-
ప్రియాంక పోటీచేస్తే ప్రధాని ఓడేవారు
రాయ్బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్లో ఎన్డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు. అవధ్ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంకఅమేథీ, రాయ్బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్కేకాదు యావత్భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ
రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు?.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. కేరళ వయనాడ్తో పాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారాయన. అయితే టెక్నికల్గా ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దేని వదులుకుంటారు? దేనికి పరిమితం అవుతారు? అనే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అనూహ్యంగా అమేథీ నుంచి ఓడి, వయనాడ్ నుంచి నెగ్గారు. ఈసారి కూడా తొలుత అక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండటంతోపాటు.. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశాయి. ఇక బీజేపీ, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఏకంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ దిగారు. ఉత్తర భారతానికి చెందిన రాహుల్ అసలు వయనాడ్ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అయినా కూడా వయనాడ్ నుంచి రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు.ఇక.. రాయ్బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియాగాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాహుల్ రాయ్బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది. అయితే ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాత్రం ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని ఒక మాటైతే అన్నారు. దీంతో అది రాయ్బరేలీ కావొచ్చనే ఊహాగానాలు తెర మీదకొచ్చాయి. -
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు. ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024 -
Lok Sabha Election 2024: కటాకట్ ఫటాఫట్
నేతల నినాదాలు ఓట్ల వర్షం కురిపించిన సందర్భాలు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! గరీబీ హటావో అంటూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇచి్చన నినాదం అప్పట్లో దుమ్ము రేపింది. ఈసారి మాత్రం నినాదాల కంటే కూడా ముఖ్య నేతల నోటి నుంచి వెలువడ్డ వింత పదబంధాలు అందరినీ ఆకర్షించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందా అని ఓటర్లలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సోదరి ప్రియాంక తమ ప్రసంగాల్లో ‘కటాకట్’ అని విరివిగా వాడారు. అదే పదాన్ని ప్రధాని మోదీ తిరిగి కాంగ్రెస్పైకి సంధించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజíస్వీ యాదవ్ కూడా వెరైటీ హిందీ పదాలను ప్రయోగించారు. రాహుల్ ఆద్యుడు కటాకట్ అనే హిందీ పదాన్ని తొలుత ప్రయోగించింది రాహులే. మిగతా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తామని, ధనవంతుల సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం తెలిసిందే. రాహుల్ తన ప్రచారంలో ఈ హామీలను తరచూ ప్రస్తావించారు. పేదల బ్యాంకు ఖాతాలకు డబ్బులు ‘కటాకట్ కటాకట్’ బదిలీ చేస్తామని ప్రకటించారు. చకచకా అనే అర్థంలో కటాకట్ పదాన్ని ప్రయోగించారు. దీనిపై ప్రజల్లో బాగా స్పందన రావడంతో ప్రియాంక కూడా అందిపుచ్చుకున్నారు. దాంతో కటాకట్ అంటే ఏమై ఉంటుందా అని గూగుల్లో శోధన కూడా పెరిగింది. మోదీ కూడా అదే పదాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్పైకి తిరిగి ప్రయోగించారు. ‘‘ఈ యువరాజులు ప్యాలెసుల్లో పుట్టారు. కష్టపడిందీ లేదు, ఫలితాలు సాధించిందీ లేదు. అందుకే దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని వారు అలవోకగా చెబుతుంటారు. ఎలా? ‘కటాకట్, కటాకట్’’ అని చెప్పుకొచ్చారు. రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గ ప్రజలు వారిని ‘కటాకట్, కటాకట్’ ఇంటిదారి పట్టిస్తారంటూ రాహుల్పై చెణుకులు విసిరారు. తేజస్వి ‘ఫటాఫట్’ తేజస్వీ యాదవ్ కూడా రాహుల్తో కలసి ఓ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్దేశించి.. ‘‘మీకు ఉద్యోగాలు ఫటాఫట్ వచ్చేస్తాయి. ఫటాఫట్. బీజేపీ సఫాచట్, సఫాచట్ (తుడిచి పెట్టుకుపోతుంది). కాంగ్రెస్, లాంతర్కు ఓట్లు తకాతక్ పడిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా గమ్మత్తైన పదాలను ప్రయోగించారు. ‘‘తాము అవినీతి చేసేది లేదు, ఎవరినీ చేయనిచ్చేది లేదని గొప్పలు చెప్పేవారు టీకాల తయారీదారుల నుంచి విరాళాలు, ఎన్నికల బాండ్ల రూపంలో భారీ మొత్తాలు అందుకుంటారు. అలాంటి వారు గటాగట్, గటాగట్, అని చెబుతుంటారు. కానీ ప్రజలు ఓటు ద్వారా వారిని ఫటాఫట్ ఫటాపట్ ఇంటికి పంపించేస్తారు’’ అని బీజేపీపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
న్యూఢిల్లీ/గోరఖ్పూర్(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. యూపీలోని గోరఖ్పూర్లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. -
ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్?
యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్ రాయ్కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.దీనికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే సభ జరిగే వేదికను, తేదీని ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ మహానగర అధ్యక్షుడు రాఘవేంద్ర చౌబే, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ పటేల్ మాట్లాడుతూ ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికారులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వారణాసిలో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్కు మద్దతుగా మే 28 లేదా 29న ఈ ఇద్దరు నేతలూ వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం. -
‘ప్రధాని మోదీ మతం పేరుతో ఓట్లు ఎందుకు అడగాలి?’
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళసూత్రం, మతం, గేదెలు పేరుతో ఎందుకు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ గత పదేళ్లలో తన పాలనపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే.. పాలన పేరుతోనే ప్రజలను ఓట్లు అడగాలి. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. పదేళ్లలో చేసిన పని చెప్పి ఓట్లు అడగాలి. కానీ, మోదీ ఎందుకు అలా కాకుండా మతం, మంగళసూత్రం, గేదెల పేరుతో ఓట్లు అడుగుతున్నారు?. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ నియామక ప్రక్రియి మూలంగా చాలా మంది అభ్యర్థులు తమ విశ్వాన్ని కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగాయి. మహిళలు ఐదు నిత్యావసర వస్తులు కొందామని షాప్కు వెళ్లితే.. కేవలం రెండు వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వస్తుంది. ధరల పెరుగుదల మహిళల్లో తీవ్ర నిరాశ నింపుతోంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ అనే నినాదాన్ని ఇచ్చి.. పదేళ్ల అవుతోంది. మరీ అలాంటప్పుడు ఈ పదేళ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు. ఉజ్వల్ ఎల్పీజీ స్కీమ్, ఊపీఏ-ఎరా స్కీమ్ వంటికి ఎందుకు అభివృద్ధి చేయలేదు?’’ అని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.లోక్సభఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఆదాయన్ని చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందిని, మహిళల మంగళసూత్రాలు సైతం లాక్కుంటారని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసుత్రాన్ని త్యాగం చేసిందని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాయ్బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్ శర్మ బరిలో నిలిచారు. లోక్సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్లమెంట్ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్నాడ్లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: నాలుగో దశ లోక్సభ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని 'ప్రియాంక గాంధీ వాద్రా' సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మొదటి మూడు దశలను చూశారు. ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్క ఓటు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభలోని 28 స్థానాలకు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. -
Priyanka Gandhi: చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు
నందుర్బార్: ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప నేతంటూ మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుండగా ఆయన మాత్రం తనను వేధిస్తున్నారంటూ చిన్నా పిల్లాడిలా ఏడుస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మాదిరిగా ధైర్యసాహసాలను అలవర్చుకోవాలని ప్రియాంక ఉద్బోధించారు. శనివారం ప్రియాంక మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ‘అవినీతిపై ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లు మోదీ చెప్పుకుంటున్నారు. ఆయన వద్దే అధికారం యావత్తు కేంద్రీకృతమై ఉంది. మోదీ అందరి కంటే గొప్పనేత అనీ, ప్రపంచ నేతల మద్దతు ఆయనకు ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, మోదీ మాత్రం తనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు వేధింపులకు పాల్పడుతున్నాయంటూ ఎన్నికల సభల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. కానీ, ఆయనే స్వయంగా ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలి మోదీజీ, ఇది ప్రజా జీవితం. ప్రధాని పదవిని తక్కువ చేయొద్దు’ అని హితవు పలికారు. ‘దుర్గామాతలా వ్యవహరించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి నేర్చుకోండి. ఆమె పాకిస్తాన్ను రెండు ముక్కలు చేశారు. ఆమె మాదిరిగా ధైర్యం, కృతనిశ్చయం కలిగి ఉండండి. కానీ, జాతి వ్యతిరేకి అంటూ ఇందిరను తిట్టిపోసే మీరు, ఆమె నుంచి నేర్చుకునేందుకు ఏముంటుంది?’ అని ప్రియాంక అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం నందుర్బార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో..తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి/తాండూరు: ‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని, బీజేపీని ఓడించడం తెలంగాణ నుంచే మొదలుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ నాయకత్వానికి అండగా నిలవండి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీని మీరంతా సోనియమ్మ అంటున్నారు. నన్ను మీ సోదరిగా భావించండి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తెలంగాణ నుంచే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం తాండూరు, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్షోలు, కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు, కారి్మకులు, రైతులు, మహిళలకు ఎలాంటి మేలు జరగలేదని, తన మిత్రులకే దేశ సంపద దోచిపెట్టారని మండిపడ్డారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ ఫొటో ఎన్నికల సమయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ధ్వజమెత్తారు. కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందని, అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందన్నారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప, దేశానికి ఏం చేశారో ప్రధాని ఒక్క వేదికపైనా చెప్పలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డికి జాతీయా హోదా ఏదీ? చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం అంటే తనకెంతో ప్రేమ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాందీకి మీరంతా ప్రేమను పంచారని, తన తల్లిని సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చి తనకు సోదర సమానులయ్యారని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయిందని చెప్పారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను చట్ట పరిధిలోకి తెస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రిపుల్ ఆర్ సినిమా చూశారా అని ప్రజలను అడిగిన ప్రియాంక... మనకు డబుల్ ఆర్ అంటే రేవంత్రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ అని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లా బీజేపోళ్లు రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో కేవలం కందులే కాదు ఇతర పంటలనూ పండించేలా ప్రోత్సహించారు. నాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వేల కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేసి రద్దు చేసి గోదావరి జలాలను రాకుండా చేశాయని ధ్వజమెత్తారు. ‘మే 9న రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చాను. రైతు భరోసా అందిస్తే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్కు సవాల్ విసిరాను. మే 6న రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశా. కేసీఆర్ఆర్కు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలి’ అని పేర్కొన్నారు. ‘రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని హరీశ్రావు అంటున్నారు. తెలంగాణ రైతుల సాక్షిగా, అనంత పద్మనాభస్వామి వారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేస్తున్నా. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా’ అని తెలిపారు. మోదీ వెంట ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అంబానీ, అదానీ ఉంటే.. రాహుల్ వెంట ఇందిరమ్మ, రాజీవ్ గాం«దీల త్యాగం, సోనియమ్మ, ప్రియాంక గాంధీ, రేవంత్రెడ్డి, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మోదీ పరివారాన్ని ఓడించి, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి దామోదర రాజనర్సింహ, చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్లో ఎన్నికలు జరుగుతుంటే.. పాకిస్తాన్ గురించి ఎందుకు?: ప్రియాంక గాంధీ
లక్నో: అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. పాకిస్తాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు అని అన్నారు. వాస్తవ సమస్యలను గురించి తెలియజేసి ఎన్నికల్లో పోరాడాలని అధికార పార్టీని కోరారు.ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ హిందూ ముస్లిం అంశంపై వ్యాఖ్యలు చేస్తోందని.. ప్రజలు మతం, కులం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు.దేశంలో నిరుద్యోగం మాత్రమే కాకుండా.. ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. ధరలు పెరగటం వల్ల ప్రజలు నిత్యావరస వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. రైతులు కూడా సరైన జీవనోపాధి లేకుండా బాధపడుతున్నారని పేర్కొన్నారు. -
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
లక్నో: ఇప్పటికే మూడు దశల లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు, లోక్సభ ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ గురువారం బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ పోటీ చేసే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ మీద విరుచుకుపడ్డారు. కేంద్రం అందించే ఐదు కేజీల రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవని పేర్కొన్నారు. ఉద్యోగం కావలా? ఐదు కేజీల రేషన్ కావాలా? అని ఎవరినైనా అడిగితే.. తప్పకుండా ఉద్యోగాన్నే కోరుకుంటారని ఆమె పేర్కొన్నారు.ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. తమ సమస్యలను గురించి తెలుసుకుని, వాటిని పరిష్కారం చూపాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం కోసం ఏమి చేసింది, ఎక్కువగా ఉన్న ధరలను తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుందా? రైతులకు, కూలీలకు ఏమైనా సహాయం చేసిందా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.#WATCH | Raebareli, UP: Congress General Secretary Priyanka Gandhi Vadra addresses a public meeting and says, "... 5 kg ration is not going to make the future. You will not become 'Aatmanirbhar' by this. If I ask you what will you choose between employment and a 5 kg ration, you… pic.twitter.com/lNUhsvTxUn— ANI (@ANI) May 9, 2024 -
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
ఢిల్లీ: మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలో ప్రియాంక గాంధీ బలి అయ్యారని కృష్ణం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయింది. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల కొంత నిరాశను మిగిల్చింది.రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రాయ్బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పాను. ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర ఉంది. దీనికి ప్రియాంక గాంధీ బలైపోతోందని మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు.#WATCH | Delhi: Former aide of Congress leader Priyanka Gandhi Vadra, Acharya Pramod Krishnam says, "The way Rahul Gandhi has left Amethi, Congress party workers' morale is down. Priyanka Gandhi not contesting the election, this is now taking the shape of a volcano in the hearts… pic.twitter.com/ynbNsTYkqG— ANI (@ANI) May 4, 2024 -
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని రెండు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన ఆమేథీ, రాయ్బరేలీలో అభ్యర్థులను శుక్రవారం ప్రకటించటంతో సస్పెన్షన్ వీడింది. ఆమేథీలో కిషోరీ లాల్ శర్మ, రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్టీ అధిష్టానం బరిలోకి దించటంతో వారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆమేథీ స్థానం విషయంలో బీజేపీ.. రాహుల్ గాంధీ క్యాంప్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ క్యాంప్.. ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కావాలనే కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.‘ఆమేథీలో ఎంతో ప్రజాదరణ ఉన్న రాబర్ట్ వాద్రాను ఆ స్థానం నుంచి కావాలనే పక్కకు తప్పించారు. ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్యాంప్ చేసిన పనే. తర్వలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ నాయకత్వానికి రెబల్గా మారుతారు’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘ఎక్స్’ వేదికగా అన్నారు.Sapre a moment for Robert Vadra, who, despite claiming immense popularity in Amethi, was overlooked for the seat. It is obvious that Rahul Gandhi camp is systematically marginalising both, Priyanka Vadra and her husband, in the Congress. How soon before the sister rebels?— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 4, 2024ఇటీవల రాబర్ట్ వాద్రా తనకు ఆమేథీలో ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు. అదీ కాక.. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశంలో కోరుకుంటోందని తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్ భావిస్తే.. రాజకీయాల్లోకి వస్తాను. తాను ఆమేథీలోనే పోటీ చేయాలని లేదు.. మొరాదాబాద్, హర్యానాలో కూడా పోటీ చేస్తానన్నారు. ఇక.. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ కంచుకోట స్థానమైన ఆమేథీ సీటు ఆశించినట్లు పరోక్షంగా వెల్లడి అయింది.మూడు పర్యాయాలు రాహుల్గాంధీ ఆమేథీ స్థానంలో అనూహ్యంగా 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరో నియోజకవర్గంలో కేరళలోని వాయ్నాడ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. 2019లో రాయ్బరేలీలో విజయం సాధించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఆ స్థానంలో అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. -
Lok sabha elections 2024: ‘రహస్య వ్యూహం’ ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాయ్బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. అరంగేట్రం వయా ఉప ఎన్నిక ! వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్వాదీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్బరేలీ, వయనాడ్లలో రాహుల్ గెలిస్తే రాయ్బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. -
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
రాయ్బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. కాగా ప్రియాంకను రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.చదవండి:Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.రాయ్బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు. -
గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
-
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
రాయ్పూర్: లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఛత్తీస్గఢ్లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లాలోని చిర్మిరి పట్టణంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. కోర్బా లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జ్యోత్సానా మహంత్ మద్దతు కోసం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేశంలో రెండు రకాల నాయకులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఒకరు అవినీతిపరులు, మరొకరు ప్రజల సంక్షేమం, సమస్యల గురించి ఏమీ మాట్లాడకుండా ఉండే వారు. ఐదు కేజీల రేషన్ అందించడం ద్వారా ప్రజలను డిపెండెంట్గా మార్చాలని బీజేపీ యోచిస్తోంది. దానికి బదులుగా ఉద్యోగాలు పొందటానికి అవకాశాలు సృష్టించాలని ప్రియాంక గాంధీ కోరారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో, దేశంపై ఎలా దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు.ధరల పెరుగుదల గురించి బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏమీ మాట్లాడారు. గత పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ తన మేనిఫెస్టోకు ‘న్యాయ్ పాత్ర’ అని పేరు పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో పేద ప్రజలకు తప్పా.. పారిశ్రామికవేత్తలకు, బడా నేతలకు అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ స్థానాల్లో మొదటి రెండు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగింటిలో పోలింగ్ జరిగింది. కోర్బాతో సహా మిగిలిన ఏడు స్థానాలకు మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్బరేలీ, ఇటు అమేధీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్ను ఉంచారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీకి దూరం!
కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. మరోవైపు.. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వదిలిపెట్టారు. ఈ క్రమంలో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట ప్రియాంకా గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, మరో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ లోక్సభ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయటానికి పరిమితం కానున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కీలకమైన అమేథీ, రాయ్ బరేలీలో ఏదో ఒక చోట రాహుల్ గాంధీ పోటీ దిగే నిర్ణయాన్ని అదిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... యూపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేవ్లో పోటీ చేయాలని కోరుతున్నారు. అమేథీ స్థానంలో మూడుసార్లు గెలిచిన రాహుల్ మళ్లీ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ రాయ్బరేలీలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అమేథీ, రాయ్బరేలీ రెండు స్థానాలు కాంగ్రెస్కు కంచుకోట. ఇక.. ఇక్కడ ఐదో విడతలో మే 20న పోలింగ్ జరగనుంది. -
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement