passangers
-
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
‘వాటే లాజిక్ .. వాటే లాజిక్’.. ఇండిగో!
ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్విచ్లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ను ఆర్డర్ పెట్టుకుంది. ఆ శాండ్ విచ్ను తినడకుండా అలాగే జర్నీ చేసింది. Got a screw in my sandwich byu/MacaroonIll3601 inbangalore సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్లో ఆర్డర్ పెట్టిన శాండ్విచ్లో బోల్ట్ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్ విచ్ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్ విచ్లో బోల్ట్ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. -
ఆ యాపిల్ వాచ్ లేకపోతే ఆ ప్రయాణికుడి ప్రాణం గాల్లోనే..!
యాపిల్ వాచ్లో ఉండే ఆధునిక టెక్నాలజీతో ఎందరో ప్రాణాలను రక్షించుకున్నారు. దీనిలో ఉండే క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైన ప్రమాదం ఎదురైతే అందులో సేవ్ చేసిన సన్నిహితుల మొబైల్కి అలర్ట్ మెసేజ్ ఇవ్వడమే గాక లోకేషన్ని కూడా షేర్ చేస్తుంది. ఈ ఒక్క ఫీచర్తో అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న ఎందరో ప్రాణాలను రక్షించుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆ యాపిల్ వాచ్లోని హెల్త్కి సంబంధించిన సరికొత్త ఫీచర్ సాయంతో ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించాడు ఓ డాక్టర్. అసలేం జరిగిందంటే..'రోజుకి ఒక యాపిల్ తింట్ డాక్టర్ని కలవాల్సిన పని ఉండదు" అన్నది పాత సామెత. మీ వద్ద యాపిల్ వాచ్ ఉంటే మీ ప్రాణాలు సేఫ్లో ఉన్నట్లే అనేది నేటి సామెత కాబోలు. ఏంటీది అనుకోకండి... ఎందుకంటే..ఆ యాపిల్ వాచే ప్రాణాపయా స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించింది. ఈ ఘటన ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ నుంచి ఇటలీలోని వెరోనాకు వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో చోటు చేసుకుంది. ఇగ్లాండ్లోని హియర్ఫోర్డ్ కౌంటీ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న 43 ఏళ్ల వైద్యుడు ఆ ఉదంతాన్ని వివరించాడు. తాను సరిగ్గా జనవరి 9న ఇంగ్లాండ్ నుంచి ఇటలీలోని వెరోనాకు ర్యాన్ ఎయిర్ విమానంలో బయలుదేరుతున్నప్పుడూ ఈ అనూహ్య ఘటన చేసుకుందన్నారు. ఓ 70 ఏళ్ల మహిళ సడెన్గా ఊపిరీ పీల్చుకోవడంలో ఇబ్బందుపడుతుంది. దీంతో వెంటనే విమానంలోని సిబ్బంది అప్రమత్తమై ఈ విమానంలో ఎవరైన డాక్టర్ ఉన్నారా? అని అడిగాడు. దీంతో తాను వెంటనే స్పందించినట్లు రియాజ్ తెలిపారు. ఆ తర్వాత తాను ఆ మహిళ పరిస్థితి చూడటమే గాక ఆమె గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగిగా గుర్తించాను. వెంటనే అక్కడే ఉన్న ఫ్లైట్ అటెండ్ యాపిల్ వాచ్ని అడిగి తీసుకున్నారు రియాజ్. ఆ వాచ్లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఫీచర్ సాయంతో ఆ మహిళ శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానంలో ఆక్సిజన్ సిలిండర్ ఉందా? అని విమాన సిబ్బందిని అడిగి దాన్ని వెంటనే ఆమెకు అమర్చడం జరిగింది. ఇటలీలో దిగే వరకు ఆ ఆక్సిజన్ సాయంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు రియాజ్. విమానం ఇటలీలో ల్యాండ్ అవ్వగానే ఆమె తక్షణ వైద్య సాయం అందించింది విమాన సిబ్బంది. ఆ మహిళ కూడా వెంటనే కోలుకోవడమే గాక ఆమె ప్రాణాపయ స్థితి నుంచి బయటపడిందన్నారు రియాజ్. ఒక రకంగా తనకు ఈ యాపిల్ గాడ్జెట్ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలనేది తెలిసిందన్నారు. అలాగే ఈ రోజుల్లో ఇలాంటి ప్రాథమిక గాడ్జెట్లతో ఇలాంటి అత్యవరసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాలను రక్షించడానికి దాన్ని ఎలా వినియోగించుకోవాలనే ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందన్నారు రియాజ్. అరువు తెచ్చుకున్న యాపిల్వాచ్లోని ఈ ఫిచర్ ఒకరి ప్రాణాలను కాపాడిందన్నారు. ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఓ రోగి ప్రాణం కాపాడటంలో అద్భుతమైన సహయకారిగా ఉపయోగిపడిందన్నారు రియాజ్. అయితే యాపిల్ కంపెనీ ఈ యాప్ విషయంలో మెడికల్ టెక్నాలజీ కంపెనీ అయిన మాసిమ్తో పేటెంట్ వివాదం ఎదుర్కొంటోంది. దీంతో యాపిల్ కంపెనీ తమ సీరిస్ 9 అల్ట్రా2 ఆపిల్ వాచ్లో బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉండదని గతవారమే వెల్లడించింది కూడా. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! అదికూడా..
విమానంలో వెళ్తున్నప్పుడూ మనం మాత్రమే ఉండి మిగతా ప్రయాణికులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది కదు. అందులోనూ విమానంలో అలా జరిగితే మాములుగా అనిపించదు. అదికూడా కేవలం మన కోసమే ఏదో కారు బుక్ చేసుకున్నట్లు విమానంలో వెళ్తున్నామా! అనిపిస్తుంది. అదికూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే తెలిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా! అలాంటి ఘటనే ఇక్కడ స్విట్జర్లాండ్కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..సీషెల్స్ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్తున్న ఎమిరేట్స్ మిమానంలో ఇద్దరే ప్రయాణికులు. 25 ఏళ్ల జో డోయల్, ఆమె తల్లి 59 ఏళ్ల కిమ్మీ చెడెల్ మాత్రమే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వారిద్దరు ఎకనామీ క్లాస్ క్యాబిన్లో ఉన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేంతవరకు తామిద్దరమే ప్రయాణికులని వారివురికి తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లికూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే బిజినెస్ క్లాస్లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గానీ వాళ్లు ప్రయాణిస్తున్న ఎకనామీ క్లాస్లో మాత్రం లేరు. తాము మాత్రమే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నామని తెలిసి ఆనందంగా ఆ విమానంలో ఉన్న ఫ్లైట్ అటెండెంట్లతో చాట్ చేస్తూ గడిపామని టిక్టాక్లో వెల్లడించింది జో డోయల్. "ఈ రోజు ఎమిరేట్స్ విమానంలో ఎగురుతున్న ఏకైక మహిళలు మేమే" అని క్యాప్షన్ పెట్టి మరీ వీడియో పోస్ట్ చేసింది. బహుశా క్రిస్మస్టైం, పైగా సీషెల్స్లో వర్షాకాలం కావడంతో ప్రయాణికులు లేరని చెప్పుకొచ్చింది. ఇద్దరే విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని రాసింది. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. వారు కూడా ఇలానే సంబరపడ్డారు. పైగా ఏదో ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగిందని వారు చెప్పుకొచ్చారు కూడా. (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్తో పనిలేదని ప్రూవ్ చేసింది!) -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ హెచ్చరిక!
రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్ యాప్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్సీటీసీ పేరుతో ఫేక్ యాప్స్ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. ఆ యాప్ను వినియోగించవద్దని కోరింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్లో, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది. Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.… — IRCTC (@IRCTCofficial) August 4, 2023 అంతేకాకుండా, ఒరిజినల్ ఐఆర్సీటీసీ, ఫేక్ ఐఆర్సీటీసీ యాప్స్లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. -
వరద ధాటికి నదిలో చిక్కిన బస్సు... ప్రయాణికుల ఆర్తనాదాలు.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX — NDTV (@ndtv) July 9, 2023 ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్
-
కోరమాండల్ ట్రైన్ లో ఏపీ వాసులు...
-
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్బోర్డ్లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
ల్యాండింగ్ టైంలో ఊపిరాడటం లేదని ఆ డోర్ తెరిచాడు..అంతే విమానం..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచితన ప్రవర్తన, వికృత చేష్టలకు సంబంధించి పలు దిగ్బ్రాంతికర ఘటనలు చూశాం. కొందరూ అన్ని తెలిసి తప్పులు చేస్తే, మరికొందరూ తెలిసి తెలియని తనంతో అమాయకత్వంతో అనుచిత ఘటనలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి విమానంలో ప్రమాదకర ఘటనకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనితో విమానంలోని మిగతా ప్రయాణకులు స్వల్ప గాయల బారినపడ్డారు. అసలేం జరిగందంటే.. దక్షిణ కొరియా ఎయిర్బస్ ఏ321లో ఈ అనుచిత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఊపిరాడటం లేదంటూ గాల్లో విమానం ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే వైమానికి భద్రతా సిబ్బంది 33 ఏళ్ల సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ విమానంల దక్షిణ ద్వీపం జెబు నుంచి డేగు నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు విచారణలో..ఆ వ్యక్తి తనకు ఊపిరాడనట్లు అనిపించడంతో విమానం నుంచి త్వరితగతిన నిష్క్రమించాలని అనుకుని ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఆ విమానంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీకి వెళ్లే టీనేజ్ అథ్లెట్లతో సహా మొత్తం 194 మంది ప్రయాణికులను తీసుకువెళ్తోంది. ఆ విమానం డేగు విమానాశ్రయం వైపుకి వెళ్లే క్రమంలో..సరిగ్గా 700 అడుగుల ఎత్తులో ఉండగా సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ఆ విమానం కుదుపుకి గురై..అందులోని కొందరూ ప్రయాణికులు శ్వాస తీసుకోవడం తరహా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి పాల్పడ సదరు ప్రయాణికుడు ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడని, ఒత్తిడికి లోనవ్వడంతోనే ఇలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతను ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించినందుకు గానూ సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. (చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!) -
ట్రైయిన్లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..
ఇటీవల ట్రైయిన్లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన) -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ప్రయాణికురాలు సజీవదహనం
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్బందర్ రోడ్డులోని గైముఖ్ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు. ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజేష్ కుమార్కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్లు కొనుగోలు) -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
తప్పతాగి.. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన!
న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ప్రయాణికుడిపై ఎయిర్లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వరుసగా మూడోసారి గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. -
విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్కి బలవంతంగా..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్లైన్స్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో 61 ఏళ్ల డేవిడ్ అలాన్ బర్క్ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్నాడు. అక్కడే ఓ మగ ఫ్లైట్ అటెండెంట్ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్కి నచ్చిన రెడ్ వైన్ ఆల్కాహాల్ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్ అటెండెంట్ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్ ఆ ప్రయాణికుడి కాంప్లీమెంట్కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్రూమ్కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్ అటెండెంట్ డెల్టా ఎయిర్లైన్స్కి జరిగిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు. అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్ అటెండెంట్. ఆ ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్ల రెడ్వైన్ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల ఏప్రిల్ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. (చదవండి: సెప్టెంబర్లో భారత్కు బైడెన్) -
ప్రయాణికులతో మర్యాదగా మెలగండి ! ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హితవు
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఆర్టీసీ బ్రాండ్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సజ్జనర్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్వల్గా.. ఈ శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. "మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సజ్జనర్ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కాగా, టాక్ట్ పేరుతో తమకు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, ఓఎస్డీ(ఐటీ అండ్ డీ) యుగంధర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం) -
రైల్వే ప్రయాణికులకు IRCTC అలెర్ట్..
-
గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు..
హాట్ ఎయిర్ బెలూన్లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్ ఎయిర్ బెలూన్లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్ హెయిర్ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Mexico 🇲🇽 ! Breaking news!🚨🚨 Saturday, April 01, 2023, in the morning hours. a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead. The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH — Lenar (@Lerpc75) April 1, 2023 (చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం) -
Ticket Checker Pees :టీసీపై సస్పెన్షన్ వేటు విధించిన రైల్వే మంత్రి
రైలులో ప్రయాణిస్తున్న మహిళపై టీసీ మూత్ర విసర్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి టీసీపై సస్పన్షన్ వేటు విధించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజు సదరు నిందితుడు టీసీ సెలవులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఉత్తర మద్య రేల్వేకి రాసిన లేఖలో..మహిళలను అగౌరవపరిచే ప్రవర్తన తీవ్ర దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. వ్యక్తిగా అతనికే కాకుండా సంస్థగా మొత్తం రైల్వేలకు చెడ్డపేరు వచ్చేలా చేశాడు. రైల్వే ఉద్యోగిగా అతని అనుచిత ప్రవర్తనకు గానూ అతన్ని విధుల నుంచి తొలగించడమే సరైన శిక్ష అని భావిస్తున్నా. అందువల్ల అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించండి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రైల్వే మంత్రి అశ్వనీ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా అకాల్ తఖ్ ఎక్స్ప్రెస్ ఏ1 కోచ్లో ఒక మహిళ తన భర్తతో కలసి ప్రయాణిస్తుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న టీసీ అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె కేకలు పెట్టడంతో వెంటనే ఆమె భర్త, ప్రయాణికులు స్పందించి..అతడికి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. (చదవండి: మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్) -
విమానంలో స్మోకింగ్.. పట్టుబడ్డాక యాక్టింగ్తో పిచ్చెక్కించిన ప్రయాణికుడు?
విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్ బాత్రూంలో స్మోక్ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్.. ఎయిరిండియా విమానం టాయిలెట్లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్ను పక్కకు విసిరేశాడు. విమానంలో జిమ్మిక్కులు అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య సమస్యలపై ఆరా నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్ పోర్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్లైన్కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్లైన్కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్లైన్కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్లైన్కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
విమానంలో మూత్ర విసర్జన: రాజీ కుదిరిందని ఫిర్యాదు చేయలేదు
ఎయిర్ ఇండియాలోని బిజినెస్ క్లాస్లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా...నవంబర్ 27ను న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్పోర్ట్లో ఎలర్ట్ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాదు ఎఫ్ఐఆర్లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది. అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!) -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్హామ్లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
ప్రయాణికుడి బ్యాగ్లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్పోర్ట్నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్పోర్ట్ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
గంటల తరబడి నిరీక్షణ తర్వాత ట్రైయిన్ ఎంట్రీ..ఒక్కసారిగా ప్రయాణికుల రియాక్షన్
వాస్తవానికి మనం ఏదైనా ఊరు లేదా యాత్రకు వెళ్లేటప్పుడూ ట్రైయిన్/బస్సు లేదా విమానం కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఆ రోజు వాతావరణం బాగోకపోవడమో లేక ఆ వాహనాల్లో సమస్య తలెత్తడం వంటి తదితర కారణాల రీత్యా ఆలస్యమైపోతుంది. దీంతో ఎవరికైనా సహజంగా కోపం, చిరాకు వంటివి వచ్చేస్తాయి. దెబ్బకు మళ్లీ ఎక్కడకి వెళ్లకూడదు అనుకునేంత చిర్రెత్తుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఒక రైల్వేస్టేషన్లోని ప్రయాణకులకు ఎదురైంది. అ లాంటి ఇలాంటి లేటు కాదు ఏకంగా 9 గంటలకు పైగా ట్రైయిన్ కోసం నిరీక్షించారు. అన్ని గంటలు అంటే కచ్చితంగా బాబోయ్ అసలు ట్రైయిన్ వస్తుందా రాదా! అన్నంత చిరాకొచ్చి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్లో వందలమంది ప్రయాణికులు ట్రైయిన్కోసం అలా పడిగాపులు కాచి ఉన్నారే తప్ప అసహనంగా కూడా లేరు. ఎట్టకేలకు తొమ్మిది గంటల ఆలస్యం తర్వాత ట్రైయిన్ రానే వచ్చింది. అంతే ప్రయాణకులంతా ఒక్కసారిగా విజిల్స్ వేస్తే ఏదో సాధించేసినట్లుగా ఫీలవుతూ హయిగా ఆ రైలు ఎక్కేసారు. అంతేకాదు దూరం నుంచి చిన్న లైటు వెలుగుతో హారన్ వేయిగానే ఎదురుచూస్తున్న ప్రయాణికుల మొహాలు చిచ్చబుడ్డిల్లా వెలిగిపోయాయి. ఐతే ఇంతకీ అదే ఏ స్టేషన్ ఎక్కడ జరిగిందనేది తెలయాల్సి ఉంది. అందుకు సబంధించిన వీడియోని హార్దిక బొంతు అనే సోషల్ మీడియా వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇండియాలో ప్రజలు ఏ సమస్యనైనా ఇలానే సహనంతో నవ్వుతూ ఎదుర్కొంటారు, ఇదే ఈ దేశంలోని అసలైన అందం అని కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX — Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022 (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!) -
నడిరోడ్డుపై పేలిపోయిన ఆటో.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మంగళూరు: కర్ణాటకలో ఆటో రిక్షా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మరోక వ్యక్తి ఆధార్ కార్డుని వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆ ప్రయాణికుడు తమకూరు డివిజన్కి చెందిన రైల్వేలో పనిచేస్తున్న ప్రేమరాజ్ హుటాగి అనే వ్యక్తి ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నాడుని చెప్పారు. సదరు వ్యక్తి గతేడాది రెండుసార్లు తన ఆధార్కార్డుని పోగొట్టుకున్నాడుని చెప్పారు. కానీ అతను కచ్చితంగా ఎక్కడో పోగొట్టుకున్నది చెప్పలేదని అన్నారు. ఈ మేరకు సదరు రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ..." తనకి సుమారు రాత్రి 7.30 గంటలకి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చించి. మీరు ఎక్కడ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తన గురించి ఆరా తీశారు. అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత ఆ ఆటో రిక్షా పేలుడు ఘటన గురించి చెప్పారు. తనకు పోలీసులు చెప్పేంత వరకు కూడా ఈ ఘటన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. ఐతే తన ఆధార్ కార్డు పోయిందనేది వాస్తవమే గానీ మంగళూరులో తాను పోగొట్టుకోలేదని చెబుతున్నాడు. తన ఆధార్ కార్డు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, మరో ఆధార్ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా తన ఆధార్కార్డు మిస్యూజ్ అవుతుందని తనకసలు తెలియదని" చెబుతున్నాడు. ఇదిలా ఉండగా. ...ఈ ఆటో రిక్షా బ్లాస్ట్కి కారణం ఆ ప్రయాణికుడేనని, అతనే నిందితుడని కర్ణాటక డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రవీణ్ సూద్ తేల్చి చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణికుడు బ్యాటరీలు అమర్చిన కుక్కర్ని వెంట తీసుకువెళ్లాడని చెప్పారు. అందువల్ల ఈ పేలుడు సంభవించి, ఆ డ్రైవరు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అలాగా ఆ ప్రయాణికుడు నకిలీ ఆధార్ కార్డుతో, నకిలీ అడ్రస్, నకిలీ పేరుతో చెలామణి అవుతున్నాడని చెప్పారు. ఇది అనుకోని ప్రమాదం కాదని పెద్ద ఎత్తున నష్ట కలిగించేలా ప్లాన్ చేసిన ఉగ్రవాద చర్యేనని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ చీఫ్ ఈ ఘటనసై రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కేంద్ర నిఘా సంస్థలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సదరు నిందితుడు కోయంబత్తూర్లో తప్పుడు పేరుతో సిమ్ తీసుకున్నట్లు చెప్పారు. అతని కాల్ డేటా ఆధారంగా తమిళనాడు అంతటా పర్యటించాడని చెప్పారు. తమిళనాడులో అతను ఎవరెవర్నీ కలుసుకున్నాడు, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు) -
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
మాస్కో విమానంలో బాంబు కలకలం... అప్రమత్తమైన అధికారులు
న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్10న లండన్కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసింది. (చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్) -
ప్యాసింజర్ షార్ట్ టెంపర్.. దెబ్బకు ఫ్లైట్ జర్నీ చేయనీకుండా జీవితకాల నిషేధం
కొంతమందికి చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేస్తుంటాయి. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించి లేనిపోనీ తంటాలను కొని తెచ్చుకుంటారు. ఇక్కడో ఒక విమాన ప్రయాణికుడు అలానే ప్రవర్తించి జీవితంలో విమాన ప్రయాణమే చేయనీకుండా నిషేధింపబడ్డాడు. వివరాల్లోకెళ్తే... మెక్సికోలోని ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ లాస్ కాబోస్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో జీవితంలో అసలు ప్లైట్ జర్నీ చేసేందుకు లేకుండా నిషేధం విధించింది. ఈఘటన అమెరికన్ ఎయిర్లైన్స్ 377 విమానంలో చోటు చేసుకుంది. ఒక విమాన సహయకుడుని నన్ను బెదిరిస్తున్నావా అంటూ ఒక ప్రయాణికుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. సదరు ప్రయాణికుడు పిడికిలితో ఫ్లైట్ అటెండెంట్ తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో సదరు అటెండెంట్ ఈ ఆకస్మిక దాడికి వెంటనే కిందపడిపోయాడు. వాస్తవానికి సదరు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికుడి ప్రవర్తన విషయమై కంప్లైంట్ చేసేందుకు వెళ్తున్నసమయంలోనే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ అనుహ్య ఘటనకి విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ విమానంలోని ఒక హోస్ట్ గాయపడిన అటెండెంట్కి సపర్యలు కూడా చేసింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన అమెరికా విమాన ఎయిర్లైన్స్ వెంటనే స్పందించి...ఈ దాడికి పాల్పడిన వ్యక్తి 33 ఏళ్ల అలెగ్జాండర్ తుంగ్ క్యూ లేగా గుర్తించి అతన్ని వెంటనే విమానం నుంచి దించేయడమే కాకుండా జీవితకాలం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతేగాదు తమ సిబ్బందిని గాయపరిచినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువైతే సదరు ప్రయాణికుడికి 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది కూడా. తమ ఎయిర్లైన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తించి దాడి చేస్తే... చూస్తూ ఊరుకోమని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A man was arrested by Los Angeles Airport police after assaulting a flight attendant on an American Airlines flight from Cabo. pic.twitter.com/2VDXxIqUfn — 🇺🇸BellaLovesUSA🍊 (@Bellamari8mazz) September 22, 2022 (చదవండి: మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి) -
బస్సులో నాగుపాము రభస
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం కెఎస్ఆర్టిసి బస్టాండు నుంచి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని శిడ్లఘట్ట వైపు వెళుతుండగా బస్సులో కలకలం రేగింది. అందరూ ఏమిటా అని చూడగా ఒక నాగుపాము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణికులు భయంతో ఒకరిపై ఒకరు పడి కిందకు దిగడానికి ప్రయత్నించారు. ఈ అల్లరితో పాము ఇంజన్ వద్దకు జారుకుంది. పాముల నిపుణుడు పృథ్వీరాజ్ను పిలిపించగా, ఆయన పామును పట్టి దూరంగా వదిలేశారు. బస్సు శిడ్లఘట్టకు వెళ్లిపోయింది. (చదవండి: అయ్యో పాపం.. ప్లాస్టిక్ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క) -
రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..: వీడియో వైరల్
ఒక మహిళ రైలు పైకి ఎక్కి కూర్చునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇంతలో రైల్వే పోలీస్ రాగానే పాపం ఇక చేసేదేమిలేక ప్రయత్నం విరమించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన బంగ్లాదేశ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఆ రైల్వేస్టేష్న్లో ఒక ఇంటర్ ఎక్స్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. మొత్తం బోగీలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం మరీ ఆ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. ఈ మేరకు సదరు మహిళ రైలు విండో పై నుంచి ఎక్కేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు అధిక జనాభా ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఒకరు, ఐనా అలాఎలా రైలు పైకి ఎక్కేందుకు అనుమతించారు, చాలా ప్రమాదం, నేరం అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz) (చదవండి: ఉన్నట్టుండి చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. ఆందోళనలో స్థానికులు!) -
పేరుకే ఫ్రీక్వెన్సీ! తప్పని నిరీక్షణ
సాక్షి,హైదరాబాద్: నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి మెట్రో రైలు నడుపుతామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు నిరీక్షణ తప్పడంలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మూడు మెట్రో కారిడార్ల పరిధిలోని 54 మెట్రో మెట్రో స్టేషన్లకు చేరుతున్న ప్రయాణికులు ప్లాట్ఫారాలపై కిక్కిరిసిపోతున్నారు. రైలులోకి ప్రవేశించే సమయంలోనూ తోపులాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోగీల్లోనూ బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏసీని పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. మధ్యాహ్నం వేళల్లో బోగీల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. మెట్రో అధికారుల పర్యవేక్షణ లోపంతోనే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతోందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు కారిడార్లతో కలిపి రద్దీ 3 నుంచి 3.5 లక్షలుకాగా.. సెలవు రోజుల్లో రద్దీ నాలుగు లక్షలకు చేరువవుతోందని పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం సరాసరిన సుమారు 1.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని.. ఆతర్వాత నాగోల్– రాయదుర్గం మార్గంలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని.. ఇక జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ 25 వేలుగా ఉంటుందని తెలిపాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, పార్కింగ్ ఉన్న చోట చార్జీల బాదుడు షరామామూలే. సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు మెట్రో స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్)వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ సంస్థ అవకాశం ఇచి్చంది. ఈ ప్రాంతంలో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు దిగిన వెంటనే సిటీజన్లు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్) -
స్పైస్జెట్ నిర్లక్ష్యం.. విమానం వద్దే ప్రయాణికుల పడిగాపులు!
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్జెట్ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ఈ విషయంపై స్పైస్జెట్ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్కు చేర్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్జెట్. How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y — Lasya Nadimpally (@nlasya) August 6, 2022 ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
విజయవాడ ప్యాసింజర్ లేనట్టేనా?
అనంతపురం సిటీ: కరోనా సాకుతో మూడేళ్ల క్రితం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ‘అనంతపురం–విజయవాడ’ ఒకటి. అయితే, కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గినా నేటికీ ఈ రైలును పునఃప్రారంభించలేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల తరువాత దశల వారీగా రైళ్లను పునఃప్రారంభిస్తున్నా.. ఈ ప్యాసింజర్ రైలు విషయంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద,మధ్య తరగతికి పెద్దదిక్కు విజయవాడకు వెళ్లే (ట్రైన్ నంబర్:56503/04) ఈ ప్యాసింజర్ రోజూ ఉదయం 7.20 గంటలకు బెంగళూరు (యశ్వంతపుర)లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం చేరేది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకునేది. మొత్తం 13 బోగీలతో 700 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో 75 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేది. రైలు ద్వారా రోజూ 2 వేల నుంచి 3 వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అధికం. రాష్ట్ర విభజన తరువాత విజయవాడకు పెరిగిన రద్దీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నత చదువులు గానీ, మెరుగైన వైద్యసేవల కోసం గానీ మరే ఇతర అవసరాల కోసమైనా ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్కు రాకపోకలు సాగించేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్తో సత్సంబంధాలు తగ్గిపోయాయి. పిల్లల చదువులు, ఇతర పనులపై ఇప్పుడు ఎక్కువగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు ఎక్కువగా విజయవాడకు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందిపోయి, ఉన్న రైళ్లను రద్దు చేయడం ఏమిటో అంతుబట్టడం లేదు. (చదవండి: కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం) -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్లు, ఆటోలు ఠంచన్గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్పాస్లో 20 శాతం రాయితీ) -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్) -
సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్!
A video of the pilot’s message: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న భీకరమైన పోరు నేటికి 19వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ లొంగిపోమని రష్యా చెబుతున్న తలవంచేదే లేదంటూ యుద్ధం చేస్తోంది. దీంతో రష్యా వైమానిక క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ విధ్వంస సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు సైతం హెచ్చరికలు, ఆంక్షలు జారీ చేసిన తనదైన యుద్ధ వ్యూహంతో చెలరేగిపోతుంది. రష్యా సృష్టించి విధ్వంసకర పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులను పొట్టన పెట్టుకుంది. మహిళలు, పిల్లలు, ఆస్పత్రుల పై దాడులు జరిపి రాక్షస విధ్వంసానికి బీజం వేసింది. దీంతో రష్యా దేశంలోని ప్రజలే ఆ దేశ అధ్యక్షుడి వ్యవహార తీరుపై ఆగ్రహం చెందడమే కాక నిరసనలు చేశారు. అయినప్పటికీ పుతిన్ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్ ఉక్రెయిన్పై యుద్ధం నేరమని, దీనిని ఆపేందుకు వివేకవంతమైన పౌరులు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు. ఈ మేరకు అతను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తెలివైన పౌరులు తనతో ఏకీభవించడమే కాక ఆపేందుకు తమవంతుగా కృషిచేస్తారని భావిస్తున్నా అని అన్నాడు. అంతేకాదు ప్రయాణికులకు కూడా చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రేనియన్ దౌత్యవేత్త ఒలెగ్జాండర్ షెర్బా మాట్లాడుతూ.. "పైలట్ రష్యాకు చెందిన ఫ్లాగ్ ఎయిర్లైన్ ఏరోఫ్లాట్ అనుబంధ సంస్థ అయిన పోబెడా కోసం పనిచేస్తున్న పైలట్ సాయర్ . అతను టర్కీలోని అంటాల్యకి చేరుకుంటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A Russian pilot tells passengers that he believes “the war in Ukraine is a crime,” adding “I think each sensible citizens will agree with me and will do everything to make it stop.” Rare to see public opposition to the war given the consequences such a statement will have pic.twitter.com/55h18mWI9U — Pjotr Sauer (@PjotrSauer) March 11, 2022 (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
ఆమె కలలో కూడా ఊహించి ఉండదు! ఇలా జరుగుతుందనీ..
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి. వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Aurora Torres (@aurooratorres) (చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది) -
మెట్రో స్టేషన్లలో జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ , దవా దోస్త్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడంతో మెట్రో ప్రయాణికులకు ఈ అవకాశం దక్కింది. దవా దోస్త్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి హై ఫ్రీక్వెన్సీ స్టోర్ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్త్ కేంద్రాలు అమీర్పేట, కెపీహెచ్బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషధ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15 నుంచి 80 శాతం రాయితీలలో పొందవచ్చన్నారు. ఎల్ అండ్ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్ను స్వాగతిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్తో రాయితీ ధరలలో ప్రయాణికులు ఔషధాలు పొందవచ్చన్నారు. దవాదోస్త్ సంస్థ సీఈవో అమిత్చౌదరి మాట్లాడుతూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. -
ఇంటి నుంచి నేరుగా ప్రయాణించేలా ... బస్సు టు క్యాబ్
సాక్షి హైదరాబాద్: గ్రేటర్లో ప్రజా రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ ‘సీమ్లెస్’ జర్నీ ఒక కలగానే మారింది. నగరంలోని ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్కు చేరుకొనే సదుపాయం లేదు. వందల కొద్దీ కాలనీలు, బస్తీలు, నగరంలోని అనేక ప్రాంతాలు మెట్రో రైలుకు దూరంగానే ఉన్నాయి. మరోవైపు కాలనీలకు మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఇక హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే వారికి కూడా లాస్ట్మైల్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. బస్సు దిగిన ప్రయాణికులు గమ్యం చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్ సేవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎదురు చూపులు లేకుండా... ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్కు చేరుకోవడానికి ముందే ప్రయాణికులు క్యాబ్లను బుక్ చేసుకోవచ్చు. శంషాబాద్ విమాశ్రయంలోనూ ఈ తరహా క్యాబ్ సదుపాయం ఉంది. అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ,దిల్సుఖ్నగర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, తదితర బస్స్టేషన్లు, కోఠీ. కాచిగూడ, కూకట్పల్లి, హయత్నగర్ వంటి ప్రయాణ ప్రాంగణాల నుంచి క్యాబ్ల సేవలను ఏర్పాటు చేయడం వల్ల సిటీ బస్సులు వెళ్లలేని కాలనీలకు ప్రయాణికులు చేరుకోవచ్చు. బస్సు కోసం పడిగాపులు అవసరం లేకుండా లాస్ట్మైల్ వరకు ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మరోవైపు ఆర్టీసీపైన ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఇందుకనుగుణంగా క్యాబ్ల అనుసంధానంపైన దృష్టి సారించినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘బస్సు దిగిన వాళ్లు ఆటో, క్యాబ్ వంటి వాహనాల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకొని వెళ్లవచ్చు.కానీ ఆర్టీసీ అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్లు ఉంటాయనే భరోసా ముఖ్యం. అందుకోసమే ఈ అనుసంధాన ప్రక్రియ..’ అని వివరించారు. అలైటింగ్ పాయింట్ల గుర్తింపు త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో అలైటింగ్ పాయింట్లను గుర్తించనున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కడికి బయలుదేరుతున్నారనే అంశం ప్రాతిపదికగా వీటి ఎంపిక ఉంటుంది. సిటీ బస్సులు చేరుకోలేని ప్రాంతాలకు క్యాబ్లు వెళ్లే విధంగా అలైటింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. మరోవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా క్యాబ్ల అనుసంధానం ఉంటుంది -
ఓలా, ఉబెర్ క్యాబ్లు సాగిస్తున్న నయా దందా!...భరోసా లేని ప్రయాణం!!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఏ ఇబ్బంది లేకుండా క్షణాల్లోనే క్యాబ్ బుక్ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్ బుకింగ్కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్ బుక్ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఎక్కడెళ్లాలి అని అడిగాడు. హిమాయత్నగర్కు అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. గంట గడిచినా క్యాబ్ రాలేదు. బుకింగ్ రద్దు కాలేదు. మరో క్యాబ్ కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకొంటే వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో డ్రైవర్ డిమాండ్కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్ క్యాబ్లు సా గిస్తున్న నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్ రూట్లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. భరోసాలేని క్యాబ్ జర్నీ... సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని భావించే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్ల వల్ల ప్రయాణానికి భరోసా లభించడం లేదని, డ్రైవర్లకు గిట్టుబాటయితేనే వస్తారని’ అంబర్పేట్కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి కొందరు రైడ్ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్లు డిమాండ్ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి క్యాబ్ డ్రైవర్లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్ అభిప్రాయపడ్డారు. కమిషన్లు తగ్గినందుకే ఇలా... ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి కిలోమీటర్కు కొంత మొత్తాన్ని డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్ల నుంచి రైడ్ బుకింగ్లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు. డిజిటల్ అయితే నో... సదరు ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థలతో తమ కమిషన్లపైన ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు. రద్దీ ఉండే రూట్ల లో క్యాబ్లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ‘డిజిటల్ పేమెంట్స్’ అనగానే నిరాకరిస్తున్నారు. ఓలా, ఉబెర్ యాప్లలో రెంటల్ బుకింగ్స్ సదుపాయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో రెంటల్ బుకింగ్స్కు డ్రైవర్లు నిరాకరించడం గమనార్హం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా క్యాబ్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరి నిమిషంలో రైడ్ల రద్దు వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. -
కోవిడ్ ప్రమాద ఘంటిక వేళ... సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న నగరవాసులు
సాక్షి హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ ప్రమాద ఘంటికలు. మరోవైపు కలిసొచ్చిన సంక్రాంతి సెలవులు. నగరవాసులు బతుకుజీవుడా అంటూ పల్లెబాట పడుతున్నారు. పిల్లలకు సెలవులు మొదలవడంతో సొంతూరుకు ప్రయాణాలు పెరిగాయి. పది రోజుల పాటు ఊరిలో ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో చాలా మంది తరలివెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టవచ్చనే ఆశావహ దృక్పథంతో బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. నగర శివార్లలోని పలు కూడళ్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలామంది సొంత వాహనాలపై తరలి వెళ్లారు. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరో వారం రోజుల పాటు సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. రైళ్లలో పెరిగిన రద్దీ.. కొంతకాలంగా తప్పనిసరి ప్రయాణాలు, సాధారణ రాకపోకలతో కనిపించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, పాట్నా, ముంబై తదితర ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలు సైతం కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా శనివారం మరో 25 వేల మంది అదనంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. ఏపీ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లతో పాటు, ఉత్తరాది రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బస్స్టేషన్లలో సందడి.. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సులు ప్రయాణికులతో నిండుగా బయలుదేరాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బస్సుల్లోనే ఎక్కువ మంది తరలివెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారుల అంచనా. మరోవైపు నగర శివార్లలోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఉప్పల్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలా మంది సొంత బైక్లు, కార్లలో ఊళ్లకు బయలుదేరారు. సిటీలో పెరిగిన ట్రాఫిక్.. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ర ద్దీ నెలకొంది. ఉప్పల్– వరంగల్, సికింద్రాబాద్–బేగంపేట్, అమీర్పేట్, దిల్సుఖ్నగర్–ఎల్బీనగర్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ చోటుచేసుకుంది. -
ఊరికి పోతే... జేబుకు వాతే!
సాక్షి హైదరాబాద్: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్ క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు. అడ్డగోలుగా.. ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్లోనూ ముందస్తు బుకింగ్లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్ నుంచి వైజాగ్కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది ప్రయాణికులు మినీ బస్సు బుక్ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్పురి ప్రాంతానికి చెందిన వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు.. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 550 బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్సార్నగర్, అమీర్పేట్, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి. -
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
దారి చూడు.. దుమ్ము చూడు
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు చల్లడం లేదు.. మండలంలోని చెరువుమాదారం క్రాస్రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గిజౌప్రావీన్స్లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు) ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) -
విమానంలో పిచ్చి చేష్టలు.. అందరూ చూస్తుండగా ప్యాంటు విప్పి..
వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని మార్చేసింది. కుటుంబాలను, మానవ జీవితాలను అతలాకు తలం చేసింది. అయినా ఇప్పటికీ కొందరు కోవిడ్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోన్న వ్యక్తులు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. అలాంటి వాడే కొలరాడోకి చెందిన 24 ఏళ్ళ లాండన్ గ్రియర్. ఆలాస్కా ఎయిర్లైన్ ఫ్లైట్లో మార్చి 9న ప్రయాణిస్తోన్న సదరు వ్యక్తిని విమాన సిబ్బంది మాస్క్ పెట్టుకోమని పదేపదే కోరారు. గ్రియర్ నిద్రనటిస్తూ, మాస్క్పెట్టుకోమని పదే పదే విజ్ఞప్తి చేసినా, వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చాడు. అంతేకాకుండా ఫ్టైట్లోనే తన సీటుపైనే మూత్రవిసర్జన చేసి అసహ్యంగా ప్రపవర్తించడంతో తోటి ప్రయాణీకులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో విమానం ల్యాండ్ అయిన అనంతరం 24 ఏళ్ళ లాండన్ గ్రియర్ను ఎఫ్బిఐ అరెస్టు చేసింది. డెన్వర్లోని జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశారు. గ్రియర్ సీటెల్ నుంచి డెన్వర్కి ఫ్లైట్ ఎక్కే ముందు మూడు నుంచి నాలుగు బీర్లను తాగానని ఎఫ్బిఐ ఏజెంట్లతో చెప్పారు. విమాన సిబ్బందిని కొట్టినట్టు తనకు గుర్తు లేదని, తాను మూత్ర విసర్జన చేసిన విషయం కూడా తనకు తెలియదని గ్రియర్ చెప్పుకొచ్చాడు. నిజానికి గ్రియర్ తన ప్యాంట్ విప్పి అసహ్యంగా ప్రవర్తిస్తుండగా విమాన సిబ్బంది హెచ్చరించడంతో తాను మూత్రవిసర్జన చేస్తున్నానిచెప్పాడు. ప్రస్తుతం పదివేల డాలర్ల పూచీకత్తుతో గ్రియర్ విడుదలయ్యాడు. విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అభియోగాలతో అరెస్టయిన ఈ తాగుబోతు నేరం రుజువైతే, గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే దాదాపు రెండు కోట్ల జరీమానా విధించే అవకాశం వుందట. -
హైదరాబాద్ మెట్రో.. అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పూర్తిస్థాయిలో అన్లాక్ అయినా మెట్రో ప్రయాణికుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెరగడంలేదు. లాక్డౌన్కు ముందు (ఈ ఏడాది మార్చి 22)తో పోలిస్తే ప్రస్తుతం మూడు రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 38 శాతం దాటకపోవడం గమనార్హం. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మార్చి నెలకు ముందు నిత్యం 3.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో నిత్యం 1.33 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. సువర్ణ ఆఫర్తో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీతోపాటు స్మార్ట్కార్డులో రీఛార్జీపై క్యాష్బ్యాక్ ఆఫర్ అమలు చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య అరకొరగానే పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఆఫర్లు ప్రకటించినా.. దసరా, దీపావళి సందర్భంగా మెట్రోరైలు సంస్థ మెట్రో సువర్ణ ఆఫర్ను ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లో భాగంగా ఛార్జీల్లో రాయితీ కల్పించడంతోపాటు.. స్మార్ట్కార్డ్ రీఛార్జీపై క్యాష్బ్యాక్ఆఫర్ అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ ఆఫర్లు అమలుకానున్నాయి. అయితే ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్యను లాక్డౌన్ ముందున్న సంఖ్యకు చేర్చేందుకు మెట్రో అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలివే.. - సిటీజన్లలో కోవిడ్ భయాందోళనలు తొలగకపోవడం. కోవిడ్ సెకండ్వేవ్ మొదలౌతుందన్న ఆందోళన. - ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలవుతుండడం. - మెట్రో స్టేషన్ల వద్ద బైక్, కార్ల పార్కింగ్కు చెల్లించే ఛార్జీలు తడిసి మోపెడు కావడం. - మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు, బస్తీలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఆటో, క్యాబ్ ఛార్జీలతో జేబులు గుల్లకావడం. - వ్యక్తిగత వాహనాలపై వెళితే కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చన్న భావన. - మెట్రో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ.. ఏసీ బోగీల్లో సులభంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనలు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది నగరంలో మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్యాష్బ్యాక్ ఆఫర్, సువర్ణ ఆఫర్ సత్ఫలితాన్నిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్లుగా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నగరం మినహా నూతనంగా మెట్రో ప్రారంభమైన మిగతా మెట్రోసిటీలతో పోలిస్తే నగరంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. – ఎన్వీఎస్రెడ్డి, హెచ్ఎంఆర్, ఎండీ -
విమానంలో వర్షం.. ఎప్పుడైనా చూశారా?
మాస్కో : విమానంలో వర్షం కురిసే సంఘటనల్ని మనం ఊహిస్తామా? విమానంలో వర్షం రావడమేంటి అనుకుంటున్నారా? రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు విమానంలో బయలు దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వాన కురవడం మొదలైంది. విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు విమానంలో గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరపగా అది వర్షం నీరు కాదని పేర్కొన్నారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే నీరు క్యాబిన్లోకి చేరిందని పేర్కొన్నారు. Volo interno russo #Chabarovsk-Sochi della Rossiya Airlines I passeggeri sono stati costretti ad usare ombrelli per ripararsi da goccioloni d'acqua, parrebbe per un guasto all'aria condizionata Ora sotto inchiesta Non vi lamentate dei treni italiani...pic.twitter.com/HKB1ab66rd — #POLiticamenteScorretto🎹FR© (@PolScorr) July 11, 2020 -
ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సేవలు పునః ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారినపడ్డారు. లాక్డౌన్ కారణంగా అన్ని విమానయాన సర్వీసులు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25న అన్ని దేశీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలువురు వారి గమ్యస్థానాలకు చేరడానికి తిరుగు పయనమయ్యారు. విమానయాన సేవలు తిరిగి ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంతో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అన్న దానిపై చర్చ మొదలైంది. (క్వారంటైన్లో 23 లక్షల మంది ) విమానాశ్రయాల్లో పరీక్షల అనంతరం కరోనా సోకినట్లు నిర్థారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్ సెంటర్కు తరలించారు. అంతేకాకుండా వారితో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు, సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్లో ఉంచారు. లాక్డౌన్ 4.0లో భారీ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగానే దీశీయ విమాన కార్యకలాపాలు సాగించడానికి అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండు నెలల అనంతరం దేశీయ విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భౌతికదూరం పాటించడం, ఫేస్ మాస్క్, శానిటైజేషన్, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి అన్న నిబంధనలు విధిస్తూ విధించింది. అయినప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకో ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే..వీరిలో ఎక్కువమంది ఇండిగో విమానంలోనే ప్రయాణించారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు ఉండటం గమనార్హం. (హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష ) -
ఇందూరు ‘స్టేషన్’లో ఇక్కట్లు..?
నిజామాబాద్ సిటీ: ‘ఏ గ్రేడ్’ రైల్వేస్టేషన్ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికి ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంలేదు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 45–50 రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే వారి ఇబ్బందులను తీర్చడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, ఏడాది క్రితం రెండో రైల్వేస్టేషన్ను నిర్మించారు. ఈ స్టేషన్కు వెనుకాల గల నాందేవ్వాడ, హమాల్వాడి, దుబ్బ, సుభాష్నగర్, కంఠేశ్వర్ ప్రాంతాల ప్రజలకు ఈ రైల్వేస్టేషన్ ఉపయోగపడుతుందని భావించారు. రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు ద్వారా ప్రధాన రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్లపై భారం తగ్గుతుందని సైతం భావించారు. తద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. దీంతో పై ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూలో ఉండటం, ఆ సమయంలో తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండటం నిత్యం జరుగుతోంది. అయితే రెండో రైల్వేస్టేషన్లో సిబ్బంది కొరత కారణంగా దాదాపుగా మూసి ఉంచుతున్నారు. గూడ్స్ రైలు వస్తే స్టేషన్ బంద్.. నిజామాబాద్ రైల్వేస్టేషన్కు గూడ్స్ రైలు వచ్చిందంటే చాలు రెండో రైల్వేస్టేషన్కు తాళం పడుతోంది. రెండో రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందే గూడ్స్ రైలులో సరుకులు నింపే పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడకు టిక్కెట్ల కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడంలేదు. ప్రధాన స్టేషన్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిజామాబాద్ మీదుగా సుదూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ, నాందేడ్ మార్గాలకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. దీంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్లో టిక్కెట్టు కౌంటర్లు మూడు ఉండగా ఇవి ఏ మాత్రం సరిపోక ప్రైవేట్గా టిక్కెట్లు ఇచ్చే మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దివరకు సమస్య తీరింది. రైలు నిజామాబాద్ స్టేషన్కు చేరుకునే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికుల సంఖ్య బాగా ఉండడంతో బుకింగ్ కౌంటర్లన్ని కిటికిటలాడుతుంటాయి. రెండో స్టేషన్లో బుకింగ్ కౌంటర్ పనిచేయక ప్రయాణికుల బాధలు మరింత పెరుగుతున్నాయి. అవగాహన కల్పించకపోవడంతోనే.. నిజామాబాద్ రెండో రైల్వేస్టేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించకనే అది నిరుపయోగంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఉన్నట్లు ప్రచారం చేయకపోవటం, ప్రజల్లో అవగాహన కల్పించక ప్రజలంతా ప్రధాన రైల్వేస్టేషన్కు చేరుకుంటున్నారు. తద్వారా అక్కడ టిక్కెట్ల కోసం ప్రయాణికుల తోపులాట ఆగటంలేదు. రెండో రైల్వేస్టేషన్ నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించి, బుకింగ్ కౌంటర్పై అవగాహన కల్పిస్తే దుబ్బ, నాందేవ్వాడ, హమాల్వాడీ, కంఠేశ్వర్, సుభాష్నగర్ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారులు రెండో రైల్వేస్టేషన్ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్కు గోల్డెన్ రేటింగ్
సాక్షి, రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలకు గానూ ఇండియన్ గ్రీన్ కౌన్సిల్ సంస్థ రైల్వేస్టేషన్కు గోల్డెన్ రేటింగ్ ఆదివారం ప్రకటించింది. 100కి 71 పాయింట్లను స్టేషన్ దక్కించుకుంది. గతేడాది నవంబరు 14న విజయవాడ రైల్వేస్టేషన్ను సందర్శించిన ప్రతినిధులు స్టేషన్లోని వసతులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేషన్కు గోల్డెన్ రేటింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు.. స్టేషన్లో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు సెంట్రల్ ఏసీతో కూడిన విశ్రాంతి మందిరాలు, అత్యాధునిక ఫుడ్కోర్టు, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, అత్యాధునిక ఎగ్జిక్యూటివ్ లాంజ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు చికెన్ వంటకాలు అందించేందుకు ప్రపంచ ప్రసిద్ధగాంచిన కేఎఫ్సీ రెస్టారెంట్ స్టేషన్లోని 1వ నంబరు ప్లాట్ఫాంపై ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సత్వర టికెట్లు అందించేందుకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్( ఏ.టి.వి.ఎం)లు 16 ఇప్పటికే స్టేషన్లోని తూర్పు ముఖద్వారం1, 2, తారాపేట టెర్మినల్లలో అందుబాటులో ఉన్నాయి. దివ్వాంగులు, వమోవృద్ధులను రైలు ఎక్కించేందుకు అత్యాధునిక వీల్చైర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని అతి తక్కువ ధరకు అందించే ఆర్వో ప్లాంట్లను ఉన్నాయి. త్వరలో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించి ప్లాటినం ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని స్టేషన్ అధికారులు తెలిపారు. -
అ‘గమ్య’ గోచరం
చుంచుపల్లి : ‘4 ఇన్ ఆల్’.. ‘పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు’.. ఆటోలు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా రవాణా శాఖ అధికారులు విధించే నిబంధనలు ఇవీ. కానీ ఇవి రాతలకు మాత్రమే. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. ఇలా జిల్లాలో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నా.. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు.. ఇలా అన్ని వర్గాల వారికీ ఆటోలే దిక్కుగా మారాయి. జిల్లాలోని అనేక గ్రామాలకు రోడ్లు సరిగా లేవనే సాకుతో అధికారులు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో రవాణా పరిస్థితి ఇదీ.. జిల్లాలో 205 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలో 1,321 ఆవాస గ్రామాలు ఉన్నాయి. వీటిలో జిల్లాలో 411 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రోడ్లు సక్రమంగానే ఉన్నా.. తమ గ్రామాలకు బస్సు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో 289 ఆర్టీసీ బస్సులున్నాయి. వీటి ద్వారా నిత్యం 1.02 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో 30 నుంచి 40 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13, 330 ఆటోలు, 1,461 ట్రాలీ ఆటోలు, 6,704 కార్లు, 69 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ వాహనాల్లో ఎక్కువ శాతం పర్మిట్ నిబంధనలను అతిక్రమిస్తున్నవే కావడం గమనార్హం. ఆటోల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. వివిధ కంపెనీలు తయారు చేసిన వాహనాలకు అదనంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు అతి వేగంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ఆటోల్లో 10 మందికి పైగానే... నిబంధనల ప్రకారం ఆటోలో డ్రైవర్తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఏ ఆటో చూసినా 10 – 15 మంది వరకు కుక్కేస్తున్నారు. ఎక్కువ మంది కూర్చునేలా అదనపు సీట్లు ఏర్పాటుచేస్తున్నారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో వేచి చూసి, విసిగి వేసారుతున్న ప్రయాణికులు త్వరగా గమ్యం చేరాలనే హడావిడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పలు గ్రామాలకు బస్సులే లేకపోగా, మారుమూల గ్రామాలకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు మాత్రమే నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలే శరణ్యం అవుతున్నాయి. ప్రజల్లో మార్పు రావాలి ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయితే మానవతా ధృక్పథంతో పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాం. ఈ విషయమై అనేక సార్లు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల విషయంలో భయం ఏర్పడాలి. ప్రాణం చాలా విలువైనది. దానిని గమనించి ప్రతి ఒక్కరు సురక్షితమైన ప్రయాణాన్ని చూసుకోవాలి. జిల్లాలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు చేపడతాం. – బి.కృష్ణారెడ్డి, రవాణా శాఖాధికారి చీకటే మిగిలింది.. బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రావులపల్లి నర్సింహారావు(38) జనవరి 14న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బస్టాప్ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మోటార్సైకిల్పై వస్తున్న నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. తాపీపనులు చేస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా గడిపై నర్సింహారావు మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన భార్య స్వప్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెలు సంధ్య, నందినిని చదివిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆమె కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన భర్త ఉన్నప్పుడు పిల్లలు ఏదడిగినా తెచ్చిపెట్టేవారని, ఇప్పుడు చాలా కష్టమవుతోందని స్వప్న రోదిస్తోంది. ప్రమాదం జరిగి రెండున్నర నెలలు కావస్తున్నా తనకు ఎలాంటి పరిహారమందలేదని చెపుతోంది. -
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
డోన్ టౌన్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్మామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గోపినాథ్ మాల్యా అన్నారు. డోన్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని మాల్యా దంపతులు సోమవారం ప్రారంభించారు. తర్వాత నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ రైల్వే డీఈ సూరబ్ కుమార్, ఏడీఏ గౌతమ్, ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఖాజా, రైల్వే సిబ్బంది శశిధర్, మల్లిఖార్జున, దామోదర్,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విమానం కూలినా అపాయం లేకుండా...
అయ్యో.. విమానం విరిగిపోయి పడిపోతుందని అనుకుంటున్నారా? కానే కాదు.. విమానం కూలిపోయే పరిస్థితి వస్తే ప్రయాణికులకు ఎలాంటి అపాయం లేకుండా ఇలా కిందకు దిగుతుందన్న మాట. రష్యాకు చెందిన తతెరెంకో వాదిమీర్ నికొలావెచ్ అనే ఏవియేషన్ ఇంజనీర్ ఈ సరికొత్త డిజైన్ రూపొందించారు. విమానానికి ఏదైనా ముప్పు సంభవిస్తే, ప్రయాణికుల కేబిన్ ఇలా విడిపోతుంది. వెంటనే దానికి అమర్చిన పారాచూట్లు తెరుచుకుని కేబిన్ నెమ్మదిగా కిందకు దిగుతుందన్నమాట. నీటిలో దిగినా మునిగిపోకుండా నిరోధించేందుకు వీలుగా కేబిన్ అడుగు భాగంలో రబ్బర్ ట్యూబులు ఏర్పాటు చేస్తామని నికొలావెచ్ తెలిపారు. అయితే ఈ నమూనాపై కొందరు పెదవి విరిచారు. ఇది ఆచరణలో కష్టసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు కిందకు దిగినా.. పైలట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి నొకొలావెచ్ ఎలా స్పందిస్తారో..! -
అయ్యో.. విమానం విరిగిపోయిందా!
-
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురికి గాయాలు
కంకిపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎదురుగా వస్తున వాహనాన్ని తప్పించే క్రమంలోనే బస్సు అదుపుతప్పి వెళ్లి చెట్టును ఢీకొట్టిందని డ్రైవర్ తెలిపాడు.