van
-
వెచ్చగా ఉంచే ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్కు యార్క్షైర్ కౌంటీలో ఒక పబ్తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్స్టా గ్రామ్లో పోస్ట్చేశారు. ‘‘ చిన్న వ్యాన్లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్నట్ స్క్వాష్ పై, కేక్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ వ్యాన్లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్లోను, 7.50 మీటర్ల మోడల్లోను దొరుకుతుంది. ‘సీల్వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. (చదవండి: ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
ఫ్రీగా దొరికిన కూరగాయలు..ఎగబడ్డ జనాలు
-
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
బీర్ల వ్యాన్ బోల్తా
-
ట్రాక్టర్, వ్యాను ఢీ.. చెలరేగిన మంటలు.. 26 మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు. చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో.. -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు. చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం -
ఉదయ్పూర్ యువరాజు మనసు దోచిన వెహికల్ ఇదే! నెట్టింట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్లు చేరాయి. ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్లు, ఇండియూజువల్ AC వెంట్లు , ఛార్జింగ్ పోర్ట్లు వంటి ఫీచర్లున్నాయి. ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు. -
సందడిగా పెట్ గ్రూమింగ్ వ్యాన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
దేశంలో తొలి మోడల్.. ఫోర్స్ మోటార్స్ అర్బేనియా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్స్ మోటార్స్ తయారీ అర్బేనియా కొద్ది రోజుల్లో రోడ్డెక్కనుంది. యాత్రలు, కార్యాలయ సిబ్బంది ప్రయాణానికి ఇది ఉపయుక్తం. మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్నుబట్టి డ్రైవర్తోసహా 18 మంది కూర్చునే వీలుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది. 115 హెచ్పీ, 350 ఎన్ఎం పీక్ టార్క్తో మెర్సిడెస్ ఎఫ్ఎం 2.6 సీఆర్ ఈడీ టీసీఐసీ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. ఈ సెగ్మెంట్లో దేశంలో డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, రోల్ఓవర్ ప్రొటెక్షన్తో తయారైన తొలి మోడల్ ఇదే. మోనోకాక్ స్ట్రక్చర్, హిల్ హోల్డ్ అసిస్ట్, కొలాప్సిబుల్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీల్డ్ పనోరమిక్ విండోస్, 17.8 సెంటీమీటర్ల ఎల్సీడీ టచ్స్క్రీన్ వంటి హంగులు ఉన్నాయి. 15 రోజుల్లో డీలర్షిప్లకు అర్బేనియా వాహనాలు చేరనున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. రూ.1,000 కోట్లతో అర్బేనియా వాహనాల అభివృద్ధి, తయారీ ప్రాజెక్టును ఫోర్స్ మోటార్స్ చేపట్టింది. -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫొటోలో ఉన్నది కొత్త మోడల్ వ్యాన్లా కనిపిస్తోంది కదూ! ఇది కొత్త మోడల్ వ్యాన్ మాత్రమే కాదు, దాదాపు ఉభయచర వాహనం. దాదాపు ఉభయచర వాహనమేంటి అనుకుంటున్నారా? ఔను! ఇది పూర్తి ఉభయచర వాహనం కాదు గాని, ఆపద్ధర్మానికి ఉభయచర వాహనంగానే పనికొస్తుంది. ఇది ఎలాంటి రోడ్ల మీదనైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది. అంతేకాదు, వరదనీరు ఉధృతంగా రోడ్లను ముంచెత్తినప్పుడు కూడా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. ‘ఎస్ట్యువరీ హోపర్’ పేరిట బ్రిటిష్ ఆటోమొబైల్ డిజైనర్ జోర్డాన్ బేమ్స్ ఈ విచిత్ర వాహనానికి రూపకల్పన చేశాడు. ఇది ‘సెమీ యాంఫీబియస్ వెహికల్’ అని చెబుతున్నారు. అంటే దాదాపు ఉభయచర వాహనమన్న మాట! వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు తరచుగా వరదల బారినపడే మన రోడ్ల మీదకు వస్తే బాగుంటుంది కదూ! చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం! -
సీఆర్ ఫౌండేషన్కు ఎస్బీఐ వాహనం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్బీఐ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్ను శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ జానకిరామన్ తెలిపారు. బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
పోలీసులపై దూసుకెళ్లిన వ్యాన్!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా పుదుచత్రం ఏకే సముద్రం జాతీయ రహదారిలో ఆదివారం వేకువ జామున ఓ కారు డివైడర్ను ఢీ కొట్టింది. అదే సమయంలో మరో లారీ సైతం అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పుదుచత్రం, రాశిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న నలుగుర్ని రక్షించారు. స్వల్పగాయాల పాలైన వారికి అక్కడే ప్రథమ చికిత్స అందించారు. రోడ్డుకు అడ్డంగా ఆగిన కారు, లారీని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వేగంగా దూసుకొచ్చి.. తొలగింపు పనుల్లో నిమగ్నమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపైకి ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే భారీ నష్టం.. జరిగిపోయింది. పుదుచత్రం స్టేషన్ స్పెషల్ ఎస్ఐ చంద్రశేఖర్(55), రాశిపురం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవరాజన్(35) ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రాశిపురం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తురు. దేవరాజన్, చంద్రశేఖర్ మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, తలా రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. రిటైర్డ్ ఇన్స్పెక్టర్ను బలిగొన్న బైక్ రేసింగ్ చెన్నై శివారులోని వండలూరు ఎక్స్ప్రెస్ వేలో యువకులు బైక్ రేసింగ్లో దూసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం అరుంబాక్కంకు చెందిన రిటైర్డ్ మహిళా ఇన్స్పెక్టర్ సెల్వకుమారి మేల కోట్టై పోలీసు క్వార్టర్స్ నుంచి బైక్లో బయలు దేరారు. మార్గం మధ్యలో బైక్ రేసింగ్లో ఉన్న యువకులు ఆమె వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. బైక్ రేసింగ్లో దూసుకొచ్చిన ఓ యువకుడు ఒకడు గాయపడ్డాడు. మిగిలిన వారు పరారయ్యారు. -
పెళ్లి వ్యాన్ బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం
గూడెంకొత్తవీధి : వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ పెళ్లి వ్యాను అదుపుతప్పిన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం వివరాలివి. మండలంలోని గాలికొండ గ్రామానికి చెందిన వధువు, లక్కవరం గ్రామానికి చెందిన వరుడికి బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఓ వ్యానులో గాలికొండ నుంచి లక్కవరం గ్రామానికి రాత్రి వారంతా చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విందు భోజనం అనంతరం స్వగ్రామానికి పయనమయ్యారు. బూసుల ఘాట్ రోడ్డులో బొలేరో వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. ప్రమాదంలో గుమ్మాలగొంది గ్రామానికి చెందిన కాకూరి నర్సింగరావు(45), బత్తునూరు గ్రామానికి చెందిన శ్రీహరి(18), శామ్యూల్(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జి.కె.వీధి పీహెచ్సీకి తరలించగా వైద్యాధికారి రామ్నాయక్ వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 15 మంది కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. వాహనంలో ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఘాట్లో రక్షణ గోడ లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెను ప్రమాదం సంభవించేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సమీర్ తెలిపారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
ఇదీ రూట్.. ఒరిస్సా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్.. కానీ మధ్యలో..
సాక్షి, సిటీబ్యూరో: ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, అమరావతికి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు, రిసీవర్ పరారీలో ఉండగా.. గంజాయి లోడ్ వాహన డ్రైవర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. వీరి నుంచి 560 కిలోల గంజాయి. కారు, డీసీఎం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అమరావతికి చెందిన నౌషాద్ ముంబై, అమరావతి ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఉస్మాన్నగర్కు చెందిన సలీమ్ ఉల్లా అలియాస్ రాజు, షేక్ రెహాన్, షేక్ వసీం సహకరించేవారు. ఒరిస్సా చిత్రకొండకు చెందిన సంతోష్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నౌషాద్.. సంతోష్ను సంప్రదించి, 1,000 కిలోల ఎండు గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్స్గా రూ.2 లక్షలు చెల్లించాడు. దీంతో సంతోష్ 560 కిలోల గంజాయిని సిద్ధం చేసి నౌషాద్కు సమాచారం అందించాడు. (చదవండి: హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్.. ) నౌషాద్ భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బంగాళదుంపలను రవాణా చేయాలని కోరుతూ.. హైదరాబాద్కు చెందిన ఇక్బాల్ను సంప్రదించాడు. ఈనెల 15న సలీం, రెహాన్, వసీం కారులో ఖమ్మం వెళ్లారు. అక్కడ ఇక్బాల్ ఏర్పాటు చేసిన డీసీఎం తీసుకున్నారు. సలీం డీసీఎం నడుపుతూ భద్రాచలం వెళ్లి అక్కడ 3 టన్నుల బంగాళా దుంపలు లోడ్ ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి ఈనెల 18న చిత్రకొండ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డీసీఎంను పార్క్ చేసి సంతోష్కు సమాచారం అందించాడు. సంతోష్ డీసీఎంలో 560 కిలోల గంజాయి లోడ్ చేసి మిగిలిన ముగ్గురికి సమాచారం అందించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. సలీం డీసీఎంను డ్రైవ్ చేస్తుండగా రెహాన్, వసీం కారులో ఎస్కార్ట్గా అమరావతి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దులో తనికీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నిందితులు టోల్ రోడ్లు రాకుండా డీసీఎంను దారి మళ్లించారు. హిమాయత్సాగర్ మీదుగా వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీసులు పీడీపీ క్రాస్రోడ్ వద్ద డీసీఎం, ఎస్కార్ట్గా వెళుతున్న కారును అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విషయం బయటపడింది. కిలో 1,250 చొప్పున కొనుగోలు చేసి.. వినియోగదారులకు రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ను ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్నా డ్రైవర్తో సహ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
శ్రీశైలం: లోయలో పడిన వ్యాన్
-
శ్రీశైలం ఘాట్రోడ్డు: లోయలో పడిన వ్యాన్
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వ్యాన్ లోయలో పడింది. అందులో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ధూల్పేటలోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది క్వాలీస్ వాహనంలో శ్రీశైలం బయల్దేరారు. ఈగలపెంట సమీపంలో మైసమ్మగుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న నమ్రతాసింగ్, హేమలత, అనిల్ సింగ్, అస్మిత్ సింగ్, ధర్మేష్, సుమన్లత, నీతూ సింగ్, రాజకుమారి, ధార్మిక్ గాయపడ్డారు. (స్పీడ్పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) క్షతగాత్రులను మూడు అంబులెన్స్లో ఈగలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నీతూ సింగ్ (40), రాజకుమారి (55), ధర్మిక్ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలించారు. మిగతావారిని కూడా ఈగలపెంటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. (సారు చెబితేనే చేశాం..) స్థానికుల సహాయం దోమలపెంట ప్రాంత యువకులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావు దేవస్థానానికి చెందిన రెండు అంబులెన్స్లు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓ అంబులెన్స్ను ఈగలపెంటకు పంపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ధులే జిల్లా వించూర్ సమీపంలో అర్థరాత్రి సమయంలో ఓ వ్యాన్ అదుపు తప్పి వంతెన పైనుంచి లోయలో పడింది. దీంతో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఏడుగురు సంఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బర్త్డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్ను దుల్కర్కి గిఫ్ట్గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్తో ఎమోషనల్గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
చెత్తవ్యానును ఢీకొన్న ఎన్టీపీసీ రైలు
యైటింక్లయిన్కాలనీ(గోదావరిఖని): రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లోని చెత్తను రైల్వేట్రాక్ దాటి డంపింగ్ చేసి వస్తున్న క్రమంలో శుక్రవారం ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేస్తున్న రైలు ఢీకొంది. ఈసంఘటనలో ఎవరికీ ఏలాంటి గాయాలు కాలేదు. ఎప్పటిలాగే చెత్తను డంపింగ్చేసేందుకు ట్రాక్ దాటి వెళ్లిన వ్యాను తిరిగి ట్రాక్ దాటుతుండగా నిలిచిపోయింది. దీంతో బొగ్గు లోడ్తో వస్తున్న ఎన్టీపీసీ రైలు ఢీకొంది. పక్కన రెయిల్ ఉండటంతో దాన్ని ఆనుకుని వ్యాన్ నిలిచిపోయింది. లేకంటే కట్టపైనుంచి కిందపడే ప్రమాదముండేంది. -
చైనాలో వ్యాన్ బీభత్సం
-
ఘాట్రోడ్డులో ప్రమాదం: ఐదుగురు మృతి
మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టాటా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరిని కాకినాడ జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో రఘు అనే వ్యక్తి మృతిచెందాడు. రాణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు. -
ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన వ్యాన్
సాక్షి, వాషింగ్టన్: ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలీదు. కానీ, వ్యాన్ ప్రమాదానికి గురైన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. డ్రైవర్ అదుపు తప్పిన వ్యాన్ తొలుత మళ్లీ డ్రైవర్ అదుపులోకి వచ్చినట్లు కనిపించి.. వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే రూట్లో వెళ్తున్న మరో వాహనంలోని వ్యక్తి వ్యాన్ ప్రమాదానికి గురైన తీరును వీడియో తీశాడు. అనంతరం సోషల్మీడియాలో ఈ ప్రమాద ఘటన వీడియోను పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన వ్యాన్
-
పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ !
కరాచీ: వ్యాన్లో ఉన్న సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరాచీలో ఆదివారం జరిగింది. కరాచీలోని గార్డెన్ ఏరియాకు చెందిన సలీం, మహమ్మద్ అలీలు కుటుంబంతో కలిసి హక్స్బే ప్రాంతానికి పిక్నిక్ నిమిత్తం వెళ్లారు. వీరు వెళ్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాను వెనుక వైపు మంటలు చెలరేగి అకస్మాత్తుగా పేలింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చేలోపే అగ్నికి ఆహుతి అయ్యారు. రెస్క్యూటీం హుటాహుటిన చేరుకుని నలుగురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృత్యుల్లో ముగ్గురు మగవారు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
తొండంగి (తుని) : మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వాహనంలో బయలుదేరిన వ్యాపారులు మార్గమధ్యలోనే ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. యానాంలోని యూకేవీ నగర్కు చెందిన వ్యాపారులు సీహెచ్ గోవిందు, భావన రాంబాబు, సాపిరెడ్డి ఏసు మామిడికాయలు కొనుగోలుకు టాటా ఏస్ వ్యాన్లో తుని బయలుదేరారు. కాకినాడ బీచ్రోడ్డు మీదుగా ఒంటిమామిడి జంక్షన్ నుంచి తొండంగి మీదుగా అన్నవరం బైపాస్లోకి వస్తున్నారు. ఎ.కొత్తపల్లి కావటి చెరువు మలుపు వద్ద వీరు వస్తున్న వీరి వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన సమయంలో వ్యాన్ తొట్టెలో ఇద్దరు నిద్రస్తుండగా డ్రైవర్ రాజు, వ్యాపారి గోవిందు (42) కేబిన్లో ఉన్నారు. గోవిందు కాళ్లు నుజ్జవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాంబాబు, ఏసుబాబులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతినికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన మృతుడు గోవిందు బంధువులు, కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉపాధి కూలీ... మరొకరికి తీవ్ర గాయాలు తాళ్లరేవు (ముమ్మిడివరం) : పోలేకుర్రు పంచాయతీ చినబాపనపల్లిలో బుధవారం పిడుగు పడడంతో ఉపాధి కూలీ కర్రి సత్యనారాయణ (42) మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఇరిగేషన్ కాలువలో సుమారు 120 మంది ఉపాధి కూలీలు పని చేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వర్షం వస్తుంటే ఐదుగురు పూరిపాకలోకి వెళ్లారు. అక్కడ పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తీవ్రగాయాల పాలైన దాకే చిట్టిబాబును స్థానికులు యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెపుతున్నారు. పిడుగుపాటు సత్యనారాయణ మృతి చెందడంతో కూలీలు తీవ్ర ఆవేదన చెందారు. స్థానిక సర్పంచ్ మొండి హరిచిన్నారావు, తహసీల్దార్ లోడా జోసెఫ్, ఎంపీడీఓ సీహెచ్ చినబాబు, ఏఎస్సై ఏవీ సుబ్బారావు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా కోసం తరలించారు. కోరంగి ఎస్సై వి.సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంచార పశువైద్యశాలలు ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంపద పరిరక్షణకు ఉద్దేశించిన సంచాల పశు వైద్యశాలలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వాహనాన్ని కలెక్టరేట్ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోనిలకు ప్రభుత్వం సంచార పశువైద్యశాలలను మంజూరు చేసిందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాహనం, డాక్టరు, ఒక పారా సిబ్బంది ఉండి పశుసంపదకు సేవలు అందిస్తారని తెలిపారు. పశువైద్యశాలలు లేని గ్రామాలకు వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తారన్నారు. వీటిని స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు సంచార పశువైద్యాశాలలను సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఏకో డెవలప్మెంటు సొసైటీకి, మరో రెండు అంకుష్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. వీటిపై ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 75 లక్షలు ఖర్చు చేస్తే, స్వచ్చంద సంస్థలు రూ.25 లక్షలు ఖర్చు చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశుసంపదకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్కుమార్, ఏడీ విజయుడు, పశువైద్యాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. æ -
లోయలో పడ్డ వ్యాన్
చెన్నై: ఊటీ-మేటిపాల్యం రహదారిలో వ్యాన్ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
వ్యాన్ను ఢీకొన్న ఆర్టీసీ నాన్స్టా‹ప్
గండేపల్లి/పెద్దాపురం : కాకినాడ–రాజమహేంద్రవరం నాన్స్టా‹ప్ ఆర్టీసీ బస్సు ఏడీబీ రోడ్డులో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రమాదానికి గురవడంతో బస్సు డ్రైవర్ సహా 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సుమారు 45 మంది ప్రయాణికులతో రాజమహేంద్రవరం వెళుతున్న ఈ బస్సుకు లలితా రైస్ గొడౌన్ నుంచి వస్తోన్న ఐషర్ వ్యాన్ అడ్డం వచ్చింది. వ్యాన్ రోడ్డుపైకి రావడాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కనకాల శ్రీనివాసరావు బస్సును అదుపు చేస్తుండగా వ్యాన్ వెనక భాగంలో ఢీకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. డ్రైవర్ వెనక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో బస్సులోని వారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొద్దిసేపటికే తేరుకుని గాయపడ్డ వారిని కిందకు దించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108లో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు వేరే బస్సులో రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. పోలీసులకు ఈ సమాచారం వెంటనే తెలియజేయలేదు. దీంతో వారు సోమవారం ఉదయం పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వివరాలు సేకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రజనీకుమార్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు క్షతగాత్రులు కె.దుర్గప్రసాద్, కె.సత్య, యు.వీరభద్రరావు, ఎం.సత్య, పి.చిరంజీవి, కె.శ్రీనివాసరావు. వి.సతీష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ఆస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాకినాడకు చెందిన యు.వరలక్ష్మి, ఎన్.ప్రవీణ్కుమార్, వి.వెంకట్రావు, జీవీ రాఘవేంద్రరావు, ఫణికుమార్, సూర్యనారాయణ, జీవీవీ సత్యనారాయణ, ఎండీ నజీరుద్దీన్ తదితరులను ప్రాథమిక చికిత్స అనంతరం వారి గ్రామాలకు తరలించినట్టు తెలిసింది. అర్ధరాత్రి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గండేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ వారు స్పందించలేదని క్షతగాత్రులు ఆరోపించారు. మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి ఆదేశం ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వైద్యాధికారులను ఆదేశించారు. పెద్దాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
ల్యాండ్మైన్ పేలుడు.. పదిమంది మృతి
ఇస్లామాబాద్: ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ల్యాండ్మైన్ ధాటికి ముక్కలైంది. పాకిస్తాన్లోని కుర్రం ఏజెన్సీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. వాహనం గొడార్ గ్రామం నుంచి సొడా గ్రామానికి వెళ్తుండగా ల్యాండ్మైన్ పేలుడు సంభవించింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాఫ్టర్ సహాయంతో పెషావర్కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుర్రం ఏజెన్సీ ఆఫ్గన్ సరిహద్దుల్లో ఉన్న ట్రైబల్ ప్రాంతం. -
తూ.గో.జిల్లా కాకినాడలో దారుణం
-
రోడ్డుప్రమాదంలో ఎస్బీఐ ఉద్యోగుల దుర్మరణం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూరు -అమీర్పూర్ హైవేపై బుధవారం అర్థరాత్రి జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా గాటంపూర్లో విధులు ముగించుకుని మారుతి ఒమ్ని వ్యానులో వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు కంటెయినర్ ఢీ కొట్టింది. దాంతో ఒమ్ని వ్యాను అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అనంతరం కంటెయినర్ వ్యాన్ మీద పడిపోయింది. మారుతి ఒమ్నిలోని ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఫీల్డ్ అధికారి, అసిస్టెంట్ మేనేజర్సు, వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. మరోవైపు కంటెయినర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్
పది మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ప్రత్తిపాడు: పదహారో నంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి రెండు ఆటోలను ఢీకొట్టడంతో పది మంది గాయాలపాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే బుధవారం మధ్యాహ్నం గుంటూరు నుంచి కర్నూలు జిల్లా నంద్యాల వెళుతున్న బొలెరో వాహనం ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా దర్శి వెళుతున్న పాసింజర్ ఆటోను ఢీకొట్టింది. అప్పటికీ వేగం నియంత్రణ కాకపోవడంతో హైవేపై ఉన్న ఫెన్సింగ్ను ఢీకొట్టి ఫెన్సింగ్ తెంచుకుంటూ సర్వీస్ రోడ్డులోనికి దూసుకువెళ్లింది. అదే సమయంలో సర్వీస్ రోడ్డులో వస్తున్న కాటూరి వైద్యశాలకు చెందిన టాటా ఏస్ ఆటోను కూడా ఢీకొట్టింది. పది మందికి గాయాలు.. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్ జి. శివారెడ్డి (75), డ్రైవర్ కొమ్ము నాగోబులేసు (21), టాటాఏస్ ఆటోలో ప్రయాణిస్తున్న యడ్లపాడు మండలం ఉప్పలపాడుకు చెందిన విప్పర్ల సురేష్ (29), కాటూరి వైద్యశాలలో స్టోర్ ఇన్చార్జిగా పనిచేస్తున్న గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంకు చెందిన చతుర్వేది ఆనంద్కుమార్ (45), ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరు కేవీపీ కాలనీకి చెందిన బోనాల సురేష్రెడ్డి (32), వేముల నాగరాజు (30), షేక్ శిలార్ (33), గండికోట నరసింహస్వామి (32), వేముల రవి (32), గుంటూరు విరియంరాజు నగర్కు చెందిన కాటం శ్రీనివాస్ (30) తీవ్ర గాయాలపాలయ్యారు. పాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురూ డ్రైవర్లు కాగా, టాటాఏసీ వాహనంలో ఉన్న ఇద్దరూ కాటూరి వైద్యశాలలో పనిచేస్తున్నారు. కాటూరి వైద్యశాలకు తరలింపు.. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని కాటూరి వైద్యశాలలో చేర్పించారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్ జి.శివారెడ్డి కేఎల్యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న తన మనుమరాలిని కళాశాల వద్ద వదిలి తిరిగి నంద్యాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాసింజర్ ఆటో నుజ్జునుజ్జు అవగా, టాటాఏసీ వాహనం తిరగబడి ధ్వంసమైంది. బొలెరో వాహనం ముందు రెండు టైర్లూ ధ్వంసమయ్యాయి. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ఆటోలను ఢీకొట్టిన వ్యాన్
పది మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ప్రత్తిపాడు: పదహారో నంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి రెండు ఆటోలను ఢీకొట్టడంతో పది మంది గాయాలపాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే బుధవారం మధ్యాహ్నం గుంటూరు నుంచి కర్నూలు జిల్లా నంద్యాల వెళుతున్న బొలెరో వాహనం ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా దర్శి వెళుతున్న పాసింజర్ ఆటోను ఢీకొట్టింది. అప్పటికీ వేగం నియంత్రణ కాకపోవడంతో హైవేపై ఉన్న ఫెన్సింగ్ను ఢీకొట్టి ఫెన్సింగ్ తెంచుకుంటూ సర్వీస్ రోడ్డులోనికి దూసుకువెళ్లింది. అదే సమయంలో సర్వీస్ రోడ్డులో వస్తున్న కాటూరి వైద్యశాలకు చెందిన టాటా ఏస్ ఆటోను కూడా ఢీకొట్టింది. పది మందికి గాయాలు.. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్ జి. శివారెడ్డి (75), డ్రైవర్ కొమ్ము నాగోబులేసు (21), టాటాఏస్ ఆటోలో ప్రయాణిస్తున్న యడ్లపాడు మండలం ఉప్పలపాడుకు చెందిన విప్పర్ల సురేష్ (29), కాటూరి వైద్యశాలలో స్టోర్ ఇన్చార్జిగా పనిచేస్తున్న గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంకు చెందిన చతుర్వేది ఆనంద్కుమార్ (45), ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరు కేవీపీ కాలనీకి చెందిన బోనాల సురేష్రెడ్డి (32), వేముల నాగరాజు (30), షేక్ శిలార్ (33), గండికోట నరసింహస్వామి (32), వేముల రవి (32), గుంటూరు విరియంరాజు నగర్కు చెందిన కాటం శ్రీనివాస్ (30) తీవ్ర గాయాలపాలయ్యారు. పాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురూ డ్రైవర్లు కాగా, టాటాఏసీ వాహనంలో ఉన్న ఇద్దరూ కాటూరి వైద్యశాలలో పనిచేస్తున్నారు. కాటూరి వైద్యశాలకు తరలింపు.. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని కాటూరి వైద్యశాలలో చేర్పించారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన డాక్టర్ జి.శివారెడ్డి కేఎల్యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న తన మనుమరాలిని కళాశాల వద్ద వదిలి తిరిగి నంద్యాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాసింజర్ ఆటో నుజ్జునుజ్జు అవగా, టాటాఏసీ వాహనం తిరగబడి ధ్వంసమైంది. బొలెరో వాహనం ముందు రెండు టైర్లూ ధ్వంసమయ్యాయి. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
మొక్కజొన్న పొత్తుల ముసుగులో రవాణా ముందస్తు సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు l23 గంజాయి బస్తాలు గుర్తింపు? రావులపాలెం: మొక్కజొన్న పొత్తుల ముసుగులో గంజాయిని తరలిస్తున్న ఉధంతమిది. వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రావులపాలెం మీదుగా ఒక వ్యాన్లో భారీగా గంజాయి తరలిపోతున్నట్టు బుధవారం తెల్లవారు జామున రావులపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి జాతీయ రహదారిపై కాపు కాశారు. రావులపాడు శివారు మల్లాయిదొడ్డి సమీపంలో మొక్కజొన్న పొత్తులతో వెళ్తున్న ఒక మినీ వ్యాన్ను ఆపి తనిఖీ నిర్వహించారు. మొక్కజొన్న పొత్తుల అడుగున గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండగా పోలీసుల ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వ్యాన్ను పోలీసులు సమీపంలో ఒక పెట్రోల్ బంకు వద్ద సీఐ పీవీ రమణ, తహసీల్దారు సీహెచ్ ఉదయభాస్కర్, ఎస్సై పీవీ త్రినాథ్ సమక్షంలో మొక్క జొన్న పొత్తులను తీసి చూడగా ఆ వ్యాన్లో 23 బస్తాల గంజాయిని గుర్తించారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలిసింది. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు, నిందితుల వివరాలు త్వరలో తెలుపుతామని సీఐ రమణ తెలిపారు. -
పంటపొలాల్లోకి దూసికెళ్లిన పాఠశాల వ్యాన్
ఐదుగురు చిన్నారులకు స్వల్పగాయాలు చండ్రుగొండ : మండల కేంద్రం చంద్రుగొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యాన్ శుక్రవారం సాయంత్రం అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. చంద్రుగొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యాన్ (టాటామేజిక్) చంద్రుగొండ నుంచి గుర్రాయిగూడెం గ్రామానికి విద్యార్థులను తీసుకెళుతుంది. మార్గమధ్యలో అదుపుతప్పి పంటపొలాల్లోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన నరెడ్ల గీతిక, సానిక అనుశ్రీ, సానికి మనోజ్కుమార్, గుర్రం రాజేష్, అవునూరి సాయిలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే మిషన్ భగీరథ పైప్లైన్ల నిర్మాణాల కోసం తీసిన గోతుల్లోని మట్టి రోడ్డుపై ఉండటంతో రోడ్డంతా చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే వ్యాన్ అదుపుతప్పి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను ఓ ప్రైవేట్ క్లీనిక్లో వైద్యచికిత్సలు అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రమాకాంత్ పరిశీలించారు. -
యువకుడి దుర్మరణం
ఏలూరు అర్బన్ : బైకుపై స్నేహితునితో కలిసి ఇంటికి వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళం రాము (26) అనే యువకుడు స్నేహితుడు శివాజీతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి బైక్పై ఏలూరు నుంచి లక్ష్మీపురం బయలుదేరాడు. మార్గమధ్యలో తంగెళ్లమూడి ప్రాంతంలోని జేఎంజే స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందగా శివాజీ గాయాలపాలయ్యాడు. ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని, మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అయ్యో పాపం..
– వాహనంలో తరలిస్తుండగా జారి కిందపడిన ఆవు – కాలు విరిగి కదలలేని స్థితిలో గోమాత చెన్నేకొత్తపల్లి : గోమాతకు కష్టమొచ్చింది. ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టుతప్పి కిందపడింది. కాలు విరిగి కదలలేని స్థితిలో మిగిలింది. ఈ దశ్యం చూసిన వారంతా అయ్యోపాపం అంటూ సానుభూతి చూపారు. చెన్నేకొత్తపల్లి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అనంతపురం నుంచి ఓ వాహనం కొన్ని పశువులతో పెనుకొండ వైపునకు బయలుదేరింది. మార్గమధ్యంలో చెన్నేకొత్తపల్లి వద్దకు రాగానే ఓ ఆవు వాహనంలో నుంచి కిందపడిపోయింది. అటుగా వచ్చిన వారు గమనించి తీవ్రంగా గాయపడిన ఆవును రోడ్డుపక్కకు తరలించేందుకు ప్రయత్నించగా వెనుక కాలు విరిగి నడవలేని స్థితిలో పడి ఉంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు దాని యజమాని వచ్చి మరో వాహనంలో చికిత్స కోసం తరలించినట్లు స్థానికులు తెలిపారు. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
సురక్షితంగా బయటపడిన డ్రైవర్ రావులపాలెం: జాతీయ రహదారిపై వెళుతున్న వ్యాన్లో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు కాలి పోయింది. నరేంద్రపురానికి చెందిన డ్రైవర్ నక్కా శరత్బాబు మారుతి వ్యాన్లో రావులపాలెం వైపు నుంచి తణుకు వైపు వెళుతున్నాడు. స్థానిక వీస్కే్వర్ థియేటర్ సమీపంలోకి వచ్చేసరికి కారులో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ శరత్బాబు కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించి వ్యాన్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇరువైపులా సుమారు అరకిలోమీటరు దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ పీవీ రమణ అక్కడకు చేరుకుని కొత్తపేట అగ్నిమాపక అధికారికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా సీఐ స్థానికుల సాయంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ వై.శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆ వ్యాన్లో రెండు గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను పోలీసులు గుర్తించారు. హైవే రెండో లైన్పై ట్రాఫిక్ను మళ్లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్వీరెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు స్టేజీ వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వ్యాన్ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న డీసీఎం వ్యాన్ కొండగట్టు వద్ద సబ్కంట్రోల్ రూం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. సుమారు 20 మీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. మృతుడు మానకొండూరు మండలానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్కంట్రోల్ రూం ఉన్నా ఫలితం శూన్యం కొండగట్టు పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ట్రాఫిక్ను నియంత్రించడంతోపాటు, ప్రజలకు పోలీసులు మరింత అందుబాటులో ఉండేందుకు 2013లో అప్పటి ఎస్సీ శివకుమార్ పోలీస్ సబ్కంట్రోల్ రూం ప్రారంభించారు. అడపాదడపా సబ్కంట్రోల్ రూం తీస్తున్నప్పటికీ దాదాపు ఏడాదికాలంగా మూలనపడింది. స్థానికంగా పోలీసులు లేకపోవడంతో వాహనాల వేగానికి అడ్డుకట్టవేసేవారు కరువయ్యారు. -
గ్యాస్ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం
గ్యాస్ ట్యాంక్ పేలి మారుతి ఓమ్ని వ్యాను దగ్ధమైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న న్యూ రాయలసీమ హోటల్ వద్ద తన ఓమ్ని వ్యానును పార్కుచేసి అదే హోటల్లో విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం ఉదయం వ్యాను స్టార్ట్ కాలేదు. ఇంజిన్కు అమర్చిన గ్యాస్ ట్యాంక్ వద్ద రిపేరు చేస్తుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ఓమ్ని వ్యాను కాలిపోయింది. సురేష్కు సైతం మంటలు వ్యాపించడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గ్యాస్ ట్యాంక్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
పంచ్లతో రోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టుకుని..
లండన్: అప్పటికే ఆ రోడ్డంతా రద్దీగా ఉంది. కనీసం పక్కకు కొంచెంకూడా తిప్పలేనంత దగ్గరిగా వాహనాలు వెళుతున్నాయి. ఆ సమయంలో ఆ రోడ్డుపై ఉన్న వాహనాలన్నీ కూడా వోక్స్ వ్యాగన్ కార్లే. కొన్ని కార్లు గృహకార్యకలాపాలకు ఉపయోగించుకునేవి కాగా.. మరికొన్ని క్యాబులు. బ్రిటన్లో ఎం ఫైవ్ రోడ్డులోగల ఓ భారీ వంతెన సమీపించిన కార్లు కొద్ది నిడివిలోనే వేగంగా వెళడం సడెన్ బ్రేక్లతో ఆగిపోవడం జరుగుతోంది. అలాంటి సమయంలోనే ఓ రహదారి నిర్వహణ సిబ్బంది వ్యాన్ కూడా మిగితా వాహనాల మధ్య వెళుతోంది. కాగా, ఏకంగా ఆ వాహనానికే పదే పదే కటింగ్స్ ఇస్తూ ఓ వోక్స్ వ్యాగన్ డ్రైవర్ వెళుతూ ఉన్నాడు. ఇదే చర్యను పదే పదే చేశాడు. రోడ్డు నిర్వహణ సిబ్బంది వ్యాన్ కూడా వెనుక వచ్చే వాహనాలకు అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకే క్రమంలో వెళుతోంది. అలా వెళుతున్న ఆ వ్యాన్ కు పదేపదే హారన్ కొట్టడమే కాకుండా అంతకుముందు కటింగ్స్ ఇచ్చిన వోక్స్ వ్యాగన్ కారు డ్రైవర్ తిరిగి ఈసారి కూడా పెద్ద కటింగ్ ఇచ్చి ఆ వ్యాన్ ముందు ఆపాడు. ఫలితంగా వ్యాన్ డ్రైవర్ అనూహ్యంగా బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఈ చర్యల కారణంగా కోపంలో మునిగిపోయిన వ్యాన్ డ్రైవర్, వోక్స్ వ్యాగన్ డ్రైవర్ గబాగబా కిందికి దిగి నేరుగా ఫైటింగ్కు దిగారు. తొలుత వ్యాన్ డ్రైవర్ ఎగిరెగిరి అతడికి పంచ్లు ఇచ్చేందుకు ప్రయత్నించినా కారు డ్రైవర్ గట్టిగా ఎదురుతిరిగి బలంగా పంచ్ చేయడంతో ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు. అనంతరం నీ సంగతి తేలుస్తానంటూ కారు నెంబర్ నోట్ చేసుకొని రోడ్డు నిర్వహణ సిబ్బంది ఉద్యోగి వెళ్లిపోయాడు. -
మిడ్ వైఫ్స్ లా సహకరించిన పోలీసులు!
న్యూఢిల్లీః సాహసమే ఊపిరిగా, సామాజికే సేవే లక్ష్యంగా పనిచేసే పోలీసులు.. తమలోని సేవా గుణాన్ని దేశరాజధాని సాక్ష్యంగా మరోసారి నిరూపించుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తక్షణ సేవలను అందించి... సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించారు. పోలీసు పీసీఆర్ వాహనంలోనే ఆమె ప్రసవానికి మిడ్ వైఫ్స్ లా సహకరించి అభినందనలు అందుకున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పీసీఆర్ వాహనంలో 23 ఏళ్ళ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవంకోసం అత్తింటివారితో పాటుగా స్మాల్ ఖా వెళ్ళేందుకు పానిపట్ నుంచి గ్వాలియర్ వెళ్ళే దాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆర్తీ...ఢిల్లీలోని సబ్జి మండి స్టేషన్ ప్రాంతానికి వచ్చే సరికి నొప్పులు తీవ్రమవ్వడమే కాక, ఉమ్మనీరు కూడ పడిపోవడంతో అత్తింటివారు టికెట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీసీ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి, పోలీసులుకు సమాచారం చెప్పడంతో సబ్జీ మండి ప్రాంతం పోలీసులు వైద్య సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓ పీసీఆర్ వ్యాన్ ను రైలు దగ్గరకు తెచ్చి ఆర్తీని ప్రయాణీకుల సహకారంతో అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ సంజయ్ లు మహిళను స్ట్రెచ్చర్ పై వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్తీ పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు కావలసిన టవల్స్, వేడి నీటితో పాటు సౌకర్యాలను అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక హిందూరావ్ ఆస్పత్రికి తల్లీ బిడ్డలను తరలించారని వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డీసీపీ ఆర్ కె సింగ్ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ఆర్తీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ సంజయ్ బెనివాల్ ఆర్తీకి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ప్రత్యేక అవార్డులను ప్రకటించారు. -
చెట్టును ఢీకొన్న డీసీఎం-క్లీనర్ మృతి
రాయపర్తి(వరంగల్): మోరిపిరాయల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి తీవ్రంగా గాయపడి, అసస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళనాడులో రోడ్డుప్రమాదం : 9 మంది మృతి
చెన్నై: తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. తూత్తుకుడి సమీపంలో ఆగి ఉన్న వ్యానును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. వ్యానులోని 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
పెళ్లి వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎడ్డిప గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు కాగా వారిని 108 వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం గన్నవారం గ్రామానికి చెందిన యువతికి రోలుగుంట మండలానికి చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వ్యానులో తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి
ఆలమూరు(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీసాకోడేరు గ్రామంలో మహేష్రాజు, దేవీప్రియాంక వివాహం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరిగింది. అనంతరం నూతన దంపతులు బంధువులతో కలసి మొత్తం 12 మంది కారులో అన్నవరం దర్శనానికి బయలుదేరారు. వారి వాహనం ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలోని మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న కృష్ణశ్రీ, మాధవీశ్రీ అనే పదేళ్లలోపు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 10 మంది గాయాలపాలయ్యారు. నూతన వధూవరులకు స్వల్పగాయాలయ్యాయి. మిగతా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. -
పోలీస్ స్టేషన్కు సమీపంలోనే..
ససారం: ఏటీఏంలో లోడ్ చేయడానికి వ్యాన్లో తీసుకెళ్తున్న 20 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన ఘటన బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో చోటుచేసుకుంది. కరాఘర్ పోలీసు స్టేషన్కు దగ్గరలోని ఎస్బీఐ ఏటీఏంలో గత రాత్రి డబ్బును నింపేందుకు ఆగి ఉన్నవ్యాన్లోని డబ్బును గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై క్యాషియర్, సెక్యూరిటీ గార్డ్లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెట్టుని ఢీకొన్న పెళ్లి వ్యాన్: 9 మందికి తీవ్రగాయాలు
జూలూరుపాడు (ఖమ్మం జిల్లా): జూలూరుపాడు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం సోమలగూడెం గ్రామానికి చెందిన 9 మంది బృందం ముదిగొండకు పెళ్లికి వెళ్లి వస్తుండగా వ్యాను అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో సరళ, రామారావు, నర్సింహారావు, శేషారత్నం, ధనలక్ష్మి, ప్రమీల, సాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు విద్యార్థులకు గాయాలు
పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : పెనుగంచిప్రోలు మండలం వెంగనాయపాలెం వద్ద ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పదవ తరగతి పరీక్ష రాసి పెనుగంచిప్రోలు నుంచి స్వగ్రామం శనగపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటచేసుకుంది. -
కుక్కునూరు వీఆర్వోను బలిగొన్న సీఎం సెక్యూరిటీ వాహనం
♦ మరో వ్యక్తికి తీవ్రగాయాలు ♦ రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసం ♦ బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో ఉంగుటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పించే విభాగానికి చెందిన వాహనం ఢీకొని ఒక గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) మృత్యువాత పడగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు (రాంబాబు) అక్కడికక్కడే మృతి చెందగా, ఉంగుటూరుకు చెందిన కొడవళ్ల రాజా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసమయ్యాయి. సీఎం చంద్రబాబు సోమవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం సీఎం పేషీలోని సెక్యూరిటీ విభాగం డీఎస్పీ జోషి ఏలూరు నుంచి వాహనంలో ఆదివారం బయలుదేరారు. ఉంగుటూరు సెంటర్కు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి రెండు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లింది. దానిపై ప్రయాణిస్తున్న కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు అక్కడిక్కడే మృతి చెందారు. మరో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న కొడవళ్ల రాజా కాలు విరిగింది. వీఆర్వో షణ్ముఖరావు స్వగ్రామం ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, ఉప్పాకపాడు, కాకర్లమూడి ప్రజలు ఘటనా స్థలానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం భద్రతా విభాగం వాహనం డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. వీఆర్వో కుటుంబానికి తగిన పరిహారం అందిస్తామని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
వ్యాన్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ముమ్మిడివరం (తూర్పు గోదావరి): తాళ్లరేవు మండలంలో శనివారం సాయంత్రం బైపాస్ రోడ్డులో వ్యాన్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అల్లవరం నుంచి ద్విచక్ర వాహనంపై జేఎన్టీయూకు వస్తున్న ముగ్గురు విద్యార్థులను ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో జేఎన్టీయూలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎద్దాడ మహేష్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలవడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం..
తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. బైక్పై లాలప్ప(25), ఆశప్ప(23)లు తాండూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఢీకొట్టిడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడతో వీరి స్వగ్రామం చెంగోలులో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వ్యాన్, బైక్ ఢీ : ఇద్దరి పరిస్థితి విషమం
బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బొగ్గు గనుల్లో బొగ్గును పేల్చడానికి ఉపయోగించే పేలుడు పదార్థాల లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెల్లంపల్లికే చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. -
వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు
మారేడుమిల్లి (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి పదిమంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం భీమవరం గ్రామం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాను బోల్తా: ఇద్దరు మృతి
-
వ్యాను బోల్తా: ముగ్గురు మృతి
ప్రకాశం(బేస్తవారిపేట): బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహీంద్ర వాహనంలో విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు, పిల్లలు సోమవారం బయలుదేరి వెళ్లారు. పిల్లలకు కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె వద్ద వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాదారుడు చిలకల కృష్ణా రెడ్డి(26)ని ఢీకొట్టడంతో అక్కడిక్కడిక్కడే మరణించాడు. మహీంద్ర వాహనం పల్టీ కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న సోమశేఖర్, కురుణ రమణలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డికి పెళ్లిచూపులు జరిగిన రెండు రోజులకే.. పందిల్లపల్లెకు చెందిన చిలకల క్రిష్ణారెడ్డికి రెండు రోజుల క్రితమే పెళ్లి చూపులు జరిగాయి. నేడు అక్క, బావలకు చూపించి వివాహం నిశ్చయం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో బెంగుళూరులో ఉన్న అక్క, బావలు బస్లో పందిలపల్ల్లెకు వస్తున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు బస్టాండ్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. మోటార్ సైకిల్ను రోడ్డు పక్కన పెట్టి నిలబడి ఉండగా జైలో వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు. తండ్రి మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉన్న ఒక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి పద్మావతి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. -
చోరీకి వచ్చి దొంగ మృతి
గన్నవరం: అపహరించిన గేదెలను వ్యాన్లో తరలించుకుపోతూ వెంబడించిన పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దొంగ ప్రాణాలను కొల్పోయిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జక్కులనెక్కలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ముంగా సుధాకర్ (45) చోరీలే ప్రవృత్తిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురితో కలిసి గత మంగళవారం అర్ధరాత్రి ఉంగుటూరు మండలం ఏలుకపాడు గ్రామంలోని పోలిమెట్ల శ్రీధర్కు చెందిన రెండు గేదెలు, దూడలను అపహరించి వ్యాన్లో తరలించే ప్రయత్నం చేశారు. గన్నవరం వద్ద నైట్ పెట్రోలింగ్ చేస్తున్న రక్షక్ పోలీసులను చూసి వ్యాన్ డ్రైవర్ వేగం పెంచాడు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ జాతీయ రహదారి నుంచి వ్యాన్ను జక్కులనెక్కలంవైపు మళ్లించాడు. అయితే గ్రామం నుంచి బయటకు వెళ్ళే మార్గం లేకపోవడంతో వ్యాన్ను వదిలేసి పరరాయ్యారు. హృద్రోగి అయిన సుధాకర్ సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్ గోడ దూకే క్రమంలో కిందపడిపోవడంతో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దొరికిపోతామనే భయంతో సహచర దొంగలు అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు గేదెల లోడుతో ఉన్న వ్యాన్ను స్టేషన్కు తరలించారు. అయితే సీసీఎస్ పోలీసుల సమాచారం ప్రకారం పోలీసులు సుధాకర్ వృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. -
బస్సు డ్రైవర్ సజీవదహనం
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలు తప్పిన భారీ ముప్పు మూలమలుపు వల్లే ప్రమాదం హైదరాబాద్: ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తు డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ప్రయాణికులు మాత్రం గాయాలకు గురైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా బయటపడగలిగారు. ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు (ఏపీ25జెడ్0064) సోమవారం మధ్యాహ్నం 58 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి ఆర్మూర్కు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు జూబ్లీ బస్స్టేషన్కు చేరుకుని బస్సు తిరిగి బయలుదేరింది. బోయిన్పల్లి పోలీస్స్టేషన్ సమీపంలోని మూలమలుపులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్.. బస్సు ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ ముందు భాగం బస్సు లోపలికి చొచ్చుకునిపోయి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలింది. వెంటనే బస్సులో మంటలు అంటుకొని డ్రైవర్ గంగాధర్ సజీవ దహనం కాగా, ప్రయాణికులు మాత్రం అత్యవసర ద్వారం గుండా కొందరు, అద్దాలు పగులగొట్టుకొని మరికొందరు బయటపడ్డారు. ఈ ఘటనలో మరో డ్రైవర్ మధుతో పాటు ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మధును తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. స్వల్పంగా గా యపడ్డ మరో 15 మంది ప్రయాణికులకు 108 వాహనంలో చికిత్స చేసి పంపారు. కాగా బస్సు ప్రమాదంలో ప్రధాన నిందితుడు డీసీఎం డ్రైవర్ బహదూర్ వాసియైన ఖాజామొయినుద్దీన్(45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. డ్యూటీ మారిన 10 నిమిషాలకే.. అప్పటివరకు బస్సు నడిపిన డ్రైవర్ మధు (ఆర్మూర్) జూబ్లీ బస్స్టేషన్లో డ్యూటీ దిగి, రెండవ డ్రైవర్ గంగాధర్ (నిజామాబాద్ జిల్లా బాల్కొండ సమీప గ్రామానికి చెందిన)కు బస్సును అప్పగించాడు. జేబీఎస్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే యా క్సిడెంట్ అయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, గంగాధర్ కాళ్లు బస్సు క్యాబిన్లోనే ఇరుకున్నాయి. ‘నన్ను కాపాడండి’ అని అతడు దీనంగా ఆర్తనాదాలు చేశాడు. కానీ అప్పటికే డీజిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో మృత్యువాత పడ్డాడు. అయితే ఆ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఎస్ఐ వేణు డ్రైవర్ను కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ భారీ మంటలు వ్యాపించడంతో ఫలితం లేకపోయింది. ‘టిమ్స్’మిషన్ కారణమా..? టికెట్ ఇష్యూ మిషన్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. బోయిన్పల్లి వద్ద బస్సు నడుపుతున్న డ్రైవర్ గంగాధర్ ఒక చేత్తో బస్సు నడుపుతూనే మరో చేత్తో టిమ్స్ మిషన్ను గేర్బాక్స్పై ఉంచేందుకు రోడ్డుపై నుంచి దృష్టి మరల్చాడు. ఆ స్వల్ప వ్యవధిలోనే బస్సు కుడివైపునకు వెళ్లిందని, ఎదురుగా వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టిందని తిరుపతయ్య, వినుకొండకు చెందిన వీరాంజనేయులు అనే ప్రయాణికులు తెలి పారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తులో ఉన్న బోయిన్పల్లి బ్లూకోట్ పోలీసులు, సీఐ సుధీర్కుమార్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు. దురదృష్టకరం : రవాణా మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమా దం జరిగిన తీరును తెలుసుకున్నారు. సజీవ దహనమైన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఓ ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం కావడం ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగలేదని ఎన్ఎంయూ అధ్యక్షకార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సయీద్ మహమూద్లు ఓ ప్రకటనలో తెలిపారు. -
భారీగా గంజాయి స్వాధీనం
వ్యాన్ సీజ్.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు నర్సీపట్నం టౌన్, న్యూస్లైన్: చింతపల్లి నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రావు తెలిపారు. గంజాయిని తరలించేందుకు ఉపయోగించిన వ్యాన్ను సీజ్ చేశారు. శనివారం సీఐ విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి నుంచి వ్యాన్లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఎక్సైజ్, పోలీసుల భయంతో సదరు వ్యాన్ దారి మళ్లించి పాకలపాడు గ్రామం మీదుగా వస్తుండగా మర్రిపాలెం వంతెన వద్ద పట్టుకున్నామన్నారు. వ్యాన్తో పాటు ఏటిగైరంపేటకు చెందిన కాళ్ల అప్పలనాయుడు(30), నాతవరం మండలం బెన్నవరం గ్రామానికి చెందిన దమ్ము రాజు(30) ఆదుపులోకి తీసుకున్నామన్నారు.వీరు కూలీ పని నిమిత్తం వెళ్లినట్టు విచారణలో తేలిందన్నారు. గంజాయి తరలించడానికి ప్రధాన కారుకుడు, వ్యాన్ యజమాని అయిన చింతపల్లి మండలం, ఎర్రబొమ్మలు గ్రామానికి చెందిన బన్నిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ గంజాయిని విశాఖపట్నం షీలానగర్ తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్ బొంజన్న పాల్గొన్నారు. రోలుగుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ కృష్ణవర్మ, ఎస్సై కృష్ణారావు రత్నం పేట-బీబీ.పట్నం రూట్లో ఆదివారం ఉదయం జరిపిన సోదాల్లో 40 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. బి.పట్నం-రత్నంపేట రూటులో పోలీసులు పెట్రోలింగు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు గోనె సంచుల్లో నింపిన గంజాయి ప్యాకింగ్లతో వాహనంలో తరలించడానికి పక్షుల చెరువు వద్ద తారసపడ్డారు. అనుమానం వచ్చి పరిశీలించగా గంజాయి బయటపడింది. ఈ సందర్భంగా రత్నంపేటకు చెందిన బత్తిన శ్రీను(26) బుదిరెడ్ల చెల్లినాయుడు(25)అను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. -
ఆటోను ఢీకొట్టిన డీసిఎం
-
వ్యానులో చెలరేగిన మంటలు,మహిళ సజీవదహనం
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పూసపాటిరేగ, న్యూస్లైన్ : జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలంలోని సీపీ ఆక్వా సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బిచ్చగాడిని ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతనిని 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఆయనకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. పూసపాటిరేగ ఎస్సై జి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు రామభద్రపురం : మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూరగాయల లోడుతో రామభద్రపురం నుంచి విశాఖ వెళ్తున్న వ్యాను బైపాస్ రోడ్డులో నడిచి వెళ్తున్న మిర్తివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు కలగర్ల కళావతి, సత్తిరాజులను ఢీకొంది. దీంతో ఇద్దరూ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో బాడంగి సీహెచ్సీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన విశాఖకు చెందిన వ్యాన్ డ్రైవర్ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో... బెలగాం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి, బోల్తా పడడంతో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన కోమటిపల్లి లీలాప్రసాద్ గుమ్మలక్ష్మీపురంలో బంధువుల ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. మార్గమధ్యలోని దిగువ మండ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతనిని కురుపాం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స జరిపి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు అతనిని మెరుగైన వైద్యం కోసం విశాఖ రిఫర్ చేశారు.