technical issues
-
సర్వర్లు పనిచేయవు...వెబ్సైట్ ఓపెన్ కాదు!
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి వెబ్సైట్లోనే అప్డేట్కు అవకాశం తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్సైట్లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. -
టీఐఎస్లో సాంకేతిక సమస్యలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కోసం ఆన్లైన్లో వివరాల నమోదుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాల వారీగా ఈ నెలాఖరులోగా వివరాలను అప్లోడ్ చేయాలని చెప్పడంతో ఉపాధ్యాయులు అదే పనిలో ఉన్నారు. అయితే, సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పని చేయకపోవడంతో ఇప్పటివరకు 20 శాతం మంది ఉపాధ్యాయులు కూడా తమ వివరాలను అప్డేట్ చేయలేకపోయారు. మరోవైపు వెబ్సైట్లోకి వెళితే ఆరు నెలల క్రితం నమోదు చేసిన అంశాలు కూడా ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో పాత వివరాలతోపాటు తాజా వివరాలను సైతం నమోదు చేద్దామంటే వెబ్సైట్ పనిచేయడం లేదని, సమస్యను పరిష్కరించి తమకు మరికొంత గడువు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్)లో రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్, విద్యార్హతలు, ఇప్పటి వరకు పొందిన పదోన్నతులు, బదిలీలు వంటి 136 వివరాలను నమోదు చేయాలి. అలాగే డిపార్ట్మెంటల్ టెస్టుల వివరాలను గెజిట్ నంబర్లతో సహా నమోదు చేయాలి. వీటి ఆధారంగానే వచ్చే ఏడాది పదోన్నతులు, బదిలీలు చేపడతారు. ఈ క్రమంలో తమ వివరాలు నమోదుకు మరికొంత గడువు పెంచాలని కోరుతున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచాలి సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పనిచేయడం లేదని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్విసు వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు వీలుగా టీఐఎస్ సర్వర్ సామర్థ్యాన్ని పెంచాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఒకేసారి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేందుకు సన్నద్ధం కావడంతో సంబంధిత టైటిల్స్ తెరుచుకోవడం లేదన్నారు. ఒకవేళ వెబ్సైట్ తెరుచుకున్నా గతంలో నింపిన వివరాలు తొలగిపోకుండా చూడాలని కోరారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం కెపాసిటీని పెంచి వివరాల నమోదుకు గడువు పొడిగించాలని, అలాగే మొబైల్ వెర్షన్ కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. -
స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు
పట్నా/చెన్నై: సాంకేతిక లోపాలు తలెత్తడంతో సోమవారం స్పైస్జెట్కు చెందిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఒకటి ఢిల్లీ–షిల్లాంగ్ సరీ్వసు కాగా, మరోటి చెన్నై–కోచి విమానం. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్కు టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అధికారుల సూచనల మేరకు ఉదయం8.52 గంటల సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్జెట్ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా, చెన్నై నుంచి కోచికి 117 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్బుక్కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
నత్తనడకన ఈ–కేవైసీ
సాక్షి, అమరావతి: దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్లోనే..ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది. ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ కూడా పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయక పోవడం తదితర సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగింది. కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును సెపె్టంబర్ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు. 7వ తేదీ వరకు ఆధార్ దిద్దుబాటుకు అవకాశంఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్డేటెడ్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. సూపర్ చెక్ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్ఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్లు పంపించనున్నారు. -
నేడు ఖాళీగా స్టార్లైనర్ తిరుగుప్రయాణం
కేప్కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్లైనర్లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్కు వీలుగా శుక్రవారం స్టార్లైనర్ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
ఎర్రర్..టైమ్ అవుట్!
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ సతాయింపులు, సర్వర్ సమస్యలు గురుకుల కొలువుల అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) విఫలమైంది. దీంతో వేలాది మంది దరఖాస్తుకు దూరం కావాల్సిన పరిస్థితి దాపురించింది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) కొలువులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. కానీ గడువు ముగిసే చివరి నిమిషంవరకు సాంకేతిక సమస్యలు వెంటాడాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. బోర్డు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించని అధికారులు, గడువు తేదీ పొడిగింపుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో రెండ్రోజుల్లో మ్యూజిక్ టీచర్, టీజీటీ దరఖాస్తు ప్రక్రియ సైతం ముగియనుంది. అప్పటివరకు ఇవే సమస్యలు పునరావృతమైతే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఎదురుకానుంది. తొలిరోజు నుంచీ ఇదే తీరు... టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తొలిరోజు నుంచే కొనసాగుతూ వచ్చాయి. రాష్ట్ర గురుకుల సొసైటీల పరిధిలోని 9,231 ఉద్యోగాల భర్తీకి గత నెల 5వ తేదీన బోర్డు ఏకకాలంలో 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెల 17వ తేదీ నుంచి గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించింది. నెల రోజుల పాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ముందుగా వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటీఆర్ నమోదు, ఆ తర్వాత దరఖాస్తుల సమర్పణకు ఉపక్రమించిన అభ్యర్థులకు గురుకుల వెబ్సైట్ చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్ సతాయింపుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీతో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగియగా.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా గురుకుల పాఠశాలల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియగా.. సాంకేతిక సమస్యలు కొనసాగడంతో దీనికీ మెజారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొందరైతే ఫీజులు చెల్లించినప్పటికీ దరఖాస్తును సబ్మిట్ చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. వివరాలు ఎంట్రీ చేశాక ఎర్రర్! గురుకుల వెబ్సైట్లో ప్రధానంగా రెండు దశల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఓటీఆర్ నమోదుకు సంబంధించి ఆధార్ వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే వివరాల పేజీ తెరుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎర్రర్ అంటూ డిస్ప్లే అవుతుండటంతో తిరిగి వెబ్పేజీని తెరవాల్సివస్తోంది. ఇలా పలుమార్లు ప్రయతి్నస్తేనే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయగలిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొందరైతే ఓటీఆర్ నమోదుకే రోజుల తరబడి ప్రయత్నించినట్లు తెలిపారు. ఓటీఆర్ నమోదు తర్వాత ఫీజు వివరాలను నమోదు చేయా ల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులో వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే సమయంలో సర్వర్ ఎర్రర్, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటూ వస్తోంది. మెజారిటీ అభ్యర్థులకు ఇదే అనుభవం ఎదురవుతుండడంతో గురుకుల బోర్డు హెల్ప్ డెస్్కకు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. కానీ హెల్ప్డెస్క్కు ఫిర్యాదులు, వినతులతో ఉపయోగం లేదని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన పీజీటీ అభ్యర్థి ఎస్.పాండురంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు గడువు పెంపు లేనట్టే..! కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును గురుకుల బోర్డు పెంచలేదు. దీంతో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు విషయంలోనూ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారు. -
గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’! హెల్ప్డెస్క్ ఉంది.. కానీ, సాయం అందదు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల దరఖా స్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. నోటిఫికేషన్లు జారీచేసి నెలైనా సాంకేతిక సమస్యలు తీరకపోవ డంతో ఆభ్యర్థులు సతమతమవుతున్నారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భా వించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు గత నెల 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి. ‘దరఖాస్తు’కే చుక్కెదురు.. సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్సైట్ను తెరవడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్నంబర్, ఈ–మెయిల్తో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం పట్టింది గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది. – డి.నర్సింగ్రావు, కొడంగల్, వికారాబాద్ జిల్లా ఓటీఆర్ నమోదు కాక దరఖాస్తుకు దూరమయ్యాను ఓటీఆర్ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్ట్యాంక్లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి. – చీపురు ప్రవీణ్కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా -
అధిక పెన్షన్ ఆప్షన్కు ఆఖరు మే 3.. కానీ పాస్బుక్ ఎర్రర్! ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్ గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తోంది. కానీ ఇప్పటికీ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలు తీరలేదు. అధిక పెన్షన్ అర్హత అవకాశాలు, అధిక పెన్షన్ లెక్కింపు సూత్రం తేలలేదు. కొత్త పాస్బుక్ డౌన్లోడ్కు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ అంశాలను ఈపీఎఫ్ఓ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. చాలా మంది చందాదారులు అధిక పెన్షన్కు దరఖాస్తు సైతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆప్షన్ ఇచ్చేందుకు మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది. పాస్బుక్.. ఎర్రర్.. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ సరికొత్త పాస్బుక్ను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగి సర్వీసులో చేరిన తేదీ, నాటి బేసిక్, డీఏ ఆధారంగా పీఎఫ్ చెల్లింపులు, సర్విసు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పలు అంశాలను జోడిస్తూ ఈ పాస్బుక్ను అప్డేట్ చేసింది. దాదాపు నెలన్నర నుంచి కొత్త పాస్బుక్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి.. కొత్త పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ చాలామంది చందాదారులకు లాగిన్ అయ్యాక పాస్బుక్ డౌన్లోడ్ అప్షన్ ఎంచుకుంటే వెబ్పేజీ ఎర్రర్ వస్తోంది. చాలాసార్లు ప్రయత్నించినా డౌన్లోడ్ కావడం లేదు. అధిక పెన్షన్లో కీలకమైంది ఈపీఎస్ (ఎంప్లాయి పెన్షన్ స్కీం) చెల్లింపునకు సంబంధించిన సమాచారమే. ఉద్యోగి పొందుతున్న పూర్తిస్థాయి వేతనానికి అనుగుణంగా ఈపీఎస్ చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ చెల్లింపుల్లో తేడాలుంటే అందుకు సంబంధిత కంపెనీ బాధ్యత వహించి చెల్లింపులు సర్దుబాటు చేయాలి. కొత్త పాస్బుక్లు డౌన్లోడ్ కాకపోవడంతో.. చాలామంది అధికపెన్షన్ దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు మరోవైపు పేరా 26(6) ఆప్షన్ ఫారం (ఉద్యోగంలో చేరినప్పుడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక పత్రం)ను ఇప్పుడు అధిక పెన్షన్ దరఖాస్తుకు తప్పకుండా జోడించాలని నిబంధన పెట్టారు. ఉద్యోగంలో చేరి చాలా ఏళ్లు గడిచిన వారికి ఈ ఫారం అందుబాటులో లేక దరఖాస్తు చేసుకోలేదు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలోనూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ఓ అధికారులకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తులకు మరింత సమయం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈపీఎఫ్ఓ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్లోనే కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్లోని ఎన్ఐఎస్ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
జేమ్స్ వెబ్కు సాంకేతిక సమస్య
వాషింగ్టన్: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేటరీ అయిన జేమ్స్ వెబ్లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న జేమ్స్ వెబ్లో ఇలాంటి సమస్య రావడం ఇది రెండోసారి. అందులోని అత్యంత కీలకమైన నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్, స్లిట్లెస్ స్పెక్ట్రోగ్రాఫ్ పరికరాల్లో సమాచార అంతరాయం నెలకొంది. దాంతో సంబంధిత సాఫ్ట్వేర్ మొరాయించింది. అయితే హార్డ్వేర్లో ఎలాంటి సమస్యలూ తెలెత్తిన సూచనలు లేకపోవడం ఊరటనిచ్చే విషయమని నాసా పేర్కొంది. ఇన్ఫ్రారెడ్ ఇమేజర్ మాత్రం ప్రస్తుతానికి పని చేయడం లేదని ధ్రువీకరించింది. సమస్యను కనిపెట్టి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో తయారు చేసిన జేమ్స్ వెబ్ గత ఆగస్టులో కూడా ఇలాగే మొరాయించింది. దాని మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. బహుశా ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్దవైన అంతరిక్ష పదార్థాలు కెమెరా లెన్స్ను గుద్దుకోవడమే రెండోసార్లూ సమస్యకు కారణమైందని నాసా భావిస్తోంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
వాట్సాప్ సేవలకు అంతరాయం
-
మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్యూవీ700 కార్లను మరోసారి రీకాల్ చేసింది. ఏడబ్యుడీ వేరియంట్లలో ఈసారి రీకాల్ ప్రధాన భాగం భర్తీ కోసంవాహనాలను వెనక్కి తీసుకుంటోంది. నెలరోజుల్లోలనే వాహనాలను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ప్రొపెల్లర్ షాఫ్ట్ సమస్య కారణంగా మహీంద్ర ఎక్స్ యూవీ 700 కార్లను ఇటీవల రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. రియర్ వీల్ కాయిల్ స్ప్రింగ్ల ప్రస్తుత ప్లేస్మెంట్లో ఉన్న సమస్యల కారణంగా మహీంద్ర ఈ రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. XUV700 AWDలోని వెనుక చక్రాల కాయిల్ స్ప్రింగ్లు ప్రతి స్ప్రింగ్లో 9 రౌండ్ కాయిల్స్ ఉండేలా మార్పులు చేసింది. అయితే 9 కి బదులుగా 8 రౌండ్ కాయిల్స్ ఉంటే, ఆ కార్లను కొత్త స్ప్రింగ్లతో భర్తీ చేసేందుకు సమీపంలోని సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని మహీంద్ర కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రభావిత వాహనాల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. కాగా మహీంద్రా ఎక్స్యూవీ700 2021లో లాంచ్ అయిన పాపులన్ మోడల్. కొన్ని వేరియంట్ల నిరీక్షణ సమయం ఒక సంవత్సరం అంటే దీన్ని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 70వేల ఎక్స్యూవీ700 కార్ల డెలివరీలు పెండింగ్లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజుకర్ ఇటీవల వెల్లడించారు. 5 సీట్లు , 7 సీట్ల ఎంపికలతో లభిస్తున్న ఈ కారు ధర 13.18 లక్షలు,(ఎక్స్-షోరూమ్) ప్రారంభం. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
సాంకేతిక సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ పరిస్థితులు లేదా విద్రోహ చర్యల వల్ల తలెత్తబోయే ప్రమాదాలను రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంలో నెలకొన్న సాంకేతిక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే.. ఇప్పుడు ఈ విషయంలో స్టార్టప్ కంపెనీల సాయం కోరుతోంది. ఈ మేరకు రూ. 3 కోట్ల వరకు ఆర్థికసాయం, మేధోహక్కుల కల్పన వంటి అంశాలతో కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై దక్షిణమధ్య రైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు బృందంతో చర్చించింది. తొలుత 11 రకాల సమస్యలను స్టార్టప్ల ముందుంచింది. దీనికి టీ–హబ్ సానుకూలంగా స్పందించింది. 11 సమస్యలు ఇవే.. 1. విరిగిన పట్టాను గుర్తించే సాంకేతికత కావాలి. 2. పట్టాలపై ధ్వంసమయ్యేంత ఒత్తిడి ఉంటే ముందుగానే గుర్తించగలగాలి. 3. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపు సమస్యను అధిగమించే ఏర్పాటు కావాలి. 4.రైల్వే ట్రాక్ తనిఖీలో కచ్చితత్వం ఉండే వ్యవస్థతోపాటు అన్ని లోపాలను సులభంగా గుర్తించే సాంకేతికత కావాలి. 5. అధిక బరువు వల్ల వ్యాగన్ల చక్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే దాన్ని ముందే గుర్తించే వ్యవస్థ కావాలి. 6. ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్కు సంబంధించి 3 ఫేజ్ కరెంటును వాడే వాటిల్లో సమస్యలు ఆన్లైన్లో గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయాలి. 7. గూడ్సు రైళ్లలో ఎక్కువ సరుకు పట్టేలా వ్యాగన్లను ఎలా మార్చాలి. 8.ట్రాక్ను మెరుగ్గా శుభ్రం చేసే సులభ విధానం కావాలి. 9. సిబ్బందికి పునఃశ్చరణ కోర్సులకు సంబంధించి యాప్లు రూపొందించాలి. 10.వంతెనల తనిఖీ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా జరిగేలా సాంకేతికత రూపొందించాలి. 11. ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం డిజిటల్ వ్యవస్థ కావాలి. -
ట్విటర్ వేదికగా ఫ్లిప్కార్ట్పై యూజర్ల ఆగ్రహం..?
నిన్న(జనవరి 3) మధ్యాహ్నం సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన చాలా మంది వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. కస్టమర్లు ఫ్లిప్కార్ట్ను యాక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టెక్నికల్ సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. కొందరు వినియోగదారులకు "దయచేసి మళ్లీ ప్రయత్నించండి" అనే పాప్-అప్ ఫ్లిప్కార్ట్ హోమ్ పేజీలో కనిపించింది. ఇంకా చాలా మంది వినియోగదారులు ఆర్డర్లకు సంబంధించిన లావాదేవీ చరిత్రను యాక్సెస్ చేసుకోలేకపోయారు. downdetector.in ప్రకారం, 59 శాతం మంది వెబ్సైట్ వినియోగదారులు ఫ్లిప్కార్ట్ను యాక్సెస్ చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటే, 24 శాతం మంది యాప్ వినియోగదారులు ఫ్లిప్కార్ట్ను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైట్ హీట్ మ్యాప్ ప్రకారం.. ఢిల్లీ, లక్నో, చండీగఢ్, జైపూర్, పాట్నా, కోల్ కతా, కటక్, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, మదురై, ముంబై, నాసిక్, అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందిన వినియోగదారులు ఫ్లిప్కార్ట్ను యాక్సెస్ చేసుకోవడంలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్య గురుంచి ట్విటర్ వేదికగా నివేదిస్తూ చాలా మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 ఇదే మొదటి సర్వర్ డౌన్ సమస్య అని కార్తీక్ పటేల్ కామెంట్ పెడితే, మరొక యూజర్ Something Went Wrong! అని పోస్టు చేశాడు. ఇంకొక యూజర్ ఈ సమస్యకు సంబంధించిన వీడియో పోస్టు చేశాడు. It's first service down in 2022 , That's technical issue in @Flipkart , i hope that's not only in my phone, any one else suffering for this ?? #Flipkart #flipkartdown #FLIPKARTDOWN pic.twitter.com/1LEcJZE4b0 — Kartik Patel (@kartikpatel5797) January 3, 2022 Something Went Wrong! 🥲 *to wallmart #FlipkartDown pic.twitter.com/sstsWyRPYT — Oyprice (@OyPrice) September 14, 2021 @Flipkart I'm not able to search anything in Flipkart Shopping App, It always showing "Something went wrong, content not found". Also tried tapping on "retry button". pic.twitter.com/4I53FBM2bq — Debadri Saha (@debadri95) January 3, 2022 -
Telangana: ధరణి.. దారికెన్నడో?
ఈ రైతు పేరు గంగుల శ్రీనివాస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుమ్ముడూరుకు చెందిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి (సర్వే నంబర్ 287/110లో ఒకటిన్నర ఎకరం, 287/133లో అర ఎకరం)ని అసైన్ చేసింది. దానికి పాస్బుక్లు కూడా ఉన్నాయి. మొదట్లో శ్రీనివాస్ తాత, తర్వాత తండ్రి, పినతండ్రి, ఇప్పుడు శ్రీనివాస్ ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవలి భూరికార్డుల ప్రక్షాళన తర్వాత శ్రీనివాస్కు కొత్త పాస్బుక్ ఇవ్వలేదు. అధికారుల ఆదేశాల మేరకు ఈ సర్వే నంబర్లో భూమిని మరోసారి సర్వే చేశారు కూడా. పాస్బుక్ కోసం కలెక్టర్, తహసీల్దార్ల వద్దకు వెళితే.. సమస్య సీసీఎల్ఏలో పెండింగ్లో ఉందని, ధరణి పోర్టల్లో మార్పులు చేస్తేగానీ పరిష్కారం కాదని అంటున్నారు. ఈ చిత్రంలోని రైతు అనాసి శ్రీనివాస్కు పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లలోని సర్వే నంబర్ 68లో ఎకరం భూమి ఉంది. తాతల కాలం నుంచి కాస్తులో ఉండి ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. పాత పాస్బుక్ కూడా ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్బుక్లు ఇచ్చే సమయంలో ఆ భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేశారు. భూమి విస్తీర్ణం కూడా తగ్గించారు. న్యాయం చేయాలంటూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. భూమిని తక్కువగా వేసి.. ఈ రైతు పేరు వీరబోయిన రాజం. ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామానికి చెందిన ఈయనకు నాంసానిపల్లి రెవెన్యూ పరిధిలోని 337, 515 సర్వే నంబర్లలో కొంత భూమి ఉంది. కొత్త పాస్బుక్కులు ఇచ్చేటప్పుడు.. 337లో 10 గుంటలు, 515లో 6 గుంటల భూమిని తక్కువగా నమోదు చేశారు. తన మొత్తం భూమి వివరాలను పాస్బుక్లో చేర్చాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ధరణిలో నమోదు కాలేదంటున్నరు మా అమ్మ పేరు మీద రెండెకరాల భూమి ఉంది. భూప్రక్షాళన కంటే ముందు పాస్పుస్తకాలు ఉన్నాయి. కొత్త పాస్బుక్కులు ఇవ్వలేదు. ఇదేమంటే ధరణిలో నమోదు కాలేదని, మిస్సింగ్ ఖాతా కింద కంప్యూటరీకరణ ఆగిపోయిందని చెప్తున్నారు. మాకు రైతు బీమా, రైతుబంధు రావడం లేదు. అవసరానికి భూమిని అమ్ముకునే వీల్లేకుండా పోయింది. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం. – దెంది రమణారెడ్డి, పుల్జాల, నాగర్కర్నూల్ జిల్లా పట్టా భూమిని.. లావణి భూమి అంటున్నరు మా గ్రామంలోని 485 సర్వే నంబర్లో 7.05 ఎకరాల భూమిని కొని, నా భార్య యమున పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ధరణి రికార్డుల్లో భూమి నమోదు కాలేదు. ఇదేమని అడిగితే అది లావణి భూమి అంటున్నారు. పట్టా భూమి అని, కావాలంటే సర్వే చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చాను – కిష్టయ్య, ఇసన్నపల్లి గ్రామం, భిక్కనూరు మండలం, కామారెడ్డి జిల్లా .. ఇదీ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పడుతున్న బాధ. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా.. వ్యవసాయ భూ ముల లావాదేవీల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన ధరణి పోర్టల్ ఈ సమస్యలకు కారణమవుతోంది. పోర్టల్లో.. తాతల కాలం నుంచీ అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల వివరాలు కూడా మారిపోవడం, వేరేవారి పేర్ల మీద నమోదుకావడం, అసలు జాడే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతులు ముప్పుతిప్పలు పడు తున్నారు. అత్యవసరానికి భూమిని అమ్ముకోవాలనుకున్నా.. నాలుగు డబ్బులు వెనకేసి కొంత భూమి కొనుక్కో వాలనుకున్నా.. ధరణి పోర్టల్లో సాంకేతిక సమ స్యలు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వర్గాల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ధరణి’ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం, అది సరిగా పనిచేయకపోవడం, తప్పు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేని దుస్థితి తలెత్తడం గమనార్హం. కలెక్టర్లకు ఫిర్యాదుల్లో ‘ధరణి’పైనే అధికం.. ధరణిలో నమోదైన తప్పులను సవరించాలంటూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మీసేవ కేం ద్రాల్లో దరఖాస్తు సమర్పించడం మొదలు.. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణల దాకా నానా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్లకు ప్రతివారం గ్రీవెన్స్లలో వచ్చే ఫిర్యాదుల్లో.. ధరణి ఫిర్యాదులే 65–70 శాతం వరకు ఉంటున్న పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ల లాగిన్లలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, కొన్నిచోట్ల 2 నెలల నుంచి పది నెలల వరకు ఫైళ్లు ఆగిపోయాయని అధికారవర్గాలే చెప్తున్నాయి. తిరిగి తిరిగి రైతుల కాళ్లు అరుగుతున్నాయే తప్ప.. ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమ వద్దకు వచ్చే రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని తహసీల్దార్లు అంటున్నారు. కీలక సమస్యలను గుర్తించినా.. ధరణి సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించిన ప్రభుత్వం.. 18 కీలక సమస్యలను రెండు నెలల క్రితమే గుర్తించింది. భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూముల వర్గీకరణలో తప్పులు, భూమి స్వభావం (పట్టా/అసైన్డ్) రెవెన్యూ రికార్డులకు, ధరణి వివరాలకు సరిపోలకపోవడం, భూమి ఎలా సంక్రమించిందనే వివరాల్లో తప్పులు, పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, ఇనాం భూముల విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి ఆప్షన్ లేకపోవడం, పట్టాభూములనూ నిషేధిత జాబితాలో చేర్చడం, సర్వే నంబర్ల వారీగా ఈసీలు చూసుకునే వీలు లేకపోవడం, ఈసీతోపాటు మార్కెట్ విలువ సర్టిఫికెట్లు ఇచ్చే ఆప్షన్ లేకపోవడం, డబుల్ ఖాతాల విలీనం వంటివి ఇబ్బందికరంగా మారాయని తేల్చింది. కానీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) బృందం.. సదరు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కలెక్టర్లకు పనిభారంతో.. ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కారించే అధికారాలను కలెక్టర్లకే అప్పగించారు. ధరణి ద్వారా ఏ సమస్య పరిష్కారానికైనా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులన్నీ కలెక్టర్ లాగిన్కు చేరతాయి. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్కు పంపుతారు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి గడువు లేకపోవడంతో.. కలెక్టర్లు 15–20 రోజులకోసారి తహసీల్దార్లకు పంపుతున్నారు. తహసీల్దార్లు వాటిని పరిశీలించి ఆన్లైన్తోపాటు మ్యాన్యువల్ రికార్డుల ను తయారు చేసి ఆర్డీవోలకు పంపాలి. సదరు ఆన్లైన్, మ్యాన్యువల్ రికార్డుతోపాటు ఆర్డీవో నోట్ఫైల్ తయారు చేసి మళ్లీ ఆన్లైన్ దరఖాస్తును కలెక్టర్ లాగిన్కు పంపాలి. మ్యాన్యువల్ రికార్డును డీఆర్వో ఆఫీస్లో సమర్పించాలి. తహసీల్దార్, ఆర్డీవోలు చేసే సిఫార్సును బట్టి.. సదరు దరఖాస్తును ఆమోదించడానికి, తిరస్కరించడానికి కలెక్టర్కు అధికారం ఉంటుంది. ఇదంతా జరగడానికి చాలా కాలం పడుతోందని రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
నిర్వహణలో లోపాలతోనే ఫేస్బుక్ డౌన్
లండన్: ఫేస్బుక్ దానికి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని గంటలు పని చెయ్యకపోవడానికి నిర్వహణ సమస్యలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ పని చెయ్యకపోవడానికి కారణం సంస్థలో జరిగే తప్పిదాలేనని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్ జనార్ధన్ తన బ్లాగ్ స్పాట్లో పేర్కొన్నారు. ఫేస్బుక్కి చెందిన కంప్యూటర్లు, రౌటర్లు, డేటా సెంటర్లు, కనెక్టింగ్ కేబుల్స్ని ఇంజనీర్లు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారని ఆ సమయంలో జరిగిన తప్పిదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల సేపు సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ‘‘ప్రతీ రోజూ ఇంజనీర్లు చేసే నిర్వహణలో భాగంగానే ఒక కమాండ్ ఇచ్చారు. అయితే ఎవరూ ఊహిం చని విధంగా దాని వల్ల నెట్వర్క్ మొత్తం డౌన్ అయింది’’ అని ఆయన తెలిపారు. -
ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి. ‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది. -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్పేయర్లు పోర్టల్లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్ను ఇన్ఫీ నిలిపివేసింది. -
కొత్త ఐటీ పోర్టల్ను వీడని సమస్యలు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్ సూన్ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్ చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లాగిన్ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్ తెలిపారు. మరోవైపు, ఇటు ట్యాక్స్పేయర్లు అటు ట్యాక్స్ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. కొత్త పోర్టల్పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి తెలిపారు. మ్యాన్యువల్గా రెమిటెన్స్ ఫారంల ఫైలింగ్.. పోర్టల్లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారని ఐటీ విభాగం వివరించింది. -
చుక్ చుక్ రైలు.. 35 కి.మీ. వెనక్కి
నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని తానక్పూర్కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్పైనున్న జంతువుని ఢీకొట్టింది. దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్అండ్వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్ను డిజాస్టర్ రికవరీ సైట్కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్వేర్లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
కరోనా టీకా: యాప్లో కనిపించని పేర్లు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా కార్యక్రమం ఎంత సజావుగా నిర్వహించాలని భావిస్తున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిన్ (కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్) యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని భావించారు. అయితే ఆ యాప్ కాస్తా మొరాయిస్తుండటంతో కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. లబ్ధిదారులు నిర్దేశిత టీకా కేంద్రానికి వెళ్లి చూస్తే, యాప్లో కొందరివి పేర్లు కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మెసేజ్లు వచ్చిన కేంద్రంలో కాకుండా ఇతర కేంద్రాల్లో కొందరి పేర్లు ఉంటున్నాయి. అంతేకాదు ఇంకొందరివైతే ఎక్కడా పేర్లు కనిపించట్లేదు. మరికొందరివి వేరే జిల్లాల్లో ఉంటున్నాయి. అయితే ఏ కేంద్రంలో లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో గుర్తించే అవకాశం ఈ యాప్లో లేకపోవడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. లబ్ధిదారులకు మెసేజ్లు పంపిస్తే కొందరికి వారి మొబైల్ ఫోన్లకు వెళ్లట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిపేర్లు తప్పు రావడం, అడ్రస్లు వేరుగా ఉండటం, గుర్తింపు కార్డులో ఉన్న వివరాలకు, యాప్ లోని వివరాలకు పొంతన కుదరకపోవడం, వయసు తప్పుగా ఉండటం, హోదాలు మారిపోతుండటం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. డ్రై రన్ సందర్భంగానే ఈ యాప్లో సమస్యలున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నెల 16 నుంచి యాప్తో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో 50 శాతం కార్యక్రమం యాప్తో నడుస్తుంటే, మిగిలిన 50 శాతం మాన్యువల్ పద్ధతిలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పద్ధతి వద్దని, యాప్నే వినియోగించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో కింది స్థాయిలో వ్యాక్సిన్ వేసే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారుల సహనానికి పరీక్ష.. టీకాలు పక్కదారి పట్టకుండా, అర్హులైన లబ్ధిదారులు అందరికీ చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే కోవిన్ యాప్ తయారు చేశారు. లబ్ధిదారులు టీకా కేంద్రానికి వచ్చాక వారి ఆధారాలను ధ్రువీకరించాలి. దీన్ని కోవిన్ యాప్లోని డేటాతో సరిపోల్చాలి. ఏమైనా దుష్ప్రభావాలు వచ్చినా, వ్యాక్సిన్లు మిగిలినా, వృథా అయినా ఆ వివరాలను కూడా తప్పనిసరిగా యాప్లో నమోదు చేయాలి. లబ్ధిదారుడికి ఏ కేంద్రంలో టీకా వేస్తారో కూడా కోవిన్ యాప్ ద్వారా వారి ఫోన్లకు మెసేజ్లు వెళ్తాయి. ఎలక్ట్రానిక్ టీకా ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్ ద్వారానే లబ్ధిదారులకు ఇవ్వాలి. యాప్ ద్వారా రోజుకు దేశవ్యాప్తంగా 50 లక్షల మంది లబ్ధిదారులకు టీకా వేసేలా తీర్చిదిద్దారని చెబుతున్నా.. ఆచరణలో అది కన్పించట్లేదన్న విమర్శలు ఉన్నాయి. 2జీ ఇంటర్నెట్ సామర్థ్యంలోనూ పని చేయగలదని చెబుతున్నా, 4జీకి కూడా స్పందించట్లేదని పేర్కొంటున్నారు. ఇలా యాప్ సక్రమంగా పనిచేయక పోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వెనుదిరుగుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిన్ సాఫ్ట్వేర్లో సమస్యల వల్ల టీకా కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సరి చూసుకునే క్రమంలో తలెత్తే ఇలాంటి సమస్యలతో మరింత ఆలస్యం అవుతోంది. గంటలకొద్దీ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వైద్య సిబ్బంది అసహనంతో వెనుదిరుగుతున్నారు. టీకా వేసేది, తీసుకునేది వైద్య సిబ్బందే కాబట్టి కొన్నిచోట్ల మాన్యువల్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు. ఆ జిల్లాలో 300 మంది పేర్లు గల్లంతు.. మహబూబ్నగర్ జిల్లాలో టీకా కోసం మొదట దరఖాస్తు చేసిన వారిలో 300 మందికి పైగా పేర్లు యాప్లో కన్పించట్లేదు. పేర్లు లేని వారికి ఆఫ్లైన్లో టీకాలు వేస్తున్నారు. జడ్చర్లలో కోవిన్ యాప్ ఓపెన్ కాకపోవడంతో సమస్యలు వచ్చాయి. సాఫ్ట్వేర్లో పేర్లు నమోదు చేసే క్రమంలో ఉద్యోగి కోడ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లకు సంబంధించి కొన్ని తప్పులు దొర్లాయి. మెదక్ జిల్లాలో సర్వర్డౌన్ సమస్యతో యాప్ ఓపెన్ కావట్లేదు. -
మళ్లీ ఆగిన మెట్రో రైలు!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5 వద్ద మెట్రో 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో రైల్లో రాయదుర్గం తరలించారు. ఈ మార్గంలో అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఇటీవల అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యలతో మెట్రో రైల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రోరైల్కు బ్రేకులు వేస్తున్నాయి. -
బ్యాంకింగ్ డిజిటలైజేషన్లో బాలారిష్టాలు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. ‘రిటైల్ బ్యాంకింగ్లో సాంకేతిక పరమైన అవరోధాలు: పెద్ద బ్యాంకుల్లో మారాల్సిన పరిస్థితులు’’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్లో ప్రధానమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థ– యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగం భారీగా పెరిగేందుకు కోవిడ్–19 ప్రేరిత అంశాలు దోహదపడుతున్నాయి. 2020 జూన్ నుంచి నవంబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ దాదాపు రెట్టింపయ్యింది. ► మొబైల్ పేమెంట్ యూజర్లు ఈ–వాలెట్ల నుంచి యూపీఐ వైపునకు మారుతున్నారు. 2020 అక్టోబర్లో మొత్తం పేమెంట్స్ మార్కెట్ లావాదేవీల్లో యూపీఐ వాటా 51 శాతం కావడం గమనార్హం. ► ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ కనెక్టివిటిలో పురోగతి, సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడే యువత అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు దోహదపడతాయి. ► బ్యాంకింగ్లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే మొండిబకాయిల భారం, తక్కువ లాభదాయకత వంటి అంశాలు సాంకేతికతపై బ్యాంకింగ్ వ్యయాలను క్లిష్టతరం చేస్తున్నాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు, కొన్ని బ్యాంకింగ్–యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) బ్యాంకింగ్ విషయంలో సాంకేతిక అవరోధాలను విజవంతంగా అధిగమించగలుగుతున్నాయి. అలాగే పలు ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు సంబంధించి పలు సేవల విషయంలో ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాయి. ► సాంప్రదాయక బ్యాంకులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకులు తమ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. -
హైదరాబాద్ : నిలిచిపోయిన 9 మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. అమీర్పేట నుంచి రాయదుర్గం మార్గంలో తొమ్మిది మెట్రో ట్రైన్లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, లోపాన్ని సరిచేయడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. -
నగదు మింగేస్తున్న ఏటీఎంలు
సాక్షి, కర్నూలు: బ్యాంకులకు వెళ్లి అకౌంట్లలో నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే.. అక్కడి సిబ్బంది తీసుకోకుండా ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్లో డిపాజిట్ చేయమని సూచిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటీఎం మిషన్ ద్వారా నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తి మిషన్ స్ట్రక్ అయిపోతోంది. డబ్బులేమో మిషన్లోకి వెళ్లి పోతున్నాయి. నగదు మాత్రం అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో బ్యాంకు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం అన్ని ప్రధాన బ్యాంకులు నగదు డిపాజిట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి రోజు వందల మంది అత్యవసరాల నిమిత్తం ఏటీఎం సెంటర్లలోని డిపాజిట్ మిషన్ల ద్వారా నగదును అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా డిపాజిట్ మిషన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్నూలు నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచీకి ఖాతాదారుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఏటీఎం సెంటరులో నగదు డిపాజిట్ మిషన్లు పెట్టారు. అయితే వారం 10 రోజులుగా సాంకేతిక సమస్యలు ఖాతా దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నగదు మిషన్లోకి వెల్లిపోయినా నగదు ఖాతాలో జమ కాకపోవడంతో ఖాతాదారుల ఆందోళన చెందు తున్నారు. 10 రోజుల నుంచి రోజు 10 నుంచి 15 వరకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్య ఉన్నా చర్యలు సున్నా... ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 10 రోజులకుపైగా ఈ సమస్య ఉన్నా ఎస్బీఐ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిషన్లకు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జీఎం, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. అయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగదు డిపాజిట్ చేస్తే రసీదు రావడం లేదు. ఈ సమస్యలను ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లేదు. ఫిర్యాదు చేస్తే 7 రోజులకు సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలనే పరిష్కరించకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నిస్తున్నారు. అత్యవసరంగా డబ్బు పంపాలనుకుంటే.. సీను రివర్స్ ఆదోని పట్టణానికి చెందిన తేజ కర్నూలులో సెయింట్ జోసఫ్ కాలేజీలో బయో టెక్నాలజీ చదువుతున్నాడు. ఆదోనిలోని తండ్రి ఖాతాకు రూ.49 వేలు పంపేందుకు బుధవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోని ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్ను అశ్రయించారు. నగదు మిషన్లో పెట్టి వివరాలు నమోదు చేసిన తర్వాత స్ట్రక్ అయ్యి మొత్తం నగదు లోనికి వెల్లింది. ఇంతవరకు నగదు ఖాతాకు జమ కాలేదు. అత్యవసరం అనుకుంటే సమస్య పరిష్కారానికి వారం రోజులు పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. -
స్పైస్జెట్లో సాంకేతిక సమస్య
సాక్షి, శంషాబాద్: విమానయాన సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. స్పైస్జెట్ 753 విమానం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవాలి. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం గమనిం చిన పైలెట్ జెట్ను నిలిపివేశారు. ప్రయాణికులకు సరైన సమాచారం అందించకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు విమానంలోనే కూర్చోబెట్టారు. దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు కిందికి దిగి ఆందోళన చేపట్టారు. విమానయాన సంస్థ నిర్వాహకులపై మండిపడ్డారు. విమానం ఆలస్యమైతే సమాచారం ఇవ్వకుండా, విశ్రాంతి గదులకు పంపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికుల ఆందోళనతో నిర్వాహకులు వారిని టెర్మినల్కు పంపారు. మరమ్మతుల అనంతరం విమానం 12.55 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది. పైలట్ రాకపోవడంతో ఈ నెల 9న సాయంత్రం 4.10 గంటలకు శంషాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం 5 గంటలు ఆలస్యంగా నుంచి టేకాఫ్ తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఓటే ఆయుధం.. నమోదు ముఖ్యం
సాక్షి, అమరావతి: ఉత్తమ పాలన అందించే నేతలను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుని తన ఆశలను నెరవేర్చే నేతలను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు తప్పనిసరి. ఓటుకు ఇంత ప్రాధాన్యం ఉన్నందున ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే ఈనెలాఖరులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓట్లు ఉన్నప్పటికీ ఏ కారణంగానైనా జాబితా నుంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. పొరపాటున/సాంకేతిక సమస్యవల్ల కూడా ఓటర్ల జాబితా నుంచి మీపేరు తొలగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదా వెంటనే చూసుకోవాలి. ఒక వేళ లేకపోతే ఆధార్కార్డు లేదా ఇతర ధ్రువపత్రాలు సమర్పించి మీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. యువతరం పాత్ర కీలకం వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటు హక్కునమోదుకు అరుŠహ్లే. వచ్చే ఏడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా జనన ధ్రువీకరణ పత్రం లేదా తల్లిదండ్రులచే ధ్రువీకరణ పత్రం, తాజా ఫొటోతో సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం–6 నింపి అక్కడి సిబ్బందికి సమర్పించి రసీదు తీసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను (ఫారం –6ను) డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దారు/ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చు. www.nvsp.in అనే వెబ్సైట్కు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం ఈనెల 31వ తేదీ వరకూ ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అనర్హులు జాబితాలో ఉంటే.. అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగించాలంటూ ఎవరైనా ఫారం–7ను సమర్పించవచ్చు. ఓటరు జాబితాలో పేరు రెండు చోట్ల ఉన్నా ఒకచోట తొలగింపునకు కూడా ఇదే ఫారం –7 దాఖలు చేయవచ్చు. ఓటరు జాబితాలో పేరు తప్పు ఉన్నా, తండ్రి/భార్య/భర్త పేర్లలో తప్పులు ఉన్నా సవరణ కోసం ఫారం–8 దాఖలు చేయవచ్చు. చిరునామాలో మార్పు కోసం కూడా ఇదే ఫారం సరిపోతుంది. ఒకే నియోజకవర్గంలో ఇల్లు మారినా.. ఉన్న పోలింగ్ కేంద్రం నుంచి కొత్త పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఓటు మార్చుకోవాలన్నా కోసం ఫారం–8ఎ సమర్పించాలి. ఇప్పటికే నమోదైన ఉందో లేదో తెలుసుకోవాలంటే ceoandhra.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ల జాబితాలో పేరు చూసుకోవచ్చు. మిస్స్డ్ కాల్ ఇస్తే... ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలన్నా, కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నా 8367797101కు మిస్స్డ్ కాల్ ఇస్తే సీఈవో కార్యాలయం నుంచి సూచనలతో కూడిన ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ సౌకర్యం ఈనెల 31వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్పీ సిసోడియా ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకు అర్హులందరికీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి’ అనే నినాదంతో మిస్స్డ్ కాల్ సదుపాయం ప్రవేశపెట్టామని సిసోడియా చెప్పారు. ప్రజలను ఓటు హక్కుపై చైతన్యపరచడం కోసం త్వరలో సోషల్మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. -
ఈ–కుబేర్ కాదు.. ఈ–కుదేల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భరోసా. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతినెలా మొదటి రోజు వేతనాలు వస్తాయనే నమ్మకం. అయితే, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేసేందుకు అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ వ్యవస్థలోని సాంకేతిక సమస్యలు కొందరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారాయి. ఆగస్టు నెల ముగింపునకు వచ్చినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వేతనాలు అందని వారంతా ట్రెజరీ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీ అధికారులు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన వివరాలను సరి చూస్తూ పరిష్కరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను ముగించే ప్రక్రియ ఆలస్యమవు తుండటంతో నెల ముగిసే సమయానికి కూడా అందరికీ వేతనాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ఆగస్టు నెల వేతనాలను చెల్లించే ప్రక్రియ మొదలైంది. సాంకేతిక సమస్యలతో ఆగస్టులో వేతనాలు అందని వారికి, సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ–కుబేర్ కొత్త విధానంలో సాఫ్ట్వేర్తో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సరిపడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నుంచే... ఉద్యోగుల వేతన చెల్లింపు ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఆర్బీఐ కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్ విధానాన్ని దీనికి వర్తింపజేశారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్వేర్తో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఆర్బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ఒకటో తేదీ ఆదివారం అయినా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. సాంకేతిక సమస్యలు మొదట 2.56 లక్షల మంది పెన్షనర్లకు అమలుచేసిన ఈ–కుబేర్ విధానాన్ని ఆగస్టు ఆరంభం నుంచి ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. మొదట అందరు ఉద్యోగుల ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేసి పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ నంబర్లు తప్పుగా ఉండడంతో వారికి ఈ మొత్తం జమ కాలేదు. ఇలాంటి వాటిని సరిచేసి ఆగస్టు 1న వేతనాలు జమ చేశారు. అయితే ఒక రూపాయి జమ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినా, పూర్తి వేతనాలు ఇచ్చినప్పుడూ ఇదే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పది శాతం మంది ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. ఉద్యోగుల వేతన బిల్లులను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) దశలవారీగా ఆన్లైన్ ద్వారా ఈ–కుబేర్కు పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ నెలలో వేతనాలు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా రిజెక్టయిన వారు ఒక్కొక్కరుగా వెళ్లి ట్రెజరీ అధికారులకు విజ్ఞప్తులు చేయడంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి వేతనాలు ఖాతాకు జమచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ఇదే సమస్య రావడంతో పరిష్కారంకోసం ఎక్కువ రోజులు పడుతోంది. - ఈ–కుబేర్ విధానంలో ఒకవ్యక్తికి సంబం ధించిన డబ్బులు ఒకే ఖాతాలో జమ అవుతా యి. ఒక ఉద్యోగికి ఒకటికంటే ఎక్కువ బ్యాం కు ఖాతాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది న వ్యక్తికి వేతనం ఒక బ్యాంకు ఖాతాలో, పెన్షన్ మరో ఖాతాలో జమవుతుంది. - పోలీసు శాఖలో విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బందికి వారి రిటైర్మెంట్ వయస్సు వరకు పూర్తి వేతనం అదే ఖాతాలో జమ అవుతుంది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుడు ఉద్యోగం పొందితే ఆ వేతనం వేరే ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ–కుబేర్ సాఫ్ట్వేర్లో ఇబ్బందులు వస్తున్నాయి. -
వెబ్ కౌన్సెలింగ్ అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం)కు విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. సతాయించిన సాంకేతిక సమస్యలు జీహెచ్ఎంల వెబ్ కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్ నంబర్ను వెబ్సైట్లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్కు ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్ అవుట్ కాకపోవడం, వెబ్ఆప్షన్లు సేవ్ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్ఎంలు ఇబ్బంది పడ్డారు. తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి.. ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్ కౌన్సెలింగ్లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్ కౌన్సెలింగ్ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్సైట్ను అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇక స్పౌజ్ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్ పని చేసే చోటు నుంచి జీహెచ్ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్వేర్ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్సైట్లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు. -
మళ్లీ క్లాట్ నిర్వహణకు సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష(క్లాట్)ను మరోసారి నిర్వహించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న క్లాట్ తొలిదశ కౌన్సెలింగ్ను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. క్లాట్ పరీక్షలో సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు జూన్ 15లోగా ఓ పరిష్కారాన్ని కనుగొనాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్(ఎన్యూఏఎల్ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆదేశించింది. దేశంలోని 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 13న ఎన్యూఏఎల్ఎస్ క్లాట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 6,000 మంది విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు. -
‘టీఆర్టీ’ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్టికెట్పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు. మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. –మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా -
వేతనాల్లేవు..!
ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ విధానం అమలులో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో జీతాలు నిలిచిపోయాయి. మార్చి నెల నుంచి వేతనాలు అందక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్థిక గణాంకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్సిస్టం) విధానాన్ని ప్రవేశపెట్టింది. ట్రెజరీ ద్వారా మంజూరయ్యే బిల్లులన్నింటినీ ఈ విధానం ద్వారానే దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 37,790 మంది ఉద్యోగులు, 39 వేల మంది పింఛనర్లతోపాటు, ఇతర బిల్లులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పంపాలని, కాగిత రహిత విధానం అమలు చేయాలని స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ‘శాప్’ అనే ప్రైవేటు సంస్థ ద్వారా అన్ని శాఖల్లోని ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కొన్ని శాఖలకు సాంకేతికంగా అవసరమైన స్కానర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాలు అందజేశారు. వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో బిల్లులు దాఖలు చేయడంలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా వేగంగా లేకపోవడంతో ఒక బిల్లు అప్లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోందని పలు శాఖల అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లు పూర్తి సామర్థ్యంతో పని చేయక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతీ నెల 18 నుంచి 25వ తేదీ మధ్య బిల్లులు ఖజానాశాఖకు సమర్పించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు పొందుపర్చకపోవడంతో ఉద్యోగుల జీతాలపైన ప్రభావం చూపుతోంది. కొన్నిశాఖల అధికారులు బిల్లులు ఆలస్యంగా సమర్పించడం, ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులకు డబ్బులు చెల్లించాలా లేదా అనే విషయంలో అనుమతులు రాకపోవడంతో పెండింగ్లో ఉంచారు. ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలివే.. కొన్ని శాఖలలో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సిస్టంలు, స్కానర్లు, ప్రింటర్లు, నెట్ స్పీడ్ లేకపోవడంతో జీతాల బిల్లులు ఆన్లైన్లో సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. డిపార్టుమెంట్ సంబంధించి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వలేదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని శాఖల అధికారులు ఇంతవరకు శిక్షణ తీసుకోలేదు. దీంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించిన జీతాలు సైతం మార్కెటింగ్ శాఖతోపాటు, పలుశాఖల ఉద్యోగులకు రాలేదు. ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ విధానం గుదిబండగా మారింది. దీంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్శాఖకు సంబంధించి పీఏవో ద్వారా జీతాలు తీసుకునేవారు. వారిలో హెచ్ఆర్ఎంఎస్ సిబ్బందికి చెక్కు ద్వారా జీతాలు చెల్లించేవారు. వీరికి సంబంధించి బ్యాంకుల్లో ఐడీలు లేకపోవడంతో ప్రభుత్వం ముందస్తుగా ఒక్కోక్కరికి రూ.75వేలు అడ్వాన్సును చెల్లించింది. మొత్తంగా ఏప్రిల్ నెల జీతాలు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అందేలా చేసేందుకు ఆయా డిపార్టుమెంటల్ అధికారులు, ఖజానా సిబ్బంది పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఖజానా కార్యాలయానికి సీఎఫ్ఎంఎస్ విధానంలో 2,250 బిల్లులు రాగా 950 బిల్లులు పాస్ అయినట్లు సమాచారం. 600 బిల్లులు డీడీవోల స్థాయిలో పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా బిల్లులు పాస్చేసేందుకు ఖజానా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఖజానా అధికారులు పేర్కొన్నారు. అందరికి జీతాలు అందేలా చేస్తాం జిల్లాలోని ఉద్యోగులు , పింఛనర్లు అందరికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధేశిత సమయం మించినప్పటికీ ఆన్లైన్ ద్వారా వస్తున్న వేతన బిల్లులను ఖచ్చితంగా పాస్ చేసేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం వల్ల చిన్న చిన్న సాంకేతిక సమస్యల తలెత్తుతున్న మాట వాస్తవం. కాని ఇందులోని బాలారిష్టాలను అధిగమించి బిల్లులతోపాటు, వేతనాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.– ఎన్.సదాశివరావు, ఉప సంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ -
అర్హత పరీక్ష!
ఈమె పేరు కళావతి. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి చెందిన టెట్ అభ్యర్థినికి పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకుంది. గురువారం రోజునే ఎంటెక్ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో విద్యార్థులు కళాశాలఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. వారంతా టెట్కే వచ్చారని భ్రమించిన కళావతి 9.45గంటలు దాటినా అక్కడే ఉండిపోయింది. చివరకు అనుమానంతో విచారించగాఅసలు విషయం తెలుసుకొనిపరీక్ష హాలులోకి వెళ్లగా అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు ససేమిరాఅన్నారు. ‘సార్.. కాళ్లుపట్టుకుంటా అనుమతించండి’అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రెండవ రోజు గురువారం కూడా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాల కేంద్రంలో ఆలస్యం కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. రెండో రోజు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 1,468 మంది అభ్యర్థులకు గాను 1,405 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు పీవీకేకే, షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా పరిశీలకులు జనార్దనరెడ్డి, ఆయా కేంద్రాల పరిశీలకులు కేంద్రాలను తనిఖీ చేశారు. బెంగళూరులో పరిశీలకులు సాయిబాబా వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండోరోజూ ఆ కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలు ఉండగా రెండోరోజూ రెండు కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ రాయలేదు. అలాగే షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ రెండు పూటలా కేవలం 71 మందిని మాత్రమే కేటాయించారు. వెంటాడిన సాంకేతిక సమస్య హిందూపురం సప్తగిరి కళాశాలలో రెండో రోజూ సాంకేతిక సమస్య తలెత్తింది. 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.15 గంటలకు మొదలైంది. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఆన్లైన్ నిర్వహణపై అవగాహన లేకనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అభ్యర్థులు వాపోయారు. -
పింఛన్ పాట్లు..
జడ్చర్ల : ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పథకం కింద అందజేస్తున్న పించన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు,తదితర పింఛన్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు పింఛన్లు పంపిణీ చేసే పోస్టాఫీస్ కార్యాలయాల వద్దకు చేరుకుని పింఛన్ తమకు ఎప్పుడు ఇస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. పంపిణీలో సాంకేతిక సమస్యలు, నగదు లేకపోవడం, తదితర కారణంగా పింఛన్లు తమ చేతికి అందడం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. సోమవారం బాదేపల్లి, జడ్చర్ల పోస్టాఫీస్ల వద్ద పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడినా చివరకు చేతికి అందక నిరాశగా వెనుదిరిగారు. పింఛన్ల కోసం పోస్టాఫీస్ చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోతున్నామని, తమకు ఇబ్బందులు కలుగకుండా పింఛన్లు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
దుల్హన్ సాయం దూరం
పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుల్హన్ పథకం అధికారుల నిర్లక్ష్యంతో విమర్శల పాలవుతోంది. అర్జీలు చేయడంలోనే ఆటంకాలు ఎదురవుతుండటంతో అర్హులకు ఈ పథకం ఫలాలు అందడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, జిల్లాలో రెండు వందల మందికి పైగా పెళ్ళైన పేద ముస్లిం జంటలు ఈ పథకంలో లబ్ధిపొందకుండా, ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగదు అందితే కొంత వరకూ ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చన్న ఆశ ఆడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఒంగోలు సెంట్రల్: నిరుపేద ముస్లిం యువతులు వివాహానంతరం రెండు నెలలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే వారు దుల్హన్ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులవుతారు. లేకుంటే అనర్హులవుతారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్లో సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయి. తరచూ ఈ సమస్య తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.అన్లైన్ పోర్టల్లో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. సమస్య రాష్ట్ర స్థాయిలో పరిష్కారించాల్సి ఉండటంతో జిల్లా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. పథకం లక్ష్యం... పేద ముస్లిం యువతులకు వివాహానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ముస్లింలు లబ్ధిపొందారు. అయితే వివాహం జరిగిన రెండు నెలల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. వధూవరుల ఆధార్కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధువు బ్యాంకు ఖాతా వంటి వాటిని ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ పథకానికి ఆన్లైన్లో సాంకేతిక సమస్య వచ్చి పడింది. దీంతో వందల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయ పత్రమే అసలు సమస్య... సాధారణంగా దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే అన్ని రకాల ఆదాయ పత్రాలతో పాటూ మీ సేవ ద్వారా లభించే ఆదాయ ధ్రువీకరణపత్రం కుడా అవసరం, రెవెన్యూ అధికారులు తెల్ల రేషన్కార్డు ఉన్న వారికి ఆదాయ పత్రం అవసరంలేదని, ఇవ్వడంలేదు. రేషన్కార్డునే ఆదాయ పత్రంగా వాడుకోవాలంటున్నారు. దీంతో దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పని సరి. అది లేకుండా మిగిలిని వివరాలు ఆప్లోడ్ చేయలేరు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 200 మంది వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని పథకం ద్వారా లబ్ధి పొందడానికి గత రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నివేదికలు ఇవ్వడంలో అలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 700 మంది వరకూ ఈ పథకం కింద లబ్ధి కల్పించినట్లు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. - ఝాన్సీ రాణి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి -
అటకెక్కిన మన టీవీలు
సిరికొండ(నిజామాబాద్ రూరల్): ‘రాజుల పైస రాళ్ల పాలు’ అన్న చందంగా మారింది. ప్రభుత్వం మన టీవీలకు వెచ్చించిన నిధుల వ్యవహారం. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించడానికి సరఫరా చేసిన టీవీలు చిన్నపాటి మరమ్మతులకు నోచుకోలేక మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు ఈ టీవీలను ప్రభుత్వం లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం సరఫరా చేసింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నా ఇవి మూలన పడిపోవడంతో ఈ కార్యక్రమాలను అధికారులు వీక్షించలేకపోతున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున అందజేసిన టీవీలు నిరుపయోగంగా మారాయి. వెంటాడుతున్న సాంకేతిక లోపాలు.. ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో 2014 జూన్లో జిల్లావ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు టీవీలను మంజూరు చేశారు. అపార్ట్ అనే ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని టీవీలను సరఫరా చేసినది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరంభశూరత్వంలా మారినది. తొలుత గ్రామీణులకు కొద్దిగా ఉపయోగపడినా ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా అన్ని మండల కార్యాలయాల్లో ఇవి మూలనపడ్డాయి. చిన్న సాంకేతిక లోపాలు, మరమ్మతుల కారణంగా ఇవి పని చేయడం లేదు. సరఫరా చేసి వదిలేశారు.. మండల పరిషత్ కార్యాలయాలలో టీవీలను ఏర్పాటు చేసిన తర్వాత చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా అవి సరఫరా చేసిన అపార్ట్ సంస్థ చూసుకోవాలి. టీవీలను అమర్చిన తర్వాత ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తిచూడటం లేదు. టీవీల్లో బ్యాటరీలు మరిన్ని సాంకేతిక లోపాలతో పనిచేయడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మరమ్మతులు చేసుకొనే వీలు లేకపోవడంతో సరఫరా చేసిన సంస్థ ప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా మండలాల అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోజనాలు బోలేడు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ప్రజలు తెలుసుకోవడం అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవడం ఇతర విషయాలు తెలుసుకోవడంలో భాగంగా ఈ టీవీలను అందించారు. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ఇతర కార్యక్రమాలు కూడా ఇందులో ప్రసారం అవుతాయి. విద్య, ఐసీడీఎస్, ఉపాధి హమీ, ఆరోగ్యశాఖ వివిధ సంక్షేమ పథకాలు అయిన కల్యాణలక్ష్మి, విద్యా రుణాలు, ఆసరా పింఛన్లు అమలు తదితర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రతి రోజు ఏదో ఒక శాఖకు సంబంధించిన అభివృద్ధిపై కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినప్పటికీ అవి మూలనపడటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసిన మన టీవీలు - 36 ఒక్కొక్క మన టీవీ ఖర్చు రూ. 25 వేలు మన టీవీలకు వెచ్చించిన మొత్తం వ్యయం రూ. 9 లక్షలు -
పద్మావతికి సెన్సార్ కష్టాలు
-
స్తంభించిన బయోమెట్రిక్ హాజరు!
సాక్షి, హైదరాబాద్: హాస్టళ్లలో బయో మెట్రిక్ హాజరు విధానం అటకెక్కింది. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయడంలేదు. సాఫ్ట్వేర్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ వసతిగృహ సంక్షేమాధికారులు హాజరు ప్రక్రియను పాతపద్ధతికి మార్చేశారు. వసతిగృహాల్లో విద్యార్థుల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టడానికిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాయి. వసతిగృహ సంక్షేమాధికారితోపాటు సిబ్బంది సైతం వేలిముద్రలతో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో దాదాపు వెయ్యికిపైగా సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ మెషిన్లను ఏర్పాటు చేశారు. సరికొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంతో వసతి గృహాల్లో అవకతవకలు సైతం అదుపులోకి రాగా ప్రభుత్వానికి భారీగా ఖర్చులు తగ్గాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ హాజరు విధానం స్తంభించి పోయింది. ఈ విధానంలో ఆధార్ నంబర్లే కీలకం. ఆధార్ నమోదు చేసుకున్నవారికే బయోమెట్రిక్ హాజరు తీసుకునే అవకాశం ఉండేలా ప్రభుత్వం సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీంతో ఒక విద్యార్థి హాజరు మరొకరు వేసే అవకాశం ఉండదు. ఇటీవల ఆధార్ వివరాలతో ఉన్న టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. వరుసగా రెండుసార్లు అప్డేట్ కావడంతో ఆ మెషిన్లు సరికొత్త సాఫ్ట్వేర్ను సపోర్ట్ చేయడం లేదు. ఈ క్రమంలో బయోమెట్రిక్ మెషిన్లలోనూ ఆధార్ సాఫ్ట్వేర్ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ అప్డేట్ చేయాల్సి ఉంది. అయితే, కొత్త సాఫ్ట్వేర్పై సంక్షేమ శాఖలు శ్రద్ధ పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో హాజరు నమోదులో గందరగోళం నెలకొంది. మెషిన్లు పనిచేయడం లేదంటూ వసతిగృహ సంక్షేమాధికారులు దాదాపు ఐదు నెలలుగా మాన్యువల్ పద్ధతిలోనే హాజరు స్వీకరిస్తున్నారు. దీంతో అవకతవకలకు మళ్లీ ఆస్కారం ఏర్పడింది. అక్రమార్కులకు మళ్లీ కలసి వచ్చినట్లైంది. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు, హాజరుపట్టికలోని వివరాలకు పొంతన లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ మెషిన్లలో కొత్త సాఫ్ట్వేర్ను మెరుగుపర్చే అంశంపై నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. -
జీఎస్టీని వీడని బాలారిష్టాలు!
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా బాలారిష్టాలు వీడడం లేదు. ముఖ్యంగా జీఎస్టీఎన్ పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అటు డీలర్లను, ఇటు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో ఆగస్టులో దాఖలు చేయాల్సిన పన్ను రిటర్నుల ప్రక్రియ.. సెప్టెంబర్ నెల ముగుస్తున్నా 40 శాతం దాటకపోవడం గమనార్హం. సాంకేతిక సమస్యలకు తోడు డీలర్ల నిర్లక్ష్యం, అవగాహనా లోపం, దసరా సెలవులు కలిపి పన్నుల వసూలు తగ్గి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంది. జాతీయ సగటు కన్నా తక్కువే.. జీఎస్టీ రిటర్నుల దాఖలులో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా.. ఆ నెలకు సంబంధించి ఆగస్టు 20కల్లా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండేది. కానీ పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలు, జీఎస్టీపై అవగాహనకు సమయం కావాలన్న యోచనతో గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచారు. దీంతో కొంతమేర రిటర్నుల దాఖలు పెరిగింది. జూలై నెలకు గాను దేశవ్యాప్తంగా 83 శాతం రిటర్నులు దాఖలుకాగా.. మన రాష్ట్రంలో మాత్రం 74.78 శాతమే వచ్చాయి. దాంతో గడువును తిరిగి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన రిటర్నులను సెప్టెంబర్ 20 వరకు దాఖలు చేయాలి. ఈ గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పెంచారు. కానీ ఆగస్టు నెల రిటర్నుల దాఖలు మాత్రం వెనుకబడిపోయింది. ఆగస్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా సగటున 48.57 శాతం రిటర్నులు నమోదుకాగా... రాష్ట్రంలో మాత్రం 39.48 శాతమే నమోదయ్యాయి. ప్రభుత్వం తిరిగి గడువు పొడిగిస్తుందనే ఉద్దేశంతోనే డీలర్లు జాప్యం చేస్తున్నారని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే డీలర్లు మాత్రం విభిన్న వాదన వినిపిస్తున్నారు. వ్యాట్ ఉన్నప్పుడు పన్ను కట్టకపోయినా రిటర్నులు దాఖలు చేసేవారమని.. ఇప్పుడు జరిగిన వ్యాపారంపై పన్ను కడితేనే జీఎస్టీఎన్ పోర్టల్ రిటర్నులను స్వీకరిస్తోందని చెబుతున్నారు. వ్యాపారాల్లో డబ్బు చెల్లింపులకు గడువు ఉంటుందని.. అందువల్ల పన్ను చెల్లింపునకు ముందే రిటర్నుల దాఖలుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఎన్నో సమస్యలు జీఎస్టీఎన్ పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈనెల 9న హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, మరో మూడు రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం ఈ నెల 20న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. మొత్తం 25 రకాల ప్రధాన సమస్యలు జీఎస్టీ పోర్టల్లో ఎదురవుతున్నాయని గుర్తించింది. వాటిని తక్షణమే పరిష్కరించాలని జీఎస్టీఎన్కు సాంకేతిక సహకారం అందిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కానీ ఇంకా ఆ సమస్యలను పరిష్కరించకపోవడంతో జీఎస్టీఎన్ సర్వర్ డౌన్ కావడం, అప్ లోడింగ్కు సహకరించకపోవడం వంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. -
జీఎస్టీకి ‘సాంకేతిక’ సమస్యలు
► వాణిజ్య పన్నుల అధికారులకు లాగిన్ ఐడీల్లేవు ► 12 మంది సీటీవోలకు పదోన్నతి, 13 మంది బదిలీలు సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి 15 రోజులు దాటిపోయినా సాంకేతిక సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. కనీసం రాష్ట్ర వాణిజ్య పన్నుల అధికారులు జీఎస్టీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే ఐడీలకు సంబంధించిన సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఒక్కో సర్కిల్ పరిధిలో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసే సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల (ఏసీటీవోలు)కు మాత్రమే లాగిన్లు వచ్చాయి. అవి కూడా సర్వర్లు బిజీ అంటూ సతాయిస్తున్నాయి. దాంతో డీలర్ల రిజిస్ట్రేషన్లు చేయడమే గగనంగా మారింది. సమస్యకు ఢిల్లీ స్థాయిలో కూడా పరిష్కారం లభించకపోవడం, సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్ పేరిట జాప్యం జరుగుతుండడంతో ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. కనీసం జాబ్చార్టుకు కూడా ఆమోదం రాకపోవడంతో ఏ అధికారి ఏం చేయాలో కూడా స్పష్టత లేకుండా పోయింది. విధుల కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే... జీఎస్టీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ విధుల కేటాయింపే పరిష్కారం. కానీ సహాయ వాణిజ్య పన్నుల అధికారి (ఏసీటీవో) నుంచి కమిషనర్ దాకా ఎవరి విధులేమిటో ఇప్పటికీ స్పష్టత రాలేదు. జీఎస్టీ అమలు బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖతో పాటు సెంట్రల్ ఎక్సైజ్కు కూడా కేంద్రం అప్పగించింది. సెంట్రల్ ఎక్సైజ్ అధికారులతో సమన్వయం కోసం వాణిజ్య పన్నుల అధికారుల హోదాలను మార్చాల్సి ఉంది. సంబంధిత ప్రతిపాదనలతో కూడిన ఫైలును ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ ఆమోదం రాకపోవడంతో ఏ పనీ సాగడం లేదు. లాగిన్ ఐడీలు వచ్చినా హోదాల్లో స్పష్టత లేకపోతే పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. 15 రోజులు దాటిన డీలర్ల రిజిస్ట్రేషన్ ఆన్లైన్ దరఖాస్తులన్నీ జీఎస్టీ చట్టం ప్రకారం వేలాదిగా వాటంతటవే ఆమోదం పొందాయి. లాగిన్ వచ్చాక వాటన్నింటినీ ఏకకాలంలో పరిశీలించడం సమస్యే కానుంది. సమస్యలు పరిష్కరించండి: శ్రీనివాస్గౌడ్ సీటీవోలకు ప్రమోషన్లిచ్చినందుకు ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్కు టీజీవోలు ధన్యవాదాలు తెలిపారు. టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రవీందర్ రావు, మధుసుదన్, కృష్ణయాదవ్, రాజ్ కుమార్ గుప్తా, వెంకటయ్య, బుగ్గప్ప, శ్రీనివాస్, రామ్ ప్రసాద్, పావని తదితరులు మహబూబ్నగర్ ఎమ్మెల్యే , టీజీవో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆయన్ను కలిశారు. ఇతర శాఖాపరమైన సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. ఎట్టకేలకు పోస్టింగుల్లో కదలిక చిరకాలంగా పెండింగ్లో ఉన్న సీటీవోల పదోన్నతుల ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. 12 మంది సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా ప్రమోషన్లిచ్చారు. మరో 13 మందిని బదిలీ కూడా చేశారు. దీంతో డీసీటీవోలు సీటీవోలుగా; ఏసీటీవోలు, డీసీటీవోలుగా పదోన్నతులు పొందే ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. రిటైరైన వాణిజ్య పన్నుల అడిషనల్ కమిషనర్ రేవతి రోహిణి పోస్టు భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ఇద్దరు డిప్యూటీ కమిషనర్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
బండి కాదు మొండి ఇది..
‘వజ్ర’తరహాలోనే మినీ పల్లెవెలుగు బస్సుల్లోనూ తీవ్ర సాంకేతిక సమస్యలు.. ఎక్కడికక్కడ ఆగిపోతున్న వైనం సీన్–1 రెండు నెలల క్రితమే ఆ బస్సు రోడ్డెక్కింది. అందులో నెలన్నర రోజులు మూలనపడి ఉంది. అధికారులేమో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. వారేమో బస్సు తయారు చేసిన కంపెనీకి సమాచారమిచ్చారు. కంపెనీ ఇంజనీర్లు వచ్చి దాన్ని పరిశీలించి, మరమ్మతు చేయటం కుదరదని చెప్పి ఏకంగా దాని ఇంజిన్నే మార్చారు. సీన్–2 ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న బస్సు ఉన్నట్టుండి రోడ్డుపై ఆగిపోయింది.. కంగారుపడ్డ డ్రైవర్ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు.. ఆయనేమో ఉన్నతాధికారులకు.. అక్కడి నుంచి కంపెనీ ఇంజనీర్లకు సమాచారం వెళ్లింది.. వారు వచ్చి చూసి.. ఇంజిన్లోకి డీజిల్ను పంపే చోట దాన్ని నియంత్రించే డివైస్ పాడైందని చెప్పి షెడ్డుకు తీసుకెళ్లి కొత్తది వేశారు. రిపేర్లతో షెడ్డుకు తిరగటమే ఎక్కువ దాదాపు రూ.350 కోట్లు వెచ్చించి 450 వరకు కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. అందులో 100 వరకు మినీ బస్సులను కొనుగోలు చేసింది. అయితే ఈ మినీ బస్సుల కొనుగోలులో ఆర్టీసీ పొరపాట్లు చేసింది. నాణ్యమైనవి ఎంచుకునే విషయంలో నిర్లక్ష్యం వహించింది. మినీ బస్సుల తయారీలో కొన్ని కంపెనీలే అందుబాటులో ఉండటం, వాటిపై ఆర్టీసీకి పరిజ్ఞానం లేకపోవటంతో నాణ్యత గల్లంతైంది. అవి రోడ్లపై ఉన్నట్టుండి ఆగిపోయి మొరాయిస్తుండటంతో షెడ్డుకు తీసుకెళ్లి బాగు చేయాల్సి వస్తోంది. అవి ప్రయాణికుల కోసం తిరగటం కంటే షెడ్లకు తిరగటమే ఎక్కువై పోయింది. గ్యారంటీ దాటితే.. కొత్త బస్సులు కావటంతో నిర్ధారిత సమయం వరకు వాటిని సరఫరా చేసిన కంపెనీలు ఉచితంగా మరమ్మతు చేస్తాయి. ఆ తర్వాత ఖర్చు ఆర్టీసీ భరించాల్సిందే. రెండు నెలల్లోనే అవి చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో.. గడువు తీరిన తర్వాత అవి ఖజానాను ఖాళీ చేస్తాయనే ఆందో ళన వ్యక్తమవుతోంది. త్వరలో మరి న్ని పొట్టి బస్సులు కొనాల్సి ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పు డు ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నీ సమస్యలే.. బస్సులో డీజిల్ వినియోగాన్ని నియంత్రించే డివైస్లు సరిగా పనిచేయటం లేదు. ఉన్నట్టుండి చెడిపోయి బస్సులు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. కొన్నింటిలో రేడియేటర్లు లీకై బస్సు ఇంజిన్ వేడెక్కి ఆగిపోతున్నాయి. క్లచ్ ప్లేట్ల సమస్యలు వస్తున్నాయి. ఇంజిన్ ఉన్నట్టుండి ఆగిపోతోంది. వైపర్లు పని చేయడం లేదు. దీంతో పెద్ద వర్షం కురిస్తే రోడ్డు కనిపించక డ్రైవర్లు బస్సును పక్కన నిలిపేస్తున్న సందర్భాలుంటున్నాయి. ఫిర్యాదులకు వాట్సాప్ గ్రూపు కొన్న బస్సుల్లో పెద్దవి బాగానే ఉండగా, మినీ బస్సులు మాత్రం నాసిరకంగా ఉన్నట్టు డిపో అధికారులు స్పష్టం చేస్తున్నారు. సగానికిపైగా బస్సులు ఏదో ఓ సమస్యతో మొరాయిస్తుండటంతో డిపో మేనేజర్లు ఫిర్యాదులతో విసిగిపోతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఫిర్యాదులకు ఏకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందులో బస్ తయారీ కంపెనీ ఇంజనీర్లను కూడా చేర్చారు. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా ఇంజనీర్లను కేటాయించింది. ఎక్కడైనా బస్ మొరాయించగానే సంబంధిత డిపో అధికారులు వివరాలను అందులో అప్లోడ్ చేస్తున్నారు. వెంటనే కంపెనీ ఇంజనీర్లు వచ్చి మరమ్మతు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో బస్సు అప్పటికప్పుడు బాగు పడక కంపెనీ గ్యారేజీకి తీసుకెళ్లాల్సి వస్తోంది. మినీ పల్లెవెలుగు పేరుతో.. ఆర్టీసీ కొనుగోలు చేసిన 100 మినీ బస్సుల్లో 48 ఏసీ బస్సులు పోగా మిగతావి నాన్ ఏసీ మినీ బస్సులు. కొన్ని ఏసీ బస్సులను వజ్ర పేరుతో నడుపుతుండగా.. నాన్ ఏసీ బస్సులను మినీ పల్లెవెలుగు పేరుతో నడుపుతున్నారు. వజ్ర పేరుతో హైదరాబాద్–నిజామాబాద్, హైదరాబాద్–వరంగల్ మధ్య తిరుగుతున్న ఏసీ బస్సులు తీవ్ర సాంకేతిక సమస్యలతో ఉన్న విషయం తెలిసిందే. వజ్ర బస్సులను ఓ కంపెనీ నుంచి, నాన్ ఏసీ మినీ బస్సులను మరో కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇవి ఆర్టీసీకి గుదిబండలుగా మారాయి. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న రూట్లలో పల్లెవెలుగు బస్సులకు ప్రత్యామ్నాయంగా నాన్ ఏసీ మినీ బస్సులను వాడుతున్నారు. అయితే నాణ్యమైన బస్సులు కాకపోవటంతో ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితి తలెత్తింది. ఇలా చెబుతూ పోతే సమస్యలెన్నో.. అవేవీ పాతబడి మరమ్మతు దశకు చేరుకున్నవి కాదు. కొత్తగా రెండు నెలల క్రితమే కొనుగోలు చేసిన మినీ బస్సులు. -
పల్స్ సర్వేకు అన్నీ అడ్డంకులే..
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన ప్రజాసాధికార సర్వే ప్రహసనంగా సాగుతోంది. వివరాల నమోదుకు ప్రభుత్వం రూపొందించిన యాప్ గందరగోళంగా ఉండటం, ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించకపోవడం, పదేపదే కార్యక్రమాన్ని వాయిదా వేయడం వెరసి అనేక సమస్యలతో స్మార్ట్ పల్స్ సర్వే నగరంలో ప్రహసనంగా సాగుతోంది. వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యూమరేటర్లుగా అవతారమెత్తి ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేస్తున్నా కొలిక్కి రాకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. వరుస సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలని గడువు విధించటంతో సిబ్బంది హడావుడి పడుతున్నారు. రాష్ట్రంలోని నివాస గృహాల్లో ఉండే ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకంగా, అర్హులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై 8న సీఎం చంద్రబాబు చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ అనేక సమస్యలతో కొనసాగుతోంది. సర్వే ప్రారంభించిన వెంటనే జిల్లాలో పుష్కరాల హడావుడి మొదలవడంతో ప్రక్రియ పూర్తిగా నెమ్మదించింది. ఆ తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో జూలై 8 నుంచి ఆగస్టు 24 వరకు వివరాలను నమోదు చేసుకునే యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరుసార్లు మార్పులు చేర్పులు చేశారు. దీంతో కొన్ని వివరాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో సర్వే మొదటినుంచి నిర్వహించాల్సిన పరిస్థితి గుంటూరులో ఏర్పడింది. నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు కలిపి 1,89,733 నివాస గృహాలు ఉండగా, వాటిలో 7,31,501 మంది నివసిస్తున్నారు. వీటిలో ఇప్పటికీ 2,76,436 మంది వివరాలు నమోదు కావాల్సి ఉంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి సూపర్వైజర్లతో పాటు 360 మంది ఎన్యూమరేటర్లు విధుల్లో ఉన్నారు. రంగంలోకి ఏఎన్యూ విద్యార్థులు.. సర్వేకు గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు ఏఎన్యూ విద్యార్థులను రంగంలోకి దింపారు. మొత్తం 150 మందిని ఈ సర్వేకు వినియోగించుకోవాలని భావించినా 50 మందికి మించి సర్వేలో పాల్గొనలేదు. సోమవారం కొంతమంది విద్యార్థులకు సర్వేపై అవగాహన కల్పించారు. అయినా వారికి స్పష్టత రాలేదు. దీంతో విద్యార్థులు ఎంతమంది సర్వేలో పాల్గొంటారో అధికారులే చెప్పలేకపోతున్నారు. స్పష్టత లేని ప్రభుత్వ ఆదేశాలు.. రాష్ట్ర ప్రభుత్వం సాధికార సర్వేకు సంబంధించి పూటకో నిబంధన మారుస్తుండటం మరింత సమస్యాత్మకంగా మారింది. తొలుత సర్వేలో భాగంగా కుటుంబ పెద్ద వేలిముద్రలు తీసుకుని మిగిలిన కుటుంబసభ్యుల పేరు, వివరాలు, వారి ఆధార్, రేషన్ కార్డు, ఇతర వివరాలు సేకరించారు. దాదాపు 20 రోజుల పాటు ఈ పద్ధతుల్లో సర్వే సాగింది. మళ్లీ ప్రభుత్వం దీనిలో మార్పులు చేసింది. కుటుంబంలో ప్రతి సభ్యుడి వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డు, ఇతర వివరాలు మొత్తం సేకరించాలని ఆదేశించడంతో మళ్లీ రెండోసారి ఇంటిబాట పడుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో వివరాలు నమోదు చేసుకునే మిషన్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం, ఇంటర్నెట్లు పనిచేయక యాప్ పనిచేయకపోవడంతో కొన్ని రోజులపాటు సర్వే నిలిచింది. సోమవారం 360 మంది ఎన్యూమరేటర్లు.. ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో సర్వే నిర్వహించకుండానే వెనుదిరిగారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ‘సర్వర్’ కష్టాలు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో దస్తావేజుల నమోదు నత్త నడక సాగుతున్నాయి. మహా నగరం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా మెరుగైన సాంకేతిక సేవల కల్పనలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నిరంతరం సర్వర్ డౌన్, నెట్వర్క్ మోరాయింపు వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖకు టీసీఎస్ నెట్వర్క్తో గల కాంట్రాక్ట్ గడువు ముగియడంతో సమస్య మరింత జఠిలమైంది. తాత్కాలికంగా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కేవలం పదంటే పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యల కార ణంగా గంటల కొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. సాధారణంగా నగరంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోlరోజుకు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా, సర్వర్ సమస్యతో 40 నుంచి 60 నిమిషాల సమయం తీసుకుంటోంది. అన్నింట్లో ఇదే దుస్థితి హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలోని నాలుగు డీఆర్ (డిస్ట్రిక్ రిజిస్ట్రార్ ఆఫీస్) పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెల రోజుల నుంచి సర్వర్ సమస్య సర్వసాధారణమైంది. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేక సర్వర్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఉమ్మడిగానే సర్వర్, ఇంటర్నెట్ కోసం స్టేట్వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)ను వినియోగిస్తున్నారు. ఇదే సర్వర్ను, ఇంటర్నెట్ సదుపాయాలను రెండు రాష్ట్రాలకు చెందిన మున్సిపల్, రెవెన్యూ, ట్రెజరీ.. తదితర ప్రభు త్వ శాఖలన్నీ వినియోగించుకుంటున్నాయి. 2 ఎంబీపీఎస్ సామర్థ్యంగల బ్రాండ్ బ్యాండ్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ ్ల శాఖ అవసరాలను తీర్చలేకపోతోంది. ఏదైనా సాఫ్ట్వేర్ చేర్చాల్సి వచ్చినప్పుడు సర్వర్ మరింత డౌన్ అవుతోంది. 1998 నుంచి కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) సిస్టమ్ ద్వారానే రిజి స్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్లో మాత్రమే చేయా ల్సి ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తి మార్కెట్ విలువను తెలుసుకోవాలన్నా, ప్రభు త్వ భూముల(పీవోబీ) వివరాల్లో తనిఖీ చేయాలన్నా ఇంటర్నెట్ వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం. మరోవైపు ఐదేళ్ల కిందట ఇచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు పనిచేయని స్థితికి చేరాయి. దీంతో పనిభారం పెరగడంతో పాటు అధిక సమయం తీసుకుంటోంది. కాలం చెల్లిన యూపీఎస్లతో పవర్ బ్యాకప్ సరిపోక రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిన సంఘటనలూ తరచూ జరుగుతున్నాయి. -
సాంకేతిక సమస్యలు అధిగమించాం
స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా ప్రత్యేకాధికారి శ్రీధర్ చంద్రశేఖరపురం(కొడవలూరు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ప్రాధమిక దశలో సాంకేతిక సమస్యలు వెన్నాడిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమస్యలను అధికమించినట్లు సర్వే జిల్లా ప్రత్యేకాధికారి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. చంద్రశేఖరపురంలో జరుగుతున్న ప్రజా సాధికార సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేకు తొలుత రాష్ట్రమంతా ఒకే సర్వర్ ఉండడం, సిబ్బందికి తగు శిక్షణ లేకపోవడం వల్ల సర్వే మందగించిందన్నారు. అయితే ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికిపోవడంతో జిల్లాకు ఒక సర్వర్ వంతున ఆధునిక పరిజ్ఞానం కలిగిన సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రాధమిక దశలో తలెత్తిన సమస్యలకు కళ్లెం పడి సర్వే ఊపందుకుందని చెప్పారు. సర్వే పూర్తయితే ప్రభుత్వ పాలన సులభతరమవుతుందని చెప్పారు. తొలుత కుటుంబ పూర్తి వివరాలు నమోదయ్యే దాకా సేవ్ కాకపోవడం సమస్యగా ఉండేదని, ఇపుడు ఆ సమస్యను కూడా అధికమించడం జరిగిందన్నారు. సర్వే వల్ల కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక పాలన స్తంభిస్తుండడం వాస్తవమేనని, కానీ ఒక నెలపాటు ఆ సమస్యను ఎదుర్కోకతప్పదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్ధారు రామకృష్ణ, ఏఎస్ఓ శ్రీనివాసులు, వీఆర్వో ఉలవపాటి వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు ఉన్నారు. -
మొదలైన ప్రైవేటు మెడికల్ కాలేజీల కుట్ర
► బీ కేటగిరీ సీట్ల దరఖాస్తుకు అడ్డంకులు ► వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ► ముందే సీట్లు అమ్మేసుకుంటున్న యాజమాన్యాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల కుట్ర మొదలైంది. గతేడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫీజుల పెంపు నుంచి ప్రవేశ పరీక్ష, అడ్మిషన్లు, నాలుగేళ్ల ఫీజు గ్యారంటీ వరకు అనేక విషయాల్లో చుక్కలు చూపించిన కాలేజీలు ఇప్పుడూ అదే పద్ధతి అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈసారి కూడా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోని 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తుది గడువు. అయితే విద్యార్థులు దరఖాస్తు చేసుకుందామనుకుంటే ఆన్లైన్లో సమస్యలు వస్తున్నాయి. వెబ్సైట్లో ప్రకటించిన నంబర్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వెబ్సైట్లో పేర్కొన్న అడ్రస్లోనూ ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలూ వస్తున్నాయి. దీంతో ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగానే వెబ్సైట్కు అంతరాయం కలిగిందని నిర్వాహకులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యాలు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పరీక్షపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముందే అమ్మేసుకుంటున్న వైనం.. రాష్ర్టంలోని ప్రైవేటు వైద్య, దంత విద్య కళాశాలల్లోని బీ కేటగిరీలోని 35 శాతం సీట్లకు పరీక్ష నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. 12 ప్రైవేటు కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు, మరో 10 కళాశాలల్లోని బీడీఎస్ సీట్లకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది ప్రైవేటు కాలేజీలు నిర్వహించిన ప్రత్యేక ప్రైవేటు వైద్య పరీక్షకు 5,130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2,266 మందికి ర్యాంకులు ప్రకటించారు. అందులో సీట్లు పొందిన వారి నుంచి ఫీజుల రూపంలో లాగేసుకున్న యాజమాన్యాలు.. మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగిలిన నాలుగేళ్ల ఫీజుకు కూడా బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి చేశాయి. దీంతో గ్యారంటీ చూపలేక సీటు కోల్పోయారు. దీంతో గతేడాదిలాగా తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు రాకుండా యాజమాన్యాలు ముందే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ముందే బీ కేటగిరీ సీట్లను అమ్మేసుకుంటున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీటు కొనుగోలు చేసిన విద్యార్థుల దరఖాస్తులనే ఆన్లైన్లో యాజమాన్యాలు నింపుతున్నాయని చెబుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్లో సమస్య వల్లే సర్వీస్ ప్రొవైడర్ వల్లే వెబ్సైట్లో సమస్య తలెత్తింది. దీన్ని త్వరలో సరిదిద్దుతాం. అలాగే గడువు తేదీని కూడా వచ్చే నెల ఐదో తేదీ వరకు పెంచాలని నిర్ణయించాం.- డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
గోల్కొండ ఖ్యాతికి ‘మసక’
♦ సౌండ్ అండ్ లైట్ షోలో తరచూ సాంకేతిక సమస్యలు ♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న ప్రదర్శనలు ♦ ఉత్సాహంగా వచ్చి ఉసూరుమంటున్న విదేశీ పర్యాటకులు సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యాటకులు ముచ్చటపడి వచ్చారు.. క్యూలో నిలబడి టికెట్ కొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో అంతా చీకటి.. ఓ మూలన తళుక్కుమంటూ కాంతి విరజిమ్మింది..! ‘‘రండి.. రండి.. మీకు సాదర స్వాగతం.. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గల ఈ గోల్కొండ కథ చెబుతాను.. ఇక్కడి రాళ్లకు జీవమే వస్తే హృదయాన్ని హత్తుకునేలా ఎన్ని కమనీయ కథలు చెప్పేవో.. ’’ అంటూ హిందీ, ఇంగ్లిష్లో గంభీరంగా అమితాబ్ బచ్చన్ గొంతు..! అంతే అందరిలో తెలియని పులకింత. మరోపక్క ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగు లైట్ల కాంతి లయబద్ధంగా కదలాడుతుంటే ప్రేక్షకుల్లో తన్మయత్వం! ఇంతలో గర్ర్ర్మంటూ శబ్దం.. ఆ వెంటనే నిలిచిపోయిన మాటలు.. లైట్ల కాంతిలోనూ మసక... షో ఆగిపోయింది. ‘‘సారీ.. సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేస్తున్నాం. మీ టికెట్ డబ్బులు వాపసు చేస్తాం తీసుకోండి..’’ అంటూ సిబ్బంది సూచన. విదేశీ పర్యాటకుల్లో తీవ్ర అసంతృప్తి... ఉసూరుమంటూ నిష్ర్కమణ.. గోల్కొండ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలో పరిస్థితి ఇదీ! ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద నిర్వహించే ఈ సౌండ్ అండ్ లైట్ షో అన్నింట్లోకెల్లా గోల్కొండ వద్ద ప్రదర్శించే షో ప్రత్యేకతే వేరు! దీన్ని అనుసరిస్తూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు గొప్ప ఖ్యాతిని మూటగట్టుకున్న ఈ షో ఇప్పుడు సాంకేతిక లోపాలతో విదేశీ పర్యాటకుల ముందు మన పరువు తీస్తోంది. మధ్యలో నిలిచిపోతున్న షోలు కోట వద్ద ప్రతిరోజూ తొలుత గంటపాటు ఆంగ్లంలో, ఆ తర్వాత గంటపాటు హిందీ/తెలుగు భాషల్లో రెండు విడతలుగా సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన 23 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పాతబడ్డ సౌండ్ అండ్ లైట్ షో వ్యవస్థ మొరాయిస్తోంది. దీంతో మధ్యలోనే ఆపేసి పర్యాటకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించి పంపుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఆ షోను ఎలాగోలా నిర్వహించేందుకు పర్యాటకశాఖ అధికారులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీన్ని ఆధునీకరించేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించటం లేదు. మరమ్మతు చేసినా మారని పరిస్థితి ఈజిప్టులో ఇలాంటి ప్రదర్శన గురించి 1988లో తెలుసుకున్న అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశం మేరకు 1993లో గోల్కొండలో ఈ ప్రదర్శన మొదలైంది. అప్పుడు ఏర్పాటు చేసిన లైట్లు, సౌం డింగ్ వ్యవస్థనే ఇప్పటివరకూ కొనసాగుతోంది. దీంతో అది దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితమే రూ.కోటితో మరమ్మతు చేయించా రు. అయినా తరచూ షో మొరాయిస్తోంది. పాతకాలం నాటి హాలోజన్ లైట్లను మార్చేసి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నిలిచిపోయిన ఎన్వైఎస్ఈ
♦ సాంకేతిక సమస్యలతో న్యూయార్క్ ఎక్స్ఛేంజీ నిలిపివేత ♦ షేర్లలో లావాదేవీల్లేవు; ముందస్తు ఆర్డర్లు కూడా రద్దు ♦ బుధవారం రాత్రి 9కి హాల్టు; అర్ధరాత్రికీ చక్కబడని తీరు ♦ సైబర్ దాడి కాదని... సాంకేతిక సమస్యలేనని చెబుతున్న అధికారులు ♦ యునెటైడ్ ఎయిర్లైన్స్కూ సాంకేతిక బెడద; విమానాలన్నీ నిలిపివేత ♦ వాల్స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ డౌన్ న్యూయార్క్ : అమెరికాలో అనూహ్య సంఘటనలు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా పేరొందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ తీవ్రమైన సాంకేతిక సమస్యలతో అల్లాడిపోయింది. ఫలితంగా ఈ ఎక్స్ఛేంజీలో లిస్టయిన షేర్లన్నిట్లోనూ లావాదేవీలు నిలిపేశారు. అప్పటికే పెట్టిన ఓపెన్ ఆర్డర్లన్నిటినీ రద్దు చేస్తున్నట్లు కూడా ఎక్స్ఛేంజీ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ విమానయాన సంస్థ యునెటైడ్ ఎయిర్లైన్స్నూ సాంకేతిక సమస్యలు అట్టుడికించాయి. దీంతో అమెరికాలోని తమ విమానాలన్నిటినీ ఈ సంస్థ అత్యవసరంగా కిందికి దింపేసింది. బయలుదేరాల్సిన విమానాలనూ కొంతసేపు నిలిపివేసింది. అదే సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ కూడా పనిచేయకుండా డౌనయిపోయింది. దీనికి కారణాలు తెలియరాకపోగా... యునెటైడ్ ఎయిర్లైన్స్ మాత్రం రౌటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని, దీన్ని సరిచేసి మళ్లీ అన్నిటినీ పునరుద్ధరించామని తెలియజేసింది. ఈ 3 ఘటనలకూ సంబంధం లేకపోయినా, దాదాపు ఒకే సమయంలో జరగటంతో ప్రాధాన్యమేర్పడింది. రాత్రి 9 గంటల నుంచీ నిలిపివేత... భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గ ంటల సమయంలో ట్రేడింగ్ను నిలిపేస్తున్నట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. దాదాపు రాత్రి 12 గంటల సమయానికి కూడా పరిస్థితి చక్కబడలేదు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) అధికారులు అధ్యక్షుడు ఒబామాకు కూడా పరిస్థితిని తెలియజేశారు. ‘‘ఎఫ్బీఐ కూడా రంగంలోకి దిగింది. కాకపోతే ఇది సాంకేతిక సమస్యే తప్ప సైబర్ దాడి కాదని మేం నమ్ముతున్నాం’’ అని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ట్రేడింగ్ను ఎప్పుడు పునరుద్ధరించేదీ మాత్రం ఈ వర్గాలు చెప్పలేకపోయాయి. రోజుకు 180 బిలియన్ డాలర్ల లావాదేవీలు... న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ పరిధిలో దాదాపు నాలుగు ఇండెక్స్లున్నాయి. ఎన్వైఎస్ఈ కాంపోజిట్ ప్రధాన ఇండెక్స్ కాగా, ఎన్వైఎస్ఈ 100 కూడా దీన్లో భాగమే. ఇంకా డౌజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్లు కూడా ఒప్పందం మేరకు దీని పరిధిలోనే పనిచేస్తాయి. ఎన్వైఎస్ఈలో ప్రతిరోజూ నమోదయ్యే లావాదేవీల పరిమాణ సగటు 180 బిలియన్ డాలర్లు. మార్కె ట్ క్యాపిటల్ దృష్ట్యా ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ఛేంజీ. ఎందుకంటే దీన్లో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ దాదాపు 16.6 ట్రిలియన్ డాలర్లు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీ ఈ) అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా.. ట్రేడింగ్ నిలి చిపోయే సమయానికి ఆ సంస్థ షేరు విలువ దాదాపు 4% నష్టపోయింది. -
కలెక్టరమ్మా పింఛన్!
మూడు నెలల నుంచి అరిగోస పడుతున్నం.. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పేరిట జాప్యం లక్షలాది మంది వికలాంగులం, వృద్ధులం, వితంతువులం, ఎదురుచూస్తున్నం.. పింఛన్ సమస్య గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధికంగా ఉంది. పట్టణవాసులు ప్రతి సోమవారం గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకోవడం.. అవి మున్సిపాలిటీకి పోవడం మినహా పెద్దగా ఫలితం ఉండడం లేదు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తే సమస్యను అధిగమించే అవకాశం ఉంది. ఇదే విధంగా వికలాంగుల కోసం సదరం క్యాంపులు నిర్వహిస్తే సమస్యలను అధిగమించవచ్చు.. - హన్మకొండ అర్బన్ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఆసరా పింఛన్ల ఎంపిక ప్రక్రియ మొదలై మూ డు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు డబ్బుల కో సం ఎదురుచూస్తున్నారు. పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సమగ్ర సర్వే సమయం లో అధికారులు చేసిన తప్పులు, డా టా ఎంట్రీలో అవకతవకలు పేదల పా లిట శాపంగా మారారుు. ఈ కారణాలతో కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నా.. ఎ న్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అనర్హులంటూ తిరస్కరణకు గురవుతున్నారుు. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ల విషయంలో ఆధార్కార్డులులేవని, వయసు తక్కువగా ఉం దని, రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ప్రధానంగా.. రెవెన్యూ అధికారుల నుంచి వయస్సు ధ్రువీకరణ పత్రం పొందడం అంతా సులువు కాదు. విచారణ అధికారులు విజ్ఞతతో ఆలోచించి పింఛన్ మంజూరు చేయూలని ఉన్నతాధికారులు చెపుతున్నా ఆ భారం మోసేం దుకు వారు సిద్ధంగా లేరు. దీంతో సాంకేతిక సమస్యలు, ఇతర చిన్నచిన్న పొరపాట్ల వల్ల పింఛన్ అందడం అగమ్య గోచరంగా మారింది. కలెక్టర్ కరుణ అరుునా దయ ఉంచి పింఛన్ ఇప్పించాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కోరుతున్నారు. జిల్లాలో 3.50 లక్షలు దాటిన పింఛన్లు జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం సుమారు 5.20 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 3,56,713 మందిని అర్హులుగా గుర్తించగా.. పింఛన్ మంజూరు అవుతోంది. వీరికోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.39,65,10,500 విడుదల చేస్తోంది. పిం ఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అధికారులు చెబుతున్నా.. గతంలో రెగ్యులర్గా పింఛన్ పొందుతున్నవారికీ ఇప్పుడు పింఛన్ ఆపేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల డబ్బులు ఒకేసారి ఇప్పించాలని పింఛన్ బాధితులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహించడం లేదు. ఫలితంగా వికలాంగులు వికలాంగ ధ్రువీకరణపత్రాలు పొందలేక పోతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించాలని కలెక్టరేట్లో గ్రీవెన్స్లో వినతిపత్రాలు వస్తున్నారుు. ఈ విషయంలో డీఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకోవాలి. రోజూ పింఛన్రాని వారు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అధికారులను కలిసి వినతులు సమర్పిస్తున్నారు. నేను ఏం పాపం చేశాను.. నా పేరు అంబాల కిరణ్. మాది వరంగల్లోని ఎల్లంబజార్. నేను ఏం పాపం చేశాను. ఆ దేవుడు నన్ను ఇట్లా పుట్టిం చాడు. ఈ స్థితిలో ఏం పని చేయను. వంద శాతం వైకల్యం అంటూ వైద్యులు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో నెలనెల పింఛన్ వచ్చేది. మూడు నెలలుగా రావడం లేదు. పింఛన్ నా పేరిట మంజూరైందట. కానీ ఆధార్ కార్డు నంబరు మా అయ్య కార్డు నంబరు పడిందట. మూడు నెలలుగా రోజూగా మునిసిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా. వరుసగా మూడు నెలలు డబ్బులు తీసుకోకపోతే పింఛన్ పోతదట. అధికారులు పింఛన్ ఇవ్వాలి. - వరంగల్ అర్బన్ -
‘ఆసరా’ కోసం అగచాట్లు
పండుగనాడూ పెన్షన్ టెన్షన్ క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు కాని పంపిణీ ప్రక్రియ సాంకేతిక సమస్యలు,వరుస సెలవులతో జాప్యం రాష్ర్టవ్యాప్తంగా ఇంకా 2.20 లక్షల మందికి అందని పింఛన్లు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వచ్చినా పింఛన్లు అందడం లేదంటూ వాటిపైనే ఆధారపడిన అభాగ్యులు మథనపడుతున్నారు. సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎలాంటి ఆసరా లేక ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతిలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా ఆదేశించినా రాష్ట్రంలో ఇంకా 2.20 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అలాగే తొలి విడతలో పింఛను మంజూరు కాని వారంతా మళ్లీ దరఖాస్తులు పట్టుకుని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పింఛన్ల పథకం ‘ఆసరా’ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించిన వ్యవస్థ సమర్థంగా లేదని కూడా తెలుస్తోంది. ఓవైపు అర్హులుగా ఎంపికైన వారికే పింఛన్లను పంపిణీ చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉండగా, మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్నా పింఛను రాలేదంటూ.. చాలామంది బాధితులు కొత్తగా మళ్లీ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఈ దరఖాస్తులు గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోడానికి దరఖాస్తుదారులంతా నిత్యం ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో జిల్లాకు కనీసం 30 వేల చొప్పున రాష్ట్రమంతటా కలిపి మూడు లక్షలకుపైగా కొత్త దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విపరీతమైన పనిఒత్తిడిలో ఉన్న అధికారులు ఈ కొత్త దరఖాస్తులను పరిశీలించడానికే హడలెత్తిపోతున్నారు. కాగా, పింఛన్ల పంపిణీలో జాప్యానికి గత రెండు నెలల్లో వచ్చిన వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. అలాగే సాంకేతిక సమస్యలు, వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం, లబ్ధిదారులకు పింఛను సొమ్ము(నగదు)ను నేరుగా వారి చేతికి ఇవ్వాల్సి రావడం తదితర అంశాలను కూడా పేర్కొంటున్నారు. అయితే సొమ్ము పంపిణీ సందర్భంగా పింఛను మంజూరు కాని వారితో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని కూడా వాపోతున్నారు. వచ్చే నెల నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు పింఛను సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఇకపై పంపిణీలో జాప్యం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులందరికీ పింఛన్ల పంపిణీ పూర్తి చేసి, కొత్త వాటి పరిశీలనను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు