Swapna
-
యూట్యూబ్లో ఫ్రీగా ‘మిస్టరీ’
ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది. అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రీగా ‘మిస్టరీ’తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘మిస్టరీ’ కథేంటి?ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. -
వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం: నిర్మాత సుప్రియ
‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్గారి బేనర్లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జునగారు డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో వీణా రావు ఫస్ట్ దర్శన్ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రెజర్ నుంచి ప్లెజర్కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
అమ్మలకు అమ్మలు
‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్వైఫ్. ‘మిడ్వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్ నాజ్ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్వైఫరీ నర్స్లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్ నాజ్ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ప్రోగ్రామ్లో వీరు పాల్గొంటున్నారు.తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ను ఎంచుకుంది. యూనిసెఫ్ సహకారంతో హైదరాబాద్లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్ మిడ్వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.భద్రాచలం ఏజెన్సీలో...డిప్లొమా ఇన్ మిడ్వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్ పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెంముఖ కవళికలతోనే...భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో కనుక్కుని బెడ్ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్ వస్తున్నాయి. హై రిస్క్ కేసు. బయటకు రిఫర్ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్ సాయంతో నార్మల్ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.– సూర్ణపు స్వప్నమరచిపోలేని జ్ఞాపకాలుహైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాస్లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్ తొలి రెండు కాన్పులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.– నౌషీన్ నాజ్‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్ నాజ్లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్లోని లీడర్షిప్ప్రోగ్రామ్ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్ వారీజ్ బేగ్ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్ నాజ్ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్ ఎంట్రెన్స్ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్లోని ‘మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో జీఎన్ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్లో నిర్వహించిన ఆబ్స్టెక్టిక్స్ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్) వర్క్షాప్లో యూకే నుంచి వచ్చిన మిడ్ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ‘నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్. మిడ్వైఫరీ కోర్సులో బెస్ట్ స్టూడెంట్గా ఎంపికైంది. హైదరాబాద్లోని నీలోఫర్, కింగ్ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. వాటర్ బర్త్, బ్రీచ్ బర్త్ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్బర్త్ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
నైపుణ్యమే సంపద
‘జీవితంలోని ప్రతి దశలోనూ గైడ్ చేస్తూ నా ఎదుగుదలకు దోహదపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ నాకు గురువులే..’ అంటూ పరిచయం చేసుకున్నారు వనమల స్వప్న. హైదరాబాద్ లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ లో అసోసియేట్ ఫ్యాకల్టీగా ఉన్న వనమల స్వప్నకు ఇటీవల నేషనల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు వచ్చింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’తో తన విజయానందాన్ని పంచుకున్నారు. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం శిక్షణా తరగతులను నిర్వహించడంలో 18 ఏళ్ల అనుభవం ఉంది. 12 ఏళ్లుగా మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఇ’లో వర్క్ చేస్తున్నాను. స్పెషలైజేషన్ ఇంక్చువ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఛార్జిగానూ వర్క్ చేస్తున్నాను.వారధిగా.. సాయంబిజినెస్ చేయాలని, రాణించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన నైపుణ్యాలు ఉండవు. అలాగే, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా తెలియవు. స్కిల్స్తో పాటు వ్యాపార అవకాశాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి.. అనే విషయాల్లో సాయం చేస్తాం. మా అకాడమీ నుంచి వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నాలుగు స్కీమ్స్తో నిరుద్యోగ యువత, మహిళలకు ఎంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నాలుగేళ్ల నుంచి మల్టీమీడియా, ఫ్యాషన్, బ్యూటీ.. వంటి రంగాలలో దాదాపు 4000 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్లోని వాళ్లకూ స్కిల్ ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. మంచి రేటింగ్ త్రీ స్టార్స్ రేటింగ్ రావడంతో ఎమ్ఎస్ఎన్మి ఇన్నోవేటివ్ స్కీమ్ కింద సివిల్ సర్వెంట్స్కు శిక్షణ ఇవ్వడానికి మా ఇన్స్టిట్యూట్కు అప్రూవల్ వచ్చింది. వివిధ రంగాలలో నిపుణులైన వారు కూడా శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. తాము సృష్టించిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. ఇటీవల శిక్షణ తీసుకుంటున్న వారిలో మహిళల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో 55 స్కిల్ప్రోగ్రామ్స్ మహిళలకే పరిచయం చేస్తున్నాం. జిల్లా, గ్రామీణ స్థాయి మహిళలకు కూడా 60 స్కిల్స్ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ప్రతి రోజూ సవాళ్లే దేశవ్యాప్తంగాప్రోగ్రామ్స్, శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడానికి ఆయా ్రపాంతాలకు వెళ్లినప్పుడు కాలేజీలు, యూనివర్శిటీల సాయం తీసుకుంటాం. అక్కడ చాలా వరకు శిక్షణకు కావల్సిన సరంజామా ఉండదు. దీంతో ప్రతీదీ సవాల్గానే ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో ఏ లోపం లేకుండా ముందస్తుగానే ΄్లాన్ చేసుకుంటాం. ఇటీవల సైబర్సెక్యూరిటీకి సంబంధించి కాకినాడ ప్రభుత్వ కాలేజీలో, డిజిటల్ మార్కెట్కు సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వారితో కలిసి వర్క్ చేశాం. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇండోర్ ఫ్యాషన్ ఇన్సిట్యూట్తో కలిసి వర్క్ చేశాం. 2023–24 సంవత్సరానికి గాను 200కు పైగా ప్రోగ్రామ్స్ చేశాం. ట్రైనింగ్ క్లాసులకు ప్రిపేర్ అవడం,ప్రోగ్రామ్స్ని నిర్వహించడం, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయడం ఓ పెద్ద ప్రణాళిక. కుటుంబ మద్దతునేను పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశాను. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఇద్దరు పిల్లలు. మహిళగా నా వర్క్లో రాణించాలంటే కుటుంబం స΄ోర్ట్ ఉండాలి. మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్లోనే నేనూ ఇల్లు తీసుకోవడంతో పిల్లలకు సంబంధించి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్లోని అడిక్మెట్ నుంచి రోజూ నా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో నన్ను గైడ్ చేయడానికి వచ్చారు. వారంతా నాకు గురువులే’ అంటూ తెలిపారు స్వప్న. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన న్యాయమూర్తి
సింగరేణి (కొత్తగూడెం): నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభ ుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్తో వివాహం జరిగింది.ప్రస్తుతం నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న.. ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె.. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు. తనకు వైద్యసేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
సీఎం జగన్,షర్మిల పై సజ్జల కామెంట్స్ జర్నలిస్ట్ స్వప్న విశ్లేషణ
-
ఉన్నది పాయె.. ఉంచుకున్నది పాయె బాబు వెన్నుపోటుకు బలి
-
విశాఖ డ్రగ్స్ కంటైనర్ పై జర్నలిస్ట్ స్వప్న సంచలన విషయాలు
-
జయప్రకాశ్ నారాయణ్ కు జర్నలిస్ట్ స్వప్న దిమ్మదిరిగే కౌంటర్
-
13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు!
వరంగల్: 108.. ఈ నంబర్ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొదటి నుండి ఇలా.. దివంగత నేత వైఎస్సార్ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్లో చికిత్స పొందింది. అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది. ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్ హెల్త్ సర్వీస్’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు. సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు! -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం ఈ జన్మకు ఇది చాలు
-
మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే సీఎం జగన్ లక్ష్యం
-
నన్ను మోసం చేశారు
-
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని గెలిపిస్తారా అని చైర్పర్సన్ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్పర్సన్ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చంపాపేట్లో వివాహిత స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దర్యాప్తులో భాగంగా స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెర మీదకు ప్రియుడు సతీష్ పేరు రావడంలో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా, స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్తో కాంటాక్ట్లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విషయం ప్రేమ్కు తెలియడంతో సతీష్తో ఇటీవల గొడవలు జరిగాయి. అయితే, నిన్న(శనివారం) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్లోని స్వప్న ఇంటికి సతీష్ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సతీష్.. స్వప్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, స్వప్న భర్త ప్రేమ్ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ఈ క్రమంలో ప్రేమ్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియరాలేదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఆయనకిద్దరితో పెళ్లి.. ఆరు ముళ్లు.. పద్నాలుగు అడుగులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘‘మూడే ముళ్లు... ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు...’’ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలను ఈయన సరిగ్గా డబుల్ చేశాడు. ఒకే రోజు ఇద్దరికీ.. ఒక్కొక్కరికి మూడు ముళ్లు.. వెరసి ఆరు ముళ్లు వేసి పద్నాలుగు అడుగులు నడిచాడు. ఇక కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. చందంగా పెళ్లి సమయానికే ఇద్దరు వధువులూ ఒకరు మగ బిడ్డతో.. ఒకరు ఆడ బిడ్డతో పెళ్లి పీటలపై కూర్చొని సదరు పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకున్నారు. ఈ చిత్రమైన పెళ్లి’ళ్లు’భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగాయి. పూర్వాపరాలిలా.. గ్రామానికి చెందిన సత్తిబాబు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడంతో స్వప్నకుమారి గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు సత్తిబాబు ఓకే అన్నాడు. కానీ స్వప్నకి తెలియకుండా సత్తిబాబు కుర్నపల్లికి చెందిన సునీతతోనూ మరో ప్రేమ కథ నడిపాడు. ఈమెనూ గర్భవతిని చేశాడు. ఇరువురు యువతుల తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలూ రంగంలోకి దిగారు. తాను ఇద్దరినీ ప్రేమించానని, ఇరువురినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పగా, యువతులూ అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో ఒకే చోట కాపురం పెట్టాడు. గతేడాది జూలైలో స్వప్నకుమారి పాపకు జన్మనివ్వగా, సెప్టెంబర్లో సునీతకు బాబు పుట్టాడు. కాగా తన పెళ్లి ఘనంగా జరగలేదని భావించిన సత్తిబాబు..ఈనెల 9న గురువారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి పత్రిక అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ పంచాడు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికార్డు వైరల్గా మారింది. సత్తిబాబు పెళ్లి ముచ్చట ఆరు ముళ్లు, పద్నాలుగు అడుగులతో ముగిసింది. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
హిజ్రా ప్రాణం తీసిన ప్రేమ: స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..
సాక్షి, మీర్పేట్: ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి వదిలివెళ్లాడని మనస్తాపానికి గురై ఓ హిజ్రా ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన మొదపూరపు గుణ అలియాస్ స్వప్న (హిజ్రా) (24) కొంత కాలంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం జేఎన్ఎన్యూఆర్ఎంలోని ఓ ఫ్లాట్లో స్నేహితులతో కలిసి ఉంటోంది. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకి చెందిన బైక్ మెకానిక్ గోశెట్టి నిషాంత్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంట్లో పూజ ఉంది రమ్మని వారం క్రితం తండ్రి నుంచి ఫోన్ రావడంతో నిషాంత్ ఊరికి వెళ్లొస్తానని చెప్పివెళ్లాడు. హిజ్రాను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులకు తెలిసి కొడుకును తిరిగి హైదరాబాద్ రానివ్వలేదు. నిషాంత్ విషయాన్ని స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఆమె వాళ్ల ఊరికి వెళ్లి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్, వారి తల్లిదండ్రులను పిలిపించగా స్వప్న తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి నందనవనంలోని రూమ్కి వచ్చింది. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. చదవండి: (పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం) -
గోల్డు స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్ ఇవ్వొద్దు
కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 జూన్ వరకు స్వప్నా సురేష్తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్ఏఐ స్పష్టం చేసింది. స్వప్నాసురేష్తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది. నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
ఓటీటీలోకి ఆర్జీవీ.. మే15న తొలి సినిమా స్ట్రీమింగ్
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లోని ఓ థియేటర్లో ఆర్జీవీ సినిమాలు విడుదల అవుతాయి. తొలి సినిమాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘డీ-కంపెనీ’ మే 15న ఇందులో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆర్జీవీకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్ముఖ్తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. -
జాతిరత్నాలు డైరెక్టర్కు కాస్ట్లీ లంబోర్గిని కారు!
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్ అనుదీప్కు స్వప్నా సినిమా బ్యానర్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్లు కాస్ట్లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్లోని ఓ బొమ్మకారును అనుదీప్కు గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్ని చేస్తున్నారు అంటూ అనుదీప్ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్ తన పంచులు, కౌంటర్లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku) చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న
-
తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు
సాక్షి, చెన్నై: కేరళ బంగారం స్మగ్లింగ్ విచారణ తిరుచ్చికి చేరింది. ఎన్ఐఏ అధికారులు మంగళవారం తిరుచ్చిలో తిష్ట వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం యూఏఈ కాన్సులేట్కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అక్కడి అధికారి స్వప్న సురేష్తో పాటు మరెందరో అరెస్టయ్యారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులను ఎన్ఐఏ వర్గాలు విచారణ చేశాయి. ఈ కేసు ప్రస్తుతం తమిళనాడు వైపుగా మరలడం చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎన్ఐఏ వర్గాల దృష్టి తిరుచ్చిపై పడింది. ఈ స్మగ్లింగ్ రాకెట్లో ఏజెంట్లుగా వ్యవహరించిన వారందరూ తిరుచ్చికి చెందిన వారుగా ఎన్ఐఏ గుర్తించింది. దీంతో ఇక్కడి పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్ఐఏ వర్గాలు ఉదయాన్నే దూకుడు పెంచాయి. తిరుచ్చిలోని అండగుండం, జాఫర్ ఖాన్ వీధుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అక్బర్ అలీ అనే వ్యక్తిని ప్రత్యేక ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. వీరంతా ముంబై, కోల్కతాలకు బంగారం స్మగ్లింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు తిరుచ్చిలోని ఓ ప్రముఖ నగల వ్యాపారికి సైతం సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిని ఆగమేఘాలపై తిరువనంతపురానికి తరలించారు. ఇక ఇటీవల కాలంగా తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ బంగారంతో ఈ కేసుకు సంబంధాలు ఉండవచ్చన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ వేగం పెరిగింది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎం రాజీనామా చేయాలి
తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం కోజికోడ్లో యూత్ లీగ్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘర్షణలో చాలా మంది నిరసనకారులకు గాయలయ్యాయి. కొచ్చిలో కూడా యువకుల నిరసన హింసాత్మకంగా మారింది. కన్నూర్లో పోలీసులు ఆందోళనకారులను నియంత్రించడానికి టియర్గ్యాస్ షెల్స్ను ఉపయోగించారు. కన్నూర్లోని సీఎం విజయన్ పూర్వీకుల ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. (గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్) కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు చెందిన పార్మిల్లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాన్సులేట్కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్న సురేశ్తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో గురువారం కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ ల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని తెలిపింది. త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది. (కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు) -
గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్?
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్ను తొలగించారు. మరోవైపు ఈ కేసులో స్వప్న సురేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేరళ సీఎం కార్యాలయం వ్యవహారాలు తెలిసినవారికి స్వప్న సురేశ్ పేరు సుపరిచతమే. రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. విజయన్తో కలిసి స్వప్న దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. దీంతో స్వప్న ఎవరనేది ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన స్వప్న.. రెండేళ్లపాటు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఇండియా సాట్స్లో ఉద్యోగం పొందారు. అయితే అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించడంతో స్వప్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణకు కూడా స్వప్న సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆమెను విడుదల చేయాలని పైనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిలు వచ్చినట్టు చెబుతారు. (చదవండి : కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు) ఎయిర్ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత.. యూఏఈ కాన్సులేట్లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. అరబిక్తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన పరిచయాలతో స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడైన శివశంకర్కు స్వప్నతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం స్వప్న మాత్రం పరారీలో ఉన్నారు. ఆమెను విచారిస్తే తప్ప ఈ గోల్డ్ స్మగ్లింగ్కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ప్రిన్సిపల్ కార్యదర్శిపై వేటు) అసలేం జరిగింది.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుపడింది. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్కు సంబంధించి స్వప్న పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. ఇక, ఫ్యామిలీ విషయానికి వస్తే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వప్నకు ఒక కుతూరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను : చరణ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో రామ్చరణ్ కూడా ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. నేను నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు. కానీ నేను ఉత్తమమైన గిఫ్ట్ ఇస్తానని మాట ఇస్తున్నాను. మరెన్నో సెలబ్రేషన్ వేచిచూస్తున్నాయి.. ’ అని పేర్కొన్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి రామ్చరణ్ బర్త్డే రోజున స్పెషల్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ బర్త్డే ఎలాంటి స్పెషల్ వీడియో విడుదల చేయడం సాధ్యపడటం లేదని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : తారక్కు బిగ్బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..) అంతులేని నవ్వులు.. ప్రముఖ అశ్వినీదత్ కుమార్తె స్వప్న కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేశారు. ‘క్రేజీ సంభాషణలు, విలువైన సమాచారం, అంతులేని నవ్వులు, రాజా సార్ నైట్స్.. ఇంకా ఎన్నో.. హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్, స్వప్న మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇంతకంటే మంచి భీమ్ నాకు దొరకడు.. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ‘నువ్వు నా జర్నీలో తొలి నుంచి ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. నీకంటే మంచి భీమ్ నాకు దొరకడు’ అని పేర్కొన్నారు. (చదవండి : ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..) View this post on Instagram crazy conversations Immense information Endless laughs raja sir nights and many more.. Happy bday friend:) @jrntr A post shared by Swapnadutt Chalasani (@swapnaduttchalasani) on May 19, 2020 at 10:32pm PDT -
నాన్నను చూసి ఎంచుకున్నాం
►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? స్వప్నా దత్: సినిమా నిర్మాణం ఎందుకు ఎంచుకున్నాం అంటే మా నాన్నగారిని (అశ్వనీదత్) చూశాం. ఆయన ప్యాషన్తో సినిమాలు నిర్మించడం చూశాం. కథను ఎంచుకోవడం, నటీనటులను, దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వంటి విషయాలు చూసి ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా యాక్టింగ్ అయినా, డిజైనింగ్ పైన అయినా ఆసక్తి చూపుతారు. కానీ మా ఇంట్లో అంత మంచి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు నిర్మాణం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. సినిమా నిర్మాణమే అన్నింటికంటే సాహసమైనది అనిపించింది. అదే చేస్తున్నాం (నవ్వుతూ). ►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? ప్రియాంకా దత్: నిర్మాత ఆడవారైనా మగవారైనా సరే అందరూ సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలి. లేడీ నిర్మాతలంటే.. మేం కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి సెట్లో అమ్మాయిలు ఉంటే వాళ్లు సేఫ్గా ఇంటికి వెళ్లగలుగుతున్నారా? వాళ్ల బాత్రూమ్స్ సరిగ్గా ఉంటున్నాయా? అని చూస్తాం. అలాగే ఏదైనా ఇష్యూలు వస్తే వెంటనే మాతో చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. మా మేనేజర్లతో అన్నీ సరిగ్గా చూసుకోమని చెబుతాం. నిర్మాత ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే సెట్లో అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? స్వప్నా: ఇది ఆడా మగా సమస్య అని చెప్పను. కొంచెం మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఉమెన్కి కచ్చితంగా చాలెంజెస్ ఉంటాయి. కష్టం అయితే అందరికీ ఒకటే. రామానాయుడిగారి అంత విజన్ ఉంటే ప్రయత్నించొచ్చు అనుకుంటా. ►నాన్నగారి బాటలో నిర్మాతలు అయి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, దేవదాస్ వంటి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడి ఏమైనా? స్వప్నా: అవును. ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఉంటుంది. అలాంటిది 50 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ (వైజయంతీ మూవీస్)ను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ప్రెషరే. అలాగే ప్లెషర్ కూడా. ►లేడీ ప్రొడ్యూసర్స్ ఎదుర్కొనే చాలెంజ్లు? స్వప్నా: ప్రొడక్షన్ అంటేనే చాలెంజ్. ప్రొడ్యూసర్స్ అంటేనే చాలెంజెస్ ఎదుర్కొనేవారు. అందులో ఆడామగా అని ఉండదనుకుంటున్నాను. జెన్యూన్గా సినిమా తీసేవాళ్లకు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. -
కాన్ఫిడెన్సే కిరీటం
‘మీకు ఒక అద్భుత శక్తి వచ్చి... చరిత్ర నుంచి ఎవరినైనా వెనక్కు తీసుకురావచ్చు అంటే మీరెవరిని తెస్తారు?’.. ఇది మహిళల అందాల పోటీలో ఒక కంటెస్టెంట్గా స్వప్నకు ఎదురైన ప్రశ్న. అందుకు ఈమె ఇచ్చిన సమాధానమే ఆమెను విజేతను చేసింది. ఈవారం మనకు ఆమె ‘పరిచయం’ అయ్యేలా చేసింది. ‘‘ప్రతి మనిషిలోనూ వారికంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఒక వ్యక్తిని గొప్ప అని, మరొకరిని గొప్పకాదు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ ఓ చరిత్ర ఉంటుంది. చారిత్రక వ్యక్తులంటూ కొందరికే గౌరవం ఇవ్వడం సరికాదు. ఏ వ్యక్తి అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఒక ఇల్లు బాగుండాలంటే అందుకు తల్లి ప్రధానం. నేనైతే.. తల్లులు లేని ఇళ్లను వెతికి వాళ్లకు వారి తల్లులను తిరిగి తెచ్చిస్తాను. సమాజానికి దారి చూపే ప్రతి నాయకుడూ ఒక తల్లి తీర్చిదిద్ది్దన బిడ్డే. తల్లి బాగుంటే ప్రతి ఇల్లూ సమాజానికి ఒక లీడర్నిస్తుంది’’.. ఇది అందాల పోటీలో స్వప్న సమాధానం. ఏడేళ్ల కిందట దూరమైన తల్లిని తలుచుకుంటూ ఇచ్చిన సమాధానం. ఈ సమాధానమే ఆమెను ‘డ్యాజిల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2019 ఎలీట్’ పోటీల్లో విజేతగా నిలిపింది. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్ అప్ కిరీటం ధరించిన స్వప్న కోరిప తన విజయ ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. అందానికి భాష్యం రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్లో గత నవంబర్ తొమ్మిదవ తేదీన జరిగిన మిసెస్ బ్యూటీ కాంటెస్ట్లో మిసెస్ బ్యూటీ రన్నర్ అప్ కిరీటాన్ని ధరించారు స్వప్న. అందం అంటే ముఖానికి మెరుగులు దిద్దుకునే మేకప్పులు కాదని, మహిళల దేహాకృతి– కొలతలు కాదని, ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని అందానికి భాష్యం చెప్పారామె. ‘‘అందంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా తోటి వారితో వ్యవహరించే తీరు, ఒక అంశం మీద స్పందించే వైఖరి ఆధారంగా సాగే పోటీలివి. మనిషి లోపల భయం, ధైర్యం, అంతర్మధనం, అపరాధభావం, ఆత్మవిశ్వాసం వంటివన్నీ నడకలో ప్రతిబింబిస్తాయి. ముఖంలో ప్రతిఫలిస్తాయి. అందుకే అడుగు తీసి అడుగు వేయడం నుంచి, ముఖ కవళికల వరకు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇవన్నీ ద్వితీయాంశాలే. అసలైన పోటీ మన ఆలోచన తీరుదే. ఒక ప్రశ్నకు మనం ఏ సమాధానం చెప్పినా అది తప్పు కాదు. ఆ సమాధానంలో మన ఆలోచన తీరు వ్యక్తమవుతుంది. ఏ ప్రశ్నకూ ‘అవును, కాదు’ అనే పొడి సమాధానాలివ్వకూడదు. మన సమాధానంలో ఒక రీజనింగ్ ఉండి తీరాలి. ఆ సమాధానాన్ని విశ్లేషించి మార్కులు వేస్తారు’’ అని వివరించారు స్వప్న. స్నేహపూర్వక పోటీ ‘‘మహిళలోని పరిపూర్ణత్వానికి ఈ పోటీ ఒక గీటురాయిగా ఉంటుందే తప్ప పోటీలో పాల్గొన్న వారి మధ్య పోటీతత్వం కనిపించదు. సాధారణంగా కనిపించే ఈర్ష్య, అసూయలు కూడా లేకుండా చాలా స్నేహపూర్వకంగా ఉంటారని తెలుసుకున్నాను’’ అన్నారు స్వప్న. ఆమె రాజస్థాన్లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను వేసుకున్న గాజు నా చీరకు సరిగ్గా మ్యాచ్ అవలేదు. మా పోటీలు జరిగిన రిసార్ట్ పుష్కర్ నగరానికి దూరంగా విసిరేసినట్లు ఉంది. ఏదైనా ఒక వస్తువు మర్చిపోతే బజారుకెళ్లి తెచ్చుకుందాం అనుకోవడానికి వీల్లేదు. దాంతో నా దగ్గర ఉన్న గాజునే వేసుకున్నాను. అది చూసి అస్సాం నుంచి వచ్చి న‘మరోమి’ తన దగ్గరున్న బ్యాంగిల్ ఇచ్చింది. ఆ గాజు వేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. ఈ పోటీల్లో ఉండే వాళ్లందరూ బిడ్డల తల్లులే కావడంతోనే షేరింగ్, పరిణితి సాధ్యమైందనిపించింది. పోటీలకు వెళ్లేటప్పుడు తెలియలేదు, కానీ పోటీల అనుభవమే నాలో పరిపూర్ణత తెచ్చిందనిపిస్తోంది’’ అన్నారు స్వప్న. ‘మార్గదర్శక్’ విస్తృతం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించే ట్రాఫిక్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ శిక్షణ తరగతుల్లో ‘ఉమెన్ సేఫ్టీ’ విభాగంలో ఆరువారాల పాటు శిక్షణ పొందారు స్వప్న. ఈ శిక్షణ పొందిన వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ‘మార్గదర్శక్’ సర్టిఫికేట్ ఇస్తుంది. గృహహింసకు గురవుతున్న బాధిత మహిళలకు ఆలంబనగా ఉంటూ వారికి చట్టాల గురించి అవగాహన కల్పించడం, వారి అవసరాన్ని బట్టి షీ టీమ్స్, భరోసా సెంటర్ల ద్వారా మార్గనిర్దేశనం చేయడమే మార్గదర్శక్ ప్రధాన విధులు. మిసెస్ బ్యూటీ విజయంతో వచ్చిన గుర్తింపును మార్గదర్శక్ సేవలను విస్తృతం చేయడానికి వినియోగించుకుంటానని చెప్పారు స్వప్న. ‘‘అమ్మ పోయిన తర్వాత ఏర్పడిన వెలితిని అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న అనాథ శరణాలయం భర్తీ చేసింది. మా పాప పుట్టిన రోజు, అమ్మ పోయిన రోజుల్లో ఆ పిల్లల మధ్యనే గడుపుతున్నాను. వారికి బియ్యం, పుస్తకాలు, స్కూలు బ్యాగ్లు ఇవ్వడం వంటి చేతనైన సహాయం చేస్తున్నాను. ఈ చిన్న పనిలో ఎంత సంతోషం పొందుతున్నానో, బాధిత ఆడవాళ్లకు అండగా నిలవడం కూడా సంతోషం కలుగుతోంది’’ అన్నారు. బిర్యానీ ల్యాండ్ ఈ కాంటెస్ట్లో మరో ముఖ్యమైన విషయం తమను తాము ఆవిష్కరించుకోవడం. సౌత్ ఇండియా కిరీటం గెలుచుకుని జాతీయ పోటీలకు హాజరైన స్వప్న ‘‘మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్న నేను ‘ల్యాండ్ ఆఫ్ బిర్యానీ’ నుంచి వచ్చాన’’ని చెప్పగానే 22 మంది పార్టిసిపెంట్స్, ఆహుతులు ‘హైదరాబాద్, బిర్యానీ’ అని అరిచారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం హైదరాబాద్లోనే. కానీ ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో ఉన్నాయి. ‘‘తాత కోరిప అంకయ్య, నానమ్మ రమణమ్మ. మా చిన్నాన్న, పెద్దనాన్నలు ఆ ఊరిలో ఉన్నారు. నాన్నకు బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం కారణంగా హైదరాబాద్లో స్థిరపడ్డాం. మా తాత జ్ఞాపకంగా మా ఊరిలో ఏదైనా చేయాలనుంది. చేసి తీరుతాను’’ అని స్వప్న ఆత్మవిశ్వాసంతో చెప్పారు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: దేవేంద్రనాథ్ ఇసుకపట్ల కూతురే కాంటెస్ట్కి పంపింది! ఇంటర్ చదివే కూతుర్ని బ్యూటీ కాంటెస్ట్కి సిద్ధం చేయకుండా, 38 ఏళ్ల వయసులో తాను పాల్గొనడానికి వెనుక ఉన్న కారణాన్ని వివరించారు స్వప్న. ‘‘2008లో ఒక షోరూమ్ వాళ్లు చీరలకు మోడలింగ్ చేస్తారా... అని అడిగారు. చేయాలని చాలా ఉత్సాహంగా ఉండింది. కానీ మా పేరెంట్స్ వద్దన్నారు. అప్పటికి నేను పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికి బయటపడి, అమ్మానాన్నల దగ్గర ఉన్నాను. నా భర్త వేధింపుల నుంచి నన్ను కాపాడుకోవడం కోసం మా అమ్మానాన్నలు కంటి మీద కునుకులేకుండా ఉన్న రోజులవి. వాళ్లు వద్దనడానికి అదీ ఒక కారణమే. ఈ మధ్య ఓ రోజు మా అమ్మాయితో ఆ మాట చెప్పాను. అప్పటి నుంచి తను ఎలాగైనా నన్ను మోడలింగ్లోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే ఈ కాలంలో మోడలింగ్ రంగంలోకి రావాలంటే అంతకంటే ముందు ఏదో ఒక గుర్తింపు ఉండాలని తెలిసి నన్ను బ్యూటీ కాంటెస్ట్కి పంపించింది. మా అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి తను నా కన్నీళ్లను, కష్టాలను మాత్రమే చూసింది. రెండు–మూడేళ్ల నుంచి అప్పులు తీరి జీవితం గాడిన పడింది. నా ముఖంలో ఇంకా ఇంకా సంతోషం చూడాలని పట్టుపట్టి తను ఈ పని చేసింది. -
బిజీ అవుతోన్న ‘ఏజెంట్’
చాలా కాలం తరువాత తెలుగు తెర మీద వచ్చిన డిటెక్టివ్ తరహా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పొలిశెట్టి ఆ సక్సెస్ ట్రాక్ను ఏ మేరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి. -
నాలుగిళ్లలో పాచిపనులు చేశా..
నలుగురు పిల్లలయిన తర్వాత కుటుంబ భారాన్ని తండ్రి అర్ధాంతరంగా వదిలి వెళ్లాడు. ఏ ఆధారమూ లేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు.. పరువు.. ప్రతిష్టలే ఆస్తులుగా భావించే తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక చిరుప్రాయంలోనే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు.. ఇల్లు గడవడానికి నాలుగిళ్లలో పాచి పనులకు సిద్ధమైంది. ఇనుప గజ్జెల తల్లి కరాళ నృత్యం చేస్తూ ఉంటే.. పిడికెడు అన్నం ముద్ద దొరకని రోజులెన్నో చవిచూసింది. పంటి బిగువన ఆకలిని భరిస్తూ.. కుటుంబంలోని మిగిలిన సభ్యుల ఆకలిదప్పికలు తీర్చేందుకు శ్రమించింది. కష్టాల జీవితంలో ఊహించని మలుపు... భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన ప్రతిభ.. ఆమెను గొప్ప నటిగా ఈ లోకానికి చాటి చెప్పింది. నేడు తెలుగు వారంతా మెచ్చుకునే నటిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమెనే.. స్వప్న. ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అనంతపురానికి వచ్చిన ఆమెతో ‘సాక్షి చిట్చాట్’ మీ కోసం.. – అనంతపురం కల్చరల్ బాల్యమంతా రాజమండ్రిలోనే .. నా బాల్యమంతా గోదావరి తల్లి ఒడ్డునే సాగింది. మాది రాజమండ్రిలోని చిన్నపాటి మధ్యతరగతి కుటుంబం. పెళ్లిళ్లకు డెకరేషన్లు చేస్తూ వచ్చే అరకొర సంపాదనతో మా నాన్న కుటుంబాన్ని పోషించేవారు. నాకు ఒక అక్క, చెల్లి ఉన్నారు. తమ్ముడు వంశీ పుట్టగానే నాన్నతో గడిపే అవకాశం లేకుండా పోయింది. గంపెడంత సంసారాన్ని మోయడానికి అమ్మ పడిన కష్టం ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతూ ఉంది. గారాలు పోతూ అల్లరి చేయాల్సిన ఆ వయసులో మేము నాలుగైదు ఇళ్లలో పాచిపని కూడా చేశాం. దీనిని సెలబ్రెటీ అయినా గర్వంగా చెప్పుకోవడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నైతిక విలువలకు కట్టుబడితే కష్టమనేది కనపడదు. కానీ పగవాళ్లకు కూడా మా కష్టం రాకూడదని కోరుకుంటా. దరువే సెలబ్రెటీగా మార్చింది మా ప్రాంతంలో పుష్కలంగా నీరున్నా.. సామాన్య కుటుంబాల వారు మాత్రం వీధి కుళాయి దగ్గరకెళ్లి బిందెలు వంతులు పట్టి తెచ్చేకోవాల్సిందే. నేనలా క్యూ లైన్లలో ఉంటూ బిందెపై కూర్చుని పాటలు పాడేదాన్ని. అదృష్టమేమిటంటే నా పాట, నా యాస అందరికీ నచ్చి మెచ్చుకునేవారు. ఓ వైపు చదువుకుంటూనే పాచి పనులు చేసుకుంటూ కష్టం తెలీయకుండా పాడుకునే యాల పదాలలో వారికేమి స్ఫూరించిందో కానీ, నేను ఓ మంచి స్టార్ అయ్యేలా మాత్రం చేసింది. ఓ రోజు లక్ష్మీ మ్యూజికల్స్ అధినేత శ్రీనివాస్ అన్న నా టాలెంట్ను కళాప్రపంచానికి పరిచయం చేయడంతో నా దిశ తిరిగింది. అంతకు ముందు చర్చిల్లో మేము పాడే పాటలు విని తెగ మెచ్చుకునేవారు. జీసెస్ నా జీవితాన్ని ఇలా నడిపించాడనుకున్నా. పుష్కరాలు జీవితాన్ని మార్చాయి 2000 సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. స్వయంగా అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నన్ను పిలిపించి యాంకరింగ్కు అవకాశమిచ్చారు. ఇది సామాన్య విషయం కాదు. లక్షల జనం పోగవుతున్న వేళ తప్పిపోతున్న వారిని వాళ్ల ఆప్తుల దగ్గరకు చేర్చే విషయంలో యాంకర్లుగా మేము చాలా శ్రమించాం. తప్పిపోయిన వారిని ఆప్తుల వద్దకు చేర్చిన సమయంలో వారు చూపించిన కృతజ్ఞత నాలో మరో మనిషిని తట్టి లేపింది. అప్పుడే నిశ్చయించుకున్నా సేవలోనే జీవితమంతా గడపాలని. ప్రతి సీరియలూ పేరు తెచ్చింది బయటి ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన పుష్కరాలే.. ఆ తర్వాత టీవీ సీరియల్స్లో నటించే అవకాశమూ తెప్పించాయి. అప్పుడు నా వాయీస్ విన్న చాలామంది మంచి అవకాశాలిచ్చారు. సినిమాలు ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితులు నన్ను ఆ వైపు నడిపించాయి. ‘సినీ రంజనీ – మనోరంజనీ’లో తొలిసారి నటించాను. దూరదర్శన్తో పాటు పాటు పలు చానెళ్లు తీసిన సీరియల్స్లో ప్రధాన పాత్ర పోషించాను. ‘అమృతం’లో నేను నటించిన హాస్య పాత్ర నాలోని చలాకీతనాన్ని ఆవిష్కరించి అలాంటి పాత్రలు మరెన్నో తెచ్చిపెట్టింది. ‘చక్రవాకం, శిశిర వసంతం, స్వాతి చినుకులు, అపరంజి, తూర్పు వెళ్లే రైలు, మనసు–మమత, నా పేరు మీనాక్షి, అంజలి, ఊహల పల్లకి, చంద్రముఖి, ఇద్దరమ్మాయిలు, కల్పన’ ఇలా ప్రతి సీరియల్లోనూ నా పాత్ర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కథలో రాజకుమారి సీరియల్లో నటిస్తున్నా. అనంత ఆదరణ బాగుంది టీవీ నటులకు ఆదరణ ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు పుట్టుకొచ్చాయి. మా పేరుపైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే చైతన్య త్యాగగుణం నచ్చి అనంతకొచ్చాను. అటువంటి సేవాభావమే మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది. నా పేరుపైన ఓ ట్రస్టు అనంతపురంలో పుట్టడం నాకెంతో గర్వకారణంగా ఉంది. వారి ఆదరణకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. సినిమాలంటే ఇష్టముండేది కాదు నా వయసు వారు ఫుల్ఫ్యాషన్ ప్రపంచంలో విహరిస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలన్నా, టీవీలన్నా అస్సలు ఇష్టముండేది కాదు. మనమొకటనుకుంటే దైవం మరొకటి తలుస్తాడంటారు కదా అదే నిజమైంది నా విషయంలో. నా వాయిస్ బాగుంటుందని అందరూ మెచ్చుకుంటూ యాడ్ పబ్లిసిటీ కోసం డబ్బింగ్ చెప్పే అవకాశం ఇప్పించారు. ఎన్నిళ్లలో పనిచేసినా పదిహేను రూపాయలు మించి ఇచ్చేవారు కాదు. 2000 సంవత్సరంలో యాడ్స్లో నేను అందుకున్న తొలి పారితోషకం రూ.15లు! దానికే నేను ఎంతో పొంగిపోయాను. అలా సిటీ కేబుల్స్లో కనిపిస్తూ వచ్చా. నా టాలెంట్ ఏమిటో కూడా బయటపడిందే అక్కడే. వైఎస్సార్ను మిస్సయ్యాను నా నట జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా. ఆ క్రమంలోనే ‘శిశిర వసంతం’ సీరియల్కు బెస్ట్యాక్ట్రస్గా తొలి అవార్డు దక్కింది. 2006లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డునందుకున్నా. అప్పుడు మా అభిమాన నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ఆ కార్యక్రమానికి వస్తారని ఎంతో ఆశించా. పనుల ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోయారు. తర్వాత నేనూ కలవక పోయా. ‘ఇద్దరమ్మాయిలు’కు కోహినూరు మహిళ, జాతీయస్థాయిలో లేడీ లెజండ్ అవార్డులు నన్నెంతగానో ప్రోత్సహించాయి. సినీనటులు ఉత్తేజ్, హర్షవర్ధన్, వేణుమాధవ్, సప్తగిరి, శంకర్ వంటి వారు హోమ్లీ పాత్రలకు నా పేరే సూచించడం ఆనందంగా ఉంది. దేవతలా పూజించారు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చాలా మంచిగా, అమాయకంగా ఉంటారు. నమ్మితే ప్రాణమిస్తారు. ‘ఎగిసే తారాజువ్వలు, అమ్మ నీకు వందనం, దేవదాసు (నాగార్జున, నానీ నటించిన కొత్త సినిమా), వజ్రకవచ, బ్రాండ్బాబు, గోవింద, మీనాక్షి’ సినిమాల్లో నటించాను. ‘చాకలి ఐలమ్మ, రేణుకా ఎల్లమ్మ’ సినిమాలు నాకు ఎంత పేరు తెచ్చిపెట్టాయంటే ఒకసారి నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని ఏకంగా పూజలు చేశారు. నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. నేను సామాన్య నటిని అంటే తెలంగాణ పల్లెల ప్రజలు నమ్మినా వదల్లేదు. పిడికెడు అన్నం ముద్ద కోసం చేతులు చాచిన నేనేనా ఈ స్థాయికి చేరుకున్నదని అనిపించేది. పెళ్లి వద్దనుకున్నా నాన్న లేకపోవడంతో కుటంబానికి ఆ స్థానం నేను తీసుకోవాలనుకున్నా. ముఖ్యంగా అమ్మను రాణిలా చూసుకోవాలన్నది నా జీవితాశయం. అక్కకు, చెల్లికి, తమ్మునికి పెళ్లిళ్లు చేశా. వాళ్ల పిల్లలకు కూడా నా చేతనైంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఇన్ని బాధ్యతలకు పెళ్లి అడ్డుకాకూడదనే వద్దనుకున్నా. జీవితాంతం ‘నన్’ గా ఉండడానికే నిశ్చయించుకున్నా. సేవా కార్యక్రమాలలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదన్నది నా జీవితం నేర్పిన పాఠం. నాలా ఉండాలని నేను కోరుకోవడం లేదు కానీ యువతకు నేను చెప్పేదొక్కటే దేనికీ భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ముందే రాసేసుకున్నాడు. అర్ధంతరంగా దానిని మార్చే ప్రయత్నం చేయొద్దు. విశ్వాసాన్ని కోల్పోతే టాలెంట్ కూడా నిస్సారం అవుతుంది. -
స్వప్నకు రజతం
దోహా: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మూడో రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్లో భారత అ మ్మాయి స్వప్నా బర్మన్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. లాంగ్జంప్, 800 మీటర్లు, 200 మీటర్లు, షాట్పుట్, 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీపడిన స్వప్నా బర్మన్ మొత్తం 5993 పాయింట్లు స్కోరు చేసింది. ఉజ్బెకిస్తాన్ అమ్మాయి ఎకతెరీనా వొర్నినా (6198 పాయి ంట్లు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్కే చెందిన పూర్ణిమ హెంబ్రామ్ (5528 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచింది. 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో మొహమ్మద్ అనస్, పూవమ్మ, విస్మయ, అరోకియా రాజీవ్లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 16.71 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. మహిళల 10000 మీటర్ల రేసులో సంజీవని 32ని:44.96 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ సెమీఫైనల్కు... పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ ఫైనల్కు అర్హత సాధించారు. -
12 వేళ్ల స్వప్నకు ప్రత్యేక బూట్లు
న్యూఢిల్లీ: భారత అథ్లెట్, ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ చాంపియన్ స్వప్న బర్మన్ ఎట్టకేలకు ప్రత్యేక బూట్లు అందుకుంది. ఆమె రెండు పాదాలకు ఆరేసి వేళ్లున్నాయి. డజను వేళ్లతో ఉన్న ఆమెకు సాధారణ స్పోర్ట్స్ షూస్ ఇరుకుగా, అసౌకర్యంగా ఉండటంతో పరుగు పెట్టడంలో ఇబ్బంది పడుతోంది. మొత్తానికి ఎన్ని ఇబ్బందులెదురైనా... ఇండోనేసియాలో గతేడాది జరిగిన ఏషియాడ్లో ఆమె దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది. చివరకు జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్ ప్రత్యేకించి స్వప్న పాదాల కోసమే బూట్లను తయారు చేసింది. ఇందుకోసం ఆమెను హెర్జోజెనరచ్లో ఉన్న తమ అథ్లెట్ సర్వీసెస్ ల్యాబ్కు తీసుకెళ్లింది. అక్కడ ఆమె పాదాలకు అనుగుణమైన కొలతల్ని తీసుకొని సౌకర్యవంతమైన ఆకృతిలో బూట్లను తయారు చేసింది. తనకు ఏ ఇబ్బంది లేకుండా పూర్తి సౌకర్యవంతమైన బూట్లు రావడంతో స్వప్న తెగ సంబరపడిపోతోంది. అడిడాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కష్టపడతానని ఈ సందర్భంగా చెప్పింది. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
చిత్తూరు, తొట్టంబేడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తొట్టంబేడు మండలం చిన్నకన్నలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ఐ జయశ్యామ్ కథనం మేరకు.. చిన్నకన్నలి గ్రామానికి చెందిన కిలారి రామానాయుడు, ఆయన భార్య స్వప్న(36) మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలో స్వప్న మంగళవవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భ్రమలు మిగిల్చిన అమరావతి!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం. ఒకవేళ నిర్మించినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజారహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా? సమాధానం చెప్పాలి. అమరావతి. ప్రపంచస్థాయి రాజధాని... ఆధునిక నగరాలను తలదన్నే రాజధాని.. ప్రపంచ పారిశ్రామికవేత్తలదరూ దృష్టి సారి స్తున్న అద్భుత రాజధాని. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాడిందే పాటలాగా పాడుతున్న ఒకేపాట.. రూపురేఖలు లేని బీడు భూముల్లో రాజధాని స్వర్గం గురించి డిజిటల్ రూపంలో సాగిస్తున్న వంచనాత్మక ప్రచారగీతం. పాలకుడి విజన్.. ఇంకా కట్టని 45 అంతస్తుల పాలనా సౌథం గురించి కలలు కంటూండగా.. రైతుల చెమట చుక్కల ఫలితమైన అమరావతి వాస్తవరూపం ఏమిటంటే చిన్నాభిన్నమైన జీవితాలు. భూములివ్వమన్న రైతులపై అక్రమ కేసులు, వేధింపులు. లక్షలు మాత్రమే ఇచ్చి కోట్లు కొల్లగొడుతున్న భారీ భూ దందా చేదు గుర్తులు, వ్యవసాయానికి ద్రోహం బడా కంపెనీలకు మోదం.. తమ భూమిని తీసుకుని బీడుగా ఉంచిన భూముల్లో ఎవరిని ఉద్ధరిస్తున్నారో అంతు చిక్కని రైతుల నిర్వేదం. వ్రయ్యలైన హామీలు, చెల్లని హెల్త్ కార్డులు, పడిపోయిన జీవన ప్రమాణాలు, వ్యవసాయానికి దూరమైన పదివేల మంది కౌలురైతుల కుటుంబాల తీరని వ్యథ. ఇదీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత ప్రజలకు ఇన్నేళ్లుగా చూపిన మహామాయ. శంకుస్థాపనలు, బాహుబలి లాంటి ఫాంటసీ బొమ్మలు తప్ప తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో నరమానవులకు అర్థం కాని స్థితి. ఇది భూ సేకరణా.. లేక అపహరణా అంటూ ఉద్యమకారులు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి, నాలుగేళ్లు గడిచిపోయాయి. అమరావతి పేరిట అప్పుడప్పుడూ జరుగుతున్న ఆర్భాటానికి గడుస్తున్న కాలం మౌన సాక్షిగా నిలిచింది. కానీ.. అమరావతిలో ఇప్పుడు అడుగుపెడితే.. కంటిచూపు పరిధిలో ఉండే భూమి బీడువారిపోయి, దుమ్ముపట్టిన శిలాఫలకాలు కలుపుమొక్కల చాటునుండి తొంగిచూస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా దిక్కుతోచని ముఖాలు, కూలిపోయిన ఆశలు, అక్కడక్కడా గొంతు చించుకుంటున్న ఉద్యమ నినాదాలు, చితికిపోతున్న బతుకులు దర్శనమిస్తాయన్నది అక్షర సత్యం. అందరికన్నా ఎక్కువగా చిన్నాభిన్నమైంది రైతు జీవితం. అగాధంలో కూరుకుపోయిన భవిష్యత్తుతో సతమతమై, స్థిరత్వం కోల్పోయిన వర్తమానంతో, సంధి కుదుర్చుకోలేక తల్లడిల్లిపోతున్నాడు రైతన్న. అన్నింటికీ మించిన దుర్భరమైన అంశం ఏమిటంటే.. ఇష్టపడో, కష్టపడో భూములను ధారాదత్తం చేసిన అన్నదాత నమ్మకాన్ని టీడీపీ ప్రభుత్వం వమ్ము చేసిన విధానం. రైతన్న ఊహకందని చందంగా వంచించి గాలికొదిలేసింది ఏపీ ప్రభుత్వం. అసలు ఆది నుండే ఈ భూసేకరణ, సమీకరణ ఒక ప్రహసనంగా స్వలాభాల కోసం కొందరు అస్మదీయులు సొమ్ము చేసుకోవడం కోసం సామాన్యులపై ప్రయోగించిన ఒక పిడుగులా పరిణమిస్తూ వచ్చింది. సీఆర్డీఏ నిబంధనలను కాలరాస్తూ, బాధ్యతా రాహిత్యం, స్వార్థం తాండవిస్తూ కొనసాగిన ఈ తంతు సామాన్యుడిపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇంతకీ ఎవరిపై ఈ దెబ్బ.. ? భూములిచ్చిన రైతుకి ఇచ్చిన హామీలు, కేజీ–పీజీ ఉచిత విద్య, హెల్త్ కార్డులు, అభివృద్ధి చేసిన ప్రత్యేక ఫ్లాట్లూ.. ఇంకా ఏవేవో. కానీ.. భూములిచ్చాక చేతికి చిక్కినవి పనిచేయని ఆరోగ్య కార్డులు, శ్మశానాల్లో సెల్ టవర్ల కింద బోరు బావుల్లో ఫ్లాట్లూ. జరీబ్ భూములకు బదులుగా వారికిచ్చినవి విలువ తక్కువుండే మెట్ట భూములు. జరిగింది అన్యా యం, మోసం అంటూ రైతు బోరుమంటున్నాడు. పైపెచ్చు లక్షలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం కాజేసిన ఈ భూముల విలువ చూస్తూండగానే కోట్లకు చేరింది. ఎవరైనా హెల్ట్ కార్డులు ఎందుకు కోరుకుం టారు..? అనుకోని ఆర్థిక సమస్య వస్తే భరించలేరు కనుక అవసరానికి ఆదుకోవాలని ఆశిస్తారు. కానీ అలా జరగటం లేదు. ‘మా నాన్నకి గుండె ఆపరేషన్ చేయించుకోడానికి ఈ కార్డు చెల్లదని చెప్పారు. నాలుగు లక్షలు నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఓ రైతు. మరొక రైతుది ఇంకో దీనగాథ. కాన్వెంట్ స్కూల్స్కు వెళుతున్న పిల్లల్ని అరకొర వసతుల ప్రభుత్వ పాఠశాలలకి మార్చాల్సి వచ్చింది. అందుకు కారణం దిగజారిన అతని ఆర్థిక పరిస్థితి. ఇదీ భూములిచ్చిన రైతుల దుస్థితి. ఇక పెనుమాకలో రైతులు నిత్య పోరాటంతో సావాసం చేస్తున్నారు. పచ్చగా సస్యశ్యామలంగా నాలుగైదు పంటలు పండించే జరీబు భూములు ఇవ్వనందుకు వారిపై అక్రమ కేసులు, వేధింపులు ప్రయోగిస్తూ.. మెడలు వంచే ప్రయత్నం చేసింది టీడీపీ సర్కార్. రాత్రికి రాత్రి చెయ్యని నేరానికి తప్పుడు కేసులు పెట్టి, మానవ హక్కులను బేఖాతరు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆదుకునేవారే కరువయ్యారు. పైగా ‘చక్కగా పండించే భూములన్నీ బడా కంపెనీలకు అమ్మేసి వ్యవసాయానికి ద్రోహం చేసే ఈ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అంతుచిక్కడం లేదు’ అంటాడు ఓ రైతు. ఆలోచిస్తే అన్నీ అంతుచిక్కుతాయి. జరిగిన కుట్ర తేటతెల్లమవుతుంది. ఇక అధికారుల పెడసరి సమాధానాలు, కంప్యూటర్ రికార్డుల్లో అకస్మాత్తుగా జరుగుతున్న మార్పులు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. అసైన్డ్ లంక భూముల రైతులది మరో తరహా పోరాటం. బలహీన వర్గాలుగా భావించి వ్యవస్థ నుంచి వారికి సంక్రమించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హక్కు చాటుకుంటోంది. స్థానికంగా లేనిపోని భయాలతో రైతుల్ని బెదిరించి, కారుచౌకగా భూముల్ని స్వాహా చేసి మంత్రిగారి బినామీల పేరిట రిజిష్టర్ చేయించారు. ఇప్పుడు అవే భూముల విలువ కోట్లలో ఉంది. అంతర్గత వ్యాపార దురాశతో దళిత భూములతో దందా చేసి సొమ్ము చేసుకున్న ప్రభుత్వ కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీఓ 41 రద్దు చెయ్యాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పి సంవత్సరం గడిచిపోయింది కానీ, ఉద్దండరాయపాలెం చుట్టు పక్క గ్రామాల దళిత రైతులకు ఇంకా న్యాయం జరగలేదు. ఉన్న ఏకైక ఆసరా కోల్పోయిన రైతులు కుటుంబాన్నే సాకుతారా? బెదిరిస్తున్న ప్రభుత్వంతో దైనందిన పోరాటమే చేస్తారా? ఇదేనా ముఖ్యమంత్రి చేసే న్యాయం.. ? ఇవన్నీ ఒక ఎత్తయితే.. కౌలు రైతుల గురించి అసలు ప్రభుత్వం ఆలోచించలేదా.. అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పదివేల దిక్కుతోచని కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. పండించడానికి పొలాలు లేక, సంపాదన కరువై పూట గడవక అల్లాడిపోతున్న ఈ జీవితాలు సీఎంకి కనపడవా? తరతరాల వృత్తి ఇప్పుడు సాయం రాక, ఇతర పనులు చేతకాక పస్తులుంటున్న అన్నదాతలకి ఏమిటి దిక్కు? అటు రైతుకూలీలదీ ఇదే పరిస్థితి. ఒక్కో కుటుంబానికీ ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల ఐదు వందలు మాత్రమే. పనికి వెళదామంటే పొలాలు లేక పనులు లేవు. అంతకు ముందు పనులు దొరికినప్పుడు కుటుంబ ఆదాయం 15 నుంచి 20 వేలదాకా ఉండేది. ఇప్పుడు పని దొరికినా కానీ పాతిక మందితో కలసి కుక్కిన ఆటోలో 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే.. చేతికొచ్చేది వంద రూపాయలు కూడా ఉండదు. ప్రభుత్వం ఇచ్చే కోటా బియ్యం మరీ నాసిరకంగా ఉండి, ఆరోగ్యాలు పాడవుతూ ఉంటే అక్కరకు జేబులో డబ్బులు లేక విలపిస్తున్నారు పిల్లల తల్లులు. పోనీ.. అయ్యవారు చెప్పినట్లు స్థానిక సచివాలయంలో పని కల్పిస్తారా అంటే, మధ్య దళారుల వేధింపులు మరో కోణం. ఎర్రగా, పొడుగ్గా వయసు మీరకుండా ఉంటేనే పనుల్లో పెట్టుకుంటారు. ఇక మా పరిస్థితి ఏమిటంటూ కంటతడి పెడుతున్నారు ఆడపడుచులు. వాస్తవంగా ప్రభుత్వం 35 వేల ఎకరాలు సేకరించింది. ఇవి అధికారిక లెక్కలు. ప్రభుత్వం చేతిలో సుమారు 80 వేల ఎకరాల భూమి ఉంది అన్నది నమ్మలేని నిజం. కానీ.. ఇంకా శంకుస్థాపనలు, బాహుబలి లాంటి బొమ్మలు మినహా తెలుగువారి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలి. బిల్డింగ్లు, ఒకవేళ అవి కట్టినా ప్రజా సంక్షేమాన్ని కాలరాసిన ప్రభుత్వం ప్రజా రహిత అమరావతి నిర్మించాలనుకుంటుందా.. సమాధానం చెప్పాలి. ఇక బట్టతలకి మల్లెపూలు అన్నట్లు చుట్టూ బార్లూ, రెస్టారెంట్లూ వెలసి ఇంతో అంతో డబ్బులు చేసుకున్న రైతన్నల జీవితాలపై నీలినీడలు కమ్ముతున్న విషయం ఎవరూ ఊహించని విపరిణామం. పాలకులకు మొదట ఉండవలసింది ప్రజల పట్ల బాధ్యత. రెండవది జవాబుదారీతనం. ఇవేవీ లేకపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్కలంగా ఉన్నవి నియంతృత్వ ధోరణి, పూర్తి దాటవేత వైఖరి. నాలుగేళ్లలో ప్రజల్ని ఎన్నిసార్లు కలిశారు. ఎన్నిమార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమం మాయమైపోయింది అన్నది ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్న కఠోర వాస్తవం. అంతర్జాతీయమూ లేదు, మహా నగరాలు లేవు... అమరావతి అంటే.. కొందరు మాత్రమే లాభపడుతున్న ఉద్దేశపూర్వకమైన ఓ కుట్ర. ఎందరో సామాన్యులు మోసపోయిన ఓ చట్రం. స్వప్న అశోక్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాక్షి టీవీ ఈ–మెయిల్: swapnatvhost@gmail.com -
'స్వప్న' సాకారం: తల్లి భావోద్వేగం
-
'స్వప్న' సాకారం
చరిత్రలో నిలిచే విజయాలతో లభించిన రెండు స్వర్ణాలు... అరుదైన రికార్డుతో దక్కిన రజతం... నిలకడైన ప్రదర్శనకు అందిన కాంస్యంతో ఆసియా క్రీడల 11వ రోజు భారత్... నాలుగు పతకాలు సాధించింది. 11 స్వర్ణాలతో గత ఏషియాడ్ రికార్డు సమం చేసిన మన దేశం... ప్రస్తుతం మొత్తం 54 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. హెప్టాథ్లాన్లో స్వప్న బర్మన్ స్వర్ణ స్వప్నం సాకారం చేయడం... ట్రిపుల్ జంప్లో అర్పీందర్ అదరగొట్టడం ఏషియాడ్లో బుధవారం భారత్ తరఫున నమోదైన మెరుపులు...! ద్యుతీ చంద్ రెండో పతకంతో సత్తా చాటగా...టీటీలో మరో కాంస్యంతో మిక్స్డ్ ద్వయం ఆనందం నింపింది. జకార్తా: కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారం... 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనత... గతంలో మూడుసార్లు ఊరించి చేజారిన కల... ఇప్పుడు మాత్రం నెరవేరింది. అద్భుత ప్రదర్శనతో బెంగాల్కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ దానిని సాధించింది. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. ఏడు క్రీడాంశాల్లో ఇలా... రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్లో ఏడు క్రీడాంశాల్లో స్వప్న మొత్తం 6,026 పాయింట్లు సాధించింది. హై జంప్ (1.82 మీ.), జావెలిన్ త్రో (50.63 మీ.)లలో టాపర్గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్పుట్ (12.69 మీ.), లాంగ్ జంప్ (6.05 మీ.)లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులో 13.98 సెకన్లతో నాలుగో స్థానంలో, 200మీ. పరుగులో 26.08 సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... అందులో (2ని.21:13సె.) నాలుగో స్థానంలో నిలిచినా... మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. చైనాకు చెందిన క్వింగ్లింగ్ వాంగ్ (5954 పాయింట్లు) రజతం, జపాన్ అథ్లెట్ యమసాకి యుకి (5873 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. అయితే, 800 మీ. పరుగుకు ముందు యమసాకి కంటే 18 పాయింట్లు మాత్రమే వెనుకబడిన భారత అథ్లెట్ పూర్ణిమా హెంబ్రామ్ (5837 పాయింట్లు)... ఆ రేసులో మూడో స్థానంలో నిలిచినా ఓవరాల్ స్కోరులో వెనుకబడి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. మరోవైపు ఏషియాడ్ హెప్టాథ్లాన్లో భారత్ తరఫున సోమా బిశ్వాస్ (2002, 2006) రజతం నెగ్గడమే ఇప్పటివరకు అత్యుత్తమం. జేజే శోభా (2002, 2006), ప్రమీలా అయ్యప్ప (2010)లు కాంస్యాలు గెలిచారు. ఆరు వేళ్ల బర్మన్... ఏడు ఈవెంట్ల విన్నర్ రెండు కాళ్లకు ఆరు వేళ్లుంటే నడవొచ్చు. పరిగెత్తొచ్చు. అంతేకాదు పతకం కూడా గెలవొచ్చని ఏషియాడ్లో ఘనంగా చాటింది స్వప్న బర్మన్. ఇది కూడా ఓ ఘనతేనా అనుకుంటే ఒక అథ్లెట్ శ్రమను తక్కువగా అంచనా వేసినట్లే! ఎందుకంటే ఆరేసి వేళ్లున్న అమ్మాయి అయినా అబ్బాయైనా షూస్తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. సాధించడంపైనే మక్కువ పెంచుకుంది. చివరకు ఇంచియోన్ (గత ఏషియాడ్లో ఐదోస్థానం)లో పోగొట్టుకున్న పతకాన్ని జకార్తాలో చేజిక్కించుకునేలా తయారు చేసింది. నాడు కష్టాలతో సహవాసం... నేడు పసిడితో సాకారం... బెంగాల్కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. కడుపునిండా తినడానికే పోరాడాల్సిన ఇంట్లో పతకం కోసం ఆరాటపడటం అత్యాశే అని అనిపిస్తుంది! కానీ... స్వప్న కేవలం ఆరాటంతోనే గడిపేయలేదు. దినదిన పోరాటంతో కుంగిపోలేదు. ఓ లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం చేసింది. చివరికి ఈ పయనంలో విజేతగా నిలిచింది. ఒకటి కాదు... రెండు కాదు... ఏడు. హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షాట్పుట్, 100 మీ. 200 మీ. 800 మీ. పరుగు పోటీలు. ఇవన్నీ ఓ ‘పట్టు’పడితే ముగిసే రెజ్లింగ్ పోటీలు కాదు. ధనాధన్గా బాదే క్రికెట్ మెరుపులు కాదు. ఒక్కో ఈవెంట్ ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అన్నీ భిన్న మైనవే! అన్నీ కష్టమైనవే! కానీ ఇవన్నీ స్వప్నకు సలాం చేశాయి. పొట్టిగా ఉన్నావంటే... గట్టిగా బదులిచ్చింది... స్వప్న హెప్టాథ్లాన్కు హైజంప్తో బీజం పడింది. తన సోదరుడు దూకే ఎత్తును చూసి తాను దూకేందుకు సరదా చూపెట్టింది. 2011లో 1.20 మీ. నుంచి 1.30 మీటర్ల ఎత్తు వరకూ దూకింది. శిక్షణ కేంద్రంలో మిగతావారు వివిధ ఈవెంట్లలో ఆడటం చూసి క్రమంగా హెప్టాథ్లాన్ ప్లేయర్గా ఎదిగింది. ఈ చాన్స్ కూడా అంత ఈజీగా రాలేదు. ముందుగా శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. సాయ్లో శిక్షణకు సీటొచ్చింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత చూస్తే ఆమె 66 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. హెప్టాథ్లాన్లో విజేతగా నిలిచింది. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సిద్ధమైతున్న వేళ కూడా బర్మన్ను పంటినొప్పి తీవ్రంగా బాధపెట్టింది. అయితే యాంటిబయోటిక్స్ మందులతో బరిలోకి దిగి అనుకున్నది సాధించింది. -
ఎవరీ స్వప్నారెడ్డి?
జోగిపేట (అందోల్): గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతున్నాయ ని, ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని అందోల్ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్ స్వప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించి ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమ వారం తేల్చిచెప్పింది. దీంతో స్వప్నారెడ్డి పేరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు ఈ స్వప్నారెడ్డి ఎవరు? అని ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ స్పందించి సర్పంచ్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్గా సీఎం ప్రస్తావించడంతో స్థానిక నాయకులు చర్చించుకున్నారు. ఎన్నికలు ఆపాలన్న ఉద్దేశం లేదు.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలన్న ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘనకు గురవుతోందనే పిటిషన్ వేశాం. ఒకవేళ దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే నేను కూడా సుప్రీంకు వెళ్లి 50% మించకుండా చూడాలని కోరతాను. – స్వప్నారెడ్డి -
కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
పట్నంబజారు (గుంటూరు): కుమార్తెను చంపి, ఆపై తల్లి కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరు పట్టాభిపురం ఎస్హెచ్వో సీహెచ్ సీతారామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రమౌళినగర్ వికాస్ ఎన్క్లేవ్లో బండ్లమూడి శ్రీనివాసరావు, భార్య స్వప్న (28), కుమార్తె కీర్తిక (5) నివాసం ఉంటున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన శ్రీనివాసరావుకు నీరుకొండకు చెందిన స్వప్నతో 2012లో వివాహమైంది. హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే శ్రీనివాసరావు స్వప్నతో కలిసి రెండున్నరేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. వారికి కుమార్తె కీర్తిక అక్కడే జన్మించింది. మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు వచ్చి విద్యానగర్లోనే ఉంటున్నారు. కొద్దికాలం క్రితమే వికాస్ ఎన్క్లేవ్స్కు వచ్చి ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తరువాత శ్రీనివాసరావు పని ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీనికి తోడు శ్రీనివాసరావుకు నరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నట్టు బంధువులు తెలిపారు. కుమార్తె కీర్తికకు కూడా వ్యాధి సోకింది. కీర్తిక కంటి పక్కన ఎముకకు సంబంధించిన ఆపరేషన్ చేయించగా, అది ఫెయిలవడం, తిరిగి పదేళ్ల తర్వాత చేయాలని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న మంగళవారం రాత్రి భర్త శ్రీనివాసరావు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో హ్యాంగర్కు కీర్తికకు ఉరి వేసి చంపి, ఆమె కూడా పక్క గదిలోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. -
నకిలీ మహిళా డాక్టర్ అరెస్ట్
తిరుత్తణి: ప్లస్టూ వరకు చదువుకుని క్లినిక్ పెట్టి వైద్య సేవలు అందించిన నకిలీ మహిళ డాక్టర్ను ఆరోగ్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో విష జ్వరాలు, డెంగీతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు, డెంగీతో బాధపడుతున్న గ్రామీణులకు అవగాహన లేక తమ ప్రాంతంలోని నిర్వహిస్తున్న వైద్య కేంద్రాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో వారం రోజుల కిందట నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దయాళన్ ఆధ్వర్యంలో వైద్య బృందం కేజీ.కండ్రిగలో బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షణ్ముగసుందరం పేరిట క్లినిక్ నిర్వహిస్తున్న స్వప్న(32) అనే మహిళను అదుపులో తీసుకుని విచారించగా ప్లస్టూ వరకు చదువుకుని క్లినిక్ నిర్వహించి వైద్య సేవలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరోగ్యశాఖ అధికారుల సూచన మేరకు తిరుత్తణి పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్వప్న అదృశ్యం కథ సుఖాంతం
-
సర్వజనాస్పత్రిలో బాలింత మృతి
వారంలో మూడుసార్లు సర్జరీ పేగుకు రంధ్రం.. నొప్పి తీవ్రం కోలుకోలేక ప్రాణం వదిలిన వైనం వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆగ్రహం సర్వజనాస్పత్రిలో ఓ బాలింత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యాధికారులు, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. - అనంతపురం న్యూ సిటీ అనంతపురం సర్వజనాస్పత్రిలో మంగళవారం బాలింత మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన స్వప్న (23), రామాంజనేయులు దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. స్వప్న రెండోసారి గర్భం దాల్చడంతో కాన్పు కోసం ఆమె భర్త ఈ నెల 16న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. అదే రోజున డాక్టర్ విజయలక్ష్మి ఆమెకు సిజేరియన్ చేశారు. స్వప్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ అయిన రోజు నుంచి స్వప్న కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు నొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గైనిక్ వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళితే నొప్పి మామూలేనంటూ తేలిగ్గా తీసుకున్నారు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో గైనిక్ వైద్యులు మరోసారి ఆపరేషన్ చేసి పరిశీలించగా.. పేగుకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో ఈ నెల 19న ఏఎంసీకు మార్చారు. గైనిక్, సర్జరీ వైద్యులు, అనస్తీషియన్లు మరోసారి పరీక్షించి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్తో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. ఈ నెల 25న కర్నూలు నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ ఆర్.సి.రామంచంద్రనాయుడుతో సర్జరీ చేయించారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వప్న మృతి చెందింది. భర్తకు విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు. రోజుల పసికందు, మూడేళ్ల బాబు బాగోగులను వికలాంగుడైన తండ్రి రామాంజనేయులు ఎలా చేసుకుంటారంటూ విలపించారు. వైద్యులపై చర్యలు తీసుకోండి బాలింత మృతికి కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలోనే పేగుకు రంధ్రం పడిన విషయం గుర్తించి, అవసరమైన చికిత్స చేసి ఉంటే బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకూ కదిలేది లేదని, మృతదేహంతో ధర్నా చేపడతామని అనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సర్జరీ విభాగం హెచ్ఓడీ రామస్వామినాయక్, అనస్తీషియన్ డాక్టర్ నవీన్, గైనిక్ డాక్టర్ సంధ్య, టూటౌన్ సీఐ యల్లంరాజు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. మా ప్రయత్నం మేం చేశాం స్వప్నకు సర్జరీ చేసిన వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి శస్త్రచికిత్సల్లో అనుభవం కల్గినవారు. సర్జరీ చేసిన వైద్యులు, స్టాఫ్ను విచారించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకునే సర్జరీ చేశామని చెబుతున్నారు. పేగులో ఏ విధంగా రంధ్రం పడిందో అర్థం కాని పరిస్థితి. బాలింత ప్రాణం కాపాడేందుకు మా ప్రయత్నం మేం చేశాం. డాక్టర్ల తప్పిదమేమీ లేదు. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పెళ్లి మాటెత్తితే మొహం చాటేశాడు
►గర్భం దాల్చిన యువతి ►నిందితుడిపై కేసు నమోదు గాజువాక: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడొక యువకుడు. ఆమె గర్భం దాల్చడంతో తనకు సంబంధం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని అటు పోలీసుల చుట్టూ, ఇటు పెద్దల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఆమెకు న్యాయం చేయాలని తమ ప్రతినిధులతో కలిసి పద్మ గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళకు దిగారు. దీనిపై స్పందించిన పోలీసులు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితురాలు, గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తుంగ్లాం గ్రామానికి చెందిన కోన స్వప్నతో ఆమె బంధువు గొలగాని శ్రీనివాస్కు వివాహం చేయాలని పెద్దలు ప్రతిపాదన చేశారు. పెళ్లి మాటలు కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 20న శ్రీనివాస్ ఆమె ఇంటికి వెళ్లాడు. తన తల్లిదండ్రులు పనికి వెళ్లిపోయారని ఆమె చెప్పినప్పటికీ ఇంట్లోకి ప్రవేశించాడు. కొద్ది సేపు మాటల తరువాత తాను పెళ్లి చేసుకుంటానంటూ స్వప్న చేయి పట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. పెళ్లి చేసుకోవాలనుకున్న తరువాత భయమెందుకంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం వెళ్తూ తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, కనుక నిన్ను పెళ్లి చేసుకోలేనని స్వప్నకు షాకిచ్చాడు. మరుసటి నెలలోనే ఆమెకు గర్భం ఖాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ అమ్మానాన్నలకు విషయాన్ని తెలిపారు. తమ కుమార్తెను శ్రీనివాస్తో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు. అందుకు అతని తల్లిదండ్రులు ససేమిరా అనడంతో తొలుత గాజువాక పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పిలిచి మాట్లాడతామని చెప్పారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో గ్రామంలోని, గాజువాకలోని కొంతమంది పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు మాట్లాడటంతో తొలుత యువతికి గర్భస్రావం చేయించాలని కోరారు. ఆస్పత్రికి వెళ్లిన అనంతరం అబార్షన్కు డాక్టర్ అంగీకరించకపోగా కేసు పెడతానని హెచ్చరించి పంపించేశారు. పెళ్లికి అంగీకరించబోమంటూ నిందితుడి తల్లిదండ్రులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేయడంతో బాధితురాలు మహిళా చేతన ప్రతినిధులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ వద్ద సంస్థ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సీఐ ఇమ్మానుయేలురాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్నానికి వివాహిత బలి
జగిత్యాల: వరకట్నానికి ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన గొల్లపల్లి మండలకేంద్రంలోని గౌతమ్ విద్యా మందిరం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడున్నరేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడున్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. 15 రోజుల క్రితం కూడా ఈ విషయమై గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం చూసే సరికి స్వప్న ఉరికి వేలాడుతూ కనిపించింది. భర్త, అత్తమామలు కలిసి ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి చుక్క లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.120 కే కిలో కందిపప్పు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతుబజారులో ఏర్పాటుచేసిన కందిపప్పు ప్రత్యేక విక్రయ కౌంటర్ను శుక్రవారం రైతుబజారు ఈవో స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కిలో కందిపప్పు రూ.120 చొప్పున ఒక్కొక్కరికి కిలో కందిపప్పును విక్రయించనున్నట్లు తెలిపారు. -
పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మైలార్దేవ్పల్లి డివిజన్ లక్ష్మీగూడలో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సురేందర్ తన ఇంట్లో కిరాయికి ఉంటున్న స్వప్నను ఖాళీ చేయాలని కోరాడు. కొంత సమయం ఇవ్వాలని అడిగిన తనపై ఇద్దరు వ్యక్తులు దాడిచేశారని స్వప్న ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పోలీస్స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం స్వప్న ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి సమయం కావాలన్నాడని..
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి సమయం కోరడంతో.. మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఓ కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా భర్తతో గొడవపడి తల్లి వద్దే ఉంటున్న స్వప్న ఇంటి పక్కనే ఉంటున్న విష్ణు అనే యువకుడిని ప్రేమించింది. రెండేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో విష్ణు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ‘తననే పెళ్లి చేసుకోవాలని.. లేకపోతె చచ్చిపోతానని’ పలుమార్లు బెదిరించింది. ఈ విషయమై గతంలో పంచాయతి కూడా జరిగింది. అయినా తీరు మార్చుకోని స్వప్న పెళ్లి చేసుకోవాల్సిందిగా విష్ణు వెంటపడింది. దీనికి అతను తన ఇంట్లో పెళ్లి కావాల్సిన అన్నయ్య ఉన్నాడని అతని పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయినా సంతృప్తి చెందని స్వప్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
చేతులు లేకున్నా..
రేగిడి : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న రెండు చేతులు లేకపోయినప్పటికీ చదువులో తన ప్రతిభను చాటుకుంటోంది. ద్వితీ య సంవత్సరం ఇంటర్మీడియెట్లో 725 మార్కులు ఎంపీసీ గ్రూపులో సాధించిం ది. ఈమె రాజాం ఉమెన్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్నను వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక వేత్త పాలూరి సిద్ధార్థ.. దాతల సహకారంతో చదివిస్తున్నారు. చదువుపై మమకారం ఉండడంతో ఇంటర్మీడియెట్లో మంచి మార్కులు సాధించడం పట్ల ఎంఈవో ప్రసాదరావుతోపాటు పాలూరి సిద్ధార్థ స్వప్నను అభినందించారు. -
బాలికకు వివాహం: తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
గుట్టుచప్పుడు కాకుండా ఓ బాలికకు పెద్దలు వివాహం చేయగా అధికారులు ఆ బాలికను చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం తరిగోపుల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య, మంజుల దంపతుల కూతురు స్వప్న(15) అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. చేవెళ్ల మండలం తంగెడ్పల్లి గ్రామానికి చెందిన అనిల్కుమార్కు బాలికతో ఈనెల 3న వివాహం చేశారు. పెళ్లిని అడ్డుకునేందుకు అధికారులు వెళ్లగా అప్పటికే వారు గ్రామం విడిచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు స్వప్నకు తంగెడ్పల్లి గ్రామంలో వివాహం జరిపించారు. ఈ విషయం బుధవారం బయటపడటంతో చైల్డ్లైన్ ఆర్గనైజర్ సంజమ్మ గ్రామానికి వెళ్లి వివాహమైన బాలికను, ఆమె తల్లిదండ్రులను తహశీల్దార్ వద్దకు తీసుకె ళ్లారు. తహశీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీల వారికి కౌన్సెలింగ్ చేపట్టి సర్దిచెప్పారు. మైనారిటీ ముగిసిన తర్వాతే ఆమెను తీసుకెళ్లాలని కోరారు. అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ హోంకు తరలించారు. -
ఆశా కార్యకర్త ఆత్మహత్య
కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ల స్వప్న(35) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల భర్తతో ఆమెకు విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ మేరకు పోలీసులు.. భర్త మోహన్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
తల్లి కళ్లెదుటే కూతురి దుర్మరణం
తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా): తల్లి కళ్లెదుటే కన్నపేగు కానరాని లోకాలకు తరలిపోయింది. రోడ్డు పక్కన ఉన్న తల్లీకూతుళ్లను మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఢీకొంది. కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా తల్లికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం తాండూరులో చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ నాగార్జున, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం ఊడిమేశ్వరం గ్రామానికి చెందిన సుమిత్ర, జనార్దన్లు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతుళ్లు రోజ, స్వప్న(5) ఉన్నారు. బతుకుదెరువు కోసం 5 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు తాండూరుకు వలస వచ్చారు. పట్టణంలోని పాత శాలివాహన సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అక్కడే అద్దె గదిలో నివాసముంటున్నారు. కూతుళ్లు రోజా, స్వప్నలు స్వగ్రామం ఊడిమేశ్వరంలోనే సుమిత్ర తల్లిదండ్రుల వద్ద ఉంటూ అక్కడే చదువుకుంటున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుమిత్ర చిన్న కూతురు స్వప్నను తాండూరుకు తీసుకొచ్చింది. సెలవులు ముగియడంతో స్వప్నను స్వగ్రామం పంపిద్దామని గురువారం సుమిత్ర పాలిషింగ్ యూనిట్ నుంచి గంగోత్రి పాఠశాల ఎదురుగా తాండూరుకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడింది. అంతలోనే మృత్యురూపంలో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్న ఓ లారీ తల్లీకూతుళ్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు గాయపడ్డారు. అప్పటికే లారీ డ్రైవర్ పరారయ్యారు. స్థానికులు గమనించి వారిని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్వప్నను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారికి గుండె భాగంలో బలమైన గాయాలు కావడంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. తన కళ్లెదుటే కూతురు చనిపోవడంతో సుమిత్ర షాక్కు గురైంది. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆమె కూతురు స్వప్న మృతదేహంపై రోదించిన తీరు హృదయ విదారకం. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
రోడ్డు దాటుతున్న తల్లి, కూతురును లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడింది. తాండూరు శివారులోని పాలిషింగ్ యూనిట్లో పనిచేసే సునీత(30), ఆమె కూతురు స్వప్న(5) గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో స్వప్న అక్కడికక్కడే చనిపోగా సునీత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని తాండూరు ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు కారణమైన లారీని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండల కేంద్రంలోని గాంధీనగర్లో స్వప్న(32) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అడ్డుకోబోయిన భర్త వెంకటేశ్కు కూడా మంటలు అంటుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం స్వప్న పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భర్త వెంకటేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. -
నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డు పై వెళ్తున్న ఒంటరి మహిళలనే కాదు ఇంట్లో ఉన్న వారినీ వదలటం లేదు దొంగలు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సైదాబాద్ పూసలబస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కె. స్వప్న స్థానికంగా పైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. కాగా, సోమవారం వేకువజామున తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పారిపోయాడు. ఆమె తేరుకునేలోగానే గోడదూకి మాయమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాపాడాల్సినవాడే కడతేర్చాడు
జలచర జీవుల్లో ఓ మగ చేప ఆడ చేప పెట్టిన గుడ్లను నోటిలో భద్ర పరచుకుంటుంది. పిల్లలు అయ్యే దాకా ఆహారం కూడా తీసుకోదు. ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక మృత్యువాత కూడా పడుతుంది. తన సంతాన్ని కాపాడుకోవడానికి ఆ మగ చేప అంతటి త్యాగానికి సిద్ధమవుతుంది. కానీ కొందరు మనుషులు సభ్య సమాజం తలదించుకునేలా తమ సంతానాన్నే చేజేతులా బలి తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రవీందర్. కట్టుకున్న భార్య, రెండేళ్ల కూతుర్ని కర్కశంగా హతమార్చాడు. - అదృశ్యమైన తల్లి, కూతురు హత్య - బావతో కలిసి హత్యలకు పాల్పడిన భర్త - వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతన్న రాయికోడ్: మండలంలోని నాగన్పల్లి గ్రా మానికి చెందిన స్వప్న (23) ఆమె కూ తురు ఐశ్వర్య (2) అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన తల్లి, కూతురు హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న రాయికోడ్ విలేకరులకు తెలిపారు. రాయికోడ్ మండలం నాగన్పల్లి గ్రామానికి చెందిన బీ రవీందర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ అయిన వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వప్నను ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రవీందర్ తల్లిదండ్రులు కొడుకు, కోడలును తమ ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు. దీంతో గ్రామపెద్దలు సహకారంతో నాగన్పల్లిలో రవీందర్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంత కాలం తరువాత రవీందర్, అతని తల్లి లక్ష్మమ్మ, తండ్రి నాగయ్య కట్నం కోసం స్వప్నను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె 2013లో రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోంది. అప్పటికే గర్భిణి అయిన ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కూతురు ఐశ్వర్య వయస్సు రెండు సంవత్సరాలు. జహీరాబాద్ కోర్టులో అదనపు కట్నం వేధింపుల కేసుకు సంబంధించి వాదనలు కొనసాగుతుండగా రవీందర్ లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకున్నాడు. స్వప్న కాపురానికి అంగీకరించి రవీందర్తో నాగన్పల్లికి వెళ్లింది. రాజీ అనంతరం లోక్ అదాలత్పేషిలకు స్వప్న హాజరు కాకపోవడంతో ఆమె తల్లి సాంబ లక్ష్మి కూతురు ఏదీ అని స్పప్న తల్లిదండ్రులు అల్లుడి రవీందర్ను ప్రశ్నించారు. తనకు తెలియదని చెప్పడంతో ఈ నెల 20న రవీందర్పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్ను అరెస్ట్ చేసి విచారించగా తల్లి, కూతురు హత్యకు గురైనట్లు తేలింది. జోగిపేట మండలం నేరేడుకుంటకు చెందిన తన బావ కిష్టయ్యతో కలిసి మే 15న నాగన్పల్లి నుంచి స్వప్న నేరేడుకుంట సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. శవాన్ని అక్కడే తగులబెట్టి ఎముకలను మంజీర నదిలో కలిపేశారు. మే 18న అభం శుభం తెలియని చిన్నారి ఐశ్వర్య(2)ను నేరేడుకుంట గ్రామశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని అక్కడే తగులబెట్టినట్లు బావ, మరిది రవీందర్, కిష్టయ్య తమ విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ రఘు, స్థానిక ఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనివాస్, సికిందర్ ఉన్నారు. -
టిప్పర్ బీభత్సం.. NCC విద్యార్థిని మృతి!
-
సికింద్రాబాద్లో లారీ ఢీ కొని విద్యార్థిని దుర్మరణం
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పేరెడ్ గ్రౌండ్స్కు వెళ్తున్న విద్యార్థిని స్వప్నకు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికక్కడే మరణించింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సికింద్రాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో రైల్ నిలయం సమీపంలోని ఆర్ఆర్సీ గ్రౌండ్స్లో పేరెడ్ రిహారల్స్ జరుగుతున్నాయి. ఆ పేరెడ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా స్వప్న మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్సీసీ క్యాడెట్ అని పోలీసులు చెప్పారు. -
ప్రేమించి పెళ్లిచేసుకొని.. మోసంచేశాడని ఆత్మహత్య
నల్గొండ: ప్రేమించి పెళ్లిచేసుకొని కాపురానికి తీసుకెళ్లకుండా తనను మోసంచేశాడని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని గుండాల మండలం తేర్యాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వప్నలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆర్నేళ్లు కాపురం సజావుగా సాగాక ఆమెను సొంతూరుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నీతో సంబంధంలేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన స్వప్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె బంధువులు మృతదేహంతో శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
అన్ని భాషలను ప్రేమిద్దాం
* ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి పిలుపు * సాక్షి టీవీ జర్నలిస్టు స్వప్నకు యంగ్ ఇండియా అవార్డు సాక్షి, చెన్నై: తెలుగు, తమిళం అన్న భేదాలు లేకుండా భాషలన్నింటినీ ప్రతి ఒక్కరూ ప్రేమించాలని ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి పిలుపునిచ్చారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని రాణి సీతై హాల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరిట అమ్మ యంగ్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. జయలలిత 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిలీప్ రెడ్డి, అపోలో ఆస్పత్రి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి హాజరై అవార్డులను ప్రదానం చేశారు. సినీ, మీడియా, స్వచ్ఛంద, సామాజిక, క్రీడా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు గుర్తింపునిస్తూ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సినీ రంగంలో నటి కాజల్ అగర్వాల్కు యంగ్ ఇండియా (స్పెషల్ అవార్డు) అవార్డును ప్రకటించారు. అయితే, ఆమె రాలేని కారణంగా ముందుగానే అవార్డును అందజేశారు. సినీ తారలు విమలారామన్, మధుషాలినీ, అక్ష పర్వసాని, షాలినీ నాయుడులకు, జర్నలిజం కేటగిరిలో స్వప్న (సాక్షి టీవీ), కాజల్ అయ్యర్ (టైమ్స్ నౌ ), మేగా మామ్గైన్( సీఎన్ఎన్ఐబీఎన్), కత్తి కార్తిక (వి 6), దీప్తి వాజ్పేయి (టీవీ-9), పబ్లిక్ సర్వీస్ కేటగిరిలో ఆదాయ పన్ను శాఖ అధికారిని జె.ఎం.జమునాదేవి (ఐఆర్ఎస్), సోషల్సర్వీస్ కేటగిరిలో అశ్విని అంగాడి (సోషల్ వర్కర్), స్పోర్ట్స్ కేటగిరిలో శైలజ (క్రికెటర్), ఔత్సాహిక ప్రతిభ కేటగిరిలో వీణా ఘంటసాల, తంతి టీవీ జర్నలిస్టు శాంతికి ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్రెడ్డి మాట్లాడుతూ..భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. ఎక్కడ మహిళలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రసంగిస్తూ.. తమిళనాడులోని తెలుగు వారికి ఏపీ, తెలంగాణలోని తెలుగు వారు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
తల్లీ కూతుళ్ల బలవన్మరణం
ఘట్కేసర్/బచ్చన్నపేట : ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ తల్లి.. తన కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్కు అర కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్నగర్కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. వీరు హైదరాబాద్లోని ముషీరాబాద్లో నివసిస్తు న్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇదిలాఉండగా సాయంత్రం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర రైల్వే ట్రాక్పై తల్లీకూతురు విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. ముఖం గుర్తించలేని స్థితిలో ఉంది. చిన్నారికి కూడా గాయాలు ఉన్నాయి. దీంతో తల్లీకూతుళ్లు గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామారావు తెలిపారు. -
నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారో..!
‘‘ఆ అబ్బాయి మంచివాడే, ఈ పిల్లకే పొగరెక్కువ. అందుకే కాపురం చెడగొట్టుకుని ఉంటుంది’’... ఈ మాట విన్నప్పుడు మనసుకు తగిలిన గాయం, అతడు చేసిన గాయం కంటే ఎక్కువ బాధపెట్టింది. ఆడపిల్ల ఆత్మవిశ్వాసం ఈ సమాజానికి ఎప్పుడూ పొగరుగానే ఎందుకు కనిపిస్తుందో అర్థం కాదు నాకు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదివాను. మంచి ఉద్యోగం సంపాదించాను. ఎవరిమీదా ఆధారపడకుండా బతుకుతున్నాను. ఎవరి దగ్గరా ఏదీ ఆశించను. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా భావాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాను. అది నా ఆత్మవిశ్వాసంతో వచ్చిన గట్టిదనమే తప్ప, అహంకారంతో వచ్చిన తలపొగరు కాదు. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. అర్థం కాకపోయినా నేను ఫీలవ్వలేదు... ఒక్కసారి తప్ప. అన్ని విషయాల్లోనూ తప్పుబట్టినా బాధనిపించలేదు కానీ, నా భర్తతో విడిపోయినప్పుడు తప్పుబడితే తట్టుకోలేకపోయాను. బాధగా ఉండదా మరి! నేనే తప్పూ చేయలేదు.మంచివాడని నమ్మాను. ప్రేమగా చూసుకుంటాడనుకున్నా. కానీ మోసగాడని, హింసిస్తాడని ఊహించలేదు. మగాడినన్న అహంకారాన్ని నిలువునా నింపుకుని మనసును, తనువును తూట్లు పొడుస్తుంటే తట్టుకోలేకపోయాను. తన వివరాలన్నీ తప్పుగా చెప్పి మోసం చేశాడని తెలిసి సహించలేకపోయాను. నిలదీస్తే అరిచాడు. బతిమాలితే కాదు పొమ్మన్నాడు. నీ పద్ధతి సరిగ్గా లేదు అని చెప్పబోతే తిరిగి నా మీదే లేనిపోని నిందలు వేశాడు. నన్నే చెడ్డగా చిత్రీకరించాలనుకున్నాడు. అయినా నేను నోరు మూసుకునే ఉండాలా! ఉంటే మంచిదాన్నని అని ఉండేవారా? మంచి సర్టిఫికెట్ ఎప్పుడిస్తారు? ఏం చూసి ఇస్తారు? చిత్రహింసలు పెట్టినా మౌనంగా భరించేస్తే మంచిదాన్ని అంటారా! కన్నీళ్లను దిగమింగుకుని కాళ్ల దగ్గర పడివుంటే అంటారా! ఇలా మాట్లాడినా కూడా తప్పనే అంటారు. అయినా వాళ్లంతా ఏమనుకుంటే నాకేంటి? బాధ నాది. బతుకు నాది. దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరమూ నాదే. అవతలివాడు దెబ్బ కొట్టాడు అంటే ఆ తప్పు అతడిది కాదు, కొట్టే అవకాశం ఇచ్చిన మనది అని భావిస్తాను నేను. అందుకే ఇంకా దెబ్బలు తినడం మంచిది కాదని అనుకున్నాను. అతడి నుంచి విడిపోవడమే మేలని నిశ్చయించుకున్నాను. అప్పుడు వినబడిందే ఆ మాట. నేనే కాపురం చెడగొట్టుకుని ఉంటానని కొందరి సందేహం. ఎవరైనా కావాలని చెడగొట్టుకుంటారా? అయినా ఏం తెలుసని అంత మాట అంటారు! అతడు పెట్టిన హింసను చూడలేదు. అది తాళలేక నేను పెట్టిన కన్నీటి నీ లేదు. కానీ నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకునేసరికి కామెంట్లు చేయడానికి సిద్ధమైపోయారు. చాలా బాధపడ్డాను. కానీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటం అనవసరం కూడా. ఎందుకంటే... ఎదుటివాడి కష్టాన్ని వాడి స్థానంలో ఉండి చూడగలిగే గొప్ప మనసు ఎవరికోగానీ ఉండదు. ఆ మనసే లేనప్పుడు ఎన్ని చెప్పి ఏం లాభం! కానీ నన్ను ఆ మాట అన్నవాళ్లందరినీ ఒక్కటే ప్రశ్న అడుగుతాను. నా స్థానంలో మీ కూతురో లేక మీరో ఉండి ఉంటే కూడా ఇలాగే ఆలోచిస్తారా? తప్పు మీ మీదే వేసుకుంటారా?! - స్వప్న, రావులపాలెం -
కులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి కర్కశత్వం
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తండ్రే దారుణంగా చంపాడు. తుంగతుర్తి మండలం గానుగుబండతండాలో ఈ సంఘటన జరిగింది. స్వప్న అనే అమ్మాయిని ఆమె తండ్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. స్వప్న వివాహం మూడు వారాల క్రితం జరిగినట్టు సమాచారం. కుమార్తె ఇంటికి రాగా తండ్రి ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. -
నాన్నకు అప్పులు తీరకూడదు!
వేదిక ‘నాన్నకు ఇంకా నాలుగైదేళ్లవరకూ అప్పులు తీరకూడదు..’ ఇదేం కోరిక.. అనుకుంటున్నారా! అవును. ఇలాంటి కోరిక ఏ కూతురూ కోరుకోదు. కానీ, నాకు తప్పడం లేదు. విషయం ఏంటంటే... మేం గంగిరెద్దులోళ్లం. మాలో ఇప్పటికీ బాల్యవివాహాల సంప్రదాయం ఉంది. బాల్యవివాహాలంటే... పదిహేనేళ్లకు, పదహారేళ్లకు పెళ్లిళ్లు చేయడం అనుకుంటారేమో! పదేళ్లకంటే ముందే నిశ్చితార్థం చేసేసుకుని వారికి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసేస్తారన్నమాట. మాది నల్గొండ జిల్లా. నాన్న గంగిరెద్దులను తిప్పుతాడు. అమ్మ వ్యవసాయం పనికి పోయేది. నాలుగేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకి వచ్చేశాం. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న. పెద్దక్కకు పద్నాలుగేళ్లకు, చిన్నక్కకు పదిహేనేళ్లకు పెళ్లి చేశారు. వాళ్లిద్దరినీ చదివించలేదు. నన్ను మాత్రం అమ్మ స్కూల్లో చేర్పించింది. నాకు మూడేళ్ల వయసున్నప్పుడు మా బంధువులబ్బాయితో నిశ్చితార్థం చేసేశారు. నేను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎప్పుడూ నాతో ‘‘చదువుపై నీకున్న శ్రద్ధ నిన్ను మంచి స్థాయికి తీసుకెళుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో చదువు మాత్రం ఆపకు..’’ అనేవారు. నా కోరిక కూడా అదే. ఊహ తెలియకముందే నిశ్చయమైన నా పెళ్లిని మూడుముళ్ల వరకూ తీసుకెళ్లడానికి మా నాన్నకు అప్పులు అడ్డొచ్చాయి. లేదంటే నా చదువు పదో తరగతి వరకూ కూడా వచ్చేది కాదు. నేను చాలాసార్లు అమ్మతో నా బాధ చెప్పాను. ఎన్ని తిప్పలు పడైనా డిగ్రీ చదవాలన్నది నా లక్ష్యం. ఇంట్లో అమ్మానాన్న నా పెళ్లికి కావాల్సిన డబ్బు గురించి మాట్లాడుకుంటూ...అక్కల పెళ్లిళ్లకు అయిన అప్పులు తీర్చిన తర్వాతే నా పెళ్లి చేయాలని అనుకోవడం విన్నాను. అప్పటి నుంచి నేను ప్రతిరోజూ ఇప్పట్లో నాన్న అప్పులు తీరకూడదని దేవుడికి మొక్కడం మొదలుపెట్టాను. పైగా నన్ను చేసుకోబోయేవాడు ఏ పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడట. అమ్మ మాటిమాటికీ నాన్నతో ‘పిల్లాడు ఏదో ఒక పనిలో కుదిరితేనే పెళ్లి చేసేది’ అనేది. ‘పనిలో కుదరకపోతే పెళ్లి చేయవా..ఏంది. పెళ్లి అయినంక వాడే పనిలోకి పోతడు. ఐదెకరాలు పొలముంది, సొంతిల్లుంది. పని చెయ్యకుంటే గడవదా వాడికి. మనకంటే పైస ఆస్తి లేదు కాబట్టి మనిద్దరం ఇట్ల తిప్పలపడుతున్నం. రేపొద్దుగాల నా బిడ్డకు ఆ ఖర్మ లేదు’’ అంటూ నావైపు గర్వంగా నాన్న చూసిన చూపులు గుండెలో ముల్లులా గుచ్చుకునేవి. చదువు లేదు, కొలువు లేదు. ఏదో అమ్మానాన్నల మాట నిలబెడదామనుకోడానికి చదువుపై నా కోరిక కూడా తీరలేదు. అందుకే ఓ నాలుగైదు ఏళ్లవరకూ నాన్నకు అప్పులు తీరకపోతే ఆలోగా నేను డిగ్రీ పూర్తిచేసి ఏదైనా ఉద్యోగంలో చేరిపోతాను. అప్పటికి మా అమ్మానాన్నల మనసు మార్చగలనన్న నమ్మకం నాకుంది. నా మాటలు అందరూ నమ్మకపోవచ్చు కాని... మా గంగిరెద్దులోళ్ల ఇళ్లలో ఆడపిల్ల పుట్టగానే మెట్టినింటి చిరునామా చూపే సంప్రదాయం ఇంకా ఉంది. - బి. స్వప్న, రంగారెడ్డి జిల్లా -
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం
కీసర, న్యూస్లైన్: నాగారం, దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగారం గ్రామంలో మంగళవారం కౌకుట్ల అనంతరెడ్డి, అన్నంరాజు అర్చన సర్పంచ్కు నామినేషన్లు దాఖలు చేశారు. 49 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, 18 వార్డు స్థానాలకు గాను 154 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మధుసుదన్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. దమ్మాయిగూడలో... దమ్మాయిగూడలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్గా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు, 16 వార్డు స్థానాలకు గాను 80 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. జవహర్నగర్లో మొత్తం 276 నామినేషన్లు జవహర్నగర్: జవహర్నగర్లో మంగళవారం చివరిరోజు వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్మేలాలతో వెళ్లి నామినేషన్లు వేశారు. జవహర్నగర్ దళిత నాయకుడు యాకస్వామి వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటాపురం రాంచందర్ (చందు) టీడీపీ రాష్ట్ర నాయకుడు మల్లారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నక్క ప్రభాకర్గౌడ్, గ్రామ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 23 మంది, 20 వార్డులకు గాను 253 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శంషాబాద్లో... శంషాబాద్: శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 20 వార్డులకుగాను 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డు సభ్యులకు తీవ్ర పోటీ నెలకొంది. 1వార్డు జనరల్ స్థానానికి అత్యధికంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2వ వార్డులో 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేత నామినేషన్ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు రాచమల్ల దాసు జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్గుప్తా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపామల్లేష్, ఎంపీటీసీ అభ్యర్థులు డి. వెంకటేష్గౌడ్, వై.సురేష్గౌడ్, జహంగీర్ఖాన్.వై కుమార్ తదితరులున్నారు. -
గృహిణి సజీవ దహనం
=ఆత్మహత్య చేసుకుందంటున్న భర్త = అల్లుడే నిప్పుపెట్టాడంటున్న మామ ఆటోనగర్, న్యూస్లైన్: అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి సజీవదహనమైంది. ఆత్మహత్మ చేసుకుందని భర్త చెప్తుండగా... అల్లుడే తమ కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం పోలీసులు, మృతురాలి భర్త కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన గుంపులి స్వప్నకు కర్నూల్ జిల్లాకు చెందిన కిరణ్తో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ప్రస్తుతం వీరు వనస్థలిపురం గాంధీనగర్లో ఉంటున్నారు. స్వప్న బీటెక్.. కిరణ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా, భర్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన స్వప్న శనివారం ఉదయం 6 గంటలకు పడకగది నుంచి వేరే గదిలోకి వెళ్లింది. తలుపులు వేసుకొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. విషయం గమనించిన భర్త వెంటనే గది తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో కిటికీ అద్దాలు పగలగొట్టి రక్షించేందుకు ప్రయత్నించాడు. తర్వాత ఇరుగు పొరుగు సహాయంతో తలుపులను పూర్తిగా ధ్వంసం చేసి లోపలికి వెళ్లే సరికి స్వప్న పూర్తిగా కాలి బూడిదై ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, కిరణే తన కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని స్వప్న తండ్రి వీరాస్వామి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఘట్కేసర్, న్యూస్లైన్ : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలంలోని పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్నకు ఇదే జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న ఇచ్చి వివాహం చేశారు. ఈ సందర్భంగా స్వప్న తల్లిదండ్రులు కట్నకానుకల కింద వెంకన్నకు ఐదు తులాల బంగారం, *3.50 లక్షల నగదు, *50వేల విలువ చేసే ఇంటి సామగ్రి, ఫ్యాషన్ప్లస్ బై క్ను ఇచ్చారు. అయితే ఉపాధి పనుల కోసం వెంకన్న, స్వప్న దంపతులు ఆరునెలల క్రితం ఘట్కేసర్ మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా వెంకన్న స్థానిక ఐటీసీ కంపెనీలో హమా లీగా చేరాడు. అయితే కొద్దిరోజుల నుంచి వెంకన్న తనకు *50వేలు అదనపు కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతం సాయంత్రం 5 గంటలకు వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగాఆమె స్పందించలేదు. అనుమానం చెందిన వెం కన్న ఇంటికి వచ్చి చూసే సరికి స్వప్న ఫ్యాన్కు ఉరి వేసుకుంది. దీంతో వెంకన్న కాలనీవాసుల సాయంతో స్వప్నను కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వప్న అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిం చారు. కాగా, మల్కాజ్గిరి ఏసీపీ చిన్నయ్య కూ డా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన స్వప్న ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు. అల్లుడు వెంకన్న అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతోనే తమ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఐఏఎస్ ఇంటి ముందు భార్య ధర్నా
ఇద్దరూ ఆడపిల్లలే జన్మించినందుకు విడాకులివ్వాలని తన భర్త వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి, విశాఖ జీసీసీ ఎండీ రమేష్ కుమార్ భార్య స్వప్న శుక్రవారం ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. ఆమెకు మద్దతుగా ఐద్వా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన స్వప్నకు 2001లో రమేష్ కుమార్తో వివాహమైంది. తనకు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది. తనను, తన పిల్లలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మగబిడ్డ కోసం తన భర్తకు మరో పెళ్లి చేసేందుకుగాను విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నట్టు వాపోయింది. తనకు న్యాయం చేయాల్సిందిగా పలువురు అధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని స్పప్న చెప్పింది. తన పిల్లలు, తాను కష్టాలు పడుతున్నామని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. -
మాతృత్వపు ఔన్నత్యం
నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకునిగా మారి తీసిన తొలి చిత్రం ‘అమ్మా! నీకు వందనం’. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఎవరెన్ని విధాలుగా చూపించినా అమ్మలోని గొప్పతనాన్ని ఎవ్వరూ సంపూర్ణంగా ఆవిష్కరించలేరు. అమ్మ గొప్పతనాన్ని, మాతృత్వపు ఔన్నత్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తీశాం. గర్భశోకం కన్నా గర్భకోశం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానం ఇది. జాతీయ స్థాయిలో పురస్కారాలు గెలుచుకునే సత్తా ఉన్న కాన్సెప్ట్ ఇది. కెమెరామేన్ కోట తిరుపతిరెడ్డి నాకు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంతా కథానాయిక స్వప్నే. అన్నారు.