washington DC
-
ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలను మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్ళు అమ్మకానికి ఉంచినట్లు.. ఒక ఎక్స్ యూజర్ పేర్కొంటూ.. ''ఎలుకలు పారిపోతున్నాయి” అని అన్నారు. నగరవాసులు తమ వస్తువులను సర్దుకుని.. సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని అన్నారు.4,271 houses put up for sale in just the last 14 days in Washington, D.C. The rats are running away. 🇺🇸 pic.twitter.com/Ra5Gq21RBJ— Joseph 💎✌️🪑🇺🇸 Tesla Long Term Investor (@ShrimpTeslaLong) February 15, 2025వలసలకు కారణం.. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అని చెబుతున్నారు. నగరంలో, ఆ చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫోటోలను కూడా షేర్ చేశారు. నగరంలో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని.. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ప్లేస్ అయిన 'జిల్లో'లో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో ఎక్స్ యూజర్ షేర్ చేసాడు. ఏడు రోజులలో 201, 14 రోజులలో 378, 30 రోజులలో 706, 90 రోజులలో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసాడు.Zillow Washington DC new home listings:•7 days: 201 new homes•14 days: 378 new homes•30 days: 706 new homes•90 days: 1,198 new homesIs this volume typical for the season? pic.twitter.com/KbGh3VOWhS— Architectoid (@Architectoids) February 15, 2025 -
ప్రధాని మోదీతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భేటీ
-
ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ చర్చలు
వాషింగ్టన్: ప్రధాని మోదీ గురువారం స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణలు, భారత్లో టెస్లా విస్తరణ వంటి అంశాలే కేంద్రంగా చర్చలు జరిపారు. ‘అంతరిక్ష రంగం, రవాణా, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు మస్క్తో సుహుృద్భావపూర్వక భేటీలో చర్చకు వచ్చాయి. మస్క్ ఆమితాసక్తి చూపే ఈ అంశాలపై ఆయనతో లోతుగా చర్చించా. పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి వివరించా. అతితక్కువ ప్రభుత్వ జోక్యం.. హెచ్చుగా పాలన అవే మా లక్ష్యమని తెలిపా’ అని మోదీ ’ఎక్స్’లో పేర్కొన్నారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు. బ్లెయిర్ హౌస్లో జరిగిన ఈ భేటీకి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్లను తీసుకు రావడం విశేషం. ఉన్నత స్థాయి సమావేశాలకు సైతం తన పిల్లలను వెంటబెట్టుకు వెళ్లడం మస్క్ ప్రత్యేకత. వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్లో తనతో భేటీకి స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పిల్లలను తీసుకురావడంతో వారిని పలకరిస్తున్న ప్రధాని మోదీ భారత ప్రధాని మోదీతో తమ తండ్రి చర్చలు జరుపుతుండగా పక్కనే కూర్చుని ఉన్న ముగ్గురు పిల్లలూ ఆసక్తిగా తిలకిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. వీరిలో ఎక్స్ సరదాగా కనిపించగా, మిగతా ఇద్దరూ అలెర్ట్గా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అంతరిక్ష రంగాల్లో భారత్ కీలకంగా మారుతున్న తరుణంలో మోదీ, మస్క్ల భేటీతో భారత్ మార్కెట్తో మస్క్ కంపెనీల బంధం బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కి మస్క్ సారథ్యం వహిస్తుండటం తెలిసిందే. -
అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!
అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వేలకు పైగా మంది ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు తీకొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడుచులు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ.. లయబద్దంగా కదులుతుంటే ఆడిటోరియం అంతటా సందడి నెలకొంది. వారిని అనుసరిస్తూ కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోతురాజులు, హైదరాబాదీ బ్యాండ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు మరువకూడదని, భావితరాలకు వారసత్వంగా అందించాలన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు అందించిన సహాకారం మరువలేనిదని తెలిపారు. అనంతరం యూఎస్ గవర్నమెంట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ అందరూ కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) వాషింగ్టన్ డీసీ ఛాప్టర్ కు ప్రోక్లమేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా డెలిగేట్ శ్రీనివాసన్ కన్నన్, అటార్నీ జనరల్ జేసన్ ఎస్. మియారెస్, లౌడన్ కౌంటీ సూపర్వైజర్ లౌరా సావినో, లౌడన్ కౌంటీ స్కూల్ బోర్డు డాక్టర్ సుమేరా రషీద్, డెమొక్రాట్ పార్టీ నేత శ్రీధర్ నాగిరెడ్డి, జీటీఏ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రెసిడెంట్ మునుకుంట్ల తిరుమల్ రెడ్డి , చైర్మన్ కళావల విశ్వేశ్వర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పడూరు శ్రీవన్ రెడ్డి , నేషనల్ ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, దేశినేని సంపత్, జీటీఏ వనిత టీమ్ తెలకుంట్ల జయశ్రీ , ప్రత్యూష నారపరాజు, సేరిపల్లి రేఖ తదిరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!) -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్హోం, లండన్లోని ట్రఫాల్గర్ స్క్వేర్లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
వాషింగ్టన్ డిసి: నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాల నుంచి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డిసి నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో1000మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ తన భావాలను పంచుకున్నారు. “మానవ జాతిలోని వైవిధ్యాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే సుందరమైన సందర్భం ఇది. ఈ భూమి చాలా వైవిధ్యంతో కూడి ఉంది, అయినప్పటికీ, మానవ విలువలనే సూత్రం ద్వారా మనందరిలో అంతర్లీనంగా ఐక్యత ఉంది. ఈ రోజు, ఈ ఉత్సవం సందర్భంగా, సమాజానికి మరింత ఆనందాన్ని తీసుకురావడానికి మనం కట్టుబడదాం. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు కృషిచేద్దాం. అదే మానవత్వం. మనమందరం దానితోనే రూపొందించబడ్డాం. జ్ఞానం ఆలంబనగా లేకపోతే ఏ ఉత్సవమైనా శోభించదు. ఆ జ్ఞానం మన అందరిలోనూ ఉంది. మనలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన వారని, అదే సమయంలో అందరూ ఒకటే అని గుర్తించడమే ఆ జ్ఞానం. మీలో ప్రతీ ఒక్కరికీ మరొక్కసారి చెబుతున్నాను. మనమంతా ఒకరికొకరు సంబంధించిన వారం. మనమంతా ఒకే విశ్వకుటుంబానికి చెందినవారం. రండి, మన జీవితాలను పండుగలా, ఉత్సవంలా జరుపుకుందాం. సవాళ్లను అంగీకరించి, ధైర్యంగా ఎదుర్కొందాం. మనకోసం, రాబోయే తరాలకోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “మనం మరింత సమృద్ధికోసం, మన భూమి భవిష్యత్తును కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నపుడు, దానికి వ్యతిరేకంగా సవాళ్ళను ఎదుర్కొనడం సహజం. అవి ప్రకృతి ఉత్పాతాలు కావచ్చు. లేదా మానవ తప్పిదాలు, సంఘర్షణలు, లేదా అంతరాయాలు కావచ్చు. ఈనాటి పరస్పర ఆధారిత ప్రపంచంలో మనమంతా ఒకరికొకరు అండగా ఉన్నామనేది ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మనకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. ఇటీవలి ఉక్రెయిన్ సంఘర్షణలో వీరిద్వారా కలిగిన ప్రభావవంతమైన మార్పును నేను ప్రత్యక్షంగా గమనించాను. ఈ రోజు, వారి సందేశం, మీ సందేశం, నా సందేశం ఒకటే. పరస్పరం దయ కలిగి ఉండడం, మనకు కలిగిన దానిని ఇతరులతో పంచుకోవడం, పరస్పరం సుహృద్భావంతో అర్థంచేసుకోవడం, సహకరించుకోవడం. ఇవే ఈనాడు మనందరినీ సమైక్యంగా ఇక్కడకు చేర్చాయి.” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోప్ తమ సందేశాన్ని పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ద్వారా పంచుకున్నారు. “ప్రపంచ శాంతిని సాధించేందుకు, మనకు అంతరంగంలో శాంతి అవసరం. శాంతిని ప్రవచించేందుకు ముందు, మనం శాంతితో జీవించాలి. శాంతియుతంగా జీవించడానికి మనకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కావాలి. శాంతియుతంగా జీవించే కళను పొందాలంటే మనం దైవంతో సంభాషిస్తూ ఉండాలి. దేవుడంటే మనిషికి శత్రువు కాదు, దైవం మనకు మిత్రుడు. దైవం అంటే ప్రేమ. దైవాన్ని పొందాలంటే మనం ధ్యానంలోకి, ప్రార్థనలోకి తిరిగి వెళ్లాలి. మన మూలాలకు చేరుకోవాలి. కాబట్టి, ఈనాటి సున్నితమైన క్షణంలో, మనలో దైవాన్ని ఆవాహన చేసుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ తరపున, సమస్త ప్రజలకు సోదరుడినైన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ అతిపెద్ద సమావేశానికి హాజరైన మీ అందరికీ నా ఆశీస్సులు. నిజంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఈ విధంగా జీవించే కళ) మన మానవాళికి భవిష్యత్తు అని నా ఉద్దేశ్యం.” అని పేర్కొన్నారు. రవిశంకర్ స్ఫూర్తితో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం, దేశాల భౌగోళిక ఎల్లలను చెరిపివేస్తూ మానవాళి, సౌభ్రాతృత్వాలను పడుగు పేకలుగా నేసి, విశ్వమానవ సంస్కృతి అనే అద్భుతమైన వస్త్రాన్ని సృజించింది. సంగీత, నృత్యాల ద్వారా ప్రాంతీయ, దేశీయ సంప్రదాయాల పరిరక్షణకు, అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందించి, ఆస్వాదించడానికి ఒక చక్కని వేదికను ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం అందించింది. ప్రేమ, కరుణ, స్నేహశీలత వంటి సార్వత్రిక మానవ విలువల పునరుద్ధరణకు ఈ ఉద్యమం స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మాట్లాడుతూ, “సంస్కృతి అనేది వారధులను నిర్మిస్తుంది, అడ్డుగోడలను కూల్చివేస్తుంది, చర్చలు, పరస్పర అవగాహనల ద్వారా ప్రపంచాన్ని కలుపుతుంది. ప్రజల మధ్య, దేశాల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. సంస్కృతి ప్రపంచ పౌరులందరి మధ్య శక్తివంతమైన పరస్పర చర్చలను, అవగాహనల మార్పిడిని సృష్టించగలదు. ఈనాడు, ప్రపంచంలోని సాంస్కృతిక సంపద అంతా యునైటెడ్ స్టేట్స్ లోని ఈ నేషనల్ మాల్ కు తరలి వచ్చింది. ఏకత్వం, భిన్నత్వం విషయంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కు గల స్ఫూర్తిదాయకమైన దృక్పథానికి నా అభినందనలు. ఇటువంటి మరిన్ని వేడుకలు, మరింతమంది కలిసి రావడం, మరింత శాంతి, మరింత సహకారం, సంఘీభావం, భాగస్వామ్యం మనకు అవసరం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను పట్టుదలతో ఎదుర్కొనడం వీటిద్వారా మనకు సాధ్యం అవుతుంది. ఈ విధంగా మనం శాంతిని స్థాపించగలుగుతాం, సంఘర్షణలను పరిష్కరిస్తాము, ఆకలిబాధను అంతం చేసి, ఆరోగ్యకరమైన జీవితాలను సమకూర్చి, నాణ్యమైన విద్యను అందించగలుగుతాము. మహిళలు, బాలికలకు సాధికారత కల్పిస్తాము. ఈ విధంగా మనం ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అంతా కలసి ముందుకు వెళ్తాము’’ అని పేర్కొన్నారు. -
మన జాతీయగీతం మిల్బన్ నోట
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ఆఫ్రికన్–అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బన్ ఆలపించిన మన జాతీయగీతం ‘జనగణమన’ వీడియో వైరల్గా మారింది. ‘అద్భుతం’ అంటున్నారు నెటిజనులు. ‘భారతీయులు నన్ను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు’ అంటున్న మిల్బన్ మన ప్రధానికి పాదాభివందనం చేసింది. మన జాతీయగీతం మాత్రమే కాదు ‘ఓమ్ జై జగదీష్ హరే’ భక్తిగీతాన్ని కూడా అద్భుతంగా ఆలపిస్తుంది మిల్బన్. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్లోనే ఉంది. ఇండో–పసిఫిక్లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్ను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నారు. భారత్లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్వేవ్స్గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా ఆటా వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ముగిశాయి. సమావేశాలకు తెలుగు వాళ్లు పోటెత్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏకంగా 15,000 మందికిపైగా హాజరవడం విశేషం. వేడుకల సందర్భంగా కపిల్, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, సద్గురు గోల్ఫ్ టోర్నమెంట్లో కూడా పాల్గొన్నారు. బతుకమ్మపై ఆటా ముద్రించిన పుస్తకాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రూతలూగించింది. తెలంగాణ నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, ఏపీ నుంచి ప్రజాప్రతినిధులు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌధరి తదితరులు పాల్గొన్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అందరినీ మైమరిపించింది. మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో ఆర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. హీరో అడివి శేష్, సినీ నటుడు తనికెళ్ల భరణి తదితరులు సందడి చేశారు. -
ఆటా సభల్లో మహానేత డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 1 నుండి 3 తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో భాగంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రావు గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని యార్లగడ్డ మండిపడ్డారు. ప్రతి పేద వాడి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలని ఎందరో పాదయాత్రలో తమ కోరికను వెల్లడించారని చెప్పారు. అలాగే 98శాతం ఇంగ్లీష్ మీడియం కావాలాని సర్వేలో చెప్పారని తెలిపారు. కేవలం సీఎం జగన్కు క్రెడిట్ వస్తుందన్న దుగ్ధతోనే ఇంగ్లీషు మీడియంను తప్పు బట్టారని విమర్శించారు. మీ పిల్లలకు ఇంగ్లీషులు చదువులు కావాలి గానీ, మరి పేదల పిల్లలు ఇంగ్లీషులు చదువుకోవద్దా ? అని విమర్శిస్తున్నవారినుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని వైజాగ్ ఎంపీ సత్య నారాయణ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఏ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగినా వైఎస్సార్ను గుర్తు చేసుకుంటారన్నారు. జులై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని ఆటా సెక్రెటరీ హరి లింగాల వెల్లడించారు. డా. వైఎస్సార్ తన పాలనతో చెరగని ముద్ర వేశారనీ, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసాల వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రశంసించారు. అంతేకాదు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మాట్లాడుతూ సామాన్యులకు చేరువైన వ్యక్తి వైఎస్సార్ అనీ, ఆయన మనకు దూరమై 12 ఏళ్లు గడిచినా అందరి మనసుల్లో సజీవంగా నిలిచే ఉన్నారని పేర్కొన్నారు. డా. వైఎస్సార్ చేసిన సంక్షేమంతో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి అమెరికా వరకు చేరుకున్నారని అన్నారు. మహానేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు జగన్ కొనసాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా వైఎస్సార్ ఫౌండేషన్ స్పందించి తనవంతు సాయాన్ని అందిస్తుందనీ వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ఫౌండేషన్కు సంబంధించి అమెరికాలో ఎంతోమంది తమవంతుగా ముందుకు వచ్చారన్నారు. మానవత్వం, దార్శనికత కలగలిసిన వ్యక్తి మహా మనిషి వైఎస్సార్, మన మధ్య లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి ఆ మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిమిక్రి రమేష్ తన అద్భుతమైన గళంతో వైఎస్సార్ను అనుకరించి సభికులను అలరించారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటా సభల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. పరుగులు తీసిన ప్రజలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని వాషింగ్టన్లో సోమవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా.. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. వైట్ హౌస్కు రెండు మైళ్లదూరంలో వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్ నార్త్వెస్ట్లో జరుగుతున్న ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఫైరింగ్లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అంతకుముందు.. మే 24న టెక్సాస్లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Multiple people, including a police officer, were shot at a music event on U Street Northwest in #Washington, DC, just less than 2 miles from the White House. pic.twitter.com/Vw0penv4jj — Gal Jammu Di (@GalJammuDi) June 20, 2022 ఇది కూడా చదవండి: చైనాలో జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా.. -
ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్వెస్ట్ వాషింగ్టన్లోని ఓ అపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రోపాలిటిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్ పామర్గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘోస్ట్ గన్ చట్టం తెచ్చినా.. అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్ గన్లు అంటారు. అంటే లైసెన్స్ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు! -
ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడేమో రోడ్ల మీద..!
అధికారంలో ఉన్నా.. అది పోయాక కూడా అంతే విలాసాలతో, హంగులతో బతికే నాయకులను చూస్తున్నాం. కానీ, అధికారం దూరం అయ్యాక.. సాదాసీదా జీవితం గడిపేవాళ్లు లేకపోలేరు. అయితే పరిస్థితుల మూలంగా అధికారానికి దూరమైన ఓ మంత్రి.. కుటుంబం కోసం రోడ్లపై క్యాబ్లు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనే.. ఆప్ఘానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద Khalid Payenda. తాలిబన్లు కిందటి ఏడాది అప్ఘనిస్థాన్ ఆక్రమణ కొనసాగిస్తున్న టైంలో.. ఖలీద్ పయేంద అమెరికాకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లో ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గానూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం చాలకనే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారట ఆయన. తాజాగా.. ఆయన దుస్థితిపై వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఖలీద్ పయేంద. లెబనీస్ కంపెనీకి చెల్లింపుల విషయంలో ఆరోపణలు రావడంతో తనను అరెస్ట్ చేయిస్తారేమోనని ఆయన భయపడ్డాడట. అందుకే తాలిబన్లు ఆక్రమణ మొదలుపెట్టాక.. అమెరికాకు ఆయన పారిపోయారు. ‘‘నాకంటూ ఓ చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కూడా కాదు. జీవితం శూన్యంగా కనిపిస్తోంది. అలాగని ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు’’ అని అంటున్నారాయన. అఫ్గన్లను అమెరికా అనాధలుగా వదిలేసిందని, అలాగని ఇప్పుడు మళ్లీ సమిష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. ‘‘మేమంతా అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అందుకే అంత వేగంగా కుప్పకూలింది. బక్క పలుచగా ఉన్నా జనాల్ని.. ప్రభుత్వం దోచుకోవాలనే చూసింది. మా ప్రజలకు మేమే ద్రోహం చేశాం. చేసిన పాపం ఇవాళ మాకు ఈ బతుకుల్ని ఇచ్చింది’’ అని పయేంద్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. విశేషం ఏంటంటే.. ఖలీద్ పయేంద కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమే ఒకప్పుడు. అఫ్గనిస్థాన్లో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ నెలకొల్పిన భాగస్వాముల్లో ఈయన కూడా ఉన్నారు. ఆయనకు ఈ పరిస్థితీ కొత్తేం కాదు. ఎందుకంటే.. అఫ్గనిస్థాన్లో అంతర్యుద్ధంతో తన 11 ఏళ్ల వయసు లో కుటుంబంతోపాటు పాక్కు వలస వెళ్లాడు ఆయన. తిరిగి అమెరికా దళాల ఎంట్రీతో.. సొంత గడ్డపై అడుగుపెట్టి, సంపాదించిన దాంతో యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు. -
కారు దొంగతనాన్ని అడ్డుకోబోయాడు, పాపం.. ప్రాణం పోగొట్టుకున్నాడు!
కారు దొంగతనం అడ్డగించేందుకు చేసే ప్రయత్నంలో ఓ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మార్చి 8న రాత్రి 8 గంటల సమయంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన రాకేశ్ పటేల్ (33) అనే వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. వాష్టింగ్టన్ డీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్గా పని చేస్తున్నాడు రాకేశ్ పటేల్. దుర్ఘటన జరిగిన రోజు నగరంలో ఉన్న తన గర్ల్ఫ్రెండ్ని కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు కొన్ని వస్తువులు అందించి వెనక్కి తిరగ్గా.. తన కారులో మరెవరవో ఉన్నట్టు రాకేశ్ గుర్తించాడు. వెంటనే కారు వైపుకు నడిచాడు. రాకేశ్ రావడం గమనించిన కారులోని అగాంతకుడు... కారుతో వేగంగా రాకేశ్ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతని శరీరంపై నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాకేశ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో దుండగుడు రాకేశ్కి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుని దొంగలించడంతో పాటు అతని ప్రాణాలు బలిగొన్నాడు. ఈ దుర్ఘటనకు కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వాష్టింగ్టన్ పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఓహియోలో ఉన్న రాకేశ్ తల్లిదండ్రులు వాషింగ్టన్కి పయణమయ్యారు. కళ్లెదుటే జరిగిన దారుణం చూసిన రాకేశ్ పటేల్ గర్ల్ఫ్రెండ్ ఇంకా షాక్లోనే ఉంది. -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
అమెరికాలో గూగుల్పై కేసు
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ ‘గూగుల్ ప్లే స్టోర్’లో ఆరోగ్యకరమైన పోటీని తన విధానాల ద్వారా తోసిపుచ్చుతోందని, దేశ కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ‘గూగుల్’పై కోర్టులో కేసు వేశాయి. వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు, విధానాలను అవలంబిస్తూ యాండ్రాయిడ్ వినియోగదారులకు సరైన, చవౖMðన ఉత్పత్తులు లభించకుండా చూస్తోం దని ఆరోపించాయి. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీ తదితర రాష్ట్రాలు గూగుల్పై ఈ దావా వేశాయి. యాప్ డెవలపర్లు వారి డిజిటల్ కంటెంట్ను గూగుల్ ప్లే సోర్ట్లో కొనుగోలు చేసిన యాప్ల ద్వారా, గూగుల్ మధ్యవర్తిగా మాత్రమే అమ్మాలని నిర్దేశిస్తోందని, తద్వారా వారి నుంచి గూగుల్ కమిషన్ సహా పెద్ద ఎత్తున ఆదాయం సముపార్జిస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపిం చాయి. ‘చాన్నాళ్లుగా ఇంటర్నెట్కు గేట్కీపర్గా గూగుల్ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు మన డిజిటల్ డివైజెస్కు గేట్ కీపర్గా మారింది. తద్వారా మనం రోజూ వాడే సాఫ్ట్వేర్ను ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. తన ఆధిక్యతను ఆసరాగా తీసుకుని పోటీని అక్రమంగా అణచివేస్తోంది. పోటీకి నిలిచిన థర్డ్ పార్టీ యాప్ డెవలపర్ల చిన్న,చిన్న వ్యాపారాలను తొక్కేస్తోంది’ అని న్యూయార్క్ అటార్నీ వ్యాఖ్యానించారు. -
భారత సంతతి సాధికారతకు శుభరూపం
యూఎస్లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పదవి చేపట్టనున్నారు. రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు. రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్మార్ట్ కంటే ముందు పేపాల్లో పదేళ్లు సేవలు అందించారు. వాల్మార్ట్లో సీనియర్ డైరెక్టర్గా, పేపాల్లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
బైడెన్ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారని వైట్హౌస్ ప్రెస్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్ మద్దతుదారలు క్యాపిట్ల హిల్పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది. (చదవండి: యూఎస్లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. (చదవండి: చివరి రోజుల్లో.. అవమానభారంతో...) జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు ఈ వీకెండ్, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్ వాషింగ్టన్ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది. ట్రంప్కు మరో షాకిచ్చిన ట్విట్టర్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంది. ఎఫ్బీలో 'ఆమోదాన్ని ఆపండి' అనే పోస్టుపై ట్రంప్ మద్దతుదారలు పోస్టులు పెడుతున్నారు. దాంతో ఎఫ్బీ ‘ఆమోదాన్ని ఆపండి’ అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగించింది. -
క్యాపిటల్ హిల్ ఘటన: ‘అక్కడ మన జెండా ఎందుకుంది?’
వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో త్రివర్ణపతాకం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్) ‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్ బైడెన్ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
యూఎస్లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది. యూఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఊహించని రీతిలో ఓటమి పాలైన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన వెర్రి చేష్టలతో అధికార మార్పిడికి మోకాలొడ్డుతున్నారు. అధికారదాహంతో ఊగిపోతూ.. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తన మద్దతుదారులను ఉసిగొల్పుతున్నారు. ఒకప్పుడు శాంతికి చిహ్నంగా నిలిచిన శ్వేతజాతీయులు నడిరోడ్డుపై నిరసనలకు దిగుతున్నారు. బైడెన్ గెలుపును అధికారికంగా ధృవీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. (వాషింగ్టన్ డీసీలో తీవ్ర ఉద్రిక్తత) ప్రపంచ దేశాల ఉలిక్కిపాటు అందోళకారులు శాంతించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఓ వీడియోను విడుదల చేసినా.. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ట్రంప్ మద్దతు దారులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు మరోముగ్గురు మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన యావత్ ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా చెప్పుకునే అమెరికాలో అధికార మార్పిడి హింసాత్మకంగా మారడంలో ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ ముందు జరిగిన ఘర్షణపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాన బోరిస్ జాన్స్న్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంలో అధికార మార్పడిన శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పెద్దన్నగా వర్ణించే యూఎస్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం. నిరసనకారులను శాంతిపచేయాల్సిన బాధ్యత వారి నేతలకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి ఆమోద యోగ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. (క్యాపిటల్ భవనంపై దాడి: ట్రంప్కు బైడెన్ విజ్ఞప్తి) ఫలితాల తారుమారుకు ట్రంప్ ఒత్తిడి... మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఏడాది నవంబర్ 3న జరగిన ఎన్నికల్లో 306- 232 తేడాతో ట్రంప్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలను సవాలు చేస్తూ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన దాదాపు 60 పిటిషన్లను అక్కడి కోర్టులు కొట్టివేశాయి. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఎక్కడా కనిపించడంలేదని న్యాయస్థానాలు తేల్చిచెబుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఈ క్రమంలో.. స్వింగ్ స్టేట్ అయిన జార్జియా ఎన్నికల చీఫ్కు ఆయన చేసిన ఫోన్ కాల్ ఆడియో లీకవ్వగా అది ఎంతి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా బైడెన్ గెలుపును పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను సైతం ట్రంప్ ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. ఫలితాలను తారుమారు చేయాలన్న ట్రంప్ విజ్ఞప్తిని మైక్ తీవ్రంగా తోసిపుచ్చారు. రాజీనామా చేసే యోచనలో ట్రంప్.. ఇక క్యాపిటల్ భవన్ ముందు చెలరేసిన హింసపై జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని అంగీకరించలేకనే ట్రంప్ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు అంటూ మండిపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేస్తూ ట్విటర్ యాజమన్యం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఖాతాను 12 గంటలపాటు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లు తొలగించాలని తొలుత ట్రంప్ను కోరగా.. ఆయన స్పందించకపోవడంతో ట్వీట్లు తొలగించి అన్లాక్ చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తుండటంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన వ్యక్తిగత సలహాదారులతో ట్రంప్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా జనవరిన అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కొరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. -
మళ్లీ స్మార్ట్ఫోన్ వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్ : దాదాపు 4ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్ఫోన్ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ డివైజ్ సర్ఫేస్ డ్యూయో కోసం కంపెనీ బుధవారం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు 1,399 డాలర్లు ఉండొచ్చు. ఈ స్మార్ఫోన్ 5.6అంగుళాల డిప్లేను, 4.8 మిల్లిమీటర్ల మందాన్ని కలిగి ఉండొచ్చు. సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల కావచ్చనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ.., వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే కరోనా ఎఫ్టెక్తో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ పతననాన్ని చవిచూడటం, నిరుద్యోగం రెండంకెల క్షీణత చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టడం పట్ల మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్టుమెంట్ చీఫ్ పీటర్ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్డోర్ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ లాగిస్తూ.. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (ట్రంప్ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి) ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్(ఆ సమయంలో విధుల్లో లేరు)కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వందలాది మంది ఒక్కచోట చేరి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రత్యక్ష సాక్షులు ఈ విషయం గురించి చెబుతూ.. బర్త్డే పార్టీలో ఒక్కసారిగా గన్ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని, అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని పేర్కొన్నారు. మరికొంత మంది కార్ల కింద దాక్కొన్నారని, అదో భయంకర ఘటన అని గుర్తు చేసుకున్నారు. -
కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!
వాషింగ్టన్ డీసీ: డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఈ మాట సర్వసాధారణంగా మనం ఏదో ఒక చోట వింటూనే ఉంటాం. అయితే ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది మారుమూల ఏదో ఒక వెనుకబడిన దేశంలో కాదు, అగ్రరాజ్యంలోనే చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. అదేంటి వింతగా చెట్లకు డబ్బులు కాయడం ఏంటా అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే చెప్పొచ్చు. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల మాట అటుంచితే ఇక కరోనా మహమ్మారి కారణంగా చిరు వ్యాపారులు, చిన్న చితక పనులు చేసుకునే వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి. చేతిలో డబ్బు లేక వారంతా విలవిలలాడుతున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఒక కొత్త కరెన్సీకి శ్రీకారం చుట్టింది అమెరికాలోని ఒక చిన్న పట్టణం. వాషింగ్టన్ రాష్ట్రంలోని టెనినో అనే చిన్న పట్టణంలో ఒక నూతన ఒరవడిని ప్రారంభించింది. అక్కడ చెక్క కరెన్సీని తయారు చేసి చలామణిలోకి తీసుకువచ్చారు. దానిని ‘కోవిడ్ డబ్బు’ అని పిలుస్తున్నారు. అక్కడ ఏది కొనడాకైనా ప్రజలు ఇప్పుడు ఆ డబ్బునే వినియోగిస్తున్నారు. మద్యం, పొగాకు, గంజాయి మినహా మిగిలిన వాటన్నింటిని ఈ డబ్బుతో కొనవచ్చు. దీనిని మాపుల్ వెనిర్ అనే కలప నుంచి తయారు చేస్తున్నారు. ఇది తెలుపు, తేల పసుపు రంగులో ఉంటుంది. దానిపై అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చిత్రాన్ని ముద్రించారు. చదవండి: కాయ్ రాజా కాయ్.. కరోనా కేసులపై బెట్టింగ్ల జోరు పర్యాటక రంగంపై ఆధారపడే నగరం టెనినో, అమెరికాలో కరోనా లాక్డౌన్ నుంచి అనేక సమస్యలను ఎదుర్కోంటోంది. దాని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దీంతో వారు చెక్క డబ్బును ఆవిష్కరించారు. స్థానిక వ్యాపారాలు నిర్వహించడం కోసం సిటీ హాల్లో రియల్ డాలర్ల కోసం దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. దీనిపై టెనినో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టైలర్ విట్వర్త్ మాట్లాడుతూ, ‘ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందో మాకు తెలియదు. కానీ చెక్క కరెన్సీతో, మేం ఇక్కడి సమాజంలో బతకవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనా అతని ఆయుష్షు పెంచింది! -
వాషింగ్టన్ డి.సిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డి సి (వర్జీనియా): దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా అమెరికాలో వాషింగ్టన్ డి సి మెట్రో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం జులై 8వ తేదీ సాయంత్రం (ఇండియా కాలమానము - గురువారం ఉదయం) ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డి సి రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, సత్య పాటిల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. (మదిలో మహానేత) వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, చెదరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం, మేరునగ ధీరుడు మన వైఎస్ రాజశేఖరుడు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన. అదే ఆలోచనలతో, భావనలతో అనేక పథకాలు రూపొందించి, అమలు చేసి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజలందరి మన్ననలు చూరగొన్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి’ అని కొనియాడారు. (రైతు దినోత్సవం) వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ, సమున్నత వ్యక్తిత్వం, చెరగని చిరునవ్వు, చెదరని దృఢనిశ్చయం, పదహారణాల తెలుగుదనం కలబోసి విరబూసిన విలక్షణ వ్యక్తిత్వమే ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వామనుడి మూడు పాదాలంత విస్తృత వ్యక్తిత్వానికి వైయస్ఆర్ అనే మూడంటే మూడు పొడి అక్షరాలు కొండను అద్దంలో కొంచెంగా చూపించే ప్రతీకలు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైయస్ఆర్ది’ అని ప్రశంసించారు. (తెలంగాణలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు) రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ‘మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసి ముఖ్య మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వైయస్ఆర్ కడప జిల్లా నుంచే నవరత్నాల పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా అందరికి మంచి చేయాలని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నవరత్న పథకాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. వినీత్ లోక వైఎస్సార్ను స్మరించుకుంటూ, ఆయన మరణం లేని మహానేత అని అన్నారు. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే..అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, నాటా నాయకులు సత్య పాటిల్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎల్వి కిరణ్, రఘునాథ్ రెడ్డి, వినీత్ లోక, నరేన్ ఒద్దులా, మదన గళ్ళ, అర్జున్ కామిశెట్టి, వినయ్ మాదాసు లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు -
నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్ శంకర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండో- అమెరికన్కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన విజయ్ శంకర్ను దేశ రాజధాని వాషింగ్టన్లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్ చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం లభించిన పక్షంలో విజయ్ శంకర్.. వాషింగ్టన్ డీసీలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా సేవలు అందించనున్నారు. కాగా డ్యూక్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన విజయ్ శంకర్.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జి చెస్టెర్ జే. స్ట్రాబ్ వద్ద లా క్లర్క్గా ఉన్నారు.(అమెరికాలో తెలుగు జడ్జిమెంట్) ఇక ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్గా ఉన్న విజయ్ శంకర్.. అప్పీలెట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్లో ఆయన ప్రైవేటు లాయర్గా ప్రాక్టీసు చేశారు. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలైన మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్ఎల్పీలో పనిచేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి.. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. వైద్యులైన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడగా.. సరిత అక్కడే పుట్టి పెరిగారు. (న్యూయార్క్ జడ్జిగా సరితా కోమటిరెడ్డి..!) సరితా కోమటిరెడ్డి -
కరోనా : ఆ వీధికి చైనా డాక్టర్ పేరు !
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన కొంతమంది సెనేటర్లు ఓ వీధికి చైనా డాక్టర్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీ ముందు ఉన్న ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ లీ వెన్లియాంగ్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.చైనాలోని వుహాన్కు చెందిన లీ వెన్లియాంగ్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలకు తొలిసారి వెల్లడించాడు. గత డిసెంబర్లో డాక్టర్ లీ వెన్లియాంగ్ తన తోటి సహచరులకు కొత్త కరోనా వైరస్ గురించి వీచాట్లో షేర్ చేశాడు. సార్స్ లాంటి వైరస్ ఏదో ప్రబలుతున్నట్లు అతను అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే తప్పుడు సమాచారం చేరవేస్తున్నారంటూ లీ వెన్లియాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు.(గంగా జలంతో చికిత్స.. నో చెప్పిన ఐసీఎంఆర్) అతను కొన్ని రోజులకే లీ వెన్లియాంగ్ కరోనా వైరస్ బారీన పడి కొద్ది రోజులచికిత్స పొందిన తర్వాత మరణించాడు. లీ వెన్లియాంగ్ మృతితో చైనా వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం వెల్లువెత్తింది. అయితే ప్రస్తుతం వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ పేరును అధికారికంగా ఖరారు చేయడమనేది కొంచెం కష్టమే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమమ్మారికి చైనానే కారణమని మొదటినుంచి చెబుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం అమెరికా సెనేటర్స్ తీసుకున్న చర్య చైనాకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఇంతకుముందు 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాలనుకున్నది. కానీ అప్పుడు కూడా ఆ ప్రయత్నంలో సఫలం కాలేదు. -
సతీసమేతంగా భారత్కు బయల్దేరిన ట్రంప్
-
భారత్కు బయల్దేరిన ట్రంప్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బయల్దేరారు. సతీసమేతంగా ఎయిర్ఫోర్స్ 1 విమానంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి పయనమయ్యారు. వారి వెంట కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఇండియా వస్తున్నారు. జర్మనీ మీదుగా వారు భారత్కు చేరుకుంటారు. రేపు (సోమవారం) ఉదయం 11.55 నిముషాలకు ట్రంప్ ఫ్యామిలీ అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. ఎయిర్పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతేరా క్రికెట్ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్ షోలో పాల్గొంటారు. లక్షలాది నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. చదవండి :- ట్రంప్ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు! ట్రంప్ను విలన్తో పోల్చిన కాంగ్రెస్ నేత హౌడీ X నమస్తే -
కాట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
వాషింగ్టన్ డీసీ : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) 2020- 2021 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అధ్యక్షురాలిగా సుధారాణి కొండపు ఉపాధ్యక్షులుగా సతీష్ వడ్డీ, కార్యదర్శి గా దుర్గాప్రసాద్ గంగిశెట్టి, కోశాధికారిగా పార్థసారథి బైరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి ఎన్నికయ్యారు. ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు నియమితులయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న కాట్స్ మాజీ అధ్యక్షుడు రవి బొజ్జ నూతన అధ్యక్షురాలికి పదవీ బాధ్యతలు అప్పగించారు. సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సలహాదారులు భువనేష్ బూజాల, మధు కోల, భాస్కర్ బొమ్మారెడ్డి, అనిల్ నీరుకొండతో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞుల సలహాలతో, కొత్తగా కార్యవర్గంలో చేరినవారి ఆలోచనలను రంగరిస్తూ పనిచేస్తామని సుధారాణి అన్నారు. తెలుగు భాష, సాహితీ రంగాలకు పెద్దపీట వేస్తూ, అంతరించిపోతున్న జానపదాలు, నాటకాలను పునరుజ్జీవం చేసే కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు. డీసీ మెట్రో ప్రాంతానికి చెందిన తెలుగు వారందరికీ మరింత చేరువయ్యే క్రీడా,సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రతీ నెలా చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సుధారాణి వెల్లడించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ పరిధిలో మరింత విస్తృత పరిచేలా కాట్స్ కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. -
అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ఆకాంక్ష
వాషింగ్టన్: ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై అమెరికాలోని ప్రవాస ఆంధ్రులు స్పందించారు. రాష్ట్ర సర్వతోభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదనలను సమర్థిస్తూ పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. కాలిఫోర్నియా, ఓహాయో నగరాల్లో ‘ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్’ అంటూ ప్రదర్శనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సమగ్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు అవసరమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ అంశానికి సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్, లేక్ ఎలిజబెత్ పార్కులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారైలు సమావేశమై తమ మద్దతును ప్రకటించారు. ‘ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్’ పోస్టర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై చంద్రహాస్ పెద్దమల్లు, కేవీ రెడ్డి మాట్లాడుతూ.. ‘అభివృద్ధి అంతా ఒకేచోట వద్దు, మిగిలిన ప్రాంతాలను వెనక్కి నెట్టొద్దు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలి’ అని అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ మునుకూరు, సురేంద్ర అబ్బవరం మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన ఫలితాలు అందుతాయని, అలా కాకుండా ఒకే ప్రాంతాన్ని వృద్ధి చేస్తే, అది ప్రాంతీయ అసమానతలకు, విబేధాలకు దారితీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కూచిబొట్ల, హరి శీలం, కొండారెడ్డి, తిరుపతిరెడ్డి, దిలీప్, పోలిరెడ్డి, ఆనంద్, అమర్, త్రిలోక్, సహదేవ్, సుబ్రహ్మణ్యం, హరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒహియోలోని క్లీవ్లాండ్ నగరంలో ఎన్నారైలు ‘ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్’ అని ప్రదర్శనలు చేశారు. సలీం షైక్, వెంకట్ సురేన్ మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా హైదరాబాద్లా ఒకే చోట కాకుండా రాష్ట్రమంతా అభివృద్ది ఫలాలు అందాలని ఆకాక్షించారు. అనిల్ రెడ్డి మూల మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలన్న వైఎస్ జగన్ ఆలోచన రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నారైలు విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ‘ఒకే రాజధాని వద్ద మూడు రాజధానులు ముద్దు’అని నినదించారు. కార్యక్రమంలో రవి నూక, రవి పాచిపళ్ళ, నాగేశ్వర రెడ్డి గజ్జల, హరినాథ్, సస్కధర్ మొందెడుల్లా, బదరి నాథ్ బుడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దీపావళి వేడుకలకు నాట్స్ కు ప్రత్యేక ఆహ్వానం
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా భారతీయులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను రాయబార కార్యాలయం ఆహ్వానించింది. తెలుగువారి మేలు కోసం అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ను దీపావళి వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరుతూ భారత రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. దీంతో నాట్స్ కూడా వాషింగ్టన్ డీసీ దీపావళివేడుకల్లో భాగస్వామి అయింది. ఈ సందర్భంగా భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా ప్రవాస భారతీయ ప్రతినిధులకువిందు ఇచ్చారు. ఇందులో నాట్స్ ప్రతినిధిగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని హాజరయ్యారు. నాట్స్ చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం నాట్స్ కు ఆహ్వానాన్ని పంపడంపై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. -
వాషింగ్టన్ డి.సిలో వైఎస్సార్కు ఘనమైన నివాళి
వాషింగ్టన్ : ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నవిషయం అందరికీ తెలిసిందే. వైఎస్సాఆర్ 10వ వర్ధంతి పురస్కరించుకొని అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ఏ, వాషింగ్టన్ డీసీ మెట్రో ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని స్టెర్లింగ్ సిటీ, వర్జీనియా,యూఎస్ఏ లోని ఇనోవా బ్లడ్ డోనర్ సెంటర్ లో రక్త దాన కార్యక్రమాలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ వల్లూరు రమేష్ రెడ్డి, వర్జీనియా రీజినల్ ఇంచార్జి శశాంక్ రెడ్డి అరమడక, శ్రీ సత్య పాటిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొనగా, 50 మంది రక్తదానం చేశారు. 'ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే "రాజన్న పరిపాలన"కు చిరునామాగా నిలిచారాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి ప్రసన్న కాకుమాని, మేరీల్యాండ్ స్టేట్ ఇంచార్జి పార్థ బైరెడ్డి, వర్జీనియా స్టేట్ ఇంచార్జి ఆంజనేయ రెడ్డి, దొందేటి శ్రీని గోపన్నగారి, వినీత్ లోక , రఘునాథ్ రెడ్డి , సుజిత్ మారం, మదన గళ్ళ, అనిత ఎరగంరెడ్డి , శ్రీరేఖ సంగీతం, శిరీష భీమిరెడ్డి, సుమంత్ మోపర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైట్హౌస్ సమీపంలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉల్కిపడింది. ఈ సారి ఏకంగా వైట్హౌస్ సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాలు.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో కొలంబియా రోడు 14వ వీధిలో గుర్తు తెలియని దుండగులు విచక్షాణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సీఎంకు ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకం
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కడి తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కదలిక పత్రిక సంపాదకుడు ఇమామ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్న సీఎం జగన్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (యూఎస్) విభాగం గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారు వల్లూరు రమేశ్రెడ్డి ఈ పుస్తకాన్ని అందజేశారు. -
హాచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి జగన్
-
డల్లాస్లో ప్రవాసాంధ్రులతో సీఎం వైఎస్ జగన్
-
పెట్టుబడులకు అనుకూలం
వాషింగ్టన్ డీసీ: నీతివంతమైన పాలన, కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా వాషింగ్టన్ డీసీలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. కొత్త అవకాశాలున్నాయ్... రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం పరిఢవిల్లేలా అమెరికాలోని భారతీయ అధికారులు గట్టి పునాదులు వేశారని వైఎస్ జగన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయన్నారు. ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను ఇవి మరింత పెంచడమే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో అభివృద్ధి పథంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టి, స్థిర సంకల్పం, పారదర్శక విధానాలు ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వ పటిమను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ విందులో పాల్గొన్న అమెరికా ప్రభుత్వ సీనియర్ డైరెక్టర్(ప్రభుత్వ వ్యవహారాలు) క్లాడియో లిలిన్ ఫీల్డ్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, నగర ప్రణాళికలు, జల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పరిశ్రమల్లో విద్యుత్ సామర్థ్యం పెంపు, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన పంటలు తదితర రంగాల్లో తాము పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. స్మార్ట్ సిటీలు, లైటింగ్ ఉత్పత్తులతో సహా పలు రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు వ్యాపారవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిచర్డ్స్ రీఫ్ మ్యాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ థామస్ ఎల్ వాజ్దా, గ్లోబల్ సస్టెయినబిలిటీ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ క్లే నెస్లర్ సహా పలువురిని సీఎం కలిశారు. డల్లాస్కు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హచ్సన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రముఖులతో తేనీటి విందులో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు) ఇక్కడే నార్త్ అమెరికా తెలుగు వారితో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొననున్నారు. -
యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్
-
అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం మాది
వాషింగ్టన్ డీసీ: అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్కు విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చడం, మెట్రో రైళ్లు, బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తుల విస్తృతికి మార్కెట్లో అపార అవకాశాలున్నాయన్నారు. నాణ్యత, అధిక దిగుబడులు సాధించడానికి తాము చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రాధాన్యతలుగా చెబుతున్న రంగాలన్నింటిలో పర్యావరణ హితం ఉంటుందన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకత్వం ఉంది: రాబ్ ష్రోడర్ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ ష్రోడర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఇటీవల ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనవిజయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ బలమైన నాయకత్వం అమెరికా– ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న భారత్ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించారు. యూఎస్లో భారత రాయబారి హర్షవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘనవిజయం సాధించారని, ఇంత మెజార్టీ రావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సరైన రాష్ట్రమని పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొన్ని కీలక అంశాలను వివరించారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం, కడపలో స్టీల్ ప్లాంట్, కోస్తా తీరంలో రిఫైనరీ ప్రాజెక్టు, బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ, తదితర కీలక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలుగా చేసుకుందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ 2.2 కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, వాటిని అమలుచేస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వాన్ని అందించడానికి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. (చదవండి : సీఎం జగన్కు అమెరికాలో ఘన స్వాగతం) ముఖ్యమంత్రికి ఘనస్వాగతం వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సీఎం వైఎస్ జగన్ అక్కడి కాలమానం ప్రకారం.. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీలోని డుల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణిష్ చావ్లా, నికాంత్ అవహద్ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎంకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో సీఎం వైఎస్ జగన్కు చోటు న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల దర్యాప్తు, సలహాల కోసం ఉద్దేశించిన అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చోటు లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షుడిగా ఉండే 13 మందితో కూడిన స్టాండింగ్ కమిటీలో నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు నామినేట్ అయ్యారు. వారిలో నవీన్పటా్నయక్ (ఒడిశా), నితీశ్కుమార్ (బిహార్), అమరేందర్ సింగ్ (పంజాబ్)లతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. తాజాగా అంతర్రాష్ట్ర మండలిని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార విభాగాలు కూడా ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. వీరంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నిర్ణయాలపై నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కౌన్సిల్లో సమస్యలను ప్రస్తావిస్తారు. ఈ స్టాండింగ్ కమిటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శర్బానంద్ సోనోవాల్ (అసోం), విజయ్ రూపాణీ (గుజరాత్), దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్)లతో పాటుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, తావర్ చంద్ గెహ్లోత్, గజేంద్రసింగ్ షెకావత్లు చోటు దక్కించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్తో ‘ఆస్క్ ఏ క్వశ్చన్ టు సీఎం’
వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం.. సీఎం జగన్ నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) ఉంటుంది. అనంతరం డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఇక సీఎంతో సమావేశం నేపథ్యంలో నాటా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ను సంప్రదించి.. సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఓ వెబ్సైట్ రూపొందించింది. ఈ కింది లింక్ ద్వారా సీఎం జగన్ను ప్రశ్నలు అడగొచ్చు. https://www.cmysjaganusa2019.com/#ask_question -
సీఎం జగన్కు అమెరికాలో ఘన స్వాగతం
వాషింగ్టన్ : అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా(ఐఏఎస్), నీల్కాంత్ అవ్హద్(ఐఏఎస్) కూడా సీఎం జగన్ను సాదరంగా ఆహ్వానించారు. కాగా వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ విందులో పాల్గొంటారు. ఇదిలా ఉండగా.. అమెరికా పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల సీఎం జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే స్వయంగా ఖర్చులు భరించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. చదవండి: బహుదూరపు బాటసారి అమెరికాయానం... సీఎం జగన్ పర్యటన వివరాలు ♦ ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. అనంతరం అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. ♦ ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ♦ ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ♦ ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు. ♦ ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, స్వాగతం పలికిన భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు pic.twitter.com/b8OGYUnk29 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2019 -
వైట్హౌస్ బేస్మెంట్లోకి వరద నీరు
వాషింగ్టన్ : అమెరికాలోని వాషింగ్టన్ను వరద నీరు ముంచెత్తింది. సోమవారం ఉదయం గంట వ్యవధిలో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటమునగడంతో వాహనదారులు వాటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి 15 మంది అత్యవసర సిబ్బంది కాపాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వర్షం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ను కూడా తాకింది. వైట్హౌస్ బేస్మెంట్లోని కార్యాలయాల్లోకి కొద్దిపాటి వరద నీరు చేరింది. సీఎన్ఎన్ జర్నలిస్టు బెట్సీ కూడా ‘వైట్ ఈస్ లికింగ్’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. సోమవారం రోజున వాషింగ్టన్లో కురిసిన వర్షం ప్రమాదకర పరిస్థితులను తలపించిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. గంటపాటు కురిసిన వర్షం రోజువారి రికార్డును బ్రేక్ చేసిందని పేర్కొంది. -
వాషింగ్టన్ డీసీలో అమర జవాన్లకు శ్రద్దాంజలి
వాషింగ్టన్ డీసీ : కశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన జవాన్లకు అమెరికాలోని భారతీయులు నివాళులర్పించారు. వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్ధాంజలిని ఘటించారు. అమెరికాలోని పార్టమెంట్ ఎదుట ఏర్పాటు చేసిన అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనిక సేవలను కొనియాడుతూ వారి కుటుంబాలకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని అన్నారు. -
వాషింగ్టన్ డీసీలో ‘యాత్ర’ జైత్రయాత్ర
సాక్షి, వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాల్లో (మేరీల్యాండ్, డెలావేర్, వర్జీనియా) యాత్ర ప్రీమియర్ షోల సందర్భంగా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'యాత్ర' చిత్ర యూనిట్కి వైఎస్సార్ అభిమానులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ అభిమానులు యాత్ర రిలీజ్ను పండగలా జరుపుకున్నారు. వైఎస్సార్ జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్సీపీ సలహాదారు (యూఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి జీవం పోసి అత్యంత అద్భుతంగా నటించారని, బాడీ లాంగ్వేజ్ వైఎస్సార్ని తలపించిందని, చివరికి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పారన్నారు. వర్జీనియాలోని సినేమార్క్ థియేటర్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి సతీసమేతంగా యాత్ర సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ 'యాత్ర' లో పాల్గొనాల్సిందేనని తెలిపారు. పలు సందర్భాలలో మహానేత రాజశేఖర రెడ్డి తమతో ఉన్నట్లుగా ఈ చిత్రం తమను కదిలించిందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వాస్తవిక సంఘటనలున్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదనవంటివి దర్శకుడు మహి వి. రాఘవ్ చూపించిన తీరు వైఎస్సార్కి ఇచ్చిన నివాళి అనడం సబబేమో అని కొనియాడారు. యాత్ర సినిమాని చుసిన తరువాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని పలువురు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను (రాజన్నను) కళ్లకు కట్టినట్టుగా చూపించారని కృష్ణ రెడ్డి చాగంటి, భువనేశ్ భుజాల, రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాధవీ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’ అని సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ వంతు బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని అన్నారు. లక్ష్మి, గీత మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. మహానేత పాదయాత్ర నాయకుడికి.. ప్రజలకు మధ్య దూరాన్ని చెరిపేసిందని, రాష్ట్ర స్థితిగతులను మార్చి ఎందరికో మార్గదర్శకమైందని అందుకే ఆయనను ప్రేమించని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదని సత్తిరాజు సోమేశ్వర రావు అన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవమని ప్రవాసులు అన్నారు. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుందని తెలిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశి దేవిరెడ్డి, శివ మేకలది. ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, మాధవి రెడ్డి, సోమిరెడ్డి, క్రిష్ణా రెడ్డి, గీత రెడ్డి, రామ్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, కోటి రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజశేఖర్ కాసారానేని, భువనేశ్ భుజాల, రాజశేఖర్ బసవరాజు, సత్తిరాజు సోమేశ్వర రావు అనేక మంది పాల్గొన్నారు. -
అమెరికాలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం
వాషింగ్టన్ డీసీ: గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్నారై ప్రవీణ్ తుమ్మపల్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. వర్జీనియా రాష్ట్రం వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని అల్దీ నగరంలో నివసిస్తున్న ఆయన ఈ నెల 22న ఛాతినొప్పి వస్తుందంటూ అమాంతం కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకుపోయేలోపే గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లా పేర్వాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ వయస్సు 45 ఏళ్లు. 1990లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆయన వాషింగ్టన్ డీసీలోని సీజీఐ ఫెడరల్ సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ తుమ్మపల్లి మృతిపట్ల అమెరికాలోని తెలుగువారు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, ఇక్కడి తెలుగువారికి తీరని లోటు అని ప్రవీణ్ ఆప్తమిత్రుడు యుగంధర్రెడ్డి పేర్కొన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు నల్లగొండలో ఉన్నందున స్వదేశానికి ఆయన భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శనార్థం ప్రవీణ్ భౌతికకాయాన్ని బుధవారం (26న) అలెగ్జాండ్రియాలోని జెఫర్సన్ ఫ్యునరల్ చాపెల్లో ఉంచనున్నామని, ప్రవీణ్ తుమ్మపల్లి భౌతికకాయం అంత్యక్రియల నిమిత్తం గురువారం స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన మిత్రులు తెలిపారు. ప్రవీణ్కు భార్య పావని, 10, 14 ఏళ్ల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్, సాక్షి ప్రతినిధి : వాషింగ్టన్ డీసీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రలు వైఎస్సార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధర్ నాగిరెడ్డి సభను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను ఎన్నారైలకు పరిచయం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ సలహాదారు (యుఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో ఇటీవల లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉన్నాయని కొనియాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఊపిరని, హోదా సాధించే వరకూ వైఎస్సార్సీపీ విశ్రమించబోదని రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే జననేత వైఎస్ జగన్ కోసం ప్రవాసాంధ్రులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ప్రజల మనిషని, ప్రజల కోసమే పుట్టి, వారి కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అనంతరం కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రతి బూత్ పరిధిలో అదనంగా పది ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం సులభం అవుతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని విమర్శించిన ఆయన, ప్రతీరోజు బాబు చెబుతున్న నిజాలను చూసి మైక్రోఫోన్ సిగ్గుతో తలదించుకుంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధి, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను ఎన్ఆర్ఐలు హర్షించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచి, వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ప్రవాసాంధ్రులు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి ఎన్నారై తమ వంతు కృషి చేయాలనీ కోరారు. వైఎస్ జగన్ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర చేస్తున్నారని, రాజన్న రాజ్యం వైఎస్ జగన్తోనే సాధ్యమని ఇందుకోసం ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్కు ఏపీ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన, ప్రజలు మద్దతు తెలుపుతున్న తీరు చూసి రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అనిల్కుమార్ యాదవ్, కోన రఘుపతి, పార్టీ సీనియర్ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్ ఖాన్, స్టేట్ సెక్రటరీ వరప్రసాద్ రెడ్డి అరిమెండ, ఎన్ఆర్ఐ ఇండియా సమన్వయ కర్త హర్షవర్ధన్ రెడ్డి, ఎన్ఆర్ఐ అమెరికా కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, శశాంక్ అరమడక, రాంగోపాల్ దేవపట్ల, మినాడ్ అన్నవరం, ప్రసన్న కాకుమాని, సుదర్శన దేవిరెడ్డి, శౌరిప్రసాద్, సుజీత్ లతో పాటు స్థానిక నాయకులూ పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్ఆర్ఐలు ఇండియా నుంచి వచ్చిన నాయకులను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. -
నాటా వేదికగా హోదా ఆవశ్యకత
వాషింగ్టన్ డీసీ : నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహా సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యకతను చాటి చెపుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు హోదా ఇవ్వాలన్న డిమాండ్తో ఇటీవల లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. నాటా సభలు జరగనున్న ఫిలడెల్ఫియాకు జులై 5 కల్లా వైఎస్సార్ కాంగ్రెస్ బృందం రానుందని పార్టీ గవర్నింగ్ కౌన్సిల్ రమేష్ రెడ్డి వల్లూరు, పార్టీ యూఎస్ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల తెలిపారు. హోదా పోరులో ఏపీలో, ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ఎన్నారైల ముందుంచుతామని, నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ ఎలా వెన్నుపోటు పొడిచారో వివరిస్తామని తెలిపారు. మహానేత వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకు అమెరికా కమిటీ ఆహర్నిశలు కష్టపడుతుందన్నారు. ప్రజలందరికీ మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను నాటా వేదికగా వేలాది మంది ఎన్నారైలకు చాటి చెపుతామన్నారు. జులై 8, 2018 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ సిపి యూఎస్ఏ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్ఫోరం సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని చంద్రబాబు ప్రలోభపెట్టి ఏ విధంగా పార్టీ ఫిరాయించేలా చేశారో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వివరిస్తారని తెలిపారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్సీపీ పొలిటికల్అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్ఇన్ఛార్జ్లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్అధ్యక్షులు శివభరత్రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు. -
‘ఆ కుటుంబాలకు బీజేపీ న్యాయం చేస్తుంది’
వాషింగ్టన్: సిక్కు వ్యతిరేక అల్లర్లలో నష్టపోయిన సిక్కు కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సిక్కు అమెరికన్లు నిర్వహించిన సిక్కుల సాంప్రదాయ పండుగ వైశాఖిలో రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో నివాసముంటున్న సిక్కులు భారీ సంఖ్యలో హాజరైయారు. కార్యక్రమంలో రాంమాధవ్ మాట్లాడుతూ...1984లో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన సిక్కుల ఉచకోతలో చాలా మంది సిక్కులు మరణించారని, వారి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీయిచ్చారు. సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారందరికి శిక్ష పడుతుందన్నారు. సిక్కు అల్లర్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ధింగ్రా కమిటీ అనేక అభియోగాలు నమోదు చేసిందని, సిక్కులపై 186కు పైగా దాడులు జరిగాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశము ద్వారా వైశాఖి పండుగను నిర్వహిస్తున్న వారందరికి అభినందనలు తెలిపారు. వైశాఖి సిక్కు సాంప్రదాయం, సిక్కు సమాజపు సంస్కృతి, విలువలను పెంచుతుందని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్లు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించారు. -
'హోదా' కోసం ప్రవాసాంధ్రుల మౌన నిరసన
వాషింగ్టన్ డీసీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి మద్దతుగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ ఫార్మ్ పార్కులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపై ధ్వజమెత్తారు. ఆనాడు రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఈనాడు హామీనిచ్చి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ప్యాకేజీ మేలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్సీపీ అనేక పద్ధతుల్లో ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేసి, చివరికి వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చేసి ఆమరణనిరాహారదీక్ష చేయటం అభినందనీయమని ఎంపీలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు, మోసాలు, కేసులనుండి తప్పించుకోవటానికే కేంద్రంతో కుమ్మక్కయి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ హోదాని తాకట్టు పెట్టారని ఎన్ఆర్ఐలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ ప్రజలకి ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఆనాడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని ఈరోజు కేసులనుండి తప్పించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నాడన్నారు. ఇప్పటికైనా తెలుగు ప్రజలు నిజాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంకోసం నిరంతరం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బలపరిచి అన్ని ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన దీక్షలో రమేష్ రెడ్డి వల్లూరు, శశాంక్ అరమడక, అమర్నాథ్ కటికరెడ్డి, మదన్ గల్లా, ఇంతియాజ్ పఠాన్, శ్రీనివాసరెడ్డి గొప్పన్నగిరి, కిషోర్ జొన్నలగడ్డ, అర్జున్ కామిశెట్టి, శివ వంకిరెడ్డి, వెంకటమణిదీప్ కొత్తా, చంద్రతేజా రెడ్డి, శ్రీధర్ నాగిరెడ్డి, నినాద్ అన్నవరం, సతీష్ నరాల, వెంకట రాజా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటరమణారెడ్డి లతోపాటుగా పలువురు తెలుగువాళ్లు పాల్గొన్నారు. తీవ్ర చలిగాలులతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా పెద్ద ఎత్తున తెలుగు వారు వచ్చి ప్రత్యేకహోదాకి మద్దతు తెలిపినందుకు వైఎస్సార్సీపీ నాయుకులు వల్లూరి రమేష్ రెడ్డి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తిని పోలీసులు షూట్ చేశారు. ఓ అపార్ట్మెంట్లో పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. పోలీస్ చీఫ్ పీటర్ న్యూషామ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ అపార్ట్మెంట్లో కాల్పులు చోటుచేసుకున్నాయన్న సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని మైఖెల్ లీచ్(32)గా గుర్తించారు. అతడికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
ఈ ఏడాదిలో ఒక సెకను అదనం!
వాషింగ్టన్: 2016 సంవత్సరం ఒక సెకను కాలంపాటు ఎక్కువగా ఉండబోతోంది. కొత్త ఏడాదికి ముందు ఒక లీపు సెకనును ఈ సంవత్సరానికి కలపనుండటమే ఇందు కు కారణం. వాషింగ్టన్ డీసీలోని ‘యూఎస్ నావల్ అబ్జర్వేటరీస్ మాస్టర్ క్లాక్ ఫెసిలిటీ’వద్ద డిసెంబరు 31న యూటీసీ (కో–ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్) కాలమానం ప్రకారం సమయం 23:59:59 సెకన్లు ఉన్నప్పుడు లీపు సెకనును కలుపుతారు. అంటే భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల 59 సెకన్లు ఉన్నప్పుడు ఆ ఒక్క సెకను అదనంగా కలుస్తుంది. -
ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం
వాషింగ్టన్: దీపావళి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం(ఏటీఏ) పేదవారి ముఖంలో సంతోషం నింపే కార్యక్రమం నిర్వహించింది. వాషింగ్టన్ డీసీలోని డీసీ సెంట్రల్ కిచెన్లో నిర్వహించిన కమ్యూనిటీ సర్వీస్ ఈవెంట్లో ఏటీఏ సభ్యులు స్వయంగా పేదవారికి భోజనం తయారుచేసిపెట్టారు. ఏటీఏ నుంచి 40 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని పోషకాహారాన్ని తయారుచేసి పేద ప్రజలకు అందించారు. హిందూ అమెరికన్ అసోసియేషన్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏటీఏ సభ్యులు తెలిపారు. స్థానిక ఏటీఏ ట్రస్టు సభ్యులు, వర్జీనియా, మేరిలాండ్ నుండి పాల్గొన్న ఏటీఏ సభ్యులు, వాలంటీర్ల సహకారంతో సుధీర్ బండారు, అమర్ బొజ్జా, చంద్ర కారుబోయిన తదితరులు పాల్గొని దివాళి పర్వదినం రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికుల మన్ననలు పొందింది. -
అమెరికాలో బాంబు కలకలం!
అమెరికా వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ థీమ్ పార్క్ ‘సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా’ వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది. ఈ థీమ్ పార్కు వద్ద బాంబులు ఉన్నట్టు అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు వదంతులపై ప్రస్తుతం పోలీసు అధికారులకు సహకరిస్తున్నామని, థీమ్ పార్కు పూర్తిగా సురక్షితంగా ఉన్నదని నిర్ధారించుకునేవరకు దీనిని మూసివేస్తున్నామని పార్కు అధికారులు ట్విట్టర్ లో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు థీమ్ పార్కు వద్ద రెండు అనుమానిత ప్యాకేజీలు లభించాయని, దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రిన్స్ జార్జ్ కౌంటీ అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి మార్క్ బ్రాడీ తెలిపారు. మొదటి అనుమానిత ప్యాకేజీని తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఏమీ కనిపించలేదని, రెండో దానిని ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. -
ఒబామా ఉండబోయే భవంతి ఇదే..
వాషింగ్టన్: వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిశాక బరాక్ ఒబామా కుటుంబం నివసించనున్న భవంతి ఇదే. వాషింగ్టన్ డీసీలోని కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న ఈ భవనంలోనే ఒబామా ఉండబోతున్నారని అమెరికా మీడియా నిర్థారించింది. పావు ఎకరం స్థలంలో 1928లో ఈ భవంతిని నిర్మించారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. -
అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. -
అగ్రరాజ్యమా? మంచుయుగపు దేశమా?
చరిత్ర కనీవినీ ఎరగని రీతిలో అమెరికాను అతలాకుతలం చేసింది జోనాహ్. దాదాపు 50 గంటలపాటు తన ప్రకోపాన్ని కుమ్మరించిన ఆ మంచు తుఫాను పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలను తోడేసింది. తుఫాన్ ఉధృతి తగ్గి, మేఘాలు కాస్త పక్కకు జరిగిన సమయంలో నాసా ఉపగ్రహం ల్యాండ్ స్టార్ 8.. విలయం తాలూకు ఫొటోలను చిత్రీకరించింది. అంతరిక్షం నుంచి తీసిన ఫొటోల్లోనూ జోనాహ్ మంచు తుఫాను బీభత్సం కళ్లకు కట్టినట్లు కనిపించడం గమనార్హం. వాషింగ్టన్ తోపాటు వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాలనూ పైనుంచి ఫొటోలు తీసి పంపింది ల్యాండ్ స్టార్. తుఫాను ధాటికి ప్రపంచ ప్రఖ్యాత మిచిగావ్ సరస్సుకూడా గడ్డకట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సరస్సులో చిక్కుకుపోయిన భారీ నౌకను ఓ ఔత్సాహికుడు డ్రోన్ సహాయంతో ఫొటోలు తీశాడు. -
అమెరికా అతలాకుతలం
మంచు తుపానుతో వణికిపోతున్న అగ్రరాజ్యం 18 మంది మృత్యువాత వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా తూర్పు కోస్తా ప్రాంతం మొత్తం బలమైన ఈదురు గాలులు, మంచు తుపాను ధాటికి అల్లకల్లోలం అవుతోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మంచు తుపాను ధాటికి దాదాపు 18 మంది మృత్యువాత పడ్డారు. ‘స్నోజిల్లా’ అని పిలుస్తున్న ఈ మంచు తుపాను ప్రభావంతో అమెరికా పశ్చిమ ప్రాంతం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి ప్రధాన నగరాలు మంచు తుపానులో చిక్కుకోవడం దాదాపు 8.5 కోట్ల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లేకపోవడంతో కొన్ని వేల మంది చీకట్లోనే గడుపుతున్నారు. వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్ వంటి నగరాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న కారణంతో ప్రజలు కార్లలో ప్రయాణించకూడదని ఆంక్షలు విధించింది. భూగర్భ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేందుకు రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు తొలగిస్తున్నారు. ఇంకో 24 గంటలు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. -
ప్రేతసౌధం
మిస్టరీ * అది ఓ ప్రఖ్యాతి చెందిన సౌథం * అందులో అడుగడుగునా భయం * ఆ భయానికి ఏమిటి కారణం? వాషింగ్టన్ డీసీ... కిటికీ దగ్గర నిలబడి తదేకంగా బయటకు చూస్తున్నాడా వ్యక్తి. వేసవి కావడంతో వెన్నెల విరబూసింది. చీకటిని దూరంగా తరిమి కొడుతోంది. ఆకాశమంతా అందంగా పరుచుకున్న నక్షత్రాలు, వాటి మధ్యలో హుందాగా నిలబడిన చందమామ... చూడటానికే ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం. అందుకే తదేకంగా చూసి పరవశిస్తున్నాడా వ్యక్తి. అంతలో పనివాడు వచ్చాడు. ‘‘సర్... స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి’’ అని వినయంగా అన్నాడు. సరే అన్నట్టు తలూపి కిటికీ దగ్గర్నుంచి ఇవతలకు వచ్చాడాయన. పనివాడు అందించిన టవల్ను తీసుకుని బాత్రూమ్లోకి నడిచాడు. పది నిమిషాల్లో స్నానం ముగించి బయటకు వచ్చాడు. తడి ఒంటిని మెత్తని టర్కీ టవల్తో తుడుచుకుని నైట్ గౌన్ వేసుకున్నాడు. ఒంటికి పౌడర్ పూసుకున్నాడు. అద్దం ముందు నిలబడి దువ్వెనతో తల దువ్వుకుంటున్నాడు. ఇంతలో వెనుక ఏదో అలికిడి అయినట్టనిపించింది. గదిలో తను తప్ప ఎవరో లేరే, మరి ఆ అలికిడి ఏమిటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలోని దువ్వెనను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ‘‘నమస్తే మిస్టర్ ప్రెసిడెంట్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు సౌమ్యంగా. అవతలి వ్యక్తి మాట్లాడలేదు. హుందాగా తల పంకించాడు. అందంగా నవ్వాడు. మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఉలిక్కిపడ్డాడాయన. ఏదో ట్రాన్స్ లోంచి బయట పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. గదంతా పరికించి చూశాడు. ఎక్కడా ఆయన లేడు. జరిగిందేమిటో అర్థమైంది. వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. క్షణాల్లో ఆ వణుకు ఒళ్లంతా పాకింది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని గబగబా బయటకు పరుగుదీశాడు. ‘‘ఏం జరిగింది సర్... ఎందుకలా కంగారు పడుతున్నారు?’’... ఎదురు వచ్చిన మేనేజర్ అడిగాడు. ఆ వ్యక్తి కాసేపు మాట్లాడలేకపోయాడు. వణుకుతూ నిలబడిపోయాడు. తర్వాత ఎప్పటికో తడారిపోయిన గొంతును సవరించుకుని అన్నాడు... ‘‘నేను ఈ గదిలో పడుకోను. వేరే గది ఏర్పాటు చేయండి.’’ మేనేజర్కి అర్థం కాలేదు. ‘‘ఏం సర్. ఇక్కడ ఏర్పాట్లు బాలేదా? క్షమించండి. ఇప్పుడే అన్నీ సరి చేయిస్తాను’’ బతిమాలు తున్నట్టుగా అన్నాడు. ఆయన వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ‘‘అవసరం లేదు. వేరే రూమ్ ఇవ్వండి’’ అంటూ వడివడిగా హాల్లోకి వెళ్లిపోయాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకలా వణుకుతున్నాడో ఎంతకీ అంతు పట్టలేదు మేనేజర్కి. కానీ గుచ్చిగుచ్చి అడగలేడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తి కాదు... బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. అతిగా ప్రశ్నలు వేస్తే అతిథిగా వచ్చిన ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆయన కోసం వేరే గది ఏర్పాటు చేశాడు. కానీ నిజానికి ఏం జరిగిందో అర్థమై ఉంటే అతడు కూడా అవాక్కయ్యేవాడు. భయంతో బిక్కచచ్చేవాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? చర్చిల్ అంతగా ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే... అక్కడ గదిలో, ఆయన మంచం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎవరో కాదు... అబ్రహాం లింకన్. కాదు కాదు... ఆయన ఆత్మ. లింకన్ చనిపోయి అప్పటికే చాలాకాలం అయ్యింది. కానీ ఆ విషయం చర్చిల్కి స్ఫురించలేదు. ఓ గొప్ప వ్యక్తిని చూసిన ఆనందంలో అనాలోచితంగా ఆయన్ని పలకరించారు. తర్వాతగానీ వాస్తవం బోధపడలేదు. లింకన్ మరణం గుర్తుకొచ్చాక ఇక కాలు నిలబడలేదు. గుండె దడ ఆగలేదు. నిజానికీ అనుభవం చర్చిల్కు మాత్రమే ఎదురు కాలేదు. అమెరికా అధ్యక్షుడి నివాసగృహంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైట్ హౌస్... ఎంతోమందికి భయానక అనుభవాలను రుచి చూపించింది. ఎందరో ప్రముఖులకు నిద్రలేని రాతుల్ని మిగిల్చింది. కారణం... ఆ భవంతి నిండా ఉన్న ఆత్మలు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే... దెయ్యాలు! ధవళకాంతులతో, అత్యాధునిక సౌకర్యాలతో విలసిల్లుతుంది వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడు నివసించడానికని ఈ భవంతిని అత్యంత అందంగా తీర్చి దిద్దారు డిజైనర్లు. అధ్యక్షుడి హోదాలో ఇక్కడ యేళ్ల పాటు నివసించారు ఎంతో మంది ప్రముఖులు. అయితే ఎవరూ ఊహించిన విధంగా వైట్ హౌస్ కాస్తా ఘోస్ట్ హౌస్గా మారింది. ఆ భవంతి నిండా దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పలువురు చెప్పసాగారు. చెప్పినవారు మామూలు వాళ్లయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ అతిథులుగా వచ్చిన ఇతర దేశాల నేతలు, ప్రముఖులు సైతం దెయ్యాల్ని చూసి జడుసుకున్నారు. కొందరు భయంతో వణికారు. కొందరైతే కళ్లు తిరిగి పడిపోయారు. దానికి తోడు అక్కడ నివసిస్తోన్న అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తరచూ దెయ్యాలు హాయ్ చెబుతూ ఉండటంతో వైట్ హౌస్ ఘోస్ట్ హౌస్ అయ్యిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ అక్కడ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా??? వైట్ హౌస్లో అత్యంత ఫేమస్ దెయ్యం... అబ్రహాం లింకన్ది. ఆయన ఆత్మను తొలిసారి చూసింది... అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ భార్య గ్రేస్. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒకసారి అతిథిగా వచ్చిన నెదర్లాండ్స్ రాణి కూడా లింకన్ ఆత్మను చూసి హడలిపోయింది. కళ్లు తిరిగి పడిపోయింది. రూజ్వెల్ట్ భార్యకి వ్యక్తిగత పరిచారిక అయిన మేరీ ఈబన్ అయితే లింకన్ ఆత్మను చూసి జడుసుకుని మంచం పట్టింది. విన్స్టన్ చర్చిల్కి కూడా లింకన్ దర్శనమివ్వడంతో ఆయన ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇలా ఇంతమంది తమ అనుభవాలు చెప్పడంతో... లింకన్ దెయ్యమయ్యారన్న విషయం రూఢి అయిపోయింది. అది మాత్రమే కాదు. లింకన్ మృతదేహాన్ని ఊరేగించిన రైలు కూడా దెయ్యమైందని చాలామంది అంటుంటారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం లింకన్ శవయాత్ర జరిగిన రోజున ఆ రైలు కనిపిస్తూ ఉంటుందని, అది ఆ రోజులాగే అలంకరించి ఉంటుందని, యాత్ర మధ్యలో ఆగిన ఒక స్టేషన్లో కొద్ది క్షణాలు కనిపించి మాయమైపోతూ ఉంటుందని దాన్ని చూసిన ఎంతోమంది చెప్పారు. దాంతో లింకన్ ఘోస్ట్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. నిజానికి లింకన్ మాత్రమే కాదు... టైఫాయిడ్తో చనిపోయిన లింకన్ పదకొండేళ్ల కొడుకు విల్లీ కూడా దెయ్యమయ్యాడని అంటుంటారు. అతని ఆత్మ కూడా వైట్ హౌస్లో చాలామందికి కనిపించిందట! ఇక తర్వాతి స్థానం అబిగలీ ఆడమ్స్ది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ భార్య అబిగలీ. ఆమెకు తూర్పువైపున ఉన్న గది అంటే చాలా ఇష్టం. ఆ గదిలో ఇప్పటికీ ఆమె ఆత్మ ఎంతోమందికి కనిపిస్తూనే ఉంటుందట. అప్పటిలాగే తలపై క్యాప్ పెట్టుకుని, లేస్ శాలువా కప్పుకుని ఉంటారట అబిగలీ. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉండటం చాలామంది అధ్యక్షులు సైతం చూశారు. అమెరికాను పాలించిన జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ కూడా దెయ్యమై వైట్ హౌస్లో సంచరిస్తున్నారని ఎంతోమంది చెప్పారు. డాలీకి గులాబీలంటే చాలా ఇష్టం. దాంతో వైట్ హౌస్లో ఓ అందమైన గులాబీ తోటను నాటారామె. ఎక్కువగా దానిలోనే గడిపేవారు. చనిపోయాక కూడా అదే తోటలో తెల్లని గౌను వేసుకుని తిరగసాగారు. ఆమె చనిపోయిన వంద సంవత్సరాల తర్వాత నాటి అధ్యక్షుడి భార్య ఎలెన్ విల్సన్ పాడయిన గులాబీ తోటను తవ్వించేయా లని అనుకున్నారు. తీరా పనివాళ్లు తవ్వడం ప్రారంభించేసరికి డాలీ ఆత్మ అడ్డుపడింది. తోట జోలికి రావొద్దని, దాన్ని తవ్వితే ఊరుకోనని భయ పెట్టడంతో పనివాళ్లు వణికిపోయి పారిపోయారట! అలాగే అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, లింకన్ భార్య మేరీ టాడ్, మరో అధ్యక్షుడికి అత్తగారైన మేరీ తదితరుల ఆత్మలు కూడా తరచుగా వైట్ హౌస్లో కనిపిస్తుంటాయని వినికిడి. ఇవన్నీ నిజమేనా అంటే నిజమే అనేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా వైట్ హౌస్లో దెయ్యాలను చూశారు. భయానక అనుభవాలతో బెదిరిపోయారు. అందుకే బల్ల గుద్ది చెప్తున్నారు అది నిజమేనని. కానీ ఆధునిక భావాలు కలవారు మాత్రం ఆ మాటల్ని కొట్టి పారేస్తున్నారు. ఎన్నో యేళ్ల ఘన చరిత్ర ఉన్న వైట్ హౌస్ ప్రతిష్టని దెయ్యాల పేరుతో దిగజార్చడం సబబు కాదు అని ఆగ్రహిస్తున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం? వైట్ హౌస్లో దెయ్యాలు ఉన్నాయా? లేవా?? అది శ్వేత సౌధమా? ప్రేతసౌధమా?? - మీరా -
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఆధ్యాయం
వాషింగ్టన్ డీసీ : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో ఓ చీకటి ఆధ్యాయమని రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అభివర్ణించారు. శనివారం యూఎస్ వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలతో శివాజీ సమావేశమయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు... ఆ సమయంలో తాను గడిపిన జైలు జీవితాన్ని శివాజీ ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు ఎన్నారైలకు వివరించారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో న్యాయస్థానాల పరిస్థితి... క్రిమినల్ లా లోని లోపాలు ... పరిపాలన ఎలా పట్టాలు తప్పేందుకు దోహదం చేసిందో ఓ క్రమానుగతంగా యలమంచిలి శివాజీ వివరించారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో పరిస్థితులు మారతాయని భావించానని ఆయన తెలిపారు. అయితే నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు పెద్ద తేడా లేదన్నారు. కొందరు వ్యక్తులు అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నికలో గెలిచి.. అధికారం చేపట్టి పెత్తనం చెలాయిస్తున్నారని యలమంచిలి శివాజీ ఆరోపించారు. అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు శివాజీ జవాబులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హేతువాది ప్రొ. ఇన్నయ్య నరిశెట్టి, మాణిక్య లక్ష్మీ, డాక్టర్ యడ్ల హేమప్రసాద్, జక్కంపూడి సుబ్బారాయుడు, మధు బెల్లం, శ్రీనివాసరావు, జ్యోతి శాఖమూరి, డాక్టర్ నవీనా హేమంత్, రావు లింగాతోపాటు పలువురు ఎన్నారులు పాల్గొన్నారు. 1975 జూన్ 25న అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దేశంలో ఎమర్జెన్సి విధించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యలమంచిలి శివాజీ స్పందించారు. -
నా కుక్క పోయిందీ..
చదివింత... ‘‘కనులు తెరిచినా నీవె... కనులు మూసినా నీవె’’అంటూ ఆవేదన చెందుతున్నాడు రోగర్ హారోవిట్జ్. వాషింగ్టన్ డీసీలో నివసించే తన ప్రియనేస్తం ఒల్లీ అనే కుక్కగారు ఓ దుర్ముహుర్తాన వీధుల్లో పరిగెడుతూ ఆదృశ్యమైపోయింది. మిస్సయిన పెట్ కోసం రోగర్ చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా వాలంటీర్ల సాయంతో మిస్సింగ్ అంటూ తన ఒల్లీ ఫొటో ముద్రించి, రహదారికి ఇరువైపులా పోస్టర్స్ కూడా అతికించాడు. దీనికి స్పందనగా ఒల్లీ దొరకలేదుగాని ఓ పోలీసు అధికారి రోగర్ ఇంటికొచ్చాడు. ‘‘కుక్క పోయి నీవు... నిబంధనలు మరచినావు’’ అంటూ మందలించి 510 యూరోలు (సుమారు 34 వేల రూపాయలు) జరిమానా కట్టించాడు. ఒక్కరోజులో నిబంధనలకు వ్యతిరేకంగా అతికించిన పోస్టర్స్ తొలగించకపోతే రెట్టింపు కట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. జరిమానా పడిందన్న బాధకన్నా... తన ఒల్లీని కనిపెట్టడమెలా అనే బాధే ఎక్కువంటున్న రోగర్.. పట్టు వదలని విక్రమార్కుడిలా‘‘ఫైండ్ ఒల్లీ’’ అంటూ నెటిజన్లను అర్థిస్తూ కొత్త ప్రచారం మొదలెట్టాడు. ...::: సత్యవర్షి -
సైన్స్ ఫిక్షన్కు వెండితెర అమ్మ
అందుకే... అంత బాగుంది! 2001: ఎ స్పేస్ ఒడిస్సీ (1968) తారాగణం: కిర్ డులియా, గ్యారీ లాక్వుడ్ ; నిర్మాత-దర్శకుడు: స్టాన్లీ కుబ్రిక్, ఛాయాగ్రహణం: జెఫ్రీ అన్స్వోత్, విడుదల: 2 ఏప్రిల్ 1968 (వాషింగ్టన్ డీసీ), 3 ఏప్రిల్ 1968 (యూఎస్) 15 మే 1968 (యూకె) ; సినిమా నిడివి: 142 నిమిషాలు ; నిర్మాణ వ్యయం: సుమారు 75 కోట్లు ; వసూళ్లు: 850 కోట్ల రూపాయలకు పైగా... మీరు నన్ను నిద్రలో లేపి ‘మీ ఆల్టైమ్ ఫేవరెట్ హాలీవుడ్ మూవీ’ ఏదని అడిగితే రెండో ఆలోచన లేకుండా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ అని చెబుతాను. ఇన్నేళ్లలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసినా, నా మస్తిష్కంలో ఆ సినిమా వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఆ చిత్రం గురించి ఆపకుండా అరగంట మాట్లాడగలను. ప్రతి ఫ్రేమూ, ప్రతి టెక్నిక్కూ, ఆర్టిస్టులు, టెక్నీషియన్లూ... ఇలా ప్రతి విషయం గుర్తుంది. ఈ సినిమా అంటే నాకెంత ఇష్టమంటే... నా ఇ-మెయిల్ ఐడీ కూడా ఈ పేరుతోనే ఉంటుంది. సైన్స్ఫిక్షన్ చిత్రమైన ఈ సినిమా ప్రధానంగా మానవులకూ, మానవ పరిణామక్రమాన్ని ప్రభావితం చేస్తున్న నల్లటి మోనోలిత్లకూ మధ్య నడుస్తుంది. చంద్రుడి మీద కనుగొన్న అలాంటి ఒక మోనోలిత్ నుంచి వస్తున్న ఒక సిగ్నల్ను అన్వేషిస్తూ గురు గ్రహానికి సాగే అంతరిక్ష యాత్ర ప్రధానాంశం. సినిమా ప్రధానంగా నాలుగు భిన్నమైన ఘట్టాలుగా నడుస్తుంది. డైలాగ్స్ అతి తక్కువగా ఉండే ఈ చిత్రంలో ఇతివృత్తపరంగా - మానవ పరిణామ క్రమం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రహాంతర జీవితం లాంటివి కనిపిస్తాయి. విజయవాడలో నేను డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నప్పుడు ఈ సినిమా రిలీజైంది. లయోలా కాలేజీలో కామర్స్ లెక్చరర్గా పనిచేసే ఎం.సి.ఆర్. దాస్గారు నన్ను ఈ సినిమాకు తీసుకెళ్లారు. బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయం జరిగినట్టుగా, మా ఇద్దరికీ ఈ సినిమా హాల్లో జ్ఞానోదయమైంది. ఒక వారం రోజుల పాటు మేమిద్దరం ఆ సినిమా గురించి రాత్రింబవళ్లూ చర్చించుకున్నాం. కనబడిన ప్రతివాళ్లకూ ‘ఈ సినిమా తప్పక చూడండి’ అంటూ చాటింపు వేశాం. వాళ్లు చూసొచ్చి ‘‘ఇదో సినిమానా? మీ వల్ల డబ్బులు వృథా’’ అని తిట్టినంత పనిచేశారు. కానీ కొంతమంది మాత్రం ‘‘ఈ సినిమా చూడకపోయుంటే... మేం చాలా మిస్సయిపోయుండేవాళ్లం’’ అని అభినందించారు. అలాంటి పరిస్థితే ఆ సినిమా దర్శకుడు ‘స్టాన్లీ కుబ్రిక్’కి కూడా ఎదురైందట. అమెరికా, బ్రిటన్ల నుంచి సినిమా చూసిన కొంతమంది టిక్కెట్ ముక్కలు పంపించి, ‘‘నువ్వేం తీశావో మాకేం అర్థం కాలేదు. కనీసం నీకైనా అర్థమయ్యిందో లేదో! మా డబ్బులు మాకు ఇచ్చేయ్’’ అన్నారట. మరో పక్క చాలామంది శాస్త్రవేత్తలు ఈ సినిమా చూసి స్టాన్లీ కుబ్రిక్ను తెగ పొగిడేశారట. వైజాగ్లో బాపు గారి మేనల్లుడు రంగాతో కలిసి ‘జగదాంబ 70 ఎంఎం’ థియేటర్లో మరోసారి ఈ సినిమా చూశా. ఎప్పుడు చూసినా నాకదే ఫీలింగ్... అద్భుతమైన సినిమా. మేమిద్దరం కూడా ఆ సినిమా గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నామో! అప్పటికీ ఇప్పటికీ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇదే మాతృక అని చెప్పాలి. దీనికన్నా ముందు ‘ఫస్ట్ మెన్ ఇన్ ద మూన్’ (1964) వచ్చింది. హెచ్.జి. వెల్స్ రాసిన నవల ఆధారంగా తీశారు దాన్ని. అయితే టెక్నికల్గా దీనంత గొప్పగా ఉండదు. ఆర్థర్ సి. క్లార్క్ రాసిన ‘ది సెంటినెల్’ అనే చిన్న కథ ఆధారంగా ఈ ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ తీశారు. స్క్రీన్ప్లే రచనలో కుబ్రిక్కి క్లార్క్ సహకరించారు. సినిమా విడుదలయ్యాక క్లార్క్ ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ పేరున నవల విడుదల చేశారు. ఒడిస్సీ అంటే అనేక సాహసాలతో కూడుకున్న అనంతమైన ప్రయాణమని అర్థం. మన భూగ్రహం నుంచి వేరే గ్రహానికి ప్రయాణం చేయడమే ఈ సినిమా. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే - జిజ్ఞాస. ఎక్కడ ఏం ఉందో తెలుసుకోవాలన్న మానవుని తపనే మనిషిని ఒక గోళం నుంచి ఇంకో గోళంలోకి తీసుకు వెళ్తోంది. అసలు ఈ సినిమా ఆలోచనే ఒక అద్భుతం. దాన్ని సాంకేతిక హంగులతో తెరకెక్కించడం మరో అద్భుతం. ఆ రోజుల్లో... అంటే 1968 ప్రాంతంలో టెక్నాలజీ ఇప్పు డున్నంతగా లేదు. అయినా దర్శకుడు తన మనసులో అనుకున్నది తన మెదడు సాయంతో తెరకెక్కించగలిగాడు.అసలు టెక్నాలజీని పక్కన పెడితే, ఇందులో చాలా ఫిలాసఫీ ఉంది. మొదటి 42 షాట్స్ స్టాటిస్టిక్స్లా ఉంటాయి. మనిషి కోతిగా ఉన్నప్పుడని ఓపెనింగ్ ఎపిసోడ్లోనే దర్శకుడు ‘థ్రస్ట్ ఫర్ నాలెడ్జ్’ అని చెబుతాడు. ఒక నల్లటి నాపరాయి ఉంటుంది. దాన్ని సినిమాలో మోనోలిత్ అంటారు. అది కనిపిస్తూ ఉంటుంది. కోతి వెళ్లేటప్పుడు ఫేస్లో అన్నీ దాన్ని చూస్తూ ఉంటాయి. ఈ సినిమాలో మరో గొప్ప అంశం ‘ఎడిటింగ్’. ‘మ్యాచ్కట్’ పద్ధతిని బాగా అనుసరించారు. ఫిల్మ్ స్కూల్స్లో ఎడిటింగ్ గురించి చెప్పేటప్పుడు, మ్యాచ్కట్ గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాను తప్పకుండా ఉదహరిస్తుంటారు. ‘మ్యాచ్ కట్’ అంటే ఒక షాట్ నుంచి సింబలైజ్ చేస్తూ మరో షాట్కు కట్ చేయడం.ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న ఒక ఏప్ అక్కడున్న ఒక థై బోన్లాంటిది తీసుకుని ఇంకొక ఏప్ను కొట్టిన ప్పుడు, అది చచ్చిపోతే దాని చేతికి ఒక ఆయుధం దొరికిందనే ఆలోచన వస్తుంది. అది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆ బోన్ను అలా ఆకాశంలో స్లో మోషన్లో వేస్తే ఆ బోన్ అలా పైకి వెళుతూ ఉంటుంది! దాన్ని కన్వర్ట్ చేసి అదే షేప్లో ఉన్న ఒక స్పేస్షిప్ ఎక్కడికో ట్రావెల్ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ‘బెస్ట్ మ్యాచ్ కట్’ ఎగ్జాంపుల్. అలాగే, స్పేస్షిప్లో సర్క్యులర్ మాడ్యుల్ ఉంటుంది. అందులో మనుషులు తలక్రిందులుగా నడుస్తూ ఉంటారు. ఇలా ఎన్నో అద్భుతమైన ట్రిక్స్ ఉన్నాయి ఈ సినిమాలో!నాకు మరీ ఇష్టమైన ఎపిసోడ్.. సినిమా ఎండింగ్లో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని ఈ మిషన్లో ఎక్కడికో పంపిస్తారు. అక్కడ ఆరు నెలలో, ఒక సంవత్సరమో ఉండాలి. వీళ్లు ఎంతసేపూ భార్య, బంధువులతోనేనా ఉండేది అని విసిగిపోతారు. ఒక విసుగుతో స్పేస్లోకి వెళ్లిపోవాలను కుంటారు. సిస్టమ్ను నాశనం చేయాలని చూస్తారు. క్లోజ్డ్ క్యాప్యూల్లో సౌండ్ కూడా లీక్ కాకుండా క్లోజ్ చేస్తారు. కంప్యూటర్ కూడా చాలా అడ్వాన్స్డ్. హాల్ కంప్యూటర్. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి అప్పుడే చెప్తాడు. నోవెల్ చెప్పింది అట్లానే చూపించాడు. అద్దాలు క్లోజ్ చేసేసి సౌండ్ కూడా జీరో లెవల్ చేసి ఇద్దరూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు. క్యాప్యూల్ సైడ్లో ఐసియు విండో (రౌండ్ మిర్రర్)లోంచి సెలైంట్గా ఉండే వాళ్ల లిప్ మూమెంట్స్ను టైట్గా క్యాచ్ చేసి దాన్ని డీకోడ్ చేసి వీళ్లిద్దరూ సిస్టమ్నే డిస్ట్రబ్ చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని గ్రహిస్తుంది. వాళ్లు బయటకు వచ్చే టైమ్కి దాన్ని కట్ చేసేస్తుంది. కట్ చేయగానే ఓ వ్యోమగామి పడిపోతాడు. విశ్వంలో కొట్టుకుపోతున్న మనిషి మస్తిష్కం ఎలా ఉంటుంది? దీన్నే జూపిటర్ గేట్ సీక్వెన్స్ అంటారు. అక్కడ ఒక డెరైక్టర్గా, ఒక ఇమాజినేటివ్ పర్సన్గా కుబ్రిక్ ఏదో విజువల్ ఎక్స్పెక్ట్ చేశాడు. దానికోసం ఎంతో పరిశోధన చేశాడు.. ఎందరినో కలిశాడు. ఎన్నో చూశాడు. కానీ ఏదీ నచ్చలేదు. తన ఆలోచనలకు దగ్గరగా ఏదీ తగల్లేదు. చివరకు డగ్లస్ టంబ్లర్ను సంప్రదించాడు. ఆయన గ్రేట్ ఆప్టికల్ సైంటిస్ట్. డగ్లస్ కొంత టైమ్ అడిగాడు. కొంత టైమ్ అంటే సుమారు ఏడాది అన్నమాట. అంత టైమ్ తీసుకున్నా, దర్శకుడు కుబ్రిక్ మనసులో ఏది అనుకున్నాడో అది చేసి చూపించాడు. జూపిటర్ గేట్లో మనిషి కొట్టుకుపోతూ ఉంటే, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో అద్భుతంగా చేసి చూపించాడు. డగ్లస్ టంబ్లర్ పనితనం చూసి డంగైపోయాడు స్టీవెన్ స్పీల్బర్గ్. 1977లో తాను తీసిన ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది మేన్ వైండ్’కి ఆయన డగ్లస్తో వర్క్ చేయించుకున్నాడు. సినిమా చివర్లో తల్లి గర్భంలోని యాంబ్రియోలో ఉన్న చిన్న పిండం అలా పైకి చూస్తూ ఉంటుంది. ఎదురుగా బ్లాక్, బ్లాక్గా వెళుతుంది మోనోలిత్. వెళుతున్నప్పుడు మ్యూజిక్ ఎంత బావుంటుందో! వ్యక్తిగతంగా నాకు దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ అంటే ఆరాధన. ఒక రకంగా ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. నేను చెన్నైలో సినిమాటోగ్రాఫర్ వీఎస్సార్ స్వామి గారి దగ్గర కెమేరా అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడు, కుబ్రిక్ తీసిన ‘బారీ లిండన్’ చూశా. దానికి జాన్ ఆల్కాట్ సినిమాటోగ్రాఫర్. ఇందులో ఫొటోగ్రఫీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మామూలుగా క్యాండిల్ లైట్ షాట్స్ ఎలా తీస్తారంటే - కొవ్వొత్తి లోపల డొల్లగా ఉంచి లోపల ఎలక్ట్రిక్ లైట్స్ పెడతారు. కానీ ఈ సినిమా మాత్రం ఒరిజినల్ క్యాండిల్ వెలుగులోనే షాట్స్ తీశారు. ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ చిత్రం నాటికి హైస్పీడ్ లెన్స్లు, కెమేరాలు లేవు. అయినా గొప్ప షాట్స్ తీశారు. అంతరిక్షంలో వాడటానికి డెవలప్ చేసిన లైట్ని తీసుకొచ్చి, మూవీ కెమేరాకు అరేంజ్ చేసి కొన్ని షాట్స్ తీశారు. అందుకే చాలామంది టెక్నీషియన్లకు కుబ్రిక్ అంటే అభిమానం. స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి గ్రేట్ ఫిలిం మేకర్గా ఎదిగినవాడాయన. ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’కి ముందు ఆయన 10 సినిమాలు తీశాడు. ఈ సినిమా చూశాక ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. ఆయన సినిమాలన్నీ కాలాని కన్నా ముందుండే ఆలోచనలతో ఉంటాయి. ‘స్పార్టకస్’ (1960) ఆయన తీసిందే. మైకేల్ డగ్లస్ తండ్రి పిర్క్ డగ్లస్ అందులో హీరో. దీన్నే తర్వాత ‘గ్లాడియేటర్’గా తీశారు. మామూలుగా ఎవరైనా ‘ఐస్ వైడ్ క్లోజ్’ అంటారు. ఆయనేమో ‘ఐస్ వైడ్ షట్’ అంటూ 1999లో సినిమా తీశాడు. అదే ఆయన చివరి మూవీ.నేనిప్పుడు వైజాగ్లో ఫిల్మ్ అకాడమీ రన్ చేస్తున్నా. అక్కడి స్టూడెంట్స్కి కచ్చితంగా ఈ ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ సినిమా చూడమనే చెబుతున్నా. మా తరం వాళ్లు, ఈ తరం వాళ్లే కాదు... నెక్ట్స్ జనరేషన్ వాళ్లూ ఈ సినిమా చూడాలి.ఈ సినిమాలో హైలైట్స్ ఏంటని అడిగితే చెప్పడం కష్టం. ఎందుకంటే - ఈ సినిమా అణువణువూ అద్భుతమే. స్టోరీ, మేకింగ్, టెక్నాలజీ, ముఖ్యంగా ‘ఫిలాసఫీ’. ఇలా అన్నీ అద్భుతమే. అయితే.. ఇది మామూలు వాళ్లకు అందకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు. బుర్రకు పదును పెట్టాలనుకునేవారందరికీ నచ్చి తీరుతుంది. కానీ కొంచెం ఓపిగ్గా చూడాలి. ఈమధ్య వచ్చిన ‘అవతార్’, ‘ఇంటర్స్టెల్లార్’... వీటన్నిటికీ తాత ఇది. వండర్ఫుల్ మూవీ... గ్రేట్ మూవీ... ఎక్స్ట్రార్డినరీ మూవీ... ఆలోచింపజేసే మూవీ... ఇలా ఈ సినిమాకు ఎన్ని విశేషణాలు తగిలించినా తక్కువే. సినిమా చూస్తే... మీరు కూడా నాతో ఏకీభవిస్తారు! విడుదలైనప్పుడు ఈ చిత్రానికి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కాలక్రమంలో ఆణిముత్యంగా పేరు తెచ్చుకొని, బాక్సాఫీస్ హిట్టయింది. 1968లో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. నాలుగు ఆస్కార్ అవార్డులకు నామినేటైన ఈ సినిమా ‘విజువల్ ఎఫెక్ట్స్’ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. సినీ చరిత్రలోనే అత్యంత ప్రభావశీలమైన, అతి గొప్ప చిత్రాల్లో ఇది ఒకటని ఇవాళ ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తోంది. సినీ దర్శకుడు కాకముందు స్టాన్లీ కుబ్రిక్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్. ‘లుక్’ అనే పత్రికకు ఫొటోలిచ్చేవారు. ఆ తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో కొన్ని డాక్యుమెంటరీ మూవీస్ తీశారు. అలాగే, ఓ టీవీ షోకి సెకండ్ యూనిట్ డెరైక్టర్గా కూడా చేశారు. 1953లో ‘ఫియర్ అండ్ డిజైర్ ’ చిత్రంతో వెండితెర దర్శకునిగా మారారు. స్టాన్లీ సినిమాలన్నీ కాలాని కన్నా ముందుండే ఆలోచనలతో ఉంటాయి. పలు వివాదాస్పద అంశాలతో కూడా ఆయన సినిమాలు తీసి, భేష్ అనిపించుకున్నారు. స్టాన్లీ తీసిన చివరి చిత్రం ‘ఐస్ వైడ్ షట్’ 1999 జూలైలో విడుదలైంది. ఆ చిత్రం విడుదల కాకముందే మార్చిలో ఆయన కన్నుమూశారు. సంభాషణ: పులగం చిన్నారాయణ -
బంగారు తెలంగాణ కోసం కలసివస్తున్న ఎన్ఆర్ఐలు
-
వాషింగ్టన్లో గాంధీ విగ్రహానికి మోడీ నివాళి
-
ఎం‘చొక్కా’ ఆడుకోవచ్చు!
వాషింగ్టన్: క్రీడాప్రియులకు శుభవార్త.. ఇన్నాళ్లూ ఇష్టమైన ఆటగాడి పేరున్న షర్టు ధరించి మీరు మ్యాచ్లు చూసుంటారు. ఇకపై మీకు నచ్చే క్రీడాకారుడు గ్రౌండ్లో ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో అచ్చం అలాగే మీరూ ఫీలయ్యేలా చేసే షర్టు వేసుకొని మ్యాచ్లు చూడొచ్చు. ఆస్ట్రేలియా టెలీకమ్యూనికేషన్ కంపెనీ ఇలాంటి సరికొత్త టెక్నాలజీ షర్టును రూపొందించింది. ఈ షర్టు వేసుకుంటే ఫుట్బాల్ మ్యాచ్లో క్రీడాకారుడు భౌతికంగా ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో (గోల్ కొట్టినప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు) మీరు అదే విధమైన అనుభూతిని స్టేడియంలో కూర్చొని పొందొచ్చు. లీతియం పాలిమెర్ సెల్ బ్యాటరీని షర్టులో వినియోగిస్తారు. సెన్సార్లు, బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగించుకునే మొబైల్ ఫోన్ యాప్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. -
ఎన్ఎస్ఏ నిఘా చట్ట విరుద్ధం
వాషింగ్టన్: నిఘా చర్యల్లో భాగంగా అమెరికన్ పౌరుల ఫోన్ వివరాలను పెద్ద ఎత్తున రహస్యంగా సేకరిస్తున్న ఒబామా సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కార్యక్రమాన్ని అక్కడి న్యాయస్థానం తప్పుబట్టింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ).. పౌరుల ఫోన్ కాల్స్ వివరాలు, సమాచారం సేకరించడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా, అమెరికన్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చర్యగా యూఎస్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ లియాన్ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఏ కాంట్రాక్టరుగా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆ సంస్థ నిర్వహిస్తున్న నిఘా కార్యకలాపాల గుట్టును ఈ ఏడాది జూన్లో బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఏ నిఘాను సవాలు చేస్తూ లర్రీక్లేమాన్ దాఖలు చేసిన పిటిషన్ను ఫెడరల్ కోర్టు జడ్జి లియాన్ విచారించారు. అమెరికన్ రాజ్యాంగంలోని నాలుగో సవరణను పేర్కొంటూ.. జడ్జి రిచర్డ్ లియాన్ ఎన్ఎస్ఏ నిఘా కార్యక్రమంపై ప్రాథమికంగా నిషేధం విధిస్తూ తొలుత ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ న్యాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను నిలిపివేశారు. ఉగ్రవాద దాడుల నిరోధానికి వీలుగా పౌరుల ఫోన్ కాల్స్ వివరాలను సేకరించాల్సి వస్తోందని ఒబామా సర్కారు వాదనను జడ్జి లియాన్ ప్రశ్నించారు. ఇలా నిఘా ద్వారా ఒక్క ఉగ్రవాద దాడి ని అడ్డుకున్న దాఖలాను ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. తాజా తీర్పుపై రష్యాలో ఆశ్రయం పొందుతున్న ఎడ్వర్డ్ స్నోడెన్ హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర సమస్యలను పరిష్కరించగల ఏకైక నాయకుడు జగన్ అంటున్న ఎన్ఆర్ఐలు
-
వాషింగ్టన్ నేవీయార్డులో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని వాషింగ్టన్ నేవీయార్డులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనలో నలుగురు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని నేవీ ఇన్స్టలేషన్స్ కమాండ్ విభాగంలో పబ్లిక్ ఎఫైర్స్ డైరెక్టర్ కెప్టెన్ ఎడ్ బక్లాటిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గాయపడ్డవారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వాషింగ్టన్ డీసీకి ఆగ్నేయంగా ఉన్న నేవల్ సీ సిస్టమ్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు ప్రారంభమైన కొద్దిసేపటికే సెక్యూరిటీ ఏజెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కమాండ్ వద్ద దాదాపు 3వేల మంది పనిచేస్తుంటారు. అమెరికా నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాముల నిర్వహణ వ్యవహారాలన్నింటినీ ఇక్కడే చూస్తుంటారు. సంఘటన వివరాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. -
వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు
అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘం (క్యాట్స్) నేతృత్వంలో సంఘసేవా కార్యక్రమంలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐదువేల మంది పేదవారికి భోజనాలు వండిపెట్టారు. క్యాట్స్ సంస్థ వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ , సంఘసేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. గత తొమ్మిదేళ్లుగా తెలుగు పాఠశాల నిర్వహణ, తెలుగు పండుగల వేడుకలు, వేసవిలో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంకా, తాము నివసిస్తున్న వాషింగ్టన్ పరిసర ప్రాంతాలలో, పేదవారికి సేవ చేయాలని ఉద్దేశంతో , ప్రతి ఏటా "వాషింగ్టన్ డిసి కిచెన్లో" నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ" కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని పేదవారి కోసం స్వయంగా వండి వడ్డిస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఐదువేల మంది పేదలకు భోజనాలు వండి వడ్డించి పెట్టారు.