Ravi Babu
-
షూటర్.. ఫస్ట్లుక్ చూశారా?
రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం షూటర్. శ్రీ వెంకట సాయి బ్యానర్పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారుఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విభిన్న కథా కథనాలతో షూటర్ను తెరకెక్కించాము. రవి బాబు, ఆమని, ఎస్తార్, రాశి, సుమన్ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా నటించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంటుంది అన్నారు. -
ఆశలు కల్పించి.. పాతాళానికి నెట్టేశారు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఆకాశమంత ఎత్తున ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను పాతాళానికి తోసేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మండిపడ్డారు. బడ్జెట్పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పాల్గొన్న రవిబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 76 స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పూర్తిస్థాయి బడ్టెట్ కూడా పెట్టలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కూటమి ప్రభుత్వం మార్చివేసిందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అంటే... రూ.11లక్షల కోట్లు అప్పు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పించారని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.6.46లక్షల కోట్లు అని తేల్చారని, చంద్రబాబు నిజాయతీ ఇదేనా? అని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నాడు–నేడు ద్వారా రూ.32వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని, రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని మెగా డీఎస్సీ ఇస్తున్నామని, రిలయన్స్, టీసీఎస్ వంటి సంస్థలను తెస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సభ్యులు మాట్లాడుతుండగా మధ్యలో మంత్రులు అడ్డుతగలడం సరికాదని, అన్ని వివరాలు నోట్ చేసుకుని చివరిలో సమాధానం ఇవ్వాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హితవుపలికారు. అనంతర రవిబాబు ప్రసంగం కొనసాగిస్తూ ఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదని తప్పుబట్టారు. అనంతరం టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు. -
మా నాన్న చేసింది తప్పే.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 'పక్కలోకి వస్తారు' అని ఏదేదో వాగారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీని గురించి ఇన్నాళ్ల తర్వాత ఆయన కొడుకు దర్శకనటుడు రవిబాబు స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'మా నాన్న చేసిన ఆ కామెంట్స్ గురించి ఇంతవరకు నేను ఎక్కడా స్పందించలేదు. కానీ నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నేను ఆ టాపిక్ గురించి నాన్నతో అస్సలు మాట్లాడలేదు. అలానే బయట మీడియాతో కూడా అస్సలు మాట్లాడలేదు. కానీ నాన్నతో మాత్రం దీని గురించి.. 'మీరు మాట్లాడిన ఈ మాట కొందరిని నొప్పించి ఉంటే వాళ్లకు సారీ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా' అని అన్నాను. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారుతుంటాం. లూజ్గా మాట్లాడేస్తుంటాం. కానీ వాటిని గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు టంగ్ స్లిప్ అవ్వడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పేశారు కాబట్టి ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది.ఇకపోతే రవిబాబు విషయానికొస్తే.. తండ్రిలానే తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ, నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా విజయ్ దేవరకొండ 'ద ఫ్యామిలీ స్టార్'లో విలన్గా చేశాడు. తాజాగా 'రష్' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
Ravi Babu : తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ రవిబాబు కుటుంబం (ఫొటోలు)
-
ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించారా ?
-
నా జీవితం ఇలా అవడానికి కారణం రవి బాబు..!
-
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
హారర్.. థ్రిల్లర్
రవిబాబు, సత్యప్రకాష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్’. ఈ చిత్రం ద్వారా సీవీఎస్ఎమ్ వెంకట్ రవీంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణార్జున మూవీ మేకర్స్పై పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ–‘‘గతంలో గ్రామాల్లో మాతంగులు జీవించేవారు. వారి జీవితాల ఆధారంగా అల్లుకున్న కథకి హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ మూవీ ద్వారా ముగ్గురు కొత్త అమ్మాయిలను హీరోయి¯Œ ్సగా పరిచయం చేస్తున్నాం. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీకే స్టిల్ రాజ్ కమల్. -
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. కానీ.. : రవిబాబు
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేసేవి. అదంతా ఏమీ లేదని రవిబాబు గతంలో రూమర్స్ను కొట్టిపారేసినప్పటికీ ఆ వదంతుల ప్రచారం ఆగలేదు. తాజాగా రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన అసలు మూవీలోనూ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో రిలేషన్షిప్పై స్పందించాడు రవిబాబు. ఆయన మాట్లాడుతూ.. 'పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పినదానికంటే పూర్ణ 200 శాతం యాడ్ చేసి నటిస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్ అనగానే అందరికీ మొదట పూర్ణ గుర్తొస్తుంది. కానీ ఆమె కొన్నింటినే ఓకే చేస్తుంది. మరికొన్నింటికి నో చెప్తుంది. ఈ మధ్య నా కొత్త సినిమా వాషింగ్ మెషీన్ కోసం ఆమెను సంప్రదించాను. తను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసింది. తను ఒక పాత్రకు సరిగ్గా సరిపోతాను అనుకుంటే మాత్రమే నటిస్తుంది. అంతేతప్ప నాకోసం ప్రత్యేకంగా ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా! అందువల్లే ఆమెకు నచ్చిన సినిమాల్లోనే పూర్ణ నటించింది' అని రవిబాబు చెప్పుకొచ్చాడు. కాగా హిట్ఫ్లాప్లతో సంబంధం లేకుండా సెలక్టెడ్గా సినిమాలు చేసే రవిబాబు అనసూయ, అవును సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2, లడ్డుబాబు, అదుగో సినిమాల్లో పూర్ణ ప్రధాన పాత్రలు పోషించింది. సీమటపాకాయ్ మూవీతో టాలీవుడ్కు పరిచయమైనప్పటికీ అవును సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అఖండ, దసరా చిత్రాల్లోనూ పూర్ణ ముఖ్య పాత్రలు పోషించింది. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. -
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు
-
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు: రవిబాబు
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్న(చలపతిరావు)ను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రవిబాబు మీడియాకు తెలియజేశారు. ‘నాన్న నిన్న రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని..ఆ ప్లేట్ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్గా వెళ్లిపోయారాయన. ఈ రోజు అంత్యక్రియలు చేద్దామనుకున్నాం. కానీ మా అక్కలు ఇద్దరూ అమెరికా లో ఉన్నారు. వాళ్ళు మంగళవారం రాత్రి కి వస్తారు. మంగళవారం వరకు మహా ప్రస్థానం లో ఫ్రీజర్ లో ఉంచుతాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని రవిబాబు అన్నారు. తన తండ్రికి ఎన్టీఆర్, మంచి భోజనం, జోక్స్ అంటే చాలా ఇష్టమని, ఎంతో అభిమానించే ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం తన తండ్రికి దక్కిందని రవిబాబు అన్నారు. -
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
బుధవారం చలపతిరావు అంత్యక్రియలు.. అప్పటిదాకా భౌతికకాయం అక్కడే
రెండురోజుల వ్యవధిలోనే టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. హైదరాబాద్లోని కొడుకు రవిబాబు నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. 1200కు పైగా సినిమాల్లో నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. చలపతి రావు వయస్సు 78 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు రవిబాబు (నటుడు దర్శకుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న కూమార్తెలు రాగానే బుధవారం మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎవరి కెరీర్ను ఎవరూ డిసైడ్ చేయలేరు
‘‘హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నరేశ్ హీరోగా పరిచయమైన ‘అల్లరి’ రిలీజ్ అయి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. నటుడిగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ సినిమా షూటింగ్ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్ చేసి, ఫోటోషూట్ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్ అన్నారు. ‘నరేశ్ కొత్తవాడు, దర్శకుడిగా నువ్వు కొత్తవాడివే. ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోతో వెళితే బెటర్ ఏమో’ అన్నట్లుగా నాన్నగారు (ప్రముఖ దర్శక– నిర్మాత ఈవీవీ సత్యానారాయణ) కూడా చెప్పారు. కానీ రవిగారు నాపై నమ్మకంతో సినిమాను స్టార్ట్ చేశారు. అలా అక్కడి నుంచి ఈదర పోయి అల్లరి స్టార్ట్ అయ్యింది. నా 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. ► కెరీర్ మధ్యలో ‘నేను’, ‘ప్రాణం’ వంటి సీరియస్ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ‘నేను’ చూసి, దర్శకుడు క్రిష్ ‘గమ్యం’లోని గాలి శీను క్యారెక్టర్కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు ‘శంభో శివ శంభో’ సినిమా చేసే అవకాశం వచ్చింది. గమ్యం, శంభో శివ శంభోలో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్ను కూడా చేయగలనని మేకర్స్ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల ‘మహర్షి’లో చేసే చాన్స్ వచ్చింది. ► నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వస్తున్నాయని చాలా మంది అన్నారు. నిజానికి ‘గమ్యం’ సినిమా నేను ఒప్పుకున్నదే. నాన్నగారు ఈ సినిమా చూశాక ‘‘కథగా చెప్పి ఉంటే ఈ సినిమా చేయవద్దనేవాడిని. బాగా చేశావ్. నీకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్లో ఫ్లాప్స్ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్స్ కాలేదని అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను చేసిన ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్ సాధించాయి. అయితే గత కొంతకాలంగా నాకు సరైన హిట్ రాలేదు. నాన్నగారిని ఓ దర్శకుడిగా కన్నా కూడా నేను ఓ ఫాదర్గా బాగా మిస్ అయ్యాను. ‘నాంది’(2021) సినిమా హిట్ సాధించినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ► ‘మహర్షి’ తర్వాత ‘ఇక నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు’ అని ఓ ప్రొడ్యూసర్ అన్నారు. ‘నాంది’ హిట్ తర్వాత ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్ని ఎవరూ డిసైడ్ చేయలేరు. ► ప్రస్తుతం ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాను. మరో మూడు కథలను ఓకే చేశాను. నాకు ‘నాంది’తో హిట్ ఇచ్చిన విజయ్తో మరో సినిమా చేస్తాను. -
హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు
Ravi Babu Gave Clarity On Rumours Over Affair With Poorna: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ దర్శకుడు రవిబాబు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆయన డైరెక్షన్లో పూర్ణ హీరోయిన్గా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రవిబాబు వరసగా ఆమెతో సినిమాలు చేయడం చూసి వారిమధ్య ఎదో నడుస్తోందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై పూర్ణ కానీ, రవిబాబులు కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో నిజంగానే వీరిద్దరికి ఎఫైర్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: ‘మెంటల్’ అంటున్న సమంత, మంటపెట్టేశారన్న సిద్ధార్థ్! ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్పై నటుడు రవిబాబు స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్లతో మాట్లాడటం కానీ, వారిని కలవడం కానీ తాను చేయనని చెప్పాడు. విలువలకు తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇక పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని చెప్పాడు. అంతే తప్పా మరో కారణం వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా రవిబాబు దర్శకత్వంలో ‘అవును’, ‘అవును 2’, ‘లడ్డుబాబు’ సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! -
‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. మంగళవారం.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అనంతరం విష్ణు ప్రెస్మీట్ పెట్టి ప్రకాశ్ రాజ్ ఆరోపణలను ఖండిస్తూ మండిపడిన సంగతి తెలిసిందే. చదవండి: లీగల్గానే మనిషికి రూ.500 ఇచ్చాను : మంచు విష్ణు ఇలా ఎన్నికల వివాదం మరింత ముదురుతున్న తరుణంలో తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అసోసియేషన్ నడపడం మనకు చేత కాదా? ఎవరో వచ్చి నేర్పాలా? అంటూ ధ్వజమెత్తారు. అంతేగాక మన క్యారక్టర్ ఆర్టిస్ట్లకే ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇతర భాషల నుంచి నటులను తెస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
భగభగ మండిపోతున్నా: రవిబాబు
ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథా చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. మూస సినిమాలకు భిన్నంగా కొత్తదనం కోరుకునే దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు, మహమ్మారి కరోనా ‘పుట్టినరోజు’ సందర్భంగా ‘విషెస్’ చెబుతూనే, గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘‘ మై డియర్ కరోనా.. ఇవాళ నీ బర్త్ యానివర్సరీ అని చాలా హ్యాపీగా ఫీలవుతున్నావు కదా. కానీ నేను మాత్రం భగభగ మండిపోతున్నా. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది. అప్పుడు జనమంతా సంతోషపడతారు.(చదవండి: మహమ్మారి ‘పుట్టిన రోజు’ నేడే..!) అంతా మామూలైపోతుంది. నువ్వు చచ్చిపోతావు. అప్పడు నీ డెత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా’’ అంటూ రవిబాబు ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘క్రష్’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతతి తెలిసిందే. కాగా మానవాళిని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ తొలి కేసు వెలుగులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తైంది. నిజానికి కోవిడ్-19 ఎప్పుడు పురుడు పోసుకుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వివరాల ప్రకారం 2019 నవంబర్ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. -
కరోనా ఎఫెక్ట్: ‘క్రష్’ ఫోటోలు వైరల్
టాలీవుడ్లో ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్’. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ను చిత్ర బృందం ప్రారంభించింది. దీనిలో భాగంగా చిత్రానికి సంబంధించిన మరో రెండు పోస్టర్లను మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ‘కరోనా వైరస్’వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్లు ధరించాలంటూ సూచిస్తూ వినూత్న ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కరోనా వైరస్ను కూడా ఉపయోగించుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవచ్చని రవిబాబుకు మాత్రమే తెలుసు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక న్యూఇయర్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్పై కూడా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఆవిరి ఐడియా అలా వచ్చింది
‘‘హారర్ జానర్లో రకాలు ఉన్నాయి. ‘ఆవిరి’ హారర్ మూవీ కాదు. మంచి ఫ్యామిలీ బేస్డ్ థ్రిల్లర్. గతంలో నేను చేసిన ‘అవును, అనసూయ’ చిత్రాలు కూడా థ్రిల్లర్ మూవీసే. హారర్ కాదు. ప్రేక్షకులను భయపెడితే థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకోను’’ అని దర్శక–నిర్మాత, రచయిత రవిబాబు అన్నారు. నేహా చౌహాన్, రవిబాబు, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. నవంబరు 1న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిబాబు చెప్పిన విశేషాలు. ► నేను, ‘దిల్’ రాజుగారు ఎప్పట్నుంచో మంచి మిత్రులం. ఆయన నిర్మించిన ‘బొమ్మరిల్లు’ నాకు చాలా ఇష్టం. మేం ఇద్దరం ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ‘ఆవిరి’ సినిమాతో కుదిరింది. ఈ సినిమా తీయడానికి ముందు ‘దిల్’ రాజుగారికి కథ చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూపిస్తే, బాగుందన్నారు. నేను ఎవరితో సినిమా తీసినా ఫస్ట్ కాపీ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకుంటాను. ► ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో నెక్ట్స్ ఏ చిత్రం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో ఓ స్పిరిట్ ఉందన్న వార్తలు చదివాను. ఈ ఐడియాకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘ఆవిరి’ కథ రాసుకున్నాను. ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయా. ‘సాహో’ వదులుకున్నాను. మళ్లీ నటుడిగా బిజీ అవుతా. ► భారీ బడ్జెట్ సినిమాలు తీయడం కంటే కొత్త ఐడియాలతో ప్రేక్షకుల మెప్పు పొందడమే గొప్పగా భావిస్తాను. ఇప్పటివరకు నేను ప్రయత్నించిన జానర్లు ఎవరూ ప్రయత్నించి ఉండరు. ∙నా దగ్గర నాలుగైదు ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఓ ముసలాయన పాత్ర ఆధారంగా ఓ కథ ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారు బతికి ఉండి ఉంటే ఆయన్ను ఈ క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేసేవాడిని. -
‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు
సినీ అభిమానులకు దీపావళి పండుగు ఒక రోజు ముందే వచ్చేసింది. దీపావళి కానుకగా పలు చిత్రాలు, క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేసి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. టెన్ థౌసెండ్ వాలా పేల్చితే కుర్రకారు ఏ రేంజ్లో ఎగ్జైట్మెంట్కు గురవుతారో.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతిగా కనిపించనున్న విజయశాంతి ఫస్ట్లుక్ చూసి అంతకుమించి ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇక విజేత ఫలితం తర్వాత మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ ఇంట్రస్టెంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సూపర్ మచ్చి’నే టైటిల్గా ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు, మూవీ ఫస్ట్ లుక్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ నయా లుక్లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్గా నటిస్తోంది. Machis.... it is #SuperMachi Title & First look! pic.twitter.com/W3Uml0TKM9 — Kalyaan Dhev (@IamKalyaanDhev) October 26, 2019 ఆది పినిశెట్టి కథానాయకుడిగా కొత్త డైరెక్టర్ పృథ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్గా మారే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీపావళి కానుకగా చిత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్పై ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. నో కట్.. రిలీజ్ డేట్ ఫిక్స్ రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా దీపావళి కానుకగా చిత్ర రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 1న థియోటర్లో కలుద్దామంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్ర టైటిల్, టీజర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకోవడంతో ‘ఆవిరి’ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. కోలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘కనితన్’ సినిమాను ‘అర్జున్ సురవరం’ గా రిమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్లు నిర్మిస్తున్నారు. నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు ‘అర్జున్ సురవరం’రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. -
‘ఆవిరి’పై సూపర్స్టార్ కామెంట్స్
ఈ మధ్య మన హీరోలు టాలీవుడ్లో వస్తున్న మంచి చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలు వచ్చిన సమయంలో.. పెద్ద హీరోలు వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. టీజర్, ట్రైలర్స్ విడుదలైన సమయంలో.. వారికి నచ్చితే వాటిని ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. తాజాగా ఆవిరి సినిమాపై సూపర్స్టార్ మహేష్ బాబు కామెంట్ చేశారు. రవిబాబు తనదైన శైలిలో మరో హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాడు. సినిమా టైటిల్స్తోనే ఆసక్తిని రేకెత్తించే రవిబాబు.. ఈసారి ఆవిరి అనే చిత్రంతో మనముందుకు రానున్నాడు. ఈ మూవీ టీజర్ను చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అన్ని సినిమాల్లోకెల్లా హారర్ జానర్లో వచ్చే వి ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు మాష్టర్.. అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఆవిరి’చిత్ర బృందాన్ని, దర్శకుడు రవిని ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ విష్ చేశాడు. -
అతిథే ఆవిరి అయితే?
‘‘మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. ‘దిల్’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. శనివారం ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. టీజర్లోని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. రవిబాబు గత చిత్రాల్లానే భినంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ప్లే : సత్యానంద్, సంగీతం: వైది. -
భయపెట్టే ఆవిరి
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సంద ర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు. రవిబాబు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుతో ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నా కుదరలేదు కానీ, ఇప్పుడు కుదిరింది. ‘ఆవిరి’ సినిమాకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: వైధి. -
దిల్ రాజు బ్యానర్లో ‘అల్లరి’ దర్శకుడు
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు క్రేజీ కాంబినేషన్స్ను సెట్ చేస్తున్నాడు. ఒకవైపు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల చిత్రాలను నిర్మిస్తూనే మరో వైపు రాజ్ తరుణ్ లాంటి హీరోలతో చిన్న సినిమాలను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత మరో క్రేజీ ప్రాజెక్ట్కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. . విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాను దిల్ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తున్న రవిబాబు భారీ కమర్షియల్ సక్సెస్లు మాత్రం సాధించలేకపోతున్నారు. తాజాగా అంతా కొత్తవారితో ‘ఆవిరి’ అనే టైటిల్తో ఓ సినిమాను రూపొందించాడు రవిబాబు. ఈసినిమాను దిల్ రాజు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్ బ్యాటరీ
సాక్షి, కొత్తగూడెం: ఓ చిన్నారి గొంతులో వాచ్ బ్యాటరీ ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్ హర్యా కూతురు (10 నెలలు) శుక్రవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో పాడైపోయిన చేతి గడియారం బ్యాటరీని మింగగా అది గొంతులో ఇరుక్కుంది. శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని సురక్ష ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ రవిబాబు నాయక్ ఎక్స్రే తీసి గొంతులో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేసి తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రవిబాబు తెలిపారు. -
ఉత్తుత్తి పెళ్లిళ్ల కేసులో భారతీయుడు దోషి
వాషింగ్టన్: భారతీయులు సహా వలసదారులకు అమెరికా పౌరులతో ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయించి మోసానికి పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో నివాసముంటున్న రవిబాబు కొల్లా(47) 2017 –2018 సంవత్సరాల్లో బే కౌంటీ ప్రాంతంలో ఉత్తుత్తి పెళ్లిళ్ల దందా సాగించాడు. అక్కడి ప్రభుత్వం నుంచి రాయితీలు అందేలా చేసేందుకు, స్థిర నివాసం ఉండేలా చేసేందుకు భారతీయులు సహా ఇతర వలసదారులకు అమెరికా పౌరులతో దాదాపు 80 వరకు పెళ్లిళ్లు జరిపించాడు. అతడికి అమెరికా పౌరసత్వం ఉన్న క్రిస్టల్ క్లౌడ్(40) సహకరించింది. ఈ పెళ్లిళ్లకు అమెరికా పౌరసత్వం ఉన్న పనామా సిటీ, కల్హౌన్, జాక్సన్ కౌంటీలకు చెందిన సుమారు 10 మందిని ఆమె ఎంపిక చేసింది. నకిలీ పెళ్లిళ్లు చేయించిన నేరానికి రవిబాబుకు ఐదేళ్ల వరకు, వీసా మోసాలకు గాను 20 ఏళ్ల వరకు శిక్ష పడే చాన్సుంది. -
సీసాలో ఆవిరి
విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేశారు. గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘‘ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని రవిబాబు తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నారు. -
ఏంటా ప్రమాదం?
లైట్ హౌస్ సినీ మ్యూజిక్ పతాకంపై కె.శివశంకర రావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీశ్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరో హీరోయిన్లు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వం వహించారు. శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య పాత్రలు చేశారు. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ–‘‘డ్రంకన్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా ఇందులో చూపించాం. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, వరంగల్ దగ్గరలోని లక్నవరం ఫారెస్ట్లో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమ జంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఈ జంట ఎలా బయటపడ్డారన్నదే కథాంశం’’ అన్నారు శ్రీపాద విశ్వక్ . -
‘అదుగో’ మూవీ రివ్యూ
టైటిల్ : అదుగో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అభిషేక్ వర్మ, నభా నటేష్, రవిబాబు, సాత్విక్ వర్మ సంగీతం : ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం : ఎస్ ఎస్ రాజేష్ దర్శకత్వం : రవిబాబు నిర్మాత : రవిబాబు, సురేష్ బాబు డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్ 3డీ యానిమేషన్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ లాగే.. రవిబాబు పంది కూడా ప్రేక్షకులను మెప్పించిందా..? కథ : దుర్గ అనే రౌడీ రాజధాని ప్రాంతంలోని రైతునుంచి 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించాలని ప్లాన్ చేస్తాడు. కానీ దుర్గ దగ్గర పని చేసే వ్యక్తి ఆ పొలాల డాక్యుమెంట్స్ కాపీ ఉన్న మెమరీ చిప్ను శక్తి అనే మరో రౌడీ మనుషులకు ఇస్తాడు. ఆ చిప్ను శక్తి దగ్గరకు తీసుకెళ్లే సమయంలో చంటి పెంచుకునే బంటి అనే పందిపిల్ల దాన్ని మింగేస్తుంది. శంకర్, గంగరాజు హైదరాబాద్లో ఉండే రౌడీలు. యానిమల్ రేసింగ్లలో బెట్టింగ్లు పెడుతూ దందాలు చేస్తుంటారు. త్వరలో జరిగే ఓ రేసింగ్ కోసం ఓ పందిపిల్ల అవసరం పడుతుంది. పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పటంతో అలాంటి పందిపిల్లను వెతికే పనిలో పడతారు. అలా నలుగురు గూండాలు బంటీ(పందిపిల్ల) వెంటపడటం మొదలవుతుంది. మరి ఈ రౌడీల మధ్య అభి, రాజీ అనే ప్రేమ జంట ఎలా చిక్కుకుంది.? రౌడీల చేతుల్లో పడ్డ బంటి తిరిగి చంటి దగ్గరకు ఎలా వచ్చింది.? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : అదుగో పూర్తిగా రవిబాబు మార్క్ సినిమా. టైటిల్స్ దగ్గరనుంచే రవిబాబు తనదైన క్రియేటివిటీతో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ రవిబాబు తయారు చేసుకున్న కథ బాగుంది. కానీ కథనంలో ఏమాత్రం కొత్త దనం లేకపోవటం, రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం కాస్త నిరాశకలిగిస్తుంది. లైవ్ 3డీ యానిమేషన్లో చూపించిన పందిపిల్ల క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సహజంగా అనిపించదు. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి కూడ పందిపిల్ల గ్రాఫిక్స్ అన్న విషయం అర్ధమైపోతుంది. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా... చాలా చోట్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఎస్ ఎస్ రాజేష్ అందించిన నేపథ్య సంగీతం. ముఖ్యంగా చేజింగ్ సీన్స్లో విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్లాంటి విషయాల్లో కూడా రవిబాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. హీరో ఫ్రెండ్స్గా కనిపించిన విజయ్ సాయి, అజయ్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్లస్ పాయింట్స్ : లైవ్ 3డీ యానిమేషన్ చేజింగ్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : క్యారెక్టరైజేషన్స్ కామెడీ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
రవి మొండితనం నచ్చింది
‘‘ప్రయోగాత్మక సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అందుకే ‘పెళ్ళిచూపులు, కంచెరపాలెం’ వంటి డిఫరెంట్ సినిమాలకు సపోర్ట్ చేశాను. కొత్త ఫిల్మ్ మేకర్స్కు, కొత్త ఆలోచనలకు ఎవరో ఒకరు మద్దతుగా నిలవాలి. అప్పుడే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వస్తుంటుంది’’ అన్నారు నిర్మాత సురేశ్బాబు. బంటి (పందిపిల్ల) ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకులు సురేశ్బాబు చెప్పిన విశేషాలు... ∙‘అదుగో’ సినిమా ఐడియాను రవిబాబు చెప్పినప్పుడు బాగా ఎగై్జట్ అయ్యాను. ఒక్క ‘సోగ్గాడు’ తప్ప మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. ‘అదుగో’ చాలా కష్టమైన సినిమా. త్రీడీ యానిమేషన్లో చేయాలనుకున్నాం. చాలా డబ్బులు ఖర్చుపెట్టిన తర్వాత యానిమాట్రానిక్ పిగ్ (యానిమేషన్ పిగ్) వర్కౌట్ కాలేదు. అప్పుడు త్రీడీ ఆలోచన వచ్చింది. రవి బడ్జెట్ను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అన్ని పనులను తను దగ్గరుండి చేశాడు... చేయించాడు కూడా. అందుకే క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుంది. ఒక దశలో ఈ సినిమాను వదిలేద్దాం అన్నాను. నో సార్ అన్నాడు. రవి మొండితనం బాగా నచ్చింది. ∙ ఇందులో పంది, 3 కుక్కల ఫైట్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో పిల్లుల చేజ్లు, పిగ్ రేస్లు ఉన్నాయి. సినిమాలో బంటి వల్ల రాజధాని భూముల రేట్లు పెరుగుతాయి. లోకల్ గూండాల పనులు తగ్గుతాయి. అవి ఎలా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం. సీక్వెల్ ఆలోచనలు కూడా ఉన్నాయి. ∙ ‘అదుగో’ హిట్ సాధిస్తుందో లేదో తెలీదు. కానీ జానర్ నచ్చింది. లైవ్ యాక్షన్ యానిమేషన్ను నమ్మాను. ఈ టెక్నాలజీ గురించి రాజమౌళికి, శంకర్కి తెలుసు. ఈ ఇద్దరూ అవుటాఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు.టెక్నికల్ స్టాండర్ట్స్ను పెంచుతున్నారు. ఎక్కువమంది ఇలా ఆలోచిస్తే మన సినిమా స్థాయి పెరుగుతుంది. ∙ మా నాన్నగారి (డి. రామానాయుడు) బయోపిక్ కోసం ఇద్దరు ముగ్గురు అడిగినా చేయాలనుకోవడం లేదు. ఓ రెజ్లర్ లైఫ్ ఆధారంగా సినిమా ప్లాన్ చేస్తున్నాం. రానా ‘హిరణ్య’ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ సినిమాకు లీడ్ ప్రొడ్యూసర్ కూడా రానానే. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నక్కిన త్రినా«థరావు, వెంకటేశ్ కాంబినేషన్లో ఓ మూవీ ఉంటుంది. తెలంగాణ లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో ‘దొరసాని’ సినిమా జరుగుతోంది. దర్శకుడు రవికాంత్ పేరెపుతో చేస్తున్న సినిమా తుది దశకు వచ్చింది. సమంత హీరోయిన్గా నందినీరెడ్డి దర్శకత్వంలో కొరియన్ రీమేక్ ‘మిస్ గ్రానీ’ ఉంది. ‘వెంకీమామ’ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుంది. తరుణ్ భాస్కర్తో సినిమాలు ఉన్నాయి. ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఇంకో సినిమాకు కో–ప్రొడ్యూసర్. కొత్త అబ్బాయి నానితో నేనూ, రామ్మోహన్ ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. వేణు ఊడుగులతో ఓ సినిమా ఉంది. ఆయుష్మాన్ ఖురానా చేసిన హిందీ సినిమా ‘అందాథూన్’ బాగుందని, చూడమని సన్నిహితులు చెప్పారు. చూసి వస్తున్నప్పుడు సడన్గా నా కారు ఓ రాయిపై ఎక్కింది. టైర్ పగిలింది. ప్రమాదం జరిగింది. వెంటనే పోలీస్స్టేషన్కి వెళ్లాను. బ్రీత్ టెస్ట్ చేశారు. జీరో వచ్చింది. ప్రమాదం నా తప్పు కాదు. వెహికల్ మిస్టేక్ కూడా ఉంది. ఇందులో గాయపడినవాళ్లందరూ నార్మల్గా వచ్చే వరకూ నాదే బాధ్యత. -
ఆ కష్టం అలవాటైపోయింది
‘‘అదుగో’ సినిమా కోసం రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా. ఈ గ్యాప్లో చాలా అవకాశాలొచ్చినా చేయలేకపోయా. ప్రస్తుతం నన్ను అందరూ మరచిపోయారని కొందరు అంటున్నారు. ‘అదుగో’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశా’’ అని రవిబాబు అన్నారు. పంది పిల్ల (బంటి) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు చేశారు. నిర్మాత సురేశ్బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. రవిబాబు చెప్పిన విశేషాలు. ► డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఓ జంతువు లీడ్ రోల్లో సినిమా తీయాలనిపించింది. హాలీవుడ్ మూవీ ‘ప్లా నెట్ ఆఫ్ ఆది ఏప్స్’ సినిమా ఇష్టం. బడ్జెట్ దృష్ట్యా కోతులతో తెలుగులో సినిమా చేయడం సాధ్యం కాదు. ఏనుగు, ఈగ, ఎలుక, జీబ్రాతో పాటు అన్ని జంతువులతో మనవాళ్లు సినిమాలు చేశారు. పందితో హాలీవుడ్లో సినిమాలొచ్చాయి. కానీ, ఇండియాలో రాలేదు. అందుకే పందిని కథా వస్తువుగా ఎంచుకున్నా. ► పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పందిపిల్లకు ఒక రోజులో ఎదురైన సంఘటనలను వినోదాత్మకంగా చూపిం చాం. ప్రతి పాత్ర వినోదం పంచుతుంది. కమర్షియల్గా ‘అదుగో’ రిస్క్తో కూడుకున్నది. ప్రతిసారి కొత్త కథతో తొలి సినిమాలా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకురావడా నికి శ్రమిస్తుండటంతో ఆ కష్టం అలవాటైపోయింది. ► హాలీవుడ్లో జంతువులపై తీసే సినిమాలకు స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. మన వద్ద ఆ సంస్కృతి లేదు. పంది పాత్రకు హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందేమో? రాజేంద్రప్రసాద్గారిని అడిగితే బాగోదేమో అన్నారు. ఈ సినిమా ట్రెండ్సెట్టర్ అవుతుందని ఒప్పించా. ► ‘అదుగో’ గ్రాఫిక్స్తో తీసిన సినిమాలా అనిపించదు. ప్రస్తుతం చాలా కథలు సిద్ధం చేసుకున్నా. ‘అదుగో’ సినిమాకి ప్రేక్షకుల స్పందన చూసి, మరో నాలుగు భాగాలు చేసే ఆలోచన ఉంది. -
అందుకే దీపావళికి వస్తున్నాం
‘‘అదుగో’ సినిమాకి సహకరించిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాతోనే చాలా మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. మా సినిమాని దీపావళి రోజు విడుదల చేయడానికి కారణం ఉంది. ఆరోజైతే సినిమా తప్పకుండా చూస్తారని వస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేశ్ బాబు. పంది పిల్ల(బంటి) ప్రధాన పాత్రలో, అభిషేక్, నభ నటేష్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. సురేశ్ బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్లో ఈ సినిమాని చూపిస్తుండటం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సినిమాలో నటించిన పందిపిల్లతో చిత్ర యూనిట్ అంతా కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర చేశారు. రవి బాబు మాట్లాడుతూ– ‘‘ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. మా సినిమాకి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. అందుకే ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమాని తప్పక చూడండి.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి’’ అన్నారు. ‘‘నటుడిగా నా ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’. నా 101 వ సినిమా ‘అదుగో’. ‘నచ్చావులే’ సినిమా లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్, హీరో అభిషేక్ వర్మ, చిత్ర బృందం పాల్గొన్నారు. -
‘అదుగో’ ప్రమోషన్
-
‘అదుగో’ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు!
పంది పిల్ల ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంత్ విహారి స్వరాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ లో చూపిస్తుండడం విశేషం.. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో హైదరాబాద్లో పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలుగగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ‘ఈ సినిమా కి సహకరించిన అందరికి చాలా థాంక్స్. ఈ సినిమా తోనే చాల మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండ చూస్తారని ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.. దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాలా థాంక్స్.ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
అదుగో నటకిరీటి వాయిస్
వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకంపై స్వీయదర్శకత్వంలో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకొని దీపావళి పండగ కానుకగా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘బంటిగా పందిపిల్ల అందరి మనసులనూ దోచేస్తుంది. తెరపై నిజమైన పంది పిల్లనే చూస్తున్నామనే ఫీల్ని ప్రేక్షకులకు కలిగించడం కోసం లైవ్ యాక్షన్ త్రీడి యానిమేషన్ టెక్నాలజీని వాడాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆడియన్స్కి ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని కూడా తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంతి విహారి స్వరకర్త. -
పందిపిల్లకు రాజేంద్ర ప్రసాద్ వాయిస్
అదుగో.. రవిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జత కలిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీవాళి సందర్భంగా అదుగో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీలకపాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఈయన వాయిస్ ఓవర్ అదుగో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థియేటర్స్ లో ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అదుగో ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రవిబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ టెక్నాలజీని వాడుకున్నారు. తెలుగులో ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాలజీ వాడుకోవడం ఇదే తొలిసారి. అభిషేక్ వర్మ, నభానటాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
'అదిగో' ట్రైలర్ లాంచ్...
-
‘మనిషిలా మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావా?’
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్లో సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అలాగే బంటీ (పందిపిల్ల) చేసే సాహసాలు, కామెడీని కూడా చూపించారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఇతర భారతీయ భాషలన్నింటిలో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
‘అదుగో’ బంటీని పరిచయం చేశారు..!
