nithish kumar
-
BPSC ప్రశ్నపత్రాల లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ, ఉద్రిక్తత
పాట్నా : బీహార్ (bihar) లో ఉద్రిక్తత నెలకొంది.డిసెంబర్ 13న నిర్వహించిన 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (bpsc) ప్రిలిమనరీ పరీక్ష పేపర్ లీకైందని, పరీక్ష వాయిదా వేయాలని రోజుల తరబడి అభ్యర్థుల చేస్తున్న ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం నితీష్ కుమార్తో భేటీ అయ్యేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీ మైదాన్లో నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు.సీఎం నితీష్ కుమార్ను కలిసిందేకు పీబీఎస్ (Bihar Public Service Commission) అభ్యర్థులు జేపీ గోలంబార్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన రెండు బారికేడ్లను ఛేదించారు. అక్కడి నుంచి పాట్నా గాంధీ మైదాన్కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు, బీపీఎస్ఈ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులు ఫ్రేజర్ రోడ్డు మీదుగా ప్రభుత్వ అధికారులు నివాస ప్రాంతమైన డాక్ బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. నిరసనకారులను అదుపు చేసేందుకు హోటల్ మౌర్య సమీపంలో బారికేడ్లతో సహా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.#WATCH | Bihar | BPSC aspirants continue their protest in Patna's Gandhi Maidan, demanding a re-exam to be held for the 70th BPSC prelimsJan Suraaj Chief Prashant Kishor also present at the protest pic.twitter.com/q9qUrv6wTd— ANI (@ANI) December 29, 2024 ఈ సందర్భంగా బీపీఎస్సీ పరీక్షలపై పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఎపీఎస్సీ పరీక్షలు అక్రమాలు, పేపర్ లీకేజీలు ఆనవాయితీగా మారాయి. ఇలా సాగడం కుదరదు. పరిష్కారం వెతకాలి.. అందుకే ‘ఛత్ర సంసద్’ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. .అభ్యర్థుల చత్ర సంసద్పై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (DM) చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, గాంధీ మైదాన్ నిషేధిత ప్రాంతం కాబట్టి జిల్లా యంత్రాంగం విద్యార్థులను గుమికూడనివ్వదు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం నిరసనల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గాంధీ మైదాన్లో, పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బందిని నియమించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ’ అని హెచ్చరించారు. -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
రాజీనామా తర్వాత నితీష్ కుమార్ సంచలన కామెంట్స్
-
రసవత్తరంగా బీహార్ రాజకీయాలు
-
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!!
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!! -
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
పట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్పై నితీశ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్కే వెళ్తోందని నితీశ్ కుమార్ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
వాళ్లంతా నాకు టచ్లోనే ఉన్నారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్ పశుపతి పరాస్తో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్ జోస్యం చెప్పారు. నితీశ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి దివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్ పాశ్వాన్... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరాగ్తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్ సింగ్ (63)కు సైతం బిహార్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
లాక్డౌన్ను పొడిగించిన మరో రాష్ట్రం
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్డౌన్ను పాటిస్తున్నాయి. దీని వలన గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బిహర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 8 లాక్ డౌన్ను పొడిగిస్తున్నట్లు సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే, కొన్ని సడలింపులను కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం, తప్పనిసరిగా అవసరంముండే షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇతర దుకాణా సముదాయాలను మాత్రం రోజు విడిచి రోజు తెరుచుకోవాలని సూచించారు. కాగా, ఆదివారం మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో లాక్డౌన్ను పొడిగించాలనే డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ‘బాల సహయాత యోజన పథకం’ కింద నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని సీఎం నితిష్ కుమార్ ప్రకటించారు. దీనితో పాటుగా వారికి ఉచిత పాఠశాల విద్యతో పాటు ఆర్థిక సహయం కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ప్రధాని మోదీ ‘ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం’ కింద అనాథ పిల్లలకు తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
పట్నా: లోక్ జనశక్తి పార్టీని ఎన్డీయేలో కొనసాగించడంపై నిర్ణయం తీసుకునేది కూటమిలోని కీలక భాగస్వామి అయిన బీజేపీయేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితం కావడానికి ఎల్జేపీనే కారణమన్న వార్తలపై నితీశ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 71 స్థానాల్లో గెల్చడం తెల్సిందే. ఎన్డీయే మిత్రపక్షాలతో శుక్రవారం చర్చించి, ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తామని నితీశ్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగుస్తుందని, అందువల్ల ప్రమాణ స్వీకారానికి తమకు తగినంత సమయముందని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 లోపు ప్రమాణ స్వీకారం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల సీఎంగా పాలనలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశముందా? అన్న ప్రశ్నకు నితీశ్.. అలాంటిదే ఉండబోదని సమాధానమిచ్చారు. ‘నేరాలు, అవినీతి, మతతత్వం.. ఈ మూడింటి విషయంలో రాజీ ఉండదు. వాటి విషయంలో మా విధానంలో మార్పు ఉండదు. నేను సీఎం అయిన తరువాత బిహార్లో ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు’ అన్నారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో గెలుపొందడంపై స్పందిస్తూ.. ప్రజా తీర్పు అంతిమమని వ్యాఖ్యానించారు. ‘ఇవే నా చివరి ఎన్నికల’ని ప్రచార సమయంలో తాను చేసిన వ్యాఖ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీశ్కుమార్ తెలిపారు. ‘చివరి ఎన్నిక అంటే నా ఉద్దేశం చివరి ప్రచార సభ అని’ అని వివరణ ఇచ్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం!? బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి నితీశ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. పవిత్రమైన ‘భయ్యూ దూజ్’ పండుగ రోజైన సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి. -
ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత వెనుకబడిన ఎన్డీఏ కూటమి.. ప్రస్తుతం అధిక స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. అయితే, కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల వరకు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ ఎక్కువ స్థానాల్లో లీడింగ్లో ఉండటం.. ఎగ్జిట్ పోల్స్ కూడా వారికే జైకొట్టడంతో జేడీయూ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ నితీష్ తిరిగి అధికారంలోకి రాకపోతే.. దానికి ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులేనని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తాం. నితీష్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను కాదని ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే.. బిహార్ వెనుకబడిందనేది నిజమని ఒప్పుకున్నట్టే’అని త్యాగి పేర్కొన్నారు. వలసలు, వరదలు, కరోనా ఇలా వరుస సంక్షోభాలు నితీష్ ప్రభుత్వాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి సొంతంగా పోటీచేసిన ఎల్జేపీక చిరాగ్ పాశ్వాన్ తమకు నష్టం కలిగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. (బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
-
నితీష్ ఇంకెప్పుడూ సీఎం కాలేరు : చిరాగ్
పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్కు ఇదే చివరి ఎన్నికలని లోక్జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు. ‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు. బిహార్లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. -
పొగుడుతూనే చురకలంటించిన ప్రధాని
-
వ్యూహాత్మకంగా జేడియూ అభ్యర్థుల జాబితా
-
‘ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అవమానించినట్టే’
ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను అవమానించిన గుప్తేశ్వర్ పాండేకు జేడీయూ టికెట్ గనుక కేటాయిస్తే అది తమను మరింత బాధిస్తుందని తెలిపింది. బిహార్ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్గా ఉన్న ఫడ్నవీస్ ఆయనకు జేడీయూ టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించింది. లేదంటే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచినట్టు అవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, బిహార్లో వచ్చే నెలాఖరు నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభవుతున్నాయి. మూడు విడతల్లో.. అక్టోబర్ 28 న తొలి విడత, నవంబర్ 3 న రెండో విడత, నవంబర్ 7 న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం నితీష్ కుమార్ మరోసారి మిత్రపక్షం బీజేపీతో జట్టుకట్టారు. (చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు) టగ్ ఆఫ్ వార్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) ముంబైలోని తన నివాసంలో జూన్ 14న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కుమారుడి మృతి పట్ల సుశాంత్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ముంబై పోలీసులు దీనికి అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తును తామే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో తమకు ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేదని డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న గుప్తేశ్వర్ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్ని ఒప్పించి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇప్పించారు. (చదవండి: నితీష్ సమక్షంలో జేడీ(యూ)లో చేరిక) -
సీఎం వైఎస్ జగన్కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్ను ఫోన్లైన్లో కోరారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్కు చెందిన బీకే హరిప్రసాద్ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.(చదవండి : ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు) -
బిహార్ ప్రభుత్వం కీలక ప్రకటన!
పట్నా: రాష్ట్రం నుంచి వలసలను అరికట్టేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యం, పరిశ్రమలను మరింతగా అభివృద్ధి చేసి వలసలు అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ వేదికగా పలు విషయాలను వెల్లడించింది. ‘‘అధిక సంఖ్యలో ప్రజలకు ఇక్కడే ఉద్యోగం, ఉపాధి కల్పించాలనేదే మా ఆకాంక్ష. తద్వారా ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. వాణిజ్య- వ్యాపారాలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఉద్యోగాల కల్పన సులభతరంగా మారుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాం’’ అని సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసింది.(కరోనా: కాస్త ఊరటనిచ్చే కబురు! ) కాగా లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలు.. సొంత రాష్ట్రానికి చేరుకునే క్రమంలో పలువురు మృత్యువాత పడటం వంటి హృదయవిదారక ఘటనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ వలసలను అరికడతామంటూ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. ఇక వలస కార్మికుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏకంగా ‘మైగ్రేషన్ కమిషన్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వలస కార్మికులకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామన్న యోగి.. ఈ మేరకు పలు ఎంఓయూలు కుదుర్చుకుని స్థానికంగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. (25 రోజుల్లో 376 అంత్యక్రియలు! ) -
యూపీ ప్రభుత్వ తీరుపై బిహార్ సీఎం ఆగ్రహం
పట్నా : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వతీరుపై బిహార్ సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. రాజస్థాన్లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం పంపింది. అదే రీతిలో బిహార్కు చెందిన వలస కార్మికులను అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించకపోవడం అన్యాయం అని నితిష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'కోటాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత కుటుంబాలకు చెందిన వారు. చాలా మంది విద్యార్థులు కోటాలోనే వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వారిని అంత అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఏముంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా నిరాశ్రయులుగా ఉన్న బిహార్కు చెందిన వలస కార్మికుల విషయంలో ఎందుకు ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తున్నారు' అని నిప్పులు చెరిగారు. విద్యార్థులను లాక్డౌన్ సమయంలో తిరిగి రప్పించడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. మార్చిలో ఢిల్లీ నుంచి కార్మికులను తరలించడం కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇదే సమయంలో, ఎక్కడివారు అక్కడే ఉండి కరోనా వ్యాప్తి అరికట్టడానికి సహకరించాలని బిహార్కు చెందిన విద్యార్థులు, వలస కార్మికులకు ఉద్దేశించి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికుల రక్షణ కోసం బిహార్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు. -
సుశీల్కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్
పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. 'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్ కుమార్ ఇంతకుముందు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. దీంతోపాటు ప్రశాంత్ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ షేర్ చేసిన వీడియోలో సుశీల్ కుమార్ నితీశ్ కుమార్పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ మాట్లాడుతూ' నితీశ్ కుమార్ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్ డీఎన్ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్పై ట్విటర్లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. (విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్: సుశీల్ మోదీ) -
పార్టీ మారాలనుకుంటే మారవచ్చు: నితీశ్
పాట్నా: జేడీయూ సీనియర్ నేత పవన్ వర్మ ట్వీట్పై బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..తనకు ఇష్టమైన పార్టీలో పవన్ వర్మ చేరవచ్చని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు నితీశ్ తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తు విషయంలో నితిశ్ కుమార్ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుందని పవన్ వర్మ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ..ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయంలో నితిశ్ కుమార్ విముఖత వ్యక్తం చేశారని పవన్ వర్మ తెలిపారు. ఈ రకంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం ఏ మేరకు సమంజసమని.. పార్టీ మారాలనుకుంటే మారవచ్చని పవన్ వర్మను ఉద్దేశించి నితిశ్ కుమార్ వ్యంగ్యంగా విమర్శించారు. చదవండి: బదులు తీర్చుకున్న నితీశ్ -
‘క్యాబ్’పై పీకే వ్యతిరేకతకు కారణం ఇదే !
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టంపై జేడీయూ వైఖరితో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆర్జేడీ బిల్లును వ్యతిరేకించగా, మొదట్లో వ్యతిరేకించినా అనంతర పరిణామాలతో అధికార జేడీయూ రెండు సభల్లోనూ బిల్లుకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిలో మార్పు పట్ల జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్ణయాన్ని బహింరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ సమావేశంలో ముందుగా తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లారని పీకేతో పాటు రవివర్మ ప్రశ్నించగా, తాజాగా పార్టీ ఎంపీలు రాంచందర్ సింగ్ స్పందిస్తూ పార్టీలో నితీష్కుమార్ నిర్ణయమే ఫైనల్ అని నచ్చనివాళ్లు పార్టీని వదిలి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రాజీవ్ రంజన్ అధినేత తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామం పట్ల విశ్లేషకులు మరో భాష్యాన్ని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ భార్య అస్సామీ. ఈ బిల్లు వల్ల ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిల్లుకు మద్దతివ్వడంపై మరో కోణాన్ని తెలుపుతున్నారు. ఇటీవల బీహార్లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రతిపక్ష ఆర్జేడీకే పడ్డాయని, ఆర్జేడీ ముస్లింలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని నితీష్ పసిగట్టారు. వచ్చే ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునక్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తే అటు ముస్లింల ఓట్లు పడకపోగా, ఇటు బలమైన హిందూ ఓటు బ్యాంకు కూడా దూరమైపోతుందని నితీష్ గ్రహించారు. అందుకే యూటర్న్ తీసుకొని బిల్లుకు మద్దతిచ్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ దెబ్బతింటుందని నితీష్కు తెలుసు. అయినా కూడా బీహార్లో హిందూ ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో మద్దతిచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జేడీయూ సీనియర్ నాయకుడు నీరజ్కుమార్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు ఎంతో చేసినప్పటికీ వారి నుంచి మాకు పడే ఓట్ల శాతంలో పెద్ద తేడాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మాకు ఎవరి సలహా అక్కర్లేద’ని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్లో నితీశ్కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
బీజేపీతో జేడీయూ కటీఫ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి బీజేపీ, జేడీయూ విషయంలో మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో బిహార్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో కలిసి పోటీ చేసిన జేడీయూ, బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాయి. ఇదే మైత్రి ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా మారిన నితీశ్ వైఖరి ఎన్డీయేకు గుడ్బై చెప్పేందుకేనా అన్నట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ ఏర్పాటు నుంచి.. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మంత్రివర్గంలో జేడీయూకు ఒక్క మంత్రి పదవినే ఇవ్వజూపడం నుంచి నితీశ్కు అసంతృప్తి మొదలైంది. అనంతరం రాష్ట్ర కేబినెట్ విస్తరించిన సీఎం నితీశ్ బీజేపీకి కూడా ఒకే ఒక్క మంత్రిపదవి ఇవ్వజూపారు. అదేవిధంగా, తగిన మార్పులు చేయకుంటే ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటామని నితీశ్ అంటున్నారు. 370వ అధికరణ, రామాలయ నిర్మాణం వంటి అంశాల్లోనూ ఎన్డీయే వైఖరికి భిన్నంగా నితీశ్ మాట్లాడుతున్నారు. బీజేపీతో తమ మైత్రి కేవలం బిహార్కే పరిమితమని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతామని జేడీయూ నేతలు అంటున్నారు. ఎన్నికల విశ్లేషకుడు, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో కలిసి పని చేస్తామని ప్రకటించడమూ బీజేపీని ఇరుకున పెట్టడానికేనంటున్నారు. గొడవల్లేవంటున్న జేడీయూ: ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ఇచ్చిన ఇఫ్తార్ విందులో నితీశ్ పాల్గొనడంపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ తప్పుపడుతోంది. బీజేపీయే గిరిరాజ్తో ఈ పని చేయించిందంటోంది. అయితే, కమలనాథులతో విభేదాల్లేవని జేడీయూ అంటోంది. కీలక అంశాలపై ఎన్డీయే పక్షాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నామే తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదంటోంది. బీజేపీతో సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని నితీశ్ అంటున్నారు. సొంత ప్రయోజనాలే ముఖ్యం నితీశ్కు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, దానికోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు వెనుకాడరని విశ్లేషకులు అంటున్నారు. 2005లో బీజేపీతో కలిసి ఆయన బిహార్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కొంతకాలం బీజేపీతో ఆయన స్నేహం నడిచింది. అనంతరం ఎన్డీయేను వీడి 2014 లోక్సభ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడ్డారు. 2017లో తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ఉన్న 40 సీట్లలో 39 సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో బిహార్ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్పటి దాకా వారి మైత్రి కొనసాగేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు. -
‘ఆయన చేతిలో మోసపోని వారు ఎవరు లేరు’
పట్నా : బీజేపీ జాగ్రత్తగా ఉండాలని.. త్వరలోనే ఆ పార్టీకి ద్రోహం జరగబోతుందని హెచ్చరించారు రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ. ఈ క్రమంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ త్వరలోనే దోఖా నం. 2గా మారబోతున్నారు. ఆయన బీజేపీని మోసం చేస్తారు. ప్రజల ఆదేశాన్ని, కూటమి సభ్యులను మోసం చేయడం నితీష్ కుమార్కు కొత్తేం కాదు. నితీష్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సామెత బీజేపీకి వర్తిస్తుంది. త్వరలోనే అతను ఎన్డీఏ కూటమికి ద్రోహం చేస్తాడు’ అని ఉపేంద్ర కుష్వాహ హెచ్చరించారు. గతంలో మేం నితీష్ చేతిలో మోసపోయాం. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం అని తెలిపారు. -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్సభకు ఎన్నిక కావడం, ముజఫర్పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..
పట్నా/మీర్జాపూర్: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్ పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్నాదళ్దీ అదే దారి.. మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్లోని అప్నాదళ్ (ఎస్) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
అందరినీ ఆకట్టుకున్న నితీశ్!
లాలూ పాత మిత్రుడు, ప్రస్తుత రాజకీయ శత్రువు అయిన బిహార్ సీఎం నితీశ్కుమార్ బాగా వెనుకబడిన బీసీలు, దళితులను ఉద్ధరించే విధానాలు అమలు చేశారు. అదే సమయంలో లాలూ కాలంలో అధికార పీఠాలకు దూరమైన అగ్రవర్ణాల ఆదరాభిమానాలు కూడా ఆయన సంపాదించగలిగారు. ఆయన పార్టీ జేడీయూ ఆయనలా ఉత్సాహంతో పనిచేస్తుండగా, లాలూ పార్టీ నీరసించి ఉంది. లాలూ జైల్లో ఉండడంతో ఆయన కుటుంబంలో కలతలు పెరిగాయి. కొడుకులిద్దరి మధ్య సఖ్యత లేదు. పెద్ద కూతురికి చిన్న తమ్ముడు తేజస్వితో పడదు. ఈ పరిస్థితుల్లో కూడా మహాకూటమికి ఆర్జేడీ నాయకత్వం వహించడం సాధారణ విషయమేమీ కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జేడీ తన ఎన్నికల ప్రచారంలో కొత్త విషయాలుగాని, విజయాల గురించిగాని చెప్పడం లేదు. తొలి ఆరేడేళ్ల పాలనలో కింది కులాలకు గ్రామీణ ప్రాంతాల్లో మేలు ఎంతగా జరిగిందో పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. గ్రామీణ ప్రజలు కూడా గణనీయ సంఖ్యలో ఈ విషయాలు నిజమేనని అంగీకరిస్తూ లాలూ గురించి అభిమానంతో మాట్లాడుతున్నారు. అగ్రకులమైన భూమిహార్ల పొలాల్లో పనిచేయడానికి వెళ్లిన దళితుల దినసరి కూలీ చాలా తక్కువనీ, వారిని చెప్పులు వేసుకోనిచ్చేవారు కాదనీ, లాలూ సీఎంగా ఉండగా పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగైందని కొన్ని గ్రామాల్లో మహిళలు గుర్తుచేసుకుంటున్నారు. ఇద్దరు మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ్ మిశ్రాలకు ఒకే కేసులో శిక్షలు పడినాగాని, మిశ్రా బెయిలుపై తిరుగుతుండగా, లాలూను జైలుకే పరిమితం చేశారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిశ్రా అగ్రవర్ణ కుటుంబంలో పుట్టడం, లాలూ బీసీ కావడమే ఈ వివక్షకు కారణమని వారు చెబుతున్నారు. మొత్తంమీద లాలూ మీద ప్రజానీకంలో ఉన్న అభిమానం మహా కూటమిని ఏ మేరకు ఎన్నికల్లో ముందుకు నడిపిస్తుందో రాజకీయ విశ్లేషకులు అంచనావేయలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో సైతం మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కొని ఆర్జేడీ 20 శాతం వరకు ఓట్లు సాధించినా ఈసారి ఎలా తన ఉనికిని కాపాడుకుంటుందో చెప్పడం కష్టం. -
‘అలా చేస్తే.. నా కొడుకును సీఎంని చేస్తానన్నాడు’
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహఘట్బంధన్ తరఫున తనను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన కుమారుడు తేజస్వీని సీఎంని చేస్తానని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం కానీ.. మోదీ కానీ నితీశ్ కుమార్ను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు సరైన విలువ ఇవ్వలేదు. బీజేపీ బలవంతం మీదనే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారు. కానీ మళ్లీ ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు. అప్పుడాయన ‘2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీని సీఎంగా చూడాలనుకుంటున్నాను. అయితే అందుకు ఒక షరతు.. మహఘట్బంధన్ తరఫున నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2020లో తేజస్వీని సీఎం చేస్తాన’’ని చెప్పాడన్నారు. రబ్రీ దేవి మహఘట్బంధన్ గురించి మాట్లాడుతూ.. ‘మేం 400 స్థానాల్లో విజయం సాధిస్తాం. లాలూజీ ఇక్కడ లేరు కాబట్టి కేవలం 400 సీట్లు మాత్రమే గెలుస్తామని చెప్పగలుగుతున్నాను అన్నారు. అసలు లాలూజీ జైలులో ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. మంజూ వర్మ కేసులో కానీ.. దాణా కుంభకోణం కేసులో కానీ లాలూజీ తప్పేం లేదని స్పష్టం చేశారు. లాలూజీ పేదల గొంతుకగా నిలిచారు. అందుకు ఆయనకు కృతజ్ఞత తెలపాల్సింది పోయి.. కుంభకోణాలు చేశారని జనాలు ఆయనను విమర్శించడం దారుణమన్నారు. -
పోటీ పసందు ఎవరో బిహార్ బంధు
