ncc
-
ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ఏర్పాటుకు చర్యలు
గుంటూరు (ఎడ్యుకేషన్): ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.మధుసూదన్రెడ్డి చెప్పారు. ఎన్సీసీ గ్రూప్ వార్షిక తనిఖీల కోసం ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా శ్యామలానగర్లోని ఎన్సీసీ కార్యాలయంలో మధుసూదన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఎన్సీసీ గ్రూప్లు ఉన్నాయని, వీటిలో గుంటూరు ఎన్సీసీ గ్రూప్ అతి పెద్దదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా విద్యాసంస్థలు ఎన్సీసీ శిక్షణ గుర్తింపును కలిగి ఉండగా, మరో 1,600 విద్యాసంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఎన్సీసీ శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత, గౌరవం పెరుగుతాయని, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎన్సీసీ గ్రూప్లను విస్తరించి, మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్సీసీ గ్రూప్ కలిగి ఉన్నట్లు కేవలం బోర్డులకే పరిమితమై, విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇవ్వని విద్యాసంస్థలకు ఎన్సీసీ గుర్తింపు రద్దు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కడప జిల్లాలోని ఎన్సీసీ గ్రూప్ అకాడమీ స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు. విశాఖలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మధుసూదన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలన చేశామని, త్వరలోనే గవర్నర్తోపాటు జూన్ 4వ తేదీ తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో సీఎం, సీఎస్లను కలిసి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎన్సీసీ ప్లానింగ్ అండ్ కో–ఆర్డినేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ సంజయ్గుప్తా, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
సీఎం జగన్ను కలిసిన NCC డిప్యూటీ డైరెక్టర్ జనరల్
సాక్షి, గుంటూరు: ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. ఏపీలో ఎన్సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అదనంగా 60 వేల మంది ఎన్సీసీ క్యాడెట్లను రిక్రూట్ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్లు అందుబాటులో ఉంటారని సీఎం జగన్కు డీడీజీ వీఎంరెడ్డి వివరించారు. ఏపీ విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. ఎన్సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్ క్యాడెట్ల శిక్షణ కోసం అవసరమైన సహాయం చేసేందుకు సిద్దమని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఎన్సీసీ డీడీజీగా ఎయిర్ కమాండర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా ఎయిర్ కమాండర్ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు. ఆయన శుక్రవారం సికింద్రాబాద్లోని ఎన్సీసీ డైరెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వి.ఎం.రెడ్డి 1989లో భారత వైమానిక దళంలో చేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 35 ఏళ్లుగా పలు హోదాల్లో సేవలందిస్తున్నారు. ఎల్రక్టానిక్ వార్ ఫేర్ రేంజ్, ఫ్రంట్లైన్ ఫైటర్ బేస్లో పైలట్ రహిత విమాన స్క్వాడ్రన్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. న్యూఢిల్లీలోని ఏరోస్పేస్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ఆయన శిక్షకుడిగా పనిచేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ప్రతిష్టాత్మక హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీసీ)లో జాతీయ భద్రత, వ్యూహ సంబంధిత కోర్సును కూడా పూర్తి చేశారు. యుద్ధవిమాన పైలట్లకు శిక్షకుడిగా 2 వేల గంటలకు పైగా ఆయన గగనతలంలో పనిచేశారు. -
AP: టీచర్లకు గుడ్న్యూస్.. బదిలీలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రీసూ్కల్, హైసూ్కల్, హైసూ్కల్ ప్లస్ స్థాయిలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యా యుల పోస్టులను బదిలీలతో భర్తీ చేసేందుకు అనువుగా సోమవారం జీవో నంబర్ 47 జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 మే 31 లేదా అంతకుముందే ఉద్యోగ విరమణ చేసేవారికి వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టనుంది. వీరుకాకుండా 2022–23 విద్యా సంవత్సరం నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్మెంట్ సరీ్వస్లో కొనసాగుతున్నారో.. ఆ విభాగంలోనే బదిలీ అవుతారు. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లు ఆ పోస్టులు ఉన్న చోటకే.. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా పోస్టులు ఉన్న పాఠశాలలకే బదిలీ చేస్తారు. లేదంటే అక్కడే కొనసాగుతారు. వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని, వారు ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలల్లో చేరిన తేదీ నుంచి సర్వీస్ను లెక్కించి అవకాశం ఉన్నవారికి బదిలీ చేసే అవకాశం కల్పించారు. 40 శాతం దృష్టి లోపం ఉన్న వారు, 75 శాతం శారీరక వైకల్యం ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. వారు బదిలీ కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పేరెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్లాలనుకునేవారు వాటిలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి వారి మాతృ సంస్థ లోని సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపల్ స్కూళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు పురపాలక శాఖ అ«దీనంలోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక మార్గదర్శకాలను విద్యాశాఖ జారీ చేస్తుంది. మొత్తం బదిలీ ప్రక్రియలో పాత స్టేషన్ పాయింట్ల ఆధారంగానే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రస్తుత స్టేషన్ పాయింట్లు పరిగణనలోకి తీసుకోరని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐటీడీఏ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్–ఐటీడీఏ ఉపాధ్యాయులు ఐటీడీయేతర పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, వారికి బదిలీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. పాత జిల్లాలనే యూనిట్గా పరిగణిస్తారు. స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, జాబితా ఖరారు, ఖాళీల నోటిఫికేషన్ తర్వాతే బదిలీ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లు - ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లను కేటాయించారు. కేటగిరీ 4 ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఏడాది సరీ్వస్కు 5 పాయింట్ల చొప్పున, కేటగిరీ 1, 2, 3లో పనిచేసిన వారికి ఏడాదికి 1, 2, 3 పాయింట్ల చొప్పున కేటాయించారు. - ప్రత్యేక కాంపిటెంట్ అథారిటీల ద్వారా ఉ పాధ్యాయుల సీనియారిటీ, వెబ్ ఆప్షన్స్ ఆ ధారంగా బదిలీ ప్రక్రియ ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు కూడా ఆ స్థాయిలోనే జారీ చేస్తారు. - ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు జోనల్ స్థాయిలో (విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్ జిల్లా) జాయింట్ కలెక్టర్ చైర్మన్గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగాను, ఆయా జిల్లాల డీఈవోలు సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - జిల్లా పరిషత్ పాఠశాలల్లో హెచ్ఎం/టీచర్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్/స్పెషల్ ఆఫీసర్ చైర్మన్గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగా, జెడ్పీ సీఈవో మెంబర్, డీఈవో సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ చైర్మన్గాను, డీఈవో కార్యదర్శి/మెంబర్స్గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. - ఉపాధ్యాయుల్లో భార్య/భర్త ప్రభుత్వ ఉద్యో గంలో ఉన్నా, అవివాహిత మహిళా హెచ్ఎంలు, దివ్యాంగులు మొదలైన వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించింది. బదిలీ ప్రక్రియలో ఏ ఇద్దరికి సమాన పాయింట్లు వచి్చ నా వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కూడా చదవండి: ఎల్లో మీడియా ఓవరాక్షన్ -
సీఎం జగన్ను కలిసిన ఎన్సీసీ డీజీ గుర్బీర్పాల్ సింగ్
-
ఎన్సీసీ ప్యానెల్లో ధోని
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ధోనిని నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్సీసీ కమిటీ చర్చిస్తుంది. -
ఒకే వేదికపై ఆనంద్ మహీంద్రా, మహేంద్ర సింగ్ ధోనీ..!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకే వేదికను పంచుకొనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ మార్పులను తేవాలని రక్షణశాఖ భావిస్తోంది. అందుకుగాను బైజయంత్ పాండా నేతృత్వంలో ఎన్సీసీపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకుగాను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని రక్షణశాఖ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాలకు కూడా చోటు కల్పించారు. చదవండి: ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్కు కేంద్రం గ్యారంటీ ఈ కమీటీలో వారితో పాటుగా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే, ఆర్థికశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అక్తర్, ఎస్ఎన్డీటీ వుమెన్స్ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధా కామత్ ఈ కమిటీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎన్సీసీలో చేయదల్చుకున్న మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జాతి నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు మరింత ప్రభావవంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. గతంలోని ఎన్సీసీలో ఉన్నవారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. చదవండి: Gaganyaan Mission: గగన్యాన్ మిషన్ లాంచ్పై స్పష్టత..! -
రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్గా పిల్చుకునే రాకేష్ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం ఝన్ ఝన్ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్సిసి షేర్లలో 12.84 శాతం వాటాను ఈ జంట సొంతం. జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్సిసి స్టాక్ ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది. 11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా ఎన్సీసీ షేరు ధర రూ.89.15 గా ఉండటం విశేషం. -
భవనం పైనుంచి పడి.. ఎన్సీసీ అధికారి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస బాలయోగి గురుకుల పాఠశాల ఎన్సీసీ శిబిరంలో మంగళవారం విషాదం నెలకొంది. వారం రోజుల నుంచి ఉత్తరాంధ్ర స్థాయి ఎన్సీపీ ప్రత్యేక శిబిరం ఈ పాఠశాలలో కొనసాగుతోంది. టొంపల నర్సింహులు (35) గరివిడి పట్టణం శ్రీరాంనగర్లో ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్రం అధ్యాపకునిగా పని చేస్తున్నారు. ఎన్సీసీ అధికారిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడి ఎన్సీసీ విద్యార్థులకు క్యాంప్ అధికారిగా దుప్పలవలస తీసుకువచ్చారు. రెసిడెన్సియల్ క్యాంపు కావటంతో ఇక్కడే ఉండి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బస చేసిన గది నుంచి రెండో అంతస్థుకు మంగళవారం వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. నిద్ర మత్తులో పిట్టగొడ పైనుంచి పైడిపోయారు. తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆయను స్థానిక అధికారులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతునిది విజయన గరం జిల్లా తెర్లాం మండలంలోని హర్షబలగ గ్రామం. ఎచ్చెర్ల ఎస్ఐ వై.కృష్ణ కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఎన్సీసీ మాస్టర్పై విద్యార్థులు దాడి
-
విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని..
సాక్షి, నెల్లూరు: విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఎన్సీసీ మాస్టర్పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి అనే నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎన్సీసీ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శ్రీహరి ఓ విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ శ్రీకాంత్ అనే విద్యార్థి సహచర విద్యార్థులతో కలిసి అతడిని చితకబాదాడు. దీంతో శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
రెండు ఇన్నింగ్స్లలోనూ డబుల్ సెంచరీలు
కొలంబో: ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా అరుదైన రికార్డును నమోదు చేశాడు. లంక దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో పెరీరా రెండు ఇన్నింగ్స్లలోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. లంక క్రికెట్లో రెండు పటిష్ట జట్లు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది. ఎన్సీసీ జట్టుకు కెప్టెన్ అయిన ఏంజెలో తొలి ఇన్నింగ్స్లో 203 బంతుల్లో 201 పరుగులు... రెండో ఇన్నింగ్స్లో 268 బంతుల్లో 231 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఈ ఫీట్ రెండో సారి మాత్రమే నమోదు కావడం విశేషం. దాదాపు 81 ఏళ్ల క్రితం 1938లో కెంట్ బ్యాట్స్మన్ ఆర్థర్ ఫాగ్ ఇదే తరహాలో 244, 202 నాటౌట్ పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున 4 వన్డేలు, 2 టి20లు ఆడిన 28 ఏళ్ల ఏంజెలో 2016 ఆగస్టులో జట్టులో స్థానం కోల్పోయాడు. -
పాఠ్యాంశాల్లో త్యాగధనుల జీవితచరిత్రలు
న్యూఢిల్లీ: విద్యావ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పీజీడీఏవీ కళాశాల వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో లో పాల్గొన్న ఆయన భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువలతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఇతర గొప్ప నాయకుల త్యాగాలు, జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. విద్యాలయాలు జ్ఞానమందిరాలుగా విలసిల్లాలన్నారు. శాంతి, అభివృద్ధికి కేంద్రాలుగా మారాలన్నారు. చదువుతో సంబంధంలేని కార్యక్రమాలను విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించొద్దని సూచించారు. విద్యార్థుల్లో మంచిగుణాలు, మంచి ప్రవర్తన నింపడమే విద్యాధర్మంగా గుర్తించాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ లాంటి కార్యక్రమాల్లో పిల్లలు కచ్చితంగా భాగం కావాలని కోరారు. వీటి వల్ల వారిలో క్రమశిక్షణ, సేవాగుణం అలవడుతాయన్నారు. వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషించాలన్నారు. చదువుతో పాటు ఆటలు, యోగా వంటి అలవాట్లను సాధన చేయాలని సూచించారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జీవనశైలి వ్యాధులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కొనేలా జాగ్రత్త వహించాలన్నారు. యువతలో అంతర్జాలం పట్ల పెరుగుతున్న మోజును నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత వల్ల తలెత్తే ప్రతికూలతలను అధిగమించడంలో పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. -
సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..
దుండిగల్: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాదా రమేష్. సాహసమే ఊపిరిగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్ సికింద్రాబాద్లోని ఎస్డీఎస్ కళాశాలలో 2టీ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నేషనల్ క్యాడెట్ క్రావ్స్ గ్రూప్లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) కోర్స్లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. రెండు పర్వతాల అధిరోహణ ఎన్ఐఎంఏఎస్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్ 2018లో మొదటి సారి అరుణాచల్ ప్రదేశ్లోని 16,414 అడుగుల మీర్తంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్లోని మచాయ్ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అన్ని అంశాల్లో తర్ఫీదు.. పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్లో భాగంగా స్పైడర్ వెబ్తో పాటు రివర్స్ క్రాసింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్ రివర్స్ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్ప్రదేశ్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్స్టాప్ క్లైంబింగ్ పోటీల్లో రమేష్ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్ వెంటాడుతున్న పేదరికం తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. రమేష్కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మేరా భారత్ మహాన్
-
వక్రించిన విధి
దేశానికి సేవ చేయాలన్న లక్ష్యం మదిలో మెదులుతుండగా.. అందుకోసం అహర్నిశలు శ్రమించేందుకు సిద్ధమయ్యాడు కామిరెడ్డి శ్రీకాంత్రెడ్డి. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది.. దేశానికి సేవలందించాలన్న కల చెదిరిపోయింది.. కరెంటుషాక్ తగలడంతో కుప్పకూలిపోయాడు.. గల్ఫ్దేశాల్లో పనిచేసుకుంటూ శ్రీకాంత్రెడ్డిని చదివించుకుంటున్న తల్లిదండ్రుల బాధ ఇక వర్ణనాతీతం. కడప అర్బన్/వైవీయూ : కడపలోని ఎన్సీసీ నగర్లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఎన్సీసీ కేడెట్ కె.శ్రీకాంత్రెడ్డి మృతి చెందాడు. టి.సుండుపల్లె మండలం వాయిల్పాటి వాండ్లపల్లెకు చెందిన కె. రాజగోపాల్రెడ్డి, సుజాత దంపతుల కుమారుడైన ఇతను ప్రస్తుతం కడపనగరంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్నాడు. అనంతరం ఎన్సీసీలో ప్రవేశం పొంది త్వరలో బీ సర్టిఫికెట్ పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే ఈనెల 25వ తేదీన నగరంలో ఎన్సీసీ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఎన్సీసీ కేడెట్స్ నగరంలోని (తెలుగుగంగ కాలనీ) ఎన్సీసీ నగర్లోని 30 ఆంధ్రా బెటాలియన్లో సాధన చేస్తున్నారు. దీంతో పాటు కేడెట్స్కు సంబంధించిన ఎన్రోల్మెంట్లో తప్పులు ఉన్నాయని వచ్చి సరిచేసుకోవాలని ఎన్సీసీ అధికారులు సూచించడంతో ఇందులో భాగంగా శుక్రవారం కె. శ్రీకాంత్రెడ్డి, పాలకొండ్రాయుడు, హర్షవర్ధన్రెడ్డి, హేమంత్లు కలిసి బెటాలియన్కు వెళ్లారు. అక్కడ సిబ్బంది వంటగది సమీపంలోని ఓ గదిని శుభ్రం చేసేందుకు ఇనుప నిచ్చెన తీసుకెళ్లేందుకు కేడెట్స్ను సహాయం కోరారు. దీంతో శ్రీకాంత్రెడ్డి, పాలకొండ్రాయుడు, ఆర్మీ సిబ్బంది హవల్దార్ ఉపేంద్రకుమార్ ఇనుప నిచ్చెన పట్టుకుని వెళ్లే సమయంలో వర్షం పడుతుంది. అందరూ కలిసి నిచ్చెనను పైకి ఎత్తారు. విద్యుత్ తీగలు తగిలి ఇనుప నిచ్చెనకు తాకడంతో షాక్ తగిలి శ్రీకాంత్రెడ్డి కుప్పకూలిపోయాడు. అతను కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. కాగా పాలకొండ్రాయుడు, ఉపేంద్రకుమార్ కాళ్లకు బూట్లు వేసుకుని ఉండడంతో వీరిద్దరికి ప్రాణాపాయం తప్పింది. పాలకొండ్రాయుడు స్వల్పగాయాలతో బయటపడగా.. హవల్దార్ ఉపేంద్రకుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని ఎన్సీసీ వాహనంలో రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ శ్రీకాంత్రెడ్డి(19) మృతి చెందాడు. ఉపేం ద్రకుమార్ను మెరుగైన చికిత్స కోసం నగరంలోని కొమ్మా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్కు తరలించారు. పలు ఆరోపణలు కేడెట్ మరణవార్తను తెలుసుకున్న ఎన్సీసీ కమాం డింగ్ ఆఫీసర్ కల్నల్ రవిచంద్రన్ క్యాంపు నుంచి తిరుగుపయనమైనట్లు సమాచారం. కాగా ఎన్సీసీ కేడెట్స్ను ఎన్సీసీ నగర్లో పనిచేయించుకునేం దుకు తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిం చాయి. అయితే దీనిపై ఎన్సీసీ సూపరింటెండెంట్ శంకర్ను వివరణ కోరగా సంఘటన దురదృష్టకరమన్నారు. ఈనెల 25వ తేదీన ఎన్సీసీ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేడెట్స్ను సాధన చేసేందుకు పిలిపిస్తున్నామన్నారు. అదే విధంగా నామినల్రోల్స్లో వివరాలు తప్పుగా ఉండడంతో సరిచేసుకునేందుకు వీరిని పిలిపించామన్నారు. అదే సమయంలో నిచ్చెన పట్టేందుకు సహాయం కోరగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. మరణించిన కేడెట్ శ్రీకాంత్రెడ్డికి ఎన్సీసీ కేడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఆర్థికసాయం అందిస్తామని, ఇందుకోసం సీఓ సూచనల మేరకు రిపోర్ట్ పంపామని తెలిపారు. కాగా చనిపోయిన శ్రీకాంత్రెడ్డి మృతదేహాన్ని రిమ్స్లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ ఎం. రామచంద్రారెడ్డి పరిశీలించారు. అదే విధంగా కొమ్మా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హవల్దార్ ఉపేంద్రకుమార్ను ఆయన పరిశీలించారు. రిమ్స్ వద్ద ఆందోళన, ఉద్రిక్తత.. ఎన్సీసీ కేడెట్ కె. శ్రీకాంత్రెడ్డి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి ఉదయం 11.30 గంటల ప్రాం తంలో తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతుని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కుటుంబాన్ని ఆదుకోవాలని తాము ప్రతిపాదించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. అలాగే ఎక్స్గ్రేషియా రూ.20లక్షలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా ఆధ్వర్యంలో సీఐలు నాయకుల నారాయణ, నాగరాజరావు, పద్మనాభన్, ఎస్ఐ లు హేమకుమార్, కుళ్లాయప్ప, నాగార్జున, కొం డారెడ్డిలు, స్పెషల్పార్టీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా మోహరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు తిరుమలేష్, దస్తగిరి, సుబ్బరాయుడు, మధుబాలాజీ, శివశంకర్, రాజ్కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు మద్దిలేటి, ఈశ్వరయ్యలు పోలీసులు, ఎన్సీసీ సిబ్బందితో చర్చలు జరిపారు. శ్రీకాంత్రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పిలిపించుకునే ముందు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే శ్రీకాంత్రెడ్డి మృత్యువాత పడ్డాడని.. 19 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తీవ్రంగా రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసినప్పటికీ అంబులెన్స్ను అక్కడి నుంచి వెళ్లకుండా తమ సమస్య తీరేదాకా ఒప్పుకోమని అడ్డుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో ఎన్సీసీ ముఖ్య అధికారులతో మాట్లాడి తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తీవ్ర గందరగోళం మధ్య ఎట్టకేలకు ఎన్సీసీ అధికారులు చెప్పిన మాటలకు అంగీకరించిన బంధువులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామం వాయల్పాటివాండ్ల పల్లెకు తీసుకెళ్లారు. కేసు నమోదు సంఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డ సహచర ఎన్సీసీ కేడెట్ పాలకొండ్రాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. శ్రీకాంత్రెడ్డి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ హేమకుమార్ తెలిపారు. కోమా నుంచి తిరిగివచ్చి.. సుండుపల్లె: విద్యుదాఘాతంలో మృతిచెందిన శ్రీకాంత్రెడ్డి గత ఏడాది సుండుపల్లె మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఉన్నత చదువులకోసం కడప ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. శుక్రవారం విద్యుత్ఘాతంతో శ్రీకాంత్రెడ్డి మృతిచెందాడని విషయం కుటుంబసభ్యులకు తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లిదండ్రులు గోపాల్రెడ్డి, సుజాత బతుకుదెరువుకోసం కువైట్కు వెళ్లారు. వీరికి కుమారుడు శ్రీకాంత్రెడ్డితోపాటు ఒక కూతురు ఉంది. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు గల్ఫ్ నుంచి స్వగ్రామం బయలుదేరారు. -
ఎన్సీసీ అధికారులే కారణం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో అర్హులైన పలువురు విద్యార్థులకు ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు దక్కకపోవడానికి ఎన్సీసీ అధికారుల తీరే కారణమని హైకోర్టు తేల్చింది. ఇప్పటికే ప్రవేశాలు ముగిసిన నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఆ విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎన్సీసీపై ఉందన్న హైకోర్టు, ఒక్కో పిటిషనర్కు రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులకు నష్టం జరిగేలా వ్యవహరించిన అధికారులను గుర్తించి, వారి నుంచి ఈ సొమ్మును రాబట్టుకోవాలని, వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చని ఎన్సీసీ ఉన్నత వర్గాలకు హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల అత్యుత్సాహానికి ఎన్సీసీ అధికారుల సాయం తోడు కావడంతో ఎన్సీసీ కోటా కింద అడ్డదారుల్లో సీట్లు పొందుతున్నారని ధర్మాసనం తెలిపింది. క్రీడల కోటాలో అడ్డదారుల్లో సీట్లు పొందిన వ్యవహారం ఏసీబీ దాడులతో బట్టబయలైందన్న ధర్మాసనం, ఎన్సీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో అక్రమాలు బయటపడేందుకు ఆస్కారం లేకుండా పోయిందని పేర్కొంది. ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు పొందేందుకు తాము అర్హులమైనప్పటికీ తమకు ప్రవేశాలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఈ కేసును ధర్మాసనం విచారించింది. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న వారికి కూడా సీట్లు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్సీసీ ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్సీసీ ఉన్నతాధికారి, అర్హులైన పలువురు పిటిషనర్లకు సీట్లు దక్కలేదని తేల్చారని వెల్లడించింది. ఎన్సీసీ అధికారుల తీరు వల్లే అర్హులైన వారికి ప్రవేశాలు దక్కలేదని, అయితే ఇప్పటికే ప్రవేశాలు ముగియడంతో పాటు పిటిషనర్లకు రావాల్సిన సీట్లలో ఇతరులు చేరినందున పిటిషనర్లకు సీట్లు కేటాయించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అంగీకరించదని తెలిపింది. అదేవిధంగా సీట్ల సంఖ్యను పెంచాలని ఆదేశాలివ్వలేమని పేర్కొంది. -
నిష్పాక్షిక విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఎన్సీసీ కోటా కింద భర్తీ చేసిన సీట్ల విషయంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ రోవిన్ను విచారణాధికారిగా నియమించే విషయంలో ఎన్సీసీ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. సీట్ల భర్తీకి సంబంధించి ఎన్సీసీ అధికారులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరపండి. పిటిషనర్లు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. మాకు విశ్వాసం కలిగించేలా విచారణ జరగని పక్షంలో పిటిషనర్లు కోరిన ప్రత్యామ్నాయంవైపు మేం మొగ్గు చూపుతాం. ఈనెల 10వ తేదీ కల్లా విచారణను పూర్తి చేసి నివేదికను మా ముందుంచాలి’’అని విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు ఈ విచారణ గురించి తెలియజేయాలని, వారికి ఇచ్చిన ప్రవేశాలు తాత్కాలికమని, విచారణ నివేదిక ఆధారంగా వారి కొనసాగింపు ఉంటుందని స్పష్టంగా చెప్పాలని ఉభయ రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల తీరు సరికాదు..: ‘‘ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందేందుకు మేం అర్హులమైనప్పటికీ, ఎన్సీసీ అధికారుల తీరు వల్ల మాకు అన్యాయం జరిగింది. ప్రాధాన్యత ఖరారు.. సర్టిఫికెట్ల ఆమోదం.. క్రీడల్లో పాల్గొన్నా గుర్తించకపోవడం.. స్పాన్సర్షిప్ తదితర విషయాల్లో ఎన్సీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి మా జీవితాలతో ఆడుకున్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి’’అని కోరుతూ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం.. అభ్యర్థుల పట్ల ఎన్సీసీ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఎన్సీసీ డైరెక్టరేట్ విశ్వసనీయతను తాము శంకించడం లేదని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్సీసీ అధికారులు పరస్పర విరుద్ధ వైఖరి గమనిస్తే, వైద్య విద్య ఎన్సీసీ కోటా సీట్ల భర్తీలో అంతా సవ్యంగానే జరిగిందని అనిపించడం లేదని ఆంది. అవకతవకలను గుర్తించడమే పరిష్కారం ‘‘కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఆ సమయం ఇంకా రాలేదని మేం భావిస్తున్నాం. పిటిషనర్లు కోరుతున్నట్లు వారికి ప్రవేశాలు కల్పిస్తే ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు పొందిన వారిని బయటకు పంపాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ పిటిషనర్లకు ప్రవేశం కల్పించి వారి సీట్లలో ఉన్న వారిని బయటకు పంపితే దానిపై అభ్యంతరం తెలియచేసేందుకు వారికి పూర్తి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు వారు కోరుతున్న విధంగా ప్రవేశాలు కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అవకతవకలను గుర్తించడమే ఈ సమస్యకు పరిష్కారం. అందువల్ల ఎన్సీసీ కోటా కింద జరిగిన సీట్ల భర్తీపై విచారణకు ఆదేశిస్తున్నాం. విచారణాధికారిగా బ్రిగేడియర్ రోవిన్ పేరుకు ఆమోదం తెలుపుతున్నాం. ఎన్సీసీ కోటా కింద ఉన్న క్రీడలు, వ్యక్తిగత, బృంద క్రీడలు, ఎన్సీసీ స్పాన్సర్ చేసిన, గుర్తించిన క్రీడల వివరాలు, ఇప్పటికే ఈ కోటా కింద ప్రవేశాలు పొందిన వారి వివరాలు, వారు శిక్షణకు వెళ్లింది నిజమా? కాదా? వారు పొందిన సర్టిఫికేట్లు నిజమైనవేనా? కావా? అన్న విషయాలను తేల్చాలి’’అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సెల్ఫీ కోసం స్టేజ్ దిగిన రాహుల్
మైసూర్: నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికీ నరేంద్ర మోదీ అవివేక నిర్ణయాలేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని పేర్కొన్నారు. శనివారం మైసూర్లో పర్యటించిన ఆయన మహారాణి కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. నీరవ్ దోచేసిన సొమ్ముతో..: ‘‘చక్కటి నైపుణ్యం ఉన్నా ఆర్థిక తోడ్పాటు లేకపోవడం వల్లే యువత అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. నిన్నిటి నీరవ్ మోదీ కుంభకోణమే తీసుకోండి.. 22వేల కోట్లను ఆయన కాజేశారు. అదే సొమ్మును మీలాంటి యువతకు రుణంగా ఇచ్చిఉంటే ఎన్ని అద్భుతమైన వ్యాపారాలు చేసేవారో కదా!’ అని రాహుల్ అన్నారు. ‘సీ సర్టిఫికేట్ పరీక్షను పూర్తిచేసుకున్న ఎన్సీసీ క్యాడెట్లకు మీరు ప్రభుత్వంలో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు?’ అన్న ఓ విద్యార్థిని ప్రశ్నకు.. ‘‘నాకు ఈ ఎన్సీసీ గురించి పెద్దగా తెలియదు. ఆ శిక్షణ, వ్యవహారాల గురించి అవగాహనలేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’ అని రాహుల్ అన్నారు. సెల్ఫీ కోసం స్టేజ్ దిగి..: ప్రశ్నావళిలో భాగంగా ‘రాహుల్జీ.. మీతో ఓ సెల్ఫీ దిగాలనుంది..’ అని ఓ విద్యార్థిని అడగ్గానే చకచకా స్టేజ్దిగిన రాహుల్.. ఆమెతో సెల్ఫీ దిగడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఎన్నికల రాష్ట్రం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిపెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు విరివిగా పర్యటనను చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగేఅవకాశముంది. -
సెల్ఫీ కోసం స్టేజ్ దిగిన రాహుల్
-
లిఫ్ట్ ఫెయిల్: ఇద్దరు మృతి
హైదరాబాద్ : మాదాపూర్లోని ఎన్సీసీ కార్పొరేట్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఫెయిల్ అవడంతో ఇద్దరు సాంకేతిక సిబ్బంది మృతిచెందారు. 11వ అంతస్తులో లిఫ్ట్ను నిలిపి గొలుసుతో వేలాడ దీసి మరమ్మతులు చేస్తుండగా గొలుసు తెగిపోయింది. దీంతో లిఫ్టు కిందకు పడిపోవడంతో అందులో ఇరుక్కుని వారిద్దరు మృతి చెందారు. సేఫ్టీ బెల్టులు లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులను జాన్సన్ కంపెనీకి చెందిన లిఫ్ట్ మెకానిక్లు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరుకు చెందిన రమేష్(21), ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన నాగరాజు(28)గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సకాలంలో పనులు చేయలేకపోయిన ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురైంది. సకాలంలో పనులు చేస్తామని ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకునేందుకు గాయత్రి సంస్థ చేసిన ప్రయత్నాలను ఎన్సీసీ సవాల్ చేయటం తెలిసిందే. ఈ మేరకు ఎన్సీసీ చేసిన అప్పీలు పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనితో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించింది. 2,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్ధేశించిన పనుల్ని చేసేందుకు ఎన్సీసీ, గాయత్రి పవర్ మధ్య డీల్ కుదురింది. ఇందుకు రూ.8.5 కోట్లు, రూ.4.25 కోట్ల చొప్పున రెండు బ్యాంక్ గ్యారెంటీలను ఎన్సీసీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఎన్సీసీ సకాలంలో పనులు చేయలేదని గాయత్రి ఆ గ్యారెంటీలను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. దీనిని ఎన్సీసీ హైదరాబాద్లోని కింది కోర్టులో సవాల్ చేస్తే ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో ఎన్సీసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన ధర్మాసనం.. ఎన్సీసీ బేషరతు గ్యారెంటీ ఇచ్చిందని, పైగా గాయత్రి ఒప్పం దాన్ని ఉల్లంఘించినట్లుగా నిరూపించలేకపోయిం దని తెలిపింది. ఈ పరిస్థితుల్లో గ్యారెంటీలను ఎన్క్యాష్ చేసుకునేందుకు గాయత్రికి హక్కు ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఎన్సీసీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని కోరగా... ఆ వినతిని పరిగణనలోకి తీసుకుని రెండు వారాలపాటు గ్యారెంటీలను ఎన్క్యాష్ చేసుకోవద్దని గాయత్రికి తన తీర్పులో సూచించింది. -
పెద్దాపురంలో ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
–జాతీయ సమైక్యతకు ఎన్సీసీ దోహదమన్న వక్తలు పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కమాండెంట్ మునీష్గౌర్ ఆధ్వర్యంలో క్యాంపు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సిక్స్ నేవల్ కమాండ్ అధికారి కెప్టెన్ వివేకానంద, కల్నల్ నీలేష్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, శ్రీ ప్రకాష్ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ప్రకాష్, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య ముఖ్యఅతిథలుగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు ఎన్సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్యాంపు ఎన్సీసీ అధికారులు ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యంలో క్యాడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాడెట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, మాజీ ప్రిన్సిపాల్ ప్రభాకరరావు, ఎన్సీసీ అధికారులు కృష్ణారావు, సతీష్, సత్యనారాయణ, పిలిఫ్రాజు, వీవీవీ రమణమూర్తి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. -
వికటించిన అల్పాహారం
9 మంది ఎన్సీసీ క్యాడెట్లకు అస్వస్థత మందులు లేవన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం పెద్దాపురం : కాకినాడ 18 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఆదివారం ఉదయం 9 మంది ఎన్సీసీ మహిళా క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. శిబిరం వద్దకు ఉదయాన్నే వండిన అల్పాహారం వికటించడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్సిసి అధికారులు మనీష్గౌర్, యు.మాచిరాజు, కృష్ణారావు, సతీష్లు హుటాహుటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబులు క్యాడెట్ల ఆరోగ్య సమస్యపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది మందులు బయట నుంచి తీసుకు రమ్మన్నంటున్నారని క్యాడెట్లు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని పిలిచి వారిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత లేదంటూనే మందులు లేవని సమాధానం చెప్పడమేమిటని మండిపడ్డారు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి గానీ రోగులపై సమాధానం చెప్పడం బాగోలేదని, ఇలా అయితే చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. వెంటనే వైద్యులను రప్పించి క్యాడెట్లకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్డీవో ఆదేశించారు. మంత్రి రాజప్ప ఆరా ఎన్సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాడెట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్డీవో విశ్వేశ్వరరావు, వైద్యాధికారులకు సూచించారు. క్యాడెట్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. -
త్వరలో నూతన ఎన్సీసీ బెటాలియన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎన్సీసీ బెటాలియన్లు ప్రారంభించనున్నట్లు ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్ ఎయిర్ కమ్డోర్, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.మహేశ్వర్ చెప్పారు. సాంవత్సరిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన నగరంలోని ఎన్సీసీ క్యాంటీన్ను సందర్శించారు. క్యాంటీన్లోని స్టాక్ వివరాలను, వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్సీసీ ట్రూప్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ, క్యాంటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ఎన్ ఐతాల్, మేనేజర్ కేపీ నాయుడు తదితరులు ఉన్నారు. -
ఎన్సీసీ శిబిరాన్ని సందర్శించిన నేవీ చీఫ్
న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పరేడ్ మైదానంలో ఉన్న ఎన్సీసీ (నేషనల్ క్యాడెట్ కోర్) గణతంత్ర దిన శిబిరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా సోమవారం సందర్శించారు. డీజీఎన్సీసీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ ఆయనకుస్వాగతం పలికారు. క్యాడెట్లు ఆయనకు సమర్పించిన గౌరవ వందనం చూసి లాంబా ముచ్చటపడ్డారు. గౌరవ వందనం సమర్పించిన క్యాడెట్లలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల వారు ఉన్నారు. క్యాడెట్లు సిద్ధం చేసిన జెండా వందనం ప్రదేశాలనుకూడా లాంబా పరిశీలించారు. అనంతరం ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను ఆయన సందర్శించారు. క్యాడెట్లంతా సాయుధ దళాల్లో చేరి మాతృభూమికి సేవచేయాలని పిలుపునిచ్చారు. -
నగదు రహితంతో అవినీతి అంతం
కర్నూలు(అర్బన్): అవినీతి నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలు సహకరిస్తాయని 28 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బీవీ మధుసూదనన్ అన్నారు. శనివారం స్థానిక ఉస్మానియా కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ ఈ – లావాదేవీలు – నగదు రహిత కొనుగోళ్లు’ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రధానమైనదని, అభివృద్ధి అంశాల్లో ఎస్సీసీ విద్యార్థులు పాలుపంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఏఎస్ హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ డి.లక్ష్మినరసింహులు, అసిస్టెంట్ మేనేజర్ ఏ విజయకుమార్ సెల్ఫోన్ ద్వారా లావాదేవీలను ఏ విధంగా చేయవచ్చో, బ్యాంకు సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ- చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి కొనుగోలుకు జవాబుదారితనం పెరుగుతుందని, దేశ ఆదాయం పెరగడమే గాకుండా దేశాభివృద్ధికి తోడ్పడిన వారమవుతామన్నారు. సమావేశంలో ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరసిలార్ మహమ్మద్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సయ్యద్ సమీఉద్దీన్, ఎన్సీసీ అధికారి మండీ అన్వర్హుసేన్ పాల్గొన్నారు. -
ఎన్సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్
న్యూఢిల్లీ: నేషనల్ క్యాడెట్ కోర్(ఎస్సీసీ) నూతన డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టక ముందు ఈయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్గా విధులు నిర్వర్తించారు. తమిళనాడులోని విల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ఈయన గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేశారు. -
ఎన్సీసీతో క్రమశిక్షణ
- కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కర్నూలు(హాస్పిటల్): ఎన్సీసీలో చేరితే క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ అన్నారు. ఆదివారం స్థానిక బి.క్యాంపులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో 68వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు డ్రిల్, పెరేడ్ చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఐజి మాట్లాడుతూ.. తాను కూడా విద్యార్థి దశలో ఎన్సీసీ కేడెట్గా ఉన్నానని గుర్తు చేశారు. ఎన్సీసీలో చేరడం వల్ల వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని, భావవ్యక్తీకరణ, పర్సనాలిటి డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఓర్వకల్లు వద్ద ఎన్సీసీ క్యాంపు కోసం 20 ఎకరాల కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో ఎన్సీసీ కేడెట్గా ఉన్నానని తెలిపారు. ఏ ఆపద, అవసరం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు ముందుండి సేవ చేస్తారని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కర్నూలు గ్రూప్ ఎన్సీసీ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ, లెఫ్ట్నెంట్ కల్నల్ గౌస్బేగ్, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాచయ్య, ఎస్టిబిసి కళాశాల ప్రిన్సిపల్ మనోరమ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎన్సీసీడే
-
శుభ్రత కోసం పరుగు
కర్నూలు(హాస్పిటల్): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనాన్ని కాపాడాలన్న నినాదంతో ఎన్సీసీ కేడెట్లు శనివారం కర్నూలు నగరంలో పరుగు తీశారు. 68వ ఎన్సీసీ డే ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ' గో గ్రీన్ గో క్లీన్' పేరుతో టు కే రన్ కార్యక్రమాన్ని కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ ప్రారంభించారు. పరుగు కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 300 మంది ఎన్సీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఎన్సీసీతో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని, ప్రతి విద్యార్థి ఎన్సీసీలో పాల్గొనాలని సూచించారు. అనంతరం ఆయన వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన ఎన్సీసీ కేడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లెఫ్ట్నెంట్ కల్నల్ గౌస్బేగ్, ఎస్కే సింగ్, మధు, ఎన్సీసీ అధికారి పివి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం
- భావిభారత పౌరుల తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకం - ఎన్సీసీతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు - జిల్లాలోని ప్రముఖులు ఈ కోవలోని వారే...! - నేడు ఎన్సీసీ డే క్రమశిక్షణమైన జీవితం, నిజాయితీగా బతకడం, ఎంతటి కఠోరశ్రమనైనా తట్టుకోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కుకోవడం, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండగలిగే మనోస్థైర్యాన్ని చిన్నతనంలోనే పెంపొందించడం, సమాజం గురించి తెలుసుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం.. ఇలాంటి లక్షణాలన్నీ ఎన్సీసీతో సాధ్యమవుతాయనడంలో అతిశయోక్తి లేదు. చదువుతో పాటు ఇతర అంశాల్లో అవగాహన కల్పించేందుకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇప్పుడు ఎన్సీసీలో చేర్పిస్తున్నారు. తద్వారా వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం (ఈనెల 27న) ఎన్సీసీ డే ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. - కర్నూలు(హాస్పిటల్) ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కాప్స్) అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్. డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ, దేశభక్తి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందే భావిభారత పౌరులు. జిల్లాలో 2002వ సంవత్సరం వరకు తిరుపతి హెడ్క్వార్టర్గా ఎన్సీసీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత కర్నూలు కేంద్రంగా 2002లో స్థానిక డాక్టర్స్ కాలనీలో ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్ ప్రారంభమైంది. దీని పరిధిలో ప్రస్తుతం బాయ్స్ బెటాలియన్, 28 ఆంధ్రా బెటాలియన్, కర్నూలు, అనంతపురం గర్ల్ బెటాలియన్, వన్ ఆంధ్రా మెడికల్ కంపెనీ ఉన్నాయి. జిల్లాలోని 71 పాఠశాలలు, 30 కళాశాలల్లో మొత్తం 10,250 మంది ఎన్సీసీ కేడెట్లు ఉండగా, ఇందులో 4,350 మంది బాలురు, 5,900 మంది బాలికలు ఉన్నారు. కర్నూలు గ్రూపులో ఆరు మంది ఆర్మీ ఆఫీసర్లు, 75 మంది జేసీవోలు, ఓఆర్లు, 100 మంది సాధారణ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రతి కళాశాలలో ఒక ఎన్సీసీ ఆఫీసర్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎన్సీసీలో మూడు రకాల శిక్షణ ఇన్సిట్యూషన్ ట్రైనింగ్ ఎన్సీసీ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ, విపత్తు నివారణలో శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, బ్యాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్ వంటి అంశాల్లో ప్రత్యేక తరగతుల్లో శిక్షణ ఇస్తారు. క్యాంప్ ట్రైనింగ్ ఈ శిక్షణను అనంతపురం జిల్లా పూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 10 రోజుల పాటు ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తారు. ఇన్సిట్యూషన్ ట్రైనింగ్లో ఇచ్చే శిక్షణతో పాటు వైద్యం, ఫైర్ ఫైటింగ్, రెడ్క్రాస్ సేవలు, 108 సేవలు, కమ్యూనిటీ లివింగ్, స్నేహితులతో ఎలా మెలగాలి వంటి అంశాలను నేర్చుకుంటారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇందులో భాగంగా ఆర్డీసీ (రిపబ్లిక్ డే క్యాంపు), తలసైనిక్ క్యాంపులకు ఎన్సీసీ విద్యార్థులను పంపించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు హైదరాబాద్లో నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తారు. ఆర్డీసీలో భాగంగా ఢిల్లీలో డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, గార్డ్ ఆఫ్ ఆనర్, బెస్ట్ కేడెట్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ ఏరియా కాంపిటీషన్ను ఉప రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, మూడు రకాల భద్రతాధికారుల సమక్షంలో మోడల్ రూపొందించి ప్రదర్శిస్తారు. తలసైనిక్ క్యాంపునకు పంపించేందుకు సైతం పై విధంగానే ఎంపికలు నిర్వహించి ఢిల్లీకి పంపిస్తారు. ఇది పూర్తిగా ఆర్మీలో ఇచ్చే శిక్షణ ఇస్తారు. ఆఫ్సిటికల్స్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, జడ్జింగ్ డిస్టెన్ ఫీల్డ్ సిగ్నల్స్, హెల్త్ అండ్ హైజనింగ్లలో శిక్షణ ఉంటుంది. పాఠశాల స్థాయి పిల్లలకు ఏ- సర్టిఫికెట్, కళాశాల స్థాయి పిల్లలకు బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. ఎన్సీసీ ప్రయోజనాలు ఎన్సీసీలో పలు రకాల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆర్డీసీ, తలసైనిక్ క్యాంపుల్లో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ సీట్ల కేటాయింపులో వీరికి రిజర్వేషన్ ఉంటుంది. దీంతో పాటు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలోనూ వీరికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎన్సీసీలో చేరడంతో పిల్లల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేన్ స్కిల్స్, పరస్పర సహకారం, నిజాయితీగా జీవించడం వంటి లక్షణాలు అలవడతాయి. శిక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు: పీజీ కృష్ణ, గ్రూప్ కమాండర్ ఎన్సీసీ విద్యార్థులకు అవసరమైన శిక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్, బేటీ బచావో, బేటీ పడావో, షుగర్, ఎయిడ్స్, లెప్రసి, మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్సీసీ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లో విదేశాలకు: గౌస్ బేగ్, లెఫ్ట్నెంట్ కల్నల్ యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా 20 మంది విద్యార్థులను ఇప్పటి వరకు విదేశాలకు పంపించాము. సిల్వర్జూబ్లీ కళాశాలకు చెందిన ధీరజ్ శ్రీనివాస్ కజకిస్తాన్, భాస్కర్ బంగ్లాదేశ్కు వెళ్లి వచ్చారు. వారు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలిస్తారు. తద్వారా వారు భవిష్యత్లో సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. -
ఎన్సీసీ సంబరాలు ఆరంభం
తొలిరోజున మొక్కలు నాటిన కేడెట్లు, అధికారులు తెనాలి అర్బన్: ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా స్థానిక అయితానగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలులో మూడురోజుల ఎన్సీసీ సంబరాలు శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమానికి ఎన్సీసీ 22 (ఎ) బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ జె.ఎ.మిర్ హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయిని ఎస్.అలివేలుమంగమ్మ, ఎన్సీసీ అధికారులు బెల్లంకొండ వెంకట్, అనసూయ, ఎన్సీసీ కేడెట్లు తొలుత మొక్కలు నాటారు. స్కూలు గార్డెన్ను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మిర్ మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయరాదనీ, వీటికి రోజూ నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. శనివారం 500 మందితో వ్యర్థాల నిర్వహణపై ర్యాలీ జరుగుతుందనీ, బాయ్నెట్ ఫైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పీఈటీ నాగయ్య, కోటిరెడ్డి, శ్రీను, శరత్బాబు, ఎస్ఎం బ్రిజ్లాల్, పీఐ స్టాఫ్ నాగేశ్వరరావు, సోమశేఖర్ పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ బీవీ రమణ పర్యవేక్షించారు. శ్రీ చైతన్య స్కూల్లో.. దేవిచౌక్లోని శ్రీ చైతన్య స్కూల్లో శుక్రవారం సోషల్ విక్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన అమరవీరుల వేషధారణాలతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి అందరిని అలరించారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయులు ఉదయ్చంద్రిక, పూర్ణిమ, మహేష్ పాల్గొన్నారు. -
ఎన్సీసీ డే నిర్వహణకు సన్నాహాలు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు నగరంలో ఈ నెల 27వ తేదీన ఎన్సీసీ డే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్సీసీ కమాండర్ కల్నల్ పత్రి గోపాలకృష్ణ చెప్పారు. శుక్రవారం స్థానిక డాక్టర్స్ కాలనీలోని ఎన్సీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీసీ డే దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఎ.క్యాంపులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజి, కోల్స్ జూనియర్ కళాశాల, కేవీఆర్ డిగ్రీ కళాశాల, సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిల్వర్జూబ్లీ ప్రభుత్వ కళాశాల, ఎస్టీబీసీ కళాశాలలకు చెందిన 54 మంది ఎన్సీసీ విద్యార్థులతో పాటు ఆర్మీ అధికారులు సైతం రక్తదానం చేశారని తెలిపారు. అలాగే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆశ్రమం పొందుతున్న వారిని ఎన్సీసీ విద్యార్థులు సందర్శించారన్నారు. శనివారం ఉదయం 6.30 గంటలకు గో గ్రీన్, గో క్లీన్ అంటూ కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు టు కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. 27వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక సిల్వర్జూబ్లీ కళాశాల మైదానంలో ఎన్సీసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే పెరేడ్కు డీఐజి రమణకుమార్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. అనంతరం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఎన్సీసీ కేడెట్లకు ఏ,బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమావేశంలో లెఫ్ట్నెంట్ కల్నల్ గౌస్బేగ్, ఎస్ఎన్. ఐథాల్ పాల్గొన్నారు. -
ఎన్సిసి క్లాస్లో ఎవరెస్టు ఫీలింగ్!
అసమాన ప్రజ్ఞ ఎన్సిసి! నేషనల్ కెడెట్ కోర్. సర్టిఫికెట్ రావాలంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి. ఆకలికి, దాహానికి తట్టుకోవాలి. ఇంటికి దూరంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలవాలి. అమ్మాయిలైతే మరీ కష్టం. ఇవన్నీ దాటుకుని, ఎన్సిసిలో ఎ, బి సర్టిఫికెట్లు సంపాదించి, రిపబ్లిక్డే పరేడ్లో పాల్గొని, ఈనెల 17 నుంచి పది రోజుల పాటు సింగపూర్లో జరిగే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి హాజరవుతోంది జానకీ ప్రజ్ఞ. ఈ ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రజ్ఞ ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సందర్భంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ పాకలపాటి జానకీ ప్రజ్ఞ మనోభావాలు. ఎన్సిసిలో చేరడం నా కల నా చిన్నప్పుడు వార్తాపత్రికలో ఎన్సిసిపై వచ్చిన ఒక వ్యాసం నన్ను బాగా ప్రభావితం చేసింది. అయితే విశాఖపట్టణంలో నేను చదువుకున్న స్కూల్లో ఎన్సిసి లేదు. ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలోనూ ఇదే పరిస్థితి. నేనిక ఎన్సిసిలో చేరలేనేమోనని బాధ పడ్డాను. ఎట్టకేలకు డిగ్రీలో నా కల ఫలించింది. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో ఎన్సిసి ఉందని తెలిసి 2014లో బికామ్ ఆనర్స్లో చేరాను. ఎన్సిసి క్లాసుకి మొదటిరోజు అడుగు పెట్టినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. ఎవరెస్టు పైకి ఎక్కితే ఇలానే ఉంటుందేమో అనిపించింది. టార్గెట్... రిపబ్లిక్ డే పరేడ్ పరేడ్కి సెలక్ట్ అవ్వాలంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాలి. క్యాంపులో నుంచి తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మళ్లీ మూడు క్యాంపులు పెడతారు. ఆ తరువాత రిపబ్లిక్డే పరేడ్కి ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో డ్రిల్, గ్రూప్ డ్యాన్స్, సింగింగ్, గ్రూప్ సింగింగ్... వీటిలో తప్పక పాల్గొనాలి. అన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేశాను. సెలక్ట్ అయ్యాను. పరేడ్కి ముందు మళ్లీ మూడు నెలలు క్యాంపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం తొమ్మిది గ్రూపులున్నాయి. అన్ని గ్రూపుల్లోకి నేను బెస్ట్ క్యాడెట్గా సెలక్ట్ అయినట్లు తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆడపిల్లను ఒంటరిగా ఎక్కడకూ పంపలేని ఈ రోజుల్లో నా పేరెంట్స్ నన్ను ఆ మూడు నెలల క్యాంపుకి ధైర్యంగా పంపారు. వారి ప్రోత్సాహానికి తోడు కమాండింగ్ ఆఫీస్ 8వ నావల్ యూనిట్ కెప్టెన్సాయిప్రసాద్ కాజా ప్రోద్బలం కూడా ఉంది. అమ్మానాన్న గుర్తుకొచ్చేవారు క్యాంపులకు వెళ్లినప్పుడు తిండి సరిగా ఉండదు. అన్నిటికీ తట్టుకునేలా మమ్మల్ని తయారుచేస్తారు. డ్రిల్ వంటి వాటిలో ఎప్పుడైనా పొరపాటుచేస్తే శిక్షలు కఠినంగా ఉండేవి. గ్రౌండ్లో పరుగెత్తడం, ఏదైనా టార్గెట్ చూపితే ఆ పని చేయడం వంటివి. పనిష్మెంట్స్ని వామప్లా భావించాలి. ఈ వామప్లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్టామినా పెంచుకోవాలి. ట్రయినింగ్ సమయంలో ఎక్కువసార్లు నీరసపడి కింద పడిపోతే వాళ్లని డిస్క్వాలిఫై చేసేస్తారు. అటువంటి సమయాల్లో ఇల్లు, అమ్మనాన్న గుర్తుకువచ్చేవారు. ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. ఈ విషయంలో ముఖ్యంగా మా కాలేజీ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి. వాళ్లు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. క్యాంపులకు వెళ్లినప్పుడు మిస్ అయిన క్లాసులు మళ్లీ చెప్పేవారు. ఒక్కోసారి స్కయిప్లో కూడా క్లాసులు చెప్పారు. బెస్ట్ క్యాడెట్గా సి.ఎం. మెడల్ అందరూ చదువుతారు. నే నూ చదువుతున్నాను. చదువు ఒక్కటే కాదు, ఇంకేదైనా సాధించాలనే పట్టుదల కలిగింది నాకు. నేను ఎన్సిసి ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం. బెస్ట్ క్యాడెట్ బంగారు పతకం అందుకున్నాను. దీనినే చీఫ్ మినిస్టర్ మెడల్ అంటారు. రాష్ట్రస్థాయిలో ఇది బెస్ట్. అలాగే క్యాంపులకి వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. సమయపాలన, కొత్త వారితో పరిచయాలు, స్నేహం పెంపొందుతాయి. క్యాంపు అయిపోయి ఆఖరి రోజు వచ్చేసేటప్పుడు బాధగా ఉంటుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, ఇంటిని మర్చిపోయేంత ప్రేమగా ఉంటాం. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
ఉత్తమ యూనిట్గా కాకినాడ ఎన్సీసీ ఆంధ్రా ఎయిర్ వింగ్
బాలాజీచెరువు (కాకినాడ) : రాజస్ధాన్ రాష్ట్రం జోథ్పూర్లో అక్టోబర్ 15 నుంచి 26వ తేదీ వరకూ జరిగిన ఆల్ఇండియా వాయు సైనిక్ క్యాంపులో కాకినాడ ఆంధ్రా ఎయిర్ వింగ్ టెక్నికల్ ఎన్సీసీ యూనిట్ ఉత్తమ యూనిట్గా ఎంపికైంది. ఆ వివరాలను కాకినాడ న్ సీసీ యూనిట్ వింగ్ గ్రూపు కెప్టెన్ ఎల్వీఎస్ సుధాంశ బుధవారం జేఎన్ టీయూకేలో విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ద్వితీయస్ధానం సా«ధించి జోథ్పూర్లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ యూనిట్గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన 17 డైరెక్టరేట్ల నుంచి 600 మంది ఎన్ సీసీ క్యాడెట్లు ప్లైంగ్, ఫైరింగ్, ఎన్ సీసీ సిలబస్ రాత పరీక్ష, టెంట్ వేసే విధానం వంటి పోటీలు నిర్వహించగా కాకినాడ యూనిట్ నుంచి వెళ్లిన పీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పి.ధనుంజయ్, కె.సత్యనారాయణ, తేజస్వినీదేవి, ఆర్.నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తమ యూనిట్గా గుర్తింపు పొందేందుకు కృషిచేశారన్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇస్తారని తెలిపారు. కాకినాడ ఎన్ సీసీ యూనిట్ వింగ్కు ప్రత్యేక గుర్తిపు తెచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు ఎన్ సీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
‘తల్ సైనిక్’లో వెల్డన్
రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం సాధించిన వేళంగి విద్యార్థి ఏడు క్యాంపుల్లో 70 రోజులపాటు శిక్షణ వేళంగి(కరప): కరప మండలం వేళంగిలోని మెర్లాస్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్ శీలం వీరవెంకటసత్యనారాయణ జూనియర్ డివిజన్ ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో తల్ సైనిక్–2016కు ఎంపికై ఏడు క్యాంపుల్లో శిక్షణ పొంది తిరిగి వచ్చాడు. గతనెలలో ఢిల్లీలో జరిగిన చివరి క్యాంపులో రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం పొందినట్టు హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్, ఎన్సీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వీరవెంకట రమణమూర్తి తెలిపారు. తల్ సైనిక్కు ఎంపిక ఇలా కృష్ణాజిల్లా నూజివీడులో 40 రోజులపాటు మూడుచోట్ల జరిగిన ఫైరింగ్ క్యాంప్లో ప్రతిభ కనబరచడంతో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వీరవెంకటసత్యనారాయణ ఒక్కడే. అక్కడ నుంచి సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్లో నాలుగు క్యాంప్లు జరిగాయి. నిజామాబాద్ క్యాంప్ ఫైనల్లో ప్రతిభ కనబరచడంతో ఢిల్లీ క్యాంప్కు ఎంపికయ్యాడు. ఢిల్లీలోని ఎన్సీసీ హెడ్క్వార్టర్లో గతనెల 19 నుంచి 30వ తేదీ వరకు 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మ్యాప్రీడింగ్, ఆయుధాలపై ఇచ్చిన శిక్షణలో 19వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జూనియర్ విభాగంలో వెళ్లిన సత్యనారాయణ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ శిక్షణ భవిష్యత్లో ఉపయోగపడుతుందని, రిజర్వేషన్ కోటా కూడా వర్తిస్తుందని ఎన్సీసీ ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఫైరింగ్లో శిక్షణ ఇచ్చినప్పుడు ఏకాగ్రతతో నేర్చుకునేవాడని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఎన్సీసీ ఉపాధ్యాయుడిని, శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఎన్సీసీ క్యాడెట్ సత్యనారాయణను పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మెర్ల వీరయ్యచౌదరి, సర్పంచ్ కె.చంద్రకుమారి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ అభినందించారు. ఎన్సీసీ మాస్టారు ప్రోత్సాహం మరువలేనిది తల్ సైనిక్కు ఎంపికై, ఢిల్లీ స్థాయిలో శిక్షణ పొందడానికి కారకులైన ఎ¯ŒSసీసీ మాస్టారు వీవీవీ రమణమూర్తి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ల ప్రోత్సాహం మరువలేనిదని శిక్షణ నుంచి తిరిగి వచ్చిన శీలం వీరవెంకటసత్యనారాయణ తెలిపాడు. చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎ¯ŒSసీసీ మాస్టారు ఎయిర్ రైఫిల్ కొనిచ్చి, శిక్షణ ఇచ్చారని, అదే తనను ఢిల్లీ వరకు తీసుకెళ్లిందన్నాడు.ఆర్మీలో మంచిపోస్టు సాధించాలన్నది లక్ష్యమని శిక్షణలో నాల్గవ స్థానంలో నిలిచిన ఎ¯ŒSసీసీ విద్యార్థి శీలం వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.ఎ¯ŒSసీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల రమణమూర్తి ఇస్తున్న శిక్షణతోనే మెళుకువలు నేర్చుకుని, ఫైరింగ్లో తల్ సైనిక్–2016కు ఎంపికై ఈ ఘనత సాధించానన్నాడు. -
ఎన్సీసీలో విద్యార్థినుల ప్రతిభ
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎన్సీసీ మహిళా క్యాడెట్స్కు జాతీయ స్థాయిలో పతకాలు వచ్చాయని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వీవీఐటీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ వీవీఐటీకి చెందిన ముగ్గురు మహిళా క్యాడెట్స్ జాతీయస్థాయి ఎన్సీసీ క్యాంప్కు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన ముగ్గురు న్యూఢిల్లీలోని ధల్ సైనిక క్యాంప్లో శిక్షణ పొందారని చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి 30వ తేదీ వరకూ జరిగిన ఈ క్యాంప్కు దేశంలోని 17 డైరెక్టరేట్లు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ మహిళా విభాగం మొదటి స్థానం సాధించిందన్నారు. క్యాంపులో అబ్స్టకల్ కోర్స్, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ హైజీన్, ఫైరింగ్, జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్, అడ్వాన్స్ రైఫిల్ షూటింగ్, లైన్ ఏరియా కాంపిటేషన్ విభాగాల్లో వీవీఐటీ క్యాడెట్లు కాంస్య పతకం సాధించారని తెలిపారు. ఈ క్యాంప్లో పాల్గొన్న సీఎస్ఈ తృతీయ సంవత్సరం విద్యార్థినులు ఐ సాధనారెడ్డి, సీహెచ్ మధురిమ, సివిల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎన్ లక్ష్మీనాగ అపర్ణ ఎస్ఎస్బీ ఎగ్జామ్స్ రాయకుండా డిఫెన్స్ ఉద్యోగాల ఇంటర్వూ్యలకు డైరెక్ట్గా హాజరు కావచ్చన్నారు. -
ముగిసిన రైఫిల్ షూటింగ్
నేటితో ఎన్సీసీ శిక్షణ శిబిరం పూర్తి తుని రూరల్ : సంయుక్త వార్షిక ఎన్సీసీ శిక్షణ శిబిరం సోమవారంతో ముగుస్తుందని 18వ ఆంధ్రా బెటాలియన్ కమాండెంట్ కల్నల్ మోనీష్గౌర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న రాజుపేట శ్రీప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 16, 17, 18 బెటాలియన్ల జూనియర్, సీనియర్ క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ శిబిరానికి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు చెందిన 610 మంది బాలురు, 48 మంది బాలికలు వచ్చారన్నారు. ఆదివారంతో రైఫిల్ షూటింగ్ ముగిసిందని, సోమవారం శిక్షణ శిబిరం పూర్తవుతుందని చెప్పారు. శ్రీప్రకాష్ ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ ఎం.సతీష్, లెఫ్టినెంట్ రమణబాబు, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎం.కృష్ణారావు పాల్గొన్నారు. -
పాముకాటుతో ఎన్సీసీ విద్యార్థికి అస్వస్థత
హుజూర్నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాల్లో విధులు నిర్వహించే ందుకు వచ్చిన నల్లగొండ ఎన్జీ కాలేజీకి చెందిన ఎన్సీసీ విద్యార్థి ఎస్కే.మస్తాన్ ఆదివారం అర్థరాత్రి పాముకాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... కృష్ణాపుష్కరాల్లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించిన మస్తాన్ మఠంపల్లిలోని మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి స్థలానికి చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి చేతిని శుభ్రం చేసేందుకు కుళాయి వద్దకు వెళ్లాడు. చేతిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో కట్లపాటు కాటు వేసింది. దీంతో మస్తాన్ వెంటనే తోటి విద్యార్థులకు సమాచారం తెలుపగా పాము కోసం వెతుకులాడగా అది తప్పించుకుపోయింది. పాముకాటుగా నిర్ధారించుకున్న వెంటనే పోలీసులు, అధికారుల సాయంతో హుజూర్నగర్లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. -
ఎన్సీసీకి విద్యార్థుల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీ ఎంపికలు మంగళవారం నిర్వహించారు. 25 మంది బాలికలు, 26 మంది విద్యార్థులు బీ సర్టిఫికెట్ కోర్సుకు, 14 మంది సీ సర్టిఫికెట్ కోర్సుకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ సునిల్ చంద్రసింగ్, కళాశాల ప్రిన్సిపాల్ రావుల నాగేందర్రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎం.విఘ్నేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఎన్సీసీ అంటే దేశభక్తితో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడమని ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ బి. హరికృష్ణ నాయుడు పేర్కొన్నారు. రింగ్రోడ్డులోని భాష్యం బ్లూమ్స్ సెకండరీ క్యాంపస్లో ఎన్సీసీ అకాడమీని ప్రారంభించారు. ఎన్సీసీ యూనిట్ 25 (ఏ) బెటాలియన్ కల్నల్, గ్రూప్ కమాండర్ బి. హరికృష్ణ నాయుడు, కమాండింగ్ అధికారి సునీల్ యాదవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా అమర జవానులకు నివాళిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా హరికృష్ణ నాయుడు మాట్లాడుతూ ఎన్సీసీ అంటే సర్టిఫికెట్ పొందడమే కాదని, దేశభక్తి, మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు, లౌకిక వాదం, సేవా దృక్పథం, దేశం కోసం పాటు పడే మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 2016–17 హెడ్ బాయ్స్, హెడ్ గర్్ల్స కెప్టెన్స్, హౌస్ కెప్టన్స్ కల్నల్ చేతుల మీదుగా షోల్డర్, చెస్ట్ బ్యాడ్జెస్ గౌరవాన్ని అందుకుని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాలువలో పడి యువకుడు గల్లంతు
ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా క ర్లపాలెంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామానికి చెందిన పరిశుద్ధరావు(20) కర్లపాలెంలో ఉన్న తన మేనమామ ఇంటికి వచ్చాడు. మేనమామ కుమారుడు అయ్యప్ప మాల ధరించడంతో.. అతనితో పాటు భజన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యప్ప స్వాములతో కలిసి కాలువ వద్ద స్నానానికి వెళ్లాడు. ఈక్రమంలో ఇతినిక ఈత రాకపోవడంగో గట్టు పై కూర్చొని స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడి కాలువలో కొట్టుకుపోయాడు. స్థానికులు ఎంత వెతికిన లాభం లేకపోవడంతో గజ ఈత గాళ్లకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా.. గల్లంతైన యువకుడు జాతీయ స్థాయిలో ఎన్సీసీ పరేడ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు స్థానికులు తెలిపారు. -
ఎన్సీసీ కోటా సీట్ల భర్తీని వాయిదా వేయండి
ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎన్సీసీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని వాయిదా వేయాలని హైకోర్టు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఆదేశించింది. ఎన్సీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రాధాన్యత విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో వారంరోజులపాటు కౌన్సెలింగ్ వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్సీసీ కోటా సీట్ల భర్తీ విషయంలో ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు నిర్దిష్ట విధానాన్ని అనుసరించట్లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన మర్రి సాయిశ్రీ, హైదరాబాద్కు చెందిన మాళవిక.. మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్ సుభాష్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. అండమాన్ నికోబార్లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో పాల్గొన్న విద్యార్థులకే సీట్ల భర్తీలో ప్రాధాన్యమిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. అంతేగాక ఎన్సీసీ డెరైక్టరేట్లు స్పాన్సర్ చేయని గెస్ట్ కాడెట్లకు సైతం సీట్లు ఇస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఒక్కో రాష్ట్రప్రభుత్వం ఒక్కోవిధంగా ప్రాధాన్యతను రూపొందించిందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసలు ప్రాధాన్యతలను తమ ముందుంచాలని కేంద్రప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ
ఎన్సీసీలో చేరటం మధుర జ్ఞాపకం న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం దక్కించుకున్న ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని అభినందించారు. ఎన్సీసీలో చేరినా ఢిల్లీలో జరిగే వార్షిక క్యాంప్ వేడుకలకు మాత్రం తాను ఎంపిక కాలేదని మోదీ వెల్లడించారు. తమ పాఠశాల నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఓ విద్యార్థి హఠాత్తుగా రాత్రికి రాత్రే ప్రముఖుడిగా మారిపోయాడని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుడిగా ఉండగా ఎన్సీసీ దుస్తుల్లో ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా మోదీ ట్వీటర్లో విడుదల చేశా రు. ఎన్సీసీ పరేడ్లో మహిళా క్యాడెట్లు ఎక్కువగా పాల్గొనటంపై మోదీసంతృప్తి వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో విభిన్న ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. జాతిని అర్థం చేసుకోవటానికి స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారన్నారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రావు ఇందర్జిత్ సింగ్, సుష్మా స్వరాజ్, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్బేడీ, ఎంపీ జయాబచ్చన్ తదితరులంతా ఎన్సీసీలో చేరినవారేనని చెప్పారు. యోగాలో ప్రపంచ రికార్డు సాధించాలి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని కోరారు. ఇప్పటినుంచే దీనికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించటం యోగా సాధకులకు గర్వకారణమన్నారు. యోగాకు వయసు, భాష లాంటి సరిహద్దులు లేవన్నారు. -
ఘనంగా ఎన్సీసీ డే వేడుకలు
విశాఖపట్నం: క్రమశిక్షణతో కెరీర్ ఏర్పరుచుకునేందుకు ఎన్సీసీ తోడ్పడుతుందని విశాఖ ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ వి.వి.ఎస్.రాజు తెలిపారు. ఎన్సీసీ డేను పురస్కరించుకుని ఏయూ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తుపాను అనంతరం సామాజిక బాధ్యతగా క్యాడెట్లు సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని అభినందించారు. దేశభక్తి, నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవడానికి విద్యార్థి దశలో ఎన్సీసీ ఎంతో ఉపయుక్తమన్నారు. తొలుత విశాఖ గ్రూప్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలు ఎన్సీసీ యూనిట్లకు చెందిన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ డివిజన్, వింగ్లకు చెందిన క్యాడెట్లు మొక్కల్ని పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మార్చ్పాస్ట్ నిర్వహించారు. గ్రూప్ కమాండర్ రాజు ఏయూ గ్రౌండ్స్లో మొక్కలు నాటారు. క్యాడెట్లు గ్రౌండ్ నుంచి సాగర తీరం వరకు ర్యాలీ నిర్వహించి మొక్కల్ని నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నినదించారు. ఈ సందర్భంగా బెస్ట్లుగా ఎంపికైన పలువురు క్యాడెట్లను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు యూనిట్ల అధికారులు రాజేంద్ర, గుహరాయ్, భరద్వాజ్, సుహిత్, నెహ్రా, జేమ్స్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎస్.కె.దా, యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఏఎన్ఓలు పాల్గొన్నారు. బెస్ట్లు వీరే : బెస్ట్ ఏఎన్ఓగా కె.సదాశివరావు ఎంపిక కాగా, సీనియర్ డివిజన్లో మహ్మద్ అబ్దుల్, సీనియర్ వింగ్లో బి.సాయి సుప్రజ, జూనియర్ డివిజన్లో జి.వి.రమణ, జూనియర్ వింగ్లో డి.జానకి బెస్ట్ క్యాడెట్లుగా నిలిచారు. పీఐ స్టాఫ్ వినోద్కుమార్, సివిలియన్ స్టాఫ్ సత్యనారాయణ గ్రూప్ స్థాయిలో బెస్ట్గా అభినందనలు అందుకున్నారు. -
నేడు, రేపు ‘ఇండియా ప్రాపర్టీ.కామ్’ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ ఆధ్వర్యంలో ‘గృహప్రవేశం’ పేరుతో శని, ఆదివారాల్లో ప్రాపర్టీ షో జరగనుంది. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే ఈ ప్రదర్శనలో టాప్ 60 మంది బిల్డర్లు 200కు పైగా కొత్త ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. దాదాపు రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. అపర్ణా, ఎస్వీసీ, ఎన్సీసీ, సైబర్సిటీ, విశాల్ వంటి నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి, ఏపీ ప్రెసిడెంట్ రాం రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్కు సమయాన్ని కేటాయించాలి.మొకట్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్లో పెంచుకోవచ్చు. ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటివారంలో రోజూ నీరు పెట్టాలి. రెండో వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పెట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన చెట్లు ప్రహరీ గోడ చుట్టూ ఉంటే సూర్యరశ్మి తగినంత పడే అవకాశం ఉండదు. ఇంట్లోకి వెలుతురు బాగారావాలంటే ఇంటి చుట్టూ కాకుండా సూర్యర శ్మి పడే ప్రాంతాలను ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను పెంచుకుంటే మంచిది. ఆహ్లాదమిచ్చే పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలకూ కాస్త స్థలం కేటాయించుకుంటే మీ ఇల్లు పచ్చగా చూడముచ్చటగా ఉంటుంది.