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమాలో కీలకమైన బంటీ(పందిపిల్ల)ని ఈ టీజర్లో పరిచయం చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. -
అదుగో సినిమా టీజర్ విడుదల
-
‘అదుగో’ ఫస్ట్ లుక్
రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అందర్నీ అలరిస్తుంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న పిల్లలను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. -
ఎలా బయటపడ్డారు
శివ కంఠంనేని, రవిబాబు, వినోద్కుమార్, ఇంద్రజ, రామ్ కార్తీక్, శివ హరీశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ చిత్రకథ బాగా నచ్చి నిర్మించా’’ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. శ్రీపాద విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ఓ ప్రేమ జంట స్నేహితుల సహాయం పొందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. వాటి నుంచి ప్రేమ జంట, ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. యాక్షన్, సస్పెన్స్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఎన్.వి. గోపాల్రావు, కె.శ్రీధర్ రెడ్డి, సంగీతం: సార్క్స్. -
నిన్న దొర నేడు చెర
నిన్న మొన్నటి వరకు ఆయనో దొర.. పోలీస్ దొర.. కానీ నేడు ఆయనకు తప్పలేదు చెర.. ఎన్నో కేసులను ఛేదించారు.. ఎందరో నిందితులను తన వెనుక నిలబెట్టించి మీడియాకు చూపించారు.. కానీ నేడాయనే తన సహచరుల వెనుక నిందితుడిలా తలదించుకొని, చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి.. అధికారం అడ్డదారులు తొక్కితే.. ఎంతటివారైనా అదఃపాతాళానికి దిగజారిపోతారనడానికి నిలువెత్తు సాక్ష్యమే డీఎస్పీ దాసరి రవిబాబు.. మాజీ ఎంపీపీ కాకర పద్మలత, రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఆయన్ను శనివారం పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య దీనవదనంతో చేతులు కట్టుకొని నిలబడిన దృశ్యం అక్కడ గంభీర వాతావరణాన్నే సృష్టించింది. చోడవరంలో లొంగిపోయే ముందు తానేం నేరం చేయలేదని.. కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని రవిబాబు చెప్పగా.. గేదెలరాజును తానే హత్య చేయించానని అంగీకరించారని.. డీసీపీ రవికుమార్మూర్తి తాజాగా ప్రకటించడం విశేషం.. ఈ హత్యకు ముందు జరిగిన సెటిల్మెంట్లో పాల్గొన్న భూపతిరాజు సహా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని.. హత్యకు బ్యాంకాక్లో కుట్ర పన్నారన్న అంశంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించడంతో రవిబాబు పూర్తిగా ఇరుక్కుపోయినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు ఎన్నో కేసుల్లో ఎంతో మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ రవిబాబు శనివారం తానే ముద్దాయిగా మారి తన సహచర అధికారుల వెనుక చేతులు కట్టుకొని నిలబడ్డారు. గేదెల రాజు హత్య కేసులో మీడియా ముందు తనను ప్రవేశపెట్టినప్పుడు డీసీపీ రవికుమార్మూర్తి తనను ఉద్దేశించి చెప్పిన వివరాలను, చేసిన వ్యాఖ్యలను మౌనంగా విన్నారు. ఏసీపీగా పనిచేసినప్పుడు ఇదే సీపీ కార్యాలయంలో తాను ఎదురుపడితే హోంగార్డ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు శాల్యూట్ చేసేవారే.. ఇప్పుడు ఆయన్ను చూసి ముఖం తిప్పుకున్న దయనీయ స్థితి. తాను పోస్టింగ్లు వేయించిన వారు.. తన కింద పని చేసిన వారు సైతం నోరు విప్పి పలకరించలేని పరిస్థితి కల్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు స్మరించుకుంటున్న వేళ.. అదే పోలీసు వ్యవస్థకు కళంకం ఓ పోలీస్ అధికారినే సమాజం ముందు నిల్చోబెట్టాల్సి రావడం పోలీసువర్గాలను కూడా ఇబ్బందికరంగా మారింది. నిన్న రెవెన్యూ..నేడు పోలీస్..బజారున పడ్డ పరువు ఇప్పటికే రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాలతో విశాఖ జిల్లా రెవెన్యూ శాఖ పరువు రాష్ట్ర స్థాయిలో మంటగలిసింది. ఇప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేయడమే కాకుండా అడ్డువచ్చిన వారిని హత్యలు చేయించిన డీఎస్పీ రవిబాబు ఉదంతంతో పోలీసు శాఖ పరువు కూడా బజారుపడింది. ప్రజల రక్షణ కోసం ప్రాణాలిచ్చిన పోలీసులున్నట్టే.. ప్రజల మానప్రాణాలను తమ స్వార్థానికి బలిచేసే వారూ ఉన్నారని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. కాగా నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రవిబాబును శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో లా అండ్ ఆర్డర్ డీసీపీ–2 రవికుమార్ మూర్తి మీడియా ఎదుట హాజరుపర్చారు. అతన్ని నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టాలని మొదట పోలీసులు భావించారు. అయితే ప్రధాన ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెడతారా.. లేదా అంటూ విస్తృత చర్చ జరిగిన నేపథ్యంలో విమర్శలకు తావు లేకుండా డీఎస్పీని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియాలో మాట్లాడనివ్వలేదు ఎలాంటి ముసుగు లేకుండానే రవిబాబును మీడియా ముందు హాజరుపర్చారు. చోడవరంలో లొంగిపోయినప్పుడు ధరించిన దుస్తులతోనే రవిబాబును తీసుకురాగా.. మీడియాతో మాట్లాడనీయకుండానే ఫోటోలు మాత్రమే తీయించి ఆ వెంటనే పంపించేయడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా మీడియా ఎదుట హాజరుపర్చిన నిందితులను ప్రెస్మీట్ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారుల వెనుకే నిల్చోబెడతారు. మీడియా అడిగిన ప్రశ్నలకు వారితో సమాధానాలు కూడా చెప్పిస్తా రు. ఇక్కడ డీసీపీ రవికుమార్ మూర్తే అన్నీ తానై సమాధానాలు చెప్పేశారు. కాకర పద్మలత, గేదలరాజు హత్య కేసుల్లో రవిబాబు పాత్రకు సంబంధించి పక్కా సాక్ష్యాధారాలు సేకరించినట్టు డీసీపీ ప్రకటించారు. ఈ కేసుల్లో ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకునే చాన్స్ లేదంటూ డీసీపీ స్పష్టంగా చెప్పడం విశేషం. గేదెల రాజును తానే హత్య చేయించానని రవిబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడని డీసీపీ వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని..అన్నీ కోర్టులో తేల్చుకుంటానని లొంగిపోయే ముందు చోడవరంలో మీడియాకు చెప్పిన రవిబాబు.. పోలీసులకు మాత్రం తానే హత్య చేయించానని ఒప్పుకోవడం గమనార్హం. పాస్పోర్టు స్వాధీనం ఏసీపీగా పనిచేసినప్పుడు రవిబాబుతో కలిసి పనిచేసిన రంగరాజు ఆధ్వర్యంలో డీఎస్పీ రవిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మురళీనగర్లోని ఆయన ఇంటిలో అణువణువు సోదా చేశారు. పాస్పోర్టు సీజ్ చేశారు. అలాగే చెక్బుక్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక పత్రాలను పక్కదారి పట్టించినట్టుగా చెబుతున్నారు.సెటిల్మెంట్ల కోసం గాజువాకలోని రఘు, రోహిత్ నిర్వహణలో ఉన్న హోటల్స్లో పలు కీలక సమావేశాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే తమదైన శైలిలో విచారణ జరిపి కొంత సమాచారాన్ని రాబట్టినట్టు చెబుతున్నారు. అలాగే ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో కూడా రవిబాబు పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపించాం డీసీపీ–2 రవికుమార్మూర్తి అల్లిపురం: గేదెల రాజు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబుపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, ఏ నిర్ణయమైనా పై స్థాయిలో తీసుకోవల్సి ఉందని నగర శాంతిభద్రతల డీసీపీ–2 టి.రవికుమార్మూర్తి తెలిపారు. శనివారం పోలీస్ కమిసనరేట్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గేదెల రాజు హత్య కేసుతో పాటు, కేసుకు ప్రధాన కారణంగా భావిస్తున్న మాజీ ఎంపీపీ కాకర పద్మలత మరణంపై అనుమానాలు వస్తుండటంతో ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నామన్నారు. కేసులో రెండో నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు దొరికితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. కాకర పద్మ మృతి విషయంలో కాకక పద్మలత తమ్ముడుని విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షాలన్నీ సేకరిస్తున్నామని, అవన్నీ ఈ కేసులో కీలకంగా ఉంటాయని తెలిపారు. పద్మలత హత్య కేసు కూడా.. గాజువాక : రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ఎ–1 నిందితుడిగా ఉన్న ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబుపై గాజువాక పోలీసులు మరో హత్య కేసు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న తన కుమార్తె పద్మలతను రవిబాబే హత్య చేయించాడని ఆమె తండ్రి కాకర నూకరాజు శనివారం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రవిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా పద్మలతను తానే హత్య చేయించినట్టు విచారణ సమయంలో పోలీసు అధికారుల వద్ద రవిబాబు ఒప్పుకున్నట్టు సమాచారం. ఆ నలుగురు ఎవరు? పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు రూ.కోటితో గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకోసం రూ.50 లక్షలు అడ్వాన్స్ కింద ముట్టజెప్పగా, మిగిలిన రూ.50 లక్షల కోసం ఒత్తిడి తేవడంతోనే ఈ హత్యోదంతం చోటు చేసుకుంది. గేదెల రాజు బెదిరింపులకు తలొగ్గి ఫైనల్ సెటిల్మెంట్గా రూ.25 లక్షలు చెల్లించేందుకు రవిబాబు అంగీకరించారు. ఈ మేరకు ఆగస్టు 13న బీచ్రోడ్లోని సుధీర్కు చెందిన గెస్ట్హౌస్లో సెటిల్మెంట్ జరిగినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ భేటీలో రవిబాబు, గేదెల రాజు, భూపతిరాజు శ్రీనివాసరాజులతో పాటు ఏడుగురు పాల్గొన్నారు. వారిలో గేదెలరాజు హతమయ్యాడు, రవిబాబు దొరికిపోయారు. దాంతో భూపతిరాజు కాకుండా మిగిలిన నలుగురు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా తన వద్ద రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయని గేదెల రాజు బెదిరించడంతో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆయనతో ముప్పు తప్పదన్న భయంతోనే అతడ్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికొచ్చిన డీఎస్పీ రవిబాబు భూపతిరాజు శ్రీనివాసరాజుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీసీపీ వెల్లడించారు. నాటీ భేటీలో వీరితో పాటు సెటిల్మెంట్లో పాల్గొన్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కాగా హత్యోదంతంలో పాల్గొన్న 10 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని.. భూపతిరాజుతో పాటు అతడిì డ్రైవర్ను అరెస్ట్ చేయాల్సి ఉందని వివరించారు. భూపతిరాజు చిక్కితే ఈ హత్య కేసుకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభిస్తుందని సీపీ అన్నారు. 27 వరకు రిమాండ్ గాజువాక : రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ రవిబాబుకు గాజువాక 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 27 వరకు రిమాండ్ విధించారు. న్యూపోర్టు పోలీసులు అంతకుముందే ఆయన పాస్పోర్టుతోపాటు బ్యాంకు చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక కోర్టులో హాజరుపరిచారు. సెక్షన్ 302, 201 ప్రకారం రవిబాబుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో రవిబాబు ఫోన్ సంభాషణ విచారణ నిమిత్తం రవిబాబును పోలీసులు గాజువాక కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం ఆయన ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశమైంది. గేదెలరాజు హత్య జరిగిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ అతడి మొబైల్ ఫోన్ స్విచాఫ్లో ఉంది. కోర్టుకు వచ్చిన తరువాత పోలీసుల పర్యవేక్షణ ఉండగానే ఆయన సెల్ఫోన్లో మాట్లాడారు. ఆయన ఎవరి ఫోన్తో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. సెంట్రల్ జైలుకు ఆరిలోవ(విశాఖ తూర్పు): రౌడీ షీటరు గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ దాసరి రవిబాబును శనివారం పోలీసులు విశాఖ కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. ఆయన్ని కారాగారం అధికారులు మొదటి రోజు అడ్మిషన్ బ్లాక్లో ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో అడ్మిషన్ బ్లాక్కే ఆయన పరిమితమవుతారు. సోమవారం ఆయనకు ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకరు షెల్టర్.. మరొకరు బ్యాంకాక్కు టికెట్లు రవిబాబును కాపాడేందుకు ఓ మంత్రి చివరి నిమిషం వరకు విఫలయత్నం చేశారు. గేదెల రాజు హత్యలో తన పాత్ర గురించి వెలుగులోకి వచ్చిన మర్నాడే రవిబాబు ఆ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ మంత్రి సంరక్షణలోనే అతనికి చెందిన ఓ గెస్ట్హౌస్లో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసు తీవ్రతను తగ్గించి తనను బయటపడేయాలని ఆ మంత్రిని వేడుకున్నా ఫలితం దక్కలేదు. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండడంతో.. లొంగిపోమని సలహా ఇచ్చింది కూడా సదరు మంత్రేనని చెబుతున్నారు. లొంగిబాటుకు చోడవరం పోలీస్స్టేషన్ను ఎంచుకోమని చెప్పింది కూడా ఆయనేనని అంటున్నారు. మరోవైపు గేదెల రాజు హత్యకు బ్యాంకాక్లోనే స్కెచ్ వేశారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా బ్యాంకాక్ వెళ్లేందుకు మరో మంత్రి తనయుడు వీరికి టికెట్లు తీసిచ్చినట్లు తెలియవచ్చింది. సరదాగా ఎంజాయ్ చేసే వంకతోనే బ్యాంకాక్ వెళ్లినప్పటికీ అక్కడే గేదెల రాజును హత్యకు పథక రచన చేసినట్టుగా వినికిడి. దీంతో రవిబాబు వెనుక ఉన్న ప్రజాప్రతినిధులెవరు..అతడిని కాపాడాలని వారు ఎందుకంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. -
ఆ హత్యకు బ్యాంకాక్లోనే స్కెచ్...
-
బ్యాంకాక్లో హత్యకు స్కెచ్ వేసిన రవిబాబు..
అది చోడవరం పట్టణం.. ఉదయం 10 గంటలు..ఆ సమయంలో స్కైబ్లూ కలర్ టీషర్టు.. ట్రాక్ సూట్ వేసుకున్న ఓ వ్యక్తి జాగింగ్ చేస్తున్నట్లు వడివడిగా వెళుతున్నారు.. ఈ సమయంలో జాగింగ్ ఏమిటా?.. అని చూసిన వారి ఆశ్చర్యం.. అంతలోనే ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుందే అన్న సందేహం.. ఇవేవీ పట్టించుకోకుండా వడివడిగా ముందుకు సాగిపోయిన ఆ వ్యక్తి అడుగులు నేరుగా పోలీస్స్టేషన్ వైపు వెళ్లాయి.. స్టేషన్ పక్కనే ఉన్న కొందరు ట్యాక్సీ డ్రైవర్లు ఆ ముఖాన్ని గుర్తుపట్టారు.. అరే డీఎస్పీ రవిబాబే.. అంటూ విస్మయానికి గురయ్యారు. పరిగెత్తుకొచ్చారు. అదే సమయానికి మీడియా ప్రతినిధులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. రవిబాబు స్టేషన్కు చేరుకున్న సమయానికే సీఐ, ఎస్సైలిద్దరూ అక్కడే ఉన్నారు.లొంగిపోతానని చెప్పిన అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం.. వారి ఆదేశాల మేరకు వాహనంలో న్యూపోర్టు పోలీస్స్టేషన్కు తరలించడం.. కలలో జరిగినట్లు 20 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి.. రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ఏ1గా ఉన్న రవిబాబును న్యూపోర్టు స్టేషన్కు ఉదయం 11కు తీసుకెళ్లినా.. మధ్యాహ్నం 3.30 వరకు విచారణ ప్రారంభించనే లేదు.. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన వెంటనే మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఏ1 నిందితుడి విషయంలో మాత్రం అత్యంగా గుంభనంగా.. మీడియా దరిచేరకుండా వ్యవహరించడం విశేషం. ఏ1 నిందితుడు లొంగిపోవడంతో.. ఏ2 నిందితుడు ఎక్కడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. అయితే అతడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. హార్బర్ స్టేషన్లో ఉంచారని సమాచారం.. మొత్తానికి శుక్రవారం జరిగిన పరిణామాలను చూస్తే.. అంతా పోలీస్ స్టైల్లోనే సాగుతోందనిపిస్తోంది. విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుల అరెస్టుల పర్వం ఓ ప్రసహనంలా కనిపిస్తోంది. కేసులో ఏ1 నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దాసరి రవిబాబు శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య చోడవరంలో లొంగిపోవడం వెనుక చాలా కథ నడిచిందని అంటున్నారు. ఆయన లొంగిపోయేందుకు తాను గతంలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన చోడవరం స్టేషన్నే ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన కాలంలో టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆయన రెండురోజుల కిందట చోడవరం సమీపంలోని గంధవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడి ఇంట్లో ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హైకోర్టులో బెయిల్ కోసం తీవ్రయత్నాలు చేసినప్పటికీ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని న్యాయవాదులు చెప్పడంతో తప్పని పరిస్థితుల్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకే తనకు వర్గ ప్రాబల్యం కలిగిన చోడవరం ప్రాంతాన్ని ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఓ దశలో పోలీస్ కమిషనరేట్కే వెళ్లి లొంగిపోవాలని భావించినట్టు తెలిసింది. ఆ మేరకు 1989 బ్యాచ్కు చెందిన కొంతమంది రవిబాబు సహచరులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఉన్నతస్థాయి అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోవడం కంటే తాను గతంలో పనిచేసిన, తనకు పరిచయాలు ఎక్కువగా ఉన్న పోలీస్స్టేషన్ పరిధిలోనే లొంగిపోతే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి చోడవరం ఎంచుకున్నట్టు సమాచారం. రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకు బ్యాంకాక్లోనే స్కెచ్ వేశారా? ఈ హత్యలో ఎ–1గా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు తన బినామీలతో కలిసి అందుకే అక్కడికి వెళ్లారా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం లభించినట్టు పోలీసువర్గాల సమాచారం. గేదెల రాజు హత్య కేసులో అనుమానితులను విచారించిన పోలీసులు శుక్రవారం మరోసారి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ విచారణకు హాజరైన ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాచారం ప్రకారం... డీఎస్సీ రవిబాబు తన ప్రియురాలు పద్మలతను హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తనకు బకాయి నగదును ఇవ్వాలంటూ గేదెల రాజు తరచూ గొడవ పడేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే హత్య విషయం బహిర్గతం చేస్తానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఇది తనకు ప్రమాదకరమని భావించిన రవిబాబు గాజువాకలోని తన బినామీల ద్వారా గేదెల రాజుతో సఖ్యతకు విఫలయత్నం చేశాడు. బ్యాంకాక్లో ఏం జరిగింది.. రవిబాబు బృందం గాజువాకలోని తన బినామీలు, అనుచరులతో కలిసి బ్యాంకాక్ వెళ్లారు. ఆ టూర్కు గేదెల రాజును కూడా ఆహ్వానించినప్పటికీ అతడు వెళ్లలేదు. గేదెల రాజు బ్యాంకాక్ వస్తే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, వీలుకాకపోతే అంతమొందించాలన్న ఆలోచనతోనే అతడిని కూడా ఆహ్వానించామని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ పథకం వేసినట్టు విచారణాధికారులకు వివరించాడు. బ్యాంకాక్లో బినామీలందరితోను చర్చించిన తరువాత గేదెల రాజును వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తిరిగి ఇక్కడికి వచ్చిన తరువాత తమ నిర్ణయాన్ని క్షత్రియభేరి పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజుకు వివరించడంతో ఆ సహాయం తానే చేస్తానని భరోసా ఇచ్చారని, అందుకే రవిబాబు తన ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కును ఆయనకు ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. చెక్కు ఇచ్చిన తరువాత కూడా చినగంట్యాడకు చెందిన ఒక బార్ నిర్వాహకుడి ద్వారా గేదెల రాజుతో చర్చలు జరిగినట్టు సమాచారం. గేదెల రాజు హత్య జరగానికి వారం రోజుల ముందు తన బార్కు సమీపంలోనే ఆ బార్ నిర్వాహకుడు ఒక కారులో గంటపాటు గేదెల రాజుతో చర్చించినట్టు సమాచారం. వారిమధ్య ఏ సంభాషణ వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బార్ యజమాని గతంలో లారీ క్లీనర్ అని, రవిబాబుకు బినామీగా మారిన తరువాత వ్యాపారాలు మొదలు పెట్టాడని రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. రూ.10 లక్షల చెక్కు సీజ్... గేదెల రాజు హత్య కోసం రవిబాబు ఇచ్చిన రూ.10 లక్షల చెక్కును విచారణాధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కె.రమణ, శ్రీనివాస్ల సమక్షంలో పోలీసు అధికారులు చెక్కును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఇచ్చిన చెక్కును భూపతిరాజు శ్రీనివాసరాజు ఒక ఫైనాన్షియర్కు ఇచ్చి తొలుత రూ.4 లక్షలను తీసుకున్నట్టు సమాచారం. ఆ నగదునే కిల్లర్లకు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫైనాన్షియర్ నుంచి చెక్కును స్వాధీనం చేసుకున్నారు. మీడియా ముందుకు నిందితుడు రవిబాబు కాగా హత్యకేసులో ఏ1 రవిబాబును శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ రవికుమార్ మూర్తి ...హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. గేదెల రాజును కిరాయి రౌడీలతో రవిబాబు హత్య చేయించారని తెలిపారు. రవిబాబు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. భూపతిరాజుతో కలిసి గేదెల రాజు హత్యకు పథకం రచించారని, అలాగే పోలీసుల వివరాలు, రవిబాబు చెప్పిన వివరాలు సరిపోలాయన్నారు. అనంతరం రవిబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. ఏ2 నిందితుడు ఎక్కడ? కాగా ఏ2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం కిందటే అతన్ని పట్టుకున్న పోలీసులు రెండురోజుల క్రితం వరకు టాస్క్ఫోర్స్ కార్యాలయంలో, తర్వాత హార్బర్ స్టేషన్లో ఉంచి తమదైన శైలిలో విచారణ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హత్య కేసులో దాసరి రవిబాబుది తెర వెనుక పాత్రే కానీ.. భూపతిరాజు పాత్ర మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. హత్యా పథకం అమలు చేసింది మొదలు.. హత్యకు తన క్షత్రియభేరి కార్యాలయాన్ని, సిబ్బందిని వినియోగించడం, సాక్ష్యాధారాలను రూపుమాపడానికి యత్నించడం వంటి కేసులన్నీ భూపతి మెడకు చుట్టుకున్నాయి, ఈ నేపథ్యంలోనే అతను పట్టుబడినా విచారణ పేరిట పోలీసులు గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏ–1 రవిబాబు లొంగిపోవడంతో ఏ2 భూపతిరాజును కూడా నేడో రేపో పోలీసులు తెర ముందుకు తీసుకు వచ్చే అవకాశముంది. -
ఏ1 రవిబాబు అరెస్ట్పై అనుమానాల నీడలు
అల్లిపురం(విశాఖ దక్షిణ): గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు అరెస్ట్ జాప్యంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. రవిబాబుకు మద్దతుగా ప్రకటనలు! ఈ కేసులో పోలీసులు ప్రెస్మీట్ పెట్టిన మరుసటి రోజే పద్మలత తండ్రి కాకర నూకరాజు మీడియా ఎదుట తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు లేవని ప్రకటించటం విస్మయానికి గురిచేసింది. మరో వైపు గేదెల రాజు భార్య కుమారి, పద్మలతను హత్య చేసేందుకు తన భర్త ఎటువంటి సుపారీ తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఆమె కూడా పోలీసులు ప్రెస్మీట్ పెట్టిన మరుసటి రోజే మీడియా ఎదుటకొచ్చి తన భర్త మరణానికి ఆర్థిక పరమైన లావాదేవీలేవీ కారణం కాదని పేర్కొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకర పద్మలతను హత్య చేసేందుకు తన భర్త కోటి రూపాయలుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అందులో యాభై లక్షలు ఇచ్చారని, మరో యాభై లక్షల కోసం రవిబాబును అడిగినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కుమారి ప్రకటించటం వెనుక రవిబాబు ఒత్తిళ్లు ఉన్నట్లుగా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను డీఎస్పీ వేధిస్తున్నాడంటూ పద్మలత ఏడాది క్రితమే అప్పటి సీపీ అమిత్గార్గ్కు మొరపెట్టుకున్నప్పటికీ రవిబాబు ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు స్వీకరించలేదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. పోలీసుల అదుపులోనే నిందితులు..? మరోవైపు నగర పోలీసుల అదుపులోనే గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మరో రెండు రోజుల్లో కోర్టులో హాజరుపరిచేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి డీఎస్పీ దాసరి రవిబాబును స్టీల్ప్లాంట్ గెస్ట్ హౌస్లో ఉంచారని, అతను సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు, పోలీసులు అది గమనించి డాక్టరునే నేరుగా గెస్ట్ హౌస్కు పిలిపించి చికిత్స అందించినట్లు వదంతులు వచ్చాయి. అదే విధంగా భూపతిరాజు శ్రీనివాసరాజును కూడా సోమవారం సాయంత్రానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిందితులను కోర్టులో హాజరుపరచడం వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ హీరోగా రవిబాబు సినిమా
మెగాస్టార్ సినిమా ఇస్తాడన్ననమ్మకంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించకపోవటంతో యంగ్ హీరోతో సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. అశ్వనిదత్ కూతురు నిర్మాతగా తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించే ప్లాన్లో ఉన్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నాడు. రవిబాబు ప్రస్తుతం పంది పిల్ల ప్రధాన పాత్రలో అదుగో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2017లో ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆ తరువాత విజయ్, రవిబాబు కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. -
ఉత్కంఠకు గురి చేసేలా...
‘ఈరోజుల్లో’ ఫేమ్ శ్రీ, రవిబాబు, నాగేంద్రబాబు, సన, షాలిని ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం - ‘త్రివిక్రమన్’. స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టైటిల్ లోగోను చినబాబు, ట్రైలర్ను రఘురామ కృష్ణంరాజు విడుదల చేశారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన హర్రర్ కథ ఇది. చిత్రీకరణ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర య్యాయి. కస్తూరి శ్రీని వాస్ సహకారంతో సహ నిర్మాత రామ కృషాణరావు పరిచ యమై నన్ను ముందుకు నడిపిం చారు’’ అన్నారు. శ్రీ, సంగీత దర్శకుడు రుంకీ గోస్వామి పాల్గొన్నారు. దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, సహ నిర్మాత: తోటకూర రామకృష్ణారావు. -
అదుగో... పంది పిల్ల
రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్గా మొదలుపెట్టేసి, షూటింగ్ పూర్తి చేసేస్తారు. మరో నెల, రెండు నెలల్లో విడుదల అనగా ఆ సినిమా వివరాలు బయటపెడతారు. ఇప్పుడు ఆయన పందిపిల్ల ముఖ్యపాత్రలో ఓ సినిమా చేశారు. ఇందులో అభిషేక్, నాభ ప్రధాన పాత్రధారులు. ‘ఏనుగు’, ‘కోతి’, ‘ఈగ’లు మనల్ని అలరించాయి. వెండితెర పైన వరాహం ముఖ్యపాత్రలో కనిపించనుండటం ఇదే ప్రథమం. అందుకే టాలీవుడ్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ఖరారు చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్బాబు ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘ఇప్పటి వరకూ ఎవరూ తీయని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
మగువలకు తెగువ పాఠాలు
ఆకాశంలో సగభాగమైన మగువలు పారిశ్రామిక, ఉద్యోగ, వ్యాపార, వైమానిక, విద్యారంగాల్లో తమ సత్తాను చాటుతూ అన్నింటా పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. అయినా సరే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మగువలకు తగిన రక్షణ లేక మృగాళ్ల చేతుల్లో హత్యాచారాలకు గురవుతున్నారు. గృహిణుల మెడల్లో చైన్లను పట్టపగలే తెంపుకెళ్లిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయులవుతున్నారు. మగవారి కంటే శారీకంగా మహిళలు తక్కువ బలాన్ని కలిగి ఉంటారు. ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు దుర్మార్గులు వారి జీవితాలను కాలరాచేందుకు సైతం వెనుకాడరు. ఇలాంటి సందర్భాల్లో కనీసం ప్రత్యర్ధిని ఏమీ చేయలేకపోయినా ధైర్యంతో తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఊరూరూ తిరుగుతూ వారికి కరాటేను నేర్పుతున్నారు కొడాలి రవిబాబు, సాగరిక దంపతులు. విజయవాడలో కరాటే శిక్షణను ఇచ్చే రవిబాబును ఏపీలోనే తొలి ఇన్స్ట్రక్టర్గా 2014లో జపాన్ కరాటే అసోసియేషన్ వారు గుర్తించి ధ్రువపత్రాన్ని అందించారు. సాగరిక గన్నవరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తూ... తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహిళల ఆత్మరక్షణకు కరాటేను నేర్పుతున్నారు. దానితోపాటు ప్రజలలో మూఢనమ్మకాలను పారదోలటానికి అవగాహనా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ‘‘మహిళలపై దాడులు ఢిల్లీ తర్వాత విజయవాడలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 2012లో నిర్భయ హత్య జరిగినపుడు మచిలీపట్నంలో 60మంది ఆడపిల్లలకు కరాటేపై శిక్షణా శిబిరం నిర్వహించాం. అదే ఈ ఉచిత కరాటే శిక్షణాశిబిరాలకు ఆరంభం. అమ్మాయిలను అనుసరిస్తూ, వారిని కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు ఆకతాయిలు. వారికి భయపడితే అదే ఆసరాగా తీసుకుని మరో అడుగు ముందుకేస్తారు. చైన్స్నాచర్లయితే, మహిళల మెడలో నుంచి చైన్లను బలవంతంగా లాగేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉంటే కనీసం ఆత్మరక్షణ చేసుకోవచ్చు. అందుకోసం కరాటేలో కొన్ని మెళకువలు ఉన్నాయి. వాటినే క్యాంప్ల ద్వారా ఊరూరా నేర్పుతున్నాం. అలాగే చేతబడి, బాణామతి, చిల్లంగి వంటివాటిపై ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు రవిబాబు, సాగరిక దంపతులు. వారి ప్రయత్నాలు నెరవేరాలని ఆశిద్దాం. - అయికా రాంబాబు సాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా) -
టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ!
కన్నడ నటి 'వజ్రకాయ' ఫేమ్ నభా నతేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతేడాది విడుదలైన కన్నడ మూవీలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో జతకట్టి అక్కడ ఎంట్రీతోనే మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆమె టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. రవిబాబు దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న మూవీలో నతేష్ అరంగేట్రం చేయనుంది. ఈ మూవీతోనే హీరో అభిషేక్ కూడా తెలుగు అభిమానులకు పరిచయం కానున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకైతే ఎలాంటి టైటిల్ ఫిక్సవ్వలేదుని తెలుస్తోంది. అయితే కన్నడలో ఆమె తొలి మూవీకి రవిబాబు తీయబోయే సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కడ పోలికే ఉండదని వార్తలొస్తున్నాయి. ఈ నెల చివర్లో గానీ, ఏప్రిల్ మొదటి వారంలోగానీ షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త నటులను తెరకు పరిచయం చేసే సురేష్ ప్రొడక్షన్ వారు ఈ మూవీ తీస్తున్నారు. విభిన్నకథతో రవిబాబు ఈ మూవీని తెరకెక్కించనున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. -
సైబర్ నేరంలో యువకుడికి రిమాండ్
ఆరిలోవ : ఓ యువతిని వేధించిన యువకుడిని ఆరిలోవ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం... కోటపాడు మండలం, పొడుగుపాలెం ప్రాంతానికి చెందిన బోకం సందీప్ రాజస్తాన్లోని బిట్స్బిలానీలో ఇంజినీరింగ్ చదువుతూ రెండో సంవ త్సరంలో నిలిపేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండా విశాఖపట్నం వచ్చి గీతంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న వినయ్ అనే యువకుడితో స్నేహం చేశాడు. కొన్నాళ్లపాటు వినయ్ ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉండేవాడు. అక్కడ ఉంటూనే సందీప్ ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆ యువతితో అశ్లీల ఫొటోలు తీసుకున్నాడు. ఆ ఫొటోలతో ప్రత్యేకంగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. వాటి ఆధారంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఒకే సెల్ఫోన్లో వేర్వేరు సిమ్ కార్డులు వేసి ఫోన్లు చేసేవాడు. ఆ యువతి నుంచి డబ్బులు నేరుగా తీసుకోకుండా వేరే అకౌంట్లలో వేయమని చెప్పేవాడు. ఆ అకౌంట్ల నుంచి ఏటీఎం కార్డుల ద్వారా అతని అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డ్రా చేసేవాడు. ఇలా పలు విడతల్లో సుమారు రూ.80 వేలు ఆ యువతి ముట్టజెప్పింది. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో ఆ యువతి ఇటీవల ఆరిలోవ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చాకచక్యంగా సోమవారం సందీప్ను పట్టుకుని రిమాండ్కు తరలించారు. అతని నుంచి రూ.4వేలు నగదు, నాలుగు సిమ్ కార్డులు, 3 ఏటీఎం కార్డులు, ఒక పాన్కార్డు స్వాధీనం చేసుకున్నారు. సందీప్కు సహకరించిన అతని స్నేహితుడు వినయ్ పరారీలో ఉన్నాడని, అతనుకూడా ముద్దాయేనని ఏసీపీ వివరించారు. యువతిని మోసం చేయడంతో పాటు సెల్ఫోన్, ఫేస్బుక్ దుర్వినియోగం చేయడంతో సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సందీప్ను పట్టుకున్న సీఐ సీహెచ్ ధనుంజయనాయుడు, ఎస్ఐ కాంతారావు, కానిస్టేబుళ్లు కాళీప్రసాద్, జయకృష్ణ, చందులను ఏసీపీ అభినందించారు. -
‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?
