SC ST Welfare
-
ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం ‘మాలల సింహగర్జన’ బహిరంగసభ నిర్వహించారు.చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సభకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షత వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మాల సామాజికవర్గం నేతలు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పొందుపరిచిన రిజర్వేషన్ల సూత్రాలకు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మనువాదుల అండతో ఎస్సీలను చీల్చే కుట్రకు దిగారని ఆరోపించారు. మాలలకు అండగా ఉంటా: వివేక్మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినా వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మాలలందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుల వివక్ష నుంచి దళితులకు స్వాతంత్య్రం కల్పించేందుకు బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వెంకటస్వామి దళితుల కోసమే పోరాడారని.. మాల, మాదిగ అనే తేడా చూడలేదని తెలిపారు. మాలలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తాను మంత్రి పదవి కోసమే మాలల పోరాటాన్ని మొదలుపెట్టానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న కుట్రలను దళిత సమాజం గుర్తించాలని కోరారు. మాల, మాదిగలు కలిసి పోరాడాలి: ఎంపీ మల్లు రవిరిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి పిలుపుని చ్చారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి, రిజర్వే షన్లను ఎత్తేసేలా చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. మాల, మాదిగలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల ని సూచించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల అమ లుకు ఉద్యమించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు, వర్గాలు మాలలపై దోపిడీదారుల ముద్ర వేశాయని ఆరోపించారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకోవడం లేదని, అందరికీ సమ న్యాయం కావాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి శంకర్ రావు చెప్పారు. మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. సభలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే శ్రీగణేష్, పాశ్వాన్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
వర్గీకరణ అమల్లో ముందుంటాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందు భాగాన నిలబడి అమలు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్కుమార్నూ సభ నుంచి బహిష్కరించింది. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్ను ఢిల్లీకి పంపాం.న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదన విని్పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం..’అని సీఎం పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించాలని అన్ని పక్షాలను కోరారు. రాజ్యాంగ ధర్మాసనానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ల కల నెలవేరింది: రాజనర్సింహఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల కల నెరవేరిందని, ఇది చారిత్రక దినమని అన్నారు. వర్గీకరణ అంటే మరో వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు.వర్గీకరణకు వైఎస్సార్ మద్దతిచ్చారు కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మంద కృష్ణమాదిగను జైల్లో పెట్టించింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. మాదిగ బిడ్డ స్పీకర్ అవడంతో కేసీఆర్ సభకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్కుమార్, మందుల సామ్యూల్ కూడా మాట్లాడారు. సుప్రీం తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ స్వాగతించారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేశారని తెలిపారు.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా తీర్పును స్వాగతించారు. కంభంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎల్పీ నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కను నియమిస్తే, ఆయన నాయకత్వంలో పనిచేయలేక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం లభించిందన్నారు. ‘తీర్పునకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినందుకు దళిత జాతుల పక్షాన ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన సీఎం రేవంత్రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తోంది: హరీశ్రావు అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండవులదేనని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని.. అయితే అధికార పక్షం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కడంపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ పారీ్టకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ 2014 నవంబర్ 29న వర్గీకరణ వెంటనే చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి వెళ్లి కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనదని, ఎన్నో త్యాగాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు అరి్పంచిన సంగతి మన కు తెలుసని అన్నారు. అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్రోహం చేసిందని చెప్పా రు.గాంధీభవన్ దగ్గర పెట్రోల్ పోసుకుని కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఏదిఏమైనా ఇది చాలా సంతోషకరమైన సందర్భమని, దశాబ్దాల కల నెరవేరిన రోజని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పోరాటం వల్లే..మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం. ఎంతో మంది సహకరించారుమేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్ సంతోష్హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతేమరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లుసాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్కు మొత్తం రిజర్వేషన్ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
ప్రత్యేక అభివృద్ధికి భారీ నిధి..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా జరిగాయి. రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.50,180.13 కోట్లు కేటాయించింది. గతేడాది చేపట్టిన కేటాయింపులతో పోలిస్తే కాస్త తగ్గి నట్లు కనిపించినప్పటికీ... కార్యక్రమాల వారీగా పరిశీ లిస్తే భారీ కేటాయింపులే జరిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యే క అభివృద్ధి నిధి కేటాయింపులు 2023–2024 బడ్జెట్ కంటే రూ.1803 కోట్లు తగ్గాయి.2024–25 బడ్జెట్లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్) కింద రూ.33124.04 కోట్లు కేటాయించగా... ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్) కింద రూ. 17056.09 కోట్లు కేటాయించారు. 2023–24లో ఎస్సీఎస్డీఎఫ్లో దళితబంధు కింద రూ.17700 కోట్లు కేటాయించగా... వాటిలో పైసా ఖర్చు చేయలేదు. తాజాగా దళితబంధు పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం... ఆ స్థానంలో అంబేడ్కర్ అభయ హస్తం పేరిట కొత్త పథకాన్ని తీసుకొ స్తోంది. ఈ పథకం కింద ప్రస్తుత వార్షిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి గరిష్టంగా రూ.12 లక్షలు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు కాలేదు.గత కేటాయింపుల్లో ఖర్చు 48 శాతమే...2023–24 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం రూ.51983.09 కోట్లు కేటాయించింది. కానీ ఇందులో ఖర్చు చేసింది రూ.25048కోట్లు మాత్రమే. గతబడ్జెట్లో ఎస్సీ నిధి కింద రూ.36750.48 కోట్లు కేటాయించగా... రూ.14649 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఎస్టీ నిధి కింద రూ.15232.61 కోట్లు కేటాయించగా.. రూ.10399 కోట్లు ఖర్చు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. -
Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు. అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు. -
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కవాడిగూడ (హైదరాబాద్): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ (టీఎస్) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్(టీఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్ప్రదేశ్లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్మేడ్ రాయితీలను ప్రకటించింది. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రావాలని సవాలు చేశారు. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా 34.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయని, వాటిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలున్నాయని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు. టీడీపీ నేతలు దళితపల్లెకు వెళ్లి పేదగుడిసె తలుపుతట్టి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా వారు చెబుతున్న మాటలను ప్రస్తావిస్తే చెప్పుతో కొడతారని ఆయన హెచ్చరించారు. చదవండి: AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
AP: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్.. మరో పదేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్ప్లాన్ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయం ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్ప్లాన్ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అన్నారు. సబ్ప్లాన్ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీపీఎం, కేవీపీఎస్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ హర్షం ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (హైదరాబాద్) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్నాయక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటామన్నారు. -
Fact Check: అబద్ధాలు చెప్పటమే అసలు దగా! దిగజారిపోయిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నాడు.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలంటే అత్యంత చులకన. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే ఈసడింపు.. దళితులకు శుద్ధీ శుభ్రం ఉండవంటూ ఏవగింపు. నేడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎస్సీ, ఎస్టీలంటే ఎంతో గౌరవం. ఎక్కడైనా ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అంటూనే మాట్లాడటం మొదలెడతారు. వారి హక్కులను కాపాడటమే కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారికి సమున్నత స్థానమిస్తున్నారు. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. అయినా సరే... ‘ఎస్సీ, ఎస్టీలకు దగా’ అంటూ చంద్రబాబు కళ్లలో సంతోషం కోసమే కథనాలు వండే స్థాయికి దిగజారిపోయింది ‘ఈనాడు’. అసలు ఎస్సీ, ఎస్టీలకు ఎవరేం చేశారు? 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేసింది రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది నవంబరు వరకూ... అంటే మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ.58,353.07 కోట్లు, ఎస్టీలకు 15,660.03 కోట్లు ఖర్చు చేసింది. ఇదీ ఇద్దరికీ తేడా!!. రుణాల మంజూరు కనిపించదా రామోజీ? – ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి, జీవనోపాధి మెరుగుదల కోసమిచ్చే రుణాలు 53 శాతం పెరిగాయి. ఇది సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తాజా నివేదిక చెప్పిందే. – ‘జగనన్న తోడు’ పథకం కింద చిన్న వ్యాపారాలు చేసుకునే 9.05 లక్షల మందికి రుణాలివ్వగా... ఈ ఏడాది మూడో దశలో ఏకంగా 9 లక్షల మందికి రుణాలివ్వాలని లకి‡్ష్యంచారు. వారిలో 5.10 లక్షల మందికి ఇప్పటికే రుణాలిచ్చారు. ఈ రుణాలపై వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 32.51 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లలో ఇచ్చిన రుణాలివీ... ఏడాది రుణ మొత్తం (రూ.కోట్లలో) 2019–20 15,791 2020–21 18,689 2021–22 28,577 పథకాల్లో సింహభాగం... ఎన్నికల మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంలా భావించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రకరకాల పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ ప్రయోజనాన్ని చేకూర్చింది. – ఎస్సీ, ఎస్టీల వివాహాలు, కులాంతర వివాహాలకు సంబంధించి ఎన్నికలకు మూడునెలల ముందు హడావుడిగా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు... ఒక్కరికైనా ఇస్తే ఒట్టు. కానీ బాబు ప్రకటించిన మొత్తాలను రెట్టింపు చేసి మరీ దీనికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. విద్యకు ఇంత ప్రాధాన్యం ఎన్నడైనా ఉందా? ఎస్సీ, ఎస్టీల విద్యను పట్టించుకోవడం లేదనేది రామోజీ విషప్రచారం. చంద్రబాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్య అద్యంతం అక్రమాల పుట్టే. నకిలీ విదేశీ వర్సిటీలను చూపించి తమ వారి ఖాతాల్లోకే డబ్బులు మళ్లించేశారు. ఇది విజిలెన్స్ విచారణలోనూ వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో విదేశాలకు వెళ్లేవారు రాష్ట్రానికి పేరు తెచ్చేలా... ఇక్కడి సంపదను పెంచేలా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్... ప్రపంచంలోని టాప్–100 వర్సిటీల్లో సీట్లు సాధించినవారికి పూర్తి ఫీజును రీఇంబర్స్ చేస్తామని ప్రకటించారు. టాప్–200 వర్సిటీల్లో చేరినవారికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు. అంతేకాదు. నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా విద్యావకాశాలు, మౌలిక వసతులను మెరుగుపరిచింది. ► రాష్ట్రంలోని స్టడీ సర్కిల్స్ ద్వారా విశాలో సివిల్ సర్వీసెస్, విజయవాడలో గ్రూప్–1, తిరుపతిలో బ్యాంకు పోస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్టడీ సర్కిల్స్లో ఈ ఏడాది ఆగస్టు వరకు 10,976 ఎస్సీ విద్యార్థుల కోసం రూ.12.75 కోట్లు ఖర్చు చేశారు. ► ఎస్సీ గురుకులాలకు టీడీపీ హయాంలో 9 ఐఐటీ, 19ఎన్ఐటీ, 18 ఎంబీబీఎస్ సీట్లు వస్తే... ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 57ఐఐటీ, 101ఎన్ఐటీ, 40ఎంబీబీఎస్ సీట్లు సాధించారు ఎస్సీ విద్యార్థులు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. అదే తీరులో గిరిజన సంక్షేమ గురు కులాలనూ ప్రోత్పసహించటంతో గతేడాది 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారు. రాజకీయాల్లో సముచిత స్థానం... వాడుకుని వదిలేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అడుగడుగునా నిర్లక్ష్యమే ఎదురైంది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీల రాజకీయ సాధికారతలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నారనటానికి కేబినెట్లో వారికిచ్చిన స్థానమే నిదర్శనం. తొలి కేబినెట్లో 56 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలను రెండవ విడతలో 70 శాతానికి తీసుకెళ్ళారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. పెద్దల సభ శాసన మండలి చైర్మన్గా కొయ్యే మోషేన్రాజు (ఎస్సీ), వైస్ చైర్మన్గా జకియాఖానం (మైనారిటీ), అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం(బీసీ)ను ఉన్నతస్థానాల్లో కూర్చొబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. 32 మంది వైసీపీ ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలేనంటే... ముఖ్యమంత్రి జగన్ వారికిచ్చిన ప్రాధాన్యమేంటో తెలియకమానదు. ప్రత్యేక కార్పొరేషన్లతో అభివృద్ధికి ఊతం... ఎస్సీ, ఎస్టీలకు వేరువేరు కార్పొరేషన్లతో పాటు ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ వంటి ప్రత్యేక కార్పొరేషన్తో వారి అభివృద్ధికి ఊతమిస్తున్నారు. మాదిగలకు లిడ్క్యాప్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులిచ్చారు. ► స్ధానిక సంస్ధల పదవుల విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాటా 67 శాతం పైనే. 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 9 ఈ వర్గాలకే. 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 వీరివే. పార్టీ గెలిచిన 84 మున్సిపాల్టీలలో 58 స్ధానాలు వీరివే. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 పదవులు ఈ వర్గాలకే కేటాయించారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తెలియకమానదు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 ఈ వర్గాలకే కేటాయించారు. ► ఇవి మాత్రమే కాదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.60 లక్షల వాలంటీర్లలో 84 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే!. ► విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... వేగంగా నిర్మాణ పనులు చేయిస్తున్నారు. 125 అడుగుల ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మృతి వనానికి ప్రభుత్వం రూ.268.48కోట్లు ఖర్చు చేస్తోంది. గిరి జనానికి అండాదండ వివిధ పథకాల్లో ఎస్టీలకు సముచిత వాటా ఇవ్వటంతో పాటు... వారికి భూమి హక్కు(ఆర్వోఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు) కల్పించడంలో ఈ ప్రభుత్వానికి ఎవ్వరూ సాటిరారనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా ఇవ్వగా.. ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏకంగా 2.48,887లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది. ► ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలతో ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటినీ మరుగున పరుస్తూ... చంద్రబాబు కాలమే స్వర్ణయుగమనే ‘ఈనాడు’ రాతలు ఇంకెన్నాళ్లు? -
అభివృద్ధి నిధులు ‘స్పెషల్’!
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఏటా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు పెంచింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ నిధులు పెంచామని తెలిపారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దళితబంధుకు భారీ నిధులు కరోనా ప్రభావం కారణంగా రెండేళ్లుగా సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దగా చేయలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, రోజువారీ జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు పెరగడంతో.. పెండింగ్లో ఉన్న పథకాలు, ఇతర సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ రాయితీ పథకాలకు మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నాయి. -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన సబ్ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
ఎస్సీ,ఎస్టీ నియోజక వర్గాలపై టీ-బీజేపీ ఫోకస్
-
జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్ సదానంద్గౌడ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. -
కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
-
సీఎం హామీల వైఫల్యంపై 30న ధర్నా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచ్చిన హామీల అమల్లో విఫలమైనం దుకు నిరసనగా ఈ నెల 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆధ్వ ర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితబంధు కింద ఎస్టీలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీనేతలు మనోహర్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మోర్చాల నేతలు హుస్సేన్నాయక్, కొప్పు బాషా, ఆలె భాస్కర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు 300 ఎకరాల భూమిని కూడా పంచలేదని విమర్శించా రు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పారన్నారు. -
ఎస్సీ, ఎస్టీలతో మమేకం
సాక్షి, అమరావతి: వారానికోసారి జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవుతారని చెప్పారు. ఆరేళ్ల అనంతరం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఐడీలోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసుల దర్యాప్తు విభాగాన్ని సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి ఎస్వోపీ పంపాలని.. దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్షించి అందులోని లోటుపాట్లను మూడు నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పానని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే వారంలో ఒకసారి కలెక్టర్లు గ్రామ సచివాలయాలను సందర్శించడం తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఈ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తప్పు చేసినవారు తమ వారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్యలు తీసుకుంది. హోంమంత్రి, డీజీపీ ఎంతో సాహసంతో వ్యవహరించి నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకుని చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా వ్యవహరించి ఎస్ఐలు, సీఐలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. బాధితులకు ఆర్థిక సాయం కొనసాగుతుంది వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది కొనసాగుతుంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదు. అందుబాటులో భూమి ఉంటే ఇద్దాం.. లేనిపక్షంలో సేకరించి బాధితులకు పంపిణీ చేద్దాం. ప్రత్యేక కోర్టులు, న్యాయవాదుల నియామకంపై దృష్టి ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు సంబంధించి కమిటీలో ఉన్న సభ్యులు తమ సూచనలు, సలహాలను పోలీసు అధికారులకు ఇవ్వాలి. వీటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు మేధోమథనం చేయాలి. తదుపరి దీనిపై కార్యాచరణ చేపట్టాలి. అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమై వీటిపై మరోసారి చర్చించాలి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, న్యాయవాదుల నియామకం, అలాగే.. బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టి పెట్టాలి. అణగారిన వర్గాల్లో సాధికారత కోసం.. అణగారిన వర్గాలకు మంచి జరగాలి.. సాధికారత రావాలన్న ఉద్దేశంతోనే తొలిసారిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే హోంమంత్రి పదవిని దళిత మహిళకు ఇచ్చాం. విద్యాశాఖనూ దళితులకే ఇచ్చాం. డీజీపీ కూడా ఎస్టీ వర్గానికి చెందిన వారే. అణగారిన వర్గాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. విద్యాశాఖలో కూడా అన్ని విషయాలు తెలిసిన మనిషి ఉండాలని సురేష్ను మంత్రిగా పెట్టాం. తద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, అణగారిన వర్గాల్లో సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం. ఒక దిశగా మనం అడుగులు వేయడం మొదలు పెట్టాం, మన లక్ష్యసాధనలో ప్రగతి కనిపిస్తోంది. 2013 తర్వాత ఇప్పటి వరకు ఈ కమిటీ సమావేశం జరగలేదు. చట్టం అమలుపై గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక దృష్టి లేదని దీంతో స్పష్టమైంది. ఇది శోచనీయం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక ఏటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం. చట్టం అమలు తీరు.. ప్రగతిని మనం సమీక్షించుకుంటాం. గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాం. చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రశంస ► ఈ సందర్భంగా.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. వివిధ కేసుల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని షెడ్యూలు కులాల నేషనల్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్కుమార్బాబు చెప్పారు. ► తూర్పుగోదావరి (రాజమండ్రి), ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఘటనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తన చిత్తశుద్ధిని చూపించిందని కమిటీ సభ్యులు ప్రశంసించారు. ► ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం తక్షణమే స్పందిస్తున్నారని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. దాదాపు ఏడు ఘటనల్లో ఆయా కుటుంబాలను సీఎం ఉదారంగా ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. ► ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఘటనల్లో రూ.60 లక్షలు బాధితులకు ఆర్థిక సహాయం చేశారని అధికారులు తెలిపారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యవహరిస్తున్న అంశాన్నీ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రస్తావించారు. ► ఈ సమావేశంలో పోలీస్ శాఖ రూపొందించిన ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ బుక్లెట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ► హోంమంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునీత, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాల్లో సమీక్ష చేయాలి. ఇందులో కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొనాలి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎస్ఓపీలనూ తయారు చేసి ఇవ్వాలి. అమలు తీరుపై వారు నివేదిక పంపాలి. ఇలా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టి సారిస్తుంది. వీటిపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
పెండింగ్ కేసులపై సత్వర విచారణ: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పెండింగ్ కేసులపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు గురించి మీడియా సమావేశంలో మంత్రులు వివరించారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించాలని తమని సీఎం ఆదేశించారని విశ్వరూప్ వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని.. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్ విమర్శించారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు.. గతంలో పోలిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు తగ్గాయని హోంమంత్రి సుచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6 శాతం విచారణలు పూర్తయితే ఇప్పుడు 7 శాతానికి పెరిగిందని సుచరిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ను మరింత బలోపేతం.. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని, భూమి లేనిచోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచించారని మంత్రి సురేష్ వెల్లడించారు. -
జగనన్న దసరా కానుక
సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి వైఎస్సార్ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్సెంటివ్తో ఎంతో ఉపయోగం నేను నోట్బుక్లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్ పని చేస్తుంది. ఈసారి కోవిడ్ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది. – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా రూ.21 లక్షల సబ్సిడీ పొందాను నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. – సీహెచ్ ఏసుపాదం, ఐఎంఎల్ పాలిమర్స్ కంపెనీ, పశ్చిమగోదావరి మమ్మల్ని నిలబెట్టారు నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్ కంపెనీ స్థాపించి, బల్క్ డ్రగ్లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్ లేదు.. ఇంకోపక్క కోవిడ్.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది. – డి.రవికుమార్, విశాఖపట్నం -
తన వర్గం కోసమే చంద్రబాబు తాపత్రయం
తాడికొండ: చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, మాజీ మంత్రులతో పాటు తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే తాపత్రయ పడుతున్నాడని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ కొదమలకుమార్ విమర్శించారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 27వ రోజుకు చేరాయి. ఆదివారం 26వ రోజు జరిగిన దీక్షల్లో కొదమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని కోర్టుల్లో తన వర్గ న్యాయవాదులను జొప్పించి పేదలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రఘురామకృష్ణరాజు డబ్బు మదంతో మహిళలను వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, ఇంకోసారి ఇలా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబుకు బుద్ధి చెప్పాల్సిందే.. 27వ రోజైన సోమవారం నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయీస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీలతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే సీఎం వైఎస్ జగన్ సంకల్పం గొప్పదని, చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దళిత నేతలు బూదాల సలోమీ, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, పులి దాసు, కొలకలూరి లోకేష్, బందెల భాను కుమార్, గుండాల ప్రసాద్, బుర్రి సుధాకర్, సలివేంద్రపు బాల సుందరం, పెద్దిపాగ బాబు, దాసరి సుదీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల దశ మారబోతుంది
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘జగనన్న–వైఎస్సార్ బడుగు వికాసం పథకం’తో వారి దశ దిశ మారబోతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తలారి వెంకట్రావు, జోగారావు అన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ఏపీఐఐసీ భూకేటాయింపుల్లో కూడా వారికి భూములు కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020– 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం దళిత జాతికి దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం అణచివేతకు గురైన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను అమలు పరచడానికి కంకణబద్ధులయ్యారని కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నారని పేర్కొన్నారు. వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి వందల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో తయారవుతారన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఎస్సీ, ఎస్టీల అదృష్టమన్నారు. మహానేత వైఎస్సార్ పేదలకు, ఎస్సీ, ఎస్టీల కోసం తెచ్చిన ఇండస్ట్రీ పాలసీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు ఏపీలో దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేస్తున్న మేలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉందన్నారు. దేశంలోనే ఉత్తమ విధానం ఎస్సీ, ఎస్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం దేశంలోనే అత్యుత్తమమైనది. ఇంత వరకు ఏ రాష్ట్రంలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి గరిష్టంగా కోటి రూపాయల సబ్సిడీ ఇవ్వలేదు. ఇది ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక. దివంగత వైఎస్సార్ మొదటిసారి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ పాలసీ ప్రకటించి చరిత్ర సృష్టించగా, నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే బెస్ట్ పాలసీ ప్రకటించి ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. – మామిడి సుదర్శన్, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు -
ఎస్సీ, ఎస్టీలకు చేయూత
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమంలో గత సర్కారుకు ఇప్పటి సర్కారుకు స్పష్టమైన తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు కావాలంటే సిఫార్సులతో పాటు దళారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, పలుకుబడి గల వ్యక్తుల చుట్టూ ఉండే వారికే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేవి. గత ప్రభుత్వంలో లక్ష మంది ఎస్సీ, ఎస్టీలకు కూడా రుణాలు ఇవ్వలేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో పాటు ఇతర పథకాల ద్వారా సెప్టెంబర్ ఆఖరు వరకు ఏకంగా 1.35 కోట్ల మందికి (1.06 కోట్లు ఎస్సీలు, 29.50 లక్షల మంది ఎస్సీలు) లబ్ధి చేకూర్చింది. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం అర్హతే ప్రామాణికంగా గత 16 నెలల్లో వైఎస్సార్ నవశకం పేరుతో వలంటీర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి నవరత్నాల గురించి వివరించి, దరఖాస్తులు తీసుకుని, లబ్ధి చేకూర్చారు. ► గత సర్కారు ఈ వర్గాలను బ్యాంకు రుణాలకే పరిమితం చేయగా, ఈ సర్కారు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత మెరుగైన జీవనం సాగించాలనే లక్ష్యంతో ఆయా పథకాలకు సంబంధించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసింది. ► గత సర్కారులో ఎస్సీ ,ఎస్టీల్లోని చిన్న, సన్న కారు రైతులకు రుణాలు అందేవి కాదు. అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 4,54,984 మంది ఎస్సీ రైతులు, 2,77,310 మంది ఎస్టీ రైతులకు లబ్ధి కలిగించింది. సంక్షేమం అంటే ఇలా ఉండాలి గతంలో సంక్షేమం అంటే దళారుల హవా ఉండేది. వారి సంక్షేమం కాగితాల్లోనే కనిపించేది. ఇన్నోవా కార్లు, పలుకుబడి ఉన్న వారికే లబ్ధి కలిగించారు. ఎస్సీ హాస్టల్స్ మూసి వేసిన ఘనత చంద్రబాబుది. ఆయన హయాంలో ఆరువేల స్కూళ్లు మూసేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధమైన సంక్షేమం లేదు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతోంది. సంక్షేమం అంటే ఇది. – కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షుడు, ఐక్య దళిత మహానాడు ఇంతగా సాయం అందడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు గిరిజనులకు నేరుగా ఏ ప్రభుత్వం కూడా సాయం అందించలేదు. పలుకుబడి ఉన్నవారే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళారులు అసలే లేరు. సీఎం వైఎస్ జగన్ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. అన్ని పథకాలకు సంబంధించి నేరుగా సాయాన్ని బ్యాంకు అకౌంట్లో వేస్తుండటం ఇదే ప్రథమం. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు. – ఆరిక సూర్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ -
ఈ నిశ్శబ్దానికి పునాది పూనా ఒడంబడిక
‘‘మీకు రాజకీయ అధికారాలను అందించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ మీకు సీట్లు రిజర్వు చేయించడానికి ముప్పై సంవత్సరాలు రాత్రీ, పగలూ శ్రమించాను. ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళండి. కానీ, మీరు నివసించే చిన్న ఇల్లును తగులబెట్టుకొని మాత్రం అక్కడకు వెళ్ళకండి. కొన్ని రోజుల తర్వాత ఏదో రోజు మీకు మీమీద కోపం కలిగితే, మిమ్మల్ని గెంటివేస్తే ఎక్కడికి వెళతారు. మీరు అమ్ముడుపోవాలనుకుంటే అమ్ముడుపోండి. కానీ మీ సొంత బలాన్ని ధ్వంసం చేసుకొని మాత్రం వెళ్ళవద్దు’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 మార్చి 18న ఆగ్రాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో చేసిన ఉపన్యాసంలోని కొంత భాగం ఇది. రిజర్వేషన్ల ద్వారా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధుల పనితీరును చూసి బాబాసాహెబ్ అన్న మాటలివి. మరోచోట, ‘‘మా ప్రజాప్రతి నిధులు ఆవులింత వస్తే తప్ప నోరు తెరవరు’’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని శాసనసభల్లో 578 మంది ఎస్సీ సభ్యులు, 526 మంది ఎస్టీ శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంటులోని లోక్సభలో ఎస్సీ ప్రతినిధులు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. లోక్సభలో ఇది దాదాపు నాల్గోవంతు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంక్షించినట్లు వీరంతా ఐక్యంగా నిలబడి, ప్రజల పక్షం వహిస్తే, ప్రభుత్వాలు తల్లకిందులవుతాయి. 1956 నాడే కాదు, నేటికీ ఎస్సీ, ఎస్టీల ప్రజాప్రతినిధులు తమ స్వీయచిత్తంతో పనిచేస్తోన్న దాఖలాలు లేవు. అంబేడ్కర్ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు అసమర్థులా? వేరే ఏదైనా కారణాలున్నాయా? ఎన్నో తిరస్కారాల నడుమ, మరెన్నో కుయుక్తులను ఎదుర్కొంటూ బాబాసాహెబ్ చేసిన యుద్ధ ఫలితమే ఈ రాజకీయ రిజర్వేషన్లు. 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని, అప్పుడే వారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని, అందుకోసం సుదీర్ఘం పోరాటం చేశారు. మొదటిసారిగా 1919లో సౌత్బరో కమిటీ ఎదుట తన వాదనలను వినిపించారు. ‘‘అంటరాని కులాలకు స్వయం నిర్ణయాధికారం కావాలి. మా సమస్యలపైన దళితేతరులు కాకుండా, దళితులే మాట్లాడాలి అనే ప్రజాస్వామ్య సూత్రం అమలు జరగాలి. అగ్రవర్ణాల దయాదాక్షిణ్యాలకు దళితులను వదిలేయొద్దు’’అంటూ ప్రజాస్వామ్య భావనలోని సారాంశాన్ని బయట పెట్టారు. 1927లో భారత దేశానికి వచ్చిన సైమన్ కమిషన్ ముందు, ప్రాతినిధ్యం లేని వర్గాలు ప్రజాస్వామ్య దేశంలో పౌరులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. 1930–32ల మధ్య జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంటరాని కులాలు హిందూ సమాజంలో భాగం కాదని, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లోఇండియన్స్, సిక్కులు మతపరమైన మైనారిటీలైనట్టే, నిమ్న వర్గాలు సామాజికంగా మైనారిటీలని, వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రైస్తవులకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. రెండో సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు. అంబేడ్కర్ వాదనను గాంధీ వ్యతిరేకించారు. దళితులను హిందూ సమాజం నుంచి వేరు చేసి చూస్తే సహించలేనని అభ్యంతరం తెలిపారు. అయితే అంబేడ్కర్ వాదనను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రత్యేక ఎన్నికల విధానంతో కూడిన ప్రత్యేక నియోజక వర్గాలను అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. గాంధీ నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. దీనితో కాంగ్రెస్తోపాటు, హిందూ సంఘాలు, మహాత్మాగాంధీ ప్రాణాలు కాపాడమని అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఒక్క గాంధీ కోసం తన జాతి భవిష్యత్తును ఫణంగా పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ గాంధీకి ఏదైనా జరగరానిది జరిగితే, దీన్ని సాకుగా చూపెట్టి తన ప్రజలపై, హిందూ అగ్రకులాలు దాడులు చేసి, మారణహోమం సృష్టిస్తాయని ఆందోళన చెంది, గాంధీతో రాజీకి అంగీకరించారు. దానిపేరే పూనా ఒడంబడిక. సరిగ్గా ఇదే రోజున అంటే 1932 సెప్టెంబర్ 24న బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఛాటింగ్లో అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి, సమాజంలోని అందరి ఓట్లతో జరిగే ఉమ్మడి ఎన్నిక విధానానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో అంటే సమాజంలోని అన్ని కులాల ఓట్లతో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు బాసటగా ఉన్నారని, దీనివల్ల ప్రయోజనం లేదని, మళ్ళీ ప్రత్యేక ఓటింగ్ విధానం (సపరేట్ ఎలక్టోరల్) కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అనే పేరుతో రా>జ్యాంగ సభకు సమర్పించిన నివేదికలో ప్రధానమైన అంశం ఈ సపరేట్ ఎలక్టోరేట్ విధానమే. రాజ్యాంగ సభ అంబేడ్కర్ ప్రతిపాదనను అంగీకరించలేదు. రిజర్వేషన్ల విధానాన్నే రద్దు చేయాలని చూశారు. ఇందులో ప్రధాన సూత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే అంబేడ్కర్ కూడా అదే స్థాయిలో సర్దార్ పటేల్ను ప్రతిఘటించారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అంగీకరించకపోతే, తాను రాజ్యాంగ రచనా సంఘానికి రాజీ నామా చేస్తానని, రాజ్యసభలో తాను కొనసాగలేనని కరాఖండీగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది. అంటే 1919 నుంచి, 1949 నవంబర్ 25 వరకు అంబేడ్కర్ సాగించిన పోరాట ఫలితమే ఇప్పుడు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు. అయితే అంబేడ్కర్ ఆశించిన రాజకీయ రిజర్వేషన్లు రాలేదు. పూనా ఒడంబడిక ప్రభావమే నేటికీ ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల మీద ఉందన్నది వాస్తవం. ఎస్సీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి నూటికి 60 నుంచి 80 శాతం వరకు దళితేతరుల ఓట్లు కావాల్సి ఉంటుంది. ఒకవేళ 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నియోజక వర్గాల పద్ధతి అమలు జరిగితే, ఈరోజు దళిత ప్రజల స్థితిగతులు వేరే విధంగా ఉండేవి. పూనా ఒడంబడిక కుట్రను, ఐఏఎస్ అధికారి, దళిత మేధావి డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు తాను రాసిన ‘అంబేడ్కర్, గాంధీ, పటేల్’ పుస్తకంలో అద్భుతంగా అక్షరీకరించారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి తెలుగులోకి అనువదించిన ఈ చారిత్రక నేపథ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నది రెండే మార్గాలు. కమ్యూనల్ అవార్డులో లాగా ప్రత్యేక నియోజకవర్గాల సాధనకు ఉద్యమించడం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సిన మార్గాలను అన్వేషించడం. పూనా ఒడంబడిక వల్ల నష్టపోయిన నేటి దళిత జాతి తమ భవిష్యత్ కోసమే కాదు, దళిత జాతి జాగృతి కోసం పోరాడాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సబ్ప్లాన్ అమలులో చిత్తశుద్ధి లోపం
‘‘అణగారిన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరమున్నది. అన్ని రకాల వివక్షల నుంచి, దోపిడీ నుంచి వారిని విముక్తి చేయాలి’’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మనకు నిర్దేశిస్తున్నది. మను షులంతా ఒక్కటేననే సమానత్వ భావ నను చట్టబద్ధం చేసింది ఈ రాజ్యాంగం ద్వారానే. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏండ్లు దాటింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. అయినా రాజ్యాంగ పూర్తి స్ఫూర్తి మన పాలనలో కనపడడం లేదు. అక్కడక్కడ, అప్పుడప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కొన్ని విధానాలను రూపొందించినప్పటికీ అవి అమ లులో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధానాలు, చట్టాలు పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. అటువంటి విధానమే ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికోసం ప్రత్యేకించిన నిధుల కేటాయింపులు, బడ్జెట్ విధానాలు. 1974లో మొదటిసారి ట్రైబల్ సబ్ప్లాన్, 1979–80లలో ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ విధా నాలు కూడా అందులో భాగంగా వచ్చినవే. ఆ తర్వాత 2006లో స్పెషల్ కాంపోనెంట్ పేరును షెడ్యూల్ కాస్ట్స్ సబ్ప్లాన్గా మార్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటా యింపులు ఉండాలనేది దాని ఉద్దేశం. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కొన్ని మార్పులు చేశారు. అప్పటి వరకు ఉన్న ప్లాన్, నాన్ప్లాన్ల పేర్లను తొలగించి, క్యాపిటల్, రెవెన్యూ పేర్లను మాత్రమే ఉంచారు. దీనితో సబ్ప్లాన్ అనే పదం మాయమైపోయింది. అంతే కాకుండా, అప్పటివరకు ఉనికిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటుచేశారు. అప్పటివరకు ప్లానింగ్ కమిషన్ చూస్తున్న కర్తవ్యాలను నీతి ఆయోగ్ కిందకి చేర్చారు. దీంతో ఎస్సీ సబ్ప్లాన్, ట్రైబల్ సబ్ప్లాన్ల మీద సమీక్ష చేయాల్సి వచ్చింది. 2017లో నీతి ఆయోగ్ ఒక కమిటీని వేసింది. అది 2019లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో ఎస్సీ సబ్ప్లాన్ పేరును డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ), ట్రైబల్ సబ్ప్లాన్ను డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(డీఏపీఎస్టీ)గా మార్చారు. అదేవిధంగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని చాలా శాఖలు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులను పూర్తిగా ఖర్చుచేయటంలేదని, మరి కొన్ని శాఖలైతే అసలు నిధులను వినియోగించటంలేదని నీతి ఆయోగ్ గుర్తించింది. అంత వరకు అది నిజమే. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకొని, ఏఏ శాఖలైతే ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను రూపొం దించి, అమలు చేస్తున్నాయో వాటికి మాత్రమే నిధులను అధి కంగా కేటాయించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అంతే కాకుండా నీతి ఆయోగ్ నివేదికలో కూడా బడ్జెట్ నిధులు పక్క దారి పట్టకుండా, ఖర్చు కాకుండా ఉండడం లాంటి చర్యలు జరగ కూడదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలలోని చాలా కులాలు, తెగలు కనీసం అభివృద్ధికి నోచుకోవడం లేదని, వాళ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని నీతి ఆయోగ్ సూచించింది. దీనిపై 2001వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం ప్రారంభమైంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించే నిధుల దుర్విని యోగంపై ప్రారంభమైన చర్చ, పరిష్కారం చట్టం మాత్రమేనని, అందుకోసం ఉద్యమించే వరకు వెళ్ళింది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా గ్రూప్లన్నీ ముక్తకం ఠంతో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం కోసం డిమాండ్ చేశాయి. దాని ఫలితంగా, సుదీర్ఘ పోరాటాల అనంతరం 2012లో చట్టం ఆమోదం పొందింది. 2013 జనవరిలో ఈ సబ్ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్రంలో బడ్జెట్లో వచ్చిన మార్పులకను గుణంగా తెలంగాణ ప్రభుత్వం, మరొక చట్టాన్ని ఆమోదించింది. అమలులోకి తెచ్చింది. దానిపేరు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో సైతం సబ్ప్లాన్ చట్టం అమలు అవుతోంది. అక్కడ ఎస్సీ, ఎస్టీలకు అనేక పథకాలు సైతం ప్రవేశపెట్టారు. ఈ చట్టాలలోని అంశాలను అధ్యయనం చేసి, కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని రూపొందించడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసి ఉంటే బాగుండేది. నీతి ఆయోగ్ ఆశిం చినట్టుగానే ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు సద్విని యోగం కావాలంటే కొన్ని చర్యలు శీఘ్రగతిన చేపట్టాలి. అందులో ముఖ్య మైనది చట్టం రూపకల్పన. దానితో పాటు ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ బడ్జెట్లలోవారి జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాలి. అయితే ఈ నిధులు నేరుగా వివిధ శాఖలకు కేటా యించకుండా, కేటాయించిన మొత్తాన్ని బడ్జెట్ నుంచి తీసి నోడల్ ఏజెన్సీలైన ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్ల ఖాతాలకు జమ చేయాలి. ఎస్సీ, ఎస్టీల కోసం ఏఏ డిపార్ట్మెంట్లైతే పథకాలను రూపొం దిస్తాయో, వాటిని పరిశీలించి నోడల్ ఏజెన్సీలు, ఆయా డిపార్ట్ మెంట్లకు కేటాయించాలి. అంతేకాకుండా ఒక సంవత్సరం కేటా యించిన నిధులు అదే సంవత్సరం ఖర్చు కాకపోతే, మరుసటి ఏడాదికి తిరిగి కేటాయించే విధానాన్ని చట్టంలో పొందుపర్చాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలలో ఉన్న వివిధ కులాలు, తెగల కోసం ప్రత్యేకించి మరింత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా తయారు చేయాలి. నూటికి 25 శాతంగాఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గత డెబ్భై ఏళ్ళలో ఆశించినంతగా ముందుకు సాగలేదు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు, భూమి, గృహ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నింటిలో ఇంకా వ్యత్యాసం, అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1974 వరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలు దళిత వాడలకు, ఆదివాసీ గూడేలకు చేరలేదు. రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, వైద్యశాలలు, మంచి నీటి సరఫరా లాంటి సౌకర్యాలు ఈ వర్గాలకు గగన కుసుమాలైనాయి. అందువల్లనే ఆనాటి రాజకీయ నాయకత్వం ప్రత్యేకించి ఇందిరాగాంధీ, కొంతమంది నిబద్ధత కలిగిన పి.ఎస్.కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ లాంటి అధికారుల చొరవతో ఇటువంటి ఆలోచనలు, ఆచరణ రూపం దాల్చాయి. దీనికి కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యంగా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు కావాలనే ఆలోచన 1882లోనే సామాజిక విప్లవకారుడు జ్యోతీరావ్ ఫూలే నుంచి మొదలైంది. అదేవిధంగా 1927లో బాబాసాహెబ్ అంబే డ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమ యంలో బడ్జెట్పై చర్చ జరిగిన సమయంలో ప్రత్యేక హాస్టల్స్ గురించి ప్రస్తావించి, అందుకోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. వీటన్నింటి మేళవింపే రాజ్యాంగం లోని ఆర్టికల్–46. దానిఫలితమే సబ్ప్లాన్ల పథకాలు, విధా నాలు. అంటే ఒక పథకం వెనుక ఎంతో చారిత్రక కృషి ఉంటుంది. ప్రభుత్వాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పేద వాళ్లకోసమే ఆలోచించాలి. కానీ ఈ రోజు ఇది తల్లకిందులైంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, ఆది వాసీలు ప్రభుత్వాల ఎజెండాలో ఎటువంటి ప్రాధాన్యతను సంత రించుకోకపోవడం విచారకరం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 81063 22077 -
‘చంద్రబాబు, హర్షకుమార్ హస్తం ఉంది’
సాక్షి, తాడేపల్లి: ‘హర్షకుమార్కు సరదాగా ఉంటే నక్షలైట్లలో చేరాలి. ఆయనతో పాటు చంద్రబాబు కూడా నక్సలైట్లలో చేరాలి. అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు’ అంటూ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత యువకుడి శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దళిత బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. అంతేకాక బాధిత బాలికకు ప్రభుత్వం పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని తెలిపారు. చంద్రబాబు దళితులను నీచంగా చూశారని అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెదపలేదన్నారు. దళితుల కోసం మీడియా సమావేశం పెట్టిన హర్షకుమార్ మూడు రాజధానులు కోసం ఎందుకు మాట్లాడుతున్నారని అమ్మాజీ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న నిన్ను ఎవరూ నమ్మరు: కనకరావు హర్షకుమార్, చంద్రబాబు మీద మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ల్లో హర్షకుమార్ ఒకరు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి అతడు కక్కుర్తి పడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్ దళిత సమస్యలపై పోరాటం చేస్తామంటే ఎవరూ నమ్మరు. దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి. ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక చంద్రబాబు, హర్షకుమార్ ఉన్నారు’ అని ఆయన ఆరోపించారు. అంతేకాక ‘యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మక్కై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు. అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు. రాజధానిలో దళితుల భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెదపలేదు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబుకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి. వారి సంక్షేమం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు’ అన్నారు కనకరావు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఖర్చుచేయాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం మన ప్రభుత్వం అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని.. వారికి ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఆరో సమావేశం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. – సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మంచి జరిగితే అంత మంచిది. – ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలవుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది. – వైఎస్సార్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు.. వైఎస్సార్ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. – ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్థోమత.. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. – మహిళల స్వయం సాధికారతకు ఈ రెండు పథకాలు దోహదపడతాయి. – రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. – ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు ఇదిలా ఉంటే.. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. అనంతరం.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషిచేశారని.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారని మంత్రులు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందంటూ సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ధర్మాన కృష్ణదాస్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు ఇలా.. – 2018–19లో (గత ప్రభుత్వం) ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసింది. – 2019–20లో సీఎం వైఎస్ జగన్ సర్కారు ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేసింది. – ఇక ప్రస్తుత సంవత్సరానికి (2020–21) సంబంధించి కొత్తగా అమలుచేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చుచేస్తోంది. – మొత్తంగా 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి చేకూరుతోంది. వచ్చే ఏప్రిల్ 14 నాటికి అంబేడ్కర్ పార్కు విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్ పార్కును వచ్చే ఏప్రిల్ 14 నాటికి పూర్తయ్యేలా మంత్రులు, అధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనిని వేగంగా పూర్తిచేసేందుకు పార్కు పనులను విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేపిం గ్ రెండు విభాగాలుగా విభజించాలి. పార్కును అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దాలి – వీలైనంతగా కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – 20 ఎకరాల్లో ఈ పార్కు పూర్తయితే విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. – సిటీ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుంది. – మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి ఈ పార్కు తలమానికం కావాలి. -
అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం
-
అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. దీనికి మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషి చేశారని మంత్రులు ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు చేసిన మొత్తం 2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలానే 2019-20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి పొందగా.. మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరిందని అధికారుల సీఎం జగన్కు తెలిపారు. మహిళా సాధికారిత కోసమే ఈ రెండు పథకాలు.. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచే. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిది. ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయి. దాంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది. వైయస్సార్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వైయస్సార్ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం జగన్ తెలిపారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణం పూర్తి ఆయన మాట్లాడుతూ.. ‘2021 ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యం నెరవేరాలి. అంబేడ్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలి. పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించాలి. విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్ పనులను రెండుగా విభజించాలి. 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలి. వచ్చే ఏప్రిల్ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి పార్కు తలమానికం కావాలి. మంత్రులు, అధికారులు సవాల్గా తీసుకుని అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాలి. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వీలైనంత కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విజయవాడ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. -
అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడి..
ఇబ్రహీంపట్నం: ప్రేమ పేరుతో వంచనకుగురైన దళిత యువతికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమి షన్ సభ్యుడు చిలుకమర్రి నర్సింహ్మ తెలిపారు. ఆ ర్డీఓ అమరేందర్రెడ్డి, ఏసీపీ యాదగిరిరెడ్డి సమక్షంలో బాధితురాలు అరుణకు జరిగిన అన్యాయంపై ఇ బ్రహీంపట్నంలో గురువారం విచారణ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామానికి చెందిన అరుణను అదేగ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మాల్ గ్రామంలో కాపురం పెట్టినట్లు చెప్పారు. మూడు నెలలు గడిచిన అనంతరం భార్య అరుణను వదలిపెట్టి పరారయ్యాడని తెలిపారు. భర్త వెంకటేశ్ అచూకీ కోసం కాగజ్ఘాట్లోని అతని ఇంటికి అరుణ వెళ్లగా.. అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడిచేశా రని తెలిపారు. బాధితురాలిని మోసగించిన వెంకటేశ్ను, అరుణపై దాడిచేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని ఏసీపీ యాదగిరిరెడ్డికి సూచించారు. మోసానికి గురైన దళిత మహిళకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల 25 వేలు అందజేస్తామన్నారు. బాధితురాలికి తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేస్తామని ఆర్డీఓ అమరేందర్రెడ్డి తెలిపారు. యు వతిని మోసం చేసిన, దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలి పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 26,306 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా పెరిగాయి.2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్తో పోల్చితే 2020–21 సంవత్సరం కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.26,306.25 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్ 9న 2019–20 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ భారీగా తగ్గడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి యాక్టు కింద ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా తగ్గాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 వార్షిక సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా పెరిగాయి. నిధుల కేటాయింపుల్లో జోరు పెరగడంతో సంక్షేమ పథకాల అమలులో వేగం పుంజుకోనుంది. పెండింగ్ పనులకు లైన్ క్లియర్... ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు భారీగా పెరగడంతో ఆయా శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019–20 వార్షిక సంవత్సరంలో కేటాయింపులు భారీగా తగ్గడంతో ముందస్తుగా అనుకున్న పలు కార్యక్రమాలను ఆయా శాఖలు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ పనులు చాలావరకు నిలిపేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మండల, డివిజన్ స్థాయిలో నిర్మించాలనుకున్న అంబేడ్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధి కాస్త నెమ్మదించింది. తాజాగా భారీగా నిధులు ప్రవేశపెట్టడంతో వాయిదా పడ్డ పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి. ఎస్డీఎఫ్ కింద కేటాయించిన బడ్జెట్ను దాదాపు 42శాఖలు సమన్వయంతో ఖర్చు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నాయి. -
బడ్జెట్ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది -
4 వారాల్లో తేల్చండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల్లో జీఓ 176 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గత తీర్పు నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. ఈ రిజర్వేషన్ల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్రెడ్డి, మరికొందరు కొద్దిరోజుల క్రితం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై జోక్యానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్రెడ్డిలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో, ఇతర ప్రభుత్వ పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోను బలహీనవర్గాలకు తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం సుప్రీంలో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అంజనా ప్రకాశ్, ప్రేరణా సింగ్ తదితరులు వాదనలు వినిపిస్తూ, కె.కృష్ణమూర్తి వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు 2010లో తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చని తీర్పులో చెప్పారని, ఏపీలో అలాంటి పరిస్థితులేవీ లేవని వివరించారు. సుప్రీం గత తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆర్.వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా వెంకటరమణి స్పందిస్తూ.. 1994 పంచాయతీరాజ్ చట్టంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుందని.. ఆ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. హైకోర్టు తేల్చడమే సబబు: సుప్రీం ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న తమ తీర్పును వచ్చే పదేళ్లలో కూడా అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో కాకున్నా, ఆ వచ్చే ఎన్నికల నాటికైనా చట్టాన్ని సవరించి తమ తీర్పును అమలు చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. ఏది ఏమైనా తమ తీర్పును మాత్రం అమలు చేసి తీరాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని కృష్ణమూర్తి కేసులో సుప్రీం చెప్పిందని వెంకటరమణి చెప్పగా, ఆ ప్రత్యేక పరిస్థితులు కేవలం షెడ్యూల్ ప్రాంతాలకే పరిమితమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి వెంకటరమణి తీసుకొస్తూ.. ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల వ్యవహారాన్ని హైకోర్టు తేలుస్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యవహారాన్ని కేసు పూర్వపరాల ఆధారంగా నిబంధనలకు లోబడి హైకోర్టే తేల్చడం సబబని అభిప్రాయపడింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 20న హైకోర్టు కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజున తామిచ్చిన ఉత్తర్వులను సీజే నేతత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు జీవో 176పై స్టే ఉంటుందని స్పష్టం చేసింది. -
ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా?
మా ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలను మార్చాలని ప్రతి అడుగూ ఆ దిశగా వేశాం. మేము అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు నేర్చుకోవాలి. సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీల ద్రోహి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. దళితులనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆయనకు లేదని, వారిపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని సోమవారం అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రతిపాదించిన బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుంటూ చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. దళితులను దారుణంగా అవమానించారు.. ఆయన (బాబు) సుదీర్ఘంగా మాట్లాడుతున్నప్పుడు మా వాళ్లు ఓపిగ్గా విన్నారు. నేను తుది మాటలు మాట్లాడడానికి లేచి నిలుచుంటే.. నా మాటలు బయటి ప్రపంచానికి ఎక్కడ వినిపిస్తాయోనని ఏకంగా గొడవకు దిగారంటే వీళ్లకు ఎస్సీలు, ఎస్టీలపై ఏ స్థాయిలో ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఎస్సీ, ఎస్టీల ద్రోహి బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండరు ఒక్క చంద్రబాబు తప్ప. ఈ వ్యక్తి (బాబు) ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ 2003లో తెచ్చామంటున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన దుస్థితి ఉంటుందా? ఎస్సీ, ఎస్టీల జాతీయ కమిషన్ 1992లో వస్తే 1994–95లో ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ పట్టించుకోలేదు. తీరా 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. చదవండి: మరో అల్లూరి.. సీఎం జగన్ ఎన్నికలకు ముందు వరకు ఇటువంటి కమిషన్ను ఏర్పాటు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఇతనే. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దళితుల గురించి ఎంతో చులకనగా మాట్లాడారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలనుకుంటారా? అని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయిలో చంద్రబాబే అలా అంటే కింది స్థాయి నాయకులు ఇంకెంత దారుణంగా మాట్లాడతారో.. దళితులను ఎంత అవమానకరంగా చూస్తారో అర్థం చేసుకోవచ్చు. బాబు కేబినెట్లోని మంత్రే లోకువగా మాట్లాడారు. దళితులు స్నానం చేయరు.. వారి వద్ద వాసనొస్తుందని చులకనగా మాట్లాడిన పరిస్థితి. అటువంటి మాటలు మాట్లాడినా చంద్రబాబు ఎటువంటి చర్యా తీసుకోలేదు. 36 సీట్లకు గాను ఒక్కటా? రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లు ఉంటే ఈ పెద్దమనిషి పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటంటే ఏ స్థాయిలో ఈ మనిషి ఉన్నాడో ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఇటువంటి మనుషుల వల్ల దేశం ఎంతగా భ్రష్టుపట్టిపోతుందో వందేళ్ల కిందటే ప్రముఖ కవి గురజాడ అప్పారావు ఓ మాట చెప్పారు. అదేమిటంటే.. ‘ఎంచి చూడగ మనుషులందున మంచి చెడులు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాల అవుతాను’ అని చెప్పారు. వందేళ్ల కిందటే ఆ మహాకవి ఆ మాట చెబితే.. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని మాట్లాడతాడు’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఉండడమూ నేరమే.. అధ్యక్షా.. చూశారా.. ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడుతుంటే వాళ్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో. (సీఎం మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పోడియం ముందు గుమికూడి గొడవకు దిగి పెద్దపెట్టున నినాదాలు చేశారు) నేను మాట్లాడే మాటలు ఎక్కడ బయటికి పోతాయోనని అల్లరికి దిగారు. ఇంతటి దిక్కుమాలిన దుర్భద్ధితో అరుస్తున్నారంటే వీళ్లసలు ఎమ్మెల్యేలు, నాయకులేనా? ఇటువంటి వాళ్లా పాలకులు కావాల్సింది? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నా. ఇటువంటి వాళ్లను ముందు పెట్టి వెనకాల ఉన్న చంద్రబాబు నిస్సిగ్గుగా నవ్వుతున్నారు. ఇలాంటి వ్యక్తిని నాయకుడంటారా? ఎస్సీలు, ఎస్టీలపై ప్రేమ ఇదేనా? ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఉండడం కూడా ఎంత ప్రమాదమో ఆలోచించాలని కోరుతున్నా. 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే ► ఐదుగురు డెప్యూటీ ముఖ్యమంత్రులను నియమిస్తే వారిలో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలని గర్వంగా చెబుతున్నా. ► దళిత మహిళ ఈ రాష్ట్ర హోం మంత్రి. ► ఒక్క ఎస్టీకి కూడా ఎన్నికలు వచ్చేదాకా మంత్రి పదవి ఇవ్వని ఘనత చంద్రబాబుదైతే ఒక ఎస్టీని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత మాది. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు దేశంలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. నామినేటెడ్ పదవులు మొదలు నామినేటెడ్ కాంట్రాక్టుల వరకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అదీ మన ప్రభుత్వమే. ► ఇదే కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటే అందులో పదింటిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చాం. ఈ వర్గాల వారికి గతంలో ఇటువంటి పదవులు రావాలంటే ఎన్నెన్నో పైరవీలు, రాజకీయ పలుకుబడి కావాల్సి వచ్చేది. దానికి భిన్నంగా మా ప్రభుత్వం ఆ వర్గాలకు పదవులను ఇచ్చింది. ► నారావారిపల్లెలో దళితుల్ని గుడిలోకి రానివ్వని పరిస్థితి గురించి మా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ఆ పల్లె సాక్షాత్తు మన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం. ఇప్పుడు నేను చెబుతున్నా.. గుళ్లలో చైర్మన్లుగా 50 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు. పేదవాడి ప్రభుత్వం అంటే ఏమిటో చెప్పడానికి ఇంతకన్నా రుజువు అక్కర్లేదు. ► గ్రామ సెక్రటేరియట్లలో లక్షా 28 వేలకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే అందులో 82.5 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులే ఉన్నారు. ► మేము వేసే ప్రతి అడుగూ విప్లవాత్మకమే. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకే ఈ అడుగులన్నీ. ఈ సమయంలో టీడీపీ సభ్యులు దిక్కుమాలిన రీతిలో, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. వారిని సస్పెండ్ చేసినా తప్పులేదని ఈ వేదిక మీద నుంచి సూచిస్తున్నా. -
ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
-
రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు. -
‘రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్ పాలన’
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. తాడేపల్లిలోని మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో కె. కనకారావు చైర్మెన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న రోజు ఇదని ఆయన గుర్తు చేశారు. మాల,మాదిగ, రెల్లి మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా దిక్సూచి లాంటి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా బలపడాలని సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల వలే కాకుండా.. ఇచ్చిన మాట నిలుపుకునే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని సురేష్ గుర్తు చేశారు. అన్ని కులాల వారికి సంక్షేమ ఫలాలు అందించేలా పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సురేష్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసేలా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని సీఎం జగన్ను ప్రశంసించారు. రాష్ట్రంలో పేదవాడు వుండకూడదనేది సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేకూరేలా పాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎంగా కన్నా రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్ పనిచేస్తున్నారని రమేష్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ నామినేటెడ్ పోస్టుల్లో, మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పిచారని ఆయన చెప్పారు. దేశంమంతా ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం కేజీ ఉల్లి రూ. 25 లకు అందిస్తున్నారని తెలిపారు. సీఎంగా వైఎస్జగన్ 25 సంవత్సరాలు రాష్ట్రాకి ముఖ్యమంత్రిగా ఉంటారని ఎంపీ నందిగాం సురేష్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్మెన్గా బాధ్యతలు చేపట్టిన కె. కనకారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదర్శవంతమైన, జనరంజకమైన పాలన సీఎం జగన్ ఆధ్వర్యంలో నడుస్తోందని తెలిపారు. నవరత్నాలతో బడుగు బలహీన వర్గాల దశ దిశ మారుతోందని కనకరావు పేర్కొన్నారు. గాంధీ, పూలే,అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. బడుగులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారని కనకరావు సీఎంను కొనియాడారు. పాదయాత్ర చేసి సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కళల్లో ఆనందం నింపారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని నిరూపించారని ఆయన తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన బలమైన బాధ్యతను నీరవేరుస్తానని తెలిపారు. ప్రజల గుండెల్లో చీరస్థాయిగా ఉండేలా పనిచేస్తానని కనకరావు చెప్పారు. రాష్ట్రంలోని 40 లక్షల మాదిగల ఆశలు నిరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ ఇచ్చిన భరోసాని కాపాడుకుంటామని కనకరావు పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు వెలుగుల వరం!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంక్షేమ శకం నడుస్తోంది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెడుతూ.. వారికి ఆర్థికంగా చేయూతనందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగ్జీవన్ జ్యోతి పథకం కింద మొదటి 200 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ పథకం కింద 100 యూనిట్ల వరకు మాత్రమే షెడ్యూల్డ్ కులాలు, తెగల కుటుంబాలకు ఉచితంగా అందించారు. అయితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వీరికి ఉచిత విద్యుత్ను 200 యూనిట్లకు పెంచుతానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ ప్రకారమే ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపారు. రాజధాని జిల్లాల్లో పరిస్థితి.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు, సీఆర్డీఏ సర్కిళ్లలో 4.44 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. కృష్ణా సర్కిల్లో 1,98,621 మంది, గుంటూరు సర్కిల్లో 1,30,805, సీఆర్డీఏ సర్కిల్లో 52,506 మంది వెరసి 3,81,932 మంది ఎస్సీ వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. అలాగే ఎస్టీ వినియోగదారుల విషయానికొస్తే కృష్ణా సర్కిల్లో 23,545 మంది, గుంటూరు సర్కిల్లో 30,353, సీఆర్డీఏ సర్కిల్ పరిధిలో 8,926 మంది వెరసి 62,824 మంది ప్రయోజనం పొందుతున్నారు. ఇలా ఈ మూడు సర్కిళ్ల పరిధిలో 4,44,756 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులు నెలనెలా ఉచిత విద్యుత్ను వినియోగించుకుంటున్నారని ఏపీఎస్పీడీసీఎల్ విజయవాడ జోన్ చీఫ్ ఇంజినీర్ కె.సంతోషరావు ‘సాక్షి’తో చెప్పారు. ఫలితంగా నెలకు కృష్ణా (విజయవాడ) సర్కిల్లో రూ.5.36 కోట్లు, గుంటూరులో రూ.3.70 కోట్లు, సీఆర్డీఏ సర్కిల్లో రూ.1.56 కోట్లు చొప్పున రూ.10.62 కోట్ల సొమ్మును ప్రభుత్వం భరిస్తూ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఎంతో ఉపశమనం కల్గిస్తోంది. ఎంతో ఉపశమనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఎస్సీలకు విద్యుత్ రాయితీ అమలవుతోంది. గత ప్రభుత్వం కేవలం 100 యూనిట్లు వరకే ఉచిత విద్యుత్ ఇచ్చేది. ఆపై వినియోగానికి బిల్లు చెల్లించాల్సి వచ్చేది. జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 200 యూనిట్ల వరకు మా ఎస్సీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీంతో మాకు నెలకు రూ.500 ఉపశమనం కలుగుతోంది. – వట్టిపల్లి ప్రభాకరరావు, మిలటరీపేట, కలిదిండి మాట తప్పని నైజం.. మాటతప్పని మడం తిప్పని నైజం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలు వల్ల ఎస్టీలలో నిరుపేదలకు ఆర్థికంగా ఊరటనిస్తోంది. గతంలో విద్యుత్ వినియోగ పరిమితి 100 యూనిట్లే ఉండేది. ఇప్పుడు 200 యూనిట్లకు పెంచడం వల్ల నిశ్చింతగా ఉంటున్నాం. జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఇస్తుండడం మాలాంటి ఎందరికో బిల్లుల చెల్లింపు బెడద తప్పింది. జగన్ హామీ నిలబెట్టుకోవడం హర్షణీయం. –భూక్యా గన్యా, ఎ. కొండూరు -
పేదింటి వెలుగులకు సమయం ఆసన్నం
సాక్షి ,కడప : అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని..లేదా సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ ఉచితంగా అందించడంతోపాటు ఎస్సీ.ఎస్టీల అభివృద్ధి,సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల మన జిల్లాలోనే 81,845 ఎస్సీ,11,769 ఎస్టీలకు అంటే మొత్తం 93,614 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కడప డివిజన్లో ఎస్సీలకు 8454 గృహ సర్వీసులు ఉండగా మైదుకూరు డివిజన్లో 21681 సర్వీసులున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్లో 15,912, పులివెందుల డివిజన్ లో 8484 ,రాజంపేటలో 18,778, రాయచోటి డివిజన్లో 8536 సర్వీసులున్నాయి. ఎస్టీలకు సంబంధించి కడప డివిజన్లో 1277 సర్వీసులుండగా.. మైదుకూరు డివిజన్లో 1178, ప్రొద్దుటూరు 1026, పులివెందులలో 1610, రాజంపేటలో 4032, రాయచోటిలో 2646 గృహ సర్వీసులు ఉన్నాయి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడంవల్ల ఎస్సీ,ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుందన్నది. ఎస్సీ,ఎస్టీల అభివృద్దికి మరింత కృషి.. ప్రధానంగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేరు వేరుగా కారొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్దిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. భూపంపిణీతోపాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద ఎస్సీ,ఎస్టీ చెల్లెమ్మల వివాహాలకోసం లక్ష రూపాయలు ఇవ్వడంతోపాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్,ఇంజనీరింగ్ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పషాలటీ ఆసుపత్రినినిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగుచేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ (ఫారెస్ట్ రైట్స్ యాక్టు 2006 ప్రకారం) గిరిజనులకు వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. జగన్ సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
గురువును మరువని కాలం
గురుశిష్యుల మధ్య సంబంధాలు మృగ్యమై పోయాయని, వీళ్ల మధ్య సంబంధాలు చాప్టర్లెక్చరర్స్, మార్కెట్ సంబంధాలని చర్చలు చేస్తున్న సందర్భంలో గురువును గురువుగా ప్రతిష్టించడం మొత్తం సమాజం గర్వించతగింది. గురువుకు ఉన్న మహోన్నత స్థానం నేటికీ చెక్కుచెదరలేదనే సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఉపాధ్యాయులను విద్యార్థులు నేటికీ తమ గుండెల్లో దాచుకుంటూనే ఉన్నారు. తన బోధనతో భావితరాన్ని సాధకులుగా మార్చగల శక్తి ఒక్క ఉపాధ్యాయునిలోనే ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువుదే ఉత్తమ స్థానమని నిర్వచనాలు చెప్పటం, ఉపాధ్యాయ దినోత్సవాల నాడు మననం చేసుకోవటం మాత్రమే కాదు, పిల్లలకోసం తపించి, పిల్లల కోసం తమ జీవితాలను అర్పించి, తరగతి గదే దేవాలయంగా భావించిన ఉపాధ్యాయులను ఏ తరమూ మర్చిపోదని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సోషల్వెల్ఫేర్ ప్రిన్సిపాల్గా పనిచేసి ఆదివారం పదవీ విరమణ చేసిన పసుపులేటి విద్యాసాగర్రావు సన్మానసభలో కళ్లకు కట్టినట్లు కనపడింది. గురుకుల విద్యావ్యవస్థలో తన సర్వీసు కాలం చదువుకుని వివిధ రంగాలలో స్థిరపడ్డ విద్యార్థులంతా తమ గురువును బండి మీద నిలుచోబెట్టి ఊరేగింపుగా ఆ స్కూల్ ప్రాంగణంలోకి బండిలాగుతూ తీసుకుపోవటం ఒకింత ఆశ్చర్యంగా, పరమానందంగా అనిపించింది. ఈ అత్యాధునిక మార్కెట్ సమాజంలో ప్రతిదానిని వినిమయ వస్తువుగా మార్చి, అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్న కాలంలో తమ గురువు పదవీ విరమణ సభలో గురువుకు కృతజ్ఞతగా దంపతులను బండిమీద కూర్చోబెట్టి బండిని విద్యార్థులు వేదికదాకా తీసుకొని పోయే సంఘటనను ఈ కాలంలో చూస్తాననుకోలేదు. ఇది మంచి ఉపాధ్యాయుడు విద్యాసాగర్కు దక్కిన గౌరవం మాత్రమేకాదు, తమను కంటిపాపలా చూసుకుని జ్ఞానబోధన చేసిన గురువులను ఏ విద్యార్థులూ మర్చిపోరనడానికి నిదర్శనం. ఇది ఒక్క గురువుకు చేసిన సన్మానం మాత్రమేకాదు మొత్తం గురుకుల విద్యావ్యవస్థకు ఉపాధ్యాయలోకానికి అత్యంత ఘనంగా జరిగిన సన్మానంగా భావించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాసులో రైలు దిగగానే, ఆయన విద్యార్థులు ఇదే రీతిలో బండిపై కూర్చోబెట్టి విద్యాసంస్థదాకా తీసుకుపోయారని పాఠంగా చదువుకున్నాంకానీ, అదే సన్నివేశం ఈ కాలంలో కూడా చూడగలగటం ఒక విశేషం. ఇది మంచి పరిణామం. ఇది విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండే అనుబంధానికి తార్కాణంగా నిలుస్తుంది. తమ విద్యార్థులు ఉన్నతస్థాయికి వెళ్లాలని ప్రతి టీచర్ కోరుకుంటారు. ఎదుగుతున్న సమాజ పురోభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, తరగతి గది పాత్రే ప్రముఖంగా ఉంటుంది. దేశాన్ని సుభిక్షంగా ఉంచేది, అత్యున్నతంగా తీర్చిదిద్దేది తరగతిగదేనన్నది గుర్తించే తరగతి గదిలో ప్రపంచం రూపొందుతుందని కొఠారి కమిషన్ చెప్పింది. తెలంగాణను తీర్చిదిద్దటానికి గురుకుల పాఠశాలలు గొప్ప కృషిచేస్తున్నాయి. పీవీ గురుకులవిద్యావ్యవస్థను తెలంగాణలో ప్రారంభించి, మానవవనరుల శాఖా మంత్రి అయ్యాక∙దేశవ్యాపితంగా జిల్లాకొక గురుకుల పాఠశాలను నెలకొల్పారు. లక్షమంది బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలు నేడు గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన చదువును పొందగలుగుతున్నారు. తెలంగాణ గురుకులాల నుంచి రాబోయే విద్యార్థులు రేపటి బంగారు తెలంగాణకు పునాదులుగా నిలుస్తారు. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ సంపదగా మారటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. శక్తిమంతమైన సమాజనిర్మాణం చేయటానికి పునాదులుగా నిలిచి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. మొత్తం సమాజం ఉపాధ్యాయులు చేస్తున్న సేవకు వారిని గొప్పగా సత్కరించుకోవాలి. ప్రతి ఊరులో దేవాలయాన్ని చూసినంత పవిత్రమైన భావనను పాఠశాలలపై చూపి ఆ పాఠశాలల రక్షణ కోసం, వాటి ఉన్నతి కోసం అందరూ సహకరించాలి. గుడిలోకి పోతే ముక్తి లభిస్తే, బడిలోకి పోతే సమాజ విముక్తి లభిస్తుంది. అందరికీ చదువు అందాలన్న మహాత్మాజ్యోతిబాపూలే, అంబేడ్కర్ ఆలోచనలకు రూపంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యలభిస్తోంది. ఇది శుభతరుణం. వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్సభ్యులు ‘ 94401 69896 జూలూరు గౌరీశంకర్ -
దళితజాతి ద్రోహి కారెం శివాజీ
పాలకొల్లు సెంట్రల్ : చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ దళిత జాతిని కించపరుస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీసెల్ కో ఆర్డినేటర్ చెల్లెం ఆనందప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని శివాజీని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ గౌరవాన్ని తగ్గిస్తూ దళితులంతా టీడీపీ వెంట ఉండాలంటూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడన్నారు. ఇలా ఎన్నికల ఉల్లంఘన ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం ఎస్సీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కలిసి దళిత జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్, రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబులు దళితజాతిని చంద్రబాబుకు తాకట్టుపెట్టారన్నారు. జిల్లాలోని గరగపర్రులో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తరఫున ఏజెంట్లుగా వచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కారెం, జూపూడి, నక్కా ఆనందబాబులు ఇంతవరకూ ఈ సంఘటనలో ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 90 శాతం దళితులు వైఎస్సార్ పార్టీకే అండగా ఉన్నారన్నారు. వైసీపీ పాలకొల్లు మండల అధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్రాజు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు బండి సుందరరామ్మూర్తి, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ మద్దా చంద్రకళ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పార్శి వెంకటరత్నం, జిల్లా ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరాస్వామి, మాజీ ఎంపీటీసీ పొనుకుమట్ల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో స్వేచ్ఛకు చోటు లేదు
సాక్షి, బేస్తవారిపేట (ప్రకాశం) : చంద్రబాబు పాలనలో మాదిగలు కనీసం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛకూడా లేకుండా పోయిందని ఎమ్మార్పీస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం స్థానిక ఎబీఎం కాంపౌండ్ ఆవరణలో విశ్వరూప సమాయత్త సభలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, కార్పోరేషన్ పదవులు ఒక వర్గానికే ఇచ్చి సామాజిక న్యాయం పాటించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. కనీసం అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, మాదిగల మరో విశ్వరూప మహాసభకు అనుమతులు ఇవ్వలేదన్నారు. రెండు,మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకుని మన సత్తా చాటుదామన్నారు. మన హక్కుల సాధనకై కలిసికట్టుగా మన సత్తాచాటాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు విశ్వరూప సభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య, జిల్లా ఇన్చార్జ్ సూరెపోగు శ్యామ్, రాష్ట్ర నాయకులు పానుగంటి సాలెమ్రాజు, పులిగుజ్జు ప్రాంక్లీన్, బొడిచర్ల రాజు, మండల అధ్యక్షుడు బూదాల ఆనంద్, నాయకులు కుంపటి సురేష్, గుర్రం ఆనంద్, గోన గురవయ్య, ఆళ్లగడ్డ వాసు, కొండెపోగు పోలయ్య, గోన శరత్, తిరుపతి శాంతమ్మ, కొండెపోగు ప్రసన్న, జయరాజ్ పాల్గొన్నారు. -
ఎస్సీ ఎమ్మెల్యేలే టార్గెట్!
-
దళితుల సత్తా చూపిస్తాం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. దళితులకు రాజకీయాలెందుకంటూ చింతమనేని వ్యాఖ్యలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం లేనివారు ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావడం, వారిని టీడీపీ వెనుకేసుకురావడంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల సత్తా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు అభిషేకాలు చేసి నిరసన తెలిపారు. విజయనగరం, పాచిపెంట: దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త మామిడి శ్రీనివాస కళాధర్ డిమాండ్ చేశారు. దళితులు పట్ల చింతమనేని మాటలను నిరసిస్తూ పాచిపెంట మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశవ్యాప్తంగా ఇంకా కుల వివక్ష తాండవిస్తోందన్నారు. దళితులుకు పదవులు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కనే విషయాన్ని చింతమనేని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో యజ్జల రామస్వామి,గోవిందు,అజయ్,యువత తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలను తూలనాడేవారికి బుద్ధిచెబుతాం చీపురుపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల అణిచివేతకు చర్యలు చేపడుతున్న టీడీపీ సర్కారుకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడడాన్ని నిరసిస్తూ గురువారం చీపురుపల్లిలో ఆందోళన చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారని, ఆయనేమైనా జమిందారీ ఇంట్లో పుట్టారా చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 18 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను తెలుగుదేశం ప్రభుత్వం హీనాతి హీనంగా చూసిందన్నారు. దళితులతో పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీలకైనా పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల అడ్డూరి రామకృష్ణ, రేగిడి రామకృష్ణ, డి.రాము, సిమ్మాల అప్పన్న, సిమ్మాల రామ్మూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాకేటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి రూ 76,800 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ను ఎన్నికల సన్నాహక బడ్జెట్గా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ 3.36 లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వం వ్యయం 13.3 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికీ ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం ఈ రంగానికి రూ 76.800 కోట్ల కేటాయింపులు జరిపింది. పన్ను మినహాయింపులతో పట్టణ ప్రాంత ప్రజలను, వేతన జీవులను ఆకట్టుకున్న ప్రభుత్వం గ్రామీణ రంగంలో రైతులకు ఊరట ఇచ్చేలా నగదు సాయం పథకం ప్రకటించింది. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ 76,800 కోట్లను బడ్జెట్లో కేటాయించిన మోదీ సర్కార్ దళితులను అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మల్లిస్తున్నారు : మెరుగు
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందంటూ వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో దళితులకు రక్షణ కరువయ్యిందన్నారు. దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన నిందితులపై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మల్లిస్తున్నారంటూ మండి పడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే దళితుల హక్కుల రక్షింపబడతాయని స్పష్టం చేశారు. -
రగులుతున్న రగడ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ మధ్య వివాదం రాజుకుంటోంది. బ్యాక్లాగ్ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయకపోవడం, రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కేటగిరీలో మెరిట్ ప్రకారం తీసుకోవడం కుదరదని ఏపీపీఎస్సీ నిర్ణయించడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ప్రమోషన్ల విషయంలో రోస్టర్ పాటించడం లేదని ఫిర్యాదులున్నాయి. వీటిపై విచారించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ గత నెలలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఈనెల 22వ తేదీన ఉదయభాస్కర్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకుండా కార్యాలయ సిబ్బందిని పంపించారు. వారు సరైన సమాచారంతో రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఈనెల 31న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఉదయభాస్కర్ను అదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేశారు. తమ నోటీసులను లెక్క చేయకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989 ప్రకారం చర్యలు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు వెళితే తన స్థాయి తగ్గుతుందని, అందువల్ల వెళ్లే ప్రశ్నే లేదని కొందరు ఏపీపీఎస్సీ అధికారులతో ఉదయ భాస్కర్ పేర్కొన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల చట్టానికి తూట్లు విద్య, ఉద్యోగాల భర్తీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. వీరంతా జనరల్ కేటగిరీలో మెరిట్ సాధిస్తే జనరల్లోనే ఎంపిక చేస్తారు. అయితే జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ అభ్యర్థులను ఎంపిక చేసేది లేదని, రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీలోనే ఎంపిక కావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. ఇది ‘స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996, 22–ఏ’ నిబంధనకు విరుద్ధమని రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. జనరల్ కోటాలో బ్యాక్లాగ్ పోస్టులు ఈ సంవత్సరం ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 225 ఎస్సీ, 257 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ నోటిఫికేషన్తో కలిపి ఖాళీలు చూపించారు. జనరల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని ఎస్సీ, ఎస్టీ పోస్టులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం ఆయా వర్గాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీలో కలిపి అన్ని పోస్టులకు నోటిఫికేషన్ పిలవడం వల్ల కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వాదిస్తోంది. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ అధికారులకు నోటీసులు ఇవ్వగానే వెంటనే సీఎం పేషీ నుంచి కాస్త స్పీడు తగ్గించుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీకి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది. తీరు మారకుంటే చట్టపరమైన చర్యలు.. ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తీరు మారకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ఆయన విధానాల వల్ల పాలకులకు చెడ్డపేరు వస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాయటంపై ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏపీపీఎస్సీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. – కారెం శివాజీ (రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్) -
కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా!
సాక్షి, హైదరాబాద్: కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై జరుగుతున్న దాడులపట్ల ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతికయుగంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంది. మిర్యాలగూడ, అమీర్పేట్లో చోటు చేసుకున్న వరుస ఘటనలపై ఆరా తీసిన సభ్యులు పైవిధంగా స్పందించారు. వీటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచిందని, కానీ రాష్ట్రంలో కేవలం రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మొత్తాన్ని అర్హులకు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ఆ వర్గాల ఆర్థిక, సామాజికాభివృద్ధిని అధ్యయనం చేసేందుకు తొమ్మిది మంది ఎంపీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం రామోజీఫిల్మ్ సిటీలోని ఓ హోటల్లో పార్లమెంటరీ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ సీతారాం నాయక్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషితోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాల పురోగతిని అడిగి తెలుసుకుంటూనే వివిధ అంశాలపై ఉన్న సందేహాలను యంత్రాగంపై సంధించారు. వీటిలో కొన్నింటికి అధికారులు సమాధానాలు చెప్పినప్పటికీ... మెజారిటీ అంశాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. వివరణలను పక్షం రోజుల్లోగా పార్లమెంట్ కమిటీకి నివేదించాలని సభ్యులు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారమిస్తే చర్యలే... ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో ఇవ్వాలని పార్లమెంటు కమిటీ అధికారులకు సూచించింది. తమ వద్ద సమాచారం ఉందని, వాటితో పొంతన లేకుండా గణాంకాలు పెంచి చూపొద్దని, తప్పుగా తేలితే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. గురుకులాలతో డ్రాపౌట్లు, కల్యాణలక్ష్మి పథకంలో బాల్యవివాహాలు తగ్గాయని వెల్లడించారు. రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు పెరిగాయని పార్లమెంటు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కుల వివక్షతో జరిగిన మరణాల గురించి ప్రశ్నించగా, అలాంటి హత్యలు జరగలేదని అధికారులు అన్నారు. సింగరేణి మైనింగ్ విస్తరణలో భూములు కోల్పోయినవారి కోసం తీసుకున్న చర్యల గురించి కమిటీ సభ్యులు ప్రశ్నించగా అధికారులు తడబడ్డారు. ఇన్నోవేషన్ కార్యక్రమాలపైనా సభ్యులు ఆరా తీశారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు తెలపగా, ఎస్టీల గురించి ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూపంపిణీ సాధ్యం కాదని తెలిపారు. అధ్యయనం తాలూకు నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి సమర్పించనున్నట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
ఆలోచనలు మారి..అంతరాలు తగ్గి..
సాక్షి, హైదరాబాద్ : ఆలోచనలు మారుతున్నాయి. అంతరాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ప్రధానంగా పరిగణించే కులం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడు తున్న ఈ తరుణంలో సామాజికంగా వస్తున్న మార్పులు పెళ్లి సంబంధాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కులాగోత్రాలు చూసి బంధాలు కలుపుకోవడం కన్నా వృత్తులు, ఆర్థిక అంశాలే ప్రధానమవుతు న్నాయి. మారుతున్న పని విధానంతో ప్రేమ పెళ్లిళ్లు సహజమవుతున్నాయి. దీంతో కులాంతర పెళ్లిళ్ల సం ఖ్య పెరుగుతోంది. గతంలో నూటికొకటి వంతున జరిగే కులాంతర వివాహాలు... ఇప్పుడు 8కి పెరిగాయని ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో తేలింది. మూడు రెట్లు పెరిగిన వివాహాలు... రాష్ట్రంలో గత పదేళ్ల క్రితం నాటితో పోలిస్తే కులాంతర వివాహాల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రతీ వంద పెళ్లిళ్లలో ఎనిమిది కులాంతర వివాహాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో జరిపిన ఓ పరిశీలనలో గుర్తించారు. ఇందులో పావు వంతు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. కులాంతర వివాహాల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య అధికంగానే ఉంటోంది. గత నాలుగేళ్ల గణాంకాలు పరిశీలిస్తే కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఎస్సీల సంఖ్య 2వేల వరకు ఉంది. ఈ గణాంకాలు అధికారికమే అయినప్పటికీ... వీటి సంఖ్య రెట్టింపు ఉంటుందని, ఎస్టీల్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహకం... కులాంతర వివాహాలు చేసుకున్న దళిత, గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ జంటకు గతంలో రూ.50వేలు ఇచ్చేది. తాజాగా ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2018–19 సంవత్సరం నుంచి రూ.2.5లక్షలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. మరోవైపు పేదింటిలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అమలు చేస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ రెండు పథకాలతోనూ లబ్ధి చేకూరనుంది. -
ఎంపీ బుట్టా రేణుక ఇల్లు ముట్టడి
కర్నూలు(అర్బన్): ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడిచిందని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇంటిని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్కుమార్, బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, పీడీఎస్యు నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు జీఓనెం.550ని అమలు చేయకపోవడంతో 496 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారన్నారు. ఈ జాబితాలో అనర్హులైన అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించారని, ఈ ప్రవేశాలకు సంబంధించి రూ.500 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్ విద్యార్థులను తీసుకోవాలని కనీస పరిజ్ఞానం కూడా అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడక పోవడం దురదృష్టకరమన్నారు. జీఓ నెం.550 ప్రకారం రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ బుట్టా రేణుక విద్యార్థి సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నాని, రంగస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదని, అది కేవలం రాష్ట్రాల సమస్య మాత్రమేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ, మంద కృష్ణమాదిగలే ప్రధాన అడ్డంకి అని విమ ర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని, వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న హామీలు ఏమయ్యాయన్నా రు. ఎంఆర్పీ ఎస్, ఆర్ఎస్ఎస్ రెండూ ఒక్క టేనని, వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. -
ఇంటింటికీ వ్యవసాయ పథకాలు
అనంతపురం టౌన్: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గ్రామాల్లోని ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత మహిళా సంఘాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో ‘వ్యవసాయాభివృద్ధి–మహిళా సంఘాల పాత్ర’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని తెలుగు భాషలో మహిళా సమాఖ్యలకు పంపుతామన్నారు. వీటిపై గ్రామ, మండల సమాఖ్య సమావేశాల్లో చర్చించి రైతులకు సమాచారం అందించాలన్నారు. ‘మన విత్తన కేంద్రం’ ద్వారా విత్తన సేకరణ మహిళా సంఘాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా నవధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష లోపు రుణాలను బ్యాంకర్లు ఇవ్వాలని, దీనిపై రైతులకు సరైన అవగాహన లేదన్నారు. రుణ అర్హత కార్డులు, వ్యవసాయ సాగు ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒకటి బ్యాంకుకు ఇస్తే రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు తదితర వస్తువులు లభించే ‘వన్ స్టాప్ షాప్’ను నిర్వహించేందుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ మహిళా సంఘాలపై నమ్మకంతో ఈ–క్రాప్ నమోదును అప్పగిస్తే అద్భుతంగా చేశారన్నారు. వ్యవసాయ అధికారులు మండల స్థాయి సమావేశాలకు వెళ్లి తమ శాఖలో అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జేసీ–2 వెంకటేశం, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, పీఎం నరసయ్య, డీపీఎం రామ్మోహన్, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ, సభ్యులు, వ్యవసాయ, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
దగాపడ్డ దళితుల కోసం ఇదో కొత్త వెలుగు
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంపై సీఎం కేసీఆర్ - వంద శాతం అమలు చేసి తీరుతాం - బడ్జెట్ ప్రతిపాదనల కంటే ఎక్కువే ఖర్చు చేస్తం - ఆకలి ఉన్న చోటనే అరుపులుంటయ్.. ఆ తీరు ఇకనైనా మారాలి - అమలు తీరును పర్యవేక్షించేందుకు దళిత ప్రజాప్రతినిధులతో కమిటీలు - జిల్లా స్థాయిలో ప్రతి త్రైమాసికానికీ మదింపు - అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో చర్చించే నిబంధనలుSరూపొందిస్తామన్న సీఎం - ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు శాసనసభ ఆమోదం సాక్షి, హైదరాబాద్ ‘‘ఏదైనా ఓ ఊరికి వెళ్లి.. అక్కడ నిరుపేదలు ఎవరని అడిగితే దళితులనే చూపిస్తరు. ఈ పరిస్థితి ఇక ముందు ఉండొద్దు. అందుకే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయిస్తూ చారిత్రక చట్టాన్ని తీసుకువస్తున్నం. దానిని నూరు శాతం అమలు చేసి చూపిస్తం. వాటికి బడ్జెట్లో ప్రతిపాదించినదానికంటే పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెడ్తం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికల స్థానంలో ప్రవేశపెడుతున్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం (ఎస్డీఎఫ్) బిల్లుకు శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. చరిత్రే.. కాదనను ఈ ఎస్డీఎఫ్ చట్టంలో కొత్తదనమేమీ లేదని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సబ్ప్లాన్చట్టానికి మూడు మార్పులు చేసి కొత్త చట్టంగా తెస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శల పట్ల సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. ‘‘చరిత్రను ఎవరూ తుడిచేయలేరు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక కాంపోనెంట్గా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను పెట్టారు. దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. అది చరిత్రే.. కాదనను. కానీ దానికంటే మెరుగైన అంశాలతో ఇప్పుడు మేం చట్టం చేస్తున్నాం..’’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తొలుత చట్టం చేసిందన్న విషయం చిరస్థాయిగా ఉంటుందని కదాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని.. ఇప్పుడు ఒక్క మండలాన్నీ తగ్గించలేం, అవసరమైతే పెంచుకుంటాం కదా అని ఉదహరించారు. పాత చట్టంలో 109 మార్పుల (అన్ని పొరపాట్లు ఉన్నట్టు అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కడియం ప్రస్తావించారు)తో అన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. ఎస్డీఎఫ్ చట్టం చేసే ముందు ఎంతోమంది దళిత మేధావులతో చర్చించి సూచనలు తీసుకున్నట్లు వెల్లడించారు. సాధికారత కోసం కృషి చేస్తున్నాం.. దళితులకు మంచి అవకాశాలు కల్పిస్తే వారు గొప్పగా ఎదుగుతారనేందుకు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. దళితులకు గ్రీన్హౌస్, మైక్రో ఇరిగేషన్లలో వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామని.. ఇటీవల నర్సాపూర్ సమీపంలోని ఇబ్రహీంబాగ్కు చెందిన శ్రీనివాస్ అనే దళితరైతు 100 శాతం సబ్సిడీ పథకాన్ని వినియోగించుకుని ఒక్క ఏడాది సాగులో రూ.10 లక్షల విలువైన పంట పండించారని తెలిపారు.‘‘ఇంట్లో బలహీనంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా మారేందుకు టానిక్ తాగిస్తాం.. మనం తినేదానికంటే ఓ బుక్క ఎక్కువ పెడతాం. ముస్లింలదీ అదే పరిస్థితి. వారి కోసం ప్రత్యేక చర్యలు ఉండాలి. ఈ సమాజంలో దళితులకూ అదే చేయాలి. ఆకలి ఉన్న చోటనే అరుపులుంటయి.. సమాజంలో ఇది అశాంతికి కారణమవుతుంది. ఇప్పుడా పరిస్థితిని మార్చాలి..’’అని పేర్కొన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్యాంకు లింకేజీ పథకాల్లోని నిబంధనలతో దళితులు వాటిని వినియోగించుకోలేకపోవటాన్ని గుర్తించానని, దాన్ని మార్చాలని అప్పటి నుంచి అనుకున్నానని చెప్పారు. టీఎస్ ప్రైడ్ పేరుతో దళితులే కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, అవసరమైతే వారికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని పార్టీల దళిత సభ్యులతో చర్చిస్తాం.. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని కఠినంగా అమలు చేసే లక్ష్యంతో ఉన్నామని కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించే ముందు అన్ని పార్టీలకు చెందిన దళిత సభ్యులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. చట్టం అమల్లోకి వచ్చాక.. నిధుల వ్యయంపై ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తామని.. జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనసభ స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ ఆరు నెలలకోసారి నివేదికను పరిశీలిస్తుందన్నారు. రైతుల రుణమాఫీ అయిపోతున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.4 వేల కోట్ల ఆదా ఉంటుందని.. అందులో నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కొంతమొత్తం కేటాయించే అవకాశం కలుగుతుందని ప్రకటించారు. -
ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సంగారెడ్డి జోన్: ఎస్సీ ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వచ్చే ఏడాది స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే సబ్సిడీని 90 శాతం పెంచేందుకు కృషి చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి రుణాల లక్ష్యం రూ.54.84 కోట్లు కాగా 3085 మంది లబ్ధిదారులకు రూ.37 కోట్లు ప0పిణీ చేశామన్నారు. 1397 ఎకరాలను 603 మంది దళితులకు భూ కొనుగోలు పథకం కింద లబ్ధిచేకుర్చామన్నారు. ఇందుకోసం రూ.66.88 కోట్లను ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి కింద 42 వేల మంది దరఖాస్తులు రాగా 12 వేల మందికి మంజూరు చేశామన్నారు. త్వరలోనే మిగిలిన వారి కూడా సబ్సిడీ విడుదల చేస్తామన్నారు. 2014-15, 2015-16లోఉన్న 80 శాతం సబ్సిడీని 2016-17 సంవత్సరానికి 90 శాతం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రథమ స్థానంలోఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలోఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నాటికి 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నవంబర్లో బస్సుయాత్ర నవంబర్ నెలలో రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంఅమలు చేసిన పథకాల ఫలితాలపై అధ్యయం చేసేందుకు సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్దాస్, సూపరింటెండెంట్ దేవయ్య తదితరులు ఉన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోండి
కడప కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఆర్థికాభివృద్ధికి వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ వెంకట సుబ్బయ్య తెలిపారు. కడప నగర అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపల్ మైదానంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ధ్యాన మండపంలో జిల్లాకు చెందిన అర్చక పురోహితుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ రూపుదిద్దినా సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్రాహ్మణ చైతన్య సమితి అధ్యక్షుడు ప్రసాద్రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సంక్షేమ పథకాల ద్వారా బ్రాహ్మణులు ఆర్థికాభివృద్ది సా«ధించాలన్నారు. కార్పొరేషన్ కో ఆర్డినేటర్ జనార్దన్రావు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి ఏమేమి పథకాలు ఉన్నాయో వివరించారు. బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పిడతల గోపాలకృష్ణశర్మ, మురళీకృష్ణశర్మ, బ్రాహ్మణ ప్రముఖులు డాక్టర్ గోపీనాథ్, జి.శివరావు, బ్రాహ్మణపల్లె చంద్రమౌళిశర్మ, ఈఓ శ్రీధర్, రిటైర్డ్ ఈఓ గురుప్రసాద్ మాట్లాడుతూ పథకాలపై అవగాహన పెంచుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. -
రజకుల డిమాండ్ న్యాయబద్ధమైనది!
దేశంలో అత్యంత వెనుకబాటుకు గురైన కులాలకు రాజ్యాంగపరంగా అందిస్తున్న అండదండలు కొన్ని వర్గాలకే పరిమితం కావడం దురదృష్ట్టకరం. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చడం రాజ్యంగపరంగా సమంజసం కాదనడం సరికాదు. రజకులు కులవృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం చేయాలని చెబుతూనే ఎస్సీల జాబితాలో చేర్చడం కుదరదన్న రీతిలో మల్లెపల్లి లక్ష్మయ్య విశ్లేషిం చడం ఆక్షేపణీయం. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజ కులు డిమాండ్ చేస్తున్నది ఎందుకు? వీటి కోసమే కదా! ‘సాక్షి’ ది.24-03-2016 నాటి సంచికలో ‘రాజ్యాంగబద్ధం కాని హామీ లేల?’ అనే శీర్షికతో ప్రచురితమైన లక్ష్మయ్య గారి వ్యాసం లక్షలాది మంది రజకుల మనోభావాలను గాయపరిచింది. ఆర్థికంగా, సామాజికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఓ సామాజికవర్గ ప్రయోజనాలను కాపాడాలని ప్రధాన రాజకీయ పక్షాలు తల్చుకుంటే రాజ్యాంగాన్ని సవరించైనా చేయగల్గుతాయి. అంటరానితనానికి, వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు 68ఏళ్లుగా చట్టసభలు, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిప రంగా రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటున్నారు. కాబట్టి ఆర్థి కంగా, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీల కంటే కడు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న రజకులకు న్యాయం చేయడానికి రాజ్యాంగం అడ్డుకాబోదు. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ర్టంలో వివిధ పార్టీలు, తమను ఎస్సీలలో చేర్చాలన్న రజకుల డిమాండ్ నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చాయి. రజకుల పోరా టానికి ఊతమిచ్చినందుకు సంతోషం. దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం కావాల నడం సబబు కాదు. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జర గడం సహజం. ఇప్పటికే మన రాజ్యాంగానికి సుమారుగా 120 పర్యాయాలు సవరణలు చేయలేదా? రిజర్వేషన్లు కల్పించాలని కాపు, ఒంటరి, బలిజ కులస్తులు ఉద్యమిస్తే అన్ని రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించలేదా? రాష్ర్ట ప్రభుత్వం దీనిపై కమిషన్ కూడా నియమించింది. ఇక ప్రాతిపదిక చెప్పాలంటే చాలానే ఉంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో రజకులు(దోబీలు) ఎస్సీలుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రజకులు ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, ఒకే సామాజిక హైన్యం కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఏ రాష్ర్టంలో ఉన్నా దేశవ్యాప్తంగా ఒకే కమ్యూనిటీగా (దోబీగా) గుర్తించాలి. దేశవ్యాప్తంగా దోబీలు ఎస్సీ జాబితాలో గుర్తించ బడ్డారు. దోబీలు ఎస్సీలైనప్పుడు దోబీ పోస్టులకు ఎన్నికయ్యే రజకులు కూడా ఎస్సీలవుతారు. భారత్లో అత్యంత ప్రాచీనమైన కుల వ్యవస్థలో ఇతిహాసాల కాలంలోనే ఉనికిలో ఉన్న చాకలి కులం ప్రధానవృత్తి బట్టలు ఉతకడం. బట్టలు ఉతకడమే కాక, దేవుళ్ల ఉత్సవాల్లో సవారీలు మోయడం, దివిటీలు పట్టడం చేస్తారు. చాకళ్ళ గురించి ప్రభుత్వా లకు కూడా ఇంతకుమించి తెలియదేమో? బట్టలుతికేవారందరినీ తెలుగు రాష్ట్రాలలో రజక/చాకలి/వన్నార్ కులస్తులుగా గుర్తించారు. ఒకే కులంగా గుర్తించడంతో చాకలి కులంలో ఉండే అనేక ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇంకా నష్టపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ జాబితాలో ప్రధాన కులా లనూ, వాటి ఉప కులాలనూ ప్రత్యేక కులాలుగా గుర్తించారు. ఒక మాల కులాన్ని ఉదాహరణగా తీసుకుంటే 11 ప్రధాన, ఉపకులా లను ప్రత్యేక కులాలుగా గుర్తించటాన్ని గమనించవచ్చు. బీసీ జాబితా చూస్తే చాకలి కులం విషయంలో ఈ ఉపకులాల ప్రస్తా వనే ఉండదు. రజక/చాకలి/ వన్నార్ అనే పేరుతో చాకలి కులస్థు లందరినీ ఒకే కులంగా గుర్తించి ఆదిమ జాతి/విముక్తి జాతి/ సంచార జాతి/ ఉప సంచార జాతుల కులాల గ్రూపు అయిన ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడక ముందు 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో పొదర వన్నాన్ అనే చాకలి కులానికి ఎస్సీ హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే విషయంపై కమిషన్ వేసింది. 1947 నుంచి 2015 వరకు.. అంటే 68 ఏళ్ల స్వతంత్రం భార తావనిలో రజకజాతి ఎంపీలు, ఆలిండియా స్థాయి ఉద్యోగులైన ఐఏఎస్, ఐపీఎస్లు జీరో. 59 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగాని, ప్రస్తుత తెలంగాణలోగాని రజకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైంది కేవలం ఒక్కరే. 2005- 2011 మధ్య కాలంలో రజక మహిళలపై వందకు పైగా అత్యాచారాలు జరిగాయి. కేసులు నమోదుకానివి, వెలుగులోకి రానివి, సభ్యసమాజం దృష్టికి రానివి అనేకం ఉన్నాయి. రజకుల్లో ఆర్థిక పరాధీనత, సామాజిక హైన్యం వీరిని బలహీనులుగా మారుస్తోంది. విద్య కూడా తగినంత లేకపోవడంతో రజకులు దయనీయస్థితిలో మిగిలిపోతున్నారు. ఇదీ అంకెల్లో రజకుల దుస్థితి. మచ్చుకు కొన్ని లెక్కలివి. తప్పుడు లెక్కలు చరిత్రలో నమోదయ్యాయి. తప్పనిసరిగా వాటిని సరి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. (24.03.2016న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసానికి స్పందన) వ్యాసకర్త వెనుకబడిన వర్గాల నాయకులు 9866200463 - కొలనుకొండ శివాజీ -
ఎస్.సీ.టీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్
-
దళితులకు ‘చేత’బడి
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు ‘‘భారతదేశంలో కాంగ్రెస్ అ త్యంత సంపన్నవంతమైన ధనికపార్టీ. డబ్బుతో అది ఏ పని చే యడానికైనా సిద్ధం! అవినీతి, ఆశ్రీతపక్షపాతం, బ్లాక్ మార్కె ట్టు మాత్రమే కాంగ్రెస్ పరిపాల నలో బలపడ్డ పరిశ్రమలు! ఈ చెడులన్నీ భారీ ఎత్తున పేట్రేగి పోయాయి. కనుకనే ధనిక వర్గానికి, పేద ప్రజలకూ మధ్య అంతరాలు, అసమానతలూ పెరిగిపోయాయి’’ - డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్ణేత, దళితవర్గ అగ్రేసర నాయకుడు భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తదుపరి 21 మాసాలకే కాంగ్రెస్ పాలన వల్ల ‘అవి నీతి, ఆశ్రీతపక్షపాతం, బ్లాక్ మార్కెట్టు’ ఎంత విస్తృతస్థాయిలో అల్లుకుపోయి, సామాజిక అసమానతలకు అంకురార్పణ జరిగిందో డాక్టర్ అంబేద్కర్ గుర్తించారు. గుర్తించడమే కాదు, దోపిడీ, అసమానతలకు తావివ్వని నవ స మాజ వ్యవస్థను స్థాపించుకోడానికి దేశంలోని యావన్మం ది పేద, దళిత బహుజనులంతా అవినీతికర రాజకీయపక్షాలకు దూరంగా ఒక్కతాటిపైన ఎందుకు ఐక్యమై తీరాలో ఆయన 1951 అక్టోబర్ 29 నాటి పాటియాలా సభలోనే స్పషం చేశారు! 63 ఏళ్ల తర్వాత కూడా ఆయన తీవ్ర విమర్శ అక్షర సత్యంగా వర్తిస్తుంది. ఎందుకంటే, ఇన్నేళ్లుగానూ కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చెలాయిస్తున్న ధనిక వర్గ రాజకీయ పక్షాలు పేద, దళిత బహుజన వర్గాలను ఎన్నికలకు ముడి సరుకుగా ఉపయోగించుకుని, అందలం ఎక్కిన తరవాత ‘అసంట’నే ఉండమంటూ వస్తున్నాయి! కాంగ్రెస్, బీజేపీ లాంటి ధనిక వర్గ పార్టీలకు, వాటి మధ్య దూరి తామూ ఎన్నో కొన్ని ఓట్లూ, సీట్లూ ‘బావుకుందామని’ ఎన్నికల జూదంలోకి దిగుతూ వస్తున్న కొన్ని వామపక్షాలకూ నచ్చక పోయినా ఇది అక్షర సత్యం. ఎన్ని లోపాలున్నా, బ్రిటిష్ పాలకులు తమ స్వార్థం కోసమే రూపొందించుకున్నదే అయినా 1935 నాటి ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు’ లేకపోతే జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆ మాత్రపు రిజర్వేషన్లు, సీట్లూ కూడా దక్కి ఉండేవి కావు! అంబేద్కర్ నాయకత్వంలో ‘మహర్ ఉద్యమం’ జరగకపోయి ఉంటే అగ్రవర్ణాల దోపిడీ దురహంకారం నుంచి దళిత బహుజన వర్గాలకు ఆ మాత్రపు వెసులుబాటు కూడా వచ్చి ఉండేది కాదు. స్వాతంత్య్రానంతరం దళిత, ఆదివాసీ ప్రజా బాహుళ్యం ప్రయోజనాల కోసం ఉద్దేశించినట్టు కనిపిం చిన ఎస్సీ, ఎస్టీ చట్టాలు నేటికీ ఎవరికి కొమ్ము కాస్తున్నాయో నిత్యం అనేకచోట్ల అవమాన భారాన్ని మోస్తున్న వారికే తెలుసు! దళితులకు కాంగీ గాలం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలుగుజాతిని చీల్చి, ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ అధిష్టానం, దాని నాయకురాలు సోనియా, రేపటి ‘ప్రధాని’ రాహుల్గాంధీ, ప్రజలు తిరస్కరించిన ఇతర నేతలూ కలిసి విభజన బిల్లుతో తగలబడిపోతున్న రాష్ట్రంలో ‘బొగ్గులు’ ఏరుకోవడానికి, మరోసారి దళిత బహుజనులను మోసగించడానికి వ్యూహం పన్నారు! తెలుగుజాతిని విభజించి రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలను దక్కించుకోడం కోసం పడుతున్న పాట్లలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర దళిత నాయకుల్ని, దళితుల్ని సమీకరించడానికి తాజాగా (5-1-2014) ఓ పెద్ద ప్రయత్నం చే సింది. ఏఐసీసీ వారి ‘షెడ్యూల్డ్ కులాల’ విభాగానికి అధ్యక్షుడైన కె. రాజు అనే వ్యక్తి సాక్షాత్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తరఫున హైదరాబాద్లో వాలారు! ఎప్పటి మాదిరే జనరల్ ఎన్నికల ముందు ‘పార్టీని బలోపేతం చేసుకోవడానికి అనుసరించదగిన పద్ధతులు, మార్గాలను’ గురించి రాష్ట్ర దళిత నాయకులతో చర్చించడం కోసం గాంధీ భవన్కు వేంచేశారు! ఇంతకూ ఆ సమావేశానికి ఎంతమంది ‘కాంగ్రెస్ దళిత’ నాయకులొచ్చారు? మల్లు భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య, ఆరేపల్లి మోహన్లు తప్ప ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా ఇతర దళిత ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొననే లేదు. గత పదేళ్లుగా తమను పట్టించుకున్న నాథుడే లేడని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభ్యులు రాజుతో మొరపెట్టుకోవలసి వచ్చింది! ఏఐసీసీ బ్యురాక్రాట్ ‘రాజు’ రాష్ట్రంలో కొన్ని ‘సంక్షేమ పధకాలు’ పెట్టించడానికి కారకుడు కూడా. అయినా ఎందుకింతగా దళిత నాయకుల వ్యతిరేకతను చూరగొనవలసి వచ్చింది? పదేళ్లుగా విస్మరించిన దళిత నాయకులు ఎన్నికలకు ముందే ఎందుకు గుర్తుకు రావాల్సివచ్చింది? పార్టీ ‘కార్యక్రమాల’ను గ్రామ గ్రామానికి తీసుకుపోవడానికి ప్రతి గ్రామంలోనూ ముగ్గురు-నలుగురు ‘చురుకైన కార్యకర్తల’ను ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల శాఖ గుర్తించాలని, తద్వారా పార్టీలో ‘దళిత గొంతులు’ అధికంగా వినిపించేటట్టు చూడాలని రాహుల్ తనకు పురమాయించాడని రాజు చెప్పుకున్నారు! రాజకీయ స్వాతంత్య్రమే చాలదు ఇంతకూ అసలు ప్రశ్నకు - అదే డాక్టర్ అంబేద్కర్ వేలెత్తి చూపిన సామాజిక, ఆర్థిక అసమానతలకు, అవమానాలకు కారకులెవరన్న ప్రశ్నకు నేటికీ సూటైన సమాధానం లేదు! ఒక్క రాజకీయ స్వాతంత్య్రమే చాలదు, సామాజిక - ఆర్థికరంగాలలో విప్లవాత్మకమైన మార్పులు రానిదే నవ్యభారత నిర్మాణం జరగదని హెచ్చరిస్తూ వచ్చినవాడు అంబేద్కర్. ఈ పని జరగకపోతే త్యాగాలతో రూపొందిం చుకున్న స్వాతంత్య్రమనే సుందరమైన ‘భవంతి’ని కూడాప్రజలు లెక్కచేయరన్నాడు! హైందవ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న దళిత బహుజనులను అస్పృశ్యత పేరుతో ‘వెలివాడల’కు బందీలుగా చేసినంత కాలం అది పౌర స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు పెద్ద అపవాదన్నవాడు అంబేద్కర్. స్త్రీలు కూడా ఈ వర్గ సమాజంలో దళితులేనని ఆయన చాటాడు! ఎన్ని చట్టాలున్నా అవి దళిత బహుజన వర్గాల ప్రయోజనాలకు తగిన స్థాయిలో రక్షణగా నిలవలేకపోతున్నాయి. ఇటీవల సంవత్సరాలలోనే రాష్ట్రంలో చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ, కంచికచర్ల, చలకుర్తి, మహబూబ్నగర్, కరీంనగర్, మక్తా కొత్తగూడెం, తాళ్ల ఊకల్లు, గొప్పారం వగైరా ప్రాంతాల్లో విచ్చలవిడిగా దళితులపై జరిగిన దాడులూ, అత్యాచారాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు! ఇలాంటి ఘట్టాలను అంబేద్కర్ తన చిన్న నాట అనుభవించి ఉన్నందుననే, స్వాతంత్య్రానంతరం కూడా హైందవ సమాజంలో అదే పరిస్థితి కొనసాగుతున్నందున ‘పూనా సంధులు’ ఎన్ని వచ్చినా... దళిత బహుజనుల ప్రయోజనాల రక్షణలో తాను విఫలమయ్యానన్న మానసిక బాధకు గురయ్యారు. చివరికి 1956, అక్టోబర్ 14న చరిత్రాత్మక నాగపూర్ పట్నంలో ఆరు లక్షల మంది దళితుల మధ్య ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాల్సివచ్చింది! రాజ్యాంగాన్ని ప్రసాదించిన చేతులనే ‘హైం దవ’ సమాజం పరోక్షంగా నరికివేసినట్టయింది! దళితులకు దేవాలయ ప్రవేశం కలిగించినంత మాత్రాన వారి శ్రమైక జీవన సౌందర్యానికి విలువ లభించదని, కుల వ్యవస్థ నుంచి పారుతున్న మురికి నీటి వల్ల అది వృధా అయిపోతుందని అన్నాడు అంబేద్కర్. దున్నేవాడికే భూమి హక్కు చెందాలనీ, భూములు లేని నిరుపేదలైన దళిత బహుజనులకు కౌల్దారీ చట్టాల ద్వారా కాకుండా సమష్టి వ్యవసాయ క్షేత్రాల వల్ల మాత్రమే ప్రయోజనాలు దక్కుతాయని చెప్పిన వాడూ అంబేద్కరే! కుల పిచ్చి దేశ ఆర్థిక ప్రగతికే పరమ చేటని, సమష్టి కృషికి హానికరమని ఆయన అన్నాడు! దళిత బహుజనుల ‘ఏకతార’ తీరా మనం ఇప్పుడు ఏ స్థితికి దిగజారిపోయాం? ఈ ధనిక వర్గ సమాజంలో ఇప్పటికీ భారీ ఎత్తున సాగుతున్న ‘క్లాస్ వార్’ ముగింపునకు రాకుండానే ‘గ్లాస్వార్’ (హోటళ్లలో, కఫిటేరియాలలో కుల పిచ్చి మనిషి చేత్తో పుచ్చుకునే ‘గ్లాసుల’ వరకూ) కొనసాగుతోంది! ఈ పూర్వరంగంలో ఓట్ల కోసం రాజకీయులు వేసే గాలానికి చిక్కకుండా స్వతంత్ర శక్తితో దళిత బహుజనులంతా ఏకం కాగలిగితేనే, అటు తెలుగు జాతి విభజననూ, ఇటు ఎన్నికల పేరిట దళిత వర్గాలను చీల్చి పబ్బం గడుపుకొనజూచే రాజకీయ పక్షాల ఆటనూ కట్టడి చేయగలుగుతారు. మహా కవి జాషువా కోరుకున్నట్టు దళిత బహుజన వర్గాలలోని చిల్లర మల్లర అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పి ఏక తాటిపై నిలబడితేనే ‘ఏకతార’ను జయప్రదంగా మీటగలుగుతారు! రాజ్యాధికార పగ్గ్గాలు పట్టుకోగల శుభముహూర్తానికి మరింత దగ్గర కాగలుగుతారు! అప్పుడు మాత్రమే దళిత బహుజనులు - ‘‘కాకతీరిన డప్పు మీద /శబ్ద తరంగం వికసించిన ట్లు /కత్తులకు సానపెట్టే /చక్రం మీద నిప్పుల పువ్వుల్ని’’ పూయించగలుగుతారు! అంతవరకూ దళిత ముసుగులోనే ఉన్న స్వకీయ వర్గ తైనాతీలకు పేద, దళిత వర్గాలు చోటు ఇవ్వరాదు, మరోసారి మోసపోరాదు! మోసాలకు దూరంగా రోషంతో మరో చరిత్ర సృష్టించండి! ఇదే దళిత బహుజనుల రేపటి మానిఫెస్టో! -
బో‘ధనం’ దోపిడీ
ఆదిలాబాద్, న్యూస్లైన్ : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం నేర్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం బెస్ట్ అవలేబుల్ స్కీంను ప్రవేశపెట్టింది. బ్రైట్ బాయ్స్ పథకాన్ని రద్దు చేసి 2011-12లో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న విద్యార్థుల వార్షిక ఆదాయం ప్రామాణికంగా అంటే గ్రామీణ విద్యార్థుల ఆదాయం రూ.62 వేలు, పట్టణ విద్యార్థుల ఆదాయం రూ.70 వేలు ఉంటే ఐదో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. పదో తరగతి వరకు చదువుకోవచ్చు. గతంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అర్హులైన ఎంపిక చేయగా, ప్రస్తుతం లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఎస్సీ విద్యార్థుల పర్యవేక్షణ సాంఘిక సంక్షేమశాఖ, ఎస్టీ విద్యార్థుల పర్యవేక్షణ ఐటీడీఏ అధికారులు చూసుకుంటారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులుకు 433 సీట్లు, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీ విద్యార్థులకు 816 సీట్లు మంజురయ్యాయి. ఏడు పాఠశాలలు.. 1,078 మందే.. ఆదిలాబాద్ పట్టణంలోని సి.రాంరెడ్డి మెమోరియల్ పాఠశాలలో 359 మంది విద్యార్థులు, ఆదిలాబాద్ మండలం మావలలోని కృష్ణవేణి స్కూల్లో 274, మంచిర్యాల పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్లో 11, మంచిర్యాల మండలం రాంపూర్లోని ఆవాస విద్యాల యంలో 35, దహెగాం మండలం సా లేగాంలోని మేరిమాతలో 73, ఉ ట్నూర్ సెయింట్పాల్స్లో 121, నిర్మల్ పట్టణంలోని రవి స్కూల్లో 205 మంది విద్యార్థులు హాస్టల్ వసతితోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాకు 1,249 సీట్లు మంజూ రు కాగా, 1,078 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకా 171 సీట్లు అడ్మిషన్కు నోచుకోలేదు. కాగా, బిల్డింగ్ సదుపాయం, వసతులు, నిపుణులైన టీచర్లు, పాఠశాల ఫలితాలు తదితర వివరాలను ప్రామాణికంగా తీసుకొని పాఠశాలలను ఎంపిక చేయాలి. అయితే విద్యా బోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠశాలలు ఈ పథకం నిర్వహణకు ముందుకు రాకపోవడంతో సదుపాయాలు లేని పాఠశాలను ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్షలు స్వాహా బెస్ట్ అవలేబుల్ పాఠశాలల యాజమాన్యాలు, అధికారులు కుమ్మక్కై రూ.లక్షలు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల విద్యార్థులను ఎంపిక చేయడం, వారు పాఠశాల వదిలి మధ్యలోనే వెళ్లిపోవడం, మళ్లీ రాకపోవడం వంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. వారి తల్లిదండ్రులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలకు వరంగా మారింది. విద్యార్థులు పాఠశాలకు రాకున్నా ఉన్నట్లుగా చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒకసారి విద్యార్థి ఎంపికైతే పదో తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తూ రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. సంక్షేమ, ఐటీడీఏ అధికారులు కూడా ‘మామూలు’గా చూడటంతో వ్యవహారం సాఫీగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినపుడు స్కూళ్లు, హాస్టళ్లలో ఇతర విద్యార్థులను చూపిస్తుండటంతో వ్యవహారం గోప్యంగా సాగుతోంది. అధికారులు దృష్టిసారిస్తే వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. బడ్జెట్ నిలిపివేస్తాం.. - అంకం శంకర్, ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ బెస్ట్ అవలేబుల్ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థుల్లో పది శాతం మంది విద్యార్థులు సెలవులు తీసుకుని రావడం లేదనేది మాదృష్టికి వచ్చింది. ఒకవేళ విద్యార్థులు తిరిగిరాని పక్షంలో వారికి టీసీలు ఇచ్చి పంపిం చడం జరుగుతుంది. హాజరు పట్టికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సహాయ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించాం. స్కూల్కు విద్యార్థులు రాని పక్షంలో వారికి కేటాయించే బడ్జెట్ను నిలిపివేస్తాం. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ కట్
వరంగల్, న్యూస్లైన్: సర్కారు వంచన మరోసారి రుజువైంది. పెంచి న విద్యుత్ ధరలపై ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అంటూ హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ వెనక వేలాది ఆంక్షలు దాచి పెట్టింది. ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్ వర్తించకుండా పాత యూనిట్లతో లంకె పెట్టింది. అంతేకాకుండా అప్పటి ఏళ్ల నాటి బకాయిలతో సహా మొత్తం వసూలు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో విద్యుత్ అధికారులు ఇప్పుడు పేద వర్గాలపై పడ్డారు. జాబితా పట్టుకుని వంద రూపాయలు బాకీ ఉన్నా... సరఫరా నిలిపివేస్తున్నారు. తాజాగా వస్తున్న బిల్లులు కూడా పాత బాకీ కలుపుకుని బిల్లు ఎక్కువగా వస్తుండటంతో ఉచిత విద్యుత్కు అర్హులు కావడం లేదు. దీంతో జిల్లాలో ఈ నెలలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాల వినియోగదారులు ఉచిత విద్యుత్ పొందలేదు. గతంలో కూడా సర్కారు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్ అంటూ పలుమార్లు ప్రకటనలు చేయడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి బకాయిలు పెరిగిపోయాయి. ఒక్కో వినియోగదారునిపై వేల రూపాయల బిల్లులు పెండింగ్ పడ్డాయి. తిరకాసు నిబంధనలు ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్కు బోలెడన్నీ ఆంక్షలు విధించింది. పాత బాకీ ఒక్క రూపాయి ఉన్నా... ఉచితం వర్తించదు. పాత బాకీ మొత్తం చెల్లించాల్సిందే. 50 యూనిట్ల పరిమితికి ఒక్క యూనిట్ దాటినా రెండింతల బిల్లు చెల్లించాల్సిందే. అంతేకాకుండా గత నెలలో సుమారు 60 యూనిట్లు వాడుకుని... తాజాగా 50 యూనిట్లు వాడినా ఉచితం పరిధిలోకి వర్తించరు. ఇలా పాత బాకీలు... పాత యూనిట్లతో లంకె పెట్టింది. దీంతో నిరుపేద ఎస్సీ, ఎస్టీ వర్గీయులు కూడా ఈ ఉచిత విద్యుత్ పరిధిలోకి రావడం లేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 980కి పైగా ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాలు, ఆవాస గ్రామాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 97వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. అయితే మూడు, నాలుగేళ్లుగా ఈ వర్గాలకు ఉచిత విద్యుత్ అనే ప్రచారం సాగడం.. వారిని బిల్లులు కూడా అడగకపోవడంతో బిల్లులు పెండింగ్ పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల కనెక్షన్లపై *46 కోట్ల బకాయిలున్నాయి. ఈ నెలలో ఈ బిల్లులు మరో రూ.2 కోట్లు అదనంగా చేరాయి. అంటే ఈ నెలతో కలుపుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలు చెల్లించాల్సిన మొత్తం బిల్లులు *48 కోట్లు. ప్రభుత్వం నుంచి పాత బకాయిల వసూళ్లకు ఆమోదం రావడంతో ఆ బిల్లులన్నీ వసూలు చేసే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ అధికారులు నాలుగైదు పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్ పోలీసులతో అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు. ఉచిత విద్యుత్ ప్రకటనతో బిల్లు చెల్లించలేదని వినియోగదారులు నెత్తీనోరు బాదుకున్నా కనికరం చూపించడం లేదు. వేలల్లో ఉన్న బిల్లులు చెల్లించాల్సిందేనంటూ సరఫరా నిలిపివేస్తున్నారు. కరెంట్ తీసేశారు అప్పుడో మాఫీ అవుతాంది అన్నరు. ఇప్పుడు వచ్చేమో మొత్తం బిల్లు కట్టాలని కరెంట్ తీసేసిండ్రు. మూడేండ్ల నుంచి ఒక్క బుగ్గ, ఒక్క ఫ్యాన్తో కాలం గడిపాం. ఉచిత విద్యుత్ మాకు ఉందన్నరు. పోయిన నెలలో ఒక్కసారే *27వేల బిల్లు తెచ్చి చేతిలో పెట్టిండ్రు. కూలీనాలీ చేసుకుని బతుకుతున్నం. అంత బిల్లు మేమెక్కడ నుంచి కడుతాం. బిల్లు చెల్లించలేక ఇంట్లో చీకట్లోనే ఉంటున్నాం. - ఎర్ర చిన్నయ్య, లష్కర్ సింగారం తినడానికి తిండే లేదంటే... నాలుగు పందులను కాస్తే తప్పా నోటికి చేతందదు. ఉండటానికి ఇళ్లే సరిగా లేదు. కరెంట్ బిల్లు అని 2011 ఎనిమిదవ నెలల కరెంట్ కట్ చేసిండ్లు. అప్పుడు *3500 అప్పు చేసికట్టిన. ఎస్టీలకు బిల్లు లేదంటే వినలే. గప్పుడు దరఖాస్తు పెట్టమన్నరు. కాగితం రాసి ఇచ్చిన. ఇవాళ కరెంటోళ్లు మల్ల వచ్చిండ్లు.. *13 వేలు బిల్లు ఉన్నది. అని వైరు తీసేసిండ్లు. కరెంట్ బంద్ పెట్టినమని కాగితం చేతిల పెట్టిండ్లు, ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు లేవని గవుర్మెంటోళ్లు చెప్పుతాంటే.. కరెంటోళ్లు బిల్లు అడగబట్టె. ఎట్లా బిల్లు కట్టాల్నో తెలుత్తలేదు. అప్పు కూడా పుట్టేటట్టులేదు. - రాయపురి నర్సయ్య