బిహార్లో ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలు అమలు చేస్తూ అవతలి వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈసారి ఎన్డీయే, యూపీఏ.. రెండే కూటములు బరిలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి బిహార్ సీఎం నితీశ్కుమార్ పరిపాలన, ప్రధాని మోదీ ఇమేజ్పై ఆధారపడితే, యూపీఏ కూటమి నితీశ్ కప్పదాటు వైఖరిని, కుల సమీకరణ లెక్కలనే అస్త్రాలుగా మార్చుకుంది. ‘ఇవాళ రేపు బిహార్లో మారుమూల పల్లెకు కూడా కరెంట్ ఉంది. ఇక లాంతర్ (లాలూప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ గుర్తు) అవసరం ఎవరికుంది?’ – బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సూటి ప్రశ్న ‘అందితే జుట్టు. అందకపోతే కాళ్లు. నితీశ్ కుమార్ విధానమే అది. కొన్నేళ్లుగా ఆయన బట్టలు మార్చినంత సులువుగా కూటముల్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో జత కట్టారో అసలు ఆయనకైనా తెలుసా?’’ – జైలు నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కౌంటర్. రంగులు మారిన రాజకీయం 2014 ఎన్నికల్లో బీజేపీ.. రామ్విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొంది. 40 లోక్సభ స్థానాల్లో 31 గెలుచుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేసి ఏడు స్థానాల్లో నెగ్గాయి. ఇక వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నితీశ్కుమార్ (జేడీయూ) రెండు స్థానాలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏడాదికే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటముల రంగు మారాయి. ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్ మహాగఠ్ బంధన్గా చేతులు కలిపాయి. బీజేపీ.. ఎల్జేపీ, ఆర్ఎస్ఎస్పీ, జేడీ (యూ)లో చీలిక వర్గమైన మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోచీ (సెక్యులర్) కలిసి పోటీ చేశాయి. యూపీఏ కూటమి మొత్తం 243 స్థానాలకు 178 సీట్లను గెలుచుకుంది. 41 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీయే కూటమి 34 శాతం ఓట్లతో 58 సీట్లు సాధించింది. నితీశ్కుమార్ ముఖ్యమంత్రిగా, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కానీ కూటమి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో జేడీ (యూ), ఆర్జేడీ మధ్య చిచ్చు ఏర్పడింది. ప్రభుత్వం కొనసాగలేకపోయింది. బీజేపీ మద్దతుతో మళ్లీ నితీశ్కుమార్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో మోదీని విమర్శించిన నితీశ్ ఈసారి కలిసి వేదిక పంచుకుంటూ కేంద్రం పాలనను ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నిచోట్లా ముఖాముఖీ పోటీ బిహార్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముఖాముఖి పోరాటమే నెలకొంది. ఎన్డీయే, మహాగఠ్ బంధన్ మధ్య పోరు నెలకొంది. ఎన్డీయే (బీజేపీ, జేడీ–యూ, ఎల్జేపీ)– మహాగఠ్ బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ) మధ్య 40 లోక్సభ స్థానాల్లో ముఖాముఖి పోరు నెలకొంది. వామపక్షాలు ఉనికి కోసం కొన్ని లోక్సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బెగూసరాయ్ మినహా మరెక్కడా కమ్యూనిస్టుల ప్రభావం లేదు. మహాగఠ్ బంధన్లో సీట్ల సర్దుబాటు కారణంగా ఆర్జేడీ ఈసారి 19 సీట్లలోనే పోటీ చేస్తోంది. ఇప్పటివరకు ఆర్జేడీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదు. కాంగ్రెస్కు తొమ్మిది సీట్లు కేటాయించడం ఆ కూటమికి మైనస్ కావచ్చని అంచనా. నితీశ్ వర్సెస్ తేజస్వి ఈసారి లోక్సభ ఎన్నికలు నితీశ్ కుమార్ వర్సెస్ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి మధ్య యుద్ధంలా మారాయి. నితీశ్కు ఓబీసీ వర్గాల్లో ఇప్పటికీ గట్టి పట్టుంది. ఇక లాలూ చిన్న కుమారుడు తేజస్వి చురుగ్గా పని చేస్తున్నారు. ఓబీసీ ఓటర్లలో యాదవులంతా ఇప్పటికే ఆర్జేడీకి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వారినీ తమ గూటికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుద్యోగం అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కాగా, ఈసారి సర్వేలన్నీ మోదీ ఇమేజ్, నితీశ్ పాలనకు బిహారీ జనం జైకొడతారని అంచనా వేస్తున్నాయి. కుల సమీకరణలు, రంగులు మారే రాజకీయాల కంటే దేశ భద్రత, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారుతాయని అంటున్నాయి. ఇక కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్ పాలనపై బిహార్లో 43 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సీఎస్డీఎస్–లోక్నీతి సర్వే చెబుతోంది. లాలూ లేని ఎన్నికలు దాణా కేసులో జైలు పాలైన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఆయన ఎన్నికల బరిలో ఉంటే, ప్రచారంలో పాల్గొంటే ఆ మజాయే వేరు. తన హాస్య చతురతతో ప్రత్యర్థి పార్టీలనూ నవ్విస్తారు. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్లో లాలూ ఉంటారని ఒకప్పుడు సరదాగా చెప్పిన ఆయన తాను ఎన్నికల బరిలో లేని లోటు తెలియకుండా జైలు నుంచి కూడా ప్రకటనలు ఇస్తున్నారు. మోదీ సభలకు వచ్చే జనాన్ని చూసి ‘నేనలా సరదాగా నడుచుకుంటూ పాన్ షాప్కే వెళితే నా చుట్టూ అంతమంది గుమిగూడతారు’ అంటూ సెటైర్లు వేశారు. ఓటర్లు లాలూని మిస్ అవుతున్నప్పటికీ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా మారుతున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు దేశ భద్రత బిహార్ ఎన్నికల్లో దేశ భద్రత అనేది కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరీ ఘటన తర్వాత పాక్పై సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్పై దాడులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ అణచివేయడం వంటి చర్యలపై ఓటర్లలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. పాక్ నక్కజిత్తుల్ని తిప్పికొడుతున్న మోదీకి మరో చాన్స్ ఇవ్వొచ్చని గయ పట్టణంలో అభిషేక్ కుమార్ అనే ఓటరు వ్యాఖ్యానించారు. అయితే సాసారాం నియోజకవర్గానికి చెందిన రవిదాస్ అనే ఓటరు మాత్రం ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఇలాంటివేవీ పనిచేయవని, కులాలే ఎన్నికల్ని శాసిస్తాయని అంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఏసీ గదుల్లో కూర్చునే వారు దేశ భద్రతపై లెక్చర్లు దంచుతారేమో కానీ సామాన్యులకు అవేవీ పట్టవని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశం కాబోతోంది. ఎందుకంటే బిహార్లో అగ్రవర్ణాలు 15 శాతం వరకు ఉన్నారు. వారంతా రిజర్వేషన్లపై హర్షం ప్రకటించారు. ఓబీసీ ఓటర్లపై ఆధారపడుతున్న యూపీఏ కూటమి దీనిని సమర్థంగా తిప్పికొట్టలేక పోతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేయడంలో విఫలమవుతోంది. నిరుద్యోగం, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రంలో ఈ రెండు అంశాలే ప్రచారాస్త్రం కానున్నాయి. యూపీఏ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ గత ఎన్నికల్లో బిహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు. దీనిపై యూపీఏ గట్టిగానే నిలదీస్తోంది. ఏ కూటమి వ్యూహాలేమిటి? యూపీఏ మేథమేటిక్స్ మహాగఠ్ బంధన్లో మొత్తం ఆరు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ.. ఇవన్నీ కుల సమీకరణలు, వాటి అంకెలు, లెక్కలపై ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగాయి. రాష్ట్ర జనాభాలో 17 నుంచి 18 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, ఆర్జేడీకి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక యాదవులు ఓట్లు 16 నుంచి 17 శాతం వరకు ఉంటాయి. సంప్రదాయంగా వాళ్ల మద్దతు ఆర్జేడీ వైపే. జనాభాలో 4 శాతం ఉన్న కొయిరి ఓటర్లు ఆర్ఎల్ఎస్పీ వైపే మొగ్గుతాయి. యూపీఏ కుల సమీకరణలకి ఇది ఊతమిచ్చేలా ఉంది. జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ కూడా యూపీఏలో భాగస్వామి కావడంతో దళిత ఓటర్లు యూపీఏ వైపు మొగ్గు చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ కుల సమీకరణలు కాకుండా అభివృద్ధి అంశంలో నితీశ్పై అస్త్రాలు సంధించడానికి ఏమీ లేక రోజుకొక కూటమి మార్చే ఊసరవెల్లిగానే నితీశ్ను యూపీఏ పక్షాలు ఏకి పారేస్తున్నాయి. ఇక బిహార్లో నిరుద్యోగం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను కూడా యూపీఏ ప్రచారంలో లేవనెత్తుతూ ఎన్డీయేని ఇరుకున పెట్టే వ్యూహాలను రచిస్తున్నాయి. ఎన్డీయే కెమిస్ట్రీ రాష్ట్రంలో కులసమీకరణలతో పాటుగా ఎన్డీయే అభివృద్ధి మంత్రాన్ని కూడా జపిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ, నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉజ్వల పథకం, టాయిలెట్ల నిర్మాణం వంటివి ప్రజల్లో ఆదరణ పొందాయి. ఇక బిహార్ అగ్రకులాల ఓట్లు 14 నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఇవి సాధారణంగా బీజేపీకే పడతాయి. ఇక కుర్మీ ఓట్లు 4–5 శాతం ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ ఓటర్లంతా ఆయన వెంట నడుస్తారు. గత లోక్సభ ఎన్నికల్లో జేడీ (యూ) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ కాదు. కానీ ఈసారి ఎన్డీయేతో చేతులు కలపడంతో కూటమి బలోపేతమైంది. ఇక రామ్విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్జనశక్తి పార్టీ శక్తిని తక్కువగా అంచనా వేయలేం. జనంలో కరిష్మా కలిగి, ఓటర్లను ప్రభావితం చేయడంలో జీతాన్ రామ్ మాంఝీ కంటే శక్తిమంతమైన నాయకుడు పాశ్వాన్. దీంతో దళిత ఓటర్లు చాలామంది ఎన్డీయే వైపు కూడా నడిచే అవకాశం ఉంది. ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశం. నితీశ్కుమార్ తరచూ కూటములు మారుస్తారన్న పేరైతే ఉంది కానీ, వెనుకబడిన బిహార్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్మిన నాయకుడు. అవినీతి, బంధుప్రీతి లేకుండా సుపరిపాలన అందించడంలో నితీశ్ది ప్రత్యేక స్థానం. మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వెలుగులు పూయించారు. రోడ్లు, తాగునీటి æ సౌకర్యాలు కల్పించారు. నేరాలను అదుపు చేశారు. అందుకే కులాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. మోదీ ఇమేజ్ కూడా కలిసి వచ్చి ఎన్డీయే జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. -
‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని చెప్పారు. తనకు ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని నితీష్ ప్రభుత్వాన్ని కోరారు. ‘రోజు హత్యలు, అల్లర్లతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఎవరు ఎవరినైనా చంపొచ్చు. నాకు ప్రాణ భయం ఉంది. రక్షణ కల్పించండి’అని మీడియా సమావేశంలో జేడీయూ ప్రభుత్వాన్ని కోరారు. సెక్యురిటీగా బాడీగార్డులు ఉన్నా ప్రాణలకు గ్యారంటీ లేదని అన్నారు. అంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి) ఇక మంగళవారం రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇందాల్ మృతికి కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం కొందరు నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు (13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, గత ఆదివారం బిహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని కాల్చిచంపడంతో పాటు నాలుగు బస్సులను తగులబెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ రాజధాని పట్నాలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. -
బిహార్లో ఎన్డీఏకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, రాష్ర్టీయ లోక్సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుష్వాహా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి గురువారం వైదొలగనున్నారని భావిస్తున్నారు. మంగళవారం ఆర్ఎల్ఎస్పీ నేతల చింతన్ శిబిర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోతిహరీలో జరిగే బహిరంగ సభలో బీజేపీతో దోస్తీకి స్వస్తి పలికే నిర్ణయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటిస్తారని చెబుతున్నారు. తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల అపాయింట్మెంట్ కోరినా లభించలేదని గత కొంతకాలంగా కుష్వాహా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారు తనకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలీదని, వారు అంత బిజీగా ఉంటే కనీసం ఫోన్ అయినా చేయవచ్చని గతంలో ఆర్ఎల్ఎస్పీ చీఫ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్పైనా కుష్వాహా గత నెలలో నిప్పులు చెరిగారు. నితీష్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేశారని ఆరోపించారు. కాగా, కుష్వాహా ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్తో కుష్వాహా భేటీ ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. -
బీజేపీ, జేడీయూల పొత్తు కుదిరింది
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీ, జేడీయూలు సమాన సంఖ్యలో అభ్యర్థులను నిలబెడతాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)లకు కూడా తగు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పాశ్వాన్, కుష్వాహ ఎన్డీఏలో కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూలకు 16 చొప్పున సీట్లు, ఎల్జేపీ 6, ఆర్ఎల్ఎస్పీకి 2 సీట్లు దక్కే అవకాశాలున్నట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. -
ఎయిమ్స్లో బిహార్ సీఎం నితీష్..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆయన ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నితీష్ కుమార్ మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఎయిమ్స్ ప్రైవేట్ వార్డులో చేరారని తెలిపాయి. జ్వరం, కన్ను, మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలపడంతో నితీష్ను ఎయిమ్స్కు తీసుకువచ్చారు. నితీష్ ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులు వెల్లడిస్తారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
థాంక్యూ నవీన్...సీఎంకు ప్రధాని ఫోన్
భువనేశ్వర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు కృతజ్ఞతలు తెలియ జేశారు. శుక్రవారం ఫోన్ ద్వారా ఈ ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఇటీవల ముగిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఈ ఇద్దరు నాయకులు ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. జనతా దళ్ (యు) అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆయనకు బిజూ జనతా దళ్ కూడా మద్దతు ఇచ్చింది. ఆయన విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనతా దళ్ (యు) అధినేత నితీష్కుమార్లు బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
షెల్టర్ షేమ్ : నితీష్ రాజీనామాకు రబ్రీ డిమాండ్
పట్నా : ముజఫర్పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ సీఎం రబ్రీ దేవి డిమాండ్ చేశారు. నితీష్ సీఎం పదవిలో కొనసాగినంత కాలం నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీబీఐ ప్రస్తుతం కేసును విచారిస్తున్నా ఇంతవరకూ పెద్ద తలకాయలు ఎవరూ పట్టుబడలేదని, నితీష్ అధికారంలో ఉంటే కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగుచూడవని తాము భావిస్తున్నామన్నారు. ముజఫర్పూర్ దారుణ ఘటనలో జేడీయూ, బీజేపీ నేతల హస్తం ఉందని నితీష్ అంతరాత్మకు తెలుసని రబ్రీ దేవి ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నిష్పాక్షిక విచారణపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ముజఫర్పూర్ ఘటన బిహార్తో పాటు నితీష్ ప్రతిష్టను మంటగలిపిందని అన్నారు. మహిళలు, బాలికలకు బిహార్ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ముజఫర్’ కేసులో మంత్రి రాజీనామా
ముజఫర్పూర్/పట్నా: బిహార్లోని ముజఫర్పూర్ వసతిగృహంలో బాలికలపై అత్యాచారాల ఉదంతంలో ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు బిహార్ సీఎంకు తన రాజీనామా లేఖ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిడిచే ఓ అనాథ శరణాలయంలో 34 మంది బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడటం తెల్సిందే. మంత్రి మంజు వర్మ భర్త చందేశ్వర్ వర్మ ఆ వసతిగృహానికి తరచూ వచ్చే వారంటూ ఓ నిందితుడి భార్య ఆరోపణలు చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మంజు వర్మపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ‘ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ మొబైల్ ఫోన్ను పోలీసులు పరీక్షించగా.. బ్రజేశ్తో మంత్రి భర్త 17 సార్లు మాట్లాడినట్లు తేలింది. ‘రాజకీయాలకు సంబంధించిన విషయాలు’ మాత్రమే మాట్లాడుకున్నట్లు బ్రజేశ్ వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంజు రాజీనామా చేసినట్లు సమాచారం.మంత్రి మంజు వర్మతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ తెలిపాడు. -
బాలికలపై అకృత్యాలు : బిహార్ మంత్రి రాజీనామా
పట్నా : దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ముజఫర్పూర్ షెల్టర్ హోం చిన్నారులపై జరిగిన అకృత్యాల ఘటనకు సంబంధించి బిహార్ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజూ వర్మ వెల్లడించారు. ముజఫర్పూర్ షెల్టర్ హోం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్తో మంజూ వర్మ భర్తకు సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. మంబయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను వెలుగులోకి తెచ్చాయి. హోంలో ఆశ్రయం పొందుతున్న 40 మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్టు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, షెల్టర్ హోంను బిహార్ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి షెల్టర్ హోంను అధికారులు సీజ్ చేశారు. -
హలో..నమస్తే..!
భువనేశ్వర్ : రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్తో ఎన్డీఏ వర్గాలు మంతనాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జేడీ(యు) అధినేత, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో ప్రత్యక్షంగా ఫోన్ సంప్రదింపులు జరిపారు. రాజ్య సభ సభ్యుడు పి.జె. కురియన్ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ముగియడంతో ఈ పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికలో జేడీ (యు) అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు హరివంశ నారాయణ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. ఈ తరుణంలో బీజేడీ కూడా అండగా నిలవాలని నితీష్ కుమార్ బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫోనులో సంప్రదింపులు జరిపినట్లు బీజేడీ పార్టీ అధికార ప్రతినిధి సుస్మిత్ పాత్రో తెలిపారు. నవీన్ పట్నాయక్దే తుది నిర్ణయం రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు విషయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్దే తుది నిర్ణయం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంప్రదింపులపట్ల నవీన్ పట్నాయక్ స్పందన స్పష్టం చేయలేదు. ఎన్నికకు ఒక రోజు ముందుగా బుధ వారం బిజూ జనతా దళ్ వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ప్రముఖుల సంప్రదింపులు జనతా దళ్ (యు) అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫోన్ సంప్రదింపులు జరిపిన కాసేపటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్పవార్ వంటి ప్రముఖులు నవీన్ పట్నాయక్తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్సీపీ అభ్యర్థి వందనా చవాన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేడీ మద్దతు ప్రకటించి సహకరించాలని ఎన్సీపీ అధినేత నవీన్ పట్నాయక్ను మంగళవారం ఫోన్ సంభాషణలో అభ్యర్థించారు. అంతు చిక్కని నవీన్ వైఖరి జాతీయ రాజకీయ వ్యవహారాల్లో బిజూ జనతా దళ్ అధ్యక్షుడి హోదాలో నవీన్ పట్నాయక్ వైఖరి ఊహాతీతం. ఆయన ఏ క్షణంలో ఏ నిర్ణయం ప్రకటిస్తారో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. జాతీయ రాజకీయాల్లో ఉభయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో సమాన దూరంలో ఉంటామని నవీన్ పట్నాయక్ తరచూ బహిరంగంగా ప్రకటిస్తుంటారు. కీలకమైన సందర్భాల్లో ఆచితూచి అడుగు వేసి ఔరా అనిపిస్తారు. లోగడ ఉపరాష్ట్రపతి ఎన్నిక పురస్కరించుకుని కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రతిపాదిత అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీకి బిజూ జనతా దళ్ మద్దతు ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎన్నికను పురస్కరించుకుని ఎన్డీఏ మద్దతు అభ్యర్థికి బీజేడీ మద్దతు అందించింది. తాజాగా జరగనున్న రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేడీ అనుకూలత ఎటు వైపు ఒరుగుతుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పి.ఎ.సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన బిజూ జనతా దళ్తో జనతాదళ్ (యు) మద్దతు ప్రకటించి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలో జనతా దళ్ (యు) అభ్యర్థికి బీజేడీ మద్దతు లభించే అవకాశం కూడా లేకపోలేదు. -
షెల్టర్ షేమ్పై స్పందించిన నితీష్ కుమార్
సాక్షి, పట్నా : ముజఫర్పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన క్రమంలో ఈ దారుణ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని నితీష్ వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని, పట్నా హైకోర్టు విచారణను పర్యవేక్షించాలని తాను కోరుకుంటున్నానన్నారు. ముజఫర్పూర్ ఘటనపై సుప్రీం కోర్టు బిహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపడం, ఈ ఉదంతంపై పార్లమెంట్, బిహార్ అసెంబ్లీల్లో తీవ్ర దుమారం రేగిన క్రమంలో నితీష్ ఈ దారుణ ఘటనపై నోరుమెదపడం గమనార్హం. ముజఫర్పూర్లోని బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు లైంగిక దాడులు జరిపారని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. వసతి గృహంలోని 34 మంది మైనర్ బాలికల్లో 29 మందిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఆరోపణల నేపథ్యంలో బాలికల వసతి గృహాన్ని బిహార్ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టింది. కాగా షెల్టర్ హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ సహా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
2019లో ఎన్డీయేతోనే జేడీయూ
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీచేస్తామనీ, ఎన్డీయే కూటమిలో కొనసాగుతామని జేడీయూ స్పష్టం చేసింది. ఆదివారం ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకం విషయంలో బీజేపీతో జేడీయూకు విభేదాలున్నాయన్న వాదనను ఆ పార్టీ నేతలు కొట్టిపారేశారు. సీట్ల సంఖ్య తర్వాత చూసుకుంటామనీ, వచ్చే ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసే పోటీ చేసి బిహార్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకం విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ తమ పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్కు ఉంటుందన్నారు. కాగా, కార్యవర్గ సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ అవినీతి, నేరాలు, మతవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు. బిహార్లో తమ పార్టీని ఓడించాలనుకునే వాళ్లే అపజయం పాలవుతారని ఆయన హెచ్చరించారు. మతవాద పార్టీగా ముద్ర ఉన్న బీజేపీతో జేడీయూ సంబంధాలు బలహీనపడ్డాయనీ, బీజేపీలోనూ నితీశ్కు శత్రువులున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో నితీశ్ చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యతేర్పడింది. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం కేంద్రం ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వం (సవరణ) బిల్లు–2016ను వ్యతిరేకిస్తూ జేడీయూ ఓ తీర్మానం చేసింది. అస్సాంలోని స్థానిక భాషలు, సంస్కృతికి ఈ బిల్లు ప్రమాదకరమని జేడీయూ పేర్కొంది. ఈ బిల్లుపై అస్సాం ప్రజల ఆందోళనలను తగ్గించేందుకు కృషి చేయాలని జేడీయూ కేంద్రాన్ని కోరింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి భారత్కు వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత్లో ఆరేళ్లు నివాసం ఉన్న తర్వాత వారికి పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. దీనివల్ల అస్సాం భాషలు, సంస్కృతికి ప్రమాదం ఏర్పడటంతోపాటు ఈశాన్య భారతంలో శాంతి, మత సామరస్యం దెబ్బతింటుందని జేడీయూ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బిహార్లో అల్లర్లకు పాల్పడిన వారిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కలవడం, హత్య కేసు దోషులను మరో కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పూలమాలలతో సత్కరించడాన్ని కూడా జేడీయూ తప్పుబట్టింది. -
‘ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా..?’
పట్నా : వచ్చే లోకసభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ-జేడీయూల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఫోన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో పాత స్నేహితుడిని మచ్చిక చేసుకునేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన తండ్రికి నితీశ్ కుమార్ ఫోన్ చేయడంపై లాలూ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి నితీశ్ ఫోన్ చేశారన్నారు. ఆ అధికారం వారికి లేదు.. ‘ఇది కేవలం ఒక కర్టెసీ కాల్ మాత్రమే.. అయినా ఆయనకు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్డీయే కూటమిలో నితీశ్ ఇమడలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మహా కూటమిలోకి తిరిగి వచ్చేందుకు ద్వారాలు తెరచిలేవంటూ’ తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ నితీశ్ బీజేపీతో బంధం తెంచుకున్నట్లయితే ఆయనను మహాకూటమిలో చేర్చుకునేందుకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తేజస్వీ కొట్టిపారేశారు. కూటమిలో ఎవరిని చేర్చుకోవాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం వారికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నానన్న తేజస్వీ.. కాంగ్రెస్- ఆర్జేడీ పొత్తు దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్ ప్రణాళికలపై తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు. కాగా విలేకరులతో మాట్లాడిన అనంతరం.. ‘నాన్న ఆస్పత్రిలో చేరిన నాలుగు నెలల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీయడం కోసం నితీశ్ జీ ఇప్పుడు ఫోన్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. బీజేపీ, ఎన్డీయే మంత్రుల తర్వాత నాన్నను పరామర్శించిన చివరి రాజకీయ నాయకుడు ఆయనేనని తెలుసుకున్నారేమో అందుకే ఇప్పుడు ఇలా..’ అంటూ తేజస్వీ ట్వీట్ చేశారు. Nothing but a late courtesy call to enquire abt his health as he underwent fistula operation on Sunday.Surprisingly NitishJi got to knw abt his ill health after 4months of hospitalisation.I hope he realises he is last politician to enquire following BJP/NDA Ministers visiting him https://t.co/lw7cNmXhDL — Tejashwi Yadav (@yadavtejashwi) June 26, 2018 -
‘యోగా డే ఓ పబ్లిక్ స్టంట్’
పట్నా : యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ, జేడీ(యూ)ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు సీఎం నితీశ్ కుమార్ హాజరుకాలేదు. యోగా డే ఒక పబ్లిసిటీ స్టంట్ అని గతంలో వ్యాఖ్యానించిన నితీశ్ కుమార్.. ఈరోజు(జూన్ 21) కూడా ఇంట్లోనే యోగా చేశారు. ఈ విషయమై జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... ‘ప్రతీ భారతీయుడు యోగా చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ మాటల్ని మేము గౌరవిస్తాం. అయినా జనాల మధ్య ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ కార్యకర్తలంతా రోజూ యోగా చేస్తారు. ఇందులో విశేషమేముంది’ అంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను ఆహ్వానించలేదు... పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, రామ్ కృపాల్ యాదవ్తో పాటు నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారని బీజేపీ నేత కృష్ణ కుమార్ రిషి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జేడీ(యూ) నేతలకు ఆహ్వానాలు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు. జేడీయూ నేతలకు ఆహ్వానాలు పంపకపోవడంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు స్పందిస్తూ.. ‘ఎన్డీయే కూటమిలో అసలేం బాగాలేదంటూ’ వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రతిపక్షం వ్యాఖ్యల్ని ఖండించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యోగా చేయడాన్ని ఇష్టపడతారు. యోగా దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని’ ఆయన హితవు పలికారు. -
ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్య
మోతిహరి(బిహార్) : ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. తూర్పు చంపారన్లోని మత్బన్వారీ చౌక్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన రాజేంద్ర సింగ్పై శత్రువులు ఇప్పటికే మూడుసార్లు దాడి చేశారు. ఈ విషయమై తనకు భద్రత పెంచాల్సిందిగా రాజేంద్ర సింగ్ పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు విఙ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్ ప్రాసెసింగ్లో ఉండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు... నితీశ్ కుమార్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శించింది. రాజేంద్ర సింగ్ హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేసింది. ఎన్డీయే కూటమి- నితీశ్ కుమార్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లు అర్థాంతరంగా తనువు చాలించాల్సి వస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత అలోక్ మెహతా ఆరోపించారు. కాగా పోలీసు, ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, గృహ, మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి పలు అంశాల గురించి ఎన్నో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో రాజేంద్ర సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన వెలుగులోకి తెచ్చిన కుంభకోణాలకు సంబంధించిన పలు కేసులు ప్రస్తుతం విచారణకు వచ్చిన నేపథ్యంలో హత్యకు గురికావడం గమనార్హం. -
మా నాయకుడు ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా
పాట్నా: యువనాయకుడు తేజస్వీ యాదవ్తో చర్చకు రావాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఆర్జేడీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. తమ నాయకుడు చదువుకోలేదని విమర్శించడం కాదు.. చర్చల్లో పాల్గొని మా నాయకుడిపై మాటల్లో గెలవాలని చాలెంజ్ చేశారు. ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో జోకిహాట్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ను విమర్శిస్తూ తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు బదులిస్తూ జేడియూ నేత... ‘తేజస్వీ పెద్దగా చదువుకోలేదు. అందుకే సరైన భాషను ఉపయోగించలేదు. ఆయన పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదు. కావున ఆయన నుంచి ఇంత కంటే మంచి భాషను అశించవద్దని ఎద్దేవా చేశారు’. దీనిపై స్పందించిన ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర జేడీయూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ‘మా నాయకుడుతో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడానికి మీరు, మీ నాయకుడు నితీశ్ కుమార్ సిద్దమా. చర్చల్లో మా నాయకుడు ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాలను నుంచి తప్పుకుంటా’ అని చాలెంజ్ చేశారు. చదువు ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. ప్రముఖ కవులు కాళీదాసు, తులసీదాసు కూడా పెద్దగా చదువుకోలేదని గుర్తు చేశారు. తన చాలెంజ్ను స్వీకరించి చర్చ వేదికను ఏర్పాటు చేయాలని జేడీయూ నేతలను కోరారు. -
ఇక నితీష్ కుమార్ పని అయిపోయింది..
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ నవమి రోజున బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో జరిగిన ఘర్షణలకు ముఖ్యమంత్రే కారణమని, ఇక నితీష్ కుమార్ పని అయిపోయిందని ఆయన అన్నారు. గడ్డి స్కాం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ను అనారోగ్యం కారణంగా పోలీసులు బుధవారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ఆసుపత్రి బయట లాలూ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంటలు పెట్టి మత ఘర్షణలను ప్రేరేపించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పని ఇక అయిపోయిందని విమర్శించారు. ఇది ఇలా ఉండగా శ్రీరామ నవమి పర్వదినం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ఎక్కువగా ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ-జేడీయూ కూటమి విఫలమైందని, బీజేపీ నాయకులు మత ఘర్షణలను ప్రోత్సాహిస్తూన్నారంటూ బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. -
స్కూలులోకి దూసుకెళ్లిన వాహనం: 9 మంది మృతి
పాట్నా : బీహార్లోని ముజఫర్పూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి స్కూలు బిల్డింగ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిపై స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
‘నితీష్ కోటా వ్యతిరేకి’
సాక్షి,పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అన్నారు. దళిత కోటాపై పాలక జేడీ(యూ) నేతలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లాలూ సమర్ధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి, మాజీ మంత్రి శ్యామ్ రజక్లు రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. ప్రమోషన్లలో కోటాను రద్దు చేశారని, ఎస్సీ,ఎస్ట్ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వీరు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడిందని విమర్శించారు. జేడీ(యూ) నేతల అభిప్రాయంతో లాలూ ప్రసాద్ ఏకీభవించారు. ఉదయ్, శ్యామ్ రజక్లు చెప్పింది నూరు శాతం నిజమని లాలూ సమర్ధించారు. దళితుల కోటాపై భిన్న పార్శ్వాల నుంచి దాడి జరుగుతోందని, దీనిపై జేడీ(యూ) చీఫ్ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని లాలూ అన్నారు. నితీష్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని తనకు తెలుసునన్నారు. మధ్యనిషేధం లోపభూయిష్టంగా మారిందని లాలూ ధ్వజమెత్తారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)రాయని డైరీ
ఉదయాన్నే ఫోన్ కాల్ ! ఫోన్ చేసిన మనిషి ‘సర్’ అనకుండానే స్ట్రయిట్గా పాయింట్లోకి వచ్చేశాడు. ‘‘ఓ ఫైవ్ అవర్స్ బయటికి రాకండి. సెక్యూరిటీ ప్రాబ్లమ్’’ అన్నాడు! ‘‘ఎవర్నువ్వు?’’ అని అడిగాను. పేరు చెప్పాడు. ‘‘పేరు కాదు, నువ్వేం చేస్తుంటావ్?’’ అన్నాను. ‘‘అడిషనల్ డీజీపీని సార్’’ అన్నాడు. ‘‘మరి నేనెందుకు బయటికి రాకూడదు?’’ అని అడిగాను. ‘‘మోదీజీ వస్తున్నారు సర్. డీజీపీ, ఎస్పీలు, డీఎస్పీలు, బిహార్ మిలటరీ, టాస్క్ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్., ఎస్టీఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. అంతా ఆయనతో ఉంటారు సర్. ఉండటానికి మీకెవరూ ఉండరు ’’ అన్నాడు. కాల్ కట్ చేశాను. వెంటనే లాలూ లైన్లోకి వచ్చాడు! ‘‘లాలూజీ చెప్పండీ..’’ అన్నాను. ‘‘ఆ.. నితీశ్జీ.. ఎలా ఉన్నారు?’’ అన్నాడు. బాగున్నాననీ చెప్పలేదు. బాగోలేననీ చెప్పలేదు. ఎలా ఉన్నానో అతడికి తెలీదా! ‘‘నూరేళ్ల పాట్నా యూనివర్సిటీ ఫంక్షన్కి మోదీ వస్తున్నాడని ఫ్లెక్సీలు పెట్టారు నితీశ్జీ. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు, ఓ మోస్తరు తలకాయలు.. ముప్పై ఐదు వరకు ఉన్నాయి. అందులో ఒక్క తలకాయ కూడా మీది లేదు. గమనించారా?’’ అని అడిగాడు. ‘‘లేనిదాన్ని ఏం గమనిస్తాం చెప్పండి లాలూజీ’’ అన్నాను. ‘‘పోనీ ఉన్నదాన్నైనా గమనించాలి కదా నితీశ్జీ. ఫ్లెక్సీలలో మీరు లేరు, మీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు’’ అన్నాడు. లాలూ లైన్లో ఉండగానే శత్రుఘ్న సిన్హా నుంచి కాల్! ‘‘శత్రూ.. కాల్ చేస్తున్నారు మిత్రమా..’’ అని లాలూతో అన్నాను. ‘‘నాకూ ఇక్కడో కాల్ వస్తోంది.. ఢిల్లీ నుంచి యశ్వంత్ సిన్హా ఫోన్ చేస్తున్నారు’’ అన్నాడు లాలూ. నలుగురం గ్రూప్ కాల్లోకి వచ్చాం. ‘‘నేను పాట్నా ఎంపీని అని మీకు తెలుసు కదా నితీశ్జీ’’ అన్నారు శత్రుఘ్న. ‘‘తెలుసు.. చెప్పండి’’ అన్నాను. ‘‘పోనీ, మీకు తెలిసి, మోదీకి తెలియదనే అనుకుందాం. పాట్నా యూనివర్శిటీ పాత స్టూడెంట్గానైనా నన్ను సెంటినరీ సెలబ్రేషన్స్కి పిలవొచ్చు కదా’’ అన్నారు ఆయన. ‘‘నేనూ పాత స్టూడెంట్నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నారు యశ్వంత్ సిన్హా. లాలూ పెద్దగా నవ్వాడు. ‘‘నేనూ పాట్నా స్టూడెంట్నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నాడు. అని, మళ్లీ పెద్దగా నవ్వాడు. ‘‘అంత నవ్వు ఎందుకొస్తోంది లాలూజీ’’ అన్నారు శత్రుఘ్న, యశ్వంత్ ఇద్దరూ కోపంగా. ‘‘ఫ్లెక్సీలో ప్లేస్ లేకపోవడం కన్నా.. ఇదేం పెద్ద ఇన్సల్ట్ కాదు కదా మిత్రులారా’’ అన్నాడు లాలూ. ఈ ఇన్సల్ట్ గురించి చెప్పడానికే సిన్హాలిద్దరినీ లాలూ.. గ్రూప్ కాల్లోకి తెప్పించి ఉంటాడని నా అనుమానం. -
అలా పనిచేయలేకే రాజీనామా చేశా: సీఎం
-
సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా
-
సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా
పట్నా: మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించనిరీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్భవన్కు వెళిన సీఎం నితీశ్ తన రాజీనామాను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అందజేశారు. నితీశ్కుమార్ రాజీనామాతో బిహార్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్కుమార్ అల్టిమేటం జారీచేశారు. ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో మొదటినుంచి బీజేపీ నితీశ్కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్కుమార్ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలుస్తోంది. -
మీసాలు రాకుండా మోసం చేయలేరా?
పట్నా: బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎలాంటి అవినీతికి ఆస్కారంలేని స్వచ్ఛమైన పాలనను అందిస్తానని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ను పదవి నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో మరో నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తేజస్వీ ప్రసాద్తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. 2005-06లో కుంభకోణం జరిగినప్పుడు తన కుమారుడికి 14 ఏళ్లని, అప్పుడు వాడి మూతిమీద మీసం కూడా మొలవలేదని, మీసం మొలవకుండా వాడెలా అవినీతికి పాల్పడతారని లాలూ ప్రసాద్ యాదవ్ నానా యాగి చేస్తున్నారు. తనకు మీసం మొలవని వయస్సులో తానెలా తప్పు చేస్తానని తేజస్వీ ప్రసాద్ కూడా సవాల్ చేస్తున్నారు. మీసం మొలవని వయస్సులో తప్పు చేయరా, చేసినా క్షమించి వదిలేయలా? వారి ఉద్దేశం ఏమిటీ? నిర్భయ కేసులో మైనరైన నిందితుడికి కూడా అప్పటికి మూతిమీద మీసం మొలవలేదు. అయినప్పటికీ అతన్ని ఉరితీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేశారు. చట్టం అందుకు అంగీకరించదు కనుక జువెనైల్ చట్టం కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ఇక్కడ ప్రధానంగా నేరం చేసిందీ తేజస్వీ ప్రసాద్ అన్న ఆరోపణకాదు. 2004 నుంచి 2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఒకరికి రైల్వే హోటల్ కాంట్రాక్టును అనుచితంగా ఇచ్చినందుకు 'క్విడ్ ప్రో' కింద తన కుమారుడు తేజస్వీ పేరిట పట్నాలో విలువైన ప్లాట్లను పొందారన్నది ఆరోపణ. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం లాలూ ప్రసాద్ 2005లో రైల్వే హోటల్ కాంట్రాక్టు ఒకరికి ఇచ్చారు. అందుకు బదులుగా 2006లో బినామీల కంపెనీ పేరిట కొన్ని విలువైన ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఆ ప్లాట్లు 2014లో తేజస్వీ ప్రసాద్ పేరిట బదిలీ అయ్యాయి. నాటి క్విడ్ ప్రో కిందనే ఈ ప్లాట్లు తేజస్వీకి అందాయా, ఆయన డబ్బులు పెట్టి మార్కెట్ ధరకు కొనుక్కున్నారా ? కొనుక్కుంటే 2015 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ ప్లాట్ల వివరాలు ఎందుకు పొందుపర్చలేదన్న ప్రశ్నలు అవినీతి ఆరోపణలకు ఆస్కారమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తేజస్వీ ఓ రాజకీయ నాయకుడిగా తన డిప్యూటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి విచారణను ఎదుర్కోవాల్సిందే. 'అమాయకుడిని, మూతి మీద మీసాలు రాలేదు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం' అంటూ మాయా మాటలు చెబితే మోసపోయేంత అమాయకులు కాదు నేటి ప్రజలు. -
యూనివర్సిటీలు, కాలేజీల్లో ఫ్రీ వైఫై
పట్నా: యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని బిహార్ ప్రభుత్వం ప్రారంభించింది. బిహార్ దివాస్ ఉత్సవాల్లో భాగంగా సీఎం నితీశ్ కుమార్ విద్యార్థులకు ఉచితంగా ఈ సౌకర్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఇచ్చిన ఏడు హామీల్లో ఉచిత వైపై కూడా ఒకటని ఆయన చెప్పారు. ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ అనేది జీవితంలో ఒక భాగమై పోయిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సీఎం సూచించారు.విద్యార్థులు ఉచిత వైఫై(ఇంటర్నెట్)ని సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కాకుండా, పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నితీశ్ సూచించారు. -
జేడీ(యూ) అధ్యక్షుడిగా నితీశ్కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ స్థానంలో ఆదివారం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో నితీశ్ మరోసారి జేడీయూను అధికారంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జేడీయూ అధ్యక్షుడయ్యారు. -
నితీశ్ ప్రమాణ స్వీకారానికి మమత
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు రానున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వచ్చే అవకాశముంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ, మహాకూటమి శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. ఈ నెల 20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం చేయనున్నారు. -
'మా పనితీరు నచ్చినవారు మాకే ఓటేస్తారు'
పాట్నా: ప్రభుత్వ పనితీరు నచ్చినవారు తమకే ఓటు వేస్తారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ అన్నారు. బుధవారం బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చిన నేపథ్యంలో నితీష్ స్పందించారు. అక్టోబరులో ఐదు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచడం పాత నిర్ణయమేనని, కొత్తగా తీసుకున్నది కాదని నితీష్ చెప్పారు. జనతా పరివార్ కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ వైదొలగడంపై స్పందిస్తూ.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్కు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కూటమి గెలుస్తుందనే నమ్మకముందని జేడీయూ నేత శరద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. -
నితీష్ కోటలో పాగా వేయాలని బిజెపి పంతం
-
కరెంటు లేకుంటే కాపురానికి రానే రాను...
పాట్నా: అత్తింటి ఆరళ్లకు తాళలేక మెట్టినిల్లు విడిచిపెట్టి పుట్టింటికి వచ్చే కోడళ్లను చూశాం. సులభ్ శానిటేషన్ చేపట్టిన సామాజిక ఉద్యమం కారణంగా మరుగు దొడ్లను నిర్మిస్తేగానీ అత్తింటిలో అడుగుపెట్టమంటూ శపథం చేస్తున్న నవతరం కోడళ్లను చూస్తున్నాం. కరెంటు కోతలున్నంతకాలం అత్తింటిలో అడుగుపెట్టనంటూ మొండికేసిన ఓ కోడలి ఉదంతాన్ని మొదటిసారి వింటున్నాం. దళిత యువతి రేణు పాశ్వాన్ మూడేళ్ల కింద పాట్నా జిల్లాలోని బార్ని గ్రామానికి చెందిన శశిభూషణ్ పాశ్వాన్ను పెళ్లి చేసుకొంది. ఎన్నో ఆశల పల్లకిలో అత్తింట్లో అడుగుపెట్టింది. పుట్టింట్లో పంకా గాలి కింద పడుకునే అలవాటున్న రేణుకు కరెంటు కోత ఎక్కువగా ఉన్న అత్తింట్లో ఉక్కపోతకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు పుట్టింటికి పారిపోదామా అని చూస్తున్న ఆమె తొలిచూలు పేరుమీద పుట్టింటికి వెళ్లింది. కొడుకు పుట్టాక కూడా అత్తింటికి రావడానికి నిరాకరించింది. భర్త, బంధువులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు. దాదాపు రోజుకు పది గంటల కరెంటు కోత ఉండే ఆ ఊళ్లో ఒక్కరోజు కూడా తాను ఉండలేనని చెప్పింది. పైగా అత్తింటికి సమీపంలోనే కోళ్ల ఫారం ఉందని, పరిసర ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో తానుండడం, తన కొడుకును పెంచడం కుదరనే కుదరని మొండికేసింది. తొలి కానుపు బిడ్డ ఫంక్షన్ అత్తింట్లో జరుపుకోవడం ఆచారమంటూ బతిలాడి బామాలి రేణును అత్తింటి వాళ్లు తీసుకెళ్లారు. ఫంక్షన్ స్తోమతమేరకు ఘనంగానే జరిపారు. భార్యాభర్తలు కూడా ఆనందంగానే గడిపారు. ఫంక్షన్కు సంబంధించిన కార్యక్రమాలు ముగియగానే రేణు తన కొడుకుతోసహా పుట్టింటికి తిరిగి చెక్కేసింది. ఈ విషయమై గత గురువారం ఇరు కుటుంబాల మధ్య మళ్లీ గొడవైంది. ఇక ఆమెకు నచ్చచెప్పడం సాధ్యంకాదని భావించిన భర్త శశిభూషణ్ సమీపంలోని ధనుర్వా పోలీసు స్టేషన్కెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్యాభర్తలు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి వాదనలు విన్నారు. సార్! ఒకప్పుడు మా ఊళ్లో కరెంటు ఎప్పుడొచ్చేదో, పోయేదో ఎవరికి తెలిసేది కాదు. ఇటీవలి కాలంలో కరెంటు పరిస్థితి బాగా మెరుగుపడింది. ఇప్పుడు పది, పదకొండు గంటలకు మించి కరెంటు పోవడం లేదు. రేణు తల్లిదండ్రులు నివసిస్తున్న పాట్నా శివారులోని మీఠాపూర్ ప్రాంతంలో మాత్రం కరెంటు పోవడం లేదా! మీరే న్యాయం చెప్పండి అంటూ పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. మా ఊళ్లో అంతసేపు కరెంటు పోదు. పోయినా త్వరగా వస్తుంది. ఆ ఊళ్లోలాగా గంటలు గంటలు పోనే పోదు. పైగా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవు. ఆక్కడ నా కొడుకు పెరగడం నాకిష్టం లేదు అంటూ రేణు తన వాదన వినిపించింది. చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఏమిటని భావించిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చ చెప్పేందుకు ఎంతో ఓపిగ్గా ప్రయత్నించి విఫలమయ్యారు. మీ తగాదా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రే తీర్చాలి. మావల్ల కాదు అంటూ పోలీసులు చేతులు దులుపుకున్నారు. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న బీహార్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చేందుకు గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు కరెంట్ కనెక్షన్లే లేవు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రామాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే ఓట్ల కోసం రానే రానంటూ నితీష్ కుమార్ శపథం చేసిన విషయం తెల్సిందే. -
జేడీయూ అభ్యర్థులకు మద్దతివ్వండి
రాజ్యసభ ఎన్నికల కోసం లాలూ సాయం కోరిన నితీశ్ పాట్నా: బీహార్లోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం జేడీయూ అగ్రనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సాయం కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐ మద్దతు కూడా ఆయన కోరారు. గత నెలలో బీహార్లో జితన్రాం మంజీ ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం నితీశ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకోసం 20 ఏళ్ల తర్వాత లాలూ సాయాన్ని అర్థించారు. మరోవైపు ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్లకు బీజేపీ, జేడీయూ అసమ్మతి వర్గం మద్దతిస్తున్నాయి. శనివారం పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో నితీశ్ మాట్లాడుతూ.. జితన్ రాం మంజీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బీహార్లో ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని అడ్డుకునేందుకు తాను లాలూను సాయం కోరినట్టు తెలిపారు. కాగా, నితీశ్ ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత సుశీల్మోడీ ఖండించారు. నితీశ్ రిమోట్తో నడుస్తున్న మంజీ ప్రభుత్వాన్ని కూలదోయడంపై తమకు ఎటువంటి ఆసక్తి లేదన్నారు. నితీశ్ తన ఇంటికీ తానే నిప్పు పెట్టుకుని బీజేపీని నిందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలపాటు ఎవరిపై పోరాటం చేశారో.. వారినే ఇప్పుడు సాయం అడుగుతున్నారని తప్పుపట్టారు. మరోవైపు నితీశ్ లాలూ సాయం కోరడాన్ని జేడీయూ అసమ్మతి నేత జ్ఞానేంద్ర సింగ్ తీవ్రంగా ఆక్షేపించారు. 2010 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఇది తూట్లు పొడవటమే అన్నారు. -
నితీశ్ రాజీనామా
బీహార్ సీఎం పదవి నుంచి తప్పుకున్న జేడీయూ నేత లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికినైతిక బాధ్యతగానే... కొత్త ప్రభుత్వాన్ని తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని వెల్లడి పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీశ్ సహా ఆయన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ డీవై పాటిల్ ఆమోదించారని, తదుపరి మంత్రివర్గం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నితీశ్కుమార్ను కోరారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీని రద్దు చేయాలంటూ గవర్నర్కు నితీశ్కుమార్ సిఫారసు చేయకపోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ‘లోక్సభ ఎన్నికల్లో జేడీయూ మెరుగైన ఫలితాలను సాధించలేదు. ఎన్నికల ప్రచారానికి నేనే నేతృత్వం వహించాను. ప్రజా తీర్పును శిరసావహించాలి కనుక ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత తీసుకోవాల్సింది నేనే. అందుకే రాజీనామా చేస్తున్నాను’ అని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడవు 2015 నవంబరు వరకు ఉంది. అసెంబ్లీ రద్దుకు ఎందుకు సిఫారసు చేయలేదన్న ప్రశ్నకు.. అసెంబ్లీ ఐదేళ్లపాటు కొనసాగాల్సి ఉందని, దాన్ని గందరగోళపర్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కొత్త నేతను ఎన్నుకునేందుకు ఆదివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుందన్నారు. మళ్లీ మిమ్మల్నే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు.. పార్టీ నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు. అయితే, నితీశ్ను కాకుండా మరో కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా బీహార్లో జేడీయూ ఆధ్వర్యంలో కొత్త సర్కారు ఏర్పడనుందని, సీఎం అభ్యర్థిని ఆదివారం ప్రకటిస్తామని పార్టీ చీఫ్ శరద్యాదవ్ చెప్పారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్తో విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఆ పార్టీతో కలిసి లౌకిక కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో జేడీయూకి 115, ఆర్జేడీకి 21, బీజేపీకి 89 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూకి నలుగురు సభ్యులున్న కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక సీపీఐ ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు. తాజా లోక్సభ ఫలితాల్లో జేడీయూ రెండు సీట్లలో మాత్రమే గెలుపొందగలిగింది. బీజేపీకి దూరం కావడంపై విమర్శలు: గత సంవత్సరం వరకు బీజేపీతో జతకట్టిన జేడీయూ.. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి దూరమైంది. ఆ నిర్ణయంపై ఇప్పుడు పార్టీలో నితీశ్పై అసమ్మతి తీవ్రమైందని వార్తలు వస్తున్నాయి. 50 మంది ఎమ్మెల్యేలు నితీశ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, లోక్సభ ఎన్నికల్లోనూ వారు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని.. మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోడీ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ స్పందించారు. ‘నేను రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. -
'ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా'
-
ఏ రాష్ట్రంలో ఏదీ కీలకం
ఈ నెల 24న ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ.. సార్వత్రిక పర్వంలో ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 24న ఆరో విడతలో దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 117 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పలు విడతల పోలింగ్ జరుగుతున్న పెద్ద రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 12 రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న కీలకాంశాలపై విహంగ వీక్షణం... ఎలక్షన్ సెల్: అస్సాం చొరబాట్లు... వేర్పాటు నినాదాలు... భద్రత, బంగ్లా నుంచి చొరబాట్లు, అభివృద్ధి ఇక్కడి ఎన్నికల్లో కీలకాంశాలుగా ఉన్నాయి. అస్సాంలో విపక్షాలైన బీజేపీ, ఏజీపీలు బంగ్లా చొరబాట్లను ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేయాలని, వేధింపుల పాలైన బంగ్లా బాధితులకు శరణార్థుల హోదా కల్పించాలని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి శంతన్ భరాలీ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లా చొరబాట్లకు వ్యతిరేకంగా 1985లో పార్టీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగిన ఏజీపీ కూడా ఈ ఎన్నికల్లో మళ్లీ అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని జనంలోకి వెళుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కూడా ఏజీపీ ప్రచార కార్యదర్శి మనోజ్ సైకియా డిమాండ్ చేస్తున్నారు. అలాగే, అస్సాంలో ఎన్నికల సందర్భంగా వేర్పాటు నినాదాలూ బలంగానే వినిపిస్తున్నాయి. బీహార్ - ప్రత్యేక హోదా.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. వెనుకబాటుతనాన్ని అధిగమించాలంటే, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఓటర్లకు చెబుతున్నారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో తన ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కూడా ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. దాణా కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సైతం ఈ ఎన్నికల్లో ‘అభివృద్ధి’ మంత్రంతోనే ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. బీహార్కు యూపీఏ సర్కారు ఉదారంగా నిధులు విడుదల చేయడం వల్లే అభివృద్ధి సాధ్యమైందంటూ కాంగ్రెస్ ఊదరగొడుతోంది. అధికారంలోకి వస్తే, బీహార్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే, బీజేపీ మేనిఫెస్టోను నితీశ్ ఒక ప్రహసనంగా కొట్టి పారేస్తున్నారు. ఉత్తరప్రదేశ్- కులాలు మతాలు.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ గెలుపొందాలన్నా కుల మతాలనే నమ్ముకోక గత్యంతరం లేని పరిస్థితి. వారణాసి నుంచి తలపడుతున్న తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావంతో హిందువుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలమని బీజేపీ ఆశిస్తుంటే, మైనారిటీల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటోంది. ముస్లింల ఓట్లన్నీ కాంగ్రెస్కు పడేలా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల జామా మసీదు ఇమామ్ బుఖారీని స్వయంగా కలుసుకుని మరీ విజ్ఞప్తి చేశారు. అవినీతి కంటే లౌకికవాదానికి వాటిల్లబోయే ముప్పే ప్రధాన సమస్య అని, అందుకే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని బుఖారీ ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీలు సైతం లౌకికవాదానికి బాసటగా తమకు ఓటు వేయాలని కోరుతున్నాయి. మరోవైపు, జాట్ కులస్తులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి మోడీ అనుచరుడు అమిత్ షా ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని చవిచూశారు. కాగా, యూపీ పశ్చిమ ప్రాంతంలోని 26 జిల్లాలతో ‘హరితప్రదేశ్’ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరెల్డీ అధినేత అజిత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు- శ్రీలంక తమిళులు.. తమిళనాడులోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీల్లో మూడు శ్రీలంక తమిళుల సమస్యనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. శ్రీలంక యుద్ధనేరాలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరవడాన్ని తమిళనాడు సీఎం జయలలిత తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా యూపీఏ వైఖరిని దుయ్యబట్టింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళుల మనోభావాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ సైతం విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఒకే ఒక్క సీటున్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ అన్ని పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. ఏఐఏడీఎంకే, డీఎంకే, ఏఐఎన్ఆర్సీ, సీపీఐ తదితర పార్టీలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓట్లడుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి జపం.. జమ్మూ కాశ్మీర్లో చిరకాలంగా పరిష్కారం కాని సమస్యలు చాలానే ఉన్నా, ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీలూ ‘అభివృద్ధి’ మంత్రంతోనే ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన ఎన్సీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, పీడీపీ... ఈ మేరకు ఓటర్లకు హామీని స్తున్నాయి. మోడీ ప్రభావంతో బీజేపీ కాస్త బలం పుంజు కున్నా, ఎన్సీ-కాంగ్రెస్ కూట మిని అధిగమించే సూచనలైతే కనిపించడం లేదు. పీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మోడీకి మద్దతుపై ప్రస్తుతానికి తటపటాయిస్తున్నా, ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. వాజ్పేయి పాలనను స్వర్ణయుగంగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ అభివర్ణిస్తుండటమే దీనికి సూచన. నిర్ణయాత్మకమైన స్థానాల్లో తమను గెలిపిస్తే, ‘కాశ్మీర్’ సమస్యను 3 నెలల్లోగా పరిష్కరిస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. కాశ్మీర్లో ఈసారి మతం ప్రస్తావన పెద్దగా వినిపించకపోవడం విశేషం. మధ్యప్రదేశ్ అవినీతి.. అరాచకం.. అభివృద్ధి.. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సాధించిన ‘అభివృద్ధి’ని బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటుండగా, గనుల అక్రమ తవ్వకాలు, కేంద్ర పథకాల అమలులో చోటు చేసుకున్న అవినీతిని, మావోయిస్టుల అరాచకాన్ని అదుపు చేయడంలో చౌహాన్ సర్కారు వైఫల్యాన్ని కాంగ్రెస్ ఎండగడుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మావోయిస్టుల దాడిలో సీనియర్ నేతలను కోల్పోయిన కాంగ్రెస్, సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ, విజయోత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ ఫలితాలు తమకే అనుకూలిస్తాయన్న నమ్మకంతో ఉంది. అందుకు మోడీ ప్రభావం కూడా దోహదపడగలదనే ధీమా కూడా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్ కాషాయం.. గోసంరక్షణ గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్ సర్కారుకు నేతృత్వం వహించిన అశోక్ గెహ్లాట్ అభివృద్ధి మంత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డీలాపడ్డాయి. ఒకవైపు కాంగ్రెస్ అభివృద్ధి, లౌకికవాదాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోగా, బీజేపీ ఈసారి గోసంరక్షణను ప్రధాన ప్రచారాస్త్రంగా జనం ముందుకు వెళుతోంది. గోసంరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. రాజస్థాన్తో పాటు హర్యానా, యూపీ పశ్చిమ ప్రాంతంలోనూ దీన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుంటామని రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభులాల్ సైనీ చెబుతున్నారు. యూపీఏ సర్కారు పెద్ద ఎత్తున మాంసం ఎ గుమతులకు అనుమతులు ఇస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. జార్ఖండ్ లౌకికవాదం, అభివృద్ధి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి, లౌకికవాదాలే జార్ఖండ్లో కీలకాంశాలుగా మారాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలు ఈ అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. జేఎంఎం-కాంగ్రెస్లు ఏకమై బీజేపీని నిలువరించేందుకు లౌకికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా గల జార్ఖండ్లో శాంతిభద్రతలు కీలక సమస్యే అయినా, ప్రధాన పార్టీలేవీ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు. జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అవినీతిమయమైందని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, లోక్సభ ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే జార్ఖండ్లో ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెబుతోంది. పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ అండ్ రైట్ ఒకప్పటి ‘ఎర్ర’కోటలో సమస్యలు లేకపోలేదు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో నెలకొన్న సమస్యల కంటే నేతల నడుమ పరస్పర విమర్శలే హోరెత్తిస్తున్నాయి. గత వైభవం కోసం వామపక్షాలు పాకులాడుతుండగా, మోడీ ప్రభావంతోనైనా బెంగాల్లో కాషాయ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. యూపీఏతో తెగతెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇటు వామపక్షాలపైనా, అటు బీజేపీపైనా తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీ ‘మతతత్వ’ రాజకీయాలను ఎండగడుతున్నారు. బరిలో ఒంటరిగా మిగిలిన కాంగ్రెస్ ఉనికి నిలుపుకొనే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. బెంగాల్పై మోడీ ప్రభావం చూపగలిగితే, వామపక్షాలు తిరిగి బలం పుంజుకోగలవని భావిస్తున్నారు. అయితే, తృణమూల్ అత్యధిక స్థానాలను గెలుచుకుని, జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత మూడో పెద్ద పార్టీ అవ్వొచ్చని సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో కొన్నేళ్లుగా సాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపరకు కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలే కారణమని బీజేపీ దుయ్యబడుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఇలాంటి దుస్థితి వాటిల్లిందని పలు ఎన్నికల సభల్లో మోడీ విమర్శించారు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే సైతం రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్, ఎన్సీపీలే బాధ్యత వహించాలంటూ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలకు ఓటు వేయవద్దంటూ ఒక రైతు రాసిపెట్టిన సూసైడ్ నోట్ను ఆయన ఎన్నికల ప్రచార సభల్లో చదివి వినిపిస్తున్నారు. అయితే, రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని సోనియా చెప్పుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో ప్రతి ఎన్నికల్లోనూ మావోయిస్టులే అసలు సమస్య. ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఎన్నికలకు ముందు దాడులు జరపడం ఈ రాష్ట్రంలోని మావోయిస్టులకు మామూలే. మావోయిస్టుల సమస్యకు సంబంధించి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న విజయోత్సాహం బీజేపీకి సానుకూలాంశం కాగా, రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించుకోవడం కాంగ్రెస్కు విషమ పరీక్షే. అయితే, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సర్కారు సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదని, ముఖ్యంగా గిరిజనులను పూర్తిగా గాలికొదిలేసిందని కాంగ్రెస్ విమర్శలు కురిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన ప్రాంతాల్లో వెనుకబడటాన్ని గుర్తుచేస్తోంది. -
అక్కడ మోడీదే హవా
-
జగన్ చెబుతున్నది మూడో ఫ్రంట్ కంటే ముఖ్యం
బీహార్ సీఎం నితీశ్కుమార్; పాట్నాలో జగన్కు ఘన స్వాగతం పాట్నా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చిన్నవాడైనా సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన బలమైన వాదనను తెర మీదకు తెచ్చారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కితాబిచ్చారు. మూడో ఫ్రంట్ కంటే జగన్ తెర మీదకు తెచ్చిన అంశం ముఖ్యమైందని, తీవ్రమైందని చెప్పారు. సాధారణ మెజారిటీతో రాష్ట్రాలు విభజించే విధానం గురించి దేశమంతా తీవ్రంగా ఆలోచించాల్సిందేనన్నారు. శుక్రవారం సాయంత్రం జగన్ తనను కలిసి వెళ్లిపోయిన తర్వాత నితీశ్కుమార్ కాసేపు విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడారు. తనకు వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ మరణించినప్పుడు బీహార్లో రెండురోజులు సంతాప దినాలుగా పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ పక్షాన ఉన్నారని, ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ.. తనకున్న సమాచారాన్ని విలేకరుల ముందుంచారు. మూడో ఫ్రంట్ గురించి ఎన్నికల తర్వాత చర్చించాలని, ఇప్పుడు సమయం కాదని చెప్పారు. జగన్ను రాష్ట్ర అతిథిగా పరిగణించిన బీహార్ సర్కార్ నితీశ్తో భేటీ కావడానికి వచ్చిన జగన్కు పాట్నా విమానాశ్రయంలో బీహార్ అధికార పార్టీ జేడీ(యూ) ఎంపీ అలీ అన్వర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఘన స్వాగతం పలికింది. బీహార్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర అతిథి (స్టేట్ గెస్ట్)గా పరిగణించింది. ఈమేరకు అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించింది. మరోవైపు జగన్ను స్వాగతిస్తూ పాట్నా తెలుగు అసోసియేషన్ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. దాదాపు 200 మంది తెలుగువారు విమానాశ్రయంలో జగన్కు పుష్పగుచ్ఛాలందజేశారు. జై సమైక్యాంధ్ర, జైజగన్ అంటూ నినాదాలు చేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నమే జగన్ ఇక్కడికి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో సాయంత్రం 6.30 గంటలకు వచ్చారు. తెలుగువారంతా ఆయన వచ్చేవరకు విమానాశ్రయంలో నిరీక్షించారు. స్వాగతం పలికినవారిలో వాసు, గౌరు సుబ్బారెడ్డి, రాజు, వెంకటరెడ్డి, సుధ తదితరులు ఉన్నారు. నితీశ్తో భేటీ తర్వాత విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే జగన్ విమానాశ్రయానికి వెళ్లిపోయారు. నితీశ్ జగన్కు కారు వద్దకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. జగన్ అంతకుముందు తన నివాసానికి చేరుకున్నప్పుడు కూడా కారు వద్దకు ఎదురొచ్చి మరీ బీహార్ సీఎం స్వాగతం పలికారు. -
రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్
రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో గురువారమిక్కడ జగన్ సమావేశమై సమైక్యాంధ్రకు మద్దుతు ఇవ్వాల్సిందిగా కోరారు. జగన్ విన్నపానికి నితీష్ సానుకూలంగా స్పందించారు. ఆయనతో చర్చించిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. తమకు మద్దతు ఇచ్చినందుకు నితీష్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలనుకున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఇదే రోజు అంతకుముందు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్లను కలసి మద్దతు కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ ఇటీవల జాతీయ నాయకులతో సమావేశమై మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.