‘విక్టరీ’ వెంకటేశ్ ఏ సినిమాలో చేస్తున్నారు? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ. త్వరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ఇప్పటికే కొంత మంది దర్శకులు వెంకీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ జాబితాలో ముందున్న పేరు రవిబాబు. వెంకీ కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ తయారు చేశారని, త్వరలోనే ఈ సినిమా మొదలవునుందని సమాచారం. -
రవి డైరక్షన్లో వెంకి
-
అందుకే నేను చాలా సినిమాలు వదులుకున్నాను : రవిబాబు
ఈ తరం దర్శకుల్లో రవిబాబు రూటే సెపరేటు. ఆసక్తికరమైన కథాంశాలతో ‘అల్లరి’, ‘అనసూయ’, ‘సోగ్గాడు’, ‘నచ్చావులే’, ‘అవును’ లాంటి సినిమాలు చేయడమే కాకుండా, వైవిధ్యంగా ఆ చిత్రాలకు ప్రచారం చేసుకున్నారు. స్టార్లకన్నా స్టోరీలనే నమ్ముతానంటున్న ఈ సృజనాత్మక దర్శకుని తాజా ప్రయత్నం ‘అవును-2’. ఈ నెల 3న విడుదల కానున్న ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. ‘అవును’కు రెండో భాగం చేయాలని ఎందుకనిపించింది? ‘అవును’ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ నాకు లెక్కలేనన్ని ఫోన్లు. అందుకే రెండో భాగం చేశా. నిజానికి ఆ సినిమా చేస్తున్నప్పుడే, రెండో భాగం చేయాలనుకున్నా. ‘అవును’ ఆఖరి సన్నివేశం చూస్తే మీకర్థమవుతుంది. మీ సినిమాల ప్రచారం భలే గమ్మత్తుగా ఉంటుందే! (నవ్వుతూ) అప్పట్లో కుక్కపిల్లల బొమ్మలతో ‘నచ్చావులే’ సినిమాకు ప్రచారం చేశాం. ‘అవును’ టైమ్లో... పోస్టర్లో భయమేసే అంశమేదో పెడదామని ఏనుగును ఉపయోగించా. ‘అవును2’కి రెండు తలలున్న ఏనుగు వాడా. వీటికి పెద్ద లాజిక్కేమీ లేదు. సినిమాలు వేగంగా తీస్తారని పేరు. కానీ 12 ఏళ్లల్లో 12 సినిమాలే చేయగలిగారు? ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి, ఇంత డబ్బు గడించాలి లాంటి లక్ష్యాలేమీ లేవు. నా మనసుకి నచ్చిన కథతో, అందర్నీ మెప్పించేలా సినిమా తీయాలన్నదే నా కోరిక. కథ నన్ను ఉద్వేగపరచకపోతే నేనస్సలు సినిమా తీయను. తీయలేను. ఎవరో హీరో చేస్తారనో, నిర్మాత అడ్వాన్స్ ఇచ్చారనో తొందరపడను. అందుకే నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. కథ తయారీకి నేను చాలా ఎక్కువ సమయం తీసుకుంటా. మేకింగ్ మాత్రం చాలా వేగంగా చేసేస్తా. స్టార్స్తో సినిమాలు చేసే ఉద్దేశం కూడా లేదా? నేను స్టార్స్ కంటే యాక్టర్స్కే ప్రాధాన్యమిస్తా. బాగా యాక్ట్ చేయగలిగేవాళ్లతోనే నేను పని చేయాలనుకుంటా కానీ, పెద్ద స్టార్స్తో కాదు. అంటే మీ దృష్టిలో స్టార్స్లో యాక్టర్స్ లేరా? స్టార్స్లో కూడా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి నేను స్టార్స్తో సినిమాలు చేయాలనుకోవడం లేదు. నా కథ డిమాండ్ చేసినప్పుడు మాత్రం వాళ్ల కోసం ఎంతకాలమైనా ఆగుతా. హ్యూమర్, హారర్ తరహా చిత్రాలకే పరిమితమయ్యారెందుకని? అదేం లేదు. నెక్ట్ప్ నేను నాకిష్టమైన యాక్షన్ జానర్లో సినిమా చేయనున్నా. నాకు రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్లు, ఇంటర్వెల్ ఫైట్లు, కై్లమాక్స్ ఫైట్లు అంటే చాలా చిరాకు. వాటికి కొంచెం భిన్నమైన యాక్షన్ సినిమానే ప్రేక్షకులకు అందిస్తా. మీ మేకింగ్ స్టయిల్ బాలీవుడ్ తరహాలో ఉంటుంది. హిందీలో ప్రయత్నించొచ్చుగా? నేను హిందీ సినిమాలు చూడటమే చాలా రేర్. దర్శకుడు రాజ్కుమార్ హిరానీ లాంటి కొందరివే చూస్తా. నా మీద బాలీవుడ్ ప్రభావం లేదు. హాలీవుడ్ సినిమాలే ఎక్కువ చూస్తా. మరి తెలుగు సినిమాలు చూడరా? చాలా తక్కువ చూస్తాను. ఈ పదేళ్లలో వచ్చిన ఏ సినిమా నాకు నచ్చలేదు. ఒకే కథతో... ఒకే ఫార్ములాతో ఆర్టిస్టుల్ని మార్చి సినిమాలు తీస్తున్నారు. నచ్చిన సినిమాలు అస్సలు లేవా? ‘హ్యాపీడేస్ నచ్చింది. ‘బొమ్మరిల్లు’ ఎక్స్ట్రార్డినరీ. మరి సినిమాలు చూడకపోతే ప్రేక్షకుల ట్రెండ్ గురించి ఎలా తెలుస్తుంది? నేనసలు ట్రెండ్ గురించి ఆలోచించను. నా సినిమాలే ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటా. నేను ఏ సినిమా తీసినా ఓ ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తా. సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో పెద్దగా కనబడరు? నాకు సినిమా, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు లేవు. రాత్రి 9 గంటలకు పడుకుని, ఉదయం 4-30 గంటలకు నిద్రలేస్తా. ఓ పక్క డెరైక్షన్... మరోపక్క యాక్టింగ్. రెండింటినీ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? నేను డెరైక్షన్ చేసేటప్పుడు వేషాలు ఒప్పుకోను. ‘రుద్రమదేవి’లో రెండుసార్లు నటించే అవకాశం వచ్చింది. మొదటిసారి ‘లడ్డూబాబు’, రెండోసారి ‘అవును-2’ అడ్డుపడ్డాయి. అందుకే ఆ సినిమాలో చేయలేకపోయా. నిజం చెప్పాలంటే... నేను చేసిన సినిమాల కన్నా వదిలేసినవే ఎక్కువ. నాకు యాక్టింగ్ అంటే సరదా. దర్శకత్వం వృత్తి. రెండింటినీ ఆస్వాదిస్తున్నా. దర్శకునిగా మీ ప్రణాళికలేంటి? చాలా ఉన్నాయి. అన్నీ ప్రయోగాలే. ఈ వైవిధ్యమైన పంథాన్ని వదిలే ప్రసక్తి లేదు. -
అరు కథల్ని నడిపించే ఏడో కథ
రవిబాబు, అర్చన, వినోద్కుమార్, భానుశ్రీమెహ్రా, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా, ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహిం చారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. ‘‘భిన్నమైన కాన్సెప్ట్తో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ఆరు కథలను ఏడో కథ ముందుకు నడిపిస్తుంది. చక్కని థ్రిల్లర్. పాటలు ఉండవు. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర పోషిస్తున్నానని అర్చన చెప్పారు. ఓ టిపికల్ కాన్సెప్ట్తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడే నిజమైన హీరో అని ఉత్తేజ్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: పార్వతీచంద్, కెమెరా: ఉదయభాస్కర్ జాస్తి, సంగీతం: తారక రామారావు. -
సినిమా రివ్యూ: లడ్డుబాబు
నటీనటులు: అల్లరి నరేశ్,భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, మాస్టర్ అతుల్, గిరిబాబు నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని సంగీతం చక్రి దర్శకత్వం: రవిబాబు సినిమా రివ్యూ: లడ్డుబాబు ప్లస్ పాయింట్స్: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఏమి లేవు మైనస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే డైరక్షన్ ముష్టి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు) కుమారుడు లడ్డుబాబు (అల్లరి నరేశ్). ఆఫ్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారవుతాడు. ఆస్థి అంతా అమ్మేసి పిసినారి కిష్టయ్య గోవాలో స్థిరపడాలనుకుంటాడు. అయితే ఆస్తి అమ్మడానికి లడ్డుబాబు పెళ్లికి ఓ లింక్ ఉంటుంది. దాంతో కొడుకుకు పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో విసిగిపోయిన కిష్ణయ్య.. లడ్డూని ఇంట్లోంచి తరిమివేస్తాడు. ఇంట్లోంచి వీధిలోకి వచ్చిన లడ్డుబాబుని మూర్తి (అతుల్) అనే పది పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న కుర్రాడు చేరదీసి.. తన ఇంటికి తీసుకుపోతాడు. లడ్డుబాబుని మూర్తి ఇంట్లోకి తీసుకురావడాన్ని తల్లి మాధురి (భూమిక) ఒప్పుకోదు. అయితే లడ్డూని ఇంట్లో ఉండేలా తన తల్లిని మూర్తి బలవంతంగా ఒప్పిస్తాడు. ఇంట్లోకి వచ్చిన లడ్డూబాబుని పెళ్లాడాలని ఓ సమయంలో తన తల్లికి మూర్తి సూచిస్తాడు. మూర్తి చేసిన ప్రపోజల్ ను తల్లి అంగీకరించిందా? ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు లడ్డుని పెళ్లాడాలనుకుంది? లడ్డూబాబుని తన ఇంటికి తీసుకురావడం వెనక మూర్తి ప్లాన్ ఏంటీ? కిష్ణయ్య ఇళ్లు అమ్మి గోవాలో సెటిల్ అయ్యాడా? ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానమే లడ్డూబాబు కథ. విశ్లేషణ: లడ్డుబాబుగా కష్టమైన మేకప్ చేసుకుని అల్లరి నరేశ్ చేసిన ఓ విభిన్న ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్ లోని కమెడియన్, హీరో అంశాలను మేకప్ డామినేట్ చేసింది. అది అల్లరి నరేశ్ లోపమని చెప్పడానికి వీల్లేదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బోండాం చిత్రంలో ఇదే మాదిరి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ చిత్రంలో శరీరం చాలా లావుగా ఉన్నా.. ముఖంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు నవ్వించడానికి వీలు కలిగింది. అయితే ఈ సినిమాలో ముఖం కనిపించకుండా మేకప్ తో సీల్ చేయడంతో నరేశ్ హావభావాలు ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి. దాంతో నరేశ్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చాలా కష్టపడి నరేశ్ చేసిన ప్రయత్నం మేకప్ మాటున వృధాగానే మిగిలి పోయింది. ముష్టి కిష్ణయ్య పాత్రలో కోట శ్రీనివాసరావు అహనా పెళ్లంట చిత్రంలో పిసినారి పాత్రను గుర్తుకు తెచ్చింది. అహనా పెళ్లంట చిత్రానికి కిష్టయ్య పాత్ర ఎక్స్ టెన్షన్ గా ఉంది. కోట కామెడీ అంతో ఇంతో ఊరట కలిగించే అంశం. ఈ చిత్రంలో భూమికకు ఇంపార్టెన్స్ ఉన్నా.. క్యారెక్టర్ డిజైన్ చేయడంలో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాంతో భూమిక క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాలేకపోయింది. మూర్తి పాత్రను పోషించిన అతుల్ పర్వాలేదనిపించాడు. మరో హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకోలేకపోయింది. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటంతో మంచి సంగీతాన్ని అందించడానికి చక్రీకి పెద్దగా పని లేకపోయింది. చక్రీ పాడిన ఓ పాట విసుగు తెప్పించేలా ఉంది. సిరిమల్లే పాట పిక్చరైజన్ ఆకట్టుకుంది. ఫోటోగ్రఫి ఓకే. ఇక డైరెక్టర్ రవిబాబు కథను ఎంచుకోవడంలోనే విఫలయ్యాడని చెప్పవచ్చు. సాదాసీదా కథను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలోనూ తడబాటుకు గురయ్యాడు. క్లైమాక్స్ కోసమే కథను సాగదీసి నడిపించాడా అనే సందేహం సహజంగానే వస్తుంది. ఇక బ్రహ్మనందం, ఆలీ, వేణుమాదవ్ తదితర కమెడియన్ల గెస్ట్ అప్పీయరెన్స్ తో షాక్ ఇచ్చిన రవిబాబు.. వారితో కూడా ప్రేక్షకులకు ఓ మాదిరి సంతృప్తిని ఇవ్వలేకపోయారు. లడ్డుబాబుని చూసి నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన కామెడికి బదులు ఎక్కువ మోతాదులో విషాదానే పంచాడని చెప్పవచ్చు. ట్యాగ్: లడ్డుబాబు కాదు.. ప్రేక్షకులకు లడ్డుబాంబు! -
ధూపవిచిత్రాలు!
