nagesh
-
మా సినిమా కలెక్షన్స్లో 20% వారికే ఇస్తాం: సముద్రుడు టీమ్
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మిస్తున్నారు. హీరో సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు నగేష్ నన్ను చూసి సముద్రుడు అనే టైటిల్ పెట్టాడు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాట నేడు నిజమైంది అన్నారు.మొదటి వ్యక్తి నేనేహీరో సుమన్ మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వ్యక్తిని నేనే! అన్నమయ్య, రామదాసు సినిమాల తర్వాత చేసిన పాత్రలే చేయడం ఎందుకని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను.ఛత్రపతిలా పెద్ద హిట్నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గవాటిలో ఇదీ ఒకటి. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. ఇప్పుడాయన జాలర్ల జీవితాలపై సముద్రుడు తీశాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.20 శాతం వారికే..దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. సముద్రం దగ్గర ఉండే జాలర్లు చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని సినిమాలో చూపించాం. ఒక మంచి పాత్రలో అడగ్గానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు అన్నారు. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. -
ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అక్షయ (2)కు అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే వ్యాధి వచ్చింది. ఈ కారణంగా పాప ఎదుగుతున్నా కండరాలు సహకరించక నిలబడలేకపోతోంది. నడవలేక.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పాప లక్షణాలను బట్టి హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్లో జెనటిక్ పరీక్షను చేయించారు. పరీక్షలో ఆ పాపకు స్పైనల్ మసు్కలర్ అట్రోఫిగా నిర్ధారణ అయ్యింది. నిర్లక్ష్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. న్యూరోఫిజీíÙయన్ హేమంత్కుమార్ ఆ పాప పరిస్థితిని వివరిస్తూ.. పాప చికిత్సకు జోల్జెరి ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ చేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు అవుతుందని చెప్పారు. జన్యుపర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. కాగా.. బిడ్డను కాపాడుకోవడం రోజు కూలీ చేసుకునే తమకు చాలా కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అక్షయను రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు. -
‘వలస’ నేతల్లో ఒక్కరే గెలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీచేసిన ‘వలస’ నేతల్లో ఒకే ఒక్కరే విజయతీరానికి చేరుకుని సత్తా చాటారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నవారు లేదా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేని వారు మొత్తంగా 9 మంది పోటీచేశారు. ఈ వలస నేతల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నుంచే గెలుపొందారు. మిగతా ఎనిమిది మంది పరాజయం పాలయ్యారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు (ఆయన తన కుమారుడు భరత్ ప్రసాద్కు టికెట్ ఇప్పించుకున్నారు), మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ డా.సీతారాంనాయక్, వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, నల్లగొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్నేత గోమాస శ్రీనివాస్, ఖమ్మం నుంచి సంఘ్పరివార్ క్షేత్రాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన తాండ్ర వినోద్రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత (సంఘపరివార్తో ఉన్న సంబంధాలు కలిసిరాగా, టికెట్ వచ్చే నాటికి బీజేపీ సభ్యత్వం లేకపోయినా ఆమెకు సీటు) వలసనేతల జాబితా కోవలోకి వస్తారు.గెలిచిన 8 ఎంపీల విషయానికొస్తే...ప్రస్తుతం బీజేపీ గెలిచిన 8 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్–బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో, చేరారు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్నగర్), ఎం.రఘునందన్రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. వీరిలో అర్వింద్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ గత లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ టికెట్పై పోటీచేసినా, ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్లో కొనసాగినందున కొత్తగా కమలం గుర్తుతో ఆమెను ఓటర్లు గుర్తించలేదు. దాంతో ఆమె బీజేపీ టికెట్పై మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి తొలిసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్రావు బీజేపీలో చేరి పదేళ్లకు పైగానే కాగా, 2018–23 మధ్యలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక కొండా విశ్వేశ్వర్రెడ్డి విషయానికొస్తే...2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. 2019లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచే ఆ పార్టీ టికెట్పై ఎంపీగా విజయం సాధించారు. టీఆర్ఎస్లో నెంబర్–టుగా ప్రాధాన్యత గల నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాక బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఐతే 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మల్కాజిగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే...బీజేపీలోనే పుట్టి పెరిగి ఒరిజనల్, పక్కా కమలనాథులుగా ఉంటూ ఎంపీలుగా గెలిచిన వారు మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమేనని పాతతరం పార్టీ నాయకులు పేర్కొంటుండడం కొసమెరుపు. -
తాత వారసత్వాన్ని కొనసాగించేందుకు హీరోగా!
దివంగత నటుడు నాగేశ్ను ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. ఈ తమిళ నటుడు తెలుగులో శ్రీ రామ బంటు, ఒక చల్లని రాత్రి, తూర్పు పడమర, సోగ్గాడు, పాపం పసివాడు, కొండవీటి సింహం, శ్రీరంగనీతులు, ప్రచండ భైరవి, భలే తమ్ముడు, శత్రువు, నేటి సావిత్రి.. ఇలా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు, నటుడు ఆనంద్బాబు కుమారుడు బిజేశ్ నాగేశ్ రంగంలోకి దిగారు. ఈయన ఇంతకు ముందు సంతానం కథానాయకుడిగా నటించిన సర్వర్ సుందరం, ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మాణిక్యవేల్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వానరన్ మూవీతో హీరోగా ఇప్పుడు వానరన్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆరెంజ్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ పద్మనాభన్, సుజాత రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను శ్రీరామ్ పద్మనాభన్ నిర్వహిస్తున్నారు. అక్షయ హీరోయిన్గా నటిస్తుండగా లొల్లుసభ జీవా, దీపా శంకర్, ఆదేశ్ బాలా, నాంజిల్ విజయన్, ఎస్ఎల్ .బాలాజీ, బేబీ వర్ష, వెంకట్రాజ్, శివగురు, రామ్రాజ్, వెడికన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అనుబంధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న వానరన్లో బిజేశ్ నాగేశ్ చాలా సహజంగా నటించారన్నారు. అక్షయ.. ఒయిలాట్టం కళాకారిణిగా అద్భుతంగా చేశారన్నారు. చిత్ర షూటింగ్ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 30 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న తరుణంలో వానరన్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం!
కరీంనగర్: పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కూతరు నగేశ్ (21), పడిదం హరీశ్ (19) ఇద్దరు స్నేహితులు. ద్విచక్ర వాహనం (టీఎస్ 22 హెచ్ 6725)పై మల్లాపూర్ నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు సిద్ధార్థ స్కూల్ దాటాక బస్సును ఓవర్టేక్ చేయబోయి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో కారు, బైక్ ధ్వంసం కాగా, బైక్ నడుపుతున్న నగేశ్, వెనుక కూర్చున్న హరీశ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదిలాబాద్కు చెందిన కారు డ్రైవర్ గౌస్ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. కారు వేగం ధాటికి ఇద్దరు చెరో చోట ఎగిరిపడ్డారు. కాగా రాష్ట్ర రహదారిపై గత కొన్నేళ్లుగా గుంతలు పడ్డ చోటనే ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ప్రమాద సూచికలను రోడ్డుపై ఏర్పాటు చేసిన అధికారులు, రోడ్డును మరమ్మతు చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కడే కుమారుడు.. ప్రమాదంలో మృతి చెందిన పాడిదం హరీశ్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చెర్లపల్లి నుంచి ధర్మారం మండలం మల్లాపూర్లో మూడేళ్లుగా నివాసం ఉంటూ సుతారి పనులు చేస్తు హరీశ్ తండ్రి రాజయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీశ్ ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదవగా, మరో సోదరి ఐదో తరగతి చదువుతోంది. సెల్ఫోన్ రిపేర్ చేస్తూ.. మృతుడు కూతురు నగేశ్ ఇటీవలే బైక్ కొనుగోలు చేశాడు. కరీంనగర్లో నివాసం ఉంటూ సెల్ఫోన్ రిపేర్లు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి పో చమల్లు నగేశ్ చిన్నతనంలోనే మృతి చెందినట్లు తెలిసింది. సోదరుడికి వివాహమైంది. రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాల్లో విషాదం నింపింది. ఇవి చదవండి: హనుమకొండ: దైవదర్శనానికి వెళ్తూ.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి -
పండుగ కోసం బట్టలు కొనేందుకు వెళ్లి.. విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: దసరా సందర్భంగా షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సోన్ మండలం గల 44 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంతోషం రవీందర్ కథనం ప్రకారం.. మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన ఆర్మూర్ నగేశ్ (22) దసరా పండగ కోసం బట్టలు కొనేందుకు ఆదివారం బైక్పై నిర్మల్ వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ డ్రైవర్ వేగంగా వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టారు. కిందపడిన నగేశ్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి బోయవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అక్రమ ఆదాయానికి చెక్ పెట్టిన ఏసీబీ సూపర్ రైడ్
-
Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగులలో యువతిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తనపై బ్లేడ్తో దాడి చేసింది నగేష్ అని బాధిత యువతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. యువతిపై దాడి జరిగిన సమయంలో నగేష్ మాడుగుల జంక్షన్లో వ్యాపారం చేసుకుంటున్నట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా సేకరించిన తర్వాత ఈ కేసులో నగేష్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని.. మెడికల్ రిపోర్ట్ల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సునీల్కుమార్ అన్నారు. చదవండి: (దారుణం.. మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్ష సుపారీ) -
నగేష్ కేసు; కీలకం కానున్న నిందితుల స్టేట్మెంట్
సాక్షి, మెదక్: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ అధికారులు బినామీల పాత్రపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆరుగురు బినామీలను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో మెదక్తోపాటు హైదరాబాద్ శిర్లలో బినామీల పేర్లతో అస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీరిని ఏసీబీ అధికారుల నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలం కీలకం కానుంది. (నగేష్ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ) -
నగేష్ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై మూడో రోజు అవినితి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడవ రోజు నగేష్ బినామిలను ఏసీబీ విచారించింది. నగేష్ బినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామిని విచారించగా, మెదక్, మనోహర బాద్, మేడ్చల్, కామారెడ్డిలో పలు అక్రమాలను ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం ఏసీబీ అధికారులు విచారించారు. నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారులతో డూప్లికేట్ కీ చేయించి రేపు ఓపెన్ చేయించనున్నారు. (మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు) లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. అయితే ఈ కేసుతో తనకు ఏలాంటి సంబంధం లేదని అడిషనల్ కలెక్టర్ విచారణలో తెలిపారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్లో ఉన్న తను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. దీంతో ఆడియో టేపులు ,అగ్రిమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేన్ అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రేపటితో నిందితుల కస్టడీ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రేపు మరోసారి పలువురు అనుమానితులను, సాక్ష్యులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (ఏసీబీ అధికారులను బుకాయించే ప్రయత్నం) -
అడిషనల్ కలెక్టర్ 'నగేష్' కేసులో మహిళ పాత్ర
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై రెండోరోజు విచారణ కొనసాగింది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగేష్ ఆస్తులకు సంబంధించి ముగ్గురు బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. ఇందులో ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డిలో నగేష్ పలు అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగులను సైతం విచారించింది. నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. లాకర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. (బ్యాంకు లాకర్పై స్పష్టతనివ్వని నగేష్) అయితే ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేష్ వెల్లడించారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్లో ఉన్న నేను అవినీతికి ఎందుకు పాల్పడుతానని ఎసిబిని బుకాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆడియో టేపులు ,అగ్రీమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేష్ను ప్రశ్నించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులు మరో మూడు రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. రేపు పలువురు అనుమానితులను , సాక్ష్యులను ఏసీబీ విచారించనుంది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. (అడిషనల్ దందా’పై నగేశ్ మౌనం) -
అడిషనల్ దందా’పై నగేశ్ మౌనం
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో ఇటీవల ఏసీబీ కోర్టు ఐదుగురు నిందితులైన మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ వాసీం, మాజీ ఆర్డీవో అరుణారెడ్డి, మాజీ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, నగేశ్ బినామీ కోలా జీవన్గౌడ్లను నాలుగురోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం నిందితులను చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నగేశ్ ఆస్తులు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించినట్లు సమా చారం. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపారా? అన్న విషయాలపై నగేశ్ నోరు మెదపలేదని సమాచారం. నగేశ్ తమతో పలు అక్రమ వ్యవహాలు చేసేలా ఒత్తిడి పెంచాడని ఇటీవల పలువురు తహసీల్దార్లు చేసిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నగేశ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వీరి కస్టడీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. పార్టీలు, ప్రలోభాలతో బుట్టలోకి! ఈ క్రమంలో జీవన్గౌడ్కు సంబంధించి ఏసీబీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టినట్లు సమాచారం. నగేశ్పై దాడుల సమయంలో ఏసీబీ అధికారుల బృందం ఒకటి.. జీవన్గౌడ్ కోసం ప్రత్యేకంగా అతని స్వస్థలమైన నిర్మల్కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానికంగా పైరవీకారుడిగా పేరున్న జీవన్గౌడ్ గతంలోనూ పలువురు అధికారులను ఇలాంటి అక్రమాలకు వినియోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం డబ్బుతోపాటు పలు రకాల విలాసాలు, పార్టీలు ఆశజూపి ప్రలోభాలకు గురిచేసే వాడని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలతో తనకు పరిచయాలున్నాయని జీవన్గౌడ్ అధికారులను మభ్యపెట్టి పనులు చేయించుకునేవాడని పలువురు రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి తెలిపినట్లు సమాచారం. నగేశ్కు జీవన్గౌడ్ తక్కువ కాలంలోనే దగ్గరయ్యాడని, నమ్మకస్తుడిగా మారి బినామీగా ఎదిగాడని తెలిసింది. ఏకంగా జీవన్గౌడ్ పేరిట పది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని బా«ధితుడు లింగమూర్తిపై ఒత్తిడి చేశాడంటే.. అతను నగేశ్కు ఎంతటి ఆప్తుడిగా మారాడో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏసీబీ : ఆరుగంటల పాటు సాగిన విచారణ
సాక్షి, మెదక్ : జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. అనంతరం ఆర్డీవో అరుణా రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అడిషనల్ కలెక్టర్ నగేష్తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులు నాలుగు రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. మొదటిరోజు విచారణలో ఏసీబీకి నిందితులు సహకరించలేదు. బ్యాంక్ లాకర్ పై నగేష్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. (గుట్టకే ఎసరుకు యత్నం) ఏసీబీ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 40 లక్షలు ఎక్కడ అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను, సాక్షులను సైతం అధికారులు విచారించనున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్) -
అదనపు కలెక్టర్ నగేశ్ బాగోతం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్వోసీ ఇవ్వాలంటే కలెక్టర్కు రూ.1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ–1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ–2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ–3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ–4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ–5గా నగేశ్ బినామీ కోలా జీవన్గౌడ్లను పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే..? శేరిలింగంపల్లికి చెందిన శరత్ చంద్ర, సత్యనారాయణ ప్రసాద్లు ఈ భూమి ఓనర్లు. వీరితో భూమి కొనుగోలుకు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తికి ఒప్పందం కుదిరింది. సర్వే నంబరు 58, 59లలోని ఈ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్కు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరి అయింది. దీంతో జూలై 30వ తేదీన ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ నగేశ్ను లింగమూర్తి ఆశ్రయించాడు. ఎకరానికి లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు కలెక్టర్ ధర్మారెడ్డికి చెల్లిస్తే.. పని అవుతుందని నగేశ్ బేరం పెట్టాడు. విధిలేక లంచం ఇచ్చేందుకు లింగమూర్తి అంగీకరించాడు. మరునాడు జూలై 31న మెదక్లోని ఏసీ నగేశ్ ఇంటికి వెళ్లిన లింగమూర్తి రూ.19.5 లక్షల నగదును లం చంగా ఇచ్చాడు. అపుడు ఏసీ నగేశ్ సర్వే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అయిన వాసీంను కలవాలని సూచించాడు. అక్కడ తనకు, ఆర్డీవోకు, తహసీల్దార్కు కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని వాసీం డిమాండ్ చేయగా.. లింగమూర్తి తన వద్ద ఉన్న రూ. 4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన రూ.లక్షను గూగుల్ పే ద్వారా వాసీం సూచించినట్లుగా సోమరాజాగౌడ్ అనే వ్యక్తికి మూర్తి తన భార్య, సోదరుడి ఫోన్ల ద్వారా పంపాడు. ఆగస్టు 7వ తేదీన రెండో విడతగా రూ.20.5 లక్షలను లింగమూర్తి ఏసీ నగేశ్కు అందజేశాడు. మిగిలిన రూ.72 లక్షలు ఏవని ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా సర్దలేకపో యానని లింగమూర్తి బదులిచ్చాడు. అయితే, ష్యూరిటీ కింద చెక్కులు ఇవ్వాలని ఏసీ నగేశ్ డిమాండ్ చేశాడు. దీంతో తన చందానగర్ ఐసీఐసీఐ ఖాతాకు చెందిన ఎనిమిది ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చాడు లింగమూర్తి. దాంతో అప్పటికే సిద్ధమైన ఎన్వోసీని లింగమూర్తికి అందించాడు నగేశ్. వాస్తవానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్పై జూలై 31 తారీఖునాడే నాటి కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేశారు. మిగతా డబ్బు కోసం ఒకటే ఫోన్లు మిగిలిన డబ్బు కోసం జూనియర్ అసిస్టెంట్ వాసీంతో నగేశ్ పదేపదే ఫోన్లు చేయించాడు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఆ ఫోన్కాల్స్ను రికార్డు చేశాడు. ఆగస్టు 14వ తేదీన మెదక్ ఏసీ నగేశ్తో లింగమూర్తి మరోసారి సమావేశమయ్యారు. మిగిలిన రూ.72 లక్షలకు సర్దలేకపోతున్నానని లింగమూర్తి చేతులెత్తేశాడు. అయితే ఎన్వోసీ జారీ అయిన 112 ఎకరాల్లో నుంచి పదెకరాలు తాను సూచించిన కోలా జీవన్గౌడ్ పేర రిజిస్ట్రేషన్ చేయాలని నగేశ్ సూచించగా, చివరికి ఐదెకరాలకు బేరం కుదిరింది. ఆగస్టు 15న జీవన్గౌడ్ పేరిట సేల్డీడ్ సిద్ధం చేసిన లింగమూర్తి వాటిని వాట్సాప్ ద్వారా వారికి పంపించాడు. ఈ లావాదేవీలో ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని నగేశ్ ముందుగానే లింగమూర్తిని ఫోన్లో హెచ్చరించాడు. అయితే ఈ సంభాషణ మొత్తం లింగమూర్తి ఫోన్లో రికార్డయింది. తరువాత సేల్ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీని ఆగస్టు 21వ తేదీన కలిసినపుడు లింగమూర్తి నుంచి ఏసీ నగేశ్ తీసుకున్నాడు. ఆగస్టు 22న ఏసీబీ ఆఫీస్కు లింగమూర్తి ఆగస్టు 7వ తేదీ నుంచే నగేశ్– లింగమూర్తి మధ్య విభేదాలు పొడసూపినట్లు సమాచారం. జూలై 31 రోజునే ఎన్వోసీ జారీ అయినా.. ఆ విషయం తనకు చెప్పకుండా రూ.20.5 లక్షలు వసూలు చేయడం, పైగా తాను కొనుగోలు చేసిన భూమిలో పదెకరాలు ఇవ్వాలనడం లింగమూర్తికి రుచించలేదు. చివరికి ఐదెకరాలకు ఒప్పందం కుదిరింది. ఆగస్టు 15వ తేదీన వాట్సాప్లో సేల్ అగ్రిమెంట్ను పంపించిన లింగమూర్తి అడిషనల్ కలెక్టర్ను వారం దాకా కలవలేదు. ఈ సమయంలో లింగమూర్తిపై అడిషనల్ కలెక్టర్కు అనుమానం వచ్చింది. తనకు ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఆదేశించడంతో ఆగస్టు 21న కలిసి ఇచ్చేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే జాప్యమైందని, తాను ఏసీబీని ఆశ్రయించలేదని వివరణ ఇచ్చుకున్నాడు లింగమూర్తి. చివరకు ఈనెల 9న నగేశ్ను ఏసీబీ అరెస్టు చేసింది. విచారణలో నోరువిప్పని ఏసీ..! ఏసీబీ విచారణ సందర్భంగా ఏసీ నగేశ్ నోరు విప్పలేదు. మొదట్లో అసలు లింగమూర్తి ఎవరో తనకు తెలియదన్న నగేశ్.. చిప్పలతుర్తి సమీపంలో ఫిర్యాదుదారుడు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తి భూమి గురించి తనను కొన్నిసార్లు కలిసినట్లు తెలిపాడు. కానీ, ఆయన నుంచి రెండు దఫాల్లో తీసుకున్న రూ.40 లక్షల గురించి ప్రశ్నించగా.. ఎలాంటి డబ్బును తీసుకోలేదన్నాడు. అలాగే మిగిలిన రూ.72 లక్షలకు ఫిర్యాదుదారుడు సంతకం చేసి ఇచ్చిన చెక్కులు, ఐదెకరాల భూమికి చేసుకున్న అగ్రిమెంటు తాలూకు పత్రాల గురించి పదేపదే అడగ్గా.. బహుశా వారు «కలెక్టర్ ధర్మారెడ్డిని కలిశారేమో అంటూ సమాధానమిచ్చాడు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నిందితులు ఐదుగురు ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సస్పెన్షన్ మరో నలుగురిపైనా వేటు భూ వ్యవహారంలో మెదక్ అదనపు కలెక్టర్సహా నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎకరాకు రూ.లక్ష ఇస్తే 22ఏ(నిషేధిత జాబితా) నుంచి 112 ఎకరాలను తొలగిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేస్తానని నగేశ్ హామీ ఇచ్చి నట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 9న మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూ వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీవో, చిలిపిచెడ్ తహసీల్దార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మరో ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అలాగే మరొకరు అదనపు కలెక్టర్ బినామీగా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్
సాక్షి, మెదక్: జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులో నగేష్తో పాటు మరో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: ‘లాకర్’ గుట్టు వీడేనా..!) నగేష్తో పాటు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీపీ కోర్టును కోరింది. నిందితులను కస్టడీకి తీసుకోవడం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పిటిషన్తో పేర్కొంది. మాజీ కలెక్టర్ పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. అంతేగాక స్టాంప్ అండ్ రీజిస్టేషన్కు మాజీ కలెక్టర్ రాసిన లేఖ ద్వారా ఈ కేసులో మాజీ కలెక్టర్ పాత్రపై వివరాలు సెకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
‘లాకర్’ గుట్టు వీడేనా..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు. బినామీలు, వారి ఖాతాలపై నజర్ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు. రియల్టర్పై నజర్.. మెదక్ జిల్లాలో రెండు చోట్ల విద్యాసంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.., అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు భూవ్యవహారాల్లో ఏసీకి అన్నీ తామై కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ కేంద్రంగా తతంగం నడిపించినట్లు గుర్తించారు. వీరిని సైతం ఏసీబీ త్వరలో విచారించనున్నట్లు తెలిసింది. లాకర్, బీరువా తెరిచేందుకు సన్నాహాలు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నగేశ్ను ఏసీబీ అధికారులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. సోదాల సమయంలో అదనపు కలెక్టర్ దంపతులు అధికారులకు సహకరించకుండా బ్యాంక్ లాకర్, బీరువా తాళం చెవులు లేవంటూ మొండికేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో వీటిని తెరిచేందుకు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. వీటిని తెరిస్తే నగదు, బినామీల బాగోతం వెలుగుచూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మాజీ కలెక్టర్కు నోటీసులు చిప్పల్తుర్తి భూములకు సంబంధించి 112 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22–ఏ నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్డీఓ అరుణారెడ్డి ఏసీబీకి కీలక సమాచారం ఇవ్వడంతో అధికారులు దూకుడుగా ముం దుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
గుట్టకే ఎసరుకు యత్నం
సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో ఉన్న గుట్టకే ఎసరు పెట్టేందుకే యత్నించారు. ఈ విషయం తాజాగా శనివారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పాంబండ గ్రామ శివారులో సర్వే నంబర్ 142లోని ప్రభుత్వ భూమిలో ఇరవై ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో క్వారీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ కోల జీవన్ గౌడ్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ భానుప్రకాశ్ దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. గుట్టకు ఆనుకుని అటవీ ప్రాంతం, గ్రామం ఉండటంతో నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఫైలును వెనక్కి పంపించారు. పలు రకాలుగా ఒత్తిళ్లు ఎలాగైనా క్వారీకి అనుమతులు పొందాలని జీవన్గౌడ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ.. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎత్తుగడలు వేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ను రంగంలోకి దించడంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో సిఫార్సుసు చేయించినట్లు తెలిసింది. క్వారీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్పై పలు రకాలుగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. కాగా, ఎవరు చెప్పినా తహసీల్దార్ వినకపోవడంతో అదనపు కలెక్టర్ దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నాలుగైదు నెలలుగా సదరు తహసీల్దార్పై ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీన్ని మనసులో పెట్టుకుని తహసీల్దారుపై ఏసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారని.. ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ దాడులతో వెలుగులోకి.. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినప్పుడు నగేశ్కు నిర్మల్ జిల్లాకు చెందిన జీవన్గౌడ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి భూ వ్యవహార లావాదేవీల్లో అదనపు కలెక్టర్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్గా నగేశ్ మెదక్ జిల్లాకు వచ్చినప్పటికీ అతడికి జీవన్గౌడ్ బినామీగా వ్యవహరించడం.. వారిద్దరి మధ్య స్నేహం ఏ పాటిదో తెలుస్తోంది. అయితే రూ.112 ఎకరాల భూమికి ఎంఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం.. అతడి బినామీ జీవన్గౌడ్నూ అరెస్టు చేయడంతో జీవన్గౌడ్ పాంబండ కేంద్రంగా గుట్టకు ఎసరు పెట్టిన ప్రయత్నాలు వెలుగు చూశాయి. కాగా.. క్వారీ లీజుకు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భావించారా.. జీవన్ గౌడ్ సొంతంగా తీసుకోవాలని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడికి తలొగ్గలేదు: శివ్వంపేట తహసీల్దార్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్న పలు భూ వివాదాలపై తనపై ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చినా.. తలొగ్గ లేదని, అందుకే ఈ రోజు తలెత్తుకొని ఉన్నానని, లేకుంటే తాను కూడా జైలులో ఉండేవాడినని తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శివ్వంపేటలో నెలకొన్న భూ సమస్యల గురించి ప్రస్తావించిన విషయం గురించి తహసీల్దార్ భానుప్రకాశ్ వివరణ ఇచ్చారు. పాంబండ, పిల్లుట్ల గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద భూముల విషయంపై చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన జీవన్గౌడ్ సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. -
ఆ ముగ్గురు ఎక్కడ?..
సాక్షి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో 112 ఎకరాల నిషేధిత భూమికి ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురు అరెస్టు అయిన విషయం విదితమే. ఎప్పుడైతే నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారో.. అప్పటి నుంచి వీరంతా అదృశ్యమయ్యారు. మరోవైపు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేసి పంపించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి లేఖ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. సన్నిహితంగా ఆ ముగ్గురు అడిషనల్ కలెక్టర్కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు అదృశ్యమవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి ఇంత వరకు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ ముగ్గురిలో ఒకరు కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో పనిచేస్తారు.. మరొకరు అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో నిత్యం అన్నీ తానై వ్యవహరిస్తారు.. ఇంకొకరు అన్నింటా సహకరించే వ్యక్తి. వీరు సడన్గా మాయమవడంతో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారన్న ప్రచారం సాగుతోంది. వివిధ పనులకు రూరల్ ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చినవారు గతంలో పరిచయమున్న సిబ్బంది లేకపోవడంతో గుసగుసలాడుకున్నారు. ధర్మారెడ్డిని విచారించే అవకాశం ఈ భూ వ్యవహారంలో మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పేరు వినిపించడం కలకలం సృష్టించింది. 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అదనపు కలెక్టర్ నగేశ్.. భూమి కొనుగోలు చేసిన లింగమూర్తితో రూ.1.12 కోట్లకు జూలై 31న బేరం కుదుర్చుకున్నారు. భూ ఎన్ఓసీకి సంబంధించిన ఫైలు ఆగస్టు 21న తహసీల్దార్, 23న ఆర్డీవో, 25న కలెక్టర్కు చేరింది. ఆ తర్వాత జూలై 31న మూర్తితో రూ.1.12 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. ఇదే రోజు కలెక్టర్ ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వెలుగులోకి వచ్చిన లేఖలో 112 ఎకరాలకు ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఫైలు అందిందని ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ రోజు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందనే కోణంలోనూ వారు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు .. ధర్మారెడ్డి పదవీ విరమణ తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఇంకా మెదక్లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయలేదని సమాచారం. ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి రోజు ఫోన్ చేసి ఆరా తీసే ధర్మారెడ్డి.. అడిషనల్ కలెక్టర్ వివాదం తర్వాత అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో ఆయనను విచారించడం ఖాయమని అవినీతి నిరోధక శాఖకు చెందిన ఒకరు స్పష్టం చేశారు. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెందరి పాత్రలు ఉన్నాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తహసీల్దార్ మాలతికి ప్రశ్నల వర్షం చిప్పల్తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలోని భూమి ఎన్ఓసీకి దరఖాస్తు సమయంలో నర్సాపూర్ తహసీల్దార్ మాలతి సెలవులో ఉన్నారు. అప్పుడు ఆర్డీవో అరుణారెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్గా ఉన్న సత్తార్కు ఈ వ్యవహారంలో రూ.లక్ష చొప్పున ముట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఆర్డీవోను హైదరాబాద్కు తీసుకెళ్లేటప్పుడు మాలతిని సైతం తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆర్డీవో మహిళ కావడంతో మాలతిని ఆమెకు తోడుగా తీసుకెళ్లినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత మాలతిని కూడా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో ఎందుకు సెలవు పెట్టారు?.. ఎవరైనా ఒత్తిడి చేశారా?.. ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో సెలవు పెట్టినట్లు ఆమె సమాధానం ఇచ్చారని సమాచారం. -
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్ పట్టుబడిన విషయం తెలిసిందే. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) కాగా కోట్ల రూపాయిలు లంచాలు తీసుకుంటున్న నగేష్కు ఏసీబీ అధికారులను చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు 103 డిగ్రీల జ్వరం ఉందని, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉందంటూ చెప్పడంతో... వైద్యుల పర్యవేక్షణలో నగేష్కు ఫీవర్ చెక్ చేయడంతో పాటు మందులు అందిస్తూనే మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చేర్పించాలంటూ అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు. (రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ) ఎకరానికి లక్ష చొప్పున ఒప్పందం ఈ కేసుపై ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ‘శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో సోదాలు చేశాం. మాకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. 29 ఫిబ్రవరి 2020 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేయడానికి అమ్మకం ఒప్పందానికి ఎన్వోసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. జులై 31న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్ కుదిరింది. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. ఆగస్ట్ 7 తేదీన ఫిర్యాదుదారుడి నుండి మరోసారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్కి బాధితుడు బదిలీ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు తీసుకున్నాడు. లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో లక్ష తహసీల్దార్కు వసీం ఇచ్చాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు కూడా గుర్తించాం. నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డీడ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం’ చేసుకున్నట్లు తెలిపారు. -
రూ.కోటి 12 లక్షలు లంచం: ఆడియో సంభాషణ
-
రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్ కలెక్టర్ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్కు రంగం సిద్ధం అవుతోంది. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్ మొదలు వీఆర్వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్ లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. సోదాలు అనంతరం హైదరాబాద్ ఏసీబి ప్రధాన కార్యాలయంకు తరలించనున్నారు. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) బాధితుడితో అడిషనల్ కలెక్టర్ ఆడియో సంభాషణ ►మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా, మీకు క్లారిటీ ఉందా ►మీకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు - అడిషనల్ కలెక్టర్ ►నాకు క్లారిటీ ఉంది సర్ - బాధితుడు ►మొదటగా 25 లక్షలు ఇస్తాం అన్నారు , ఆ తరువాత 19.5 ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►వసీం 5 లక్షలు ఇచ్చాను , మొదటగా రెండు లక్షలు , ఆ తరువాత మూడు లక్షలు ఇచ్చాను - బాధితుడు ►నేను రెండు లక్షలు చెప్పాను కదా, నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►మీకు వసీం కాల్ చేశాను అని చెప్పాడు , అందుకే ఇచ్చాను సర్ - బాధితుడు ►ఎవరికీ ఏమి ఇచ్చిన ప్రతిదీ నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు - అడిషనల్ కలెక్టర్ ►ఆడియో క్లిప్లో డబ్బు లావాదేవీల చర్చతో అడ్డంగా బుక్కైన అధికారి -
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
-
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్రెడ్డి) అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా) అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు) -
క్రీడల నేపథ్యంలో...
కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్మేకర్ నగేశ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్లో చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ. -
‘యడ్యూరప్ప పీఏ నన్ను హైజాక్ చేశాడు’
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజీనామ చేసిన రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ను యడ్యూరప్ప హైజాక్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందే నగేష్ నాకు కాల్ చేశారు. యడ్యూరప్ప పీఏ తనను హైజాక్ చేశాడని చెప్పారు. వెంటనే నేను విమానాశ్రయానికి వెళ్లాను. ఆ లోపే విమానం వెళ్లి పోయింది’ అన్నారు. ఇదంతా యడ్యూరప్ప దర్శకత్వంలోనే జరుగుతుందని శివకుమార్ ఆరోపించారు. ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి అయిన నగేష్ గత నెలలోనే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితుల్లో నగేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. విమానాశ్రయంలో నగేష్ విమానం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
డాక్టర్ నగేష్కే వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలు
కొత్తపల్లి(కరీంనగర్): వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలను కరీంనగర్కు చెందిన డాక్టర్ కే.నగేష్కు పార్టీ అధిష్టానం అప్పగించింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఆయన కరీంనగర్ నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వృత్తిరీత్యా వైద్యుడైన నగేష్కు అమరావతిలో జరిగిన ఏపీ ప్లీనరీ సమావేశాలు, హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించే అవకాశాన్ని అధిష్టానం కల్పించింది. ప్లీనరీలో నగేష్ ప్రసంగం పార్టీ అధినాయకత్వాన్ని, శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. మిడ్మానేరు ప్రాజెక్టు సమస్యపై, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకారం అందించారు. దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మితమైన రాజీవ్ గృహకల్ప సముదాయాలు శిథిలావస్థకు చేరడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా నగేష్ విశేషంగా కృషి చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యం : డాక్టర్ నగేష్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు నూతనంగా నియామకమైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కే.నగేష్ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికవ్వడం తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో జగన్ ముందుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగా ణలో కూడా పార్టీ బలోపేతానికి అధిష్టానం దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని అన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన గట్టు శ్రీకాంత్రెడ్డికి, అందుకు సహకరించిన వైఎస్ జగన్, తదితర నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఏసీబీ వలలో బొల్లారం ఎస్ఐ, కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్ : ఓ కేసు విషయమై రూ.20 వేల లంచాన్ని ఫోన్ పే ద్వారా తీసుకున్న బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్2 డీఎస్పీ ఎస్.అచ్చేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ఆదర్శనగర్కు చెందిన జనగాం నర్సింగ్రావు బ్యాండ్మేళా నిర్వహిస్తుంటాడు. నర్సింగ్రావు వద్ద పనిచేసే వర్గల్కు చెందిన గోపీ అడ్వాన్స్గా రూ.18వేలు తీసుకుని ఏడాదిగా పనిలోకి రావడం లేదు. అకస్మాత్తుగా ఈ నెల 2వ తేదీన రోడ్డుపై కలవడంతో పనికి ఎందుకు రావడం లేదని గోపీని నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే గోపీపై నర్సింగ్రావు చేయిచేసుకున్నాడు. దీంతో గోపీ తన యాజమాని నర్సింగ్రావుపై ఈ నెల 3వ తేదీన బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నర్సింగ్రావుపై సెక్షన్ 324, 384 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ నిమిత్తం పిలిచినా రాకుండా నర్సింగ్రావు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ముందస్తు బెయిల్కు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కానిస్టేబుల్ నగేష్ ద్వారా ఎస్ఐ బ్రహ్మచారికి రాయబారం నడిపాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ. 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. స్టేషన్ బెయిల్ నిమిత్తం కానిస్టేబుల్ నగేష్ ఈ నెల 13వ తేదీన నర్సింగ్రావు ఇంటికి రావడంతో ఆయన భార్య అంభికా మొదటి విడతగా కానిస్టేబుల్కు రూ.10వేల నగదును ఇచ్చింది. నర్సింగ్రావు ఇంటి ఎదురుగా ఉన్న టెంట్హౌజ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. అనంతరం రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు ఫోన్ పే చేయాలని కానిస్టేబుల్ నగేష్ నర్సింగ్రావు భార్య అంబికకు ఫోన్ చేశాడు. అకౌంట్ నంబర్ పంపివ్వాలని ఆమె సూచించగా వాట్సాప్లో అకౌంట్ నంబర్ పంపగా, ఆ అకౌంట్ నంబర్కు రూ.10వేలు బదిలీ చేసింది. అనంతరం కానిస్టేబుల్కు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ విషయం ఎస్ఐకి చెప్పాలనగా కానిస్టేబుల్ నగేష్ కాన్ఫరెన్స్ కలిపాడు. డబ్బులు పంపించినట్లు ఆమె చెప్పిన విషయాన్ని విన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ వస్తుందనుకున్న నర్సింగ్రావుకు మాత్రం నిరాశే మిగిలింది. బెయిల్ ఇవ్వాలంటే టీఆర్ఎస్ నేత వేణుగోపాల్రెడ్డిని వెంటబెట్టుకుని స్టేషన్కు రావాలని ఎస్ఐ బ్రహ్మచారి తనకు సూచించాడని నర్సింగ్రావు అన్నారు. ఇదిలా ఉండగా మరోసారి తన ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ రూ.5వేలు కావాలని డిమాండ్ చేశాడని తెలిపాడు. డబ్బులు ఇచ్చినా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా, కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుండడంతో నగర ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీసీ కెమెరాల రికార్డుతో పాటు ఫోన్లోని వాట్సాప్, ఆడియోలను పరిశీలించి, పూర్తి ఆదారాలతో సోమవారం బొల్లారం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. -
నాన్నే స్ఫూర్తి
నాకు బచ్చల కూర పప్పు అంటే భలే ఇష్టం. వంట కూడా బాగా వండుతా. చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. సెల్ఫ్ కుకింగ్తో రిలాక్స్ కావొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నేనే వండుతా. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మమ్మీ కంటే డాడీనే బాగా వంట చేస్తారని మా పిల్లలు అంటుంటారు. మా నాన్న.. మా టీచర్.. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్. మా నాన్నే నాకు స్ఫూర్తి అని.. ఆయన అండ, సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టమని, సమయం దొరికితే కవితలు రాస్తుంటానని, కామెడీ, కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయని చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య విధుల్లో తలమునకలైన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపిగుర్తులు, మరుపురాని సంఘటనలు, ఇష్టమైన వంటకాలు, సినిమాలు, ఆటలు, స్నేహబంధంపై నగేష్ పర్సనల్ టైం ఆయన మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మా నాన్న రాంరెడ్డి రిటైర్డ్ టీచర్.. అమ్మ పద్మ హౌస్ వైఫ్. నాకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని తొర్లికొండకు చెందిన మమతతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాకు ఇద్దరు సంతానం. అబ్బాయి ధీరజ్ బీటెక్ తృతీయ సంవత్సరం.. అమ్మాయి లాస్య బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. విద్యాభ్యాసం.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్లో నాలుగో తరగతి వరకు చదివాను. హైదరాబాద్లోని అమీర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని చందూర్లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసించాను. నిజామాబాద్ జిల్లా బోధన్లోని శంకర్నగర్లో ఉన్న మధుమలంచ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్.. నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఎల్ఐసీ, ఎంఏ–తెలుగు విద్యనభ్యసించాను. అది నాకు చేదు, తీపి జ్ఞాపకం వెల్కటూర్లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నన్ను మార్చేసింది. మా నాన్న ఆ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు. 30 ఏళ్లు అక్కడే టీచర్గా పనిచేశారు. సిన్సియర్ టీచర్గా పేరు సంపాదించారు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు తెలుగు నెలల పేర్లు చెప్పమంటే.. చెప్పాను. వరుస క్రమంలో చెప్పకపోవడంతో అందరి ముందు బెత్తంతో బాదారు. ఆ తర్వాతే నేను చదువు మీద దృష్టిసారించాను. ఇది నాకు చేదు, తీపి జ్ఞాపకంగా మిగిలింది. గాంధీ ఆటోబయోగ్రఫీ మరువలేను నేను హైదరాబాద్లో ఏడో తరగతి చదువుతున్నా. స్కూల్లో ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో నేనే ఫస్ట్ వచ్చా. నాకు జాతిపిత మహాత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ ఉన్న పుస్తకం, ఒక డిక్షనరీ ప్రజెంట్ చేశారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. హ్యాపీ మూమెంట్.. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో నాకు గ్రూప్–3 ఉద్యోగం వచ్చింది. 1994లో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా నా తొలి పోస్టింగ్. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం. ఓ హోటల్లో అందరం భోజనం చేసి.. స్వీట్లు తిన్నాం. అది నాకు హ్యాపీ మూమెంట్. మూడు సంఘటనలు మరిచిపోలేనివి కామారెడ్డిలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించాను. ఓ సంధులోని పాత ఇంట్లో ఆ స్కూల్ ఉంది. గాలి, వెలుతురు రాకపోవడంతోపాటు వసతులు సరిగా లేవు. పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకుంటే చాలా బాధేసింది. వెంటనే మార్చాలని నిర్ణయానికి వచ్చా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏఎస్డబ్ల్యూ ఆఫీస్లోకి మార్చా. ఈ ఆఫీస్ను అంతకు మునుపే కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనంలోకి తరలించారు. దీంతో కేజీబీవీని అక్కడికి తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించా. ఏడు, ఎనిమిది గదులను అప్పటికప్పుడు శుభ్రం చేసి బాలికల విద్యాలయాన్ని అక్కడికి మార్చాం. ఒక్క రోజులోనే ఇదంతా చేశాం. ఈ ప్రాంతం జనావాసాలకు కొంత దూరంగా ఉండడంతో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సూచించా. ఇందుకోసం పోలీసులు ప్రతి రాత్రి సంతకం చేసేలా బుక్ పెట్టాం. ఈ నేపథ్యంలో విద్యార్థినులు చాలా హ్యాపీగా ఫీల్ కావడం.. నాకు సంతోషాన్నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. 2015–16 అనుకుంటా. ఎవరెస్ట్ను అధిరోహించిన పూర్ణ అనే అమ్మాయి అప్పుడు అక్కడే చదువుతోంది. ఈ పాఠశాల గుట్టమీద ఉండడంతో తాగునీటికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. వెంటనే గుట్ట కింద ఉన్న బావి వారితో మాట్లాడి పూడిక తీయాలని సంకల్పించా. వెంటనే జేసీబీతో బావి పూడిక తీయడంతోపాటు గుట్టపైకి పైపులైన్ వేసి విద్యార్థుల నీటి కష్టాలు తీర్చాను. విద్యార్థులు వచ్చి థ్యాంక్స్ సర్ అని చెప్పడంతో ఆనందమేసింది. కామారెడ్డిలో ఆర్డీఓగా ఉన్న సమయంలో 2016లో సుమారు పది వేల మందికి పౌతి చేసి రికార్డ్ సృష్టించాం. చనిపోయిన వారి వారసులకు సంబంధించిన భూములను గ్రామ సభలు నిర్వహించి గుర్తించాం. సుమారు పదేళ్లుగా వారు పట్టాపాస్ బుక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వారి గ్రామాల్లో చెట్ల కింద పౌతి ప్రక్రియ పూర్తి చేసి వారి ఇంటి వద్దకు వెళ్లి పాస్బుక్కులు అందజేశాం. దీనికి సంబంధించి ఆయా గ్రామస్తులు అభినందించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. బుక్స్ రీడింగ్ ఇష్టం నాకు బుక్స్ చదవడమంటే ఇష్టం. ఇప్పటివరకు సుమారు 1000 నుంచి 1,200 వరకు బుక్స్ కలెక్ట్ చేశాను. దీంతోపాటు సాహిత్యం, కవితలపై ఇంట్రస్ట్ ఎక్కువ, అప్పడప్పుడు కవితలు రాస్తుంటా. సినిమాలు చాలా తక్కువగా చూస్తా. హిట్ టాక్వచ్చి.. ఫ్యామిలీ సినిమా అయితేనే వెళతాం. రెండు, మూడు నెలలకోసారి ఫ్యామిలీతో సహా సినిమా చూస్తాం. మా ఇంట్లో కామెడీ సినిమాలే ఇష్టపడతారు. నేను చూసిన వాటిలో ‘కిక్’ సినిమా చాలా బాగుంది. స్నేహబంధంలో ప్రత్యేక అనుభూతి.. స్నేహ బంధంలో మరపురాని అనుభూతి ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతోపాటు యూనివర్సిటీ ఫ్రెండ్స్తో ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇటీవల ఎస్సెస్సీ బ్యాచ్ వాళ్లు గెట్ టుగెదర్ పెట్టారు. నేను బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. దసరా వంటి పండుగలకు ఊరెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ను తప్పనిసరిగా కలుసుకుంటా. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి.. పుస్తకాలు చదివించడం నేర్పించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేలా వారిలో తల్లిదండ్రులు స్ఫూర్తి నింపాలి. విధులు ఇలా.. నా తొలి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత హైదరాబాద్లోని సెక్రటేరియేట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్గా.. నిజామాబాద్లో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్గా, భువనగిరిలో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తించాను. అనంతరం కామారెడ్డి ఆర్డీఓగా, నిర్మల్ డీఆర్వోగా, ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్గా 2017 నవంబర్ నుంచి పని చేస్తున్నాను. -
నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు...
సాక్షి, హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవానికి, ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ఈ విషయం క్రమశిక్షణా సంఘం కూడా గుర్తించినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని నగేశ్ ముదిరాజ్ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన గాంధీభవన్లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై అకారణంగా చేయి చేసుకోవడంతో పాటు వీహెచ్ తనను వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. అన్ని పార్టీల నేతల ముందు, తన నియోజకవర్గంలో వీహెచ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, కనీసం వీహెచ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం...నగేశ్పై సస్పెన్షన్ వేటు వేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నా సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం -
నగేశ్పై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో క్రమశిక్షణా సంఘం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన క్రమశిక్షణా సంఘం సమావేశం సోమవారం గాంధీభవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో కో చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్, కన్వీనర్ కమలాకర్ రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వీహెచ్, నగేశ్ మధ్య జరిగిన ఘర్షణపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. నగేశ్ ముదిరాజ్ ఈ సందర్భంగా క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై సంఘటనపై వివరణ ఇచ్చారు. మరోవైపు వీహెచ్ కూడా జరిగిన సంఘటనపై లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు అందించిన సమాచారాన్ని కూడా పరిశీలించింది. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత నగేశ్ ముదిరాజన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నగేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ చదవండి: (వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్) -
నగేష్ బహిష్కరణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. దీని కోసం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండ్రెడ్డి, ఇతర సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుపైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ దాడి చేసినట్లు క్రమశిక్షణా సంఘం భావిస్తోన్నట్లు తెలిసింది. ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి ఆర్సీ కుంతియా సభలో పాల్గొన్న సమయంలో వీహెచ్పైన దాడి జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించింది. సీనియర్ నాయకులు, పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వీహెచ్పైన నగేశ్ ముదిరాజ్ అనుచితంగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగడాన్ని క్రమశిక్షణా సంఘం తీవ్రంగా ఖండింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని క్రమశిక్షణా సంఘం తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీలను కమిటీకి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా సూచన చేశారు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్పైన చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వారినైనా, ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. -
వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్లో వీహెచ్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్పై వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ వీహెచ్ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. నగేష్ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్ నేత వీహెచ్పై నగేశ్ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్పై చర్యలు తీసుకోనున్నారు. -
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో కొత్త డ్రామా తెర మీదకు తెచ్చాడు. తాను అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు ఖర్చు చేయించడమే కాకుండా, పెళ్లికి నిరాకరించిన జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిపై కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తవ్వినకొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకేసులో రాకేష్ రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్, విశాల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. శిఖా చౌదరి బ్రేకప్ చెప్పడంతో.. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...‘శిఖా చౌదరి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటు, రాకేష్ రెడ్డికి బ్రేకప్ చెప్పి దూరం పెట్టడంతో అతడు కోపం పెంచుకున్నాడు. దీంతో శిఖా చౌదరికి ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. అంతేకాకుండా ఆమెకు జయరామ్ బహుమతిగా ఇచ్చిన కారును రాకేష్ రెడ్డి తీసుకు వెళ్లాడు. ఈ విషయాన్ని శిఖా చౌదరి తన మేనమామకు చెప్పడంతో ఆ డబ్బులు తాను ఇస్తానని జయరామ్ హామీ ఇచ్చి, కారు తిరిగి శిఖాకు ఇప్పించాడు. ఆ తర్వాత జయరామ్ను డబ్బులు అడిగితే సరిగా స్పందించకపోవడంతో ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేయడానికి రాకేష్ రెడ్డి పథకం వేశాడు. దీంతో జయరామ్ కుటుంబంతో పాటు, ఆయన ఆస్తులపై రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా జయరామ్ను బెదిరించి ఆస్తి కొట్టేసి, ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. హనీ ట్రాప్తో పక్కా స్కెచ్ ఇందుకోసం జయరామ్ అమెరికా నుంచి రాగానే రాకేశ్ రెడ్డి ‘హనీ ట్రాప్‘ చేసి, ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇందుకోసం అతడు తన డ్రైవర్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేష్, అతడి మేనల్లుడు విశాల్, జూనియర్ ఆర్టిస్ట్ సూర్యప్రసాద్ సాయం తీసుకున్నాడు. జయరామ్ను 19 గంటల పాటు తన ఇంట్లో నిర్భందించాడు. ఆ సమయంలో డబ్బులు అడగగా...జయరామ్ రూ.6 లక్షలు సమకూర్చాడు. తనను వదిలిపెడితే రూ.10 కోట్లు ఇస్తానని జయరామ్ ఆఫర్ చేసినా రాకేష్ రెడ్డి నిరాకరించాడు. అంతేకాకుండా నిన్ను చంపితే నాకు రూ.100 కోట్లు వస్తాయంటూ... అతడితో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు డ్రైవర్ శ్రీనివాస్తో పాటు విశాల్ కూడా సహరించాడు. ఆ తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కారులో కృష్ణాజిల్లా నందిగామకు వెళ్లాడు. ఆ తర్వాత కారు అక్కడే వదిలేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. విశాల్ లైఫ్ సెటిల్ చేస్తానంటూ.. రాకేష్ రెడ్డి తాను చేస్తున్న అక్రమ దందాలకు రౌడీ షీటర్ నగేష్ సాయం తీసుకునేవాడు. ఆ నేపథ్యంలో అతడి మేనల్లుడు విశాల్తో పరిచయం అయింది. నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ ఆశచూపించిన రాకేష్ రెడ్డి... జయరామ్ హత్యకు విశాల్ సాయం తీసుకున్నాడు. అంతేకాకుండా హత్య కేసులో నీ పేరు రాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. జయరామ్ హత్య తర్వాత ఆస్తులను లిటిగేషన్ చేస్తామని, అతడి భార్య పద్మశ్రీతో సెటిల్మెంట్ చేసుకుందామని విశాల్ ఆశ చూపించిన రాకేష్ చిట్టచివరికి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఆది నుంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ ఎపిసోడ్లో జయరామ్ హత్యకు శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఉద్యమ పార్టీకే అందలం..!
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర సాధనే సింగిల్ ఎజెండాతో ఉద్యమం సాగించిన టీఆర్ఎస్కు 2014లో జిల్లా ప్రజలు అధికారం అప్పగించారు. 2001లో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడింది. అయితే 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆదరణ లభించలేదు. ఒక్క ఆలేరు నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ 2004 ఎన్నికల్లో విజయం సాధించగా, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే స్థానిక సంస్థల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన భువనగిరి డివిజన్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస ఘన విజయాలను నమోదు చేసింది. అదే ఊపుతో నల్లగొండ జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని విజయం ఢంకా మోగించింది. భువనగిరి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలైన భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. అంతకు ముందు రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపింది. తెలంగాణ ఉద్యమకాలంలో జిల్లాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గంలో తప్ప ఎక్కడ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుని ఆలేరు ఆసెంబ్లీ స్థానంలో విజయం సాధించిన టీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గంలో ఓడిపోయింది. 2009లో మహాకూటమితో పొత్తుపెట్టుకుని పోటీచేసిన ఆలేరుతో పాటు హుజూర్నగర్, సూర్యాపేట, అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. రెండు సార్లు ఆలేరులో గెలిచిన నగేశ్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుని 2004 ఎన్నికల బరిలో దిగింది. ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ నగేశ్ టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుపై విజయం సాధించారు. అదే ఎన్నికల్లో భువనగిరిలో పోటీ చేసిన ఆ పార్టీ నేత ఆలె నరేంద్ర టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. నకిరేకల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ ఓటమి పాలయ్యారు. 2008లో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కోసం ఆలేరు ఎమ్మెల్యే డాక్టర్ నగేశ్ తొలిరాజీనామా చేశారు. వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి నగేశ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 నాటికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. మహాకూటమిలో చేరిన టీఆర్ఎస్ జిల్లాలో నాలుగు చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల పరాజయం పాలయ్యింది. టీడీపీ, వామపక్షాలతో కలిసిన టీఆర్ఎస్ మహాకూటమి పేరుతో జిల్లాలోని ఆలేరు, సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్లెంయాదగిరిరెడ్డి ఓటమిపాలయ్యారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి చేతిలో, సూర్యాపేటలో పోరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2014 నాటికి సీన్ రివర్స్ తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో సగం సీట్లు కైవసం చేసుకుంది. భువనగిరి పార్లమెంట్ స్థానంలో విజయం సా«ధించింది. టీఆర్ఎస్ నుంచిపోటీ చేసిన డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ విజయం సాధించారు.12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. సూర్యాపేటలో గుంటకండ్ల జగదీశ్రెడ్డి, భువనగిరిలో పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నకిరేకల్లో వేముల వీరేశం, తుంగతుర్తిలో గాదరి కిశోర్లు విజయం సా«ధించి అసెంబ్లీకి వెళ్లారు. సూర్యాపేట నుంచి గెలిచిన జగదీశ్రెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఆలేరు నుంచి గెలిచిన గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ప్రభుత్వ విప్గా సేవలందించారు. -
ఎంజీఆర్తో ఢీ
తమిళసినిమా: లెజెండరీ యాక్టర్, చరిత్రకారుడు ఎంజీఆర్తో కలిసి నటించే అవకాశం కోసం అప్పట్లో చాలా మంది ఎదురుచూసి ఉంటారు. అలాంటి వారిలో అతి కొద్దిమందికే ఆయనతో నటించే అవకాశం లభించి ఉంటుంది. చాలా మందికి అది కలగానే మిగిలిపోయి ఉంటుంది. అలాంటిది ఎంజీఆర్ జీవించి లేకపోయినా ఆయనతో నటించే లక్కీ ఛాన్స్ను నటి అక్షరగౌడ్ అందుకుంది. అదేంటని ఆశ్చర్య పోతున్నారా. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ చేయాలని భావించినా, ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో అది జరగలేదు. అయితే ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రానికి సీక్వెల్ తాజాగా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు పేరుతో తెరరూపం దాల్చుతోంది. ఇది కొంత భాగం యానిమేషన్లోనూ మరి కొంత భాగం నటీనటులు నటించే విధంగానూ రూపొందుతోంది. ఎంజీఆర్, జయలలిత, నాగేశ్ వంటి పాత్రలు యానిమేషన్లోనూ ఇతర పాత్రలు నేరుగానూ ఉంటాయట. ఇందులో ఎంజీఆర్కు ప్రతినాయకిగా అక్షరగౌడ్ను ఎంపిక చేశారు. ఈ అమ్మడు ఇంతకుముందు ఉయిర్తిరు 420, తుపాకీ, ఆరంభం, ఇరుంబు కుదిరై, బోగన్ చిత్రాల్లో గ్లామరస్ విలనీయాన్ని ప్రదర్శించారు. కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రంలో ఎంజీఆర్ ఆఫ్రికా వెళ్లినప్పుడు అక్కడ ఆయనతో ప్రతినాయకిగా అక్షరగౌడ్ ఢీకొంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
ద్వితీయ శ్రేణికీ బ్యూటీ, వెల్నెస్ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇపుడు సౌందర్య పోషణ అనేది ఎగువ తరగతికే కాదు!! మధ్య తరగతికి... ఇంకా చెప్పాలంటే దిగువ మధ్య తరగతికీ విస్తరిస్తోంది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. కాకపోతే ఎక్కడికక్కడ సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు విడి విడిగానే ఉంటున్నాయి. చెయిన్లు నిర్వహించేవన్నీ పెద్ద పెద్ద సంస్థలే!! వారి ఫ్రాంఛైజీ అంటే మాటలు కాదు!. ఇదిగో... సరిగ్గా ఈ అంశమే తమను ‘వసుంధర సెలూన్స్’ ఏర్పాటు చేయటానికి పురి గొల్పిందంటారు నాగేశ్, అరుణ కుమారి. దిగువ మధ్య తరగతి మహిళలనూ సహ యజమానులుగా చేస్తూ ఆరంభించిన తమ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే... ‘‘ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యవస్థీకృతమైన బ్యూటీ, వెల్నెస్ సేవలందించాలన్నదే మా ఉద్దేశం. దీనికోసమే డాజిల్ సెలూన్ అండ్ స్పా ప్రై.లి, వసుంధర బ్యూటీ అండ్ స్పా పేరిట రెండు బ్రాండ్లను మార్కెట్కు పరిచయం చేశాం. వసుంధర బ్రాండ్ పూర్తిగా మహిళల కోసమే. నేను అమెరికాలో పలు కంపెనీల్లో పని చేసి 2007లో ఇండియాకు తిరిగొచ్చా. ఇక్కడ పలు బ్యూటీ అండ్ వెల్నెస్ కంపెనీలకు ఈఆర్పీ వంటి ఐటీ సొల్యూషన్స్ అందించేవాణ్ణి. అప్పుడే సొంతంగా బ్యూటీ సెలూన్ పెట్టాలని నిర్ణయించుకొని 2012లో డాజిల్ సెలూన్స్ను ప్రారంభించాం. మహిళలకు హెయిర్ వాష్, ఫేషియల్, బాడీ మసాజ్ వంటి ఇతరత్రా బ్యూటీ సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బ్యూటీ సేవలు, అది కూడా అందుబాటు ధరలకు అందించడమే వసుంధర లక్ష్యం. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, హైదరాబాద్లలో 8 బ్రాంచీలున్నాయి. వచ్చే మూడేళ్లలో 100 బ్రాంచీలకు చేర్చడం లక్ష్యం. మూడు నెలల్లో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో సెలూన్లను ప్రారంభించనున్నాం. ఆయిల్స్, క్రీములు ఇతరత్రా బ్యూటీ ఉత్పత్తులను ముంబై నుంచి తెస్తాం. శ్రీలంక నుంచి ప్రత్యేకంగా ఆయుర్వేద ఫేషియల్ ఆయిల్స్లను దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ ఉత్పత్తులు వినియోగిస్తున్నప్పటికీ స్థానిక సెలూన్లతో పోలిస్తే మా దాంట్లో ధర 30–40 శాతం తక్కువే ఉంటుంది. హైదరాబాద్లో మహిళలకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికైతే వసుంధరలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ సేవలను విస్తరిస్తాం. వసుంధర సెలూన్ల ఏర్పాటుతో ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. పెట్టుబడుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాతో (బీఓబీ) ఒప్పందం చేసుకున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.30 లక్షల వరకు ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 52 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.1.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. విస్తరణ, బ్రాండింగ్ కోసం రూ.4.5 కోట్ల పెట్టుబడులు అవసరం. 60 శాతం నిధుల కోసం బీఓబీతో చర్చలు జరిపాం. ఏడాదిలో నిధులను సమీకరిస్తాం’’ అని నాగేశ్, అరుణ కుమారి ధీమా వ్యక్తంచేశారు. -
చెయ్యేసే బాస్కు బడితపూజ
ఆడవాళ్లకు మాత్రమే సీటులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆఫీసుకు టైమ్కు వస్తుంది టైమ్కు వెళుతోంది అని అనిపిస్తుంది. కాని ఒకామె భర్తకు ఉద్యోగం పోయింది. ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం పోయినందుకు చిన్నబుచ్చుకుంటూ ఇంట్లో ఉన్నందుకు భార్యకు సాయం చేస్తూ చిన్న పాప ఉంటే ఆ పాపను చూసుకుంటూ ఉన్నాడు. భర్త గురించి ఆమెకు టెన్షన్. కాని తయారయ్యి ఆఫీసులో సీటులో కూర్చుని ఉంటే ఆ టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక ఆమెకు మొగుడు తాగుబోతు. దేవుడి హుండీని కూడా లుంగీలో దాచుకెళ్లి చుక్కేసుకొని వచ్చి పెళ్లాంతో వాదులాటకు దిగుతుంటాడు. చిన్న గుడిసె. లేని బతుకు. జీవితం గడవాలంటే పని చేయాలి. తనొచ్చి ఆఫీసులో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటే ఆమె టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక అమ్మాయికి పెళ్లి కాదు. వీళ్లు యాభై వరకు అనుకొని ఉంటారు. వచ్చినవాడు లక్ష అడుగుతుంటాడు. పైగా ఇరవై తులాల బంగారం పెట్టాలట. బండి ఇవ్వాలట. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలట. ఆ అమ్మాయికి కోపం. అలాగైతే తాళి నేను కడతాను కట్టించుకోమనండి అంటుంది. అలాంటి అమ్మాయి తన సీటులో తాను కూర్చుని ఉంటే ఆ సమస్య కనిపిస్తుందా? ఆఫీసు టైము టెన్ టు ఫైవ్. ఆ టైములో వీరు ముగ్గురు ఆఫీసులో అవైలబుల్గా ఉంటారు. సీట్లలో కూర్చుని ఉంటారు. వీళ్లకు బాస్ తను. అనగా వీళ్లపై సర్వాధికారి తను. వీళ్ల ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... ‘ఆడవాళ్లకు మాత్రమే’ కథ అవుతుంది. ∙∙ గార్మెంట్స్ ఫ్యాక్టరీ అది. అందరూ మహిళా ఉద్యోగులే. ఒంటి మీద బట్టలు కుట్టే వీళ్ల వొంటి మీది పవిట పట్టుకుని లాగాలనుకునే మేనేజర్ నాజర్. కింది ఉద్యోగులు ఏం చేయగలరు? ఏమైనా చేయాలనుకుంటే ఉద్యోగం తీసేయడూ? అదీ అతడి ధైర్యం. నాజర్ది గొప్ప పురుష హృదయం. అతడికి పీఏ, కంప్యూటర్ డిజైనర్, స్వీపర్ అనే తేడా లేదు. అందరూ కావాలి. తను పిలిస్తే అందరూ వస్తారని అభిప్రాయం. ఊర్వశి– అతడి పీఏ. ఆమెను పిలిచి తన కుర్చీ పక్కన నిలబడేలా చేసి వెనుక నుంచి తడిమేసే ప్రయత్నం చేస్తుంటాడు. రోహిణి– ఆ ఆఫీసు స్వీపర్. లోపలికి పిలిచి ‘నువ్వు బాగా చిమ్మాలి’... ‘నువ్వు బాగా పని చేయాలి’... ‘నువ్వు...’ ఈ ‘నువ్వు’ అనేటప్పుడంతా అతడు తన చూపుడు వేలిని ఆమె ఎద మీద గుచ్చుతుంటాడు. ఆమె చీపురు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. రేవతి– కంప్యూటర్ డిజైనర్. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి లంచ్కు పిలుస్తుంటాడు. ‘ఏదో జోక్లో చదివాను. ఇలాగే ఒక మేనేజర్, అతడి అసిస్టెంట్ అమ్మాయి కలిసి భోం చేస్తుంటే ‘నంచుకోవడానికి ఏమైనా ఉందా’ అని మేనేజర్ అడుగుతాడు. ‘నంచుకోవడానికి ఏమీ లేదు కాని ఉంచుకోవడానికి నేనున్నాను’ అని ఆ అమ్మాయి అంటుంది’ అని పెద్దగా నవ్వుతాడు. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చూస్తాడు. దారిన పోయే వెధవ ఒక మాట అనేసి పోతాడు. బస్సులో రాసుకుని వెళ్లే వెధవ బస్సు ఆగగానే దిగి వెళ్లిపోతాడు. ఇది అలా కాదు. ఈ బాస్ రోజూ ఉంటాడు. రోజూ వేధిస్తుంటాడు. తందామంటే తన్నలేరు. మాట విందామంటే వినలేరు. నరకం. ∙∙ ఆఫీసులో ఏదో పొరపాటు జరుగుతుంది. ముగ్గురి మీద పోలీసు కంప్లయింట్ పెడతాను అని బెదిరిస్తాడు నాజర్. అలా వద్దనుకుంటే నాతో మూడు రోజులు గెస్ట్హౌస్లో గడపాలి అని కోరతాడు. ముందు నుయ్యి. వెనుక గొయ్యి. సరే అని ఒప్పుకుని గెస్ట్హౌస్కు వెళతారు ముగ్గురు. కాని ఏమయితే అదవుతుందని అతణ్ణి చావబాది కట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద ఇంజనీరింగ్ చేసి అతణ్ణి దూలానికి వేళ్లాడ గట్టి బాత్రూమ్కు వెళ్లగలిగేలా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి బంధిస్తారు. మమ్మల్ని హింసించినందుకు ఇది నీకు శిక్ష అని చెబుతారు. అంతే కాదు అతడి చేత సంతకం పెట్టించి ఆఫీసు ఇన్చార్జ్షిప్ తీసుకుంటారు. అప్పటి దాకా మగవాడి దృష్టికోణం నుంచి ఆఫీసు నడుస్తుంది. ఇప్పుడు స్త్రీల దృష్టి కోణంలో. ఆఫీసును మంచి ఈస్తటిక్ సెన్స్తో డెకరెట్ చేస్తారు. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగిస్తారు. తల్లులైన ఉద్యోగుల కోసం ఆఫీసులోనే క్రష్ పెడతారు. ఆఫీసు ఎంతో బాగుపడుతుంది. కాని నాజర్ బుద్ధి మాత్రం మారదు. అతడు స్త్రీలను వేధించడానికే ప్రయత్నిస్తుంటాడు. చివరకు హెడ్డాఫీసు వారికి అతడి వ్యవహారం తెలుస్తుంది. అండమాన్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. సినిమా ముగుస్తుంది. ∙∙ పని చేసే ఆడవాళ్లు పని చేయడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత జీవితంలో వారికి ఉండే వొత్తిళ్లు వారికి ఉంటాయి. వారి సంపాదన కుటుంబానికి ముఖ్యం కావచ్చు. అలాగే చేసే పనిలో కూడా వొత్తిళ్లు, సవాళ్లు ఉంటాయి. ఇన్ని ఉండగా వాళ్లు స్త్రీలైన పాపానికి హరాస్మెంట్కు దిగితే ఎంత అవస్థగా ఉంటుంది. కక్కలేక మింగలేక వాళ్లు పడే అవస్థ అవసరమా? ‘నవమాసాలు మోసి కనేది తల్లి. కాని ఇంటి పేరు మాత్రం తండ్రిది’ అనే డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. ‘పేరుకు లేడీస్ స్పెషల్ బస్సు. కాని నడిపేది మాత్రం మగవాడు. అందుకే ఆడవాళ్లను చూసినా ఆపడు’ అనే డైలాగ్ కూడా ఉంది. వేధింపులకు మూలమైన బేస్ వేల ఏళ్ల నుంచి మగాడు సిద్ధం చేసి ఉన్నాడు. కాని ఆడవాళ్లు తమకు తాముగా నిర్ణయాత్మక స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను మార్చుకుంటారు అని ఈ సినిమా చెబుతుంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని ‘సునందా... ఒకసారి కేబిన్లోకి రా’ అని పిలిచే బాసులారా.. జాగ్రత్త. మిమ్మల్ని తలకిందులు చేసే శక్తి వారికి ఉంది. బీ గుడ్. డూ గుడ్. మగళిర్ మట్టుమ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్ నిర్మాతగా 1994లో విడుదలైన సినిమా ‘మగళిర్ మట్టుమ్’. తెలుగులో మురళీమోహన్ డబ్ చేయగా ‘ఆడవాళ్లకు మాత్రమే’గా విడుదలైంది. వర్కింగ్ విమెన్ ఎదుర్కొనే సెక్సువల్ హరాస్మెంట్ మీద పూర్తి కమర్షియల్ ఫార్మెట్లో వచ్చిన తొలి సినిమా ఇదే కావచ్చు. దీనికి మూలం హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘9 టు 5’ (1980). 10 మిలియన్లతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే వంద మిలియన్లు సంపాదించింది. బహుశా అమెరికాలో ఆ సమయంలో పని చేసే ఆడవాళ్లు ఎక్కువ కావడం వర్క్ప్లేస్ హరాస్మెంట్ ఎక్కువ ఉండటం కారణం కావచ్చు. తమిళంలో మంచి విజయమే సాధించిన ఆడవాళ్లకు మాత్రమే తెలుగులో పూర్తిగా సఫలం కాలేదు. దానికి కారణం అప్పటికి నాజర్ ఇంకా పూర్తిగా తెలుగువారికి తెలియకపోవడమే. అయినా ఈ సినిమా సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి, రోహిణి, ఊర్వశి గొప్ప నటనతో ఆకట్టుకుంటారు. డీగ్లామరస్గా కనిపించే రోహిణి అచ్చు ఒక పనిమనిషిలానే ఉంటుంది. ఇందులో ‘శవం’ పాత్ర నగేశ్ పోషించాడు. క్లయిమాక్స్లో కమలహాసన్ కాసేపు కనపడతాడు. హిందీలో ఈ సినిమాను రణధీర్ కపూర్తో తీశారు. కాని ఏ కారణం చేతనో సినిమా విడుదల కాలేదు. అయితే ‘మగళిర్ మట్టుమ్’ కంటే ఏడాది ముందు ‘9 టు 5’ స్ఫూర్తితోనే జంధ్యాల ‘లేడీస్ స్పెషల్’ తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. సింగీతం శ్రీనివాసరావు – కె -
ఆదిలాబాద్ ఎంపీ ఇంట్లో భారీ చోరీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ ఇంట్లో మంగళవారం భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్ హౌజింగ్బోర్డు కాలనీలో ఎంపీ నగేశ్ నివసిస్తున్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరు. ఈ క్రమంలో దుండగులు అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు అల్మారాలోని వస్తువులు చిందర వందరగా పడేసి, రూ.17 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.70 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా, దొంగలు ఎంపీ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సీసీ పుటేజ్ హార్డ్డిస్క్ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు సైతం ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. బుధవారం విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, పోలీసులు క్లూస్టీంతో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇది రెండోసారి..: ఎంపీ నగేశ్ ఇంట్లో 2013లో కూడా చోరీ జరిగింది. నాడు దుండగులు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వాటిని ఇప్పటికీ రికవరీ చేయలేదు. నాడు దొంగతనం జరిగిన నేపథ్యంలోనే ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేయడంతో పాటు హార్డ్డిస్క్ ఎత్తుకెళ్లారు. ఎంపీ ఇంటికి కనీసం సెక్యురిటీ సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీ ఢిల్లీలో ఉండడంతో ఆయన సంబం«ధీకులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తన ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని..
అనంతపురం: కట్టుకున్న భర్తనే హత్య చేయడానికి ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది ఓ ప్రబుద్ధురాలు. గతనెల 30న రాత్రి శ్రీనివాసనగర్లో వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసును త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో శ్రీనివాస నగర్లో పసుపులేటి నగేష్, కోమలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. ఈమె నగరంలోని భాగ్యనగర్కు చెందిన జింకాప్రదీప్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని, ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. గత నెల 30న రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికొస్తున్న నగేష్ను హత్య చేయడానికి స్కెచ్ వేసింది. రైల్వేస్టేషన్కు సమీపంలోని షిరిడినగర్ శ్రీయ ఆస్పత్రి వద్దకు రాగానే ప్రదీప్కుమార్, అతని స్నేహితులు మనోజ్, పల్లం సాయిప్రసాద్లు కత్తులతో దాడి చేశారు. చనిపోయాడని భావించి అక్కడి నుండి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో పాటు బాధితుని భార్య కోమలక్ష్మిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తి, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి
-
తణుకులో కారు బీభత్సం .. వ్యక్తి మృతి
కారు అదుపుతప్పి ఐదు ద్విచ క్రవాహనాలను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయాపడిన ఓ యుకువుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందాడు. పశ్చిమగోదావరి జల్లా తణుకులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద శనివారం సాయంత్రం పెనుమండ్ర మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కుమార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఐదు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆచంటకు చెందిన నెక్కింటి నగేష్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఇప్పటికే ఆర్ఐను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టుకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్ క్రైం : 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్లపై అప్పట్లో ఇంద్రవెల్లిలో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. -
అత్యాచార నిందితులకు రిమాండ్
మెదక్: మోసపూరిత మాటలతో ఇంటి వద్ద దిగబెడతామని నమ్మించి బైక్ పై మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ(30)పై బాలేష్, నగేష్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
వాంకిడి: ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తూ ఇంకుడుగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నగేష్(1) మంగళవారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కనున్న ఇంకుడుగుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే బాలుడు మరణించాడు. -
తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
ముకరంపుర: ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రతిపక్షాలను భయపెట్టి బ్లాక్మెయిల్ పాలన సాగించాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని విమర్శించారు. కేసీఆర్ తమ్మిడిశెట్టి, మేడిగడ్డ బ్యారేజీల ఎత్తు తగ్గిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎత్తు తగ్గిస్తే అంచనాలు తగ్గాల్సి ఉన్నా వేల కోట్ల రూపాయలు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదివరకే మార్చి 8న, తర్వాత ఆగస్టు 23న రెండుసార్లు మహారాష్ట్ర ఒప్పందంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయహోదా కల్పించడంలో నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేణుమాధవ్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మోకెనపల్లి రాజమ్మ, జిల్లా అధ్యక్షురాలు బోగెపద్మ, నాయకుడు బలాల పాల్గొన్నారు. -
రెండో ఏఎన్ఎంలపై వివక్ష తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నగేశ్ చొప్పదండి : రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వానికి వివక్ష తగదని, వారిని రెగ్యులరైజ్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన గురువారం మద్దతుతెలిపి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైందన్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ, వెట్టిచాకిరీ చేయించుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతారన్నారు. -
వ్యక్తి దారుణ హత్య.. కూతురిపై అనుమానం..
జిల్లాలోని వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన త్యాపాల నగేష్(40) శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం మర్మాంగాలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మర్మాంగాల పై బలంగా కొట్టడంతోనే నగేష్ మృతిచెందాడని అనుమానిస్తున్న పోలీసులు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగేష్ పెద్ద కూతురు వివాహేతర సంబంధాలు నడుపుతున్న నేపథ్యంలో గతంలో తండ్రి ఆమెను మందలించాడు. అది మనసులో పెట్టుకున్న యువతి భర్తతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి
కర్నూలు మండలం కోట్ల విజయభాస్కర్రెడ్డి నగర్ వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు... విజయ్భాస్కర్రెడ్డి నగర్ నుంచి రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్పై ఉన్న నగేష్ (25) మృతి చెందగా మరో మగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్స్ వారితో మాట్లాడి ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వరంగల్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు కాలనీ సమీపంలో శనివారం వేకువజామున చోటు చేసుకుంది. మల్లూరు పంచాయతీ కొత్తబెస్తగూడెం గ్రామానికి చెందిన గుమ్మల నగేష్(45), బట్ట వెంకటేశ్వర్లు మల్లూరులో శుక్రవారం రాత్రి జరిగిన జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు.రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిద్దరినీ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వరంగల్కు ఆస్పత్రికి తరలించారు. -
బనగానపల్లిలో టీడీపీ నేత హత్య
బనగానపల్లి: పాతకక్షల నేపధ్యంలో ఓ టీడీపీ నాయకుడు హత్యకు గురైన సంఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. రామకృష్ణాపురానికి చెందిన నగేష్ (37) టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం రామకృష్ణ పిల్లలను స్కూల్ దగ్గరకు దించి వస్తుండగా గుర్తు తెలియన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రామకృష్ణ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీళ్ల ట్యాంకర్ పడి యువకుడి దుర్మరణం
నేరేడుచర్ల: కూలీ పనులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన కురుపోతు నగేష్(21) నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె సమీపంలో కొనసాగుతున్న సాగర్ కాల్వ పనుల్లో పాల్గొంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పనులకు అవసరమైన నీటిని సరఫరా చేసే ట్యాంకర్ ప్రమాదవశాత్తు అతనిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన నగేష్ అక్కడికక్కడే చనిపోయాడు. -
బావిలో పడి వ్యక్తి మృతి
మాల్యాల(కరీంనగర్ జిల్లా): వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ ఒక వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం మద్దుట్లలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నగేష్(35) గల్ఫ్ దేశాల్లో కూలీగా పని చేసేవాడు. కాగా, కొద్ది రోజుల క్రితమే స్వదేశానికి వచ్చాడు. మంగళవారం వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లను కొట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో కాలు జారి బావిలో ఉన్న రాళ్లపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు మరో 15 రోజుల్లో తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి ఉండగా ఈ సంఘటన జరగడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నట్లు సమాచారం. -
ఇంటిని ‘ఎత్తు’తున్నారు..
చండ్రుగొండ (ఖమ్మం జిల్లా): పూర్వీకులు కట్టిన ఇల్లా.. భూమిలోకి కుంగిపోయిందా.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తుదా.. అయితే ఫర్వాలేదు.. ఇంటిని పైకి ఎత్తుతామంటున్నారు హర్యానాకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో వేముల నగేష్ అనే వ్యాపారి తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి ముందు వైపు రోడ్డు పెరగడంతో.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తోంది. ఈ క్రమంలో నెట్లో డోంట్ వర్రీ, అప్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ బిల్డింగ్స్ అనే ప్రకటనను చూశాడు. వెంటనే ఫోన్లో హర్యానా రాష్ట్రంలోని యమున నగర్కు చెందిన బీఎల్ఆర్ ఇంజినీరింగ్ గ్రూప్, మామ్చంద్ అండ్ సన్స్ వారిని సంప్రదించాడు. అంతే వారు వచ్చి ఇల్లు చూసుకున్నారు. మూడు అడుగుల ఎత్తు పైకి ఎత్తేందుకు రూ. 3 లక్షలు మొత్తాన్ని ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం పనులు ప్రారంభించారు. శుక్రవారం ఇంటిని పైకి ఎత్తే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 200 జాకీలు.. ఇంటి చుట్టూ, మధ్య భాగంలోని గోడలన్నింటికీ సుమారు 200 జాకీలు అమర్చారు. మేనేజర్ గురుమాన్సింగ్ పర్యవేక్షణలో పది మంది జాకీలను ఒకదాని తరువాత మరో దాన్ని ఎత్తుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే నాలుగు గదుల ఇల్లు ఆరంగుళాలు పైకి లేచింది. 25 నుంచి 40 రోజుల్లో ఇల్లంతా మూడడుగులు ఎత్తు ఎత్తే విధంగా వారు ప్రణాళిక చేసుకున్నారు. ఖాళీ అవుతున్న ప్రదేశంలో కాంక్రీట్ నింపి ఇంటి కింది భాగంలోని బేస్మెంట్ను బలోపేతం చేస్తామని గురుమాన్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. రెండురోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియను జనం తండోపతండాలుగా గ్రామానికి వచ్చి వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని నగేష్ మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా.. అమ్మానాన్నలు కట్టిన ఇల్లు కూల్చకూడదనే భావనతోనే ఈ ప్రక్రియ ఎంచుకున్నట్లు చెప్పారు. -
షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధం
షాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు షార్ట్సర్క్యూట్తో కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సీతారాంపూర్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయ ంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిత సోదరులకు రాఖీలు కట్టేందుకు ఆదివారం కుటుంబ సమేతంగా మారుతీ 800 కారులో షాద్నగర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో షాబాద్ మండలం సీతారంపూర్ సమీపంలో కారు ఇంజిన్లోంచి పొగలు వచ్చాయి. గమనించిన దంపతులు వెంటనే తమ పిల్లలతో కలిసి కిందికి దిగారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. ఎస్ఐ చంద్రకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోలీవుడ్కు మరో వారసుడు
ప్రస్తుతం కోలీవుడ్ను ఏలుతున్న వారిలో వారసులే అధికం. సూపర్ స్టార్ రజనీకాంత్కు వారసులుగా ఆయన ఇద్దరు కూతుళ్లు (ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ అశ్విన్) దర్శకత్వంలో రాణిస్తున్నారు. పద్మభూషణ్ వారసురాలు శ్రుతిహాసన్, క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక నటుడు శివకుమార్ వారసులు సూర్య, కార్తీ సూపర్ హీరోలుగా ప్రకాశిస్తున్నారు. శరత్కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు తనయుడు, దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు విక్రమ్ ప్రభు యువ హీరోగా దూసుకుపోతున్నారు. అలాగే మురళి కొడుకు అధర్వ, కార్తీక్ వారసుడు గౌతమ్ కార్తీక్, భాగ్యరాజ్ కొడుకు శాంతను, పాండియరాజన్ కొడుకు పృథ్వి తండ్రుల పేరు కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా దివంగత హాస్య శిఖామణి నాగేష్ మనవడు, ఆనంద్బాబు తనయుడు గజేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి కల్కండు అనే టైటిల్ను నిర్ణయించారు.యారడా మహేశ్ చిత్రం ఫేమ్ డింపుల్ శోబాడే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ మ్యూజిక్ను రీక్రియేట్ చేసే నటుడు తన చిత్రంలో హీరోగా నటించాలని భావించనున్నారు. గతంలో తన చిత్రాల్లో దివంగత నటుడు నాగేష్ నటించారని గుర్తు చేశారు. ఆయన మనవడు కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలియడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరికీ కథ వినిపించి గజేష్ను ఎలా ప్రజెంట్ చేయనున్నది వివరించానన్నారు. చిత్రకథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఆగస్టు చివరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
నేను కరెక్ట్... కాదు నేనే !
- పోలీసుస్టేషన్ చేరిన భార్యాభర్తల గొడవ చౌడేపల్లె: మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి తనతో తాళి కట్టించుకుని మోసం చేసిందని భర్త.. తాను అన్ని విషయా లు పెళ్లికి ముందే చెప్పానని, ఇప్పుడు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భార్య ఇద్దరూ సోమవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోమల మండలం కామిరెడ్డిపల్లెకు చెందిన ఉత్తన్న కుమార్తె రేఖాప్రసన్న అలియాస్ శిరీష తిరుపతిలో చదువుకున్నారు. అదే మండలం పేటూరుకు చెందిన వెంకటరమణకుమారుడు నగేష్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో మొబైల్కు వచ్చిన మిస్డ్ కాల్ ద్వారా ఇరువురూ స్నేహితులయ్యారు. వారిస్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఇద్దరూ హైదరాబాదులో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. చౌడేపల్లె మండలంలోని లద్దిగం గ్రామానికి చెందిన నగేష్ బంధువులు వీరిని చూసేందుకు హైదరాబాద్కు వచ్చారు. అక్కడ ఉన్న నగేష్ భార్య రేఖా ప్రసన్న అలియాస్ శిరీషాను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు రమేష్ ఇదివరకే శిరీషను వివాహం చేసుకున్నాడన్న విషయాన్ని నగేష్కు బంధువులు తెలిపారు. దీంతో అతను గ్రామానికి వెళ్లి విచారించానని, రమేష్తో వివాహం జరిగిన విషయం నిజమని తేలిందని నగేష్ ఆరోపిస్తున్నాడు. మొదటి వివాహ విషయం దాచి పెట్టి తనను మోసం చేసిం దని గ్రామపెద్దల సహకారంతో నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని నగేష్ కు చెప్పానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనే దాచి పెట్టాడని, ఇప్పుడు అందిరికీ తెలిసాక తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని రేఖాప్రసన్నఅలియాస్ శిరీష వాపోయారు. భర్త నగేష్ తనకు కావాలని శిరీష పట్టుబడుతున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
తాడిపత్రి/ పెద్దవడుగూరు, న్యూస్లైన్ : పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరించి అందరికీ పంపించడమే కాకుండా ఇంటర్నెట్లోనూ పెట్టారు. పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారంఅమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు... ఓ వివాహిత వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు యువకులు ఆమెపై దాడిచేశారు. చెట్లపొదల్లోకి బలవంతంగా తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటనను ఒకరు తన సెల్ఫోన్లో వీడియో తీసుకున్నాడు. ‘బయటకు చెబితే నీ పరువు పోతుంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతాం’’ అని బెదిరించి వదిలేశారు. కొద్దిరోజు తర్వాత సెల్ఫోన్లో తీసిన యువకుడు మరొకరికి ఆ వీడియోను పంపాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరి సెల్ఫోన్లోకి పంపించుకున్నారు. ఆఖరికి ఇంటర్నెట్లోనూ ఈ దృశ్యాన్ని పెట్టారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని భయపడి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తనే కుమిలిపోయింది. సెల్ఫోన్లో వీడియోను చూసిన వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో ఆమె భర్త సోమవారం పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై అత్యాచారం చేసిన నిందితులు నాగేష్, నాగరాజు, బాలుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. వీడియో ఆధారంగా గుర్తించిన నిందితులలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పారు. -
జంప్ జిలానీలకు కలిసొచ్చేనా?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కప్పదాట్ల నేతలకు కలిసొస్తుందా? కండువాలు మార్చి పోటీ చేస్తున్న నేతలను ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల నగారా మోగే వరకు ఆయా పార్టీల్లో ఉండి.. ఎన్నికల్లో అతికొద్ది రోజుల ముందు పార్టీలు మార్చిన అభ్యర్థులు విజయతీరం చేరుకుంటారా? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు పార్టీలు మార్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి పరిస్థితిని పరిశీలిస్తే.. నగేశ్ది తుది వరకు చంద్రబాబు జపం నగేశ్ ఇన్నాళ్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొంటే ఆయన మాత్రం చంద్రబాబు జపమే చేశాడు. సకల జనుల సమ్మెతో అందరూ ఏకమై నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే.. ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇకపై ఆ పార్టీలో ఉంటే అ సలుకే ఎసరొస్తుందని భావించి.. రెండు నెలల క్రితం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ మాటెత్తని ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పునర్నిర్మాణం తమతోనే సాధ్యమంటున్నారు. తెలంగాణవాదుల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయనకు ప్రత్యార్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చివరి క్షణంలో పార్టీ మారిన నగేష్ను నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కారు దిగి.. కాంగ్రెస్లోకి కాకా కుమారులు.. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి జి.వివేక్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. నగేష్ చంద్రబాబు జపం చేస్తే.. వివేక్ కేసీఆర్కు వంతపాడారు. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్తోనే సాధ్యమని కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా ఆయన గులాబీ గూటిలోనే ఉన్నారు. తీరా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత చివరి క్షణంలో టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వెంటనే ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఖరారైంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్లో ఈ నాయకుడు ఇప్పుడు తన ప్రత్యర్థిగా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిని విమర్శించాల్సి వస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న వివేక్ ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. కాకా మరో కుమారుడిది ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా చివరివరకు కొనసాగారు. వివేక్తోపాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఓదేలు నుంచి చెన్నూరులో పోటీని ఎదుర్కొంటున్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన చెన్నూరును అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు కప్పదాట్ల నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా బరిలో ఉన్నారు. ఆదిలాబాద్, ముథోల్ బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న పాయల్ శంకర్, రమాదేవిలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబుు వెంటే చివరి వరకు ఉన్నారు. టీడీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావించి కాషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణపై చంద్రబాబు తీరును నిరసిస్తూ వీరు పార్టీని వీడినా ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తుండటంతో తిరిగి టీడీపీ కండువాను కూడా వేసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తోంది. చంద్రబాబును విమర్శించి, పార్టీ మారిన ఈ నేతలు అదే పార్టీ మద్దతుతో బరిలో ఉన్న వీరిపై నియోజకవర్గ ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన దివాకర్రావు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. టీఆర్ఎస్లో ఉన్న సి ట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్రెడ్డి కాంగ్రెస్ గూటి కి చేరుకోవడంతో, దివాకర్రావు టీఆర్ఎస్లోకి వెళ్లారు. ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు కండువాలు మార్చుకుని తలపడుతుండగా, విజయం ఎవరిని వరిస్తుందో ఫలితాలు తేల్చనున్నాయి. ఎన్నికల వరకు తటస్థంగా ఉంటూ.. టిక్కెట్ల గోల ప్రారంభం కాగానే కాంగ్రెస్లో చేరిన ఐకేరెడ్డి చివరకు కాంగ్రెస్ కండువా కోసం పోరాడి విఫలం అయ్యారు. అనంతరం బీ ఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రధా న అనుచరుడు కోనప్ప కూడా బీఎస్పీ నుం చి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్న వీరిని స్థానిక ప్రజలు ఆదరిస్తారో చూడాల్సిందే. కాంగ్రెస్ను వీడి ఎన్నికల వేళ టీడీపీలో చేరిన సోయం బాపురావుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. -
గులాబీ దళంలో మార్పులు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరికి స్థానచలనం కలగవచ్చు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో మంచిర్యాల మినహా, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్ శుక్రవారం అభ్యర్థులను ప్రకటించారు. బోథ్ (ఎస్టీ) ఎమ్మెల్యే అభ్యర్థిగా గోడం నగేష్ పేరును ఖరారు చేశారు. కానీ ఆయన ఎంపీగా బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బోథ్ నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన ఎంపీగానే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ విషయంలో తాను నిర్ణయం తీసుకోలేదని నగేష్ ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. నామినేషన్ మాత్రం ఈనెల 9న వేస్తానన్నారు. నగేష్ ఎంపీగా బరిలోకి దిగితే.. ఖాళీ కానున్న బోథ్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి పేరును పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు రాథోడ్ బాపురావు నామినేషన్ వేశారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రాములు నాయక్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. సిర్పూర్ స్థానానికి కావేటి సమ్మయ్య అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన పేరు ఖరారైంది. అయితే ఇక్కడ ఆ పార్టీ మహిళా నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్రావుతో నామినేషన్ వేయించారు. సిర్పూర్ అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని ఆమె టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో ఒకరైన హరీష్రావును శనివారం కలిసి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిర్పూర్ టిక్కెట్ను తన కుమారునికి కేటాయించాలని కోరినట్లు సమాచారం. బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య పేరును అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా వినోద్ కొనసాగారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో చిన్నయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అయితే దుర్గం చిన్నయ్యపై ఆయన వ్యతిరేక వర్గీయులు టీఆర్ఎస్ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చిన్నయ్యపై గతంలో నమోదైన ఓ కేసును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అధినేత అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఆదివారం రాత్రి వరకు బీ-ఫారాలు మాత్రం ఇవ్వలేదు. మంచిర్యాలపై వీడని ఉత్కంఠ మంచిర్యాల నుంచి బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడటం లేదు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధినేత కేసీఆర్ మంచిర్యాల అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. దీంతో అనేక ఊహాగానాలు తెరలేచినట్లయింది. ఈ టిక్కెట్పై నడిపెల్లి దివాకర్రావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. కానీ మొదటి జాబితాలో ఆయన పేరును ప్రకటించక పోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. -
చంద్రబాబుకు టీ. టీడీపీ ఎమ్మెల్యేల ఝలక్
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీని వీడేందుకు టీ.టీడీపీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టమైన వైఖరి తెలపకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన పలువరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమైయ్యారు. ఎమ్మెల్యేలు నగేశ్, సత్యవతి రాథోడ్ లు టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర రావు టీ.టీడీపీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో చంద్రబాబుకు అందజేశారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఎర్రబెల్లి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్నరాజకీయ పరిణామాలను చూస్తే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో ఎర్రబెల్లి తన రాజకీయ భవితవ్యంపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విఫలయత్నం చేశారని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తమ పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారని, ఈ పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ లో చేరేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్ బై, టీఆర్ఎస్ లో రేపు చేరిక
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో రాజీనామా పర్వం కొనసాగుతునే ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సత్యవతి రాధోడ్, నగేశ్ లు రాజీనామాలు సమర్పించి సోమవారం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. సత్యవతి రాథోడ్, నగేశ్ లే కాకుండా మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యవతి రాథోడ్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మరో ఎమ్మెల్యే నగేశ్ కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, రేపు మధ్నాహ్నం 3 గంటలకు పార్టీ ప్రధానకార్యాలయం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలా? లేదా పార్టీని విలీనం చేయాలా అనే అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారని పార్టీకి చెందిన నేతలు వెల్లడించారు. -
పొత్తుల ఎత్తుగడ
జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్ను కాపాడుకోవడానికి నేతలు పొత్తుల ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన లాబీయింగ్తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ‘దేశం’ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ పార్టీని వీడగా, పలు నియోజకవర్గాల ఇన్చార్జీలు కూడా త్వరలోనే గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడుతున్న ఈ నేతలతో కలిసి కేడర్ కూడా వెళ్లకుండనిలుపుకునేందుకు టీడీపీ నేతలు పొత్తును ఎత్తుగడగా వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర పడటంలో బీజేపీ తనదైన పాత్రను పోషించింది. ఈ క్రెడిట్ ఉన్న బీజేపీతో పొత్తు ఉంటుందని చెబితే కొందరైనా నాయకులు, మొదటి పేజీ తరువాయికార్యకర్తలను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే ‘దేశం’ నేతలు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. బీజేపీ నాయకులు మాత్రం పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసలను నివారించడానికి.. కార్యకర్తలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు పొత్తు అంశాన్ని వాడుకుంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దమ్ముంటే చంద్రబాబుతో పొత్తు విషయమై ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్ను కాపాడుకోవడానికి నేతలు పొత్తుల ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన లాబీయింగ్తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీని వీడిన నగేష్ వెంట కేడర్ వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించి కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. సోమవారం బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఇచ్చోడలో నిర్వహించారు. బీజేపీతో పొత్తు తప్పకుండా ఉంటుందని, కార్యకర్తలు అధైర్య పడవద్దని ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. కానీ ఈ సమావేశానికి ఒక్క ఇచ్చోడ మండల పార్టీ అధ్యక్షుడు మినహా మిగిలిన ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు హజరుకాలేదు. కాగా పార్టీని వీడిన నగేష్ కూడా గురువారం ఇచ్చోడలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాథోడ్ రమేష్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతల్లో సగం మందికి పైగా గురువారం నగేష్ నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం గమనార్హం.. -
మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!
నాకు చిన్నప్పటి నుండి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాటల్లో నేను ఎక్కువగా విన్న పాట శ్రీకారం (1996)లో ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’. మానవీయ కోణంలో, బతుకుపట్ల భరోసా ఇచ్చి, ఆశావాదం నింపే పాటలను రాయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి పాటలను చూసే నేను ఆయనను గురువుగా భావిస్తాను. యువతరానికి ఒక సందేశాన్ని, సందేశంలా కాకుండా ఎలా చెబితే యువతరం వెంటనే స్పందిస్తుందో మనసుకు తాకే సరళమైన పదాలతో రాయడం ఆయన శైలి. ఈ మధ్య యువతరంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వల్ల ప్రతి చిన్న విషయానికి నీరసించి నీరుగారడం కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల వలనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ అత్యాచారానికి గురై, మానసిక వేదనకు లోనవుతుంది. ‘ఇక నాకు చావే శరణ్యం’ అనుకొని ఆత్మహత్య చేసుకోబోయే తరుణంలో హీరో ఆమెను ఓదారుస్తూ, ధైర్యం నింపి బతుకుమీద ఆశ కలిగేటట్లు చేస్తాడు. ఆ సందర్భంలో వచ్చిన పాటే ఇది. మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు/ కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు/ ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది/ వేటాడు వేళతో పోరాడమన్నది... అనే పల్లవిలో మొదటి వాక్యమే అద్భుతమైన స్టేట్ మెంట్. మనసుకు బాధగా ఉందని, ఇక మరణం ఒకటే దారి అనుకొని వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ పాట వినాలి. నీ కన్నీళ్లను తుడిచేవారు ఏ ఒక్కరూ లేరని చితిమంటలకు స్వాగతం పలకకూడదు. నిండుగా నూరేళ్లు సంతోషంగా జీవించాలి. జీవించినంత కాలం ఎటువంటి సమస్యలు వచ్చినా, కాలానికి ఎదురెళ్లి పోరాడి కాలాతీతవ్యక్తులుగా నిలిచిపోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది. కలసి రాని కాలమెంత కాటేస్తున్నా చలి చిదిమేస్తున్నా/ కూలిపోదు వేరు ఉన్న తరువేదైనా తనువే మోడైనా/ మాను జన్మకన్న మనిషి ఎంత మిన్న/ ఊపిరిని పోసే ఆడదానివమ్మా/ బేలవై నువ్వు కూలితే నేలపై ప్రాణముండదమ్మా... అనే మొదటి చరణంలో ఆరారు కాలాలు రకరకాలు ఋతువులు మారుతున్నా, చచ్చేంత చలి చిదిమేస్తున్నా మోడైన చెట్టు తనకు తాను కూలిపోదు. ఆ చెట్టు కంటే గొప్ప బతుకు మనిషిదే కదా! ఈ లోకమనే మహావృక్షానికి తల్లి వేరువు నువ్వు... నువ్వే కూలిపోతే భూమ్మీద ప్రాణి అనేదే ఉండదు. జీవరాశికి పుట్టుకకు కారణమైన ఆడదానివి నువ్వు... నువ్వే చావును ఆశ్రయిస్తే అది ఎంతవరకు సమంజసం. ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు పరిమార్చవే కీడు/ కాళివైతే కాలి కింద అణుగును చూడు నిను అణిచేవాడు/ మృత్యువును మించే హాని ఎక్కడుంది/ ఎంత గాయమైనా మాని తీరుతుంది/ అందుకే పద ముందుకే లోకమే రాదా నీ వెనకే... అనే రెండవ చరణంలో నీ ఆయుష్షునీ చావులా కాకుండా ఆయుధంగా మార్చుకుంటే ఏ కీడు దరిజేరదు. నువు కాళికవై పోరాడితే నిను అణిచేవాడు ఎప్పటికీ నీ కాలి కిందే ఉంటాడు. సృష్టిలో మనిషికి హానికారమైనది మరణమొక్కటే దాని ముందు ఎంతగాయమైనా చిన్నదే కదా! ఏదో ఒకరోజు మానుతుంది కదా అందుకే ఎటువంటి ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తే అది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. నిన్ను చూసి ఈ లోకం గర్విస్తుంది. జీవితంలో ఓడిపోయానని, సమస్యలు చుట్టుముట్టాయని ఆత్మహత్యకు పాల్పడేవారికి ఈ పాట ఒక మేలుకొలుపు. ఈ పాట వింటే ఆత్మహత్యలు ఆగిపోతాయని నా నమ్మకం. ఈ పాటకు ఇళయరాజా బాణీ, జేసుదాస్ స్వరం మరింత బలం చేకూర్చాయనడంలో అతిశయోక్తి లేదు. - సంభాషణ: నాగేశ్ -
టీడీపీకి గణేశ్రెడ్డి గుడ్బై
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : టీడీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోక గణేశ్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు, జిల్లా అధ్యక్షుడు నగేశ్కు పంపారు. ఆ పత్రులను మీడియూ వారికి విడుదల చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బాబు తీరును నిరసిస్తూనే పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ద్రోహులుగా మిగలకుండా పార్టీని వీడాలని హితవు పలికారు. కాగా 1995లో టీడీపీలో చేరిన గోక గణేశ్రెడ్డి తలమడుగు మండల అధ్యక్షుడిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా, టెలికాం అడ్వైజరీ సభ్యుడిగా, రెండుసార్లు రైల్వే అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, 1996,1998,2004,2009 ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించారు. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: తుమ్మెదా... ఓ తుమ్మెదా... ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ॥ అతడు: మగడులేని వేళ తుమ్మెదా వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా ఆ: మాట వరసకంటూ తుమ్మెదా పచ్చి మోటసరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెదా ॥ చరణం : 1 ఆ: ఎదురుపడితే కదలనీక దడికడతాడే పొదచాటుకు పద పదమని సొదపెడతాడే ॥ అ: ఒప్పనంటే వదలడమ్మా ముప్పు తప్పదంటే బెదరడమ్మా ॥ చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం పట్టు విడుపులేనిదమ్మా కృష్ణుని పంతం ॥॥ చరణం : 2 ఆ: తానమాడువేళ తాను దిగబడతాడే మాను మాటు చేసి చూడ ఎగబడతాడే ॥ అ: చెప్పుకుంటే సిగ్గుచేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు ॥ ఆ: ఆదమరచి ఉన్నావా కోకలు మాయం ఆనక ఏమనుకున్నా రాదే సాయం ॥॥ చిత్రం : శ్రీనివాస కళ్యాణం (1987) రచన : సిరివెన్నెల సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలు, పి,సుశీల నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఏదో మనసు పడ్డానుగానీ కల్లో కలుసుకున్నాను గానీ నీపై ప్రేమా ఏమో నాలో ఏదో మనసు పడ్డానుగానీ ఎంతో అలుసు అయ్యాను గానీ నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకొనలేవా... తలపునపడు తనువు ముడి మనువై మమతై మనదైపోయె అనురాగాలు కలనే ॥మనసు॥ చరణం : 1 అతడు: ఒక హృదయం పలికినది జతకోరే జతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి... ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి... ఆ: తె లుసా తేటిమనసా పూలవయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో అ: ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి మెడ ఉరి గడుసరి సరిసరిలే ॥మనసు॥ చరణం : 2 అ: ఒక మురిపెం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అధరం వణికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి ఆ: బహుశా బావ సరసాలన్నీ విర సాలాయెనేమో ఇక సాగించు జతసాగించు మనసే ఉన్నదేమో అ: ఓ పాపా నిందిస్తే నా పాపం నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే ॥మనసు॥ చిత్రం : అమ్మదొంగా (1995) రచన : వేటూరి సంగీతం : కోటి గానం : మనో, కె.ఎస్.చిత్ర, శైలజ నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : Ooh baby just give me love Ooh baby I want it now ‘‘Ooh baby‘‘ అందమైన భామలు లేత మెరుపు తీగలు (2) ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యోరామ ఈ భామ భలె ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే ॥ ॥‘‘Ooh baby‘‘ చరణం : 1 నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్నా నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసేయ్నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా ॥‘‘Ooh baby‘‘ చరణం : 2 కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకి వేసెయ్నా గాలాన్ని నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారీ ॥॥ చిత్రం : మన్మథుడు (2002) రచన : భువనచంద్ర సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్ నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఓహో ఓహో... ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా (2) మావారి అందాలు నీవైన తెలుపుమా (2) ॥ఓహో॥ చరణం : 1 మనసు మధురమైనది మమతలు నిండినది సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది ॥ అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా? (2) కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ ॥ఓహో॥ చరణం : 2 వలపుకన్న తీయని పలుకులు వారివి తలచుకున్న చాలును పులకరించు నా మేను ॥ మగసిరి దొరయని మరునికి సరియని (2) అందరు అందురే అంత అందమైనవారా ఓహో ఓహో॥ చరణం: 3 అందరి కన్నులు అయ్యగారి మీదనే దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు ॥ అన్నది నిజమేనా అల్లిన కథలేనా (2) కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా ఓహో ఓహో॥ చిత్రం: వుంచివునసులు (1962) రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె.వి.వుహదేవన్, గానం: ఎస్.జానకి నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి... (2) నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి... చరణం : 1 కళకళలాడే నీ కళ్లు దేవుడి ఇళ్లమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా ॥ నీ కోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి ॥ చరణం : 2 ఆటలలో చదువులలో మేటిగ రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి ॥ చీకటి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారుకలలే నిజమై నిలవాలి ॥ చరణం : 3 నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాథుడు కావాలి (2) నీ సంసారం పూలనావలా సాగిపోవాలి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి నిన్నే తలచి నే పొంగిపోవాలి ॥ చిత్రం: బంగారు కలలు (1974), రచన: దాశరథి సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, గానం: పి.సుశీల నిర్వహణ: నాగేశ్ -
హిందూ ‘నగేష్’కు ముందస్తు బెయిల్
విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్కు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని నగేష్ను ఆదేశించింది. అంతేకాక నాలుగు వారాల పాటు ప్రతి శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే పోలీసు దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో మత గురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్రెడ్డి ఈ నెల 12వ తేదీన కలిసిన అంశాన్ని ప్రచురించినందుకు నమోదు చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందుస్తు బెయిల్ను మంజూరు చేయాలంటూ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పోలీసుల చర్య ఏకపక్షంగా ఉందని ఆయన తెలిపారు. విధుల్లో భాగంగానే డీజీపీ వార్తను ప్రచురించామని, మరుసటి రోజు డీజీపీ పంపిన వివరణను సైతం ప్రముఖంగా ప్రచురించడం జరిగిందని, ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నగేష్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. -
గీత స్మరణం: మావేలే మావేలే
పల్లవి : ఆమె: మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మళ్లీ రాదు బృందం: వారెవ్వా బాబయ్య ॥ మావేలే॥ చరణం : 1 ఆ: పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు బృం: చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ ఆ: చిలకే ఎగిరొస్తే విదిలించుకోవద్దు బృం: రావొద్దూ రావొద్దూ మళ్లీ మళ్లీ రావొద్దు ఆ: పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు పడుచుకి పూవందం మరిచిపోవద్దు లక్షలు అడిగేనా లగ్నం నేనడిగేను ముహూర్తం పెట్టించు రేపో మాపో ॥ మావేలే॥ చరణం : 2 ఆ: పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు బృం: పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ ఆ: కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ బృం: పాడొద్దు పాడొద్దు హద్దుమీరి పాడొద్దు చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే దొరకీ దొరకనట్టు జారుకోవద్దూ పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు అనుభవించాలి నేడే నేడే ॥ మావేలే॥ గానం : మిన్మిని, బృందం పల్లవి : చికు బుకు చికు బుకు రైలే అదిరెను దీని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే ॥ చికు॥ దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష ॥ చికు॥ చరణం : 1అహ... సైకిలెక్కి మేం వస్తుంటే మీరు మోటర్ బైకులే చూస్తారు అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే మీరు మారుతీలు వెతికేరు అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే మీరు పంచలొంక చూస్తారు మీకు ఏవి కావాలో మారు అర్థం కాలేదే పూలబాణాలేశామే పిచ్చివాళ్లయి పోయామే ॥ చికు॥ చరణం : 2 మాకు ఆటపాటలో అలుపొచ్చే మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే మా మతులు చెదిరి తల నెరుపొచ్చే రాదులే వయసు మళ్లీ మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు రేపిచ్చుకోవాలి కట్నాలు అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు మీరు ఇపుడే లవ్చేస్తే మూడుముళ్లు పడనిస్తే కన్నవాళ్లకు అది మేలు చిన్నవాళ్లకు హ్యాపీలు ॥ చికు॥ చిత్రం : జెంటిల్మేన్ (1993), రచన : రాజశ్రీ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, గానం : సురేష్ పీటర్ - నిర్వహణ: నాగేష్