Shaakuntalam Movie
-
అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?
సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు. (ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్కు అన్ని కోట్లా?) ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది. పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది. (ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!) మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్. ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో? (ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్) -
సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!
సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ) అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ) తాజాగా ఫ్రాన్స్లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్
సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. అందరి అంచనాలు తలకిందలు చేస్తూ భారీ ఫ్లాఫ్గా నిలిచింది. దీంతో నిర్మాతలను ఊహించని విధంగా నష్టాలపాలు చేసింది శాకుంతలం. మరోవైపు ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ తెలిపింది. చదవండి: అనారోగ్యం బారిన పడిన బిగ్బాస్ బ్యూటీ అరియానా న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్గా శాకుంతలం అవార్డులను గెలుచుకున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఫ్లాప్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. Our team is overwhelmed to have been honored with these prestigious Global Awards ✨ Thank you for this incredible recognition 🙏#Shaakuntalam streaming now on @PrimeVideoIN. https://t.co/obv3N5qKUw@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna… pic.twitter.com/2EjTVaOlLO — Gunaa Teamworks (@GunaaTeamworks) May 11, 2023 -
లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన సమంతా తాజాగా అత్యంత ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ (డ్యూప్లెక్స్) కొత్తగా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్ను తాజాగా సమంత సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్లతో జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్మెంట్ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతా రీసెంట్గా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ డ్రామా `శాకుంతలం`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.11 కోట్లు మాత్రమే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్ సింగిల్పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలోకి సమంత 'శాకుంతలం'.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. సుమారు 60కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూ ఇచ్చింది. సినిమాకు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా కథ, గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి -
ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు నిర్మిస్తుంటారు. ఫ్లాపులు ఎదురైన వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి దిల్ రాజును భారీగా దెబ్బతీసింది ఆ చిత్రం. ఇటీవలే ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, మధుబాల, అల్లు అర్హ నటించారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్పై ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందించారు. (ఇది చదవండి: సర్ఫ్తో స్నానం.. టాయిలెట్ వాటర్తో కాఫీ తాగా: నటి ఆవేదన) దిల్ రాజు మాట్లాడుతూ.. 'శాకుంతలం మూవీ మిస్ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలి. రియలైజేషన్ రావాలి. శాకుంతలం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్లో ఇది ఊహించలేదు.'అని అన్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్ అందుకున్న దిల్ రాజుకు శాకుంతలం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాగా.. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్తో ప్రాజెక్టులు ఓకే అయ్యాయని దిల్ రాజు తెలిపారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి) -
ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల
మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!) మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్) -
సమంత సింపతీ డ్రామా....?
-
శాకుంతలం సినిమా పై సమంత షాకింగ్ రియాక్షన్
-
శాకుంతలం అట్టర్ ప్లాప్ అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ
-
సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిందా? నెట్టింట పోస్ట్ వైరల్
సమంత ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడిగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత స్టార్ ఇమేజ్తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే శాకుంతలం విషయంలో ఇది వర్కవుట్ కాలేదు. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ప్రమోషన్స్తో బాగా హైప్ క్రియేట్ చేసినా సినిమా రిజల్ట్ మొత్తం తలకిందులయ్యింది. కథ, కథనాలతో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్, శకుంతల, దుష్యంతుల కెమిస్ట్రీ, డబ్బింగ్.. ఇలా పలు విషయాల్లో శాకుంతలం విమర్శలను ఎదుర్కొంటుంది. వీకెండ్ కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 'శాకుంతలం' రిజల్ట్ చూసి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందని బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఈ క్రమంలో శాకుంతలం మూవీ రిజల్ట్పై సమంత ఇన్డైరెక్ట్గా స్పందించింది. భగవద్గీతలోని..'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంగోత్స్వ కర్మణి..' అనే శ్లోకాన్ని పోస్ట్చేసింది. అంటే..'కర్మ ఫలితం మన చేతుల్లో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానరాదు. ఏదేమైనా ముందుకు సాగిపోవాలి' అని ఈ శ్లోకం అర్థం. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
అదే ప్రాబ్లమ్.. ఎవరూ ప్రపోజ్ చేయట్లేదు: అనన్య
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్ సాబ్’తో మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ని అలరిస్తుంది. తాజాగా ఈ నటి.. తన బాయ్ఫ్రెండ్, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్స్టా లైవ్లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్ఫ్రెండ్ పేరు, అతని ఇన్స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది. అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్ ‘లాస్ట్ టైమ్ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది. -
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి సొగుసుతో ఫిదా చేస్తున్న బుల్లితెర యాంకరమ్మ వర్షిణి పూర్తి పేరు వర్షిణి సౌందరాజన్.. ఈమెది సొంతూరు తమిళనాడు మోడల్గా కెరీర్ ఆరంభించిన వర్షిణి పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది బుల్లితెర యాంకర్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం 'చందమామ కథలు'చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి 'పెళ్లి గోల' వెబ్సిరీస్తో మంచి గుర్తింపును సంపాదించుకుంది -
‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్.. భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 14)విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం ఊహించినదానికంటే చాలా తక్కువ కలెక్షన్స్ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 4.70 కోట్ల గ్రాస్, రూ. 2.24 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రూ.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. (చదవండి: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ) ఏరియా వైజ్గా చూస్తే.. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్ రూ.10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.8లక్షలు, వెస్ట్ గోదావరి రూ.4 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణ రూ. 8లక్షలు, నెల్లూరు రూ. 3లక్షలు చొప్పున వసూళ్లను రాబట్టింది. తమిళ్, కర్ణాటక, ఇతల ప్రాంతాలలో కలిసి రూ. 42 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఈ వీకెండ్లో కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. రూ.19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే రూ 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే.. ఇంకా రూ. 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
అప్పుడే ఓటీటీలో శాకుంతలం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. భారీ బడ్జెట్తో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. రిలీజ్కు ముందు భారీ బజ్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ఈ చిత్రం రాణించలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శాకుంతలం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ నడుస్తుంది. సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తుంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. -
శాకుంతలం మెప్పించిందా..?నొప్పించిందా..?
-
సమంత 'శాకుంతలం' సినిమా స్టిల్స్ చూశారా? (ఫోటోలు)
-
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్పై భారీ దెబ్బ పడింది. థియేటర్కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
Shaakuntalam Review: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ
టైటిల్: శాకుంతలం నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్బాబు, అదితి బాలన్, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ తదితరులు నిర్మాణ సంస్థ: గుణ టీమ్వర్స్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : నీలిమా గుణ దర్శకత్వం: గుణశేఖర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 కథేంటంటే.. విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుని భంగం చేయమని మేనక(మధుబాల)ను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. అనుకున్నట్లే తన అందచందాలతో మేనక.. విశ్వామిత్రుని తప్పస్సుకి భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగాను కలుస్తారు. ఫలితంగా మేనక ఓ ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓ మనిషి వల్ల పుట్టిన బిడ్డకి దేవలోకంలో ప్రవేశం లేకపోవడంతో ఆ చిన్నారిని భూలోకంలోనే వదిలి వెళ్లిపోతుంది మేనక. ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కణ్వ మహర్షి(సచిన్ ఖడేకర్) ఆశ్రమానికి తరలిస్తాయి. ఆమెకు శకుంతల(సమంత) అని పేరుపెట్టి కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి. ఒకరోజు దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) కణ్వాశ్రమానికి వెళ్తాడు. అక్కడ శకుంతలను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. గాంధర్వ వివాహంతో ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటి? గర్భిణీగా ఉన్న శకుంతలకు దుష్యంత రాజ్యంలో జరిగిన అవమానం ఏంటి? శకుంతల గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రి కాదని దుష్యంతుడు ఎందుకు చెప్పాడు? శకుంతల, దుష్యంతుడు విడిపోవడానికి దుర్వాస మహాముని(మోహన్ బాబు) ఎలా కారణమయ్యాడు? గర్భవతిగా ఉన్న సమయంలో శకుంతల పడిన బాధలేంటి? ఆమెకు పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు? తిరిగి వీరిద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గుణశేఖర్. ఇదొక అందమైన ప్రేమ కావ్యమని అందరికి తెలిసిందే. చాలామందికి తెలిసిన కథ. ఇలాంటి కథలకు తెరరూపం ఇవ్వడం అంటే కత్తిమీద సాములాంటిదే. ప్రేక్షకులను మైమరిపించేలా విజువల్ ఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉండాలి. కానీ ఈ విషయంలో గుణశేఖర్ టీమ్ దారుణంగా ఫేలయింది. నాసిరకమైన త్రీడీ హంగులతో సీరియల్కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్నట్లుగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పటికీ మహాభారతం చదవకపోయినా.. శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా..ఈ సినిమా అర్థమవుతుంది. ఒక్కో విషయాన్ని చాలా నీట్గా, అందరికి అర్థమయ్యేలా వివరించారు. అయితే కథను కథలాగే చెప్పడం మైనస్. ఈ రోజుల్లో కథలో వేగం, బలమైన సంఘర్షణలు, ట్విస్టులు లేకపోతే.. ప్రేక్షకులు ఆదరించడం లేదు. వారిని రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడానికి బలమైన కథ ఉండాలి. లేదంటే మైమరిపించేలేలా సాంకేతిక హంగులద్దాలి. కానీ ఈ రెండూ శాకుంతలంలో మిస్ అయ్యాయి. కథ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అలా.. వెళ్తుంది. కానీ ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఆహా..ఓహో..అనిపించేలా ఒక్కటంటే.. ఒక్క సన్నివేశం ఉండదు. ఫస్టాఫ్ మొత్తం విషయానికిస్తే.. పసిపాప శకుంతలను పక్షులు ఎత్తుకెళ్లి కణ్వాశ్రమంలో వదిలేయడం.. కణ్వ మహర్షి పెంచి పెద్ద చేయడం.. అక్కడి పక్షులు, జంతువులతో శకుంతలకు ఉన్న అనుబంధం.. దుష్యంతుడితో ప్రేమాయణం.. ఇలా సాగుతుంది. ఒక చిన్న ట్వీస్ట్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు కథంతా సెకండాఫ్లో సాగుతుంది. దుష్యంతుడి రాజ్యానికి శకుంతల వెళ్లడం.. ఆమెకు అవమానం జరగడం.. రాజ్యంలోని మనుషులు రాళ్లతో కొట్టడం..ఆమె అక్కడి నుంచి పారిపోవడం..ఇలా చాలా సంఘటనలు సెకండాఫ్లో జరుగుతాయి. ఫస్టాఫ్లో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. శకుంతల, దుష్యంతుడు లవ్స్టోరీ అంతగా ఆకట్టుకోదు. అలాగే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేందుకు బలమైన సీన్స్ కూడా ఉండవు. యుద్ధ సన్నివేశాలు సైతం అంత్యంత పేలవంగా సాగుతాయి. చాలా చోట్ల ఇది గ్రాఫిక్స్ అనే విషయం ఈజీగా తెలిసిపోతాయి. ఇక క్లైమాక్స్లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ అదిరిపోతుంది. దుష్యంతుడితో ఆమె చేసే వాదనలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది సమంత. ప్రేమికురాలిగా, భర్తకు దూరమైన భార్యగా ఇలా డిఫెరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించింది. కానీ ఆమె డబ్బింగ్ మాత్రం పెద్ద మైనస్. ఇక దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ బాగానే సెట్ అయ్యాడు కానీ.. నటన పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన స్థానంలో టాలీవుడ్కి పరిచయం ఉన్న నటుడిని తీసుకుంటే బాగుండేమో. ఓ స్టార్ హీరోని పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే సమంతతో సమానంగా ఆ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. అలాంటి పాత్రకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని దేవ్ మోహన్ని ఎంచుకొని గుణ శేఖర్ పప్పులో కాలేశాడు. ఇక దుర్వాస మహర్షిగా మోహన్ బాబు బాగా సెట్ అయ్యాడు. ఆయన తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆకట్టుకున్నాడు. మేనకగా మధుబాలను చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో భరతుడి పాత్రకు న్యాయం చేసింది. తెలుగు డైలాగ్స్కి చక్కగా చెప్పింది. గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖడేకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా తేలిపోయింది. త్రీడీ అన్నారు కానీ.. ఆ ఫీలింగ్ పెద్దగా కలగదు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
వరుస ప్రమోషన్స్.. మళ్లీ అనారోగ్యం బారిన సమంత
Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెకక్కిన సినిమా 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వరకే రిలీజైన ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. మరో వైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్తో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో సమంత కూడా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈక్రమంలో కెమెరా ఫ్లాష్లైట్స్ వల్ల తను కళ్లు కూడా తెరవడానికి ఇబ్బంది పడింది. తాజాగా సామ్ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సమంతే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'ఈ వారం అంతా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండాలని, మీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని అనుకున్నాను. కానీ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం నాకు జ్వరం కూడా వచ్చింది.. నా గొంతు కూడా పోయింది.. ఈ రోజు మల్లారెడ్డి కాళాశాలలో జరిగే ఈవెంట్లో శాకుంతలం టీం రాబోతోంది.. మీరంతా వెళ్లండి.. మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను' అని సమంత ట్వీట్ చేసింది. అయతే శాకుంతలం సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటం, సామ్ ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొంతకాలం కొనసాగిన ఆయన వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న శాకుంతలం సినిమా గుణశేఖర్కు పూర్వ వైభవం తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా రెండు రోజులు వెయిట్ చేయల్సిందే. (1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love. Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice. — Samantha (@Samanthaprabhu2) April 12, 2023 -
30 కేజీల లెహెంగా.. చాలా ఇబ్బంది పడ్డా: సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేది దగ్గర పడుతుండడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు పాల్గొంటున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా సమంత తన ఇన్స్టాలో ఈ సినిమాకు సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత షేర్ చేశారు. ఐదు ఇంట్రెస్టింగ్ విషయాలివే పూలు అంటే ఎలర్జీ అని సమంత తెలిపారు. ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు వచ్చాయని వెల్లడించారు. అవీ టాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయని తెలిపింది. షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్తో కవర్ చేసినట్లు తెలిపింది. శాకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో కుందేలు కరిచిందని సమంత తెలిపింది. సెట్లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి తనని కరిచిందని సమంత చెప్పుకొచ్చింది. ఆ కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్గానే లేదని చెప్పింది. ఈ సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్ కాదని సమంత వెల్లడించింది. శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత తెలిపింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచారని వెల్లడించింది. నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోందంటూ చెప్పడంతో సెట్ అంతా నవ్వులు కురిసేవని సమంత చెప్పింది. ఈ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘శాకుంతలం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ ఫోన్ చేయలేదు: సమంత
‘‘ఒకప్పుడు నా లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో.. నేను చాలా సింపుల్గా, హ్యాపీగా ఉన్నాను. కానీ నా జీవితంలో నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో స్ట్రగుల్స్ను ఫేస్ చేసినప్పుడు వారు స్ట్రాంగ్గా మారిపోతుంటారు. నేనూ అంతే. నన్ను నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకుని, ఇందుకు తగ్గట్లుగా జీవితంలో ముందుకెళుతున్నాను’’ అని సమంత అన్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత్ మహారాజుగా దేవ్మోహన్ నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన సమావేశంలో సమంత మాట్లాడుతూ–‘‘శాకుంతలం’ పూర్తి కథ విన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల పాత్రను పోషించడం నాకు పెద్ద బాధ్యతగా అనిపించింది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్సిరీస్లో రాజీవంటి క్యారెక్టర్ చేసిన నేను వెంటనే శకుంతల పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను. కానీ శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు.. హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన యువతి కూడా. ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నాను. తొలి సారిగా 3డీలో ‘శాకుంతలం’ ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. ఈ సినిమా కోసం గుణశేఖర్గారు మ్యాజికల్ వరల్డ్ను క్రియేట్ చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్కి రమ్మని ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. ఈ విధంగా నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ‘శాకుంతలం’ సినిమా తీశాం’’ అన్నారు గుణశేఖర్. ‘‘ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గుణశేఖర్గారి ప్రయత్నంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘దిల్’ రాజు. -
ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా భయపడ్డా: సమంత
సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శాకుంతలం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటిస్తున్నారు. సమంత మాట్లాడుతూ..'చిన్నప్పుడు ఈ కథ నాకు కొంత తెలుసు. నా ప్రతీ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఫస్ట్ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి భయపడ్డా. నాకు అన్ని ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ క్లిష్ట సమయంలోనే నేను చాలా స్ట్రాంగ్గా తయారయ్యా. అర్హ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు అందరి ముఖాల్లో నవ్వు కనపడుతోంది. పాన్ ఇండియా సినిమాకు నా బెస్ట్ కోసం ఎంతో కృషి చేశా.' అని అన్నారు. (ఇది చదవండి: సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందా?) దిల్ రాజు మాట్లాడుతూ.. 'మన సొంత ప్లేస్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చెప్పినా ప్రతిదీ వైరల్ అవుతుంది. కానీ బయట ప్లేస్లో అలా అవసరం లేదు బోల్డ్గా చెప్పొచ్చు. నాకు సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు ఉంది. ఈ జానర్లో కూడా చేద్దామనని ఈ సినిమా చేశా. ఏ భాషలో అయినా స్టార్ హీరోలు స్టార్ హీరోలే.' అని అన్నారు. -
సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో బిజీగా మారిపోయింది సమంత. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితంలో జరిగిన అంశాలపై పరోక్షంగా కామెంట్స్ చేసింది. నా జీవితంలో ఇంత వరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం. ఎత్తుపల్లాల్ని పారదర్శకంగా అందరూ చూడవచ్చు. కానీ కొందరిలో విషయాలను దాచిపెట్టడం, ఫేక్గా ఉండటం నాకు నచ్చవు. నేను అలా ఉండలేను అంటూ సామ్ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు నాగచైతన్యను ఉద్దేశించే చేసినవంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడ్డానని, గత రెండేళ్లలో అస్సలు ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయని సమంత పేర్కొంది. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే
ప్రతివారం బక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం పాన్ ఇండియా సినిమాతో పాటు మరిన్ని కొత్త చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. అలాగే ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు వినోదం మరింత రెట్టింపు అయ్యింది. పెద్ద సినిమాలన్ని తమకు నచ్చినప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది. ప్రతివారం ప్రేక్షకులను అలరించేందుకు ఇటూ థియేటర్లు, అటూ ఓటీటీలు కొత్త సినిమాలతో సిద్ధమవుతాయి. గతవారం థియేటర్లో రావణాసుర, మీటర్ వంటి సినిమాల అలరించగా ఈ వారం శాకుంతలం వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు పెద్ద హీరోలు చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే. శాకుంతలం సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాతో అర్హ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటం విశేషం. ‘రుద్రుడు’గా మారిన లారెన్స్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేశన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి ‘విడుదల’ తమిళంలో మంచి విజయం సాధించిన ‘విడుదలై’ చిత్రం ఇప్పుడు తెలుగులో అలరించేందుకు రెడీ అయ్యింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రీబ్యూషన్ విడుదల పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 15న తెలుగులో విడుదల కాబోతోంది. ఓటీటీలో అలరించే చిత్రాలు విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లో విడుదలైంది. విశ్వక్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. విడుదలైన నెల రోజులకు ముందే దాస్ కా ధమ్కీ ఓటీటీకి రావడం గమనార్హం. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ+హాట్స్టార్ ఓ కల (తెలుగు) ఏప్రిల్ 13 టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 9 నెట్ఫ్లిక్స్ ఫ్లోరియా మాన్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 13 అబ్సెషన్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 13 క్వీన్ మేకర్ (కొరియన్ సిరీస్) ఏప్రిల్ 14 ది లాస్ట్ కింగ్డమ్ (హాలీవుడ్) ఏప్రిల్ 14 అమెజాన్ ది మార్వెలస్ మిస్సెస్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 14 జీ5 మిస్సెస్ అండర్కవర్ (హిందీ) ఏప్రిల్ 14 -
శాకుంతలం టీమ్ మాటలకు ఫ్లాట్ అయిన ఉదయభాను..సినిమా చూసి తీరాలంతే...
-
శాకుంతలం సినిమాలో మహేష్ బాబు కూతురిని కాకుండా అల్లు అర్జున్ కూతురిని ఎందుకు తీసుకున్నామంటే..
-
సుమ స్పాంటేనిటీ పీక్స్.. సమంత నవ్వలేక ఏడ్చేసింది
-
శాకుంతలం నుంచి విడుదలైన 'మల్లికా' వీడియో సాంగ్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మల్లికా.. మల్లికా అనే వీడియో పాటను విడుదల చేశారు. నిమిషంనర నిడివి ఉన్న ఈ పాట 'మల్లికా మల్లికా మాలతీ మాలిక .. చూడవా చూడవా ఏడే నా ఏలికా' అంటూ సాగుతుంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రమ్య బెహ్రా ఆలపించింది. దుష్యంతుడి కోసం ఎదురుచూస్తూ శకుంతల పాడుకునే పాటగా దీన్ని చిత్రీకరించారు. -
'శాకుంతలం' మూవీలో సమంతను అనుకోలేదు: గుణశేఖర్
సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు మూడేళ్ల సమయం పట్టిందని తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో శకుంతల పాత్రకు సమంతను ఎంపిక చేయలేదని అన్నారు. తన కూమార్తెనే సమంత పేరును సూచించిందని గుణశేఖర్ వెల్లడించారు. కథను ఎంచుకున్న తర్వాత పాత్రలపై చాలా రోజులు కసరత్తులు చేసినట్లు ఆయన తెలిపారు. గుణశేఖర్ మాట్లాడుతూ .. 'ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం పట్టింది. షూటింగ్ కోసం ఆరు నెలల సమయం అనుకున్నాం. కానీ 81 రోజులు పట్టింది. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అలాగే శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివా. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశా. మొదట నేను సమంతను తీసుకోవాలని అనుకోలేదు. సమంత అయితేనే బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో మరోసారి 'రంగస్థలం' చూశా. ఓ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించా.' అని అన్నారు. దేవ్ మోహన్, సమంత నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘శాకుంతలం’ నా మొదటి అడుగు!: ‘దిల్’ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘‘రాజమౌళి ‘బాహుబలి’ని పాన్ ఇండియాకి, ‘ఆర్ఆర్ఆర్’ని మొత్తం ప్రపంచానికి చూపించారు. మన తెలుగు సినిమాలు ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి.. దాని కోసం నా మొదటి అడుగు ‘శాకుంతలం’. ఇది మన ఇండియన్ సినిమా అని తర్వాతి తరానికి తెలియాలి. ఈ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సమంత లీడ్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రం త్రీడీ ట్రైలర్ని విడుదల చేశారు. చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ..‘‘గుణశేఖర్గారికి సాయం చేయడానికి నేను ఈ మూవీలో భాగమయ్యాను’ అని అందరూ అనుకుంటారు. కానీ, గుణశేఖర్గారు మోస΄ోయారు.. నేను స్వార్థంతో ఈ మూవీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే తెలుగు సినిమా గ్లోబల్ వరకూ వెళ్లింది. భవిష్యత్లో నేను కూడా ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న గొప్ప సినిమాలు తీయాలంటే పని నేర్చుకోవాలి. అందుకే ‘శాకుంతలం’లో చేరాను’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఇది సమంతగారి ‘శాకుంతలం’. శకుంతల పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు’’ అన్నారు. ‘‘మైథాలజీలో త్రీడీలో వస్తున్న తొలి చిత్రం ‘శాకుంతలం’. ప్రేక్షకులందరూ ఈ మూవీని త్రీడీలో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నీలిమ గుణ. చదవండి: బర్త్డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? -
శ్రమను చూసి పారితోషికం ఇవ్వాలి.. యాచించాల్సిన అవసరం లేదు: సమంత
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది సమంత. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ‘శాకుంతలం’చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. నటీ నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కష్టాన్ని చూసి దానికి తగ్గట్టుగా పారితోషికం ఇస్తే బాగుంటుందని సమంత అభిప్రాయపడింది. ‘నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం’అని నిర్మాతలే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’అని సమంత చెప్పుకొచ్చింది. ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
ప్లీజ్ సామ్ మళ్లీ లవ్ చేయండి.. సమంత రియాక్షన్ ఇదే!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ఘనంగా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రం బృందం. ఈ క్రమంలో రీసెంట్తో యాంకర్ సుమతో సమంత ముచ్చటిస్తూ శాకుంతలం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు ఇక అదే వీడియోను సామ్ అభిమాని షేర్ చేస్తూ.. ‘ఇది చెప్పేంత చనువు నాకు లేదని తెలుసు. ప్లీజ్ సామ్ మీరు ఎవరితో అయినా డేట్(ప్రేమ) చేయండి’ అని కోరారు. ఇక దీనిపై సమంత స్పందిస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఆమె ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకి అభిమాని ట్వీట్కి ఏం అన్నదంంటే.. మీలా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. కాగా టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్ ప్రాణాంతకమైన మయోసైటిస్ బారిన పడినప్పుడు కూడా సామ్ ఒంటరిగా పోరాడు. ఆ కష్ట సమయాల్లో చై సామ్ పక్కన ఉంటే ఎంత బాగుండేదోనంటూ వారి అభిమానుల కోరుకుంటూ ఎన్నో కామెంట్స్ చేశారు. కాగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో లీడ్ రోల్లో సామ్ నటించగా.. దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5 — Samantha (@Samanthaprabhu2) March 26, 2023 -
అల్లు అర్జున్ కూతురిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత
సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కారణం బన్నీ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇవ్వడమే. శాకుంతల-దుష్యంత మహారాజు కొడుకు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా నార్మల్గానే చెప్తుంది. ఈ జనరేషన్ పిల్లలకి అంత బాగా తెలుగు నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సెట్లో కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా బాగా చెప్పింది. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయితే, అర్హ పుట్టకతోనే స్టార్' అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. -
ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయలేదు: సమంత
సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో అభిమానులను పలకరించింది. ఆ సమయంలో సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా కూడా ప్రమోషన్స్లో పాల్గొన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక ఉండేది కాదు. చాలా మందులు వాడాల్సి వచ్చేది. సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. శాకుంతలం చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుణశేఖర్ కథ చెప్పగానే మొదట తిరస్కరించినట్లు తెలిపింది. అందుకు కారణం మూడేళ్లుగా తనలో ఉన్న భయమేనని అన్నారు. కానీ గుణశేఖర్ ఒప్పించి మరీ నటించేలా చేశారని వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామాలు, వర్కవుట్లు, డైట్ కూడా మార్చుకున్నట్లు వివరించారు. ఈ చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమయ్యేది కాదన్నారు. కాగా.. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్బాబు, అదితి బాలన్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
శాకుంతలం సినిమాలో ధరించిన బంగారు, వజ్రాభరణాలు చూశారా? (ఫొటోలు)
-
'శాకుంతలం' సినిమాలో సమంత ధరించిన నగలు ఎన్ని కోట్లో తెలుసా?
సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా శాకుంతలం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈసినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలం కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించినట్లు గుణశేఖర్ వెల్లడించారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలను తయారుచేసింది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు... తన పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు. -
Shaakuntalam: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు (ఫొటోలు)
-
సమంతతో బాక్సాఫీస్ ఫైట్కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
ఎండల్లో హాయ్ హాయ్..అంటున్న స్టార్స్.. సమ్మర్ టార్గెట్గా భారీ సినిమాలు
వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్ కూల్గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్ టార్గెట్గా ఎక్కువ సినిమాలు సిల్వర్ స్క్రీన్కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... ♦ ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ♦ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్లో నటించారు. ప్రస్తుతం నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ♦ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ . కదిరేశన్∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించినా వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎ న్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం. ♦ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్ప్యాక్ దేహం, పొడవాటి హెయిర్ స్టైల్తో స్టైలిష్గా మేకోవర్ అయ్యారు అఖిల్. ఫారిన్లో చిత్రీకరించే ఓ ఫైట్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ♦ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ (పీఎస్– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 30నపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ♦ తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్ల్ ప్రారంభమైంది. తన కెరీర్లో తొలిసారి మాస్, యాక్షన్ మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏప్రిల్ 29న బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ∙ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ రిలీజ్ అవుతుందా? మరో కొత్త డేట్ని అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సమంత లీడ్ రోల్లో నటించినపాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
అది మీకు ఎప్పటికీ తెలియదు.. సమంత పోస్ట్ వైరల్
మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. నారోగ్యంతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన సామ్.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. ఇలా వరుస షూటింగ్స్తో బిజీ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేస్తూ.. అభిమానుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. తాజాగా సామ్ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఇలా రాసుకొచ్చింది.‘ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. -
వాలంటైన్స్ డే: శాకుంతలం చిత్రం నుంచి మరో మెలోడీ సాంగ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టిజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శాకుంతలం పాటలు అయితే యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం మరో మెలోడీ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘మధుర గతమా..’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీమని సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కాగా ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శాకుంతం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
సమంత ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ టీం
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 14న శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్ల తాజాగా ప్రకటన ఇచ్చారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. చదవండి: ప్రకాశ్ కామెంట్స్పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఇప్పటికే ఈ సినిమా ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. The Love that was forgotten... An unforgettable tale of Love that remains🦢#Shaakuntalam in theatres worldwide on April 14🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth #ShaakuntalamOnApril14 pic.twitter.com/sUG21bjYUM — Gunaa Teamworks (@GunaaTeamworks) February 10, 2023 -
అఫీషియల్.. సమంత ‘శాకుంతలం’ వాయిదా
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఈ క్రమంలో ఆడియన్స్కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది. చదవండి: ఓర్వలేక నా బిజినెస్పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. The theatrical release of #Shaakuntalam stands postponed. The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj — Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023 -
సమంత ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సమంత శాకుంతలం.. లిరికల్ సాంగ్ అవుట్
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఋషివనములోనా' మరో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్లో రిలీజై అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈ సాంగ్ లిరిక్స్ శ్రీమణి అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. -
శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్
మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను రమ్య బెహ్రా పాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్హ.. సోషల్ మీడియాలో పంచుకున్న ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. ఇప్పటికే సమంత నటిస్తున్ శాకుంతలం సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన శాకుంతలం ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా అర్హ కనిపించింది. తాజాగా అర్హ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే ఆరో ఏట అడుగు పెట్టిన అల్లు అర్హ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాకుంతలం చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. మరోవైపు మహేశ్ బాబు మూవీ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్హ నటిస్తున్నట్లు టాక్. -
సమంత అందంపై కామెంట్.. తన స్టైల్లో రిప్లై ఇచ్చిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొనడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. ట్రైలర్లో సమంత అందానికి, నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మయోసైటిస్ నుంచి సమంత కోలుకుందా? ఇప్పుడు మునుపటిలా వరుస సినిమాలు చేస్తుందా అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో సమంత అందంపై ఓ నెటిజన్ చేసిన కామెంట్కి సామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చదవండి:Samantha: సమంత మయోసైటిస్ నుంచి ఇంకా కోలుకోలేదా? సమంతను చూస్తే జాలేస్తుంది. విడాకుల తర్వాత ధైర్యంగా నిలదొక్కుకొని కెరీర్ ఉన్నత స్థానంలో ఉందని భావిస్తుండగా మయోసైటిస్ ఆమెను దెబ్బతీసింది. ఆమెను మళ్లీ బలహీనురాలిని చేసింది. సామ్ అందం, గ్లో తగ్గిపోయింది. ఆమెను చూస్తూ బాధేస్తోంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. నాలాగా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి నీకు రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది సామ్.చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత I pray you never have to go through months of treatment and medication like I did .. And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a — Samantha (@Samanthaprabhu2) January 9, 2023 -
సమంత చేతిలో జపమాల.. కారణం ఇదేనా?
చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెరపై ఆమె మాట్లాడడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామ్ గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు అనారోగ్యం కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్లోనూ పాల్గొనలేకపోయింది. శక్తిని కూడగట్టుకొని బలవంతంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నిన్నటి వరకు సామ్ మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉన్నారు. అయితే సామ్ ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలను కూడా సమంత పాటిస్తున్నారని తెలుస్తుంది. సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకు ముందు ముంబై ఎయిర్పోర్ట్లో కూడా చేతిలో జపమాలతో కనిపించింది. దీంతో అందరి దృష్టి ఆ జపమాలపై పడింది. ఆమె జపమాల ధరించడానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆరా తీస్తున్నారు. (చదవండి: సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్) సాధారణంగా తులసిమాల వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనసు కూడా ప్రశాంతంగా అంటుందని చాలామంది నమ్ముతారు. దీంతో సమంత కూడా ఆ తులసి జపమాల ఆరోగ్యం కోసం, చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికే ఆ జపమాల వేసుకుందట. అంతేకాదు ఎక్కువగా తెల్లటి దుస్తులనే ధరిస్తున్నారట. నెగిటివ్ థాట్స్ రాకుండా, మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకే సామ్ జపమాలతో లక్ష జపం చేస్తున్నారట. అలాగే సమంతకు ఆధ్యాత్మిక భావన ఎక్కువనే చెప్పాలి. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవుని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. కాగా, సమంత లీడ్ రోల్లో నటించిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులతో ట్రైలర్ అదిరిపోయింది. శాకుంతలగా సమంత మేకోవర్, మణిశర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , దుర్వాస మహర్షి పాత్రలో మంచు మోహన్ బాబు, భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది. (చదవండి: ఓపిక లేకపోయినా వచ్చాను.. సమంత ఎమోషనల్) తాజాగా ఈ సినిమా ట్రైలర్పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో నిన్ను చూడడం మంత్రముగ్ధులను చేసింది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు’అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. . @Samanthaprabhu2, you nailed it with grace in #Shaakuntalam. 🙌🏻🤗 Nanna watching you as Durvasa Maharshi, has left me spellbound. 😍😍 Last and the cutest #Arha papa as #Bharathudu is a spectacle to watch out for!! ♥️https://t.co/iED4KfGNEm — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 9, 2023 -
Samantha: సమంత మయోసైటిస్ నుంచి ఇంకా కోలుకోలేదా?
‘‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతలా ప్రేమిస్తానో... సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ‘శాకుంతలం’తో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను’’ అని సమంత అన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటింన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ– ‘‘ఓపిక లేకపోయినా గుణశేఖర్గారిపై ఉన్న అభిమానం, గౌరవంతో నా బలం మొత్తాన్ని కూడగట్టుకుని ఇక్కడికి వచ్చాను. కొందరికి సినిమా అనేది జీవితంలో ఓ భాగం. కానీ, గుణశేఖర్గారికి సినిమానే జీవితం. ప్రతి సినిమాలానే ‘శాకుంతలం’ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఏ కథ విన్నా సినిమా బాగా రావాలని నటీనటులు కోరుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..‘శాకుంతలం’ చూశాక నాకు అదే భావన కలిగింది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్గారు ‘శాకుంతలం’ కథ చెప్పినప్పుడు లీడ్ రోల్లో సమంత అయితే సరిపోతారనుకున్నాం. కథ విని, సమంత కూడా ఓకే అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా ఇది’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘శాకుంతలం’లో ముగ్గురు హీరోలున్నారు. కథకు హీరో దేవ్ మోహన్ , సినిమాకు హీరో సమంత, తెరవెనక హీరో ‘దిల్’ రాజుగారు. ఇండియాలో వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినివ్చన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’. ఓ హీరోయిన్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన రాజుగారికి థ్యాంక్స్. (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు. గుణశేఖర్ మాటలకు సమంత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘‘మా నాన్న ఎన్నో విజువల్స్ వండర్స్ సృష్టించారు. ‘శాకుంతలం’ ఆయనకు పూర్వ వైభవం తెస్తుంది’’ అన్నారు నీలిమ గుణ. -
గుణశేఖర్ మాటలకు సమంత ఎమోషనల్
-
సమంత ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాట్లాడినా..ఏడ్చినా అది తప్పదు, సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్ ఆరోగ్యం ప్రస్తుతం కాస్త కుదుట పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ముంబై ఎయిర్పోర్ట్లో మెరిసింది. అంతేకాదు ప్రస్తుతం శాంకుతలం డబ్బింగ్ పనుల్లోనూ పాల్గొంటుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శాకుంతలం పాత్రలో నటించనడానికి తాను పడిన కష్టాలను తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది సామ్. ‘శాకుంతలం చిత్రం కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు.. మాట్లాడుతున్నప్పుడు.. పరుగెత్తున్నప్పుడు.. ఏడుస్తున్నప్పుడు కూడా దయ.. భంగిమను కొనసాగించడం. దయ చూపించడం నా వల్ల కాలేదు. దాని కోసం ట్రైనింగ్ తీసువాల్సి వచ్చింది. అలా కాకుండా సాషా(పెంపుడు కుక్క)ను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది’అంటూ దీనంగా చూస్తున్న పెంపుడు కుక్క వీడియో పాటు శాకుంతలం భంగిమను షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత 'శాకుంతలం'.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన తాజా చిత్రం 'శాకుంతలం'. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 9న ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్తో ఉన్న స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. -
నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ తాను మయోసైటిస్తో బాధపడుతున్నానని చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైంది. ఆస్పత్రి బెడ్పైనే యశోద మూవీకి డబ్బింగ్ చెప్పింది సమంత. ఇక ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబతోంది. ఈ నేపథ్యంలో సమంత శాకుంతలంలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! శాకుంతలం సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ‘నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటన్నింటికి ఈ కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను’ అని రచయిత నిక్కీ రో రాసిన కోట్ను ఈ సందర్భంగా పంచుకుంది. ఈ పోస్ట్ చూస్తుంటే సమంత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ ముంబై ఎయిర్పోర్టులో వైట్ సూట్ ట్రెండీ డ్రెస్లో సామ్ దర్శనమిచ్చింది. ఈ లుక్ చూసి ఆమె ఫాలోవర్స్ లేడీ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు మూవీ టీం. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాకుంతలంను 3D వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్తో ఉన్న స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
దేవకన్యలా సమంత.. శాకుంతలం ఫస్ట్లుక్ వచ్చేసింది
Samantha First Look In Shakunthalam Is Out: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సమంత ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. చదవండి: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత Presenting .. Nature’s beloved.. the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam 🤍 #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth — Samantha (@Samanthaprabhu2) February 21, 2022 -
ఒకే లొకేషన్లో తండ్రి కూతురు షూటింగ్
-
శాకుంతలం సెట్లో అల్లు అర్హ.. మేకప్ వీడియో వైరల్
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ అల్లువారి ముద్దుల తనయ సంబంధించిన మేకప్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అర్హ ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొంది అర్హ. కారవాన్లో అర్హ క్యూట్గా మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు టీం. మేకప్ వేస్తుండగా భలే ముద్దుగా కూర్చుని ఉంది అర్హ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. #AlluArha is back on the sets. The little Prince Bharata joins the ongoing schedule of the mythological drama #Shaakuntalam, which is currently underway in Hyderabad @alluarjun @Samanthaprabhu2 @Gunasekhar1@neelima_guna @neeta_lulla @GunaaTeamworks pic.twitter.com/l03FKZFBrK — Shreyas Sriniwaas (@shreyasmedia) August 3, 2021