Mission
-
అథెనా కథ ముగిసింది
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది. వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది. -
2027లో చంద్రయాన్-4 మిషన్
-
‘అహం బ్రహ్మాస్మి’పై భర్తల ఫిర్యాదు
విశాఖపట్నం, సాక్షి: నగరంలో మరోసారి అహం బ్రహ్మాస్మి మోసాలు తెరపైకి వచ్చాయి. ఈసారి ఆశ్రమానికి వచ్చే యువతీయువకులనే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతోంది మాతా శ్రీ సహస్ర తారా విశాల్ అలియాస్ స్వప్న. ఆశ్రమానికి వచ్చే యువతకు దైవనిర్ణయం పేరిట బలవంతపు వివాహాలు చేయిస్తోంది మాతా శ్రీ సహస్ర తారా విశాల్. ఆపై భర్తల నుంచి ఆ భార్యలను విడదీసి తన ఆశ్రమంలోనే ఉంచుతోంది. ఈ వ్యవహారంపై బాధిత భర్తలు ఆమెను నిలదీస్తే.. ఆశ్రమానికి డొనేషన్ల పేరిట వాళ్ల ఆస్తులు రాసివ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో.. చేసేది లేక కొందరు డబ్బులు, మరికొందరు ఆస్తులు రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమధ్య ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇలాగే వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్లతో వివాహం జరిపించింది. అయితే.. భార్యలు ఆశ్రమం పట్టునే ఉండడంతో సదరు బాధిత భర్తలు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కిలాడీ మాతాశ్రీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. -
ఐదున్నర దశాబ్దాల శ్రమ
భారత్కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.భారత్కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్లాల్, తేజ్బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్వెల్త్లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు. 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్కు సమర్పించింది.తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!-డాక్టర్ గోపరాజు నారాయణరావు -
ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్: ఇస్రో
భారత స్పేడెక్స్ ఉపగ్రహాల పనితీరుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అప్డేట్ ఇచ్చింది. నేడు(ఆదివారం) ఈ ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాయి. శనివారం వీటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉంది. తాజాగా వీటి దూరం తొలుత 15 మీటర్లకు చేరుకోగా, ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను మూడు మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చి, తరువాత సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది. SpaDeX Docking Update:A trial attempt to reach up to 15 m and further to 3 m is done.Moving back spacecrafts to safe distanceThe docking process will be done after analysing data further. Stay tuned for updates.#SpaDeX #ISRO— ISRO (@isro) January 12, 2025ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని, ప్రస్తుతం ఎస్డీ01 (ఛేజర్), ఎస్డీఎక్స్02 (టార్గెట్) రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని, ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను(Satellite) సురక్షితమైన దూరానికి తరలించామని ఇస్రో ఒక ట్వీట్లో పేర్కొంది.SpaDeX Docking Update:SpaDeX satellites holding position at 15m, capturing stunning photos and videos of each other! 🛰️🛰️#SPADEX #ISRO pic.twitter.com/RICiEVP6qB— ISRO (@isro) January 12, 2025కాగా ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్) ఎప్పుడు చేపడతామన్నది ఇస్రో ఇంకా వెల్లడించలేదు.2025 జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని గతంలో ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న ఎస్డీఎక్స్01 (ఛేజర్), ఎస్డీఎక్స్02 (టార్గెట్) శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం(Spadex experiment) పూర్తిగా విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది.ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్కు స్టీవ్ జాబ్స్ సతీమణి -
ప్రోబా-3 రెడీ.. పీఎస్ఎల్వీ సీ-59 కౌంట్డౌన్ ప్రారంభం
సాక్షి, తిరుపతి జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అంతర్భాగమైన న్యూస్పెస్ ఇండియా వాణిజ్యపరంగా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా–3 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-59కి కౌంట్డౌన్ ప్రారంభమైంది.సతీష్ధవన్ స్పెస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ అథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ప్రయోగానికి 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధాహ్నం 2.38 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం నిర్వహిస్తారు. -
గురుడి చందమామ యూరోపా..
“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.- జమ్ముల శ్రీకాంత్ -
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కలిసి రూమీ–1 రాకెట్ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ను తయారు చేసినట్లు స్పేస్జోన్ కంపెనీ వెల్లడించింది. -
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్పై కథ ఆడియన్స్కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై మహేశ్బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్తో రామ్చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
వచ్చే ఏడాదే ‘సముద్రయాన్’: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి. -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్యాన్లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్ఐఎస్లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్ఫోర్స్లో యుద్ధవిమాన పైలెట్గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా, టెస్ట్ పైలెట్గా అనుభవం గడించారు. గగన్యాన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్మరలో నివసిస్తోంది. నాయర్ను ఆస్ట్రోనాట్గా ప్రధాని ప్రకటించగానే నెన్మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్లో భారత వాయుసేనలో పైలెట్గా చేరారు. ఫ్లయింగ్ ఇన్స్టక్టర్గా, టెస్ట్ పైలెట్గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్గా, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్యాన్ మిషన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలెట్గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, టెస్ట్ పైలెట్గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్యాన్లో ఈయన వింగ్ కమాండర్గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్ వన్
కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్ మెషిన్(ఐఎమ్ వన్) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్ వన్ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్కెనరావల్లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఐఎమ్ వన్ నోవా సి ల్యాండర్ను నింగిలోకి పంపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్(సీఎల్పీఎస్) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది. ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్ వన్ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయితే 1972 తర్వాత అమెరికా వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్ తర్వాత రెండో మిషన్గా చరిత్రకెక్కనుంది. ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది -
‘గగన్యాన్’కు రెడీ
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిని గగన్యాన్ ప్రాజెక్టు సంవత్సరంగా పరిగణిస్తోందని, మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని సతీశ్ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. శుక్రవారం షార్లో 75వ గణతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలతో 2023 ఇస్రో చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఇస్రోకు గిఫ్ట్ అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్డే ఉత్సవాల్లో చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని పంపిన ఎల్వీఎం మార్క్–3 రాకెట్, ల్యాండర్, రోవర్ను ప్రదర్శించడం అభినందనీయ మన్నారు. కొత్త ఏడాదికి కానుకగా పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం నిర్వహించామని తెలిపారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్శాట్–3 డీఎస్ ప్రయోగం నిర్వహించనున్నామని, ఈ ఏడాది మరో పది ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. విద్యార్థులంతా స్పేస్ సైన్స్పై అవగాహన పెంచుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో సామాన్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని, సైన్యానికి విలువైన సమాచారాన్ని అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో ఈ ఏడాది నుంచి వాణిజ్యపరంగానే కాకుండా ప్రైవేట్ స్పేస్ సంస్థలకు చెందిన ప్రయోగాలూ చేపడుతుందని రాజరాజన్ వెల్లడించారు. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
రెడీ మిక్స్ ప్లాంట్లో దారుణం
మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్ల నిర్మాణం చేస్తున్న ఏఎస్బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.. పుప్పాలగూడ ఎస్బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్గ్రేషియాను ఇవ్వాలన్నారు. -
సాంకేతిక లోపంతో గగన్ యాన్ TV D1 ప్రయోగం నిలిపివేత
-
చైనా ‘జియాన్-6’తో భారత్పై నిఘా పెట్టిందా? హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతోంది?
చైనా తన మరో గూఢచార నౌక జియాన్-6ను హిందూ మహాసముద్రంలోకి దింపింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. ఇది నిరంతరం శ్రీలంక వైపు కదులుతోంది. ఇది భారత్కు ముప్పుగా పరిణమించినున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2022 నవంబర్లో భారతదేశం బంగాళాఖాతంలో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాలనుకుంది. క్షిపణిని పరీక్షించబోయే ప్రాంతంలో నో ఫ్లై జోన్ హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే అదే సమయంలో చైనా తన గూఢచార నౌక యువాన్ వాంగ్-6ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రయోగించింది. ఈ చైనా నౌక కారణంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష తేదీని భారత్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే అక్టోబర్ 2023లో భారత్ బంగాళాఖాతంలో మరో క్షిపణిని పరీక్షించబోతోంది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5 నుండి 9 వరకు సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కోసం బంగాళాఖాతం నుండి హిందూ మహాసముద్రం వరకు హెచ్చరిక జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పరీక్షకు ముందే హిందూ మహాసముద్రంలో చైనా మరో గూఢచార నౌక జియాన్-6ను ప్రయోగించింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. జియాన్-6 అనేది చైనీస్ పరిశోధన నౌక. చైనా తెలిపిన వివరాల ప్రకారం ఈ నౌక నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (నారా)తో కలసి పరిశోధనలు సాగిస్తుంది. అయితే ఇది చైనా గూఢచార నౌక అని నిపుణులు భావిస్తున్నారు. జియాన్-6 సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో కీలకమైన ప్రాజెక్ట్. ఇది ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత, ఓడ 2022లో తూర్పు హిందూ మహాసముద్రంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా చేసింది. శ్రీలంకకు చెందిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం అక్టోబర్లో కొలంబో నౌకాశ్రయంలో ఈ చైనా పరిశోధన నౌకను డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ చైనా గూఢచార నౌక హిందూ మహాసముద్రంలో భారత్ బాలిస్టిక్ క్షిపణిని యూజర్ ట్రయల్ నిర్వహించబోతున్న సమయంలో ల్యాండ్ అయింది. అటువంటి పరిస్థితిలో భారతదేశం పరీక్ష నిర్వహిస్తే.. ఈ గూఢచార నౌక భారత క్షిపణి అందించే నిఘా సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది. ఈ క్షిపణి వేగం, పరిధి, కచ్చితత్వాన్ని చైనా తెలుసుకోగలుగుతుంది. ఈ విధంగా భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఈ చర్యతో స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి భారతదేశం - చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పెరుగుతున్న చైనా ఆధిపత్య ప్రభావం భారత్కు శాశ్వత సవాలుగా నిలవనుంది. చైనా తన సముద్ర సరిహద్దులో చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో విస్తరణవాద విధానాన్ని అనుసరిస్తున్న చైనా విషయంలో భారతదేశం ఆందోళన చెందక తప్పదని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్ను, రోవర్ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
బెంగళూరు: తక్కువ ఖర్చుతో అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ISRO మరో అడుగు వేయబోతోంది. చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్ ఆస్వాదిస్తూనే.. మరో కీలక ప్రయోగంపై ఇస్రో ప్రకటన చేసింది. ఈసారి ఏకంగా సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమని స్పష్టం చేసింది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1 Aditya L1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారాయన. ఆదిత్య ఎల్1 ISRO Sun Mission ప్రయోగంలో కరోనాగ్రాఫీ స్పేస్క్రాఫ్ట్ను భూమికి సూర్యుడికి మధ్య ఎల్1 పాయింట్ చుట్టూ ఒక హాలో ఆర్బిట్లో చొప్పిస్తారు. సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు.. భూమి చుట్టూ ఉన్న పర్యావరణంపై దాని ప్రభావం తదితర అంశాలపై ఇది అధ్యయనం చేస్తుంది. ఇస్రో ఈ స్పేస్క్రాఫ్ట్ను దేశంలోని వివిధ పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. పీఎస్ఎల్వీ-ఎక్సెల్(సీ 57) ద్వారా షార్ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం చేపట్టనుంది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్1 సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్.. సాగిందిలా! -
చంద్రయాన్ ప్రయోగంపై శాస్త్రవేత్తలకు అబ్దుల్ కలాం ప్రశ్న..?
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని యావత్ దేశం ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ నేడు సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ంగ్ కానుంది. దాదాపు నాలుగేళ్లుగా 1000 మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి ఫలితం దక్కనుందని ఇస్రో ఛైర్మని సోమనాథ్ తెలిపారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ఈ మిషన్ విఫలమైంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు ముందు భారత్ చంద్రయాన్ 1 ప్రాజెక్టు కూడా చేపట్టింది. ఈ మిషన్ జాబిల్లి కక్ష్యలో దాదాపు 3400 ఆర్బిట్లు తిరిగింది. 2009 ఆగష్టు 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత ఈ మిషన్ కూడా పూర్తయింది. అయితే.. చంద్రయాన్ 1 ప్రయోగం లాంచింగ్కి అప్పట్లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంని పిలిచారు. అక్కడకు హాజరైన ఆయన చంద్రయాన్ 1 మిషన్ శాస్త్రవేత్తల బృందానికి ఓ ప్రశ్న వేశారు. ప్రయోగం విజయవంతం అయిందనడానికి రుజువులు ఏం ఉంటాయని అడిగారు. అందుకు ఫొటోలు మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలపగా.. అవి సరిపోవని అయన చెప్పారు. చంద్రునిపై ఏదైనా వస్తువు వేయాలని సూచించారు. కలాం సూచనలు విన్న శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగంలో మార్పులు చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ 1 నుంచి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా భూమి ఫొటోలను పంపించినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ విషయమని విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయింది. భారత అంతరిక్ష యానంలో ఎన్నో ఎళ్ల కళ సాకారం అయింది. అయితే.. ఈ మహత్తర కార్యం వెనుక దాదాపు 1000 మంది ఇంజినీర్ల కృషి ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. వీళ్లనే మూన్ స్టార్లుగా పిలుస్తున్నారు. ఇందులో ప్రధానమైనవారు.. ఎస్. సోమనాథ్, (ఇస్రో ఛైర్మన్) ఎస్. సోమనాథ్ ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్ని రూపొందించడంలో సహకరించారు. రాకెట్లోకి చేర్చే ముందు చంద్రయాన్ 3ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను ఆయన చూసుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పూర్వ విద్యార్థి. సంస్కృత భాషను అనర్గళంగా మాట్లాడగలరు. ఈయన పేరులోని సోమనాథ్(చంద్రునికి ప్రభువు) అర్థం ఉంది. ఇస్రోలో ఎంతో సమర్థవంతమైన నాయకునిగా పనిచేస్తున్నారు. ఉన్నికృష్ణన్ నాయర్,(విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్) రాకెట్ పరిశోధనల్లో మరో కీలక శాస్త్రవేత్త . అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు మొదటి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్లకు నాయకత్వం వహించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోనే విజయవంతమైంది. వీరముత్తువేల్:(చంద్రయాన్ 3 డైరెక్టర్) ప్రముఖ శాస్త్రవేత్త వీరముత్తువేల్.. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు. ఈయన చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. కే. కల్పన(చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్) మరో ప్రముఖ ఇంజినీర్ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు. ఎం. వనిత(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్)బెంగళూరు ప్రముఖ ఇంజినీర్ ఎం. వనిత చంద్రయాన్-2 మిషన్కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన ఆమె.. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళ. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్ 3 కోసం శాస్త్రవేత్తల బృందం సరిగా వినియోగించుకుంది. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎమ్ శంకరన్:(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డైరెక్టర్) బెంగళూరు ఎమ్ శంకరన్ ISRO పవర్హౌస్గా ఖ్యాతిగాంచారు. ఎందుకంటే కొత్త పవర్ సిస్టమ్లు, పవర్ శాటిలైట్లకు సౌర శ్రేణులను తయారు చేయడంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉంది. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2ల్లో కూడా పనిచేశారు. చంద్రయాన్-3లో ఉపగ్రహం తగినంత వేడి, చల్లగా ఉండేలా చూసుకోవడం ఈయన పని. ల్యాండర్ బలాన్ని రూపొందించడంలో ఆయన సహాయం చేశారు. ఈయన భౌతికశాస్త్రంలో మాస్టర్ పట్టా పొందారు. వీ నారాయణన్.. (లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ డైరెక్టర్, తిరువనంతపురం) లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను తయారు చేయడంలో నిపుణుడు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి అవసరమైన థ్రస్టర్లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారు. ఖరగ్పూర్ IIT పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయడంలో కూడా ఆయన నిపుణుడు. చంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో ఈయన మేధస్సు ఉపయోగపడింది. ఇదీ చదవండి: Chandrayaan-3 Moon Landing Updates:షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ -
అలెర్జీలకు చెక్ పెట్టే యంత్రం - ధర రూ. 10795 మాత్రమే!
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్ష్మాతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
చెరుకు మిషన్లోకి చున్నీ: యువతి మృతి
శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. స్థానికులు హుటాహుటిన రిమ్స్కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
‘అంగారకుడి’పై ఏడాది పాటు జీవనం.. ఎవరామె?
అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఈలోపు అలాంటి వాతావరణమే భూమ్మీద సృష్టించి.. మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సైంటిస్ట్ ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది. కెనడియన్ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్కి మార్స్(అంగారకుడు)పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల అట. అది ఇప్పుడూ ఆనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్ అందుకోసం సన్నద్ధమవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేలా కసరత్తులు శిక్షణ తీసుకుంటోంది. జూన్ చివరి వారంలో టెక్సాస్లోని హ్యూస్టన్లో మార్టిన్ నివాస స్థలంలోకి(అంగారకుడిపై మాదిరి పరిస్థితులే ఉంటాయక్కడ) అడుగుపెట్టనున్నారు. అయితే.. ఆమె అక్కడికి ఒంటరిగానే వెళ్లడం లేదు. కూడా నలుగురు వాలంటీర్లు ఉంటారు. భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో మానువుడి ఎదుర్కొనగల సామార్థ్యాన్ని అంచనా వేసేందుకు, అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల తోపాటు, నీటి పరిమితులు ఎదుర్కొనక తప్పదని స్పేస్ ఏజెన్సీ హెచ్చరించింది. అలాగే బయట ప్రపంచం కమ్యూనికేషన్ ఉండదు. భూమి, అంగారకం గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టకుని జీవింగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా వెల్లడించింది. ఈ మార్స్(అంగారక గ్రహం)పై ఉండేందుకు మార్స్ డ్యూన్ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలచే త్రీడీ ప్రింటెడ్ 1700 చదరపు అడుగుల నివాస స్థలం, బెడ్రూమ్లు, వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. హాస్టన్కి నాసా నుంచి ఈ అవకాశం వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం తదితరాలు వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఈ మిషన్లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి. ఎయిర్ లాక్ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్ చేయడమే గాక, సూట్ని ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. మార్స్లోకి ప్రయాణించే వారిలో తాను ఉన్నట్లు నిర్థారించగానే ఆమె ఆనందానికి వదలి లేకుండా పోయింది,. తనతోపాటు అక్కడ ఒక ఇంజనీర్, ఎమర్జెన్సీ డాక్టర్, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తులు ఒకరికొకరూ పరిచయమే లేదు. అయితే మార్స్ కోసం హ్యూస్టన్ నివాస స్థలంలో ఉండనున్న హౌస్మేట్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం. అలాగే అక్కడ గ్రహంపై గడిపే వారు తమ వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి మరీ మిగతా హౌస్మేట్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ గడపాల్సి ఉంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఉండగలమా? అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్తోనే తన కుటుంబసభ్యులతో టచ్లో ఉండాల్సిందే. ఈ ప్రయోగాత్మక మిషన్ చాపే(క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనలాగ్) పేరుతో నాసా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా, అంగారక గ్రహంపై ఏడాది పాటు జీవించగలిగే మిషన్ని 2015-2016లో హవాయిలోని నివాస స్థలంలో ప్రారంభం కానుంది. అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నట్లు నాసా పేర్కొంది. కాగా, అంగారకుడి గ్రహంపై జీవించనున్న కెల్లీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిజంగా అంగారకుడి వద్దకు వెళ్తున్నానా అని ఎగ్జైట్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ క్లినిక్పై క్షిపణి దాడి..) -
భారీ అంచనాలతో వస్తున్న 'మిషన్: చాప్టర్1'
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్లను సొంతం చేసుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషం. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావిస్తోంది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. -
జలజీవన్ మిషన్ లో ఏపీ టాప్
-
‘జలజీవన్ మిషన్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘జలజీవన్ మిషన్’ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకం అమలు జరుగుతుండగా.. రాష్ట్రాల వారీగా పథకం అమలు జరుగుతున్న తీరుపై కేంద్రం ప్రతినెలా పథకం అమలులో పురోగతిపై జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రకటిస్తూ వస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం ‘జలజీవన్ మిషన్ సర్వేక్షణ్ బులెటిన్’ పేరుతో విడుదల చేస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలు జరిగిన తీరుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం దేశంలోనే రెండవ ర్యాంక్ కైవసం చేసుకోగా.. మరో రెండు జిల్లాలు టాప్–10 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, అనకాపల్లి జిల్లా దేశంలోనే టాప్–10 జిల్లాల జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుంది. మూడు అంశాల ఆధారంగా.. ప్రతినెలా జిల్లాల వారీగా ఆయా గ్రామాల్లో కొత్తగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం.. తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.. అందుకు గ్రామ స్థాయిలో కలి్పస్తున్న వసతులు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా కేంద్రం ప్రతినెలా దేశంలోని జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. డిసెంబర్ నెలలో తమిళనాడులోని సేలం జిల్లా 91.79 మార్కుతో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించగా.. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా 86.85 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా 81.83 మార్కులతో 5వ ర్యాంక్, అనకాపల్లి జిల్లా 72.55 మార్కులతో పదో ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా వివిధ అంశాలపై ప్రతినెలా జిల్లాల వారీగా పథకం పురోగతిపై మార్కులను కేటాయిస్తూ ర్యాంకులు ఇస్తోందని.. ప్రతినెలా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వివరించారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
మిషన్ పోలవరం
-
టెక్నాలజీపై పట్టు, బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన ఉంటే.. రూ.5 లక్షలు మీవే!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మద్దతు, వెల్స్ ఫార్గో భాగస్వామ్యంతో ‘అకడమిక్ గ్రాండ్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) బుధవారం ప్రకటించింది. ఈ చాలెంజ్లో భాగంగా దేశంలోని విద్యార్థి బృందాలు రెండు కోణాల్లో పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది. పూర్తిగా భవిష్యత్ బ్యాంకింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచైనా లావాదేవీలు నిర్వహించేలా ఆధునిక టెక్నాలజీల సమ్మిళితంగా నూతన ఆవిష్కరణ చేయాలి. దీంతో పాటు ఏడాది కాలంలో ఫైనాన్షియల్ మార్కెట్ల పనితీరును అంచనా వేసే విశ్లేషణాత్మక నమూనాను రూపొందించడం కూడా ఈ చాలెంజ్లో భాగంగా ఉంటుంది. విజేతగా నిలిచిన విద్యార్థి బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతితో పాటు పలు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంతోపాటు వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంలో ఇలాంటి చాలెంజ్లు తోడ్పడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థి బృందాలు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, విజేతలను ఈ ఏడాది నవంబర్లో ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని టీ–ఎయిమ్ వర్గాలు వెల్లడించారు. చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు: ఆరుగురు అరెస్ట్ -
Guntur: పల్లెల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్
సాక్షి, గుంటూరు: ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్ మిషన్లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ పనులకు అక్టోబర్ 2020లో పాలనా అనుమతులు లభించగా, 2021లో మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని జిల్లాల వారీగా విభజించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. 5,79,156 ఇళ్లకు కుళాయిలు 2020 ఏప్రిల్ 1 నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,21,270 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జల జీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ఈ సంఖ్యను 5,79,156కి చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.400.74 కోట్లతో 1,264 పనులు చేపట్టారు. వీటిని పని విలువను బట్టి విభజించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. మూడు దశల్లో పనులు ► జలజీవన్ మిషన్ పనులను మూడు దశలుగా విభజించారు. ► తొలిదశలో ఇప్పటికే సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాలను విస్తరించడం, అంతర్గత పైపు లైన్లను నిర్మించడం చేయనున్నారు. ► రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు నీటి సదుపాయాలను సమకూర్చనున్నారు. ► మూడో దశలో తాజా ప్రతిపాదనల మేరకు కొత్త పథకాల నిర్మాణం చేపట్టనున్నారు. ► ఉపరితల జలాల లభ్యత లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలను వినియోగించేలా పథకాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ► జలజీవన్ మిషన్ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారు. -
Hyderabad: అసంపూర్తిగా మిషన్ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లు గడిచినా మిషన్ హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులు అసంపూర్తిగానే మిగిలాయి. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సే న్సాగర్ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగర మథనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. సాగర ప్రక్షాళనకు 2006 నుంచి 2021 వరకు దాదాపు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యంగానే మారింది. సాగర ప్రక్షాళన పనుల్లో ఇప్పటివరకు పూర్తయ్యింది గోరంతే. మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థా లు జలాశయంలోకి ఇప్పటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలు గా బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేపట్టిన పనులివే.. ప్రధానంగా కలుస్తున్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు. ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: ► 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కవేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017, 2018, 2019, 2021: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. ► హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు ఇప్పటివరకు చేసిన వ్యయం: దాదాపు రూ.326 కోట్లు చేపట్టాల్సిన పనులివే.. ► జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ► దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్లా ఏర్పడిన టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించడం. ► నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని పూర్తిగా దారి మళ్లించడం. ► జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ► జలాశయం నీటిని ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. ► హుస్సేన్సాగర్ చుట్టూ రింగ్సీవర్ మెయిన్స్ నిర్మించి జలాశయంలోకి మురుగు నీరు చేరకుండా చూడడం. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు. జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు. -
దేశఆరోగ్య రంగంలో మార్పు కోసం జాతీయా ఆరోగ్య విధానం అవసరం: మోదీ
-
మిషన్ ‘ఆయిల్ పామ్’.. సబ్సిడీ తీరు ఇలా..
సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్ సాగును జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతుల్లో 56 శాతం పామాయిలే... మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఒక్క పామాయిల్పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే... సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది. ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్ పామ్ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ ఏపీ.. ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్కు 19.81 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది. -
గుడ్న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్పామ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్ను ప్రకటించింది. -
కరెన్సీని శానిటైజ్ చేసేలా..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వాల్తేరు డీజిల్ లోకో షెడ్ అల్ట్రా వైలట్ రేడియేషన్తో కూడిన డిసిన్ఫెక్షన్ కరెన్సీ శానిటైజర్లను రూపొందించింది. రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కార్యాలయాల వద్ద రైల్వే నిత్యం నగదు కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం, రసీదులు, టికెట్లు, ఫైళ్లను నిత్యం అనేకమంది తాకుతూ ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ (డీజిల్) సంతోష్ కుమార్ పాత్రో సహకారంతో డీజిల్ లోకో షెడ్ సిబ్బంది ఈ కరెన్సీ శానిటైజర్లను తయారు చేశారు. ఈ పరికరంలో జర్మి సైడల్ యూవీసీ బల్బస్ 99.9శాతం క్రిములను, వైరస్లను, బాక్టీరియాలను హరింపచేస్తాయని సిబ్బంది తెలిపారు. మిషన్ వినియోగమిలా.. ప్రయాణికులు కౌంటర్లో రిక్వెస్ట్ స్లిప్లు, నగదు వంటివి ఈ శానిటైజర్ ట్రేలో వేస్తారు. అది స్కాన్ చేసిన తరువాత కౌంటర్లో సిబ్బంది దీనిని తీసుకుంటారు. అలాగే ప్రయాణికులకు అందజేయవలసిన టికెట్లు, రసీదులు కూడా ఈ ట్రేల ద్వారా ప్రయాణికులకు అందజేస్తారు. వీటి పనితీరు పరిశీలించిన ఈస్ట్కోస్ట్ రైల్వే సంతృప్తి వ్యక్తం చేసి, సిబ్బందిని అభినందించింది. తమ పరిధిలోని అన్ని కౌంటర్లకు అవసరమైన 150 కరెన్సీ శానిటైజర్లను తయారుచేయవలసిందిగా సూచించింది. ప్రస్తుతం 24 యూనిట్లను అందించగా, మిగిలిన వాటిని జూలై 10వ తేదీకి అందజేయనున్నట్లు డీఎల్ఎస్ సిబ్బంది తెలిపారు. -
చంద్రయాన్-3 మిషన్కు శ్రీకారం
బెంగళూర్ : చంద్రయాన్ 3 మిషన్కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ కే శివన్ బుధవారం వెల్లడించారు. చంద్రమండలానికి మానవ మిషన్ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా ఏదోఒక రోజు ఇది సాకారమవుతుందని అన్నారు. ఇక చంద్రయాన్ 3 ల్యాండర్, క్రాఫ్ట్ ఖర్చు దాదాపు రూ 250 కోట్లు కాగా, లాంఛ్కు రూ 350 కోట్ల వ్యయమవుతుందని శివన్ వెల్లడించారు. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. మరోవైపు గగన్యాన్ మిషన్కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్లోనే భారత్ నుంచి వెళతారని ఆయన తెలిపారు. చదవండి : వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో -
చంద్రయాన్-2 ప్రయోగం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు
-
భారత్పై గూఢచర్యం.. పాక్ భారీ స్కెచ్
ఇస్లామాబాద్: భారతదేశంపై గూఢాచర్యానికి పాకిస్థాన్ భారీ ఆపరేషన్ను మొదలుపెట్టింది. సుమారు 4.7 బిలియన్ రూపాయల ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే ఏడాదికల్లా వాటి నిర్మాణం పూర్తి చేసి ప్రయోగించాలని పాక్ నిఘా వ్యవస్థ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ రక్షణ నిపుణుడు మరియా సుల్తాన్ ఇంటర్వ్యూను డాన్ పత్రిక ప్రచురించింది. ‘భారత కదిలికలపై పాక్ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంత కాలం ఇండియా పరిమిత పరిధిలో ప్రయోగాలు చేసుకునేంది. కానీ ఈ మధ్య అమెరికా సహకారంతో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ సమయంలో పాక్ త్వరపడాల్సిన అవసరం ఉంది. విదేశీ శాటిలైట్లపై ఎంతో కాలం ఆధారపడలేం. అందుకే ఈ భారీ ప్రయోగానికి పాక్ రక్షణ రంగం సిద్ధమైంది’ అని మరియా పేర్కొన్నారు. దేశీయ సూపర్కో ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పాక్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో రూ. 100 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టులో మొత్తం నాలుగు శాటిలైట్లను రూపకల్పన చేయనున్నారు. అందులో పాక్ శాట్-ఎంఎం1 ఒక్కదాని కోసమే రూ. 135 కోట్లను కేటాయించగా... మిగతా మూడు శాటిలైట్ల కోసం రూ.255 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదిగాక సుమారు రూ. 100 కోట్లతో కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్లలో స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. -
మిషన్ పాజిబుల్
పొడుగురావు ఆ అడవిలో తపస్సు మొదలు పెట్టి ఆరు వారాలు దాటిపోయింది. గడ్డంమీసాలు ఎడాపెడా పెరిగి భయపెడుతున్నాయి. ఒకానొకరోజు తపోసమాధిలో ఉన్న పొడుగురావును ఎవరో భుజం తట్టారు. ‘ఖచ్చితంగా... గాడే’ అనుకుంటూ కళ్లు తెరిచాడు. కానీ ఎదురుగా ఫారెస్ట్ గార్డ్!‘‘ఈ జంగల్ల ఏంచేస్తున్నవయ్యా పెద్దమనిషి?’’ అని పొడుగురావును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. గార్డ్తో లొల్లి ఎందుకని, అతని కంటపడకుండా కాస్త దూరంలో పొదల చాటున తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు పొడుగురావు. రెండో రోజు...ఎవరో రావు భుజం తట్టారు. ‘‘ఛ...ఇక్కడ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకోనివ్వడం లేదు ఈ గార్డ్’’ అని తిట్టుకుంటూ కళ్లు తెరిచాడు.కాని ఎదురుగా ఉన్నది గార్డ్ కాదు...స్వయానా గాడ్! ‘భక్తా! టైమ్ వేస్ట్ చేయకుండా నీ బాధ ఏమిటో మూడు ముక్కల్లో చెప్పు’’ చేతికి ఉన్న డైమండ్ వాచ్ను చూస్తూ అడిగాడు గాడ్.‘‘నా భార్య నేను ఏది చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేసి బాధ పెడుతుంటుంది. పెళ్లైన కొత్తలో...మీకు ఏ కూర అంటే ఇష్టం ఉండదు? అని అడిగింది. కాకరకాయ కూర అని పొరపాటున చెప్పాను. ఇక చూస్కోండి...మరుసటి రోజు నుంచే కాకర ఇడ్లీలతో పొద్దున టిఫిన్, కాకరపొడితో కాఫీ, కాకరకాయ వేపుడు, కాకర పులుసులతో లంచ్, ఇక రాత్రి కాకర పుల్కాలు...లేస్తే కాకరా... కూర్చుంటే కాకరా...నేనో బకరా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పొడుగురావు. ‘‘ఇప్పుడు నన్నెం చేయమంటావు?’’ సానుభూతిగా అడిగాడు గాడ్.‘‘నా భార్యకు నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా... నాకో వరం ఇవ్వు స్వామి’’ అని గాడ్ను దీనంగా వేడుకున్నాడు మిస్టర్ రావు. ‘‘వరాల స్కీమ్ ఎప్పుడో అటకెక్కింది. ఇప్పుడు ఎంత సిన్సియర్ భక్తులకైనా, సీనియర్ భక్తులకైనా వరాలు ఇవ్వడం లేదు. ‘దేవలోకం టైమ్స్’ న్యూస్పేపర్ చదవడం లేదా ఏమిటి?’’ ఆరా తీశాడు గాడ్. ‘‘ఆ న్యూస్పేపర్ సంగతి నాకెందుగానీ... నాకు విముక్తి లేదా స్వామీ?’’ మరింత దీనంగా అడిగాడు రావు.‘‘వరాలతో పనులయ్యే రోజులు పోయాయి. టెక్నాలజీ ఆ లోటును తీర్చుతుంది. ముంబైలో ఉండే పేరు మోసిన సైంటిస్ట్ జఫ్ఫా జమాల్కర్ ఫోన్ నంబర్ ఇస్తాను. జప్ఫా దగ్గరకు వెళ్లి ‘మిషన్ పాజిబుల్’ అనే మిషిన్ను కొంటే సరిపోతుంది. ప్రాబ్లం సాల్వ్’’ అభయం ఇచ్చాడు గాడ్.‘‘ఆ మిషిన్ వల్ల ఉపయోగం ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు పొడుగురావు.‘‘సైబోర్గ్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? కచ్చితంగా విని ఉండవులే. చెప్తాను విను. మనుషుల్లా పనిచేసే రోబోల గురించి నీకు తెలుసు. ఇప్పుడు రివర్స్గేర్ అన్నమాట. మనుషులే రోబోల్లా పనిచేసే టెక్నాలజీని మీ సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. మనిషి శరీరంలోకి అతి సూక్ష్మమైన చిప్స్లను ప్రవేశపెట్టడం ద్వారా... రోబోతో సమానమైన శక్తిసామర్థ్యాలు మనిషికి వస్తాయి. సైబోర్గ్ సిస్టం ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచలను కూడా నియంత్రించే టెక్నాలజీని జఫ్ఫా జమాల్కర్ కనిపెట్టాడు. సపోజ్... ఒకడు కోపంగా నిన్ను తిట్టడానికి వచ్చాడు అనుకుందాం. ‘మిషన్ పాజిబుల్’లో ‘పొగిడింగ్’ అనే మీటను నొక్కితే చాలు తిట్టడానికి వచ్చినవాడు కాస్తా... నిన్ను వేనోళ్ల పొగిడి పోతాడు. ప్రత్యర్థి మెదడులోకి ‘మిషన్ పాజిబుల్’ చిప్ను ప్రవేశపెడితేనే మనం ఇచ్చే కమాండ్స్ వర్కవుటవుతాయి’’ చెప్పాడు గాడ్. ‘థ్యాంక్ గాడ్’ అని చెప్పి సెలూన్లో షేవింగ్ చేసుకోకుండానే డైరెక్ట్గా ముంబాయిలోని సైంటిస్ట్ జప్ఫా జమల్కార్ ఇంట్లో ప్రత్యక్షమైన రావు, ‘మిషన్ పాజిబుల్’ మిషిన్ను నిమిషాల్లో కొనేశాడు. ‘వెధవ నిద్రా నువ్వూనూ...లే...ఆఫీసుకు టైమవుతుంది’ అని రోజూ తిట్ల దండకం వినిపించే రావు భార్య పంకజం ఈరోజు మాత్రం తన కాళ్లు నొక్కుతూ...‘ఏమండీ...మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోండి. తిన్నాక మళ్లీ పడుకోండి. అవసరమైతే ఆఫీసుకు సెలవు పెట్టండి’ అంటూ ‘భర్తను మించిన భాగ్యం ఉన్నదా!’ అనే పాట అందుకుంది. సంతోషం తట్టుకోలేక ఆనందబాష్పాలు తుడుచుకున్నాడు రావు. ఈ దెబ్బకు నిద్ర నుంచి మెలకువ వచ్చింది. ‘‘ఓస్...ఇప్పటి వరకు నేను కలకన్నానన్నమాట’’ అని నిట్టూర్చాడు విమానంలో నిద్ర నుండి లేచిన రావు. ఫ్లైట్ శంషాబాద్లో ల్యాండ్ కాగానే జెట్ స్పీడ్ వేగంతో ఇంట్లోకి వచ్చి పడ్డాడు. ‘మిషన్ పాజిబుల్’ సహాయంతో చిప్ను భార్య పంకజం మెదడులోకి పంపడంలో సక్సెస్ అయ్యాడు . మరుసటి రోజు...‘‘ఒసేయ్ పంకజం...నేనూ ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లకుండా అదే పనిగా తాగుతుంటాను. నువ్వు మధ్య మధ్యలో చికెన్–65, మటన్–25లు వేడివేడిగా అందిస్తూ ఉండాలి. వెళ్లు ...వెళ్లి పనిచూడు’’ భార్యను ఆదేశించాడు రావు. క్షణం గ్యాప్ లేకుండా రావు గూబ గుయ్యిమంది పెద్ద సౌండ్తో. పంకజం చేతిలోని అప్పడాల కర్ర రావు తలపై అదేపనిగా సల్సా డ్యాన్స్ చేసింది.‘డ్యామిట్ కథ అడ్డం తిరిగింది’ అని మొత్తుకుంటూ సైంటిస్ట్ జఫ్ఫాను కలవడానికి తిరిగి ముంబైకి వెళ్లాడు రావు. జరిగినదంతా అతనికి చెప్పి ఏడ్చాడు. ‘‘నీ భార్య నీకన్నా తెలివైంది. ముందుగానే జాగ్రత్త పడింది. మిషన్ పాజిబుల్ చిప్ను ఎప్పుడో నీ మెదడులో ప్రవేశపెట్టింది. నీ మెదడులో ఆ చిప్ ఉన్నంత వరకు నీ కమాండ్స్ ఎదుటి వ్యక్తి మీద పని చేయవు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మెదడులో నుంచి ఆ చిప్ను తీసివేస్తే సరిపోతుంది. మిషన్ ఇంపాజిబుల్ బేషుగ్గా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్లే నీ భార్య వింటుంది. ముందు ఆ చిప్ను తీసివేయాలి. ఇలా కూర్చో’’ అని రావును కూర్చోపెట్టి ఏదో యంత్రం బిగించాడు జఫ్ఫా. అయిదు నిమిషాల తరువాత...‘‘అదేంటయ్యా...అసలు నీ తలలో మెదడే లేదు. ఖాళీ బుర్రతో ఇన్ని రోజులు నీ భార్య దగ్గర ఎలా మేనేజ్ చేశావు? ఆ చిప్ మెదడులో తప్పా ఏ శరీరావయవంలోనూ పనిచేయదు. మెదడేలేని నీలో ఆ చిప్ పనిచేయడం అసాధ్యం’’ అని పెదవి విరిచి రావును వెనక్కి పంపిచేశాడు సైంటిస్ట్ జఫ్ఫా. హైదరాబాద్ వెళ్లడానికి ముంబై ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కూర్చున్న రావుకు ఏదో విషయం చటుక్కున గుర్తొచ్చింది. సంతోషం కట్టలు తెంచుకుంది. ‘వస్తున్నా సార్...’ అంటూ సైంటిస్ట్ ఇంటికి పరుగులు తీశాడు. ‘‘ఏమిటయ్యా మళ్లీ వచ్చావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సైంటిస్ట్.‘‘సార్...నాకు మెదడు లేదని మీరు తేల్చి చెప్పారు. కాని అది నిజం కాదు సార్. నా భార్య పంకజం నన్ను ఎప్పుడూ ఒక తిట్టు తిడుతుంది. ‘నీకు మెదడు తలలో లేదు. మోకాళ్లలో ఉంది’ అని. మోకాళ్లలో ఉన్న ఆ చిప్ను తీసివేయండి సార్’’ అని సైంటిస్ట్ కాళ్ల మీద పడ్డాడు పొడుగురావు! – యాకూబ్ పాషా -
అంగారకా.. మేం వచ్చేస్తున్నాం
వాషింగ్టన్, న్యూఢిల్లీ : అంగారక గ్రహం మీదకు యాత్రికులుగా వెళ్లి వచ్చేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. నాసా చేపట్టిన ఇన్సైట్ (ఇంటీరియర్ ఎక్లోరిషన్ యూజింగ్ సెస్మిక్ ఇన్వెస్టిగేషన్) మిషన్లోభాగంగా అంగారక గ్రహ ప్రయాణానికి 1,38,899 మంది తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని నాసా ధృవీకరించింది. ఈ మిషన్ 2018 మే 8న ప్రారంభం కానుంది. ప్రయాణానికి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు ఆన్లైన్లోనే బోర్డింగ్ పాస్లను జారీ చేస్తున్నట్లు నాసా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్లో పాల్గొనేందుకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు నాసా తెలిపింది. అందులో 2,62752 మందిని ఎంపిక చేసినట్లు నాసా జెట్ ప్రాపల్సన్ లేబరేటరీ అధికారి అండ్రూ గుడ్ తెలిపారు. ఈ మిషన్ మొత్తం 720 రోజుల పాటు కొనసాగుతుందని అండ్రూ గుడ్ తెలిపారు. అంగారకుడి భూ మధ్య రేఖ మీదుగా వెళ్లి.. అక్కడనుంచి అంగారకుడి భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా అంగారక భూ ఉపరితలంపై భూ కంపాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంగారక గ్రహం నుంచి తిరిగి 2018 నవంబర్ 26 భూమికి తిరిగి వస్తామని అండ్రూ పేర్కొన్నారు. -
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
కామారెడ్డి రూరల్: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. శనివారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని బాబాగౌడ్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓడడం, గెలవడం ప్రధానం కాదని.. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి వేముల సురేందర్రెడ్డి స్మారకార్థం రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనయమన్నారు. తన తండ్రి 48 సంవత్సరాల వయస్సులో కూడా క్రికెట్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించారని, ఆయనతో పాటు తాను కూడా క్రికెట్ ఆడానని చెప్పారు. క్రీడాభివృద్ధికి కృషి: గంప గోవర్ధన్ రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. రాబోయే రోజుల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తులో గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం కల్పిస్తారని చెప్పారు. క్రీడలు ర్వహించిన నిట్టు వేణుగోపాల్రావును ప్రశాంత్రెడ్డి, గంప గోవర్ధన్ అభినందించారు. విజేతలు వీరే... వేముల సురేందర్రెడ్డి స్మారక వాలీబాల్ టోర్నీలో పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, హైదరాబాద్ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో నిజామాబాద్ విజేతగా నిలవగా, ద్వితీయ బహుమతి నల్గొండ, తృతీయ బహుమతిని హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకున్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు విప్ గోవర్ధన్ రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబోద్దిన్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, నిట్టు వేణుగోపాల్రావు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ప్రతినిధులు, మల్లేశ్గౌడ్, అశోక్కుమార్, మోహన్కుమార్, లింగన్న, మనోజ్రెడ్డి, మసూద్అలీ, గోపిగౌడ్, పీడీలు, పీఈటీలు, క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్’తో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం
రెండు విడతల్లో 2కోట్లకు పైగా క్యూబిక్ మీటర్ల మట్టి పూడికతీత పెరిగిన సామర్థ్యం 1.043 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి వరంగల్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత మరమ్మతులతో జిల్లాలో సుమారు 1.043 టీఎంసీల నీటి సామర్థ్యం పెరిగిందని చిన్ననీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివరాలను వెల్లడించారు. మిషన్–1లో 1,69,74,642 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీయగా, రెండో విడతలో ఇప్పటి వరకు 1,28,51,420 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీసినట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో మిషన్ కాకతీయ మొదటి విడతలో 1,070 చెరువులను ఎంపిక చేసి పునరుద్ధరణకు రూ.415.52కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో 1,059 చెరువులకు రూ.243.02కోట్లతో పనులు ప్రారంభించగా అందులో 1,023 చెరువుల పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. ఇక మిషన్ రెండో విడతలో 1,268 చెరువులను ఎంపిక చేయగా 1,128 చెరువులకు అంచనాలు సమర్పించగా ఇప్పటి వరకు 1,085 చెరువులకు రూ.406.93కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. అందులో 1,076 చెరువులకు టెండర్లు పిలిచి 1,068పనులకు అగ్రిమెంట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1,050 చెరువుల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇలా పనులు పూర్తయిన చెరువులకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని ఎస్ఈ వివరించారు. -
గడువుకు ముందే ‘మిషన్’ పూర్తి
ఇంటింటికీ తాగునీరందిస్తాం.. ‘భక్త రామదాసు’ను నవంబర్లో రైతులకు అంకితం చేస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి : 2017కు ముందే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు రిజర్వాయర్లో నిర్మిస్తున్న ఇన్టేక్వెల్ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం రింగ్బండ్ కట్ట తెగిపోయి.. ఇన్టేక్వెల్కు నీరు చేరిందని, దీనివల్ల ప్రమాదమేమీ లేదని, ప్రస్తుతం నీరు చేరిన ప్రాంతంలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో రూ.3,558కోట్లతో ఐదు సెగ్మెంట్లలో భగీరథ పనులు కొనసాగుతున్నాయని, దీంతోపాటు మరో రూ.వెయ్యి కోట్లతో గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నల్లాలు బిగిస్తామని అన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికి 388 గ్రామాలకు, 2017 జనవరిలో 300 గ్రామాలకు, మార్చిలో 746 గ్రామాలకు, సెప్టెంబర్లో 560 గ్రామాలకు, డిసెంబర్లో 674 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రబీకి సాగర్ నీళ్లు తెప్పిస్తా.. జిల్లాలో వచ్చే రబీ పంటకు సీఎంతో మాట్లాడి సాగురు తెప్పిస్తానని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో పాలేరు నిండిందని, దీంతో నీటిని ఎడమ కాలువకు వదిలి పలు చెరువులు నింపుతున్నామని అన్నారు. రైతులు ఇప్పుడు నాట్లు వేసుకోవటం మంచిది కాదని, నవంబర్ 15 తరువాత నాట్లు వేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే వెంటనే అధికారులు చర్యలు చేపట్టి.. రాకపోకలు పునరుద్ధరిస్తున్నారని వివరించారు. నవంబర్ నాటికి ‘భక్త రామదాసు’ నీళ్లు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావొచ్చాయని, నవంబర్ మొదటి వారంలో ట్రయల్ రన్ వేసి నెలాఖరులోగా చెరువులకు సాగర్ జలాలు వదులుతామని మంత్రి తుమ్మల అన్నారు. ఎర్రగడ్డతండా వద్ద నిర్మిస్తున్న ఇన్టేక్వెల్ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భక్త రామదాసు ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 557కోట్లు అవుతుందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కోసం కొన్న పైపులను, మోటార్లను ఈ పథకానికి వినియోగిస్తుండగా.. రూ.100కోట్లు వెచ్చించటంతో పథకం పూర్తవుతుందని అన్నారు. ఈ పథకం తనకు వచ్చిన ఆలోచనేనని, తాను కోరగానే సీఎం అంగీకారం తెలపటం మంచి పరిణామమన్నారు. 33 కిలోమీటర్ల పైపులైన్ పూర్తయిందని, భారీ మోటార్లు బిగించారని, మిగిలిన పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేసి నవంబర్లో సీఎం చేతులమీదుగా రైతులకు అంకితం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, వేనేపల్లి చందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ రాంచంద్రునాయక్, పాలేరు సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, ఎంపీటీసీలు వెంకన్న, విద్యాచందన, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సీఈ సుధాకర్రావు, ఎన్నెస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్యాంరావు, ఆర్డీఓ విజయ్కృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డి, నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ జీఎం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
గడువుకు ముందే ‘మిషన్’ పూర్తి
ఇంటింటికీ తాగునీరందిస్తాం.. ‘భక్త రామదాసు’ను నవంబర్లో రైతులకు అంకితం చేస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి : 2017కు ముందే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు రిజర్వాయర్లో నిర్మిస్తున్న ఇన్టేక్వెల్ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం రింగ్బండ్ కట్ట తెగిపోయి.. ఇన్టేక్వెల్కు నీరు చేరిందని, దీనివల్ల ప్రమాదమేమీ లేదని, ప్రస్తుతం నీరు చేరిన ప్రాంతంలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో రూ.3,558కోట్లతో ఐదు సెగ్మెంట్లలో భగీరథ పనులు కొనసాగుతున్నాయని, దీంతోపాటు మరో రూ.వెయ్యి కోట్లతో గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నల్లాలు బిగిస్తామని అన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికి 388 గ్రామాలకు, 2017 జనవరిలో 300 గ్రామాలకు, మార్చిలో 746 గ్రామాలకు, సెప్టెంబర్లో 560 గ్రామాలకు, డిసెంబర్లో 674 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రబీకి సాగర్ నీళ్లు తెప్పిస్తా.. జిల్లాలో వచ్చే రబీ పంటకు సీఎంతో మాట్లాడి సాగురు తెప్పిస్తానని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో పాలేరు నిండిందని, దీంతో నీటిని ఎడమ కాలువకు వదిలి పలు చెరువులు నింపుతున్నామని అన్నారు. రైతులు ఇప్పుడు నాట్లు వేసుకోవటం మంచిది కాదని, నవంబర్ 15 తరువాత నాట్లు వేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే వెంటనే అధికారులు చర్యలు చేపట్టి.. రాకపోకలు పునరుద్ధరిస్తున్నారని వివరించారు. నవంబర్ నాటికి ‘భక్త రామదాసు’ నీళ్లు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావొచ్చాయని, నవంబర్ మొదటి వారంలో ట్రయల్ రన్ వేసి నెలాఖరులోగా చెరువులకు సాగర్ జలాలు వదులుతామని మంత్రి తుమ్మల అన్నారు. ఎర్రగడ్డతండా వద్ద నిర్మిస్తున్న ఇన్టేక్వెల్ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భక్త రామదాసు ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 557కోట్లు అవుతుందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కోసం కొన్న పైపులను, మోటార్లను ఈ పథకానికి వినియోగిస్తుండగా.. రూ.100కోట్లు వెచ్చించటంతో పథకం పూర్తవుతుందని అన్నారు. ఈ పథకం తనకు వచ్చిన ఆలోచనేనని, తాను కోరగానే సీఎం అంగీకారం తెలపటం మంచి పరిణామమన్నారు. 33 కిలోమీటర్ల పైపులైన్ పూర్తయిందని, భారీ మోటార్లు బిగించారని, మిగిలిన పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేసి నవంబర్లో సీఎం చేతులమీదుగా రైతులకు అంకితం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, వేనేపల్లి చందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ రాంచంద్రునాయక్, పాలేరు సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, ఎంపీటీసీలు వెంకన్న, విద్యాచందన, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సీఈ సుధాకర్రావు, ఎన్నెస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్యాంరావు, ఆర్డీఓ విజయ్కృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డి, నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ జీఎం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘మిషన్’ పనులపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
∙ఒకరిద్దరి సస్పెండ్తో సరిపోదు ∙అక్రమ సొమ్మును రికవరీ చేయాలి ∙బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి హన్మకొండ : మిషన్ కాకతీయ పనులపై పూర్తి స్థాయి అక్రమాలు బయటకు తీయడానికి విజిలెన్స్చే విచారణ జరిపించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి డిమాండ్ చేశా రు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్ కాల నీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మిషన్ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టిం చుకోలేదన్నారు. జిల్లా లో పునర్విభజన ప్రజాభీష్టం మేరకు జరగాలని, వరంగల్, హన్మకొండ నగరాన్ని విడదీసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. హన్మకొండ జిల్లా చేయొద్దని వరంగల్లోనే కొనసాగించాలని, జనగామను జిల్లా చేయాలని డిమాండ్ చేశా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి మాట్లాడుతూ బం గారు తెలంగాణ సాధనలో మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వ పెద్దలు బంగారం సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెం బర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి కుమారస్వామి, నాయకులు కొత్త దశరథం, పెదగాని సోమయ్య, మల్లాడి తిరుపతిరెడ్డి, చందుపట్ల కీర్తి, రాజి రెడ్డి, వీసం రమణారెడ్డి పాల్గొన్నారు. -
వేముల ప్రశాంత్రెడ్డికి పలువురి పరామర్శ
వేల్పూర్ : మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సోమవారం వేల్పూర్లో పరామర్శించారు. ప్రశాంత్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి శనివారం మరణించిన విషయం విదితమే. ఈ మేరకు వారి కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వారి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాములు, చిన్నారెడ్డి, మహిపాల్, రాములు, బాల్రాజ్, దయాకర్, భోజన్నయాదవ్ తదితరులు ఉన్నారు. అలాగే స్పీకర్ మధుసుధనాచారి కొడుకు క్రాంతితో పాటు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్రెడ్డిని పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పలñ ్లగంగారెడ్డితోపాటు నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్,రమేశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డిని పరామర్శించి సంతాపం తెలిపారు. -
పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు ఇవ్వండి
ఆదిలాబాద్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి వెంటనే మంజూరు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటికీ పరిష్కారం చూపారో తెలపాలన్నారు. ఇంకా ఏఏ కారణాలతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. టీఎస్ ఐపాస్ కింద ఏప్రిల్ నుంచి జూలై వరకు 86 దరఖాస్తులు రాగా, 49 ఆమోదించామని, 37 దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్లో ఉన్నట్లు పరిశ్రమల శాఖ జీఎం కృష్ణరావు తెలిపారు. అభ్యంతరాలున్న వాటిని పరిష్కరించేందుకు దరఖాస్తుదారులను పిలిచి మాట్లాడాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం, ఆన్లైన్లో తిప్పిపంపడంతో ఆలస్యం జరుగుతుందని వివరించారు. ఫ్లైయాష్ ఇటుకల తయారీకి ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డ్ కులాల యువతకు అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో 74 యూనిట్లకు నాలుగు కంపెనీలకు బొగ్గు సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు జీఎం వివరించారు. సమావేశంలో ఎల్డీఎం వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జేమ్స్ కల్వల, డీపీవో పోచయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. -
ఏటీఎం మిషన్ మాయం!
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురువారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్ను ఎత్తుకుపోయారు. వివరాలివీ.. ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల రోడ్డులో ఇండియన్బ్యాంక్ ఏటీఎం ఉంది. గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు మిషన్ను పెకిలించి, ఎత్తుకుపోయారు. అందులోని సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సమాచారం. ఏటీఎంలో రూ.5.27 లక్షల నగదు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకు ముందు దుండగులు ఏటీఎం మిషన్లకు కన్నం వేయడం చూశాం గానీ.. ఇలా మిషన్నే ఎత్తుకెళ్లిన ఘటనను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
'మిషన్' ఆరంభానికి గ్రహణం!
హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకం ఆరంభానికి గ్రహణం పట్టింది. జనవరి చివరి వారంలోనే చెరువుల మరమ్మతు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినా ఇప్పటికీ కనీసం తేదీలను కూడా ఖరారు చేయలేదు. పనుల అంచనాలు, పరిపాలనా అనుమతులు, టెండర్లు, ఒప్పందాలపై చిన్న నీటి పారుదల శాఖ ఎంతో శ్రమించి అన్నింటినీ సిద్ధం చేసినా.. ముఖ్యమంత్రి స్థాయిలో పనుల ఆరంభ తేదీలపై నిర్ణయం జరగకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. వర్షాకాలానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉండటం, ఈలోగా సుమారు 9 వేలకు పైగా చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉండటం నీటిపారుదల శాఖ అధికారులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎప్పటిలోగా నిర్ణయం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. లక్ష్యం 9 వేల చెరువుల పునరుద్ధరణ రాష్ట్రంలో గుర్తించిన 46,531 చెరువుల్లో ఏటా 20 శాతం చెరువులను అంటే సుమారు 9 వేల చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఏడాది 9,651 చెరువుల పనులను లక్ష్యంగా పెట్టుకున్న చిన్న నీటి పారుదల శాఖ ఇందులో ఇప్పటికే 8 వేల చెరువుల సర్వేలు పూర్తి చేసి, 7 వేల చెరువుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటి వరకు 5,200 చెరువులకు సుమారు రూ.1,600 కోట్ల విలువైన పరిపాలనా అనుమతులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2 వేలకు పైగా చెరువుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పూడికతీత మట్టిని పొలాలకు తరలించేందుకు వీలుగా ఇప్పటికే వ్యవసాయ శాఖ భూసార పరీక్షలను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 4 వేల చెరువుల మట్టి నమూనాలకు పరీక్షలు సైతం పూర్తి చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు అంతా సిద్ధం చేసినా పనుల ఆరంభం మాత్రం జరగడం లేదు. వర్షాకాలానికి కేవలం మూడు నెలల వ్యవధే ఉండటం, పనులు చేయాల్సిన చెరువుల లక్ష్యం భారీగా ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే పునరుద్ధరణ పనులు ఆరంభించాలని నిర్ణయించారు. ఈ పనులను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆరంభించాలని ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సైతం చేసింది. నాలుగు జిల్లాల్లో ప్రతిపాదనలు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకే రోజు పనులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు ఆయా జిల్లాల్లో నాలుగేసి చెరువులను ఎంపిక చేసి ప్రతిపాదనలను పక్షం రోజుల కిందట సీఎం కార్యాలయానికి పంపారు. సీఎం తేదీలను నిర్ణయిస్తే పనులను ఆరంభిస్తామని తెలియజేశారు. అయినప్పటికీ ఇంతవరకు సీఎంఓ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దానికి తోడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటం, ఫలితంగా సీఎం బిజీగా మారనుండడంతో ఆరంభ తేదీల నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నిర్ణీత లక్ష్యాలను ఎలా చేరుకుంటామన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మరోమారు ముఖ్యమంత్రిని కలసి ఈ విషయంపై విన్నవించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
ప్రణాళికతో లక్ష్యం సుసాధ్యం
జిల్లా అదనపు జడ్జి బి.రామారావు కైకలూరు : ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకుని కష్టపడి పనిచేస్తే విజయం తనంతట తానే వరిస్తుందని జిల్లా 11వ అధనపు జడ్జి బొడ్డెపల్లి రామారావు చెప్పారు. కైకలూరు కోర్డులో అందుతున్న సేవలు, రికార్డులను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. బార్ అధ్యక్షులు గురజాడ ఉదయశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ సమాజంలో న్యాయవ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తే పరిపాలన అంత బాగుంటుందన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని చెప్పారు. వీరికి నాణేనికి రెండు వైపుల మాదిరిగా... కేసుకు సంబంధించి రెండు పక్షాల వాదనలు తెలుస్తాయన్నారు. ఎప్పటి కప్పుడు మారుతున్న చట్టాలను లాయర్లు అవగాహన చేసుకోవాలని కోరారు. బార్ సభ్యులు రెండు నెలలకు ఒక పర్యాయం శిక్షణా తరగతులు నిర్వహించుకుంటే వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందన్నారు. పూర్వకాలంలో వ్యాసమహర్షి రచించిన గ్రంథంలో న్యాయవ్యవస్థ గురించి చక్కగా వివరించారన్నారు. బ్రిటీష్ పాలకులు వాటిని అధ్యయనం చేసి ఇంగ్లిష్లో తర్జుమా చేశారని చెప్పారు. వేద కాలం నుంచే చట్టాలు భారతదేశంలో ఉన్నాయని, శ్లోకాలతో సహా ఉదాహరణలతో ఆయన వివరించడం ఆకట్టుకుంది. సీనియర్ న్యాయవాధులు తుమ్మలపల్లి బాలకృష్ణారావు, గొర్తి ప్రభాకరదీక్షితులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కైకలూరు కోర్టు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జి.లక్ష్మీ వరప్రసాద్, ఏపీపీ బాబురావు, ఏజీపీ కారే శరత్బాబు, ప్రభుత్వ ఉచిత న్యాయ సలహాదారు మోరు శ్రీనివాసరావు, సీఐ డి.వెంకటేశ్వరరావు, టౌన్ ఎస్సై దాడి చంద్రశేఖర్, న్యాయవాధులు ఏవీ.రమణ, టి.శ్రీనివాసరావు, విఎస్ఆర్.మూర్తి, బి.ప్రసాదరావు, ఆర్.రత్నారావు, ఇందిరా, లక్ష్యణరావు, ఎంఎస్ఎస్.రాజు, పవన్ పాల్గొన్నారు. కొల్లేరు పక్షుల అందాలు అద్భుతం... ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని జడ్జి బి.రామారావు అన్నారు. కైకలూరు కోర్డు తనిఖీ నిమిత్తం వచ్చిన ఆయన ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారు చేసి పక్షుల ఆందాలను దగ్గరుండి తిలకించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. -
ఆదర్శప్రాయులు ‘ఆంధ్రకేసరి’
విజయవాడ : తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు చేయడంలో రాజీపడని ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు అన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యక్తిత్వంలో హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదిగిన ప్రకాశం పంతులు ధైర్యం, తెగువ, సాహసం యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు, ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా పని చేసిన తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమంలో బ్రిటిష్వారి తుపాకి గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులుకు ఆంధ్రకేసరి బిరుదు లభించిందని వివరించారు. సీనియర్ పాత్రికేయులు సి.రాఘవాచారి మాట్లాడారు. సబ్ కలెక్టర్ డి.హరి చందన అధ్యక్షత వహించిన ఈ సభలో స్వాతంత్య్ర సమరయోధులు వేములపల్లి వామనరావు, సి.రాఘవాచారి, తుర్లపాటి కుటుంబరావులను సత్కరించారు. ఆంధ్రకేసరి జయంతిని పురస్కరించుకుని పాఠశాల, కళాశాల స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తుర్లపాటి కుటుంబరావు రచించిన ‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తొలుత ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ కార్యాలయంలో.. కోనేరుసెంటర్(మచిలీపట్నం) : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎస్పీ జి.విజయ్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ బీడీవీ సాగర్, కార్యాలయ ఏవో ప్రసాద్, ఓఎస్డీ వృషికేశవరెడ్డి, బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ పి.మురళీధర్, డీసీఆర్బీ సీఐ బాలరాజు, ఆర్ఐ కృష్ణంరాజు, ఆర్ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఈడేపల్లి(మచిలీపట్నం) : తెలుగువాడి ఆత్మగౌరం, పౌరుషాలకు ప్రకాశం పంతులు ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యాన శనివారం మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు నిర్వహించారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య వెంకయ్య మాట్లాడుతూ ఆవేశం, స్వతంత్ర వ్యక్తిత్వం, ఆత్మగౌరవం విషయంలో ప్రకాశం పంతులుకు సాటిలేరని కొనియాడారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్పీ డాక్టరు కేవీ శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం ప్రకాశం పంతులు జీవిత ఘట్టాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర’పై నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో ఆలపాటి ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్, ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ నారదముని, అంగలూరు డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీజీ ఆంజనేయులు, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఉషారాణి, చరిత్ర అధ్యాపకుడు ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇదేం క్రమశిక్షణ?!
విడ్డూరం పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి పాఠశాలల్లో పలు రకాల నియమాలు పెడుతుంటాయి యాజమాన్యాలు. అయితే అమెరికాలోని కొన్ని స్కూళ్లలో ఉన్న రూల్స్ చిట్టా కాస్త విచిత్రంగా ఉంది. మీరే చూడండి... ఆస్ట్రేలియా, బ్రిటన్లలోని కొన్ని పాఠశాలల్లో పిల్లల పరీక్ష పేపర్లను పచ్చ ఇంకుతో దిద్దుతారు. ఎరుపురంగు విప్లవభావాలకు ప్రతీక కాబట్టి ఆ రంగు సిరాని వాడరు. దీన్ని ఈ మధ్య అమెరికాలోని కొన్ని పాఠశాలలు కూడా అవలంబిస్తున్నాయి! న్యూయార్కలోని ఓ పాఠశాలకి బస్సులు ఉండవు. మరీ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు దింపవచ్చు కానీ, కాస్త ఎదిగాక కచ్చితంగా సైకిల్ మీదే రావాలి. స్థూలకాయం రాకుండా నివారించడానికి ఈ రూల్ పెట్టారట! మిచిగన్లో ఉన్న ఓ స్కూల్లో ప్రతి విద్యార్థికీ ఓ లాకర్ ఇస్తారు. క్యాంటీన్కి, తరగతి గదులకు మధ్య ఉండే ఈ లాకర్లలో పుస్తకాలు, లంచ్ బాక్సులు పెట్టుకోవాలి. ప్రతి పీరియడ్కి ముందు అక్కడికి వెళ్లి కావలసిన పుస్తకాలు తెచ్చుకోవాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారట! మసాచుసెట్స్లోని ఓ పాఠశాలలో బేక్ చేసిన ఫుడ్ అమ్మరు. పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు! కొలరాడోలోని ఓ స్కూల్లో పిల్లలు 18వ అంకె ప్రింట్ చేసి ఉన్న దుస్తులు వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ‘ఎయిటీన్త స్ట్రీట్ గ్యాంగ్’ అనే రౌడీ మూక ఉంది. కాబట్టి ఆ అంకెకు దూరంగా ఉండాలనే నియమం పెట్టారు! ఫ్లారిడాలోని ఓ స్కూల్లో విద్యార్థులు ఒకరినొకరు వాటేసుకోకూడదు. అలా చేస్తే శిక్ష తప్పదు. పోయినేడు నిక్ మార్టినెజ్ అనే అమ్మాయి ఫ్రెండ్ని హగ్ చేసుకుందన్న కారణంతో సస్పెండ్ చేశారు! సౌత్ కరొలినాలోని పాఠశాలలకు పిల్లలు వెరైటీ హెయిర్ స్టయిల్స్తో రాకూడదు. జుత్తుకి రంగులు కూడా వేయకూడదు. స్కూలువాళ్లు ఒక హెయిర్స్టయిల్ చెబుతారు. కచ్చితంగా పిల్లలంతా అలాగే దువ్వుకోవాలి! వర్జీనియాలో కాల్వర్ట హైస్కూల్లో స్కర్టులు ధరిస్తే ఇష్టపడరు. ఒకవేళ స్కర్కులు వేసుకోవాలని ఉంటే యాజమాన్యం చెప్పిన కొలతలతో కుట్టించుకుని వేసుకోవాలి! పెన్సిల్వేనియాలో విద్యార్థులు చేతులకు బ్యాండ్స పెట్టుకోకూడదు. పెట్టుకున్నారో... స్కూల్లోంచి తీసేస్తారు! -
ఇదెక్కడి ఫ్యాషన్?!
విడ్డూరం అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. ఫ్యాషనబుల్గా కనిపించాలని అనుకోవడంలో అభ్యంతరం ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ ఆ ఆసక్తి కాస్తా వెర్రి తలలు వేస్తేనే విడ్డూరంగా ఉంటుంది. అమెరికాలో ఈ మధ్య ఓ సరికొత్త ఫ్యాషన్ మొదలైంది. పాదాలు అందంగా ఉండాలని అక్కడి అమ్మాయిలు ఒకటే పరితపించిపోతున్నారు. ఉన్నట్టుండి ఆ తాపత్రయం ఎందుకు మొదలయ్యిందనేగా! దానికి కారణం డాక్టర్ జేసన్ హర్గ్రేవ్. ఈయనగారు పాదాలను అందంగా చేస్తానంటూ ఓ బోర్డు పెట్టాడు. అది చూసి అమ్మాయిలంతా క్యూ కడుతున్నారు. వంకర టింకరగా ఉన్న తమ పాదాలను అందంగా తీర్చిదిద్దమంటూ జేసన్ వెంట పడుతున్నారు. దాంతో అతగాడి హాస్పిటల్లో కాసుల వర్షం కురుస్తోంది. పాదాల ఎత్తూ పల్లాలను సరిచేయడానికి సర్జరీలు చేసేస్తున్నాడు. వేళ్ల పరిమాణంలో ఎక్కువ తక్కువలుంటే కట్ చేసి అతికేస్తున్నాడు. అయితే దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. కానీ జేసన్ తీర్చిదిద్దిన తమ పాదాల అందాలను చూసి మురిసిపోతున్న అమ్మాయిలు మాత్రం అతడిని వెనకేసుకొస్తున్నారు. దాంతో జేసన్ విమర్శల్ని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు! -
చిత్రమైన చావులు
విడ్డూరం మరణమనేది ఎప్పటికైనా సంభవించక తప్పదని అందరికీ తెలుసు. అది ఎప్పుడు ఎలా వస్తుందో కనిపెట్టలేమనీ తెలుసు. అయితే చరిత్రలో కొందరిని మరణం మరీ విచిత్రమైన పద్ధతిలో వెతుక్కుంటూ వచ్చింది. వాటి గురించి వింటే అయ్యో పాపం అనిపించక మానదు. క్రీ.పూ. 206లో క్రిసిపస్ అనే గ్రీకు ఫిలాసఫర్ నవ్వి నవ్వి నరాలు తెగిపోయి చనిపోయాడు. అతడంత నవ్వడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. తను తిందామని పెట్టిన అంజూరపు పళ్లను గాడిద తినడం చూశాడు. దీనికి అంజూరపు పళ్లు కావలసి వచ్చాయా అని పడీ పడీ నవ్వాడు. ఇక అంతే సంగతులు! 1771 - స్వీడన్ రాజు అడాల్ఫ్ ఫ్రెడరిక్ మరణించాడు. అయితే ఎలానో తెలుసా? పాలల్లో తనకిష్టమైన పద్నాలుగు రకాల పదార్థాలను కలుపుకుని తిన్నాడు. ఆపైన అజీర్తితో ప్రాణాలు కోల్పోయాడు! 1871 - క్లెమెంట్ అనే అమెరికన్ లాయర్ ఓ హత్య కేసు వాదిస్తున్నాడు. తన క్లయింటు చేతిలో తుపాకీ అనుకోని విధంగా ఎలా పేలిందో వివరిస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడు. తూటా గుండెల్లోకి దూసుకెళ్లి మరణించాడు. 1958 - గ్యారెత్ జోన్స్ అనే బ్రిటిష్ నటుడు నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సన్నివేశంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయినట్టు నటించాలి. అలా నటిస్తుండగా నిజంగానే గుండెనొప్పి వచ్చింది! 1974 - ఇంగ్లండుకు చెందిన బసిల్ బ్రౌన్ కాలేయం దెబ్బ తిని చనిపోయాడు. అతడి లివర్ చెడిపోయింది మద్యం వల్ల అనుకునేరు. పది రోజుల్లో పది గ్యాలన్ల క్యారెట్ జ్యూస్ తాగేయడంతో ‘ఎ’ విటమిన్ ఎక్కువై కాలేయం దెబ్బతింది! 1993 - కెనడాకు చెందిన గ్యారీ హోయ్ అనే న్యాయవాదికి తన ఇంటి కిటికీ అద్దం గురించి వాదన వచ్చింది. అది పగులుతుందని వాళ్లు, పగలదని ఈయన వాదులాడుకున్నారు. తన మాటను నిరూపించుకోవడానికి హోయ్ కిటికీలోంచి దూకాడు. తర్వాత ఏమైందో వేరే చెప్పాలా! -
అదిగదిగో లక్ష్యం!
విజన్ క్రికెట్ తప్ప ఏ ఆటా పట్టని మన దేశ యువతలో ఇప్పుడు మార్పు వస్తోంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫీవర్ వారిని కూడా బలంగానే తాకింది. ఫుట్బాల్లో తమ అభిమాన తారలను కూడా ఎంచుకుంటున్నారు. కొందరు ఆ అభిమానాన్ని టీ షర్ట్ల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి , అభిమానం సంగతి పక్కన పెడితే ‘ఫుట్బాల్ లో మన సత్తా చాటలేమా?’ అనే ప్రశ్నకు ‘ఖచ్చితంగా చాటవచ్చు’ అని సమాధానమిస్తున్నారు క్రీడా నిపుణులు. 2017లో ఫిఫా అండర్-17 వరల్డ్కప్కు ఆతిథ్యం ఇచ్చే అపూర్వమైన అవకాశం మన దేశానికి వస్తుంది. ఫుట్బాల్కు సంబంధించి మన దేశంలో ఇదొక పెద్ద కార్యక్రమం. ఆ సమయానికల్లా మన వాళ్లు ఫుట్బాల్ ఆటలో సత్తా చాటడానికి నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు: దేశవ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి. దాన్ని మరింత మెరుగైన స్థితికి తీసుకువెళ్లాలి. ఫుట్బాల్ ఆటకు సంబంధించిన మౌలిక వసతులను పాఠశాల, కళాశాల స్థాయిలో కల్పించాలి. యూత్ లీగ్లు, టోర్నమెంట్లు దేశవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించాలి. ప్రపంచస్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన అధునాతమైన వసతులతో దేశంలో ఫుట్బాల్ అకాడమీలను ఏర్పాటు చేయాలి. పాఠశాల యజమాన్యాలు ఫుట్బాల్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆటకు సంబంధించి గొప్ప ఆటగాళ్ల విజయగాథలను స్ఫూర్తిదాయకంగా చెప్పాలి. మెరికల్లాంటి ‘యువ ఫుట్బాల్’ ఆటగాళ్లు తయారుకావడానికి పాఠాశాలలు, మీడియా తమ వంతు పాత్రను పోషించాలి. యూరోపియన్ క్లబ్ల మాదిరిగా కార్పొరెట్ కంపెనీల సహకారంతో యువత కోసం ఫుట్బాల్ టోర్నమెంట్లను నిర్వహించాలి. -
ఏ పేరులో ఏముందో?!
విడ్డూరం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధిం చాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో... జైలుకు పోవాల్సిందే! మలేసియాలో పిల్లలకు జంతువులు, పురుగులు, పండ్లు, కూరగాయలు, రంగుల అర్థాలు వచ్చే పేర్లు పెట్టకూడదు. హిట్లర్, వోతీ లాంటి చాలా పేర్ల మీద అక్కడ బ్యాన్ ఉంది. ఐస్ల్యాండ్లో క్రిస్టీ/క్రిస్టా, కరొలినా లాంటి పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే వాటిలో ‘సి’ అనే అక్షరం ఉంటుంది కదా! ఆ దేశ అక్షరమాలలో ‘సి’ ఉండదు. కాబట్టి ఆ అక్షరంతో వచ్చే పేర్లు పెట్టకూడదు! పేర్ల విషయంలో నార్వే దేశం చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని వేల పేర్ల మీద నిషేధం ఉంది ఆ దేశంలో. వాటిలో ఏదైనా పెడితే కేసు పెడతారు. గతంలో ఓసారి... అధికారులు చెప్పినట్టుగా తన బిడ్డ పేరు మార్చనందుకు ఓ మహిళను రెండు రోజులు జైల్లో కూడా పెట్టారు! జర్మనీలో ఆండర్సన్ అన్న పేరు పెట్టకూడదు. అదే విధంగా టేలర్, టాబీ, రిలే, క్విన్ లాంటి పేర్ల మీద నిషేధం ఉంది. లింగ నిర్థారణ చేసే విధంగా పేర్లు పెట్టడానికి ఆ దేశం ఒప్పుకోదు! న్యూజిలాండ్లో ప్రిన్స, ప్రిన్సెస్, కింగ్, మేజర్, సార్జెంట్, నైట్ లాంటి పేర్లు పెట్టకూడదు. అవి స్థాయిని సూచిస్తాయి కాబట్టి కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటుందా ప్రభుత్వం! పోర్చుగల్ ప్రభుత్వం నిషేధించిన పేర్ల జాబితా దాదాపు 41 పేజీలు ఉంటుంది. కారణమేంటో తెలియదు కానీ... అందులో మోనాలిసా అన్న పేరు కూడా ఉంది. అంతేకాదు... అక్కడ పిల్లలు పుట్టే సమయానికే పేరు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే బర్త సర్టిఫికెట్లో నమోదు చేసిన పేరునే జీవితాంతం ఉపయో గించాలి. ముద్దు పేరు రాస్తే కుదరదు! -
ఇదేం పండగ బాబోయ్..!
విడ్డూరం పండుగ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, దేవుడికి పూజలు చేయడం అని మనమనుకుంటాం. కానీ విదేశాల్లో జరుపుకునే కొన్ని పండుగల గురించి వింటే ఇవేం పండుగల్రా బాబూ అనిపిస్తుంది. వాటిలో ఇవి కొన్ని... కూపర్స హిల్ చీజ్ రోలింగ్ అండ్ వేక్ - ఇదో విచిత్రమైన పండుగ. ఇంగ్లండ్లోని కూపర్స కొండ మీద జరగడం వల్ల దానికా పేరు వచ్చింది. పోటీదారులంతా కొండమీద నిలబడి ఉంటారు. బెల్ కొట్టగానే అందరూ కింద పడి దొర్లడం మొదలు పెడతారు. వేగంగా దొర్లుకుంటూ ఎవరైతే మొదట కొండ కిందకు వెళ్తారో వారే విజేత! మంకీ బఫే ఫెస్టివల్ - థాయ్ల్యాండ్లో ఇది ముఖ్యమైన పండుగ. అక్కడి లోప్బురీ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏటా ఓ రోజు అక్కడ కోతుల పండుగ జరుపుతారు. ఆ రోజున దాదాపు రెండువేల కిలోల పండ్లు, కూరగాయలు, ఇతరత్రా ఆహార పదార్థాలు కోతులకు పెడతారు. ఈ వేడుకలో పాల్గొనడానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు! హడకా మత్సూరీ - ఇది జపాన్ వాళ్లకెంతో ఇష్టమైన పండుగ. ఏటా వేసవిలో ఘనంగా జరుగుతుంది. పురుషులంతా గోచీలాంటి ఆచ్ఛాదనను మాత్రమే ధరించి ఈ పండుగలో పాల్గొంటారు. దేవుడి సన్నిధిలో ఉంచిన రెండు పవిత్రమైన వెదురు ముక్కలను మత గురువు విసురుతాడు. అవి ఎవరికి చిక్కుతాయో వారు ఆ సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని విశ్వాసం! ఫెస్టా డెల్ కార్నుటో - రోమ్లోని రోకా కాన్టెరానో అనే పట్టణంలో ఏటా ఈ పండుగ జరుగుతుంది. ప్రేమలో మోసపోయినవారు మాత్రమే ఇందులో పాల్గొనాలి. వీళ్లందరికీ ఒక కొమ్ముల జతను ఇస్తారు. వాటిని ధరించి అందరూ వీధుల్లో ఊరేగింపులా తిరుగుతారు. తద్వారా తాము ఒంటరిగా ఉన్నామని, జంటను కోరుకుంటున్నామని తెలియజేస్తారు. చాలామందికి ఈ వేడుకలోనే జోడీ దొరుకుతుందట! -
ఊళ్లు పట్టుకు తిరిగితే ఆరు కోట్లిస్తారా!
విడ్డూరం మంచి జీతం, సౌకర్యాలు, ఆఫీసులో కాస్తంత స్వేచ్ఛగా ఉండగలగడం, కోరినన్ని సెలవులు... ఇవి ఏ ఉద్యోగికైనా ఉండే కొన్ని ప్రాథమికమైన కోరికలు. అయితే ఉద్యోగం కోసం ఆఫీసుకే వెళ్లనవసరం లేకపోతే? హ్యాపీగా ఊళ్లన్నీ తిరుగుతూ ఆనందంగా గడపడమే ఉద్యోగమైతే? పైగా అలా గడిపినందుకు ఏడాదికి ఆరు కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ఇస్తే? అంతకన్నా ఆనందం, అదృష్టం ఉంటాయా ఎవరికైనా! ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, అసలలాంటి ఉద్యోగం ఉంటుందా అనుకోకండి. ఉంటుంది... కాదు ఉంది. బ్రిటన్కు చెందిన ఒక లగ్జరీ టూరిస్టు కంపెనీ అలాంటి ఉద్యోగాన్నిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లోని వివిధ రిసార్టులను సందర్శించడం, అత్యంత ఖరీదైన వాటిల్లో బస చేయడం, రకరకాల వంటకాలు రుచి చూడటం, ఆయా నగరాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాలన్నీ సందర్శించడం... స్థూలంగా చెప్పాలంటే ఏ ఒక్క సౌకర్యాన్నీ వదలకుండా అనుభవించడమే ఆ ఉద్యోగం! అందుకు అయ్యే ప్రతి రూపాయినీ ఆ ట్రావెల్ సంస్థే భరిస్తుంది. అందుకు ప్రతిగా చేయాల్సింది ఒకటే... మీరు అనుభవించిన సౌకర్యాలు, సదుపాయాల గురించి సమీక్ష రాయడం! అలుపు లేకుండా వెనిస్, నెక్ ఐలాండ్, బ్యూనస్ ఎయిర్స్, మియామీ, లాస్వెగాస్, మాల్దీవులు తదితర ప్రాంతాలు పట్టుకు తిరిగితే కోట్లకు కోట్లు ముట్టజెబుతామంటోంది. ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడ్డం, సృజనాత్మకంగా రాయడం వస్తే చాలంటోంది. మీకుగానీ ఆ అర్హతలుంటే ఒక్కసారి http://www.veryfirstto.com వెబ్సైట్ చూడండి. ఎంపిక అయితే ఇక మీ పంట పండినట్టే! -
లక్ష్యం పెట్టుకోండి... చేరుకోండి..!
ఇప్పటి యువతను చూస్తే ముచ్చటేస్తుంది. అద్భుతమైన శక్తిసామర్థ్యాలు వారి సొంతం. కొద్దిమంది అంటుంటారు-‘‘ఆయన చెబితేగానీ నాలోని శక్తి ఏమిటో నాకు తెలియలేదు’’ అని. ఎవరో వచ్చి మన శక్తి గుర్తించి, చెప్పే వరకు ఎందుకు నిరీక్షించాలి? ప్రతి మనిషిలో ఒక విమర్శకుడు ఉంటాడు. అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీలో శక్తి ఏమిటో, లోపాలు ఏమిటో చెబుతాడు. కలను నిజం చేసుకోవడమంత గొప్ప పని ఈ జీవితంలో మరొకటి లేదు. ఏ లక్ష్యం లేకుండా రోజులు దొర్లించడమనేది మనకు మనమే హాని చేసుకోవడం లాంటిది. మీ కంటూ ఒక లక్ష్యం లేనట్లయితే ఏర్పరుచుకోండి. ఉంటే కృషి చేయండి. లక్ష్యాన్ని చేరుకున్న రోజు ఒక్కసారి కళ్లు మూసుకొని మౌనంగా ఉండండి. తెరలు తెరలుగా ఆనందం మీ హృదయాన్ని తాకుతుంది. నిజానికి అది మాటల్లో చెప్పే అనుభూతి కాదు. అది మీ సొంతం కావాలంటే...ప్రయత్నించండి, గెలవండి! - షారుక్ఖాన్ -
భార్యను అమ్మకానికి పెట్టాడు!
ఈబే (eBay)... ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలకూ కొనుగోళ్లకూ జనప్రియంగా మారిన వెబ్సైట్ ఇది. ‘మీ దగ్గరున్న పాత, కొత్త వస్తువులను మా వెబ్సైట్లో పెట్టండి, మంచి రేటుకు అమ్మేసుకోండి’ అంటూ జనాలకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఓ మగమహారాజు ఈ మధ్య... ఏకంగా తన భార్యనే ఈబేలో అమ్మకానికి పెట్టాడు! బ్రిటన్కు చెందిన షాన్... తన భార్యను అమ్మేస్తున్నానంటూ ఆమె ఫొటోలను ఈబే సైటులో అప్డేట్ చేశాడు. ‘నచ్చిన వాళ్లు కొనుక్కోండి, మంచి తరుణం మించిన దొరకదు’ అంటూ హడావుడి మొదలెట్టాడు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికి ఆమెను ఇచ్చేస్తానన్నాడు. విచిత్రం ఏమిటంటే... షాన్ తన భార్యను వేలానికి పెట్టిన కొన్ని గంటల్లోనే ఆమె కోసం 50 మంది మగ మహారాజులు బిడ్డింగ్ చేశారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియా కంట పడింది. ఇంకేముంది... దీని గురించి కథనాల మీద కథనాలు వేయడం మొదలైంది. దాంతో షాన్ అడ్డంగా బుక్కయ్యాడు. ‘ఏదో సరదాగా ఈ పని చేశాను. పైగా ఈ విషయం నా భార్యకు కూడా తెలుసు’ అంటూ బిక్కమొగం వేశాడు షాన్. ఆ విషయాన్ని అతడి భార్యకూడా ధ్రువీకరించింది. వీరి సరదా గురించి బిడ్డింగ్ చేసిన వారికి చెబితే... ‘మేం మాత్రం సీరియస్గా ట్రై చేశామా ఏంటి, సరదాగానే చేశాం’ అంటూ తేల్చేశారు వాళ్లు! -
పల్లెలో ‘మొల్లి’ వికాసం
=పేదింటి విద్యా కుసుమం =ఒకేసారి ఐదు ఉద్యోగాలు రావికమతం, న్యూస్లైన్ : సకల సదుపాయాలున్న పట్టణాల్లో విద్యాభ్యాసం చేసిన వారికే సర్కారు ఉద్యోగం దొరకని రోజులివి. అలాంటిది, కనీస సౌకర్యాల్లేని మారుమూల పల్లెలో పట్టుదలే పెట్టుబడిగా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులను అవలీలగా హస్తగతం చేసుకుంది ఆ యువతి. కష్టపడి చదివితే సాధించలేనిది లేదని, పేదరికం అడ్డుకాబోదని నిరూపించింది. పలువురికి ఆదర్శంగా నిలిచింది. మండలంలోని పి.పిన్నవోలు శివారు ఆర్.కొత్తూరులో నిరుపేద కుటుంబానికి చెందిన మొల్లి రాజారావు, రాజు దంపతుల కుమార్తె రాజేశ్వరి. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించింది. స్వగ్రామం, టి.అర్జాపురం, రావికమతం ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ వసతి గృహంలో ఉంటూ చదివిన ఆమె అప్పట్లో పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్గా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు భాస్కరరావు తదితరుల సహాయ సహకారాలతో ఎస్.కోట కాలేజీలో చేరి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో మాకవరపాలెం అవంతి కాలేజీలో బీటెక్లో చేరింది. ఆ కళాశాల కరస్పాండెంట్ ఈ చదువుల సరస్వతికి ఫీజు లేకుండానే ఉచిత విద్య అందించారు. పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంటూ ఉన్నత చదువులు చదవాలని భావించిన రాజేశ్వరి బ్యాంకు క్లర్కు పోస్టుకు పరీక్షలు రాసి అందులో విజయం సాధిం చింది. ప్రస్తుతం రావికమతంలో ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తూనే జూనియర్ లెక్చరర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్టల్ అసిస్టెంట్, ఎల్ఐసీ డెవలప్మెంట్ అధికారి, సీజీఎల్ఏ పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. ఒక్కొక్కటిగా అన్నీ పాసైనట్టు ఆమె తెలియజేసింది. అయితే జూనియర్ కాలేజీ లెక్చరర్ కన్నా మిగిలిన పోస్టులకు ఆమె ఇష్టపడక ఇంట ర్వ్యూలకు హాజరు కాలేదు. రావికమతం ఆంధ్రా బ్యాంకు నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా చేరేందుకు సిద్ధమవుతోంది. స్వయంకృషితో కష్టాలను లెక్కచేయకుండా అరుదైన ఘనత సాధించిన రాజేశ్వరిని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, రావికమతం ఆంధ్రా బ్యాంకు సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తన విజయానికి కారకులైన గురువులు భాస్కరరావు, అప్పలనాయుడు, రామారావు, గిరిజారాణి, రామునాయుడులకు కృతజ్ఞతలు తెలిపింది.