సృజన ప్రశాంతంగా ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశంకేసి చూస్తుంటే... నీలిమేఘాలు భారంగా కదులుతుంటే, తెల్లని మేఘాలు దూదిపింజల్లా తేలిపోతుంటాయి. ఆ మబ్బుల్లో ఆకారాలను వెతుక్కోవడం భలే సరదా. అంతటి సృజనాత్మకతను ఆస్వాదించడం అలవాటైన మనసు ఊరుకుంటుందా? అగరువత్తి నుంచి వెలువడే ధూపంలోనూ ఆకారాలు వెతుక్కుంటుంది. అలా ఒక రూపం ఇచ్చి ‘స్మోక్ ఆర్ట్’ అని పేరు పెట్టారు రవిబాబు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపు ఆ బొమ్మలు. స్మోక్ ఆర్ట్ మీద ఆసక్తి కలిగిన సందర్భం! ‘‘దాదాపుగా పదేళ్ల క్రితం ఒకసారి ఇంటర్నెట్లో ఒక ఫొటో చూశాను. ఒక ఫొటోగ్రాఫర్ ధూపాన్ని ఫొటో తీసి దానికి ఫొటోషాప్లో ఒక ఇమేజ్ని అనుసంధానం చేశాడు. దానిని చూసినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఇది. చిత్రకారుడిగా ఎన్నో ప్రయోగాలు చేశాను. దేవుడి ముందున్న సాంబ్రాణి కడ్డీ నుంచి వెలువడే ధూపం గాల్లో కలిసేలోపు ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో! మనం ఎన్ని కోణాల్లో చూస్తే అన్ని రూపాలు కనిపిస్తాయి. నేను ఆసక్తిగా చేసుకున్న అ అలవాటుకి అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ స్ఫూర్తితో ఒక రూపం ఇవ్వగలిగాను. మొదట్లో ఒక బొమ్మ వేయడానికి ఒక రోజు పట్టింది. ఇప్పుడు గంట సేపటికి ఒక బొమ్మ సిద్ధమవుతోంది’’ అన్నారు రవిబాబు. బ్రష్ లేదు... పెయింట్ లేదు..! స్మోక్ ఆర్ట్ వేయడానికి రంగులు, కుంచెలు అక్కర్లేదు. ఒక రూపాన్ని ఊహించుకుని దానిని కంప్యూటర్ స్క్రీన్ మీద డ్రాయింగ్ వేస్తారు. ఫొటోషాప్లో మరికొన్ని ఎఫెక్ట్లిస్తారు. కంప్యూటర్ మౌస్తో అన్ని ఆకారాలనూ గీయడం కష్టం. అలాంటి వాటిని కాగితం మీద పెన్సిల్తో గీసి స్కాన్ చేయాలి. ఆ సాఫ్ట్ కాపీ ఆధారంగా కంప్యూటర్ పెన్సిల్ టూల్తో బొమ్మ పూర్తి చేస్తారు. డిజిటల్ పెయింటింగ్లో ఇదో ప్రక్రియ. బొమ్మను చూస్తే పొగను ఫొటో తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన పొగ కాదు, పొగలా కనిపించే ఒక రకమైన చిత్రకళ. ‘‘ఇందులో సృజనాత్మకత ప్రధానం. ఆ దృష్టి ఉంటే మన చుట్టూ కనిపించే ఏ వస్తువునుంచి అయినా కళారూపాన్ని సృష్టించవచ్చు. ఈ రకమైన రూపకల్పన నాతోనే మొదలైందని అనుకుంటున్నాను. నేను చిత్రకారుడిగా శిక్షణ పొందలేదు. ఉత్తమ్ గారి ఏకలవ్య శిష్యుణ్ని. ఆయనను కలిసి బొమ్మవేయడంలో మెలకువలు అడిగినప్పుడు... మెటీరియల్ వాడకం గురించి సలహాలిచ్చారు. ‘బొమ్మ ఎలా వేయాలనేది చిత్రకారుడే నిర్ణయించుకోవాలి. ఎవర్నీ అనుకరించకూడదు, అనాటమీ తప్పకూడదు’... అన్నారు. నేను ఆ మాటలనే అనుసరిస్తున్నాను’’ అంటారు రవిబాబు. -
'లడ్డుబాబు' ఆడియో వేడుక
-
నగ్నసత్యం మూవీ స్టిల్స్
-
భూమికకు కొడుకు పుట్టాడు!
బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఇటీవలే భూమికకు ఇది అనుభవంలోకొచ్చింది. జస్ట్ రెండు వారాల క్రితమే ఆమె ఓ బాబుకి జన్మనిచ్చారు. ‘బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే.. ఆ తల్లికి జన్మనిచ్చేది ఆ బిడ్డే. బిడ్డతో పాటు ఆ తల్లీ పుట్టినట్లే’ అంటున్నారు భూమిక. భరత్ ఠాగూర్ని వివాహం చేసుకున్న తర్వాత భూమిక పెద్దగా సినిమాలు చేయలేదు. ఆ మధ్య ‘ఏప్రిల్ ఫూల్’ అనే చిత్రంలోనూ. రవిబాబు దర్శకత్వంలో ‘లడ్డూబాబు’లోనూ నటించారు. ఈ రెండూ విడుదలకు సిద్దమయ్యాయి. భూమిక తెరపై కనిపించి చానాళ్లయ్యింది కాబట్టి, ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారని చాలామంది ఊహించారు. కానీ, సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని, గర్భవతిగా ఉన్నప్పుడే ‘ఏప్రిల్ ఫూల్’లో చేశానని భూమిక తెలిపారు. ప్రస్తుతం మాతృత్వం తాలూకు ఆనందాన్ని అనుభవిస్తున్నారామె. త్వరలో మా అబ్బాయికి నామకరణ మహోత్సవం జరపనున్నామని చెబుతూ -‘‘ప్రెగ్నెన్సీ నుంచి తల్లయిన వరకు జరిగిన ప్రయాణానికి సంబంధించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. పుట్టిన బిడ్డను చూసిన క్షణంలో నేను, భరత్ ఆనందం పట్టలేక ఏడ్చేశాం. బాబుకి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జీవితంలో వచ్చిన ఈ కొత్త దశ చాలా చాలా బాగుంది’’ అని తెలిపారు. -
'ఐదు' (పంచభూతాలు) ఆడియో లాంచ్
-
సత్వర తీర్పుతోనే నమ్మకం
పీలేరు, న్యూస్లైన్: కేసుల సత్వర తీర్పుతోనే ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ కే.చంద్రభాను అన్నారు. శనివారం పీలేరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. 22 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎప్పుడు జిల్లాకు వచ్చినా సొంత ఊరికి వచ్చినంత ఆనందంగా ఉంటుందన్నారు. తీర్పులు త్వరితగతిన, సత్వరం పరిష్కరించేలా న్యాయవాదులు కృషిచేయాలన్నారు. ఓ పంచాయతీ కేం ద్రంలో ఐదు కోర్టులు ఉన్న దాఖలా లు పీలేరులో మినహా రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు. పీలేరు బార్ అసోసియేషన్ పనితీరు బాగుందని కితాబిచ్చారు. స్థానికంగా కోర్టు భవనాల నిర్మాణం కోసం 2.47 ఎకరాల స్థలాన్ని ఇచ్చారని, ఇందుకోసం మార్కెట్ విలువ ప్రకారం రూ.1.6 కోట్లు గతంలోనే చెల్లించామని గుర్తుచేశారు. ఇప్పుడు మరో రూ.కోటి చెల్లిస్తే స్థలాన్ని పూర్తి స్థాయిలో అప్పగిస్తామని రెవెన్యూ మెలిక పెట్టినట్లు వాపోయారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక న్యాయవాదులకు సూచించారు. తక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నందున అన్ని కోర్టులలో జడ్జీల నియామకం చేపట్టలేకపోయామన్నారు. అంతకుముందు జస్టిస్ కేసీ.భానుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఆయన్ను స్థానిక బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రవిబాబు, మూడో అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజమౌళిశర్మ, పీలేరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు వీ.కృష్ణమూర్తి, వెంకట కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎం.డీ.రఫీఅన్సారీ, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు 5 కొత్త కోర్టులు మదనపల్లెక్రైం : చిత్తూరు జిల్లాకు ఐదు కొత్త కోర్టులు మంజూరైనట్టు హైకోర్టు న్యాయమూర్తి కే.చంద్రభాను తెలిపారు. శనివారం మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టు ఆవ రణలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కోర్టులపై సమీక్ష నిర్వహించినప్పుడు మదనపల్లెలో 3 వేల కేసులు పెండింగ్లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బార్ అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు అదనపు కోర్టును మంజూరు చేయిం చామని ఆయన వెల్లడించారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. మదనపల్లె బార్ అసోసియేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి 16 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. జిల్లాలో ప్రస్తుతం 54 కోర్టులు ఉన్నాయని, శనివారం పీలేరులో ఒక కోర్టు, మదనపల్లెలో మరో కోర్టు ప్రారంభించడంతో ఈ సంఖ్య 56కు పెరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు వెంకట్రమణ, ఎస్ఎస్ఎస్ జయరాజ్లు పాల్గొన్నారు. -
నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!
యాంకర్లు కథానాయికలుగా మారుతున్న సీజన్ ఇది. సుమ, ఉదయభాను ‘హీరోయిన్లు’ అనిపించుకున్నవారే. వీరిద్దరితో పాటు ఈ మధ్య కొందరు యాంకర్లు కూడా కథానాయికలుగా మారారు. ఇప్పుడు ఆ వరుసలో చేరారు ప్రశాంతి. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘అనగనగా’. శ్రీరాజ్ బల్లా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో రవిబాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఎన్వీయస్ అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘కథానాయికగా నేను నటించిన తొలి సినిమా ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరాజ్కి డెరైక్షన్ కొత్త అయినప్పటికీ తెలివిగా తెరకెక్కించాడు. రవిబాబు లాంటి సీనియర్తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. హీరోయిన్గా కొనసాగినా, యాంకరింగ్ మాత్రం వదలను’’ అన్నారు. -
అనగనగా... అలా జరిగింది
రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య తారలుగా ఎన్.వి.ఎస్. అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్ళ నిర్మించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఓ కీలక పాత్రను పోషించి, శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించారు. రవివర్మ బళ్ళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వి. సాగర్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, సురేష్ కొండేటి, రామసత్యనారాయణ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనం, పాటలు, ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రవివర్మ మంచి బాణీలిచ్చారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు పూర్తిగా సహకరించడంవల్లే సినిమాను అనుకున్నట్లు తీయగలిగాను’’ అన్నారు. -
తొలిప్రేమ పవిత్రత
నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, ఓ దొంగ, ఓ సాధారణమైన అమ్మాయి... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. రవిబాబు, క్రాంతి, చిత్రం శ్రీను, దిలీప్, సాయినాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయారుష్(వన్నీ) దర్శకుడు. ఆర్.సాయిరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి శివబాలాజీ కెమెరా స్విచాన్ చేయగా, డా.శ్రీహరి క్లాప్ ఇచ్చారు. తొలిప్రేమలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళతామని, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్, కెమెరా: దాము నర్రావుల, సంగీతం: దిలీప్, కళ: పి.కిరణ్కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి. -
తొలిప్రేమ పవిత్రత
నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, ఓ దొంగ, ఓ సాధారణమైన అమ్మాయి... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. రవిబాబు, క్రాంతి, చిత్రం శ్రీను, దిలీప్, సాయినాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయారుష్(వన్నీ) దర్శకుడు. ఆర్.సాయిరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి శివబాలాజీ కెమెరా స్విచాన్ చేయగా, డా.శ్రీహరి క్లాప్ ఇచ్చారు. తొలిప్రేమలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళతామని, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్, కెమెరా: దాము నర్రావుల, సంగీతం: దిలీప్, కళ: పి.కిరణ్కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి.