Sneha Reddy
-
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ.. పుష్ప నటి లేటేస్ట్ లుక్స్!
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..పుష్ప నటి కరణం పావని లేటేస్ట్ ఫోటో లుక్స్..టూర్లో చిల్ అవుతోన్న బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి..భూమిక చావ్లా లేటేస్ట్ ఫోటో షూట్..గ్రీన్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు...సైకిల్ నేర్చుకుంటోన్న ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ సతీమణి కూడా!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్డమ్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్హ బర్త్ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అభిమాన హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
గోవాలో ఫ్యామిలీతో అల్లు స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అల్లు స్నేహ బర్త్డే స్పెషల్: ఐకాన్ స్టార్.. స్టైలిష్ వైఫ్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ భార్య.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి స్వామివారి దర్శన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందిన్కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పుష్పకు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడినా మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే పుష్ప-2 షూటింగ్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. రిలీజ్ తేదీలోనూ ఎలాంటి మార్పులేదని మరోసారి ప్రకటించారు.#TFNReels: #AlluSnehaReddy along with her kids visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!! 🙏✨#AlluArjun #AlluAyaan #AlluArha #TeluguFilmNagar pic.twitter.com/fNGQNbFb1A— Telugu FilmNagar (@telugufilmnagar) August 6, 2024 -
జిమ్లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
హీరో అల్లు అర్జున్ ఈ మధ్య లేనిపోని వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడంతో బన్నీని ఉద్దేశిస్తూ నాగబాబు రెచ్చగొట్టే ట్వీట్ చేయడం.. ఇలా అనుకోని విధంగా వార్తల్లో నిలిచాడు. అయితే అదంతా సైలెంట్ అయిపోయింది. ఇక తాజాగా బన్నీ నుంచి ఊహించని ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో భార్యతో కలిసి ఓ డాబాలో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. బయట ఎక్కడ కనిపించినా సరే జనాలు బాగానే వస్తారు. అలాంటిది సింపుల్గా ఓ దాబాలో భోజనం చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్కి సపోర్ట్ చేసేందుకు నంద్యాల వెళ్లిన బన్నీ.. తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, బన్నీ స్టైల్-స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!) -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
ఇద్దరు అర్జున్లను హ్యాండిల్ చేయగలవా..భార్యపై బన్నీ కామెంట్లు
-
అల్లు అర్జున్ పెళ్లి రోజు.. భార్యతో ఈ క్యూట్ ఫొటోలు చూశారా?
-
తిరుమల శ్రీవారి సేవలో స్నేహా రెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమలలో ప్రగతి, నందిని రెడ్డి స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Allu Arjun Wife Sneha Reddy: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి!https://t.co/jc53pf3pku#AlluArjun #allusnehareddy #SnehaReddy #tirumala #TTD #MovieNews #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday #Trending — Sakshi (@sakshinews) January 29, 2024 -
సంక్రాంతి వేకేషన్లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్ వెకేషన్కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్పోర్ట్లో కనిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 సీక్వెల్గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. #TFNExclusive: Icon stAAr @alluarjun along with his wife #AlluSnehaReddy were seen 📸 at HYD airport in stylish & chic looks as they're off to Bangalore for Sankranthi celebrations with family! 😍🔥#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/zbj3NHc55j — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
వరుణ్- లావణ్య పెళ్లిలో బన్నీ కూతురు సందడి..!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలు హాజరవుతున్నారు. ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాక్టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. (ఇది చదవండి: ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?) సోమవారం రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ మరింత స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. తాజాగా అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. ఆ ఫోటోల్లో అర్హ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. బన్నీ సైతం తన కుమారుడు అయాన్తో ఉన్న పిక్ను షేర్ చేశారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. కాగా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (ఇది చదవండి: నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి బర్త్ డే స్పెషల్ ఫొటోలు
-
'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సెప్టెంబర్ 29న తన భార్య స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీడియో షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే క్యూటీ.. సన్సైన్ ఆఫ్ మై లైఫ్' అంటూ భార్యపై బన్నీ ప్రేమను చాటుకున్నారు. కాగా.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్రతో నటించిన అర్హ తొలిసారిగా స్క్రీన్పై నటిస్తోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరి కాంబో వచ్చిన పుష్ప పార్ట్-1 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
భార్య బిజినెస్ను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్ అండ్ కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కొడుకు అయాన్తో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్గా మారాయి. భార్య ఈవెంట్ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) టాలీవుడ్ జంట ఎయిర్పోర్ట్లో స్పెషల్ లుక్లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) ICON star @alluarjun and #AlluSnehaReddy at Mumbai airport Bunny boy looks 😎😍#Pushpa2TheRule pic.twitter.com/YoPTySfKyx — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 7, 2023 #TFNExclusive: AA slays in Black🖤 Icon Star @alluarjun along with his wife #AlluSnehaReddy get papped at Mumbai airport!!😎#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/rkVKbbpj4A — Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023 -
స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్, వెకేషన్ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్కు స్నేహా కంటే ముందు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో తన ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ పేరును బన్నీ రివీల్ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్కు అల్లు అర్జున్ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్ అవుతుందో..! -
చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్ వెకేషన్.. ఇది సరిపోదా?
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్తో వెకేషన్కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ కూతురిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత
సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కారణం బన్నీ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇవ్వడమే. శాకుంతల-దుష్యంత మహారాజు కొడుకు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా నార్మల్గానే చెప్తుంది. ఈ జనరేషన్ పిల్లలకి అంత బాగా తెలుగు నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సెట్లో కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా బాగా చెప్పింది. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయితే, అర్హ పుట్టకతోనే స్టార్' అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. -
అర్హ స్టంట్కి షాక్ అయిన అల్లు అర్జున్.. ఫోటో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. సోషల్ మీడియాలోనూ అర్హకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే అర్హ తాజాగా తన టాలెంట్తో మరోసారి సర్ప్రైజ్ చేసింది. అతి చిన్న వయసులోనే క్లిష్టమైన యోగాసనాలు వేసి తండ్రి అల్లు అర్జున్కే ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది. అయాన్, అర్హ చేసే అల్లరి ఫోటోలు, వీడియోలను స్నేహారెడ్డి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటదన్న విషయం తెలిసిందే. తాజాగా తమ గార్డెన్లో అర్హ యోగాసనం వేస్తుంటే అది చూసి బన్నీ షాక్ అవుతున్నట్లు ఒక ఫోటోను స్నేహా అభిమానులతో పంచుకుంది. ఇక అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి రోజు: అల్లు అర్జున్-స్నేహ క్యూట్ పిక్స్ వైరల్
-
అంతకన్నా ఆనందం ఏముంటుంది? అదే నాకిష్టమైన ప్లేస్ : స్నేహారెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్తో ఆకట్టుకుంటుంది. స్టైలిష్ కపుల్గా ఇండస్ట్రీలో ఈ జంటకు పేరుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మాంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్న స్నేహరెడ్డి తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ వీడియోను షేర్చేస్తూ.. 'మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం' అంటూ మొక్కలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగే స్నేహారెడ్డి యంగ్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు.. మేడమ్ సర్.. మేడమ్ అంతే. హీరోయిన్కి ఏమాత్రం తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
బన్నీ భార్యకు ఆ అవసరం లేదు.. అయినా పనిచేస్తుంది : అల్లు అరవింద్
ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్ పద్మభూషణ్ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. తాజాగా రైటర్ ప్మభూషణ్ సక్సెస్ మీట్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. -
Allu Sneha Photos: అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి బ్యూటిఫుల్ ఫోటోలు
-
Allu Sneha Reddy: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్ భార్య?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఫోటోషూట్స్తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది స్నేహ. హీరోయిన్కి ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్తో నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఈ క్రమలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న స్నేహకు రీసెంట్గా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఒకేవళ ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే టాలీవుడ్ కాకుండా మాలీవుడ్ను ఎంచుకుంటుందా అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్గా అనిపించింది: హీరోయిన్ -
బన్నీ భార్య స్నేహా రెడ్డి చీర ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడం కరెక్టేమో! ట్రెండ్ను ఫాలో అవుతూ స్టైల్ను మెయింటెన్ చేయడంలో ఇద్దరూ ముందుంటారు. ప్రతి సినిమాకు లుక్ను మార్చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంటాడు బన్నీ. అలాగే ఆయన భార్య స్నేహా కూడా డిఫరెంట్ శారీస్తో అందంగా రెడీ అవుతూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వెండి కలర్లో ఉన్న చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. రిమ్జిమ్ దాదు ఈ చీర డిజైన్ చేయగా, ప్రీతమ్ జుకల్కర్ తననింత స్టైలిష్గా రెడీ చేశాడని పేర్కొంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఎంతందంగా ఉన్నారండీ బాబూ.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా లక్షా డెబ్భై ఆరు వేల రూపాయలట! చూడటానికి ఇంత సింపుల్గా ఉంది, కానీ అంత ధర ఉందేంటని షాకవుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: రౌడీ హీరో ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు, వీడియో వైరల్ -
భార్య బర్త్డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
గంగూబాయిలా మారిన నిహారిక కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్గా కెరీర్గా మొదలుపెట్టిన నిహారిక `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్ నటించిన గంగూబాయ్ లుక్లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా బర్త్డే పార్టీకి వచ్చిన నిహారిక గంగూబాయిలా అచ్చం దించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ భార్య స్నేహా, శ్రీజ సహా పలువురు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) -
బన్నీ భార్య స్నేహారెడ్డి ఫోటోపై కల్యాణ్ దేవ్ కామెంట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో తెగ యాక్టివ్గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ డిజైనింగ్ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్ లుక్లో కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు. స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ రియాక్ట్ అవుతూ హాట్ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్పై నిహారిక కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బన్నీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్లో సూపర్ స్టైలిష్ లుక్లో కనపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా అల్లు అర్జున్ మామ, స్నేహరెడ్డి తండ్రి చంద్రశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తానని కితాబిచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవి అడుగుజాడలో బన్నీ కూడా ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి సమయంలో బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు అని అడగ్గా.. బన్నీ అసలు కట్నం తీసుకోలేదని పేర్కొన్నారు. 'వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం' అంటూ బన్నీ గురించి ప్రశంసలు కురిపించారు. బన్నీపై ఆయన మామ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. -
బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో తెగ యాక్టివ్గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహా ఇన్స్టాలో అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో చిట్చాట్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, లండన్ ఫేవరెట్ హాలీడే స్పాట్ అని పేర్కొంది. ఇక బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగ్గా.. బిర్యానీ అని సీక్రెట్ బయటపెట్టేసింది. ఇక రీసెంట్గా దిగిన ఫ్యామిలీ ఫోటోలను సైతం పంచుకుంది. -
అల్లు అర్జున్-స్నేహ వివాహ బంధానికి పదకొండేళ్లు.. బన్నీ స్వీట్ విషెస్
Allu Arjun Celebrate 11th Marriage Anniversary Wishes To Sneha Reddy: టాలీవుడ్లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరూ ప్రేమ చూపించడంలో ఎవరికీ వారే సాటి. అయితే ఆదివారం (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి రోజు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, ఏడడుగులు నడిచి నేటికి 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ పిల్లలతో కేక్ కట్ చేస్తున్న ఫొటో షేర్ చేస్తూ 'పెళ్లి రోజు శుభాకాంక్షలు క్యూటీ. మనిద్దరి ఈ బంధానికి 11 వసంతాలు.' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కాగా శ్రుతిహాసన్తోపాటు పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ రూపంలో విషెస్ తెలుపుతున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లాలి. కానీ పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పార్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. -
అల్లు అర్జున్ భార్యపై సమంత 'హాట్' కామెంట్స్ వైరల్
Samantha Comment On Allu Arjun Wife Sneha Reddy Pic, Goes Viral: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో తెగ యాక్టివ్గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు సైతం స్నేహపై ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోయిన్ సమంత సైతం హాట్.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్ సాంగ్లో కనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: చై నుంచి రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్.. స్పందించిన సామ్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఫాంహౌస్లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Allu Arjun And Sneha Reddys Diwali Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె దీపావళి వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫాంహౌస్లో జరిగిన ఈ దీపావళి వేడుకల్లో రామ్చరణ్, ఉపాసనలతో పాటు మిగతా మెగా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. 'ఫాంహౌస్లో మా దీపావళి పార్టీ. డెకరేషన్ అంతా స్వయంగా స్నేహ దగ్గరుండి చేయించింది..దీపావళి వైబ్స్' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అల్లుఅర్జున్, స్నేహరెడ్డి స్టన్నింగ్ అవుట్ఫిట్లో సందడి చేశారు. ముఖ్యంగా స్నేహ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్కు ఏమాత్రం తగ్గని సౌందర్యం అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ఎయిర్పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి చదవండి: ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా! View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఎనర్జీ కావాలంటున్న అనుపమ.. కొటేషన్ చెప్పిన అనసూయ
► ఎనర్జీ కావాలంటున్న అనుపమ ► యాంకర్ అనసూయ స్టన్నింగ్ లుక్స్ ► జిమ్లో ఫన్నీ వీడియో షేర్ చేసిన జెనీలియా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
తీగల వంతెనపై బన్నీ ఫ్యామిలీ.. వైరల్ వీడియో
Allu Arjun Long Drive : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ వెదర్ను ఎంజాయ్ చేస్తూ బన్నీ, పిల్లలతో కలిసి లాంగ్డ్రైవ్కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను స్నేహా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో బన్నీ స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. దుర్గం చెరువు వద్ద ఉన్న ఆకర్షనీయమైన లైట్స్ను అయాన్, అర్హ ఎంజాయ్ చేస్తుండటం వీడియోలో చూడొచ్చు. కాగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్.. సరదాగా ఫ్యామిలీతో హైదరాబాద్ రోడ్లపై షికారు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఆరుబయట మంచం మీద పిల్లలతో సేద తీరుతూ బన్నీ!
అల్లు అర్జున్ ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ అకేషన్ వచ్చినా షూటింగ్కు బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగులకు కూడా బ్రేక్ పడినట్లయ్యింది. ఈ సమయాన్ని అల్లు అర్జున్ పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. బుధవారం పిల్లలు అయాన్, అర్హలతో అల్లు అర్జున్ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను స్నేహ రెడ్డి తన ఫోన్లో బంధించింది. ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది. ఇదిలా వుంటే ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్వకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి : బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న అల్లు అర్జున్ బన్నీకి నెగెటివ్.. పిల్లలతో కలిసి ఎమోషనల్ వీడియో -
భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్గా చెప్పుకొవచ్చు. సినిమాలకు విరామం వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో గడపడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇక ఇంట్లో కూతురు ఆర్హ, కొడుకు ఆయాన్తో బన్ని చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వీరి ఫన్నీ ఫొటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియా దర్శనమిస్తూనే ఉంటాయి. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను ఆయన భార్య స్నేహా రెడ్డి షేర్ చేస్తుంటారు. తాజాగా బన్నీ.. భార్య స్నేహరెడ్డి, కూతురు ఆర్హలకు సంబంధించి ఓ ఫొటోకు షేర్ చేశాడు. ఈ ఫొటోకు అతడు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. భార్య స్నేహా, ఆర్హలు వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్న ఈ ఫొటోను ‘క్యూటీస్’ అంటూ బన్నీ షేర్ చేశాడు. ఇది చూసి ‘క్యూట్ మమ్మీతో క్యూట్ డాటర్’ అంటూ నెటిజన్లు తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లోని మారేడు మిల్లీ అడవుల్లో జరుపుకుంది. ఇక ఇటీవల రెండ షెడ్యూల్ను కేరళ అడవుల్లో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) చదవండి: మీ అందరికి రుణపడి ఉంటా.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు షూటింగ్లో ప్రమాదం: నటుడికి గాయాలు -
పేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన అల్లు అర్హ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాలుగేళ్లవయసులోనే తన మాటలు, చేష్టలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా అర్హకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడగ్గా మొదట జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని చెప్పిన అర్హ.. దాని స్పెల్లింగ్ చెప్పమంటే మాత్రం లేదు లేదు..నా ఫేవరెట్ హీరోయిన్ ఆలియా భట్ అంటూ మాట మార్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్గా మారింది. ముఖ్యంగా అర్హ ఎక్సెఫ్రెషన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలోనూ బెండకాయ్, దొండకాయ్ నువ్వే నా గుండె కాయ్, రాములో రాముల పాటకు దోస స్టెప్ అంటూ అల్లు అర్జన్- అర్హ మధ్య సాగిన సంభాషణలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ఫ. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్లో కనిపించనున్నారు బన్నీ. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి : కూతురు బర్త్డేకు సర్ఫ్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్ ‘బాలీవుడ్’ అవార్డ్స్లో అల్లు అర్జున్ మూవీ రికార్డులు -
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో ఆది దంపతులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ... కరోనా తరువాత శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తను నటించిన శశి చిత్రం ఈ నెల 19న రిలీజ్ అవబోతుందని, ట్రీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించినట్లే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశీస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ .. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని శ్రీవారిని మొక్కుకున్నాని అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ సిటింగ్ ఎమ్మెల్సీ అనుభవపరుడని పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ అభ్యర్థిని వాణీదేవి దివంగత మాజీ ప్రధాని పివీ నరసింహ రావు కూతురని గుర్తు చేశారు. వీరు ఇరువురు అత్యంత మెజారిటీతో గెలుపొందాలి అని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. -
అప్పుడే పదేళ్లు.. తాజ్మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్
ఆగ్రా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు నేడు(శనివారం) 10వ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ రోజుతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు.టాలీవుడ్ స్టార్ హీరోగా అల్లుఅర్జున్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏం మాత్రం టైం దొరికినా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు. శనివారం (నేడు) పదవ వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్ భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్మహల్ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ కపుల్ అల్లుఅర్జున్- స్నేహ రెడ్డి దంపతులకు అటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి : శర్వానంద్కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా Happy 10th Anniversary to us Cutie . What a wonderful journey of ten years ... and many more to come ❤️ pic.twitter.com/d4g6X5at6A — Allu Arjun (@alluarjun) March 6, 2021 -
చిన్న బ్రేక్ తీసుకున్న అల్లుఅర్జున్
రెండు మూడు నెలలుగా ‘పుష్ప’ చిత్రీకరణలో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు అల్లు అర్జున్. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ పూర్తి చేయడానికే ఈ బిజీ. మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఈలోపు అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఫ్యామిలీతో కలసి ఓ హాలిడే ప్లాన్ చేసుకున్నారు. వారం పాటు భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయనున్నారాయన. ఈ హాలిడే పూర్తయ్యాక మళ్లీ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీ అవుతారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. -
17 ఏళ్లు... 20 సినిమాలు
ఇటీవలే ‘అల..వైకుంఠపురములో...’తో సూపర్సక్సెస్ అందుకున్నారు అల్లు అర్జున్ (బన్ని). ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా కోసం చిత్తూరు యాసపై పట్టు సాధించే పనిలో బిజీగా ఉన్నారు బన్ని. ఇది తన కెరీర్లో 20వ చిత్రం. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే బన్నీ సినీ కెరీర్లో 17 సంవత్సరాలు ముగిశాయి. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘పరుగు’, జులాయి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీలో తనదైన ప్రతిభను చాటుకున్నారు. ‘‘పదిహేడేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, నా అభిమానులకు రుణపడి ఉంటాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ గార్లతో పాటు ‘గంగోత్రి’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అల్లుఅర్జున్. అలాగే ఈ 17ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు స్నేహా రెడ్డి (అల్లు అర్జున్ భార్య). -
నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది: బన్నీ
టాలీవుడ్ స్టార్ కపూల్ అల్లు అర్జున్- స్నేహా రెడ్డి 2011లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ రోజుతో(శుక్రవారం) వీరి వివాహ బంధానికి తొమ్మిది సంవత్సరాలు. దీంతో అటు ప్రముఖుల నుంచి ఇటు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు బన్నీ. తన పెళ్లినాటి ఫోటోను షేర్ చేస్తూ.. ‘పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. కానీ రోజు రోజూకి నీపై ప్రేమ పెరుగుతూనే ఉంది’. అని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అలాగే అల్లు శిరీష్ కూడా అన్నయ్య పెళ్లి రోజున శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యపీ యానివర్సరీ లవ్ బర్డ్స్.. లవ్ యూ బోత్’ అంట్ ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) on Mar 5, 2020 at 6:13pm PST Happy anniversary you lovebirds! Love you both. 😘🤗 @alluarjun pic.twitter.com/SotnPv0j3T — Allu Sirish (@AlluSirish) March 6, 2020 -
హ్యాపీ బర్త్డే మై చబ్బీ డాల్ : అల్లు అర్జున్
స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మూవీ అప్డేట్స్తో పాటు తన కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం బన్నీకి అలవాటు. ఈ క్రమంలో తన గారాల పట్టి అర్హా పుట్టినరోజు సందర్భంగా బన్నీ ట్విటర్లో చేసిన పోస్ట్ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తెగ ఆకర్షిస్తోంది. తన కూతురి రెండో పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేస్తున్న ఈ మెగా హీరో... ‘ హ్మాపీ బర్త్డే మై చబ్బీ డాల్ అర్హా.. ఈరోజు తను రెండో వసంతంలోకి అడుగుపెడుతోంది’ అంటూ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అర్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘లిటిల్ ప్రిన్సెస్కు శుభాకాంక్షలు.. అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్ చెబితే మీతో పాటు మేం కూడా కేక్ కట్ చేస్తాం’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా టాలీవుడ్ స్టైలిష్ కపుల్ అల్లు అర్జున్- స్నేహారెడ్డిలకు ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2014లో అయాన్కు, 2016లో అర్హాకు జన్మనిచ్చారు. Happy Birthday to my chubby doll Arha ... Turning Two Today ... Muuaaahhhh ! pic.twitter.com/JUDvbg8ITg — Allu Arjun (@alluarjun) November 21, 2018 -
అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ
-
అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ
సాక్షి, నల్గొండ: షూటింగ్లతో బిజీగా ఉండే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్కి బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ విరామ సమయంలోనే వచ్చిన దసరా పండుగను స్పెషల్గా అత్తగారింటిలో జరుపుకుంటున్నాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం చింతపల్లి గ్రామమానికి అల్లు అర్జున్ దంపతులు విచ్చేసి సందడి చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బన్నీ రాకతో చింతపల్లి గ్రామ ప్రజలు దసరా పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇక తనను కలిసి విషెస్ చెప్పిన వారందరికీ కృతజ్ఞతల తెలిపారు. కాసేపు చిన్నారులతో కలిసి బన్నీ సందడి చేశారు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది. (బన్నీతో హ్యాట్రిక్ సినిమా..!) ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో షాక్ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. (గణపతి బప్పా మోరియా) -
భార్య అందంపై బన్నీ పోస్ట్.. వైరల్
హైదరాబాద్ : టాలీవుడ్లో స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్. అంతేకాదండోయ్.. టాలీవుడ్లో స్టైలిష్ జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరి వ్యక్తిగత జీవితానికి, సినిమాలకు సంబంధించిన విషయాలను నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బన్నీ తన భార్య గురించి చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘ఓఎంజీ (ఓ మై గాడ్)! నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా’అంటూ భార్య స్నేహారెడ్డి అందంపై బన్నీ సరదాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. గోదుమ రంగులో ఉన్న సల్వార్ కమీజ్ను ధరించిన తన భార్యను ప్రముఖ స్టైలిస్ట్ హర్మన్ కౌర్ చాలా అందంగా ముస్తాబు చేశారని అల్లు అర్జున్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. బన్నీ పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, స్నేహారెడ్డి చాలా అందంగా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తుండగా.. సార్ మీ తర్వాతి మూవీ అప్డేట్స్ చెప్పండంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లలో అడుగుతున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఫొటోలు షేర్ చేసే బన్నీ తాజాగా.. భార్య అందాన్ని పొగుడుతూ పోస్ట్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార్, ఏ దర్శకుడితో పనిచేస్తున్నారన్న విషయాలపై నటుడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
‘సంధ్య’లో సూర్య
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సంధ్య థియేటర్లో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాను భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్తో కలిసిప్రేక్షకుల మధ్య వీక్షించారు. అర్జున్తో కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ముషీరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో హీరోఅల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీని భార్య స్నేహారెడ్డి, చిత్రయూనిట్సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీక్షించారు.స్టైలిష్ స్టార్ను చూసేందుకు అభిమానులు తరలొచ్చారు. -
ప్రియా ప్రకాష్ స్పూఫ్ చేసిన బన్నీ
-
ప్రియా ప్రకాష్లా బన్నీ..!
సినిమాలు, షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉంటాడు యంగ్ హీరో అల్లు అర్జున్. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఉండేందుకే ఇష్టపడే బన్నీ తన చిన్నారులతో కలిసి అల్లరి చేస్తుంటాడు. బన్నీ పిల్లలతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తుంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహ. తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ఒరు ఆదార్ లవ్ లోని ఓ సన్నివేశం నాకు బాగా నచ్చిందంటూ బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి స్పూఫ్ చేశాడు స్టైలిష్ స్టార్. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ చేసినట్టుగానే చేతితో తన కొడుకును షూట్ చేయటం, బన్నీ కొడుకు అయాన్ అమాంతం బెడ్ మీద పడిపోవటాన్ని వీడియో తీసిన స్నేహ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. -
అల్లువారింట లక్ష్మీ కళ
హైదరాబాద్: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందంలో మునిగితేలుతున్నారు. సోమవారం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బన్నీ తన అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు తొలిసంతానంలో మగబిడ్డ అయాన్ జన్మించాడు. రెండో సంతానంలో అమ్మాయి జన్మించడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ పేర్కొన్నారు. Blessed with a Baby Girl ! Soooo Happppyyyyyy right now ! One boy & one girl. Could'nt ask for more. Thank you for all the wishes. Lucky me — Allu Arjun (@alluarjun) 21 November 2016 -
సుల్తాన్గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి
సరైనోడు సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తున్న అల్లు అర్జున్, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా అంగీకరించని బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే కశ్మీర్ ట్రిప్ ముగించుకొని టర్కీ చేరిన బన్నీ దంపతులు అక్కడి పర్యాటక ప్రదేశాల్లో సందడి చేస్తున్నారు. ఈ ట్రిప్లో భాగంగా ప్రసిద్ధ బ్లూ మాస్క్యూను సందర్శించిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అక్కడి రాజ కుటుంబీకుల దుస్తులు ధరించి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్నేహ సుల్తాన్, సుల్తానా అంటూ కామెంట్ చేసింది. ఆసక్తికరంగా కనిపిస్తున్న బన్నీ లుక్ ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిక్గా మారింది. -
లెజెండరీ క్రికెటర్తో అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ను కలుసుకున్నారు. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహరెడ్డి కపిల్దేవ్తో కలిసి దిగిన ఫొటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ. 'గ్రేట్ ఇండియన్ కెప్టెన్ కపిల్దేవ్ను కలిశాం. ఆయన నా సినిమాలు చూస్తానని చెప్పటం నాకు ఆశ్యర్చాన్ని కలిగించింది. రేసుగుర్రం సినిమాలో నా పెర్ఫార్మెన్సును ఆయన అభినందించారు' అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
పేస్ బుక్లో 'చోటా జులాయి' హల్చల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్లో హల్చల్ చేస్తున్నాడు. అయాన్ జన్మించి ఆరునెలల అయింది. ఈ నేపథ్యంలో అయాన్ తాజా ఫొటోలను అల్లు అర్జున్ తన వ్యక్తిగత ఫేసు బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో ఫేసు బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే దాదాపు లక్షల లైకులు వచ్చాయి. ఆ లైకులు ఇంకా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. అయాన్ పుట్టిన తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబంతో మరింత ఎక్కువ కాలం గడుపుతున్నారు. -
అల్లు అర్జున్కు కొడుకు పుట్టాడు
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. ''అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు కొడుకు పుట్టాడు. తల్లీ కొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు'' అని అర్జున్ మేనేజర్ తెలిపారు. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్.. 2011 మార్చిలో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం చిత్రం ఈనెల 11వ తేదీ శుక్రవారం విడుదల కానుంది. (చదవండి: పెదవి దాటని తీపి కబురు) తన భార్య గర్భవతి అన్న విషయాన్ని అల్లు అర్జున్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా పదిమందితో పంచుకున్నారు. ‘ఎక్స్పెక్టింగ్ ఎనీ టైమ్’ అంటూ తన ఫేస్బుక్లో ఈ ఫొటో పెట్టారు బన్నీ. ఆ ఫొటోలో.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే ఆనందం బన్నీ, స్నేహల్లో స్పష్టంగా కనిపించింది. ఈనెల 8వ తేదీన అర్జున్ పుట్టినరోజు. -
పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు తన భార్య స్నేహ రెడ్డితో కలిసివున్న ఫోటో కూడా పోస్ట్ చేశారు. దంపతులిద్దరూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ తమ కలల పంట కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఫోటోలో కనిపించారు. 'తన ప్రేమకు ప్రతిరూపం ఊపిరి పోసుకుని కళ్లకు ముందుకు వస్తే ఏ మగాడైన తన భార్య, బిడ్డతో మళ్లీ ప్రేమలో పడతాడు. క్యూటీ త్వరలో మా మధ్యకు వస్తుంది' అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే బన్నీ భార్య ఆడపిల్లకు జన్మినిచ్చినట్టు అంతకుముందు రుమార్లు వచ్చాయి. వీటిని అప్పుడే అల్లు అరవింద్ తోసిపుచ్చారు. ఇప్పుడు ఫోటోతో అల్లు అర్జున్ పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టారు. స్నేహకు త్వరలోనే(ఈ నెలలోనే) డెలివరీ కానుందని సమాచారం. అంటే త్వరలోనే జూనియర్ బన్నీ రాబోతున్నాడన్నమాట. -
అల్లు అర్జున్ కు కూతురు పుట్టింది!
సంకాంత్రి పండుగ, ఎవడు ఘన విజయం సాధించడంతోపాటు, మరో సంఘటన అల్లు, మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఓ పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలిసింది. రెండేళ్ల క్రితం అర్జున్, స్నేహారెడ్డిలకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంలోకి కొత్తగా మరో సభ్యురాలు చేరడాన్ని అల్లు, చిరు కుటుంబాలు ఆహ్వానించాయి. బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు.