Elections 2017
-
ఆ మంత్రికి హైకోర్టు షాక్..
అహ్మదాబాద్ : గుజరాత్లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్రసింగ్ చుడాసమా ఎన్నిక చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఎన్నిక చట్టవిరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు పేర్కొంది. 429 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్రమంగా రద్దు చేశారని ఆయన ప్రత్యర్ధి అశ్విన్ రాథోడ్ వాదనను సమర్ధిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ పరేష్ ఉపాథ్యాయ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్ జిల్లాలోని డోక్లా నియోజకవర్గం నుంచి భూపేందర్ సింగ్ చుడాసమ 327 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి : శ్రామిక్ రైలులో ఆగిన గుండె -
‘సిద్దరామయ్యా నీకు దమ్ముందా..’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తీవ్ర విమర్శలు చేశారు. 'కర్ణాటకలో సిద్దరామయ్య అంటే అవినీతి అలాగే అవినీతి అంటే సిద్దరామయ్య అని అర్థం' అని వ్యాఖ్యానించారు. మైసూరులో గురువారం జరిగిన పార్టీ పరివర్తన యాత్ర కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించాలని కోరారు. 'నేను కర్ణాటక ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఆపాలి' అని అమిత్షా సిద్దరామయ్యకు సవాల్ విసిరారు. పరివర్తన ర్యాలీ అంటే యువత జీవితాల్లో మార్పు అని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడం అని చెప్పారు. పలు వ్యూహాలతో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజలు మాత్రం మారాలని కోరారు. 'బీజేపీ నిర్వహిస్తున్న పరివర్తన యాత్ర చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న ర్యాలీని అడ్డుకోవాలని చూస్తోంది.. బంద్కు పిలుపునిచ్చింది. రాజకీయ లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా వ్యతిరేకించింది. కానీ ఆ బిల్లు ముస్లింలకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చాం. ముస్లిం సోదర, సోదరీమణులకు న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము' అని అమిత్ షా అన్నారు. -
హిమాచల్ సీఎం అభ్యర్థిపై బీజేపీకి తలనొప్పి!
సాక్షి, షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం విషయమై అక్కడికి వెళ్లిన పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నేతలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ కమిటీ సమావేశ భవనం బయటే బీజేపీ సభ్యులు ప్రేమ్ కుమార్ దుమాల్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. 'ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని చేయాలే తప్ప ఎలాంటి లాబీయింగ్ జరగొద్దు' అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ దుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్తగా ఎవరిని పెట్టాలనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క, కేంద్రమంద్రి జేపీ నడ్డా పేరును సీఎంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. -
గుజరాత్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
పణజి: ‘నితిన్ గడ్కరీ(బీజేపీ) ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. మన సీనియర్ నాయకులు ఏం చేస్తున్నార’ని ప్రశిస్తూ గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినాయత్వం చేతగానితనాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, మరింత మంది పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘గోవాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చాలా అవమానకర రీతిలో కాంగ్రెస్ హేండిల్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నార’ని విశ్వజిత్ రాణె వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎవరు పార్టీని వీడరని, రాణెతో మాట్లాడతామని చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చక్రం తిప్పడంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ కంటే బీజేపీ తక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ గడ్కరీ రంగంలోకి పరిస్థితిని తమ పార్టీకి అనుకూలంగా మార్చేశారు. పరీకర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే మద్దతు ఇస్తామన్న ఇతరుల కోరికను మన్నించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది. దీనికి అనుగుణంగా పరీకర్ తో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ గోవాకు తీసుకురావడంతో బీజేపీపై ఇతరులకు విశ్వాసం కలిగింది. అతిపెద్ద పార్టీగా ఏర్పడిన హస్తం పార్టీ మీనమేషాలు లెక్కించడంతో కమలం పార్టీ పదుదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోయింది. ఫలితంగా కాంగ్రెస్ లో అసంతృప్తి రాజుకుంది. -
‘సీఎం పదవికి ముందు రాజీనామా చేయండి’
ఇంపాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్ను రాజీనామా చేయాల్సింది ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లా కోరారు. రాజీనామా చేస్తే తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన డిమాండ్ను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్కు 28, బీజేపీకి 21 స్థానాలు, మిగితా సీట్లు ఇతర పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ ప్రకారం కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. ఇతర పార్టీలవారు బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. అయితే, గత రాత్రి ఇబోబీతోపాటు డిప్యూటీ సీఎం గైఖాంగమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్ హావోకిప్ గవర్నర్ను కలిశారు. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని ఇబోబీకి గవర్నర్ హెజ్మా సూచించారు. అయితే, తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, 28 సీట్లు గెలుచుకున్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇబోబీ కోరారు. దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఖాళీ పేపర్లో రాసుకొని వచ్చి చూపించారు. అయితే, కాగితంపై రాసివ్వడం కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని, గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపించాలని కోరారు. బీజేపీ 21మంది గెలిచిన అభ్యర్థులతోపాటు ఎన్పీపీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుచ ఎల్జేపీ, టీఎంసీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబోబిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. -
ఉక్కుమహిళ ఎందుకు ఓడారంటే?
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల రాజకీయ ప్రవేశం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు మణిపూర్ ప్రజలు పట్టం కడతారా? దీక్షకు వచ్చిన భారీ స్పందన మాదిరే ఆమె పార్టీ ‘పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’కి నీరాజనం పడతారా? అన్న ఆసక్తి రేగింది. దీక్ష విరమించినందుకు కొందరు షర్మిలను విమర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రజల నుంచి విస్తృతంగానే మద్దతు లభించింది. అయితే ఈ మద్దతు ఓట్ల రూపంలోకి మారలేకపోయింది. రాజకీయ దిగ్గజం, సీఎం ఇబోబీ సింగ్పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి మారింది..: సాయుధ బలగాల చట్టవిరుద్ధ హత్యలు, అత్యాచారాలు జాతీయ మీడియాకు ముఖ్యమైన అంశాలే అయినా.. రాష్ట్ర ప్రజలకు మాత్రం బంద్లు, రోడ్ల దిగ్బంధనాలు, అభివృద్ధి లేమి పెద్ద సమస్యలుగా మారిపోయాయి. అఫ్సా రద్దు ఉద్యమానికంటే దైనందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం పెరిగింది. అఫ్సా రద్దు కోసం 16 ఏళ్ల కిందట షర్మిల ఉద్యమించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మొబైల్ ఫోన్లు, ఇతర భద్రతా సదుపాయాల రాకతో బలగాలు గతంలో మాదిరి నిరంకుశంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అలాగే, ఎన్నికలు జాతి ప్రయోజనాల ప్రాతిపదికగా జరగడం, శక్తిమంతుడైన ఇబోబీ సింగ్తో తలపడడం కూడా షర్మిల ఓటమికి కారణమైంది. మెజారిటీ వర్గమైన మీటీలు.. తమ వ్యతిరేకులైన నాగాలను ఎదుర్కొనే నాయకుడు ఇబోబీనే అని తలపోశారు. థౌబాల్ నియోజకవర్గంతో(ఇబోబీపై)పాటు, తన స్వస్థలమైన ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల తర్వాత ఖురాయ్ నుంచి పోటీ విరమించారు. ఆమె ఓటమికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి కారణమైందని విశ్లేషకుల అంచనా. మొత్తం 268 మంది అభ్యర్థుల్లో ఆమె సహా పదిమంది మాత్రమే మహిళలు ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా పురుషుల వ్యవహారమనే భావన మణిపూర్లో ఉంది. షర్మిల రాజకీయాల్లోకి రాకుండా మానవ హక్కుల ఉద్యమాలకే పరిమితం కావాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
తర్వాతి గురి దక్షిణాదిపైనే ..!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్లో అఖండ విజయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేయనుందా? ముఖ్యంగా కేరళ, తమిళనాడులో దూకుడు పెంచనుందా? అన్న ప్రశ్నలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే బీజేపీ మరి కొంత సమయం వేచిచూడక తప్పదనేది కొందరి వాదన కాగా...కర్నాటకలో విజయం సాధించాకే కేరళ, తమిళనాడుపై దృష్టి పెట్టవచ్చనేది మరికొందరి విశ్లేషణ. కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్నాక.. కేరళలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో కమలం ముందుకు సాగుతుందని, తమిళనాడులో అన్నాడీఎంకే చీలిక వర్గంతో కలిసి నడుస్తుందనేది వారి అభిప్రాయం. కేరళలో చాలా వేగంగా పావులు కదపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరి లెక్క ప్రకారం తమిళనాడు, కేరళలో పార్టీ విస్తరణకు బీజేపీ మరో మూడు నాలుగేళ్లు వేచిచూడాల్సిందే.. తమిళనాడులో విస్తరణకు ప్రాంతీయ పార్టీలు అడ్డంకిగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఓట్ల శాతం పరంగా చూస్తే కేరళలో ఇప్పటికే మంచి స్థానంలో ఉందని చెబుతున్నారు. -
403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రంలో 19 శాతం ముస్లింలు ఉండగా... తాజా శాసనసభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 24 మంది మాత్రమే విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో 69 మంది ముస్లిం సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘సబ్కా సాత్... సబ్కా వికాస్’ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... మొత్తం 403 స్థానాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలోకి దింపకపోవడం గమనార్హం. ముస్లింలు అధికంగా ఉండే రోహిల్ఖండ్, తెరాయ్తో పాటు యాదవులు, దళితులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న తూర్పు ప్రాంతం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు పెద్ద ఓటు బ్యాంకులు. ఈ సామాజిక లెక్కల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్తో జతకట్టింది ముస్లింల ఓటు బ్యాంకు కోసమే. ఈ ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య చీలిపోతే... అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది వారి అంచనా. మరోవైపు యూపీలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. ఈసారి 479 మంది మహిళా అభ్యర్థులు పోటీపడితే... 40 మంది మాత్రమే గెలిచారు. వీరి గెలుపు శాతం పది కంటే తక్కువ. ఇక... 403 మంది నూతన శాసనసభ్యుల్లో డిగ్రీ ఆపై చదువులు చదివినవారు 290 మంది. 143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 403 కొత్త ఎమ్మెల్యేల్లో 143 మంది నేర చరితులు, 322 మంది కోటీశ్వరులు ఉన్నారు. నేర చరితుల్లో హత్య తదితర తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నట్టు ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో బీజేపీ తరుఫున కోలొనెల్గంజ్ స్థానం నుంచి నెగ్గిన అజయ్ప్రతాప్సింగ్ టాప్లో ఉన్నారు. ఈయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,455 మంది కోటీశ్వరులు పోటీపడ్డారు. -
అమిత్ షాకు సీఎంల ఎంపిక బాధ్యత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతోపాటు మణిపూర్లకు ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అప్పగిస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యంమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ను ఇప్పటికే పార్టీ ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులు ఎమ్మెల్యేలను సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు చెబుతారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ కార్యదర్శి భూపేంద్ర యాదవ్లను పరిశీలకులుగా బీజేపీ నియమించింది. ఉత్తరాఖండ్కు పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ కార్యదర్శి సరోజ్ పాండేలు నియమితులయ్యారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దేలు మణిపూర్ బాధ్యతలు చూసుకుంటారు. -
ప్రజాస్వామ్యానికి పాతరేసిన బీజేపీ
విమర్శించిన కాంగ్రెస్ పార్టీ పణజి/న్యూఢిల్లీ: గోవా, మణిపూర్లలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతరేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని, ప్రజలు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాంతారామ్ నాయక్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే బీజేపీ అనైతిక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. పారికర్ను ‘విలన్’గా ఆయన అభివర్ణించారు. మేం శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుండగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని శాంతారామ్ పేర్కొన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం చెప్పారని కూడా శాంతారామ్ గుర్తుచేశారు. మణిపూర్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కిడ్నాప్ ఇంఫాల్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బలగాల సాయంతో మణిపూర్కి చెందిన ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సీఐఎస్ఎఫ్ బలగాలను, విమానాశ్రయ అధికారులను దుర్వినియోగం చేసి అసబుద్దీన్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని, ఆ ఎమ్మెల్యేని కలకత్తాకు తరలించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం పట్టపగలు ఖూనీ చేస్తోందని సుర్జేవాలా విమర్శించారు. -
16న అమరీందర్ ప్రమాణం
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్య క్షుడు కెప్టెన్ అమరీందర్సింగ్ ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరీందర్ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన రాజ్భవన్లో గవర్నర్ బద్నోర్ను కలిశారు. ఈనెల 14న రాహుల్గాంధీతో భేటీ అవుతానని చెప్పిన ఆయన కేబినెట్ కూర్పుపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
రాష్ట్రపతి ఎన్నికలో స్వేచ్ఛ
►బీజేపీకి కలిసొచ్చిన యూపీ, ఉత్తరాఖండ్ గెలుపు ►వచ్చే ఏడాదికి రాజ్యసభలో 100కి చేరనున్న ఎన్డీఏ బలం న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం బీజేపికి అనేక తీపికబుర్లు అందించింది. ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ఎంపికలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశంతో పాటు, వచ్చే ఏడాది రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా నిలిచేందుకు ఆస్కారమిచ్చింది. తాము నిర్ణయించిన అభ్యర్థి రాష్ట్రపతి భవన్లో ఉంటే.. కొన్ని కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడం సులభమవుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది జులై 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందాలంటే మొత్తం 10,98,822 ఎలక్టోరల్ ఓట్లలో 50.1 శాతం సాధించాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి గెలుపునకు 75 వేల ఓట్లు తక్కుపడ్డాయి. తాజా ఫలితాలతో ఆ లోటు 20 వేలకు తగ్గిందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నాడీఎంకేకు చెందిన 134 మంది ఎమ్మెల్యేలు, బీజేడీ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో స్వేచ్ఛగా తన అభ్యర్థిని ఎనుకునే అవకాశం బీజేపీకి కలుగుతుంది. రేసులో మహాజన్, రాంనాయక్, సుష్మ, జాదవ్లు! బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, యూపీ గవర్నర్ రామ్ నాయక్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ దళిత నేత నరేంద్ర జాదవ్, కేంద్ర మంత్రి తావర్చంద్ గెహ్లాట్ల పేరు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో అకాలీ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, బీజేపీ నేత వెంకయ్య నాయుడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదికి రాజ్యసభలోను బీజేపీదే హవా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో 243 మంది సభ్యులున్న రాజ్యసభలో వచ్చే ఏడాది కల్లా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవనుంది. రాజ్యసభలో ఎన్డీఏ ఎంపీల సంఖ్య 100కు పెరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 56 మంది సభ్యులుండగా, కాంగ్రెస్కు 59 మంది ఉన్నారు. అదే విధంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు సులభంగా ఆమోదం పొందేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి. జీఎస్టీ ఆమోదానికి లోక్సభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం విపక్షాలదే పైచేయి. తాజా విజయంతో రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య తగ్గవచ్చనేది బీజేపీ భావన. యూపీ సభ్యుడి ఎలక్టోరల్ విలువ ఎక్కువ పార్లమెంట్లోని ఉభయసభల సభ్యులు, 29 రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటేసే అవకాశముంటుంది. లోక్సభ స్పీకర్ కూడా ఓటేయవచ్చు. అయితే లోక్సభలోని ఆంగ్లో ఇండియన్ సభ్యులు, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటేసే అధికారం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉండగా... ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో గెలుపుతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని మరింత సులభతరం చేసింది. యూపీలో ప్రతి అసెంబ్లీ సభ్యుడికున్న ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 208... మహారాష్ట్రలో ఆ విలువ 175 మాత్రమే. అందుకే యూపీ 324 సీట్లలో ఎన్డీఏ విజయంతో రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టును మరింత పెంచింది. ఇక 543 మంది సభ్యులున్న లోక్సభలో బీజేపీకి 281 మంది ఎంపీలుండగా... రాజ్యసభలో 56 మంది సభ్యులున్నారు. -
కమల వికాసం..
అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ ఆధిక్యత న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీలు.. దళితులు.. గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంతాలు.. ఇలా ఎక్కడ చూసినా కమల వికాసమే. మొత్తంగా ఉత్తరప్రదేశ్లో 2014 సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమయ్యాయి. దీంతో దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన యూపీలో బీజేపీ రికార్డు స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యత చూపించారు. సంప్రదాయంగా తమకు పట్టున్న నియోజకవర్గాల్లోనే కాదు.. బీజేపీ గెలుపు అసాధ్యం అనుకునే స్థానాల్లోనూ కాషాయం రెపరెపలాడింది. గ్రామీణం(97/142) గ్రామీణ జనాభా 93 శాతానికిపైగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లో 142 ఉన్నాయి. 2012లో వీటిల్లో 9 సీట్లు మాత్రమే గెలిచిన కమలనాథులు.. ఇప్పుడు ఆ సంఖ్యను 97కు పెంచుకోగలిగారు. కాంగ్రెస్–ఎస్పీ బలం 105 నుంచి 28కి.. బీఎస్పీ సీట్లు 26 నుంచి మూడుకు తగ్గిపోయాయి. ముస్లిం మైనారిటీలు(93/133) ఉత్తరప్రదేశ్లో ముస్లిం మైనార్టీల సంఖ్య 22 శాతం కంటే ఎక్కువగా ఉన్న అసెంబ్లీ్ల నియోజకవర్గాలు 133 ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ 93 చోట్ల విజయం సాధించింది. 2012లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువ. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్వాదీ కూటమి 2012లో 75 చోట్ల విజయం సాధిస్తే.. ఈసారి 30 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ బలం 25 నుంచి ఐదుకు పడిపోయింది. దళితులు(107/140) యూపీలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితుల సంఖ్య 23 శాతం కంటే ఎక్కువ ఉంది. వీటిల్లో 107 స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. 2012లో బీజేపీకి ఈ స్థానాల్లో దక్కింది ఎనిమిది సీట్లే. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్వాదీ కూటమి బలం 94 నుంచి 22 సీట్లకు పడిపోయింది. బీఎస్పీ 34 నుంచి ఐదు స్థానాలకే పరిమితమైంది. -
యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు
⇒ అత్యధికం 1,50,685 ⇒ అత్యల్పం 171 లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరు లక్షన్నరకు పైగా మెజారిటీ సాధిస్తే.. మరొకరు కేవలం 171 ఓట్ల తేడాతో గట్టెక్కారు. యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన వారిని పరిశీలిస్తే.. ఐదుగురు అభ్యర్థులు లక్ష ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో గెలవగా, ఎనిమిది మంది కేవలం వెయ్యి లోపు మెజారిటీతో గట్టెక్కారు. అలాంటివారి వివరాలు... ► సాహిబాబాద్ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ అత్యధికంగా 1,50,685 ఓట్ల మెజారిటీ సాధిం చారు. కాంగ్రెస్ అభ్యర్థి అమర్ పాల్ను సునీల్ ఓడించారు. ► రథ్ నియోజకవర్గంలో మనీషా అనురాగి 1,04,643 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గాయదీన్ అనురాగిపై గెలిచారు. ► నోయిడా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్ 1,04,016 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరిని ఆయన ఓడించారు. ► దోమరియాగంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ కేవలం 171 ఓట్ల మెజారిటీ సాధించారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యదా ఖటూన్ను ఆయన ఓడించారు. ► మీరాపూర్లో బీజేపీ అభ్యర్థి అవతార్ సింగ్ భదానా 193 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి లియాకత్ అలీపై గెలుపొందారు. ► మంత్ నియోజకవర్గంలో బీఎస్పీకి చెందిన శ్యామ్ సుందర్ శర్మ ఆర్ఎల్డీ అభ్యర్థి యోగేశ్ చౌదరిని 432 ఓట్ల తేడాతో ఓడించారు. -
నెహ్రూకు పోటీగా.. మోదీ?
►జనాదరణలో జవహర్లాల్తో పోటీపడుతున్న నరేంద్రుడు ►ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో ఇందిరను వెనక్కి నెట్టిన ప్రధాని న్యూఢిల్లీ: జనాదరణ విషయంలో జవహర్లాల్ నెహ్రూ ఎంత ఉన్నతుడో ఒక సందర్భంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ వివరించారు. అప్పట్లో ముంబైలో కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఆ సమయంలో పటేల్ అమెరికా జర్నలిస్ట్ విన్సెంట్ షీన్తో మాట్లాడుతూ.. ‘‘వారు వచ్చింది నాకోసం కాదు. జవహర్ కోసం’’ అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. భారీ మెజార్టీతో ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం నేతలలో నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ఉక్కుమహిళగా పేరొందిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు. అమిత్ షా మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుత ప్రధాని తొలి ప్రధానినే అధిగమించేశారని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. భారత చరిత్రను అధ్యయనం చేస్తున్నవారికి, విశ్లేషకులకు అమిత్ షా వ్యాఖ్యలు ఒక అతిశయోక్తిగానే కనిపిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ తర్వాత స్థానం నెహ్రూదే. తిరుగులేని ఆయన శక్తిని తరచూ ‘‘నెహ్రూ స్వామ్యం’’గా అభివర్ణించేవారు. స్వాతంత్య్రం తదనంతర దేశ నిర్మాణంలో ఆయన పాత్ర గణనీయమైనది. అయితే అమిత్ షా వ్యాఖ్యలు ఏమంత తీసిపారేయతగ్గవి కూడా కాదు. ఇప్పటి మోదీ జనాదరణ అప్పటి నెహ్రూ జనాదరణతో పోటీ పడుతోంది. 2014లో చిన్న విజయం.. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల కంటే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 1977లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ను కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ దిగ్గజ నేతలతో పోటీలో మోదీ వెనకబడ్డారని చెప్పలేం. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన అధికారంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ (దాదాపు 40 శాతం) చూస్తే.. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ను అధిగమించేసింది. అంతేగాక 1962లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ (36 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో సాధించిన ఈ విజయం సాధారణమైనదికాదు. మోదీ గుజరాత్ను వదిలి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడం మొదలు దీని వెనకాల ఎంతో కృషి ఉందని చెప్పవచ్చు. అలాగే ఒక్కో రాష్ట్రంలోనూ బీజేపీ పాగా వేస్తూ వస్తోంది. 1967లో కాంగ్రెస్ 10 రాష్ట్రాలను పాలిస్తే.. 2017లో బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోంది. దీనిని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మోదీ స్వామ్యం.. అప్పట్లో నెహ్రూకు ఉన్న జనాదరణతో పార్టీలో ఉన్న రైటిస్టులు కూడా కిమ్మనకుండా ఉండేవారు. దీంతో నెహ్రూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. పథకాలు, చట్టాలు రూపకల్పన చేశారు. పురాతన హిందు సంప్రదాయాలు స్థానంలో ప్రగతిశీల చట్టాలను తీసుకొచ్చారు. లౌకిక విధానాన్ని అవలంభించి దేశ విభజన తర్వాత భారత్లోని ముస్లింలకు భద్రత కల్పించే చర్యలు తీసుకున్నారు. అయితే నరేంద్ర మోదీది రైటిస్ట్ భావజాలం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడంతో ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది. నెహ్రూ స్థాయిలో ఆయన అధికారాలు ఉంటే దేశాన్ని తన భావజాలంవైపు తీసుకెళ్లవచ్చు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పోటీకి దింపలేదు. ఈ విజయం పూర్తిగా హిందు ఓట్ బ్యాంకుపై ఆధారం. తానో హిందు శక్తిగానే కనిపించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. -
ఉత్తరప్రదేశ్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహం
⇒ 900 సభలు ⇒ 10000 వాట్సాప్ గ్రూపులు ⇒ 67000 కార్యకర్తలు లక్నో: యూపీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాషాయ దళం.. గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. రెండేళ్ల కిందటే కసరత్తు ప్రారంభించిన బీజేపీ.. సభలు, రోడ్షోలు, సమ్మేళనాలు, సోషల్ మీడియా.. వంటి అనేక మార్గాల్లో ప్రజలను చేరుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులను పటిష్టం చేసి, 67 వేలమంది క్రియాశీల కార్యకర్తలను రంగంలోకి దింపింది. ఒక్కో నియోజ కవర్గంలో 2 నుంచి 4 సభల చొప్పున మొత్తం 900 సభలు ఏర్పాటు చేసింది. మోదీ 23 సభ ల్లో ప్రసంగించారు. వ్యూహాన్ని పార్టీ అమిత్ షా, రాష్ట్ర ఇన్చార్జి ఓ మాధుర్, రాష్ట్ర కమిటీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రూపొందించి అమలు చేశారు. దళితులు, ఓబీసీల ఓట్ల కోసం.. గత ఏప్రిల్లో మాజీ ఎంపీ, బౌద్ధ సన్యాసి ధమ్మ విరియోతో బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మాయావతి ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి దళితులు, ఓబీసీల జనాభా అధికంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోవిరియో ‘ధమ్మ చేతన యాత్ర’ చేపట్టి మోదీకి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికి పార్టీ 200 పిచ్డా వర్గ్ సమ్మేళనాలను, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు 18 స్వాభిమాన్ సమ్మేళనాలను, వ్యాపారుల మద్దతు కోసం 14 వ్యాపారీ సమ్మేళనాలను నిర్వహించింది. కాలేజీల్లో 1,650 సభల ద్వారా యువతకు చేరువైంది. యాత్రలు.. మహిళా సమ్మేళనాలు.. రోడ్షోల రూపంలో డిసెంబర్ 24 నుంచి మొత్తం 403 నియోజకవర్గాల్లో పరివర్తన్ యాత్రలు చేపట్టింది. 50 లక్షల మంది ప్రజలకు మోదీ విజయాలను వివరించింది. మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి అన్ని జిల్లాల్లో 77 ‘మహిళా సమ్మేళన్’లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ 34 జిల్లాల్లో ‘కమల్ మేళా’ ఎగ్జిబిషన్లను, రైతులకు చేరువకావడానికి 3,564 ‘అలావో సభ’ (చలిమంట భేటీలు) ఏర్పాటు చేశారు. 75 జిల్లాల్లో జరిగిన ‘మాటీ తిలక్ ప్రతిజ్ఞా ర్యాలీ’ల్లో తాము రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తామని బీజేపీ ఎంపీలు తిలకధారణ చేశారు. సోషల్ మీడియా.. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కమల నాథులు రాష్ట్రస్థాయిలో 25 మంది ఐటీ నిపుణు లతో ఒక టీమ్ను, ప్రాంతీయ స్థాయిలో 21 మందితో 6 టీమ్లను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో మరో 90 జిల్లా యూనిట్లనూ రంగంలోకి దింపారు. ఈ టీమ్లన్నీ కలిపి మొత్తం 10,344 వాట్సాప్ గ్రూపులు, 4 ఫేస్బుక్ పేజీలను ఏర్పాటు చేసి, ఆడియో, వీడియో క్లిప్పులను చేరవేశాయి. ఇంకా ఏం చేశారంటే.. ► పార్టీ పరిశోధన బృందాలు ఒక్కో నియోజక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందించాయి. ► 33 మంది ఎంపీలు 92 నియోజకవర్గాల్లో 263 సభల్లో ప్రసంగించారు. 1,025 శిక్షణా శిబిరాలు నిర్వహించి 88 వేలమంది కార్యకర్త లకు పార్టీ విధానాలను వివరించారు. ► ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి 75 వీడియో వ్యాన్లను రాష్ట్రమంతటా తిప్పారు. ‘బూత్ విజయ్ అభియాన్’ పేరుతో అభ్యర్థులకు ఓటేయాలని ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు పంచారు. ► రాష్ట్రంలోని మొత్తం 1,47,401 పోలింగ్ బూత్లలో 10 నుంచి 21 మందితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశాలను ఉద్దేశించి పార్టీ చీఫ్ అమిత్ షా ప్రసంగించారు. ‘ఆజీవన్ సహయోగ్ నిధి’ పేరుతో సభ్యుల నుంచి రూ.16.91 కోట్లను వసూలు చేసి పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. -
40 ఏళ్లలో ఇదే రికార్డు!
యూపీలో 312 స్థానాలతో బీజేపీ విజయం ⇒ 1977లో 352 స్థానాలు సాధించిన జనతా పార్టీ ⇒ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ల చరిత్రలో అతిచెత్త ప్రదర్శన న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో గత 40 ఏళ్లలో ఎవరూ సాధించని రికార్డుని బీజేపీ సొంతం చేసుకుంది. మొత్తం 403 స్థానాల కుగాను 312 సీట్లను (77.4%) తన ఖాతాలో వేసుకుని ప్రభంజనం సృష్టించిం ది. 1977 తరువాయి ఒక పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అలాగే 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతాన్ని 25 నుంచి 39.7 శాతానికి పెంచుకుంది. ఎమర్జెన్సీ అనంతరం 1977 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ మొత్తం 425 అసెంబ్లీ స్థానాలకు 352(82.8 శాతం) సీట్లతో కాంగ్రెస్ను మట్టికరిపించింది. 47.8 శాతం ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక 1980లో ప్రస్తుతం బీజేపీ సాధించిన స్థాయిలో కాంగ్రెస్ మంచి ఫలితాలు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో మొత్తం 425 స్థానాలకు గాను కాంగ్రెస్ 309(72.7 శాతం) స్థానాలు గెలుపొంది.. 39.6 శాతం ఓట్లు గెలుచుకుంది. కాగా ఆ ఎన్నికల్లో 10.8 శాతం ఓట్లతో బీజేపీ 11 స్థానాలకే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అలాంటి ప్రదర్శననే కనపరుస్తూ.. 6.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. మరోవైపు 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి అద్భుత ప్రదర్శనను బీజేపీ మళ్లీ కనపర్చింది. ఆ ఎన్నికల్లో 42.7 శాతం ఓట్లతో మొత్తం 80 లోక్సభ స్థానాలకు గాను 73(90 శాతం కంటే అధికం) సీట్లు దక్కించుకుంది. 1993 అనంతరం... ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు 20 శాతానికి మించి ఓటు బ్యాంకు గెలుచుకున్నా సీట్లు సాధించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ 21.8, బీఎస్పీ 22.2 శాతం ఓట్లు సాధించగా, 2012లో ఎస్పీ 29, బీఎస్పీ 26 శాతం ఓట్లను గెలుపొందాయి. 1993 నుంచి ఎస్పీ, బీఎస్పీల ఓట్ల శాతం క్రమంగా పెరగ్గా... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం తగ్గింది. 2017కి వచ్చేసరికల్లా పార్టీ చరిత్రలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చగా, 1977 అనంతరం అతి తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపర్చింది. ఆవిర్భా వం అనంతరం ఎస్పీ, బీఎస్పీల అతిచెత్త ప్రదర్శన కూడా ఇదే కావడం గమనార్హం. బీజేపీ ఓట్ల సునామీ: నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల శాతం -
గోవా, మణిపూర్ బీజేపీవే..
గోవా ముఖ్యమంత్రిగా పరీకర్ ►బలనిరూపణకు 15 రోజుల గడువు ►మణిపూర్లోనూ చక్రం తిప్పిన కమలనాథులు ►బీజేపికి ఎన్పీపీ, ఎల్జేపీ మద్దతు ►గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కలిసిన బీజేపీ మద్దతుదారులు ►రెండు రాష్ట్రాలలో కమలం కన్నా హస్తానికే ఎక్కువ సీట్లు పణజి/ఇంపాల్: మినీరణంగా పేరొందిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కమల నాథుల విజయపరంపరం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో స్పష్టమైన విజయాన్ని నమోదుచేసిన బీజేపీ.. తక్కువ సీట్లకే పరిమితమైన గోవా, మణిపూర్లలోనూ పీఠాలను కైవసం చేసుకోగలిగింది. దీంతో పంజాబ్ ఒక్కదానికే కాంగ్రెస్ పరిమితం కావలసి వచ్చింది. గోవా, మణిపూర్లలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ చిన్నపార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీ సంపాదించగలిగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసమే.. తీర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని జీఎఫ్పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ తెలిపారు. అస్థిరత కారణంగా రాష్ట్రం అభివృద్ధికి దూరం కావడం తమకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పరీకర్ నాయకత్వం వహిస్తున్నారన్న కారణంతోనే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని ఎంజీపీ నాయకులు సుదిన్ ధావలికర్ తెలిపారు. పరీకర్ను చూసి తాము బీజేపీకి మద్దతు లేఖ ఇచ్చామని, ఆయన లేకుంటే మద్దతిచ్చేవారం కాదని సుదిన్ పేర్కొన్నారు. అంతకుముందు పణజిలో సమావేశమైన బీజేపీ శాసనసభ్యులు పారికర్ను శాసనసభాపక్షనేతగా ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్షాకు పంపించారు. తమ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ను కలసినట్లు బీజేపీ గోవా అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ చెప్పారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన బీజేపీ గోవాలో బీజేపీ 32.5శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కన్నా ఇది 4.1శాతం ఎక్కువ అయినా అది ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. 28.4శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా 32.5శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 13 సీట్లను మాత్రమే గెలుచుకోగలగడం విశేషం. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఎంజీపీ 3, జీఎఫ్పీ 3, ఇండిపెండెంట్లు 3 స్థానాలలో గెలవగా ఎన్సీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. గోవాలో 1.2 శాతం మంది నోటాను ఉపయోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో నోటా ఇంతశాతం మరెక్కడా నమోదు కాలేదు. పరీకర్ నాయకత్వంలో గోవాలో బీజేపీ ప్రభుత్వం గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి గా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. గవర్నర్ మృదులా సిన్హాను ఆదివారం సాయంత్రం కలసిన పరీకర్ తన నాయకత్వంలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమి వ్వాల్సిందిగా కోరారు. పరీకర్ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్.. మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల గడువిచ్చారు. అంతకుముందు, తమకు ఎన్సీపీ, స్థానిక పార్టీలు, కొందరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నట్లు ఆయన గవర్నర్కు తెలిపారు. ముగ్గురేసి ఎమ్మెల్యేలున్న గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న ఎన్సిపి, ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్న లేఖలను పరీకర్ గవర్నర్కు సమర్పించారు. 13 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ బలం వీరి మద్దతుతో 22కు చేరుకుంది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి అవసరమైన నలుగురు ఎమ్మెల్యేల మద్దతును సాధించలేకపోయింది. మణిపూర్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలు కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. బీజేపీకి మద్దతిస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆదివారం ప్రకటించాయి. ఎన్పీపీ, ఎల్జేపీలతో అవగాహన కుదిరిందని.. మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్ వ్యవహారాల బాధ్యుడు) రామ్ మాధవ్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలూ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వీటి చేరికతో బీజేపీ బలం 26కు చేరుకుంది. కాగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూడా మణిపూర్లో బీజేపీకే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా నిలిచారు. కాగా, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిశారు. ‘60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు’ అని గవర్నర్ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్కుమార్పై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతిచ్చారని హిమంత తెలిపారు. కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశం లేదని ఈ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. -
‘అఖిలేశ్తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
మణిపూర్లో పెద్దపార్టీ హస్తం
⇒ అధికారానికి 3 స్థానాల దూరంలో కాంగ్రెస్.. బీజేపీ 21 సీట్లు ⇒ కీలకంగా మారిన చిన్న పార్టీలు ⇒ షర్మిలకు దారుణ పరాభవం ఇంఫాల్: తుది నిమిషం వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మణిపూర్లో ఓట్ల లెక్కింపు హంగ్కు దారితీసింది. 60 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ఫిగర్ అయిన 31ని ఏ పార్టీ చేరలేదు. అధికార కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కించుకోని బీజేపీ ఈసారి 21 సీట్లు సాధించి మెరుగైన ప్రదర్శన చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందంజలో నిలిచింది. 59 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 35.1 శాతం, 60 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 36.3 శాతం ఓట్లు సొంతం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న ఎన్సీపీ ఈసారి ఖాతా తెరవలేదు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీల చేతులు మారింది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి కీలకం కానున్నారు. ది నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) , ది నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. సారీ.. ఇరోమ్!! మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల గుర్తుందా..? ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ధీర! పోలీసులు కొన్ని వందలసార్లు దీక్ష భగ్నం చేయడానికి యత్నించినా.. ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగించారు. ఏళ్ల తరబడి దీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్జేఏ పార్టీ స్థాపించారు. ఈ ఎన్నికల్లో సీఎం ఇబోబిసింగ్పైనే పోటీచేశారు. ...అయితే ఆమెకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 90!! దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు! ఎస్పీ నేత, యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి గుర్తున్నాడా? మహిళపై గ్యాంగ్రేప్ కేసులో నిందితుడు ఇతడు. ఇదే ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 50 వేల పైచిలుకు!! ...ప్రజాస్వామ్యంలో ఇదో విషాదం కాకపోతే మరేంటి?? -
గోవాలో హంగ్ అసెంబ్లీ
⇒ అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ⇒ సీఎంతోపాటు ఆరుగురు మంత్రుల ఓటమి ⇒ రాజీనామా సమర్పించిన పర్సేకర్ పణజీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి చిన్నదైన గోవాలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సంపాదించలేకపోయింది. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 40 కాగా అధికారం చేపట్టడానికి కావలసిన కనీస స్థానాలు 21. 17 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్కు 4 సీట్ల దూరంలో ఆగిపోగా, బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ)లు చెరో మూడు స్థానాల్లో గెలిచాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయ బావుటా ఎగురవేశారు. ఎన్సీపీకి ఒక స్థానం లభించింది. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి లక్ష్మీకాంత్ పర్సేకర్ మండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. పర్సేకర్ శనివారం గవర్నర్కు రాజీనామాను సమర్పించారు. 9 నుంచి 17కు పెరిగిన కాంగ్రెస్ బలం.. ప్రస్తుత అసెంబ్లీలో కేవలం 9 మంది సభ్యులను కలిగిన కాంగ్రెస్..ఈ ఎన్నికల్లో తన బలాన్ని దాదాపు రెట్టింపు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగంబర్ కామత్, ప్రతాప్సిన్హ్ రాణే, రవి నాయక్, ల్యుజిన్హో ఫెలేరియోలు ఈ ఎన్నికల్లో భారీ విజయాలను అందుకున్నారు. హంగ్ రావడంతో చిన్న పార్టీలైన జీఎఫ్పీ, ఎంజీపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించనున్నాయి. స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ మద్దతుతోనే గెలవడం లాభించే అంశం. మేం కూడా రేసులో ఉన్నాం: పరీకర్ కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ మాట్లాడుతూ ‘గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రేసులో ఉంది’అని అన్నారు. రాజీనామా సమర్పించిన అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ ‘గోవా ప్రజలు తప్పు చేశారని నేను భావిస్తున్నా. వచ్చే ఐదేళ్లపాటు వారు పశ్చాత్తాప పడతారు’అని వ్యాఖ్యానించారు. -
ఫలితం తేలేది నేడే!
-
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర!
-
ఫలితం తేలేది నేడే!
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ♦ 12 గంటల కల్లా స్పష్టత! ♦ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ♦ రాజ్యసభ లెక్కలపైనే కమలదళం దృష్టి ⇒ ఉత్తరప్రదేశ్ : మొత్తం సీట్లు 403 .. మేజిక్ ఫిగర్ 202 ⇒ పంజాబ్: మొత్తం సీట్లు..117 .. మేజిక్ ఫిగర్ 59 ⇒ ఉత్తరాఖండ్: మొత్తం సీట్లు 70 .. మేజిక్ ఫిగర్ 36 ⇒ మణిపూర్: మొత్తం సీట్లు 60 .. మేజిక్ ఫిగర్ 31 ⇒ గోవా: మొత్తం సీట్లు 40 .. మేజిక్ ఫిగర్ 21 నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలే మిగిలింది. కీలకమైన యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలం పార్టీకి విజయం అత్యంత అవసరం. అటు ఎస్పీ–కాంగ్రెస్ కూటమి అస్తిత్వం నిలుపుకునేందుకు ఈ ఎన్నికలు క్రియాశీలకం. న్యూఢిల్లీ/లక్నో: యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవనుండగా.. 11 గంటలకల్లా ఫలితాలపై ఓ అంచనా, 12 కల్లా స్పష్టత వచ్చే వీలుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలు పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటుచేశాయి. ప్రధాన మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్న ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కువసీట్లున్న యూపీలో బీజేపీ అధిక సీట్లు గెలిచే వీలున్నప్పటికీ.. హంగ్ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని నిపుణులంటున్నారు. పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా, ఎగ్జిట్పోల్స్పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ చెప్పినప్పటికీ.. మహాకూటమే గెలిచిన విషయాన్ని లాలూ గుర్తుచేశారు. రాజ్యసభపై బీజేపీ గురి లోక్సభలో తగినంత మెజారిటీ ఉన్న బీజేపీ.. రాజ్యసభలో బలం లేక తన నిర్ణయాలకు ఆమోదం పొందలేకపోతోంది. అందుకే యూపీలో విజయం కోసం శతవిధాలా శ్రమించింది. యూపీ నుంచి గరిష్టంగా 31 మంది రాజ్యసభ ఎంపీలుంటారు. ప్రస్తుతం బీజేపీకి యూపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కలసి మొత్తంగా 12 మంది ఎగువసభకు వెళ్లగలరు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్కు 59 మంది (యూపీఏ–65) సభ్యులుండగా.. బీజేపీకి 56 మంది (ఎన్డీఏ–74) ఎంపీలున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికీ కలసి 106 మంది ఎంపీలున్నారు. యూపీలో బీజేపీ గెలిస్తే 2018లో ఈ లెక్కల్లో భారీ మార్పులు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీ ఫలితాలు ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల బలాబలాలను నిర్దేశించే అవకాశం ఉంది. ఈ విషయం అఖిలేశ్కు అర్థమైందని.. అందుకే బీజేపీని అడ్డుకునేందుకు బీఎస్పీతోనూ దోస్తీకి సిద్ధమనే సంకేతాలిచ్చారని రాజకీయ నిపుణులంటున్నారు. ఎన్నికలకు నెల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్కు.. ఇప్పుడు గెలిస్తేనే పార్టీపై పట్టు దక్కుతుంది. లేదంటే నష్టపోక తప్పదు. గోవా సీఎంగా పరీకర్? 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 19–22 సీట్లు రావొచ్చని ఎగ్జిట్పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. సీఎం ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. ప్రచారాన్ని కేంద్రమంత్రి పరీకర్ ముందుండి నడపటంతో ఆయనే మళ్లీ సీఎంగా వస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. -
అనూహ్యం.. బీఎస్పీకి అఖిలేశ్ పిలుపునిచ్చాడా?
లక్నో: ఉత్తరప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? బిహార్లో మాదిరిగా జాతీయ పార్టీని వెళ్లగొట్టేందుకు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక్కటైనట్లుగానే ఇప్పుడు యూపీలో కూడా ఎడమొహంపెడమొహంలాగా ఉండే పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా? లౌకికవాదం పేరుతో బీజేపీకి యూపీ నుంచి తిరుగుటపా కట్టే చర్యకు దిగబోతున్నారా? అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజాగా చేసిన ప్రకటన అదే ఆలోచనకు ఊపిరిపోస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, అధికారం చేపట్టనుందని తేలడంతో అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాషాయవర్ణ పార్టీ(బీజేపీ)ని యూపీలోకి అడుగుపెట్టనివ్వకుండా చేయాలంటే లౌకిక వాద శక్తులు(ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ, తదితరపార్టీలు) ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూటమిగా అయ్యాయి. ఇక మిగిలిన మరో పెద్ద లౌకికవాద పార్టీ బీఎస్పీ. అఖిలేశ్ తాజా ప్రకటన ప్రకారం బీఎస్పీని కూడా తమతో పెట్టుకునేందుకు, చేయికలిపేందుకు కలిసి రావాలని ఆహ్వానం పంపించినట్లేనని రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ‘సమాజంలోని అన్ని రకాల వ్యవస్థలకు, వ్యక్తులకు రక్షణ కల్పించాలంటే కాషాయ పార్టీని ఎదుర్కోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధ ప్రభుత్వాన్ని అందించేందుకు లౌకికవాద శక్తులంతా ఒక బాధ్యతగా భావించి ఏకం కావాలి’ అంటూ అఖిలేశ్ ఓ మీడియాకు చెప్పారు. అయితే, లౌకిక అనే పదం తప్ప ఆయన నేరుగా బీఎస్పీ కూడా రావాలని ప్రత్యక్షంగా మాత్రం చెప్పలేదు. అయితే, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ పరిస్థితి తలెత్తితే తాము కానీ, ఇతరులు కానీ రాష్ట్రపతి పాలనకు అంగీకరించబోమని, అలా జరిగితే యూపీపై కేంద్రం పెత్తనం పెరిగిపోతుందని అన్నారు. అయితే, మరోసారి తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందని, ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేనని అఖిలేశ్ చెప్పారు. అయితే, లౌకిక శక్తులు మాత్రం కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హింట్ మాత్రం ఇచ్చారు. అయితే, 1995 జూన్లో జరిగిన సంఘటనను బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఎప్పటికీ మర్చిపోదని, ఆ సమయంలో సమాజ్వాది పార్టీ కార్యకర్తలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా వేధించారని, ఆ ఆగ్రహం ఆమెను ఇప్పటికీ వెంటాడుతునే ఉందని అంటున్నారు. అయితే, 1993లో మాత్రం మాత్రం బీఎస్పీ, ఎస్పీలు పొత్తు పెట్టుకుని సమర్థంగా బీజేపీని అడ్డుకున్నాయి. అయితే, 1995నాటికే ఆ బంధం బద్దలైంది. ఎన్నికల ఫలితాలను బట్టి ఎలాంటి పరిణామాలైన జరిగే అవకాశం ఉందని మాత్రం అఖిలేశ్ పరోక్షంగా చెప్పారు. -
పాంచ్ పటాకా పేలింది...!
న్యూఢిల్లీ : కౌంటింగ్కు ముందే పాంచ్ పటాకా పేలింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈలోపే ఎన్నికలకు సంబంధించి ప్రజా అభిప్రాయ ఫలితాలు (ఎగ్జిట్ పోల్స్) గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ కాంగ్రెస్, యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో ఎస్పీ కూటమి, మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ... ఉత్తరాఖండ్, మణిపూర్లో కమలం వికసించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. గోవా విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ : అతి పెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్లో కమలం రెపరెపలాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రం యావత్ దేశంలోనే అత్యంత కీలకం. అక్కడ గెలిస్తే ఢిల్లీకి దారి దగ్గరవుతుందనేది నానుడి. అందుకే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ తో యూపీలో బీజేపీ వనవాసం ముగుస్తున్నట్లే కనిపిస్తోంది. పంజాబ్ : ఇంతకాలం పంజాబ్లో రెండు పార్టీల పాలనే. అయితే కాంగ్రెస్, లేకుంటే అకాలీదళ్ కూటమి. తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో బలమైన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీంతో 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ముక్కోణపు పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. అలాగే బీజేపీ ఇక్కడ చతికిలపడిందనే చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ : చిన్నరాష్ట్రం అయిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కేరళ తరహా వ్యవహారమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చడం ఆ రాష్ట్ర ప్రజల ఆనవాయితీ. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించి... కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి...కమలం చేతపట్టారు. ఇక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాఖండ్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటన సందర్భంగా పలు నేషనల్ ఛానల్స్ బీజేపీ గెలుపుకే మొగ్గుచూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎన్నికలు కూడా అందరినీ ఆకర్షించాయి. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా... ఈసారి 4 స్తంభాలాటగా తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా సెగలు పొగలు పుట్టించింది. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్కు 10 స్థానాలు, ఆప్కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మణిపూర్ : ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు పండగే. ప్రచార ఆర్భాటాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో... ఒక విధమైన సందడి కనిపిస్తుంది. కాని ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో సైలెంట్గా ఎన్నికలు జరిగిపోయాయి. నాగాల ఆర్థిక దిగ్బంధం ప్రభావం ఉన్నా.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి మణిపూర్ ఎన్నికల్లో సరికొత్త కెరటం రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆమె ఉక్కుమహిళ ఇరోం షర్మిల. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన షర్మిల... పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పీఆర్జేఏ అనే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. -
మా కుటుంబంలో బాధ వర్ణించలేను: అఖిలేశ్
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ప్రచారంలో ముందు పెట్టకపోయుంటే బీజేపీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఆయన తన సతీమణి డింపుల్ యాదవ్తో కలిసి కాలిదాస్ మార్గ్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సేద తీరుతూ కనిపించారు. ఈ సందర్భంగా సరదాగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో ప్రజలు అభివృద్ధిని చూసే ఓటు వేశారని, ఆర్భాటం చూసి కాదని అన్నారు. వారణాసి మొత్తం కూడా ఎస్పీ చేతుల్లోకి వచ్చేదని, ఆ విషయం ముందు గ్రహించే చివరకు మోదీని అక్కడ ప్రచారంలోకి బీజేపీ దింపిందని లేదంటే అక్కడ ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేదని చెప్పారు. వారణాసి కోసం ప్రత్యేకంగా బీజేపీ కేంద్రమంత్రులంతా ప్రచారం నిర్వహించారని, తమ పార్టీకి అలాంటి పరిస్థితి లేదని అన్నారు. తాము చేసిన మంచి పని ముందు బీజేపీ వారణాసిలో గల్లంతయ్యేదని మోదీని ముందుపెట్టి ఆ పరిస్థితిని కొంత మార్చుకోగలిగారని చెప్పారు. ‘తొలుత వారం రోజులపాటు బాగా కష్టంగా అనిపించింది. కానీ, తర్వాత పరిస్థితి మెరుగవుతూ వచ్చింది’ అని డింపుల్ ప్రచారం గురించి చెప్పారు. గత ఏడాది కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా తట్టుకోగలిగారు ఆ పరిస్థితిని కాస్త చెబుతారా అని డింపుల్ను ప్రశ్నించగా అఖిలేశ్ మధ్యలో జోక్యం చేసుకొని ఒక కథ చెప్పారు. ‘ఒకసారి రామకృష్ణ పరమహంసను ఒకసారి వివేకానందుడు దేవుడిని చూపించమని అడిగారు. దాంతో ఆయన గట్టిగా గిల్లారు. ఏమైందని ప్రశ్నించగా నొప్పిగా ఉందని బదులిచ్చారు. నొప్పి చూపించాలని రామకృష్ణ పరమహంస కోరగా వివేకానందుడు ఆశ్చర్యపోయారు. అలాగే మా ఇంట్లో పరిస్థితి ఎంత బాధకరమైందో మాటల్లో చెప్పలేను’ అని చెప్పారు. ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. -
యూపీ ఆఖరి దశలో ఓటేసిన ప్రముఖులు
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగే ఉత్తరప్రదేశ్ ఏడో దశ, మణిపూర్ రెండో దశ పోలింగ్లతో శాసనసభ ఎన్నికలు ముగుస్తాయి. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4న మొదలైంది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 15న ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల ఫలితాలు మార్చి 11న వెల్లడవుతాయి. ఉత్తరప్రదేశ్లో ఏడు జిల్లాల్లోని మొత్తం 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఆలాపూర్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో పోలింగ్ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ చివరిదైన రెండో దశ పోలింగ్ బుధవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 22 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి. సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుదీర్ఘకాలం నిరాహార దీక్ష సాగించిన ఉద్యమకారిణి ఇరోం చాను షర్మిల తౌబాల్ నుంచి పోటీ చేస్తున్నారు. -
ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9). కులం ప్రభావం ఎక్కువే! అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది. అప్నాదళ్తో పొత్తు లాభిస్తుందా? కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
‘భయం లేదు.. పవన్పై పది ఓట్ల తేడాతో గెలుస్తా’
అమరావతి: ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ అన్నారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని, తాను పోటీ చేస్తే.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మీద కూడా 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వచ్చే ఐడియాలు మరెవరికీ రావని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని కొనియాడారు. చంద్రబాబు ముందు మోదీ కూడా సరిపోడంటూ ఆకాశానికెత్తేశాడు. బీజేపీతో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడా లేవని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవికంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. -
మోదీ వృద్ధుడయ్యారు..
► యూపీలో యువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ► ఎన్నికల ప్రచారంలో రాహుల్ జౌన్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీకి వయసు మీదపడిందని, అలసిపోయారంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమి యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. సోమవారం జౌన్ పూర్లో ఆయన మాట్లాడుతూ... తమ నేతృత్వంలోని యువ ప్రభుత్వం యూపీని ప్రపంచానికి కర్మాగారం మారుస్తుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రధమ మహిళ మిషెల్ ఒబామా కూడా తన వంట గదిలో ‘మేడిన్ జౌన్ పూర్’ పాత్రల్ని కలిగి ఉండే రోజు వస్తుందన్నారు. ‘మేడిన్ ఉత్తరప్రదేశ్’ ఉత్పత్తులు ప్రపంచమంతా లభ్యమవుతాయని పేర్కొన్నారు. ‘మోదీకి తప్పనిసరిగా సాయం చేయాలని నేను అఖిలేశ్కి చెప్పాను. ఆయనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరా. అఖిలేశ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మోదీ విశ్రాంతి పొందుతారు’ అని రాహుల్ చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీ వరుస రోడ్షోలపై స్పందిస్తూ... మోదీ సినిమాలో పదే పదే రీటేక్లు తీసుకుంటున్నారని చమత్కరించారు. నాలుగు రోజుల్లో నాలుగు రీటేక్లు తీసుకున్నారని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. వారణాసి ఫలితంపై మోదీ భయపడుతున్నారని, అందుకే గత మూడు రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. గంగా మాత పుత్రుడిగా మోదీ అభివర్ణించుకోవడాన్ని తప్పుపడుతూ... భారత్లో గంగా నదికి ఒక్కరే కొడుకు ఉన్నారా? అన్న ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. -
రేపే తుది దశ పోలింగ్
యూపీలో 40, మణిపూర్లో 22 స్థానాలకు లక్నో/ఇంఫాల్: హోరెత్తించిన మైకులు... ప్రత్యర్థులే లక్ష్యంగా ఎక్కుపెట్టిన మాటల తూటాలు... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో రెండు నెలలకు పైగా వాడి వేడిగా సాగిన ఉత్తరప్రదేశ్, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. యూపీలో ఏడు దశల్లో, మణిపూర్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో బుధవారం జరగనున్న ఆఖరి దశ పోలింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్తర యూపీలోని మొత్తం 40 స్థానాలకు, మణిపూర్లోని 22 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వారణాసిలో కాశీ విశ్వనాథుడు, కాళభైరవ తదితర ఆలయాల సందర్శన, రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించిన మోదీ... ఎన్నో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ వెటరన్ నాయకులు వారణాసికి క్యూకట్టారు. ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలు మోదీకి దీటుగా ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం సాగించారు. ఈనెల 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
నేనూ పేదరికం అనుభవించా..
అందుకే పేదల జీవితం బాగుపడాలని కోరుకుంటున్నా.. ► కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ యూపీని నాశనం చేశాయి ► ఆ పార్టీలను ఎన్నికల్లో ఓడించండి: ప్రధాని మోదీ వారణాసి: ‘‘నేను కూడా ఒకప్పుడు పేదరికం అనుభవించా. అందుకే దేశంలో ఉన్న లక్షలాది మంది పేదల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నా..’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలో మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోహనియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుషీపూర్ గ్రామంలో నిర్వహించిన ఆఖరి ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్–ఎస్పీ, బీఎస్పీలు ఉత్తరప్రదేశ్ను నాశనం చేశాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, పోలీసు విభాగంలో ప్రొఫెషనలిజం తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలోని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 45 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో మోదీ బీజేపీ మిత్ర పక్షాలైన ఆప్నాదళ్, భారతీయ సమాజ్ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చినా.. మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రైతుల అభివృద్ధిపైనే ఆధారపడిందని, వారి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశం ముందుకెళుతుందని చెప్పారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2019 నాటికి దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. అఖిలేశ్ యాదవ్ సర్కార్పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో 50–60 శాతం మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి తీసుకొస్తే..యూపీలో మాత్రం 14 శాతం మందే ఈ పథకం కిందికి వచ్చారని, ఇది యూపీ సర్కారు వైఫల్యమేనని మండిపడ్డారు. పోటీపరీక్షల విషయంలో బంధుప్రీతి, అవినీతిల్లో ఎస్పీ ప్రభుత్వం కూరుకుపోయిందని, కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్యూలు లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే.. అఖిలేశ్ సర్కారు మాత్రం దానికి అడ్డుపడుతోందని ఆరోపించారు. లాల్బహదూర్ శాస్త్రికి నివాళి అంతకుముందు ప్రధాని మోదీ గర్హా్వ ఘాట్ ఆశ్రమాన్ని సందర్శించారు. స్వామి శరణానంద నేతృత్వంలోని ఈ ఆశ్రమానికి ఎక్కువగా యాదవ సామాజికవర్గం వారే వస్తుంటారు. అలాగే సంప్రదాయంగా ఈ ఆశ్రమం సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ఉంటుందనే ప్రచారం ఉంది. అనంతరం రామ్ఘాట్కు చేరుకున్న మోదీ అక్కడ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అలాగే శాస్త్రి చిన్నతనంలో నివసించిన ఇంట్లో కాసేపు గడిపారు. కాగా, యూపీ ఎన్నికల తుది దశ ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. -
ఎగ్జిట్పోల్స్పై నిషేధం పొడిగింపు
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్పై నిషేధాన్ని ఒకరోజు పాటు పొడిగిస్తూ భారతీయ ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్పోల్స్ను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య వెల్లడించకూడదని ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అలాపూర్, కర్ణప్రయాగ్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు హఠాన్మరణం చెందడంతో మార్చి 9 వరకూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదని పేర్కొంది. -
పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది. -
‘మోదీ వృద్ధుడవుతున్నారు.. యువనేత కావాలి’
లక్నో: మరో ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా సోమవారం ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీ, ఎస్పీ కూటమి, బీఎస్పీలో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్గాంధీ తన స్వరాన్ని పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీపై గట్టి విసుర్లు విసిరారు. మోదీ పెద్దవారిగా(వృద్ధుడిగా) మారి పోతున్నారని, అందుకే ఉత్తరప్రదేశ్కు యువనేతనే పాలకుడిగా తెచ్చుకుందామంటూ వ్యాఖ్యానించారు. తానే మొత్తం చేశానని మోదీ చెప్పుకుంటారని, ఇస్రో రాకెట్ పంపించినా దానికి కూడా తానే కారణమని చెప్పుకుంటారని మండిపడ్డారు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ను మాత్రం ఇక్కడే ఉంచి ఆయనే వెళ్లి ఒబామాతో మాట్లాడి వస్తారని విమర్శించారు. మోదీ చెప్పిన అచ్చేదిన్ అనే సినిమా అట్టర్ ప్లాఫ్ అయిందని, ఇక చూద్దామని అనుకున్న ఈ చిత్రం కనిపించబోదని ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యాకు మోదీ రూ.1200కోట్లు ఇచ్చారని, ఆయన వాటితో విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉటంకిస్తూ ప్రజల సొమ్ము మొత్తాన్ని మోదీ లాక్కున్నారని, ఆ మొత్తాన్ని కూడా కేవలం 50మంది కుబేరులకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో మోదీకి, ఆయన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని, తమకే పూర్తి స్థాయి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. అంతకుముందు, అమిత్ షా మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది రూ.కోట్లు పంపించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు చేయడం లేదని, పైగా కొన్నింటిని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి యువకుడికి కులాలు, మతాలు అనే తారతమ్యం చూడకుండా ల్యాప్ట్యాప్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మాత్రం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచిపరిపాలన అందించగలదని అన్నారు. -
వారణాసి వార్
► గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ ► కీలకంగా మారిన 20 శాతం ముస్లింల ఓట్లు వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వారణాసిలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో పాటు ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ–కాంగ్రెస్లు ఏకమవడం, పట్టున్న నేతలకు మిగతా పార్టీలు సీట్లివ్వగా... అభ్యర్థుల ఎంపికలో తడబడడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ప్రచారంలో హోరెత్తించిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వారణాసిలో బహిరంగ ర్యాలీల్లో ప్రసంగించడంతో పాటు పలు రోడ్షోలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతల్ని వారణాసిలో ప్రచారం కోసం మోహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ మూడింటిని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు సిట్టింగ్ల్లో ఇద్దరు అభ్యర్థుల్ని మార్చింది.వారణాసి సౌత్ స్థానం నుంచి ఏడు సార్లు విజేతగా ఉన్న శ్యామ్దేవ్ రాయ్ చౌదరీ స్థానంలో నీలకంఠ తివారీకి అవకాశమిచ్చింది. ఇక వారణాసి కంటోన్మెంట్ నుంచి జోత్సానా శ్రీవాత్సవకు బదులు ఆమె కుమారుడు సౌరభ్ శ్రీవాత్సవ పోటీ చేయనున్నారు. ఈ మార్పులు పార్టీలో కొందరు నేతలకు రుచించలేదు. కాగా వారణాసి నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర జైశ్వాల్కే అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో జైశ్వాల్ గట్టెక్కారు. నియోజక వర్గంలోని ముస్లింలు ఈసారి ఎస్సీ – కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేయడం కలిసొచ్చే అంశం. రోహనియా నుంచి బీజేపీ, మిత్రపక్షం అప్నా దళ్ల మధ్య పొత్తు కుదరకపోవడంతో విడి విడిగా పోటీ చేయడం మరో ఎదురుదెబ్బ. ‘ఎందుకు ఓటేయాలి’ వారణాసి నియోజకవర్గంలో దాదాపు 20 శాతం ముస్లిం జనాభా ఉన్నారు. ఈసారి వారంతా బహిరంగంగా ఎస్పీ–కాంగ్రెస్ కూటమికే ఓటేయవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల్లో చీలిక బీజేపీ మూడు సీట్లు గెల్చేందుకు సాయపడింది. మోదీ రోడ్ షోల్లో ముస్లింలు కనిపించినా అవన్నీ ఓట్లుగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నారు. యూపీలో బీజేపీ ఎంత మంది ముస్లింలకు సీట్లిచ్చింది? ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. మేం ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి అంటూ ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. -
కేబినెట్లో రేపిస్టు మంత్రా?
అఖిలేశ్యాదవ్ను ప్రశ్నించిన యూపీ గవర్నర్ లక్నో: ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాయక్ ఆదివారం ఘాటు లేఖ రాశారు. ‘ఒక రేప్ కేసులో మంత్రి తప్పించుకు తిరుగుతుండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఇది తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇంకా కేబినెట్లో కొనసాగించడం వల్ల రాజ్యాంగ నైతికత, గౌరవానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎంను వివరణ కోరారు. ‘లొంగిపోవాలని సీఎం స్వయంగా చెప్పినా, ప్రజాపతి ఆ పని చేయకుండా పరారీలో ఉన్నారు. విదేశాలకు తప్పించుకుని పోయే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే అరెస్ట్: షా తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అంబేడ్కర్నగర్లో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. -
ప్రతి ముగ్గురిలో ఒకరిపై కేసు!
యూపీ ఎన్నికల బరిలో అభ్యర్థుల జాతకమిది ► 30% మంది కోటీశ్వరులు ► 41% అభ్యర్థులు పన్నెండో తరగతి లోపువారే! న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాతకాలు విస్తు గొలుపుతున్నాయి. బరిలో నిలిచిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటిల్లో హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నవారూ అధికంగానే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇక డిగ్రీ కూడా పూర్తి కాని వారి శాతం 41. నిరక్షరాస్యులు 54 శాతం. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఏడు దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 8న జరగనుంది. బరిలో ఉన్న మొత్తం 4,823 (మహిళలు 445) అభ్యర్థుల్లో 859 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో 704 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. 31 మంది అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేకపోవడంతో వారి వివరాలు ఇక్కడ ఇవ్వలేదని ఏడీఆర్ తెలిపింది. 38 మంది లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. 1457 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.1.91 కోట్లు. రూ.5 కోట్ల పైనున్నవారు 453 మంది. 13 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 411 మంది రూ.లక్ష కంటే తక్కువని పేర్కొన్నారు. 1210 మంది పాన్ కార్డు, 2,790 మంది ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదు. -
యూపీకి ఏం చేశారు?
మోదీకి అఖిలేశ్ ప్రశ్న సోనేభద్ర: ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీకి గరిష్టసంఖ్యలో ఎంపీలను అందించారు. అయితే ఆ పార్టీ వారికేం చేసింది? వారు వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, వారి ప్రధానిని తెచ్చుకున్నారు. ప్రజలకు భ్రమలు కల్పించి ఉత్తిచేతులు చూపారు’ అని సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. ప్రధాని మోదీని విమర్శించారు. మొత్తం ప్రపంచమంతా తిరిగిన మోదీ.. యూపీ ప్రజల కోసం ఏం తెచ్చారని ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో నిలదీశారు. మూడేళ్లలో తను చేసిన పనులేవో చెప్పాలని తాను ప్రధానికి సవాల్ విసిరినా ఆయన ఇంతవరకూ అవేమిటో చెప్పలేదన్నారు. -
అఖిలేశ్, రాహుల్ అసమర్థులు
వాళ్లు కఠిన నిర్ణయాలు తీసుకోలేరన్న మోదీ ► వారణాసిలో బీజేపీ భారీ బహిరంగ సభ ► ఎస్పీ, బీఎస్పీలు ఒకే నాణేనికి రెండువైపులన్న ప్రధాని వారణాసి: యూపీ సీఎం అఖిలేశ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సున్నితంగా ఆలోచిస్తారని.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీళ్లు అసమర్థులని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ‘అఖిలేశ్కు ఆయన తండ్రి ములాయం సింగ్ నుంచి అధికారం వచ్చింది. రాహుల్ గాంధీకి.. తాతలు తండ్రుల నుంచి వచ్చింది. ఇద్దరూ ఉచితంగా వచ్చిన అధికారాన్నే అనుభవిస్తున్నారు. వీళ్లు సున్నితంగా పెరిగారు. కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. నేను గెలిచింది కాశీ ప్రజల ఆశీర్వాదం తోనే. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సమస్యలనుంచి బయటపడేస్తా. ఆ ధైర్యం నాకుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీలు రెండూ ఒకే నాణేనికి రెండు వైపులన్నారు. దేశం మొత్తం నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. యూపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తనదని ఓటర్లకు ప్రధాని భరోసా ఇచ్చారు. ఇటీవల దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతోందని.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేదని పరిశోధకులు చెప్పుకునే రోజు వస్తుందని మోదీ అన్నారు. వారణాసి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చిరు వ్యాపారులు అవినీతిపై చేస్తున్న దాడుల గురించి భయపడాల్సిన పనిలేదని.. రాజకీయ నాయకులు, అధికారులే దేశాన్ని దోచుకున్నారని ప్రధాన మంత్రి తెలిపారు. పథకాల అమల్లోనూ అఖిలేశ్ వివక్ష ఎస్పీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వివక్ష చూపిందని.. ‘కుఛ్ కా సాథ్, కుఛ్ కా వికాస్’ అన్నట్లుగానే పనిచేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా అఖిలేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించిందని ప్రధాని ఆరోపించారు. వారణాసికి తను ఇచ్చిన ప్రాజెక్టులను అఖిలేశ్ ఉద్దేశపూర్వకంగానే నెమ్మదింపజేశారన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్న మోదీ.. ఈ ప్రాంతంలో రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మార్చి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని మోదీ కోరారు. ‘తూర్పు యూపీలో అభివృద్ధి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్రం నిధులను రాష్ట్రం ఖర్చుచేయలేకపోయింది. అందుకే వారు పెట్టిన ఖర్చు చెప్పాలని నేను అడుగుతున్నా. ప్రజానిధులను దోచుకున్నందుకు ప్రశ్నిస్తే.. నన్ను ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి విమర్శిస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. తనపై కానీ తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా లేదని మోదీ గుర్తుచేశారు. వారణాసి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి. అంతకుముందు, బెనారసీ సాంప్రదాయ దుస్తుల్లో మోదీ రెండోరోజు ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ జెండాలతో ప్రధానికి స్వాగతం పలికారు. పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ నుంచి పాండేపూర్ చౌరాహ వరకు కిలోమీటర్ దూరం మోదీ ర్యాలీ వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టింది. మహిళలు రోడ్లకు ఇరువైపులా పూలబుట్టలతో నిలబడి మోదీపై పూలు చల్లారు. -
ఆరో దశలో 57% పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్లో 57.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1.72 కోట్ల ఓటర్లున్న 49 స్థానాలకు 635 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ అజాంగఢ్తో పాటు, బీజేపీ ఫైర్బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్, కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా డియోరియా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశ పోలింగ్లో ఉన్నాయి. బీఎస్పీ ముఖ్యనేత స్వామి ప్రసాద్ మౌర్య (పద్రౌనా), ఎస్పీ తరఫున మాజీ గవర్నర్ రాంనరేశ్యాదవ్ తనయుడు శ్యాంబహదూర్ యాదవ్ (ఫుల్పూర్ పవాయ్) ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖలు. మణిపూర్లో 84 శాతం పోలింగ్ ఇంఫాల్: మణిపుర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో గురువారం రికార్డు స్థాయిలో 84 శాతం పోలింగ్ నమోదైంది. 38 స్థానాల్లో 168 మంది పోటీపడ్డారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు చెప్పారు. -
నినాదాల ‘వార్’ణాసి
వారణాసి: ప్రధాన పార్టీల ఎన్నికల రోడ్షోలతో ఉత్తరప్రదేశ్లో చివరి విడత ఎన్నికల కేంద్రమైన వారణాసి దద్దరిల్లింది. బీజేపీ, ఎస్పీ పార్టీల పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని చేసిన ‘ఖబరస్తాన్ , శ్మశాన్ ’ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో భారీ స్పందన కనిపించింది. మోదీ కాశీలో పర్యటించాల్సి ఉన్నా.. పర్యటనను శనివారానికి మార్చారు. మరోవైపు, రెండోసారి యూపీలో అధికారాన్ని ఆశిస్తున్న సీఎం అఖిలేశ్ ప్రచారం కూడా శనివారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. వారణాసితోపాటు చుట్టుపక్కన జిల్లాల్లో 8న పోలింగ్ ఉంది. -
మీరు అభివృద్ధి చూపగలరా?
ప్రధాని మోదీకి యూపీ సీఎం అఖిలేశ్ సవాల్ ► తాను చేసిన అభివృద్ధిని చూపడానికి సిద్ధమని వెల్లడి బదోహి (ఉత్తరప్రదేశ్): దమ్ముంటే ఈ మూడేళ్లలో చేసిన 10 అభివృద్ధి పనులను ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రధాని నరేంద్రమోదీకి సవాల్ విసిరారు. యూపీలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రకటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. ‘‘నా ప్రభుత్వంలో నేను చేసిన 10 పనులను చూపిస్తా. ఆయన (మోదీ) చేసిన 10 పనులను చూపగలరా? నా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేను చేసిన పనులపై నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే, ఆయన తన మూడేళ్ల పాలనపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.’’ అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ శనివారం నిర్వహించిన ర్యాలీలో అఖిలేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయని, వారి వద్ద నుంచి డబ్బు తీసుకొని.. ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండని ఓటర్లకు సలహా ఇచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికీ అఖిలేశ్ చురకలంటించారు. ‘‘సజీవంగా ఉండగానే ఆమె స్మారకం తయారు చేశారు. ఇప్పుడు ఆమె భాషలో కూడా మార్పు వచ్చింది. ఆమె కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. ప్రజలు ఆ మాటలు విని నిద్రలోకి జారుకుంటున్నారు.’’ అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తన ఐదేళ్ల పాలనలో చేసిన పనులను అఖిలేశ్ ఉద్ఘాటించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.1000 పింఛను ఇస్తానని ప్రకటించారు. -
వారిది ‘ప్రజాపతి’ మంత్రం
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడుతున్నారు ♦ కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే వారు పనిచేస్తున్నారు ♦ అఖిలేశ్, ఎస్పీ–కాంగ్రెస్లపై ప్రధాని మోదీ విమర్శలు ♦ వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని జౌన్ పూర్(ఉత్తర్ప్రదేశ్): అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నాయకుడు గాయత్రి ప్రజాపతి విషయంలో యూపీ సీఎం అఖిలేశ్ నిద్రపోతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రజలను హింసించిన వారికి బుద్ది చెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని, చిత్రహింసలకు గురిచేసిన వారికి పిండప్రదానం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాదిరి ‘అందరి కోసం.. అందరి అభివృద్ధికే..’ నినాదంలా కాకుండా.. ‘ప్రతిపక్షాలు కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే..’’అనే నినాదంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మనం ఏదైనా మంచిపని చేసేటప్పుడు లేదా చేసినప్పుడు గాయత్రి మంత్రం పఠిస్తామని, కానీ, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి మాత్రం ‘గాయత్రి ప్రజాపతి’ మంత్రాన్ని పఠిస్తోందన్నారు. ప్రజాపతిపై ఓ కేసు నమోదైందని, కానీ సీఎం ఆయన కోసం ప్రచారం చేశారని, అప్పుడు ప్రజాపతి అక్కడికి వచ్చారని, కానీ ఇప్పుడు పోలీసులకు ప్రజాపతి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని చెపుతున్నారని విమర్శించారు. ఓ కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని, కానీ సీఎం నిందితునికి కొమ్ముకాస్తున్నారని ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ఓ మంత్రి గేదెలు తప్పిపోతే మాత్రం.. మొత్తం ప్రభుత్వమే వాటి కోసం పరుగులు పెడుతుందని.. అదే న్యాయం కోసం ఓ కూతురు కన్నీరు పెట్టుకుంటున్నా.. ముఖ్యమంత్రి, పోలీసులు నిద్రపోతున్నారని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమేథీలో ఎస్పీ టికెట్పై పోటీచేస్తున్న ప్రజాపతి తరఫున ఇటీవల అఖిలేశ్ ప్రచారం నిర్వహించారు. అయితే ఓ మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె తల్లిపై సామూహిక అత్యాచారం అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రజాపతిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అఖిలేశ్ కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది) నినాదంపై ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలపై తాను కొన్ని ఎన్నికల సభల్లో ప్రశ్నించగానే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగించారని, ఇదేనా మీరు చెప్పే పని మాట్లాడే పద్ధతి అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కు విద్యుత్ ఇస్తామంటే ముఖ్యమంత్రి వద్దన్నారంటూ.. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి నిజాలే చెపుతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ‘లక్నో–ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ప్రయాణం చేస్తే.. నేను (మోదీ) ఎస్పీకి ఓటేస్తానని అఖిలేశ్జీ చెప్పారు. కానీ.. జౌన్ పూర్లోని ఖేతాసరాయ్–ఖుతాన్ రోడ్లపై కొత్త మిత్రుడు (రాహుల్)తో కలిసి సైకిల్పై ప్రయాణించండని అఖిలేశ్ను కోరుతున్నా. ఆ తర్వాత ఆయనే ఎస్పీకి ఓటేయరు’ అని ప్రధాని మోదీ విమర్శించారు. మోదీపై కేసు నమోదుచేయండి: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా వారణాసిలో రోడ్షో నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసులు నమోదుచేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రధాని మోదీ వారణాసిలో రోడ్షో నిర్వహించారని కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. వారణాసిలో మోదీ పూజలు.. వారణాసి: లోక్సభకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీవిశ్వనాథునికి, కాల భైరవునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వారణాసిలో ప్రధాని రోడ్షో నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభైన ఈ రోడ్షో వారణాసి వీధుల గుండా సాగింది. ఈ రోడ్షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూత్వ సిద్ధాంతకర్త మదనమోహన మాలవ్య విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఆఖరి దశ ఎన్నికలు జరగనున్న వారణాసి ప్రాంతంలో మొత్తం 49 నియోజకవర్గాలు ఉన్నాయి. -
‘నేనెందుకు? నీ కొత్త దోస్తుతో సైకిల్పై వెళ్లు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్పై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. అఖిలేశ్ పరిపాలనలో ఏ తల్లి, ఏ కూతురు క్షేమంగా లేరని అన్నారు. గాయత్రి ప్రజాపతిలాంటి రేపిస్టులకు అఖిలేశ్ ఆశ్రయం ఇస్తుంటే మహిళలు భయపడిపోతున్నారని చెప్పారు. శనివారం జాన్పూర్లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అఖిలేశ్పై మాటల యుద్ధం ప్రకటించిన మోదీ.. ‘అఖిలేశ్ నన్ను ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ రోడ్డు మీద ప్రయాణించమన్నాడు. అలా చేస్తే నా ఓటుకు కూడా అఖిలేశ్కే వేస్తానని చెప్పాడు. నేను అఖిలేశ్ను ఆయన కొత్త దోస్తు(రాహుల్)తో కలిసి సైకిల్పై జాన్పూర్ రోడ్లలో వెళ్లాలని కోరుతున్నాను. కచ్చితంగా ఆయన దోస్తు కూడా అఖిలేశ్కు ఓటెయ్యడు’ అని మోదీ తిప్పికొట్టారు. దేశంలో భక్తులంతా గాయత్రి మంత్రం జపిస్తుంటే, ఎస్పీ ఆ పార్టీ కూటమి మాత్రం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతి పేరును తలుస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక కూడా గాయత్రి ప్రజాపతి తన ఓటు వినియోగించుకునేందుకు వెళ్లాడని, పోలీసులు మాత్రం అతడికి కోసం చూస్తున్నారని, అఖిలేశ్ మాత్రం అతడికి అండదండలు ఇస్తున్నారని విమర్శించారు. మార్చి 11న ఫలితాలు వచ్చిన తర్వాత దేశ ప్రజలంతా యూపీలో బీజేపీ విజయంతో హోళీ సంబురాల్లో మార్చి 13న మునిగిపోతారని చెప్పారు. విద్యుత్ అందుబాటులో లేని గ్రామాలు యూపీలో చాలా ఉన్నాయని, దేశంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు 18,000 ఉంటే అందులో 1500 గ్రామాలు యూపీవేనని మోదీ చెప్పారు. -
‘మెజార్టీ ఖాయం.. విజయం మాదే’
న్యూఢిల్లీ: ‘యూపీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. రాజకీయ నిపుణులు కూడా ఇదే అంగీకరిస్తున్నారు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ‘ఈస్ట్రన్ ఉత్తరప్రదేశ్ మీదుగా బీజేపీ పవనాలు బలంగా రాష్ట్రమంతటా వీస్తున్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు వారణాసిలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీ జరిగిన తీరు, తరలివచ్చిన జనాలను చూస్తే బీజేపీకి ఎంత అనుకూలంగా ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ర్యాలీని ప్రారంభించిన మోదీ కాళ భైరవ ఆలయం వరకు కొనసాగించారు. -
సర్జికల్ దాడులపై రాజకీయాలా?
-
సర్జికల్ దాడులపై రాజకీయాలా?: మోదీ
వారణాసి: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ 40 ఏళ్లుగా ఉన్నా ఏ పార్టీ కూడా ఏం చేయలేకపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాము పార్లమెంటు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే ఇచ్చేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్రమోదీ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అసలు జాతీయ భద్రతపరమైన అంశాలను ఎందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ భద్రత కోసం తీసుకొనే అలాంటి నిర్ణయాలను ఎందుకు? ఎలా ప్రశ్నించగలుగుతున్నారని అన్నారు. ఎవరు సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్నారో వారు జాన్పూర్ వెళ్లి అమర జవానుల కుటుంబాలను అడగాలని, అప్పుడు ఎందుకు సర్జికల్ దాడులు చేయాల్సి వచ్చిందో తెలుస్తుందని చెప్పారు. తాము చేసిన హామీలను మర్చిపోబోమని, ఉత్తరప్రదేశ్లో అధికారం వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే సన్నకారు రైతులకు రుణాలనిచ్చే విధానం సరళీకృతం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విజయం మాదే: ఇరోమ్ షర్మిల
ఇంఫాల్ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల అన్నారు. మణిపూర్లో కూడా అలాంటి మార్పే రావాలని ఆమె ఆకాంక్షించారు. యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల తన గెలుపుపై ముందే ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న జరిగే ఎన్నికల్లో ముఖమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. కాగా ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇరోమ్ షర్మిల తాను స్థాపించిన పీఆర్జేఎ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరికి దింపారు. మరోవైపు పీఆర్జేఏ అభ్యర్థి ఎలాండ్రో లైకోంబామ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మణిపూర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలి దశలో మొత్తం 38 అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 69శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మరో రెండోవిడత పోలింగ్ బుధవారం జరగనున్నాయి. -
పూర్వాంచల్లో పోటాపోటీ
► నేడే పోలింగ్ ► బీజేపీకి తలనొప్పిగా హిందూ యువవాహిని సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. నేపాల్, బిహార్లతో సరిహద్దును పంచుకుంటున్న పూర్వాంచల్ ప్రాంతంలోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లు ఎక్కువమంది ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోటీ బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్యనేనని వారి అభిప్రాయం. ఇక్కడ 2012 ఎన్నికల్లో ఎస్పీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. బీఎస్పీ నుంచి ముక్తార్ అన్సారీ పోటీ పూర్వాంచల్లోని మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ జిల్లా సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు స్వతంత్రుడిగా గెలిచారు. 2009 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని సీఎం అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఆజంగఢ్ జిల్లా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువవాహిని అభ్యర్థులు.. హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీని దెబ్బతీస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్ది బలియా జిల్లా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోవడంతో పరిస్థితి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన స్థానాలే మెజారిటీ అందించాయి. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు.. 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్ లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్లోని అసమ్మతివర్గం పంపిణీచేస్తోంది. -
యూపీ 6వ దశ, మణిపూర్ తొలి దశ ఎన్నికలు నేడు
లక్నో/ఇంఫాల్: ఉత్తరప్రదేశ్లో 6వ దశ 49 అసెంబ్లీ స్థానాలతో పాటు మణిపూర్లో తొలి దశ 38 నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 1.72 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 635 మంది ఈ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. 6వ దశ కింద మాయు, గోరక్పూర్, మహరాజ్గంజ్, ఖుషినగర్, డెఒరియా, ఆజంగఢ్, బాలియా జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరవ దశలో బీజేపీ 45 స్థానాల్లోనూ, అప్నా దశ్ ఒకటి, సుహెల్దేవ్ బీఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే బీఎస్పీ.. 49, ఎస్పీ.. 40, కాంగ్రెస్.. 9 చోట్ల బరిలోకి దిగుతున్నాయి.స్వామిప్రసాద్ మౌర్య, సూర్య ప్రతాప్ షాహి, శ్యామ్ బహదూర్ యాదవ్, అంబికా చౌదరీ, నరడ్ రాయ్ లాంటి హేమాహేమీలంతా ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మణిపూర్లో తొలి దశ...: తొలి దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ దశలో 38 నియోజకవర్గాల పరిధిలో 1,643 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్తో పాటు కొండ ప్రాంత జిల్లాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 168 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 19, 02, 562 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
ఆ పార్టీలకు 11న కరెంట్ షాక్
యూపీ ఫలితాలపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లను ఉద్దేశించి మోదీ మీర్జాపూర్: ఈ నెల 11న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు విద్యుత్ షాక్లు తగులుతాయని ప్రధాని మోదీ అన్నారు. యూపీలో విద్యుత్ పంపిణీ సరఫరా సరిగా లేదన్న తన ఆరోపణలకు బదులుగా.. కరెంటు ఉందో లేదో తేల్చుకోవడానికి తీగ పట్టుకోవాలని సీఎం సవాల్ విసిరిన నేపథ్యంలో మోదీ స్పందించారు. ‘కరెంటు ఉందో లేదో తీగ పట్టుకుని చూడాలని అఖిలేశ్ సవాల్ విసిరారు. అయితే ఆయన కొత్త మిత్రుడు రాహుల్ గాంధీ మదిహన్ (మీర్జాపూర్) సభలో కరెంటు తీగ పట్టుకుని అందు లో కరెంటు లేదని గులాం నబీ ఆజాద్తో చెప్పారు. అఖిలేశ్జీ.. ఇప్పుడు ప్రజలు కరెంటును ప్రవహింపజేస్తున్నారు. అది ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు మార్చి 11న షాకిస్తుంది’ అని శుక్రవారం మీర్జాపూర్లో జరిగిన ఎన్నికల సభలో మోదీ అన్నారు. ప్రతి పనికీ లంచం.. యూపీలో ప్రతి పనికి, ఉద్యోగానికి లంచాన్ని నిర్ధారించారని ఆరోపించారు. ఈ అవినీతి పోవాలంటే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లను ఓడించాలన్నారు. తన విగ్రహాలకు మీర్జాపూర్ నుంచి రాళ్లను తెప్పించుకున్నానన్న బీఎస్పీ చీఫ్ మాయావతి.. దర్యాప్తు మొదలయ్యాక రాళ్లను రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నట్లు చెప్పారని, ఆమెకు మీర్జాపూర్ రాళ్లపైనా ఇంత ద్వేషమెందుకని ప్రశ్నించారు. మీర్జాపూర్లోని ఇత్తడి పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్ ఇచ్చి ఉంటే యువత గుజరాత్, మహారాష్ట్రలకు వలసపోయేవారు కారన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: అఖిలేశ్ కాన్పూర్ రైలు ప్రమాదం వెనక ఐఎస్ఐ హస్తముందన్న మోదీ ఆరోపణలను అఖిలేశ్ ఖండించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఘాజీపూర్ సభలో విమర్శించారు. కాన్పూర్లో రైలుపట్టాల బాగోగులు పట్టించుకోని రైల్వే మంత్రి.. వాటిని ఐఎస్ఐ ధ్వంసం చేసిందంటూ ప్రధానికి నివేదిక ఇచ్చారని, సీఎం అయిన తనకు మాట కూడా చెప్పలేదని అన్నారు. బీజేపీకి ఆ పార్టీ శ్రేణులే బుద్ధి చెబుతాయి: మాయావతి యూపీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను, నేరచరితులను నిలబెట్టిన బీజేపీకి ఆ పార్టీ సొంత శ్రేణులే గుణపాఠం నేర్పుతాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జాన్ పూర్ సభలో ధీమా వ్యక్తం చేశారు. -
నేడు సమరాంగణంగా వారణాసి
మోదీ, రాహుల్, మాయావతి ప్రచారం వారణాసి: ప్రధాని మోదీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి శనివారం రాజకీయ దిగ్గజాల ప్రచారంలో సమరాంగణంగా మారనుంది. మోదీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ప్రచారంతో హోరెత్తించనున్నారు. వీరందరూ ఒకేరోజు పర్యటనకు రానుండడంతో అధికారులు ఠారెత్తిపోతున్నారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్న మోదీ మొదట కాశీవిశ్వనాథ ఆలయానికి వెళ్తారు. తర్వాత బెనారస్ వర్సిటీలో విశ్రాంతి తర్వాత కాశీ విద్యాపీఠ్ వర్సిటీకి వెళ్లి ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. అఖిలేశ్, రాహుల్లు కచేరీ ప్రాంతం నుంచి గిరిజాఘర్ వరకు రోడ్షో చేస్తారు. మాయావతి రొహానియాలో ర్యాలీ నిర్వహిస్తారు. మోదీ ఆదివారం కూడా వారణాసిలో ప్రచారంలో పాల్గొనే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
‘గంగలో రాహుల్ దూకాలి.. లేదంటే నేను దూకుతా’
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీ తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రకటించింది. గంగా నది విషయంలో మోదీని విమర్శించిన రాహుల్పై కేంద్ర మంత్రి ఉమా భారతి విరుచుకుపడ్డారు. ‘రాహుల్గాంధీ అయినా గంగా నదిలో దూకాలి.. లేదంటే నేను దూకుతాను’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ది పరిపక్వత లేని మెదడు అని అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాహుల్ ఏ థాయిలాండ్కో పారిపోవడం కాదని, నేరుగా తనతో గంగా నది వద్దకు రావాలని, అప్పుడు గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభంకాకుంటే తాను గంగలో దూకుతానని, లేదంటే రాహుల్ దూకాలని సూచించారు. వారణాసిలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్కు చేసిందేమి లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్కు కుమారుడిగా చెప్పుకున్న రాహుల్ గంగా నదిని తన కన్నతల్లిగా చెప్పుకున్నారని, ఇప్పుడు గంగా తల్లికి ఆయన చేసేందేమిటని ప్రశ్నించారు. యూపీకిగానీ, గంగకుగానీ ఏమైనా చేశారా అని నిలదీశారు. గంగను శుద్ధి చేశారా అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆయనపై విరుచుకుపడ్డారు. ‘గంగా పరివాహక ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ, ఉత్తరప్రదేశ్లో మాత్రం మొదలుకాలేదు. మేం ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ, ఇంతవరకు నో అబ్జెక్షన్ కాపీ వాళ్లు ఇవ్వలేదు. వాస్తవానికి గంగాకు నిజమైన శత్రువు అఖిలేశ్ యాదవ్. ఓసారి ములాయం వచ్చి గంగా నదిపై పనులు ప్రారంభం కాలేదని పార్లమెంటులో అరిస్తే ఇంతవరకు మీ రాష్ట్రమే ఎన్వోసీ ఇవ్వలేదని గుర్తు చేస్తే చప్పుడు చేయకుండా కూర్చున్నారు. కావాలనే గంగా శుద్ధి కార్యక్రమానికి యూపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభం అవడం ఖాయం. అలా జరగకుంటే నేనన్నా అందులో దూకుతాను. రాహుల్ అయినా దూకాలి’ అని ఉమాభారతీ మండిపడ్డారు. -
వ్యూహాత్మకంగా అఖిలేశ్పై రాహుల్తో మోదీ ఎటాక్
మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన కూటమిపై దాడి చేశారు. గతంలో ఆయన చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రస్తుం అఖిలేశ్తో భాగస్వామ్యం పంచుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ఉపయోగించుకున్నారు. గతంలో అఖిలేశ్ మాటలను ఉటంకిస్తూ ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉందో లేదో తెలుసుకునేందుకు వైర్లను పట్టుకోమని అఖిలేశ్ యాదవ్ నాకు చెప్పారు. ఈ సందర్భంగా నేను ఆయనకు తన కొత్త స్నేహితుడు రాహుల్గాంధీ గత ఏడాది నిర్వహించిన ఖాట్ సభలో చెప్పిన మాటలు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. 27 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో విద్యుత్ లైన్లు ఉన్నాయి. కానీ అందులో విద్యుత్ లేదు అని రాహుల్ అన్నాడు. ఆ విషయం అఖిలేశ్ మర్చిపోయాడేమో’ అంటూ తనదైన శైలిలో రాహుల్ను, అఖిలేశ్ను ఇరుకున పడేశారు. ‘ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రెండు పెద్ద వంతెనలు మిర్జాపూర్లో నిర్మిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆపని పూర్తి కాలేదు. ఇప్పటికే ఆ హామీ ఇచ్చి 13 ఏళ్లు అయినా తన తండ్రి ఇచ్చిన హామీని ఎందుకు అఖిలేశ్ నెరవేర్చలేదు. పర్యాటకానికి ఉత్తరప్రదేశ్ ఎంతో అనుకూలమైనది. కాశీకి వింద్యాచల్ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. దేశంలో ఉన్నవారందరినీ ఇక్కడికి ఆకర్షించవచ్చు’ అని మోదీ చెప్పారు. -
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు. -
సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాలు విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీరుతో ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓటర్ల ముందూ బోరుమని ఏడుస్తున్నారు. తాము గతంలో తప్పు చేశామని, ఈ ఒక్కసారి క్షమించి అధికారం ఇవ్వాలంటూ తమ చెప్పులతో తమనే కొట్టుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముందే ఓ ఎస్పీ నేత వెక్కివెక్కి ఏడ్చాడు. కారణం చెప్పకుండా మైకులో ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే మాట్లాడటం ఆపేసి మధ్యలో ఏడ్వడం మొదలుపెట్టాడు. అయితే, సొంతపార్టీలో తనకు అసమ్మతి ఎదురైన కారణంగా ఆయనకు చేస్తున్న అవమానాలు గుర్తొచ్చి ఏడ్చారని ఆయనతో ఉన్న ఇతర నేతలు చెప్పారు. ఏం జరిగిందంటే పీడీ తివారీ అనే వ్యక్తి సమాజ్వాది పార్టీ తరుపున బార్హాజ్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగాడు. ఆరో దశలో భాగంగా శనివారం ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. అయితే, ఇక్కడికి ప్రచారానికి వచ్చిన మోదీ పీడీ తివారీ పోటీ చేసే స్థానం బీజేపీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడికే ప్రచారానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్ పీడీ తివారీకి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు ద్వారా తివారీకి అప్పగించాలని అన్నారు. ‘ ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లన్ని కొల్లగొడుతుందని చెప్పారు. బార్హాజ్ సీటును ఎలా కొల్లగొడతారో మనమూ చూద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తివారీకి మద్దతుగా చప్పట్లు శబ్దాలు, ఈలలు వినిపించాయి. ఆయన అలా అన్న తర్వాత భావోద్వేగం ఆపుకోలేక అతడు వెక్కివెక్కి ఏడ్చాడు. అంతకుముందు సుజాత్ అలాం అనే వ్యక్తి తన చెప్పులతో తానే పదేపదే తలపై కొట్టుకొని ఈ ఒక్కసారి క్షమించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసింది. -
‘దత్తపుత్రుడు ఇంటికి.. కూతురుకే అధికారం’
సోనేభాద్ర: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్ వాసులు దత్తపుత్రుడిని(ప్రధాని నరేంద్రమోదీ)ని తిరిగి గుజరాత్ పంపిచేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తమ సొంత కూతురు(మాయావతి) చేతుల్లోనే అధికారం పెడుతున్నారని చెప్పారు. బీజేపీకి ఆమె కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపే అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ జుమ్లా పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. నల్లధనం తీసుకొస్తామని, రూ.15 లక్షలు ప్రతి సామాన్యుడి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఆ హామీ కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. తన హామీలు నెరవేర్చలేకనే ఆ వైఫల్యాలు వేరే వారికి తెలియకుండా ఉండేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల దృష్టిని మరల్చారని మండిపడ్డారు. -
ఏం టైమింగ్.. పవర్ మంత్రికి భలే అనుభవం
వారణాసి: ఆహా.. ఏం టైమింగ్ అని సాధారణంగా అంటుంటాం. ఎవరి గురించి మాట్లాడుతామో.. ఏ విషయం గురించి చర్చిస్తామో దాన్ని ప్రతిబింబించేలా ఆవ్యక్తి వచ్చినప్పుడుగానీ, ఆ విషయం తాలూకు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఈ టైమింగ్ అనే డైలాగ్ను ఉపయోగిస్తుంటాం. సరిగ్గా నిజంగా ఏం టైమింగ్ అన్నట్లుగా కేంద్ర మంత్రి ఉన్నచోట ఏర్పడిన పరిస్థితిని చూసి అక్కడి వారంతా అనుకున్నారు. ఇంతకీ ఎవరా కేంద్రమంత్రి? ఏం సంఘటన అక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా ఆయన మాట్లాడుతుండగానే పుటుక్కున కరెంట్ పోయింది. లైట్లు ఆగిపోయాయి. అది కూడా సరిగ్గా విద్యుత్ అంశంపై మాట్లాడుతుండగానే కావడంతో అక్కడ ఉన్నవారంతా ఏం టైమింగ్ మంత్రిగారిది అని గుసగుసలాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉపయోగిస్తున్న అస్త్రాల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే కరెంట్ సమస్యే ఉండదని, పూర్తి స్థాయిలో విద్యుత్ను అందిస్తామని ఆయన హామీ ఇస్తున్న సమయంలోనే లైట్లు ఆగిపోవడంతో అందరు బిత్తరపోయి నవ్వుకున్నారు. అయితే, తాను చీకట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సమాజ్వాది పార్టీపై విమర్శలు చేశారు. విద్యుత్ అందరికీ సమానంగా అందించాలని, ఇలా అంతరాయం కలిగిస్తూ కొన్ని ప్రాంతాలకే పూర్తి సహాయం చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ‘నేను నా గురించి ఆందోళన చెందడం లేదు.. బాధపడటం లేదు. నేను కాలేజీల్లో, పాఠశాలల్లో చదివే విద్యార్థుల గురించి ఫీలవుతున్నాను. రైతుల గురించి, ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న వైద్యుల గురించి, రోగుల గురించి ఆందోళన చెందుతున్నాను’ అని గోయల్ అన్నారు. -
‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్ కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ప్రచారం ఉండబోదంట. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. మంగళవారం బెనారస్లో మీడియాతో ఆజాద్.. పార్టీ తరుపున మొత్తం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ప్రియాంకనే చూసుకుంటున్నారని, అందువల్ల ఆమెకు ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచారం చేయబోరని చెప్పారు. సోనియాకు ఏమైంది అని ప్రశ్నించగా అంతపెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తీవ్ర సమస్యేం కాదని సమాధానం దాట వేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్, రాహుల్ ఇద్దరూ సమానమేనని, రాహుల్ రెండో నేత కాదని స్పష్టం చేశారు. వారు ఎక్కడికి వెళ్లినా ఉమ్మడిగానే వెళుతున్నారని, కలిసి పనిచేస్తూ తమ కూటమి గెలుపుకోసం కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తాము అనుకోలేదని, ప్లేయర్ల మాదిరిగానే ఉండాలని బరిలోకి దిగినట్లు చెప్పారు. -
బేరసారాల కోసం కొత్త ఆట
ఓటమి తప్పదని ఎస్పీ, బీఎస్పీకి అర్థమైంది ► అందుకే హంగ్ రావాలని కోరుకుంటున్నాయి ► హంగ్ వస్తే అధికారం కోసం బేరసారాలు ఆడాలనేది వారి ఆలోచన ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మావు(యూపీ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన ఎస్పీ, బీఎస్పీ కొత్త ఆటకు తెర తీశాయని, యూపీలో హంగ్ రావాలని కోరుకుంటున్నాయని, తద్వారా అధికారంకోసం బేరసారాలు ఆడొచ్చనేది వారి ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘యూపీలో మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అర్థమైపోయింది. దీంతో వారు కొత్త ఆట, సరికొత్త ఎత్తుగడను ప్రారంభించారు. ఒకవేళ తాము ఓడిపోయినా.. లేదా సీట్ల సంఖ్య తగ్గినా.. ఎవరికీ మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాయి’’ అని చెప్పారు. సోమవారం యూపీలోని మావు పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ, బీఎస్పీ నాయకులకు నేను చెప్పేదొకటే. బీజేపీని ఓడించడానికి మీరు ఏమైనా చెయ్యండి. దానితో ఎటువంటి సమస్యా లేదు. కానీ యూపీ భవిష్యత్తుతో మాత్రం ఆటలాడొద్దు. యూపీ ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంది. హంగ్ అసెంబ్లీ వస్తే బేరసారాలు ఆడేందుకు అవకాశం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ యూపీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడతారు’’ అని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఎస్పీ అధికారం పోతుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అయితే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, దానితో పాటు ఎస్పీ కూడా మునిగిపోతుం దని, కాంగ్రెస్, ఎస్పీ కలసి మీడియా కవరేజీతో ప్రజలను ఏమార్చాలనుకుంటే కుదరదని చెప్పారు. ప్రజలకు పాలను.. నీటినీ ఎలా వేరు చేయాలో తెలుసన్నారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమకు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్–ఎస్పీ నేతలు చెప్పారని, కానీ మూడో దశ పూర్తయ్యేసరికి వారికి వాస్తవం అర్థమైందని, మెజారిటీ మాట పక్కన పెట్టి తమకు మరో అవకాశం ఇస్తే.. తప్పులను సరిచేసుకుంటామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ వచ్చినా సరే మిత్రపక్షాలను కలుపుకునే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తోందని, ఇదే విధంగా యూపీలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశం మొత్తం యూపీని కీర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి. తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో 2012తో పోలిస్తే 2017 ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహం భారీగా పెరిగింది. యూపీలో 2012లో రూ.36.29 కోట్ల నగదు, రూ.6.61 లక్షల విలువైన 3,073 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా ఈసారి ఏకంగా రూ.115.7 కోట్ల నగదు, రూ.57.69 కోట్ల విలువైన 20.29 లక్షల బ్యారెళ్ల మద్యం, రూ.7.91 కోట్ల విలువైన 2,725 కేజీల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఉత్తరాఖండ్లో ప్రస్తుత ఎన్నికల సమయంలో రూ.3.4 కోట్ల నగదు, రూ.3.1 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2012లో ఈ రాష్ట్రంలో పట్టుకున్న నగదు రూ.1.3 కోట్లు, మద్యం విలువ రూ.15.15 లక్షలు. పంజాబ్లో 2012లో రూ.11.51 కోట్ల నగదు, రూ.2.59 కోట్ల మద్యాన్ని పట్టుకోగా 2017లో రూ.58.02 కోట్ల నగదు, 13.36 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. -
నేడే యూపీ ఐదో దశ పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల 9న జరగనున్నది. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
‘కసబ్’కు కొత్త నిర్వచనం
‘కంప్యూటర్, స్మార్ట్ఫోన్ , బచ్చే’ అని చెప్పిన డింపుల్ జౌన్ పూర్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సంక్షిప్త పదాలతో ప్రత్యర్థి పార్టీ లపై విరుచుకుపడుతుండటం కొనసాగుతోం ది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంధించిన ‘కసబ్’ వాగ్బాణాన్ని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ తిప్పికొట్టారు. ‘క అంటే కాంగ్రెస్ అని బీజేపీ చెబుతోంది. కానీ ‘క’ అంటే కంప్యూటర్ అని మీ అఖిలేశ్ భయ్యా చెప్పారు. ‘స’ అంటే స్మార్ట్ఫోన్ . ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసు కోవచ్చు. ఇక ‘బ్’ అంటే బచ్చే (చిన్నా రులు)’ అంటూ డింపుల్ వివరించారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు ఇస్తామని సమాజ్వాదీ పార్టీ హామీ ఇచ్చింది. గర్భిణులకు ఇంటివద్దనే ఆహార ధాన్యాలు అందిస్తామని డింపుల్ యాదవ్æ హామీ ఇచ్చారు. -
‘మాకు 300స్థానాలు పక్కా’
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారం చేపట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 300పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కలయిక ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్ద మార్పును తీసుకొస్తుందని అది ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెప్తున్నానని, తమకు ఈ ఎన్నికల్లో 300 సీట్లు దాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడుతూ ‘ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఇది ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఒప్పందం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మార్పు తీసుకురాగల యువకులది ఈ ఒప్పందం’ అని చెప్పారు. రెండు అవినీతి కుటుంబాల మధ్య యూపీలో పొత్తు జరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అఖిలేశ్ ఇలా బదులిచ్చారు. -
కొత్త మిత్రులకు పరీక్ష
► రేపు యూపీ ఐదో దశ ఎన్నికలు ► అమేథీ సహా 51 స్థానాల్లో పోలింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదో దశ ఎన్నికలు కొత్త మిత్రులైన యువనేతలు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్లకు పరీక్షగా నిలవనుంది. రాహుల్ సొంత ప్రాంతమైన అమేథీ సహా 11 జిల్లాల్లోని 51 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. షెడ్యూలు ప్రకారం మొత్తం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అలాపూర్లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2012 ఎన్నికల్లో ఈ 52 స్థానాల్లో వేర్వేరుగా పోటీచేసిన సమాజ్వాదీ పార్టీ 37 సీట్లలో, కాంగ్రెస్ ఐదు సీట్లలో గెలిచాయి. తాజా ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీలు నాటి విజయాన్ని పునరావృతం చేయడం రాహుల్, అఖిలేశ్ల ముందున్న సవాల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావస్తి, బలరాంపూర్, సుల్తాన్ పూర్, అంబేడ్కర్నగర్ జిల్లాల్లో ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి పరిస్థితి ఏకపక్షంగా లేకున్నా... త్రిముఖ పోరులో పొత్తు లాభంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎస్పీ ధీమాతో ఉంది. ఐదో దశ బరిలో ఉన్న 9 మంది మంత్రులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దోస్తీమే సవాల్.. ఎస్పీ, కాంగ్రెస్లు పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి రాహుల్ ప్రతిష్టతో ముడిపడి ఉన్న అమేథి లో తమ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీ, రాజవంశీకుడు సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్, బీజేపీ నుంచి సంజయ్ మొదటి భార్య గరిమా పోటీపడుతున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి ఎస్పీ టికెట్పై బరిలో ఉన్నారు. అమేథి జిల్లాలోని మరో స్థానం గౌరిగంజ్లోననూ ఎస్పీ, కాంగ్రెస్లు పోటాపోటీగా అభ్యర్థులను నిలిపాయి. బీఎస్పీ ఆశలు తమ ముస్లిం– దళిత ఫార్ములాపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఐదోదశలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో చాలాచోట్ల ముస్లిం, దళితులు కలిసి మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలో 38 శాతం, బహ్రాయిచ్ జిల్లాలో 36 శాతం, సిద్ధార్థ్నగర్ జిల్లాలో 30 శాతం ముస్లింలే. అందుకే ఈ దశలో 18 మంది ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని ఓడించగల స్థితిలో ఉన్న అభ్యర్థివైపు ముస్లింలు మొగ్గుతారని బీఎస్పీ ఆశిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎన్నికలు జరిగే స్థానాలు: 51 బరిలో ఉన్న అభ్యర్థులు: 608 జిల్లాలు: 11 మొత్తం ఓటర్లు: 1.84 కోట్లు పోలింగ్ బూత్లు: 19,167 గమనిక: 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి మృతితో అలాపూర్ ఎన్నిక మార్చి 9న జరగనుంది. 2012లో ఎవరికెన్ని స్థానాలు ఎస్పీ 37 కాంగ్రెస్ 5 బీజేపీ 5 బీఎస్పీ 3 పీస్ పార్టీ 2 మొత్తం 52 -
15 నెలల్లో అభివృద్ధి చేస్తాం
మణిపూర్ ఎన్నికల సభలో మోదీ ఇంఫాల్: పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ తీవ్రంగా వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 15 నెలల్లో అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారమిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పాలనలో మణిపూర్లో అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు తాగునీరు అందించడంతో ప్రభుత్వం విఫలమైంది. 15 ఏళ్లలో ఆ పార్టీ చేయలేని పనిని(రాష్ట్ర అభివృద్ధి)ని మా ప్రభుత్వం 15 నెలల్లోనే చేస్తుంది’ అని చెప్పారు. ‘15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం 10 పర్సెంట్ సీఎం అని నేను విన్నాను. వంద శాతం నిజాయతీగల సీఎం కావాలా, లేకపోతే 10 శాతం కమీషన్ తీసుకునే వ్యక్తి కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం భారీగా పంపుతున్న నిధుల్లో అధిక భాగాన్ని నేతలు, అధికార పార్టీ మంత్రులు దారి మళ్లిస్తున్నారన్నారు. నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం నాగా మిలిటెంట్లతో కేంద్రం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఇబోబీ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. మణిపూర్, మణిపురీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమేదీ ఒప్పందలో లేదని స్పష్టం చేశారు. ‘ఏడాదిన్నర కిందట ఆ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ’ అని మండిపడ్డారు. యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్ త ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరవధిక ఆర్థిక దిగ్బంధాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే తొలగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఔషధాలు, ఇతర సరుకులు అందక అల్లాడతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
వంద శాతం సీట్లు బీజేపీకే కట్టబెట్టాలి
యూపీ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి గోండా(యూపీ): ‘‘ఈ ఎన్నికల్లో ఒక్క తప్పునకు కూడా తావు ఇవ్వొద్దు. బీఎస్పీ, ఎస్పీ పార్టీ ఏదైనా ఒక్క సీటు కూడా వారికి దక్కనివ్వొద్దు. వంద శాతం సీట్లను బీజేపీకే కట్టబెట్టాలి’’అని ఉత్తరప్రదేశ్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. శుక్రవారం ఇండో–నేపాల్ సరిహద్దులకు సమీపంలోని గోండా ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో మోదీపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశా, మహారాష్ట్ర, చండీగఢ్లో స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదా గుజరాత్లోని పంచాయతీ ఎన్నికలైనా గత మూడు నెలల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ మూడో కన్నుతో చూసి బీజేపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు.’ అని అన్నారు. 150 మంది ప్రాణాలు బలి తీసుకున్న కాన్పూర్ రైలు ప్రమాదం ఘటన వెనుక కుట్ర ఉందని, సరిహద్దుల అవతల నుంచి కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లభించాయని మోదీ చెప్పారు. -
సింహగర్జన కాదు.. చిట్టెలుక స్వరం
ప్రధాని మోదీపై రాహుల్ విసుర్లు లక్నో : ప్రధాని మోదీ స్వరం చిట్టెలుక కంటే బలహీనంగా మారిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాసి నియోజకవర్గంలో ప్రసంగిస్తూ... ‘మేకిన్ ఇండియా అంటూ ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అది సింహ గర్జన కాదు... చిట్టెలుక శబ్దం కంటే బలహీనంగా మారింది’ అంటూ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రతీచోట ‘మేడిన్ ఇన్ చైనా’ వస్తువులు అందుబాటులో ఉన్నాయని, నా ఫోన్ కూడా మేడిన్ చైనానే అంటూ రాహుల్ చమత్కరించారు. ఎస్పీ–కాంగ్రెస్లు జట్టు కట్టినప్పటి నుంచి మోదీ మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారన్నారు. మోదీ ధనికుల రుణాలు మాఫీ చేశారు గానీ, రైతుల్ని పట్టించుకోలేదని తప్పుపట్టారు. యూపీకి దత్తపుత్రుడిగా మోదీ ప్రచారం చేసుకోవడాన్ని కూడా రాహుల్ ఎద్దేవా చేశారు. ఎక్కడికెళ్తే అక్కడ బంధుత్వం ఏర్పరచుకుంటారని, అది కేవలం పెదాలకే పరిమితం కాకూడదన్నారు. మోదీ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే(అచ్చే దిన్ వాగ్దానం) సినిమా తీశారని, నోట్ల రద్దుతో అది షోలేగా మారిందన్నారు. రాహుల్పై బీజేపీ వ్యంగ్యా స్త్రాలు రాహుల్గాంధీ ఇంకా పరిణతి చెందలేదని, అందుకు మరికొంత సమయం అవసరమన్న షీలాదీక్షిత్ వ్యాఖ్యల్ని బీజేపీ సమర్ధించింది. ఒకవేళ రాహుల్ పరిణితి చెందకపోతే... బలవంతంగా ఎందుకు ఉత్తరప్రదేశ్పై ప్రయోగిస్తున్నారు? ఇదేమైనా రాజకీయ ప్రయోగశాలా లేక పాఠాలు నేర్చుకునే వేదికా? అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ ప్రశ్నించారు. ఎస్పీని అడ్డుకునేందుకు ఏకమైన బీజేపీ, బీఎస్పీ: అఖిలేశ్ బీజేపీ సాయంతో ఎస్పీని అడ్డుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారంటూ యూపీ సీఎం అఖిలేశ్ ఆరోపించారు. అయోధ్యలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బీజేపీపై పోరాడాలనే ఉద్దేశం బీఎస్పీకి లేదని, అందుకే వారిద్దరు సమాజ్వాదీ పార్టీని అడ్డుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు. మరోవైపు, యూపీ అసెంబ్లీ ఐదో విడత పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ఐదో విడతలో 12 జిల్లాల్లోని 51 సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. -
బీఎంసీలో బీజేపీ ‘మహా’ విజయం
-
బీజేపీ ‘మహా’ విజయం
బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో సత్తా చాటిన కమలం ► ముంబైలో 84 సీట్లతో మొదటి స్థానంలో శివసేన.. బీజేపీకి 82 ► గతంకన్నా కమలదళానికి 52 సీట్లు అధికం ►మ్యాజిక్ ఫిగర్కు రెండూ దూరం ►కాంగ్రెస్, ఎన్సీపీకి పరాభవం.. ఎంఐఎం బోణీ ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ముంబై మునిసిపాలిటీలో గణనీయంగా సీట్లు పెంచుకుంది. 25 ఏళ్లుగా శివసేనతో పొత్తు ఆధారంగా స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఒంటరిగానే (అక్కడక్కడ చిన్న పార్టీలను కలుపుకుని) పోటీచేసి ఘనమైన ఫలితాలు సాధిం చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది. శివసేన కంచుకోటగా ఉన్న బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. ఇందులో 84 సీట్లతో శివసేన అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ 82 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 31, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) 9, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 7, మజ్లిస్ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందాయి. కాగా ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో పాగా వేశారు. అయితే బీఎంసీ పీఠాన్ని అధిరోహించేందుకు కావాల్సిన 114 సీట్ల మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకి దక్కలేదు. అయితే సంపన్న కార్పొరేషన్ (2016–17 సంవత్సరానికి 37వేల కోట్ల బడ్జెట్)పై అధికారాన్ని నిలుపుకుంటామని శివసేన, తమదే మేయర్ పీఠమని బీజేపీ ప్రకటనలు చేస్తుండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జోరుమీదున్న బీజేపీ: శివసేనతో కలసి ప్రభుత్వంలో ఉన్నా విడిగా పోటీ చేయటమే బీజేపీకి కలిసొచ్చింది. సొంతంగా పోటీచేస్తామంటూ శివసేన ఆర్నెల్ల ముందునుంచే స్పష్టం చేస్తుండటంతో.. బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు అవకాశం కలిగింది. గత ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 51 స్థానాలను అదనంగా గెలుచుకోవటంతో ముంబై బీజేపీ సంబరాలు జరుపుకుంటోంది. తగ్గిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు చుక్కెదురైంది. గత ఎన్నికల్లో 52 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి 31 సీట్లకే పరిమితమైంది. ఎన్సీపీ 13 స్థానాలనుంచి 9కి చేరుకుంది. చాలాచోట్ల ఈ రెండు పార్టీలు ఐదు, ఆరో స్థానాలకు పడిపోయాయి. అటు, రాజ్ఠాక్రే నాయకత్వంలోని ఎంఎన్ కూడా 28 స్థానాలనుంచి ఏడుకు పడిపోయింది. ముంబై మునిసిపల్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ఎంఐఎం బోణీ చేసి 3 చోట్ల విజయం సాధించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కోటల్లో కమలం పాగా శరద్ పవార్కు కంచుకోట పుణేలో బీజేపీ తొలిసారి జెండా ఎగరేసింది. మహారాష్ట్ర సాంస్కృతిక, ఐటీ రాజధానిగా పేరున్న 162 స్థానాల పుణే మునిసిపల్ కార్పొరేషన్ ఎంసీ)లో 77 సీట్లతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్సీపీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్16, శివసేన 10 స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్ ఫిగర్ 81 చేరుకునేందుకు బీజేపీకి 4 స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ మేయర్ పీఠం అధిరోహించనుంది. నాగ్పూర్ మునిసిపాలిటీపై మరోసారి బీజేపీ పట్టు నిలుపుకోగా, థానేలో శివసేన ఆధిపత్యం కొనసాగింది. 131 సీట్లకు గానూ శివసేన 67 స్థానాలతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమరావతి, నాసిక్, ఉల్లాస్నగర్, పింప్రి–చించ్వాడ్, అకోలా, షోలాపూర్ మునిసిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇందులో అమరావతి, షోలాపూర్లో గతంలో కాంగ్రెస్ విజయం సాధించగా.. నాసిక్, పింప్రి–చించ్వాడ్ ఎన్సీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. జెడ్పీల్లోనూ బీజేపీ హవా 25 జిల్లాపరిషత్లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. మొత్తం 1518 జెడ్పీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 409 చోట్ల విజయం సాధించింది. చెరకు రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీకి పట్టు తప్పగా.. బీజేపీ ఇక్కడ పాగా వేసింది. కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాల్లోనూ బీజేపీ దూసుకుపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న లాతూర్కు రైలు ట్యాంకర్ల ద్వారా నీరందించటం బీజేపీకి బాగా కలిసొచ్చింది. రత్నగిరి, సింధుదుర్గ్, బీడ్, పర్భణి ప్రాంతాల్లో బీజేపీ జోరును ఎన్సీపీ అడ్డుకుంది. బీడ్ జెడ్పీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక మంత్రి పంకజా ముండే రాజీనామా చేశారు. అయితే దీన్ని ఆమోదించలేదని తెలుస్తోంది. ధన్యవాదాలు... మోదీ: ‘మహారాష్ట్ర సోదర, సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ, అభివృద్ధి రాజకీయాలపై విశ్వాసం ఉంచుతున్న ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు. మహారాష్ట్ర, ఒడిశా ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞులం. కార్యకర్తలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తొందరెందుకు: ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్ ‘బీఎంసీలో అధికారం ఎవరిదనే దానిపై తొందరెందుకు? కూటమి ఉండాలా వద్దా అనేది ఇప్పుడే నిర్ణయించలేం. కానీ బీఎంసీ మేయర్, భవిష్యత్తు ముఖ్యమంత్రి ఇద్దరూ శివసేన వాళ్లే ఉంటారని పక్కాగా చెప్పగలను’ అని ఉద్ధవ్ చెప్పారు. దోస్తీ ఉంటుందా? లేదా? బీఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో ఎవరు మేయర్ అనేదానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ, శివసేన పొత్తుపై ఎలాంటి స్పష్టత రానప్పటకీ.. ఫలితాలకు ముందునుంచే బీజేపీ పొత్తు సంకేతాలు పంపుతోంది. గొడవలకు స్వస్తి పలికి పారదర్శకతకోసం ఒక్కటవ్వాలంటూ ఫడ్నవిస్ సంకేతాలివ్వగా.. ఇతర నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో విమర్శలను పక్కనపెట్టి ఏకమవ్వాలనే సందేశాన్ని పంపిస్తున్నారు. అటు శివసేన కూడా మేయర్ పీఠం తమదేనంటూనే.. బీజేపీతో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేమంటోంది. పొత్తుపై గతంలో చేసిన ప్రకటనకే (బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు) కట్టుబడతామని ఉద్ధవ్ చెబుతున్నా.. చర్చలు మొదలైతే ఉద్ధవ్ దూకుడు తగ్గించవచ్చని ముంబై రాజకీయ వర్గాలంటున్నాయి. ముంబైలో ‘తెలుగు’ విజయం బీఎంసీ ఎన్నికల్లోని 174 వార్డు (హిందూ కాలనీ) నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన తెలుగు మహిళ కందిక కృష్ణవేణి రెడ్డి (45) విజయం సాధించారు. ఈమె చిత్తూరు జిల్లా, నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన వినోద్రెడ్డిని వివాహమాడారు. ముంబైలోనే స్థిరపడినా.. కొత్త ఆరూరులో జరిగే గంగజాతరతో పాటు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు ఇప్పటికీ వీరి కుంటుంబం హాజరవుతోంది. -
బీఎస్పీ, ఎస్పీ మద్దతుదారుల తన్నులాట
లక్నో: ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాది పార్టీ, సమాజ్వాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఎస్పీ నేత సిద్ధ గోపాల్ సాధు కుమారుడిపై బీఎస్పీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. కర్రలతో కొట్టుకుని రాళ్లను పరస్పరం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల నుంచి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో నాలుగ దఫాలో భాగంగా 53 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం కాస్తంత కలవరానికి గురి చేసింది. సంబంధిత కథనాలకై చదవండి.. ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు -
ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ హత్యాప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. సమాజ్వాది పార్టీకి చెందిన నేత కొడుకుపై బీఎస్పీ నేత కుమారుడు దాడికి పాల్పడ్డాడు. అతడిపై తుపాకితో కాల్పులు జరపడంతో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ చర్యతో మహోబా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాజ్వాది పార్టీకి చెందిన సిద్ధ గోపాల్ సాహు కుమారుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. నాలుగో దఫా ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. గురువారం ఉదయాన్నే గుర్తు తెలియని గుండాలు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతడిని కాన్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలయ్యాయి. సిద్ధగోపాల్ కుటుంబం మాత్రం బహుజన్ సమాజ్వాది పార్టీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడే ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
నేడే నాలుగోదశ పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (గురువారం) నాలుగో దశ పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లో ఉన్న 53 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన బుందేల్ఖండ్ ప్రాంతంతో పాటు, నెహ్రూ కుటుంబం కంచుకోట రాయ్బరేలీ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతాప్గఢ్, కౌశంబి, అలహాబాద్, జలౌన్, ఝాన్సీ, లలిత్పూర్, మహోబా, బందా, హమిర్పూర్, చిత్రకూట్, ఫతేపూర్. రాయ్బరేలీ జిల్లాల్లో నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తర అలహాబాద్ స్థానంలో అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2012లో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 24 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ–5, బహుజన్ సమాజ్ పార్టీ–15, కాంగ్రెస్–6, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. -
ప్రజలను దోచుకుంటోంది
⇒ మోదీ ప్రభుత్వంపై సోనియా ధ్వజం ⇒ యూపీ ఓటర్లకు లేఖ న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాల వల్ల గత 17ఏళ్లలో తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు రంగంలోకి దిగారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ప్రజలను దూరం చేస్తూ, వారి సమస్తాన్నీ దోచుకుంటున్న శక్తులను ఓడించాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ గురువారం జరగనున్న నేపథ్యంలో తాను, తన కొడుకు రాహుల్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేథీల్లోని ఓటర్లను ఉద్దేశించి ఆమె బుధవారం ఈమేరకు లేఖ రాశారు. దీన్ని తన వ్యక్తిగత సందేశంగా భావించాలని కోరారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల వద్ద ఉన్న సమస్తాన్నీ దోచుకుంటోంది. మోదీ తన కుర్చీ కాపాడుకోవడానికి అలా చేస్తున్నారు. పిడికెడు మంది కోసం, ఎంపిక చేసుకున్న పారిశ్రామికవేత్తల కోసం పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి వీరు పనిచేస్తున్నారు. దేశం దృష్టి అంతా రాయ్బరేలీ, అమేథీలపై ఉంది. మీరంతా కాంగ్రెస్కు ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్న నాకు సహకరించండి’ అని కోరారు. ‘మంచి రోజులు(అచ్చేదిన్) తీసుకురావడానికి బదులు మోదీ ప్రభుత్వం మీ భూములు, ఉద్యోగాలు, కష్టార్జితాన్ని లాక్కుంది. వారి దుష్పరిపాలన వల్ల రైతులు నష్టపోయారు. యువత ఉద్యోగాలు కోల్పోయింది. మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొన్నారు. -
అవి ‘కసబ్’ పార్టీలు!
కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీలపై అమిత్షా ధ్వజం చౌరిచౌరా: ఎన్నికల ప్రచారంలో పొట్టి పదాలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే సంప్రదాయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం యూపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీలను ‘కసబ్’ పార్టీలుగా ఆయన అభివర్ణించారు. కసబ్ పార్టీలను అంతమొందిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రజలు కసబ్ నుంచి విముక్తి పొందాలి. కసబ్ అంటే నా ఉద్దేశం వేరే కాదు. కా అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్వాదీ, బ్ అంటే బీఎస్పీ’ అంటూ ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ప్రజలకు వివరణ ఇచ్చారు. అజ్మల్ కసబ్ ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది అన్న విషయం తెలిసిందే. ‘సమాజ్వాదీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతి’లను స్కామ్గా, బీఎస్పీని ‘బహెన్జీ సంపత్తి పార్టీ’గా మోదీ.. మోదీని ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా బీఎస్పీ చీఫ్ మాయావతి.. స్కామ్ అంటే ‘సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోదీ’ అని అఖిలేశ్లు ఒకరినొకరు విమర్శించుకోగా, తాజా కసబ్ వ్యాఖ్యతో యూపీ ఎన్నికల ప్రచారాన్ని షా మరింత రక్తి కట్టించారు. ఎన్నికల అనంతరం బీఎస్పీ సహా ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని షా బుధవారం మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. షా చేసిన కసబ్ వ్యాఖ్య బీజేపీ మతతత్వ మనస్తత్వానికి అద్దం పడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. -
‘కాంగ్రెస్కు ప్రచారం చేయను.. అన్న చెబితే ఓకే’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరుపున తాను ప్రచారం చేయబోనని సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాల్లోపాల్గొంటున్నాయి. అయితే, తాను మాత్రం కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనబోనని శివపాల్ చెప్పారు. అయితే, తన సోదరుడు చెబితే అప్పుడు వెళతానని, తాను ఒక్క ఎస్పీకి మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎస్పీ టికెట్పై పోటీ చేయడం తప్పనిసరి పరిస్థితి అని, మార్చి 11 వరకు ఆ పార్టీతోనే ఉంటానని, ఒక వేళ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తనకు ఎలాంటి అవమానం ఎదురవకుంటే అప్పుడు పరిస్థితిని బట్టి ముందుకెళతానని చెప్పారు. అఖిలేశ్ వర్గానికి చెందిన నేతలు తనను పదేపదే అవమానిస్తున్నారని, ఈనేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానని గతంలోనే శివపాల్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు పార్టీ పెట్టబోరని ములాయం చెప్పారు. అయినప్పటికీ శివపాల్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం ఆయన ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. -
‘మోదీ, అమిత్ షా ఉగ్రవాదులు’
లక్నో: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. ‘వారిద్దరూ ఓట్ల కోసం యూపీలో భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో భయాన్ని సృష్టిస్తున్నారు’ అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో ఎస్పీ ఆందోళనకు అద్దం పడుతున్నాయని, ప్రధానిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్రజలు శిక్షిస్తారని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి ఓమ్ మాధుర్ అన్నారు. -
మా పొత్తుతో మోదీ నవ్వు మాయం
రాహుల్ గాంధీ వ్యాఖ్య బందా(యూపీ): ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ చేతులు కలపడంతో ప్రధాని మోదీ ముఖంలో నవ్వు మాయమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ యూపీకి సొంత కొడుకు కాడని, దత్తపుత్రుడు మాత్రమేనని విమర్శించారు. ‘గంగామాత తన కొడుకు వారణాసికి పిలిపించుకుందని 2014లో మోదీ చెప్పారు.. మోదీజీ.. సంబంధాలనేవీ చెప్పుకుంటే కాదు పెంపొదించుకుంటే ఏర్పడతాయి’ అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, మోదీకి మాత్రం ఆ ఉద్దేశం లేదని ఆరోపించారు. మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: న్యూఢిల్లీ: యూపీలో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ఎన్నికల వాతావరణాన్ని మోదీ కలుషితం చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ‘మోదీ ఎన్నికల సభల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఖబరిస్తాన్ ఉన్నప్పుడు శ్మశానం కూడా ఉండాలని ఆదివారం ఆయన అన్న మాటలు సమాజాన్ని విడగొట్టేవే. ఆయన మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. -
గుజరాతీ గాడిదలకు ప్రచారం మానండి
అమితాబ్కు అఖిలేశ్ సూచన బరేలీ: ‘గుజరాతీ గాడిదలకు ప్రచారం చేయకండి’ అని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు సలహా ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నారో ఆయన చెప్పకున్నా మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అన్నట్లు భావిస్తున్నారు. గుజరాత్లోని లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో ఉన్న అడవి గాడిదల అభయారణ్యానికి రావాలంటూ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ చేసిన ఓ వాణిజ్య ప్రకటనను అఖిలేశ్ ప్రస్తావించారు. ‘గాడిదలున్న ఓ ప్రకటన టీవీలో వస్తోంది. గుజరాతీ గాడిదలకు మద్దతివ్వడం మనుకోవాలని శతాబ్దపు పెద్దనటుణ్ని కోరుతున్నా..’ అని సోమవారం ఉంచహార్లో ఎన్నికల సభలో అన్నారు. ప్రధాని మాటల మనిషి మాత్రమేనని అఖిలేశ్ మండిపడ్డారు. ‘ఆయన ఇప్పటికైనా మన్ కీ బాత్ను ఆపేసి ముఖ్య విషయాలపై దృష్టి పెట్టాలి’ అని అన్నారు. యూపీలో రంజాన్ , దీపావళి పండగలకు విద్యుత్ సరఫరాలో వివక్ష చూపారన్న మోదీ వ్యాఖ్యలపైనా అఖిలేశ్ ధ్వజమెత్తారు. -
మీరు ‘నెగటివ్ దళిత్ మ్యాన్ ’
మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మాయావతి సుల్తాన్ పూర్: యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు వ్యక్తిగతంగా మారాయి. బెహన్ జీ సంపత్తి పార్టీ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ చీ‹ఫ్ మాయావతి తిప్పికొట్టారు. సుల్తాన్ పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో.. ప్రధాని మోదీ పూర్తి పేరైన నరేంద్ర దామోదర్దాస్ మోదీ పేరుకు ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్ ’ అని సరికొత్త నిర్వచనాన్నిచ్చారు. తనకు మద్దతుగా ఉన్న దళితులకు మోదీ పూర్తి వ్యతిరేకమని ఆమె విమర్శించారు. ‘బీఎస్పీ ఎలా ప్రారంభమైందో.. ఏయే ఉద్యమ పునాదుల మీద పార్టీ నిర్మాణం జరిగిందో మోదీ తెలుసుకోవాలి. నా జీవితమంతా దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, ముస్లింలలో సాధికారత కల్పించేందుకు అంకితం చేశాను. మోదీ బీఎస్పీని తప్పుగా నిర్వచిస్తున్నారు. నేను సంపత్తి (సంపద) కోసం ప్రయత్నించలేదు. ప్రజలే నా సంపద’ అని మాయావతి తెలిపారు. కార్యకర్తలు ఇచ్చే విరాళాల ద్వారానే బీఎస్పీ నడుస్తోందన్న మాయావతి.. మోదీ చేతలు, ప్రవర్తన ఆధారంగానే ఆయన దళిత వ్యతిరేకి అని నిర్వచించాల్సి వచ్చిందన్నారు. బీఎస్పీకి రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రధాన మంత్రి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. -
యూపీలో గూండా రాజ్యం
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ► ఓటమి భయంతో అఖిలేశ్ ముఖం కళ తప్పింది ► యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఫతేపూర్: ఉత్తరప్రదేశ్లో గూండా రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్వాదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని ఆయన తప్పుపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫతేపూర్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... యూపీలో పోలీసుస్టేషన్లు సమాజ్వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ‘అఖిలేశ్ యాదవ్ ముఖం కళ తప్పింది. అతని మాటతీరు నీరసపడింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో పాటు, మాటల కోసం వెదుకులాడుతున్నారు. ఆటలో ఓటమిని ఆయన అంగీకరించారు’ అని మోదీ పేర్కొన్నారు అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ‘రాష్ట్రంలో పోలీసు విభాగం ఎందుకు అంత అసమర్ధంగా ఉంది? ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదు? ఇదేం పనితీరు?’ అంటూ మోదీ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రజాపతి తరఫున అఖిలేశ్ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం పదేళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందంటూ ఎస్పీ, బీఎప్పీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శిస్తూ... ‘ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదన్న విషయం పుట్టుకతోనే ప్రముఖులైనవారికి అర్థమైంది. అందుకే ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడింది’ అని విమర్శించారు. యూపీని దత్తత తీసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. శివాజీయే ఆదర్శం న్యూఢిల్లీ: మరాఠా యోధుడు శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. శివాజీ ఆలోచనలతోనే తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ‘శివాజీ వంటి గొప్ప నేత మన గడ్డపై పుట్టి మనల్ని పాలించటం గర్వకారణం. ధైర్య, సాహసాలు, సుపరిపాలనకు ఆయన పర్యాయపదం. ముంబైలో గొప్పగా శివ్స్మారక్ నిర్మించటమే ఆయన గొప్పతనానికి జాతి ఇచ్చే అసలైన నివాళి’ అని అన్నారు. -
మూడో విడత 61% పోలింగ్
యూపీలో ఓటేసిన రాజ్నాథ్, అఖిలేశ్, మాయావతి లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో విడతలో 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పుంజుకొంది. ఈ స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 59.96 శాతం, 2014 లోక్సభ ఎన్నికల్లో 58.43 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 55 స్థానాలను, బీఎస్పీ ఆరు, బీజేపీ ఐదు, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఓటేసిన ప్రముఖులు కాగా మూడో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బహుజనన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆశాభావం ఈ సందర్భంగా ప్రధాన పక్షాలన్నీ అధికారం తమదేనని ఘంటాపథంగా చెప్పాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ‘బీఎస్పీ 300 సీట్లను సాధించి ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా యూపీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికే ప్రజలు పట్టం కడతారని ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. అఖిలేశే మళ్లీ సీఎం: ములాయం యూపీకి అఖిలేశ్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ గాంధీలు ఎవరికి ఓటేశారో! యూపీ మూడో దశ పోలింగ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు ఓటేశారు. వీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారులు కాదులెండి. లక్నోలోని ఓ కుటుంబంలోనూ రాజీవ్ గాంధీ (46), సంజయ్ గాంధీ (45), సోనియా గాంధీ (40)లు ఉన్నారు. రాజీవ్, సంజయ్లు అన్నదమ్ములు కాగా, సోనియా మాత్రం ఇక్కడ సంజయ్ భార్య. మరి ఈ గాంధీలను ఎవరికి ఓటేశారని అడగ్గా బయటకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్ ఎంతంటే?
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 61.16శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దఫా పోలింగ్లోనే హోంమంత్రి రాజ్నాథ్ లోక్సభ స్థానమైన లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 2.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటావా.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్ప్రతాప్ యాదవ్ది మైన్ పురి జిల్లా. దీంతో మూడో దఫా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
యూపీ ‘మూడో దశ’ నేడు
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 69 స్థానాలకు ఆదివారం జరగనున్న ఈ దశ పోలింగ్లో హోంమంత్రి రాజ్నాథ్ లోక్సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ దశ పోలింగ్లో 2.41 కోట్ల మంది ఓటర్లు 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మొత్తం 25,603 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇటావా... ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్ప్రతాప్æ యాదవ్ది మైన్ పురి జిల్లా. దీంతో ఈ దశ అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు
యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ న్యూఢిల్లీ: ఫిబ్రవరి 23న జరగనున్న యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 189 మంది కోటీశ్వరులు, 116 మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఎన్నికల పర్యవేక్షణ, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) మొత్తం 680 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది. వీరిలో బీజేపీ అభ్యర్థులు 36 మంది, బీఎస్పీ అభ్యర్థులు 45 మంది, ఎస్పీ అభ్యర్థులు 26 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 17 మంది, ఆర్ఎల్డీ అభ్యర్థులు ఆరుగురు, 25 మంది స్వతంత్ర అభ్యర్థులు కోటీశ్వరులని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర(రూ.70 కోట్లు), బీజేపీ అభ్యర్థి నంద్ గోపాల్ గుప్తా నంది(రూ.57 కోట్లు), బీఎస్పీ అభ్యర్థి మహమ్మద్ మస్రూర్ షేక్(రూ.32 కోట్లు) అత్యధిక ధనికుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. నేర చరిత్ర కలవారి విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థులు 19 మంది, బీఎస్పీ అభ్యర్థులు 12 మంది, 9 మంది ఆర్ఎల్డీ, 13 మంది ఎస్పీ, 8 మంది కాంగ్రెస్, 24 మంది స్వతంత్ర అభ్యర్థులపై పలు రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
అఖిలేశ్ ‘పని’కి పరీక్ష!
నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార సమాజ్వాదీ పార్టీకి ఈ మూడోదశ ఎన్నికలు చాలా కీలకం. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటున్న సీఎం అఖిలేశ్ యాదవ్.. ‘పనే మాట్లాడుతుంది’ (కామ్ బోల్తాహై) అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అఖిలేశ్ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది రాజధాని లక్నోలోనే. ఆదివారం ఎన్నికలు జరగనున్న మూడోదశలో లక్నో కూడా ఉంది. బీజేపీ కంచుకోట బద్దలు అడ్వాణీ రామజన్మభూమి ఉద్యమ ప్రభావం కారణంగా.. గత ఎన్నికల వరకు లక్నో బీజేపీకి కంచుకోట. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన తర్వాత యూపీలో ఎవరు అధికారంలో ఉన్నా లక్నోలో బీజేపీ హవా నడిచింది. దీనికి తోడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లక్నో ఎంపీ కావటంతో పరిస్థితి పూర్తిగా కమలానికి అనుకూలంగా ఉండేది. కానీ 2012లో సమాజ్వాదీ పార్టీ.. కమలం కంచుకోటను బద్దలుకొట్టి ఇక్కడున్న 9 సీట్లలో ఏడింటిని గెలుచుకుంది. అయితే లక్నోను అభివృద్ధి బాట పట్టించిన అఖిలేశ్.. ఈ ఎన్నికల్లోనూ తన సీట్లను కాపాడుకోగలిగితే తను చెబుతున్న ‘పనే మాట్లాడుతుంది’ అనే నినాదం విజయవంతమైనట్లే. లక్నోలో మెట్రోరైలు ప్రారంభం అఖిలేశ్ డైనమిజానికి నిదర్శనం. హైదరాబాద్, కొచ్చిల్లో ఏళ్ల తరబడి మెట్రోరైలు నిర్మాణం కొన‘సాగు’తుంటే.. వేగంగా 8.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసిన ఘనత అఖిలేశ్దే. ట్రయల్ రన్ నడుస్తున్న ఈ స్ట్రెచ్లో మార్చిలో మెట్రో పరుగు ప్రారంభం కానుంది. లక్నో–ఆగ్రా ఎక్స్ప్రెస్వే అఖిలేశ్ సాధించిన మరో విజయం. గోమతి తీరం, జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్ అభివృద్ధి కూడా ఎస్పీ ప్రచారంలో కీలకంగా మారాయి. బడీ దీదీ వర్సెస్ ఛోటీ బహు లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో బీజేపీ తరపున రీటా బహుగుణ జోషి , ములాయం చిన్నకోడలు అపర్ణ యాదవ్ (ఎస్పీ) మధ్య పోటీ ఆసక్తి కరంగా మారింది. యాదవ కుటుంబంలో వివాదం తర్వాత అంతా సర్దుకుందని చెప్పుకునేందుకు అఖిలేశ్.. అపర్ణకు సీటిచ్చారు. దీంతో లక్నో కంటోన్మెంట్లో పోటీ బడీ దీదీ (రీటా బహుగుణ) వర్సెస్ ఛోటీ బహు (అపర్ణ)గా మారింది. మరోవైపు, లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుంచి ములాయం మేనల్లుడు అనురాగ్ యాదవ్పై కామన్ వెల్త్ మెడలిస్ట్ స్వాతి సింగ్ బీజేపీ (రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు) తరçఫున పోటీ చేస్తున్నారు. లక్నోలోని వివిధ నియోజకవర్గాలనుంచి ముగ్గురు ఎస్పీ మంత్రులు సహా పలువురు మహామహులు బరిలో ఉన్నారు. అయితే లక్నోకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఎస్పీని గెలిపిస్తే.. రెండోసారి సీఎంగా మరింత ముందుకు తీసుకెళ్తానని అఖిలేశ్ ప్రచారంలో ప్రజలను కోరుతున్నారు. మోదీకి దీటైన జవాబులు 2014లో బీజేపీ యూపీలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి వేరుగాఉంది. మోదీ విమర్శలకు రాహుల్, అఖిలేశ్, డింపుల్ యాదవ్ కూడా తమదైన శైలిలో దీటైన సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు, 2014 ఎన్నికలకు ఇప్పటికీ ప్రముఖమైన తేడా ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిశోర్ (పీకే). ‘కామ్ బోల్తాహై’ అని అఖిలేశ్ అన్నా.. ‘మన్ కీ బాత్ కాదు కామ్ కీ బాత్’ అని డింపుల్ నినదించినా అది ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగమే. అటు ప్రియాంక గాంధీ కూడా మోదీ విమర్శలను చాలా వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. తను దత్తపుత్రుడినని మోదీ చెప్పిన మరుక్షణమే.. ‘రాహుల్, అఖిలేశ్ వంటి సొంత పుత్రులుండగా.. దత్తపుత్రుల పని యూపీకి లేదు’ అని దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. - యూపీ నుంచి కె.రామచంద్రమూర్తి -
ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు!
అఖిలేశ్పై ములాయం వ్యాఖ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఉమ్మడి వెళుతున్న సమాజ్వాదీ-కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ మాత్రమే లబ్ధి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. 'ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ఎలాంటి బలం లేదు. ఈ పొత్తు వల్ల ఆ పార్టీ పునరుత్తేజం పొంది కొన్ని స్థానాలు గెలుపొందవచ్చు. కానీ పోటీ మాత్రం ఎస్పీ-బీజేపీ మధ్యే ఉంటుంది' అని ఆయన స్పష్టం చేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనయుడు అఖిలేశ్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయడంపై తనకెలాంటి విచారం లేదని పేర్కొన్నారు. 'నిజానికి నేనే అఖిలేశ్ను ముఖ్యమంత్రిని చేశాను. నాకు తెలుసు అప్పుడు నేను చేయకుంటే.. అతను ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు' అని పేర్కొన్నారు. తమ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుందన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. టికెట్ రాని కొందరు ఆగ్రహంతో ఉన్నారు తప్ప కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. -
యూపీకి దత్తపుత్రుడు అక్కర్లేదు
► ఇక్కడ సమర్థులైన యువకులు ఉన్నారు ► బయటి వారి సహాయం వారికి అక్కర్లేదు ► ప్రధాని మోదీపై ప్రియాంకా వాద్రా విమర్శలు ► రాహుల్తో కలసి రాయ్బరేలీలో ప్రచారం రాయ్బరేలీ: ఉత్తరప్రదేశ్కు దత్తపుత్రుని అవసరం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా స్పష్టం చేశారు. యూపీలో చాలా మంది సమర్థులైన యువకులు ఉన్నారని, బయటి నుంచి వచ్చిన నాయకుడు యూపీకి అవసరం లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లో సోదరుడు రాహుల్గాంధీతో కలసి తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూపీ ఎన్నికల సందర్భంగా తన తొలి ప్రసంగంలో ఆమె కొద్దిసేపే మాట్లాడినా.. అందరినీ ఆకట్టుకున్నారు. తాను ఉత్తరప్రదేశ్కు దత్త పుత్రుడినని ప్రధాని మోదీ ప్రకటించుకోవడంపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. ‘‘గతంలో ప్రధాని మోదీ వారణాసి తనను దత్తత తీసుకుందని, వారణాసికి తాను దత్త పుత్రుడినని చెప్పారు. వారణాసిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నా ఉద్దేశం ప్రకారం.. బయటి నుంచి వచ్చిన నాయకుడు యూపీకి అవసరమా’’ అని సభికులను ప్రియాంక ప్రశ్నించారు. ‘‘మోదీజీ.. బయటి వారిని దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి యూపీకి ఉందా..? ఇక్కడ సమర్థులైన యువకులు లేరా? అలాంటి సామర్థ్యం కలిగిన రాహుల్, అఖిలేశ్ మీ ముందు ఉన్నారు. వారి హృదయంలోనూ.. ఆలోచనల్లోనూ యూపీయే ఉంది. యూపీలోని ప్రతి ఒక్క యువకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయగలరు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగగలరు. ఇదే రాహుల్, అఖిలేశ్ కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే మోదీ అనేక శుష్క వాగ్దానాలు చేశారని, చాలా సంవత్సరాలు గడిచిపోయాయని, వీటి గురించి వారణాసి ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మూడేళ్లుగా ప్రధానిగా ఉన్నా మోదీ సొంత నియోజకవర్గం వారణాసికి ఏమీ చేయలేదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏం చేశారో అమేథీ ప్రజలను అడిగితే ఇప్పటికీ చెపుతారని వివరించారు. మహిళలను మోదీ సోదరీమణులు, అమ్మలు అని సంబోధించడంపై ప్రియాంక స్పందిస్తూ.. వారిని బంధుత్వంతో దగ్గర చేసుకోవాలని ప్రయత్నించక్కర్లేదని, వారికి ఏం కావాలో తెలియాలంటే వారి కళ్లల్లో చూస్తే చాలని పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై ఆమె స్పందిస్తూ.. పేద మహిళల కష్టం వృ«థాగా మారిపోయిందని, డబ్బుల కోసం వారు బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమికి ఘన విజయం కట్టబెట్టాలని, ప్రజల కోసం ఎవరు పనిచేస్తారో గుర్తించి వారికే ఓట్లేయాలని ప్రియాంక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన షారూక్ కాదు.. గబ్బర్సింగ్: రాహుల్ కాంగ్రెస్–ఎస్పీ బంధాన్ని సినిమాతో పోలుస్తూ మోదీ విమర్శలు చేయడంతో ఆయనకు అదే తరహాలో బదులిచ్చారు రాహుల్. బాలీవుడ్ సూపర్హిట్ మూవీ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో హీరో షారుఖ్ మాదిరి మోదీ అచ్చేదిన్ వస్తాయని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆయన షోలే సినిమాలో విలన్ గబ్బర్సింగ్లా మారారన్నారు. యూపీ అభివృద్ధిపై శూన్య వాగ్దానాలు చేస్తూ.. తనను తాను హీరోగా మోదీ భ్రమపడుతున్నారన్నారు. మోదీ ఎక్కడికి వెళితే అక్కడ సంబంధాలు కలుపుకుంటారని, వారణాసి వెళితే.. గంగ తన తల్లి అని, తాను వారణాసికి కుమారుడినని చెపుతారని, 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా వారణాసిని మారుస్తానని హామీ ఇచ్చారని, క్లీన్ గంగ, క్లీన్ ఘాట్స్, రింగ్రోడ్, ఫ్రీ వైఫై, భోజ్పురి ఫిల్మ్సిటీ ఇలా అనేక హామీలు ఇచ్చారని, కానీ తన తల్లికి ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా మోదీ పూర్తి చేయలేదని విమర్శించారు. -
బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్
మెయిన్ పురి: ఎన్నికల్లో ఓడిపోయామని బీజేపీ ముందే అంగీకరించిందని, అందుకే గతంలోని విషయాలను తిరగదోడుతోందని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. 1984లో కాంగ్రెస్ నేతలు ములాయం సింగ్ యాదవ్పై హత్యాయత్నం చేసినా, ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం గురించి ప్రధాని మోదీ చేసిన విమర్శలపై గురువారం కర్హాల్లో జరిగిన ప్రచార సభలో అఖిలేశ్ దీటుగా సమాధానమిచ్చారు. ఎప్పుడో జరిగిన విషయాల కంటే, ఫరియాబాద్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమను యూపీసీసీ చీఫ్ రాజ్బబ్బర్ ఓడించిన విషయాన్ని మోదీకి ఆయన సలహాదారులు వివరించాల్సిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తో పొత్తులో తన అనుభవలేమిని ప్రదర్శించారనే మోదీ విమర్శపై మాట్లాడుతూ.. సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) తొక్కడాన్ని తాను బాగా నేర్చుకున్నానని, తన వేగానికి దరిదాపుల్లో కూడా ఏనుగు (బీఎస్పీ గుర్తు) గాని, కమలం (బీజేపీ గుర్తు) గాని రాలేవన్నారు. -
చిన్న తేడాతో గెలుపు గల్లంతే
► విజయావకాశాల్ని నిర్దేశిస్తున్న ఓట్లశాతంలో స్వల్ప తేడా ► గత ఫలితాల్ని ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు లక్నో: ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరులో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ అంతరానికి కారణమవచ్చంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల ఆలోచనా ధోరణిలో చిన్న మార్పు పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితా లు అందుకు నిదర్శనంగా వారు ఉదహరిస్తున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 30 శాతం, ఎస్పీ 26 , బీజేపీ 17, కాంగ్రెస్ 8.5 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. అప్పుడు సమాజ్వాదీ గెలుపొందిన స్థానాలు 97. ఐదేళ్ల అనంతరం 2012లో ఎస్పీ కేవలం అదనంగా మూడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని 97 స్థానాల నుంచి రికార్డు స్థాయిలో 224 స్థానాలకు ఎగబాకింది. 2007తో పోల్చితే బీఎస్పీ 4.5 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా సాధించినా.... ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 206(2007) నుంచి 80కు పడిపోయాయి. లోక్సభ ఎన్నికల్లోను... ఇక 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 (18.25 ఓట్లశాతం), ఎస్పీ 23 (23.26%) స్థానాలతో మంచి ఫలితాలు సాధించాయి. బీఎస్పీ 20 (27.42%) స్థానాలకు పరిమితం కాగా... బీజేపీ కేవలం 10 (17.5%) స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారమారయ్యాయి. బీజేపీ ఓట్లశాతం 42.6కు ఎగబాకడంతో 71 స్థానాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తుచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... మొత్తం 403 గాను 80 శాతం స్థానాల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఎస్పీ 42 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ కేవలం 9 స్థానాల్లో ఆధిక్యం కనపరిచాయి. కోడలు, తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... కోడలు, తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. వారిద్దరి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన... ఆ రెండు స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ్ముడు శివ్పాల్ యాదవ్ పోటీచేస్తున్న జశ్వంత్నగర్లో ప్రచారం చేస్తూ... ఈ ఎన్నికలు తనకు, శివ్పాల్కు ఎంతో ముఖ్యమైనవన్నారు. కోడలు అపర్ణ విజయంతో తన గౌరవం ముడిపడిఉందంటూ ఉద్వేగంగా చెప్పారు. 2014 కంటే 10% తగ్గినా.. విశ్లేషకుల అంచనా ప్రకారం... 2014 లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 10 శాతం తగ్గినప్పటికీ అధికార పీఠం దక్కించుకునే అవకాశాలున్నాయి. బీజేపీ 32 శాతం ఓట్లు సాధిస్తే మెజార్టీకి అవసరమైన 202 సీట్లను సులువుగా గెలుచుకోవచ్చు. 2014 లోక్సభ ఎన్నికల్లో అప్నాదళ్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోను ఆ స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఓబీసీల్లో పట్టున్న అప్నాదళ్తో పొత్తు తమకు లాభిస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. -
కృష్ణుడలా.. నేనిలా..!
యూపీ ప్రచారంలో కృష్ణుడితో పోల్చుకున్న మోదీ ► ఉత్తరప్రదేశ్ దత్తపుత్రుడిని.. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను ► బీజేపీకి మెజారిటీ ఇవ్వండని ప్రజలకు పిలుపు హర్దోయ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను కృష్ణ భగవానుడితో పోల్చుకున్నారు. కృష్ణ భగవానుడిలానే తనకూ గుజరాత్, యూపీలతో విడదీయలేని సంబంధం ఉందన్నారు. ‘కృష్ణ భగవానుడు ఉత్తర ప్రదేశ్లో జన్మించాడు. గుజరాత్ను కర్మభూమిగా మార్చుకున్నాడు. అలాగే నేను గుజరాత్లో పుట్టాను. ఉత్తరప్రదేశ్ నన్ను దత్తత తీసుకుంది. వారణాసి నుంచి పోటీ చేశాను. ఉత్తరప్రదేశ్ నా అమ్మానాన్న వంటిది. తల్లిదండ్రులను విస్మరించే కొడుకును కాదు నేను. మీరు నన్ను దత్తత తీసుకున్నారు. మీకోసం కృషి చేయాల్సిన బాధ్యత నాది’ అని భావోద్వేగంతో అన్నారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ యూపీకి తాను ‘దత్త పుత్రుడిని’ అని అన్నారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కాంగ్రెస్ పార్టీలను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని.. అభివృద్ధిలో వెనకబడి పోతుందని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లను ఓడించండి ‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చేట్టుగా ఓట్లేసి గెలిపించండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ వచ్చే ఐదేళ్లలో పరిష్కారం చూపుతానని హామీ ఇస్తున్నాను. ఇది గంగ, యమున నదులతో అలరారే నేల. కోట్లాదిమంది కృషితో సారవంతమైన భూమి ఇది. అయినా ఇంకా పేదరికం ఉంది. ఎందుకిలా? ఇక్కడ వనరుల కొరత లేదు. ఇక్కడి ప్రజల్లో వెనుకబాటుతనం లేదు. వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. అయితే ఇక్కడి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే అసలు సమస్య. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. అవన్నీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే కృషి చేస్తున్నాయి. వాటిని తరిమి కొట్టేంతవరకు యూపీలో మార్పు రాదు’ అని మోదీ అన్నారు. కేంద్ర పథకాలను అమలు చేయని రాష్ట్రం సమాజ్వాదీ ప్రభుత్వం పలు కేంద్ర ప్రథకాలను రాష్ట్రంలో అమలు చేయలేదని మోదీ ఆరోపించారు. యూపీలో కేవలం 14 శాతం రైతులే పంట బీమా పథకం ప్రయోజనం పొందారన్నారు. ‘చేసిన పనే చెబుతుంది’ అంటున్న వారు బీమా విషయా న్ని రైతులకు చెప్పలేదంటూ పరోక్షంగా అఖిలేశ్ను విమర్శించారు. ఇక్కడి పోలీస్ స్టేషన్లన్నీ సమాజ్వాదీ పార్టీ కార్యాలయా లుగా మారిపోయాయని.. ఆ పార్టీ కార్యకర్తలే ఏ కేసు నమోదు చేయాలి.. వేటిని చేయకూ డదు అనేది నిర్ణయించే పరిస్థితి నెలకొంద న్నారు. అందుకే రాష్ట్రంలో అధికంగా రాజకీ య హత్యలు, సామూహిక అత్యాచారాలు చోటుచేసుకున్నాయని అన్నారు. దళితులపై వేధింపులు దేశంలో 20 శాతం ఇక్కడే చోటుచేసుకుంటున్నాయని.. అయినా ఎవరికీ శిక్షలు పడలేదన్నారు. చౌదరి చరణ్సింగ్ ప్రభుత్వం తర్వాత తమ హయాంలోనే ఎరువుల ధరలు తగ్గాయని గుర్తుచేశారు. కొడుకు ఏం చేయలేదు..దత్త పుత్రుడు అన్నీ చేస్తాడు బారాబంకిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల పట్ల ఏహ్యభావం ఏర్పడిందన్నారు. ‘అఖిలేశ్జీ.. ఐదేళ్ల కిందట మీరు పాలనా పగ్గాలు చేపట్టినపుడు ప్రజలు మిమ్మల్ని స్వాగతించారు. మీరు యువకులు కాబట్టి రాష్ట్రానికి ఏదైనా చేస్తారని భావించారు. ఇప్పుడు మీకు ఖాళీ లేదు కాబట్టి మార్చి 11 తర్వాతైన మీకు వ్యతిరేకంగా ప్రజల్లో ఇంతలా ఏహ్యభావం ఎందుకు ఏర్పడిందో ఆలోచించుకోండి’అని మోదీ అఖిలేశ్కు హితవు పలికారు. ‘యూపీ కొడుకు (అఖిలేశ్) ఏమీ చేయలేక పోయాడు. మీ దత్త పుత్రుడు (మోదీ) మాత్రం మీకోసం అన్నీ చేస్తాడు. పేదల దురవస్థ గురించి నేను పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు. అదంతా నా బుర్రలోనే ఉంటుంది’అని అన్నారు. -
ఆరు నెలల్లో కటకటాల్లోకి...
అధికారంలోకి వస్తే అసాంఘిక శక్తుల్ని అణచివేస్తాం ► అధికారంతో అఖిలేశ్ కళ్లు మూసుకుపోయాయి.. ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ లఖింపూర్ ఖేరి: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అఖిలేశ్ చూడలేకపోతున్నారని, అధికారంతో ఆయన కళ్లు మూసుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అధికారమిస్తే ఆరు నెలల్లో అసాంఘిక శక్తుల్ని అణచివేస్తామని హామీనిచ్చారు. యూపీలోని లఖింపూర్ ఖేరిలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ... గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో అఖిలేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ‘మన్ కీ బాత్’ను పరోక్షంగా విమర్శిస్తూ... ‘కామ్ కీ బాత్’ (ఉపయోపడే అంశం) గురించి మోదీ ఎప్పుడు మాట్లాడతారని అఖిలేశ్ ప్రశ్నించడాన్ని ప్రధాని తిప్పికొట్టారు. ‘ఆయన (అఖిలేశ్) అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయి కేంద్రం చేసిన అభివృద్ధిని చూడలేకపోతున్నారు’ అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, జైళ్ల నుంచే గ్యాంగ్లు కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ‘కిడ్నాపులు, అల్లర్లు కూడా ఎక్కువయ్యాయి. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి?’ అని ప్రశ్నించారు. పొత్తుతో పాపాలు కడుక్కోలేరు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశమివ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మాకొక అవకాశమివ్వండి... కత్తులు, పిస్తోలు వాడేవారిని ఆరు నెలల్లో కటకటాల్లోకి నెడతాం. చెరకు రైతుల బకాయిలు 14 రోజుల్లోగా చెల్లిస్తాం’ అని హామీనిచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చేసిన పాపాల్ని ఎస్పీ ప్రభుత్వం కడిగేసుకోలేదన్న విషయం మొదట దశ ఎన్నికల సరళిని బట్టి చూస్తే స్పష్టమైందన్నారు. బీఎస్పీ హయాంలో కుంభకోణాలపై విచారణ జరుపుతామన్న అఖిలేశ్ హామీలు ఏమయ్యాయని మోదీ ప్రశ్నించారు. మెట్రోపై తప్పుదారి పట్టిస్తున్నారు.. సోషలిస్టు నేతలు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్లు జీవితాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారని, ఇప్పుడు ఆ పార్టీతో జతకలసి వారిని అవమానించారని మోదీ పేర్కొన్నారు. లక్నో మెట్రో ప్రాజెక్టుపై అఖిలేశ్ ప్రచారాన్ని విమర్శిస్తూ...‘మెట్రో స్టేషన్ ఇంకా నిర్మాణంలో ఉండగా ఏ రైలైనా నడుస్తోందా? ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించడమే’నని చెప్పారు. వారి తీరుతో విసిగిపోయారు: అమిత్ షా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం అఖిలేశ్ల తీరుతో యూపీ ప్రజలు విసిగిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా విమర్శించారు. సంభాల్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘ఒకరితో అతని తల్లి నిరాశచెందితే... మరొకరు తండ్రిని ఇబ్బందిపెట్టారు’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. రేడియో అద్భుత సాధనం: మోదీ న్యూఢిల్లీ: సమాజంతో సంభాషించేందుకు, నేర్చుకునేందుకు, సంబంధాలు కొనసాగించేందుకు రేడియో ఓ అద్భుతమైన సాధనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విటర్లో స్పందించారు. ‘రేడియో ప్రేమికులకు శుభాకాంక్షలు. ఈ రంగంలో పనిచేసేవారు రేడియోను పునరుజ్జీవింపచేసేందుకు మరింత గొప్పగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించాలి. సమాజంతో అనుసంధానమయ్యేందుకు రేడియో గొప్ప సాధనం. మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారానే భారతీయులకు దగ్గరవుతున్నాను’ అని రెండు వేర్వేరు ట్వీట్లలో మోదీ తెలిపారు. -
రెబల్స్ చేతిలో ఫలితం
ఉత్తరాఖండ్ ఎన్నికల ముఖచిత్రం ► కాంగ్రెస్, బీజేపీలకు రెబల్ అభ్యర్థుల సెగ ► కమలానికి 16 స్థానాల్లో, హస్తానికి 12 స్థానాల్లో చిక్కు చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు రెబల్ అభ్యర్థుల నుంచి పెద్ద చిక్కు ఎదుర్కొంటున్నాయి. 16 ఏళ్ల చరిత్రలో 8 మంది సీఎంలను చూసిన ఈ రాష్ట్రంలో తాజా ఫలితాన్ని రెబల్ అభ్యర్థులే నిర్ణయించే స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలుం డగా, కర్ణప్రయాగ్ కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కన్వాసీ చనిపోవడంతో 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్న బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో రెబల్ అభ్యర్థులను ఎదుర్కొంటున్నాయి. పార్టీ అభ్యర్థులను ఓడించడానికి రెబల్స్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బుధవారం జరిగే ఎన్నికల్లో దాదాపు 74 లక్షల మంది ఓటర్లు.. 628 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. బీజేపీకి కీలకం: ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి కీలకంగా మారాయి. గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. పంజాబ్లో అకాలీ–బీజేపీ కూట మి గెలుస్తుందనే ఆశల్లేవు. యూపీ ఫలితం కూడా అనిశ్చితమే. దీంతో బీజేపీని ఒక్క ఉత్తరాఖండే అదుకోవాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కమలదళ సారథి అమిత్ షా, మోదీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం హరీశ్ రావత్ కూడా దీటుగా తలపడుతున్నారు. ప్రధాని ఇప్పటివరకు ఐదు సభల్లో, రాహుల్ మూడు సభల్లో మాట్లాడారు. బయటివారికిచ్చి.. కాంగ్రెస్తో సమానంగా స్వపక్ష రెబల్స్తోనూ పోరాడాల్సిన అగత్యాన్ని బీజేపీ ఎదుర్కోంటోంది. రావత్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమిత్ షా చేసిన యత్నం బెడిసికొట్టడమే దీనికి కారణం. అమిత్ షా యత్నం వల్ల 12 మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీ ఫిరాయించారు. వారిని బీజేపీలో చేర్చుకోవాలని అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు చెప్పగా వారు తిరస్కరించారు. అయినా షా వెనక్కి తగ్గకుండా వారందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. వారికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన మరికొందరికి టిక్కెట్లివ్వాల్సి రావడంతో నలుగురు బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేకపోయారు. దీనికి తోడు ఇతర కారణాల వల్ల మొత్తం 16 స్థానాల్లో కాషాయదళంపై రెబల్స్ బరిలోకి దిగారు. కాంగ్రెస్లో..: ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రావత్ రెబల్ అభ్యర్థులతోనూ గట్టిగా తలపడుతున్నారు. అయితే బీజేపీతో పోలిస్తే రెబల్స్ సెగ కాంగ్రెస్కు తక్కువేనని చెప్పొచ్చు. ప్రచారాన్నంతా నెత్తి న వేసుకుని నడిపిస్తున్న రావత్ కాంగ్రెస్ గెలి చినా, ఓడినా అందుకు బాధ్యుడవుతారు. అగ్రవర్ణాల అధిపత్యం రాష్ట్ర జనాభాలో మాదిరే రాజకీయాల్లోనూ అగ్రవర్ణాల ప్రాబల్యం కొనసాగుతోంది. జనాభాలో 64 శాతం అగ్రవర్ణ ఠాకూర్లు, బ్రాహ్మణులే. ముస్లింలు 14 శాతం ఉండగా దళితుల జనాభా 16 శాతం. జవాన్ల రాష్ట్రం: రాష్ట్రంలో ప్రతి ఐదిళ్లలో ఒక ఇంటి నుంచి ఒకరు సైన్యంలో పనిచేస్తున్నారు. ఆర్మీలో 90 వేలు, పారామిలటరీలో 1.25 లక్షల మంది ఉత్తరాఖండ్ వారు న్నారు. దీంతో పార్టీల కన్ను వీరి కుటుం బాలపై పడింది. సైనికులకు ఒక ర్యాంకు–ఒక పింఛను(ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేసిన ఘనత తమదేనని బీజేపీ నేతలు అన్ని సభల్లోనూ ప్రస్తావిస్తున్నారు. హోరాహోరీ పోరు హోరాహోరీ ఎన్నికలకు చిరునామా అయిన ఉత్తరాఖండ్లో తాజా ఎన్నికల్లోనూ గట్టి పోటీ నెలకొంది. 16 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీగానీ, స్థిరమైన అధికారం గానీ దక్కలేదు. ఎన్డీ తివారీ మాత్రమే సీఎంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని (2002–2007) పూర్తి చేసుకున్నారు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్కు 32, బీజేపీకి 31 సీట్లు దక్కాయి. రెండు పార్టీలకు 31.13 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల సంఖ్యలో చెప్పాలంటే.. బీజేపీకంటే కాంగ్రెస్ కేవలం 27వేల ఓట్లను మాత్రమే ఎక్కువగా గెలుచుకుంది. 2007 ఎన్నికల్లో బీజేపీకి 31.6%, కాంగ్రెస్కు 29.9% ఓట్లు వచ్చాయి. - డెహ్రాడూన్ నుంచి కె. రామచంద్రమూర్తి -
రెండు స్థానాల్లో పోలింగ్ వాయిదా
న్యూఢిల్లీ: పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో యూపీ, ఉత్తరాఖండ్లలో ఒక్కో నియోజకవర్గంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన పోలింగ్ వాయిదావేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. యూపీలో ఆలంపూర్ నియోజకవర్గంలో ఎస్పీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి ఆదివారం గుండెపోటుతో కన్ను మూయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో కర్నాప్రయాగ్ సీటుకు బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న కుల్దీప్ సింగ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. పాఠశాలల్లోనే ‘ఎన్నికల అక్షరాస్యత’: ఈసీ విద్యార్థులకు ‘ఎన్నికల అక్షరాస్యత’పై అవగాహన కల్పించాలని కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. సానుకూలంగా స్పందించిన హెచ్చార్డీ మంత్రి.. దీనిపై నూతన విద్యారంగ విధానంలో మార్పుల సమయంలో పరిగణలోకి తీసుకోవాలని ఎన్ సీఈఆర్టీకి సూచించారని సమాచారం. -
చిన్న పార్టీలతో ఫలితం తారుమారు!
యూపీ ఎన్నికల బరిలో అనేక చిన్నా చితకా పార్టీలు ► అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం ► కుల ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్న పార్టీలు లక్నో: ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చిన్నా చితకా పార్టీలు అదృ ష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడమే కాక, అభ్యర్థుల విజయావకాశాల్ని కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలో కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా మరికొన్ని ప్రధాన పార్టీలకు మద్దతు ప్రకటించాయి. వివిధ కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. పీస్ పార్టీ, నిషాద్ పార్టీ, మహాన్ దళ్కు కొన్ని కులాల్లో మంచి పట్టుంది. రాష్ట్ర ఓటర్లలో 4.5 శాతం ఓట్లున్న మలాహ్ కులం (మత్స్యకారులు, పడవ నడిపేవారు) ఓట్లపై నిషాద్ పార్టీ ఎక్కువగా ఆధారపడింది. యూపీలోని నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 125 నియోజకవర్గాల్లో ఈ కులం ఓట్లు కీలకం కానున్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి రాజ్భర్ కులంలో మంచి పట్టుంది. అలాగే బదౌనీ, ఇటావా, బరేలీ, షాజహాన్ పూర్, ఫర్రుఖాబాద్ ప్రాంతాలపై మహాన్ దళ్ ఆశలు పెట్టుకోగా... శాక్య, మౌర్య, కుశ్వాహ, సైనీ వర్గాల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంది. అందుకే ఇటీవల బీఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరో నేత కేశవ్ ప్రసాద్మౌర్యను రాష్ట్ర విభాగం అధ్యక్షుడ్ని చేసింది. ముస్లింల్లో పీస్ పార్టీకి పట్టు ఇక ముస్లింల్లో మంచి పట్టున్న పీస్ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ముస్లిం ఓట్లు తమకే పడతాయని పీస్ పార్టీ ధీమాగా చెబుతోంది. ఇంతవరకూ ప్రధాన పార్టీలు లేవనెత్తని అంశాల్ని తెరపైకి తీసుకొస్తూ... పశ్చిమ ఉత్తరప్రదేశ్ వికాస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ నేతృత్వంలోని యూపీఏ మిత్రపక్షం అప్నాదళ్ పశ్చిమ యూపీలోని 10 స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది. మహిళలు, రైతుల సంక్షేమం కోసం మరికొన్ని: మహిళల భద్రత పశ్చిమ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎజెండా కావడంతో.. మహిళా శక్తికరణ్ పార్టీ ఆ అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు ప్రయత్ని స్తోంది. బ్రిజ్ క్రాంతిదళ్ నేతలు బ్రిజ్ ప్రాంత చరిత్రను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మధుర, జలేసర్, భరత్పూర్ తదితర ప్రాంతాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కాగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) వంటి పార్టీలు ఎన్నికల బరిలో లేకపోయినా పెద్ద పార్టీలకు ఓట్ల సాయం చేస్తున్నాయి. సమాజంలో వెనకబడ్డ వర్గాల సమస్యల్ని ప్రస్తావిస్తూ భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ, భారతీయ కర్యస్థ సేన, కిసాన్ మజ్దూర్ సురక్ష పార్టీ, భారతీయ భాయ్చరలు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ముజఫర్నగర్ అల్లర్ల తర్వాత తెరపైకి వచ్చినవే. మత సామరస్యత కోసం తమకు ఓటేయమని అభ్యర్థిస్తున్నాయి. కానరాని ప్రముఖులు ఈ సారి యూపీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రముఖుల సందడి తగ్గింది. మొదటి రెండు దశల ఎన్నికల ప్రచారానికి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలు దూరంగా ఉన్నారు. కావాలనే ములాయం ప్రచారానికి దూరం కాగా... అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనలేదు. తన కుమారుడికి రాంనగర్ సీటు ఇవ్వకపోవడంతో మరో సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ కూడా ప్రచారాన్ని విరమించుకున్నారు. బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ఈసారి ప్రచారానికి దూరమయ్యారు. -
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే...
► కాంగ్రెస్–ఎస్పీ పొత్తుపై మోదీ విమర్శలు ► యూపీలో అచ్చేదిన్ రాలేదంటే దానికి బాధ్యత అఖిలేశ్దే.. బదౌన్ (ఉత్తరప్రదేశ్): తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో ఇరు పక్షాలు జతకట్టాయని సమాజ్వాదీ–కాంగ్రెస్ పార్టీల పొత్తుపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘అఖిల్శ్.. అచ్చేదిన్ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. గత ఐదేళ్లుగా ఆయనే యూపీ సీఎం. మంచిరోజులు రాలేదని ప్రజలు ఆయనతో చెపుతున్నారంటే.. దానికి బాధ్యత ఆయనదే. దీనికి బీఎస్పీ, కాంగ్రెసూ కారణమే’’అని అచ్చేదిన్ హామీపై వెల్లువెత్తిన విమర్శలకు బదులిచ్చారు. అఖిలేశ్ చెపుతున్న ‘కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదం పంక్చర్ అవుతుందని, ఆయన చెపుతున్న మాటలు రాష్ట్రంలోని చెడునంతా ప్రజల కళ్లముందు ఉంచుతున్నాయన్నారు. శనివారం బదౌన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. మాయావతి ప్రభుత్వం అవినీతి మయమని, దోషులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అఖిలేశ్ ఇప్పుటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ విషయంలోనూ మాయావతి, ములాయం ఒక్కటి కారని, కానీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తనపై కోపంతో వారిద్దరూ ఏకమయ్యారన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరుగుతున్న అవినీతి కారణంగా.. యూపీలో నిజాయితీ కలిగిన, అన్ని అర్హతలు ఉన్న ప్రజలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయండి రుద్రపూర్: ఉత్తరాఖండ్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న రాజకీయ సంకల్పం లేదని మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రగతి కోసం బీజేపీకి ఓటేయాలని రుద్రపూర్లో జరిగిన సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెమెరాల ముందు కూడా భయం లేకుండా లంచం తీసుకునే ‘బాహుబలి’లాంటి రాజకీయ నేతలను రాష్ట్రం వదిలించుకోవాలంటూ సీఎం హరీశ్ రావత్కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను మోదీ ప్రస్తావించారు. -
తొలిదశలో 64 శాతం పోలింగ్
► యూపీలో 73 నియోజకవర్గాలకు ముగిసిన ఎన్నికలు ► ఓటింగ్ స్వల్ప హింసాత్మకం లక్నో: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిదశ కింద శనివారం 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింసాత్మక ఘటనలు జరిగాయి. 64.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటరు స్లిప్లను దౌర్జన్యంగా లాక్కోవడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేష్ చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ మూడు శాతం పెరిగింది. ఈ దశలో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు కాగా వారిలో 1.17 కోట్ల మంది మహిళలు. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల సంఘం ఇక్కడ రూ.9.56 కోట్ల నగదు, 14కోట్ల విలువైన 4.44 లక్షల లీటర్ల మద్యం, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. శనివారం హాపూర్, షామ్లీ, ముజఫర్నగర్, బాగ్పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలీగఢ్, మథుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఎటా, కాస్గంజ్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం జిల్లాలు 75. మీరట్, బాగ్పట్లో ఘర్షణలు... బాగ్పట్లో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. బాగ్పట్ జిల్లాలోని మరో గ్రామంలో ఆర్ఎల్డీ కార్యకర్తలు దళితులను ఓటు వేయకుండా అడ్డుకోగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరట్లో ఓ బీజేపీ నేత సోదరుడు పోలింగ్ బూత్కు తుపాకీ తేవడంతో పోలీసులు అరెస్టుచేశారు. తొలిదశలోని ప్రముఖులు వీరే... తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తనయుడు పంకజ్ సింగ్ (నోయిడా), కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ (మధుర), బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్శర్మ, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కూతురు మృగాంకా సింగ్ (కైరానా), బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ (మీరట్), ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ (సికింద్రాబాద్), రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్సింగ్ మనవడు సందీప్ (అత్రౌలి) తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు. బీజేపీ ఖాతాలోకి 3 ఎమ్మెల్సీలు రాష్ట్రంలోæ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. బీజేపీకి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. కాన్పూర్, బరేలీ, గోరఖ్పూర్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం, పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మోదీ తీసుకొచ్చిన పథకాలే తమను గెలిపించాయని అభ్యర్థులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటమే.. యూపీలో మళ్లీ కమలం వికసించేందుకు సంకేతమని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. -
యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9గంటలకు 10.56 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముజఫర్నగర్ సహా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్పై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. (చదవండి : 'ఉత్తర'దిశ చూపే ‘పశ్చిమం’! ) కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
ఆయనవి చిన్న పిల్లల చేష్టలు
కావాలంటే కంప్యూటర్లో శోధించండి..తనపైనే ఎక్కువ జోకులు ► యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విసుర్లు బిజ్నూర్: మాజీ ప్రధాని మన్మోహన్ ను ఉద్దేశించి చేసిన రెయిన్ కోట్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోకులు పేల్చారు. ‘కాంగ్రెస్లో ఓ నాయకుడు ఉన్నాడు. ఆయన చర్యలన్నీ చిన్న పిల్లల చేష్టలే. మీరు కంప్యూటర్లో శోధిస్తే.. ఆయనపై ఉన్నన్ని జోకులు మరే నేతపైనా మనకు కనిపించవు’ అని రాహుల్పై పరోక్షంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయనతో జతకట్టిన అఖిలేశ్ జ్ఞానం పైనా అనుమానాలు కలుగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం బిజ్నూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్–సమాజ్వాదీ పార్టీ పొత్తుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘ ఆ రెండు కుటుంబాలు విడిగా ఉన్నప్పుడే రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశాయి. ఇప్పుడా రెండు చేతులు కలిపాయి. యూపీని కాపాడాలంటే ఆ రెండు కుటుంబాలను దూరం పెట్టాలి’ అని ఎస్పీ, కాంగ్రెస్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం అఖిలేశ్యాదవ్ గురించి తనకు పెద్దగా తెలియదని, కొన్ని సమావేశాల్లో మాత్రమే కలిశానని, ఆయన అందించిన నివేదికలు చూసిన తర్వాత చదువుకున్న యువకుడిగా.. కొత్త విషయాలు తెలుసుకునే ఔత్సాహికునిగా కనిపించారని.. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులే దూరంగా ఉండే నేతతో జతకట్టడం చూస్తోంటే ఆయన జ్ఞానంపైనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్, ఎస్పీలు ప్రభుత్వాలను నడిపించడం తమ కుటుంబ హక్కుగా భావిస్తున్నాయని, సామాన్యులు పదవులు దక్కించుకుంటే చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. శనివారం జరగనున్న తొలి విడత, 15న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో జాట్ సామాజికవర్గం ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే జాట్ నాయకుడు చరణ్సింగ్ పేరిట రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని, చిన్న, మధ్య తరగతి రైతుల రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దేవభూమి పవిత్రతను దెబ్బ తీశారు హరిద్వార్: ఉత్తరాఖండ్లోనూ మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరిద్వార్లోని రిషికుల్ మైదాన్ లో బీజేపీ విజయ్ సంకల్ప్ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవభూమి పవిత్రతను దెబ్బ తీసిన ప్రభుత్వానికి చరమగీతం పాడి.. అటల్బిహారీ వాజ్పేయి కలలుగన్న ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఉత్తరాఖండ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ ఏర్ప డి పదహారేళ్లు అయ్యిందని, 16 ఏళ్ల వయసు ప్రతి వ్యక్తి జీవితంలోనూ కీలకమైన సమయమని, రానున్న ఐదేళ్లు రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించే కాలమని చెప్పారు. ఉత్తరాఖండ్లో అవినీతి కోర్టుల్లో నిరూపణ కాకపోయి నా.. దేశమంతా టీవీల్లో చూసిందని చెప్పారు. ఉత్తరాఖండ్ గౌరవాన్ని కాపాడేందుకు.. వాజ్పేయి దార్శనికతను నిజం చేసేందుకు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. -
నేడే యూపీ తొలిదశ
పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్నగర్లోని 887 పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్బుద్ధ నగర్ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎస్పీ–కాంగ్రెస్కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మమద్ నూరూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు. -
దిశ చూపే ‘పశ్చిమం’!
కీలకంగా తొలి దశ పోలింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నిర్ణయాత్మకమైనది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 సీట్లకు శనివారం జరిగే తొలి విడత పోలింగ్ సరళి ప్రభావం మిగిలిన దశల పోలింగ్పై ఉంటుందని రాజకీయపక్షాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న పశ్చిమ యూపీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రాష్ట్రంలో ముస్లింల జనాభా 18 శాతం ఉండగా, ఇక్కడ అది 26 శాతం. మాజీ ప్రధాని చరణ్సింగ్, ఆయన కొడుకు ఆరెల్డీ నేత అజిత్సింగ్ వంటి నేతల జాట్ సామాజికవర్గం ఉన్నదీ ఇక్కడే. రైతుల విషయంలో పాలకపక్షం విధానాలు ఇక్కడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. నరేంద్ర మోదీ గాలి వీచిన 2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం పది లోక్సభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రాంతీయపక్షాలు ఎస్పీ, బీఎస్పీలకు 24 సీట్ల చొప్పున దక్కగా, బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకుంది. జాట్ల ఓట్లే పునాదిగా ఉన్న ఆరెల్డీకి 9, కాంగ్రెస్కు 5 సీట్లు లభించాయి. గతంలో ఎస్పీకి లాభం.. 2012లోనూ యూపీ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఆ దశలో ఓట్లు సమాజ్వాదీ పార్టీకి పడ్డాయంటూ జరిగిన ప్రచారం మిగతా విడతల పోలింగ్పై కనిపించిందని విశ్లేషకులు నిర్ధారించారు. ఎస్పీ మిగిలిన దశల్లో మరింత బాగా పుంజుకుని రికార్డు స్థాయిలో 224 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఓటు ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది కీలకాంశంగా మారింది. నవంబర్, డిసెంబర్లో ఎస్పీ యాదవ పరివారంలో జరిగిన కీచులాటలు చివరికి సుఖాంతమవడంతో ఈ పార్టీకి జనాదరణ పెరుగుతోందని వార్తలొస్తున్నాయి. ‘అఖిలేశ్ మంచివాడేగాని, చివరి రెండేళ్లలోనే బాగా పనిచేశాడు’అ ని ఈ ప్రాంతంలో కొందరంటున్నారు. తగ్గిన బీజేపీ హవా..: ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి అంత జనాదరణ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్తో తొలిసారి చేతులు కలిపిన ఎస్పీ, ఒంటరిగా బరిలో ఉన్న బీఎస్పీ బలాన్ని వారు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. బీసీల్లో ప్రధాన వర్గమైన యాదవుల జనాభా పశ్చిమ యూపీలో నామమాత్రం కావడంతో ఎస్పీకి విజయావకాశాలు తక్కువ. బీఎస్పీకి పునాదివర్గమైన దళితుల్లోని చమార్లు(జాటవ్లు) ఈ ప్రాంతంలో ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం దళితుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. ఈ పార్టీ చీఫ్ మాయావతి తల్లిదండ్రులు ఇక్కడి ఘజియాబాద్ జిల్లాకు చెందినవారు. 2013లో జరిగిన ముజఫర్నగర్ మతఘర్షణల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో జాట్లతోపాటు మెజారిటీ హిందూ ఓటర్లు కమలానికి ఓటేశారు. జాట్లకు బీసీ హోదా దక్కకపోవడం, రైతు సమస్యలు తీరకపోవడంతో గ్రామీణులు బీజేపీకి దూరమయ్యారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బీఎస్పీకి బుఖారీ మద్దతు
పశ్చిమ యూపీలో ముగిసిన ప్రచార పర్వం లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం మౌలానా అహ్మద్ బుఖారీ ప్రకటించారు. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ మద్దతు ఇచ్చిన మర్నాడే బుఖారీ మద్దతు ప్రకటించడంతో బీఎస్పీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. గురువారం బుఖారీ మాట్లాడుతూ.. ‘ముస్లింలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. బీఎస్పీకి మద్దతు ఇవ్వనున్నారు. లేకుంటే ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలను తమ ప్రయో జనాల కోసం ఫుట్బాల్లా వాడుతుంది. అఖిలేశ్ హయాంలో ముస్లింలు వివక్షకు గురయ్యారు. అఖిలేశ్ ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడని ములా యం చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం’అని పేర్కొన్నారు. పశ్చిమ యూపీలో త్రిముఖ పోటీ పశ్చిమ యూపీలో తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ ప్రాంతంలోని 73 స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ విస్తృత ప్రచారం నిర్వహించారు. నోట్లరద్దుతో అవినీతిపై కొరడా ఝళిపించిన బీజేపీకి ఓటేయాలని కోరారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఎస్పీ, బీఎస్పీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘తుపాను’లోనూ సైకిల్ రయ్ రయ్!
మోదీ వ్యాఖ్యపై సీఎం అఖిలేశ్ సీతాపూర్/లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’లోనూ ఎస్పీ సైకిల్ను ఎలా ముందుకు పోనివ్వాలో పార్టీ శ్రేణులకు తెలుసని సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీతాపూర్, లఖింపూర్ ఖేరిల్లో సమాజ్వాదీ పార్టీ నిర్వహించిన ప్రచార సభల్లో అఖిలేశ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ చేయి కలపడంతో ఎస్పీ సైకిల్ వేగం పెరగనుంది. స్నేహహస్తమిచ్చిన కాంగ్రెస్కు ఎక్కువ సీట్లిచ్చాం. ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’ దెబ్బకు సీఎం ఎగిరిపోతారని మోదీ అంటున్నారు. కానీ అంతటి గాల్లోనూ సైకిల్ సవా రీ ఎలాగో సమాజ్వాదీలకు తెలుసు. యూ పీలో అధికారపక్షానికి వ్యతిరేకంగా బలమైన గాలులు వీస్తున్నాయని మోదీ భావిస్తే, పంజాబ్లో కూడా అధికారపక్షానికి వ్యతిరేకంగా గాలులువీస్తున్నాయనే విషయం మోదీ గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. ములాయం ప్రచారం: ఎస్పీ–కాంగ్రెస్ కూట మిపై మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్ ‘యూ టర్న్’ తీసుకున్నారు. రేపటి నుంచి అఖిలేశ్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. -
‘తప్పులు చేసే మోదీకి స్కామ్లే కనిపిస్తాయి’
కాన్పూర్: ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా ప్రధాని మోదీ అభివర్ణించటాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం అఖిలేశ్లు ఆదివారం తిప్పికొట్టారు. మోదీ తప్పులు చేస్తున్నారు కాబట్టే ఆయనకు స్కామ్లు కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ల పొత్తు తో మోదీకి భయం పట్టుకుందనీ, బిహార్లో బీజేపీకి ఎదురైన పరాభవాన్ని ఉత్తరప్రదేశ్లోనూ పునరావృతం చేసి చూపించాలని రాహల్ ప్రజలను కోరారు. ‘స్కామ్’అం టే ‘సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్షా అండ్ మోదీ’అని అఖిలేశ్ కొత్త భాష్యం చెప్పారు. -
‘స్కామ్’ పార్టీలను వదిలించుకోండి
► ఓటర్లకు మోదీ పిలుపు ► ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా అభివర్ణన మీరట్: ఉత్తరప్రదేశ్ను అవినీతి పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను కోరారు. నోట్ల రద్దుతో తాను అవినీతిపరులను ‘దోచుకోవడం’తో వారు తనను అధికారం నుంచి దించేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ శనివారం మీరట్లో జరిగిన బీజేపీ ఎన్నికల సభతో తొలిసారి తన ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘యూపీని స్కామ్.. ఎస్ అంటే సమాజ్వాదీ, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేశ్, ఎం అంటే మాయావతి పార్టీల నుంచి విముక్తం చేయండి’ అని కోరారు. బీజేపీ అభివృద్ధి ఎజెండా కావాలో, నేరస్తులను కాపాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారు కావాలో తేల్చుకోవాలన్నారు. ‘నన్ను ప్రధానిని చేసింది యూపీనే.. ఇందుకు రుణం తీర్చుకుంటా.. ప్రస్తుతమిక్కడి ప్రగతి నిరోధక ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో కలసి పనిచేసే ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, చెరకు రైతులకు 14 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై.. మొన్నటివరకు పరస్పరం తిట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్లు రాత్రికి రాత్రి పొత్తుపెట్టుకున్నాయని మోదీ ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకోలేని వారు యూపీని కాపాడలేరని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి దగ్గర రూ. 150 కోట్లు దొరికినా, అతనిపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తన కుటుంబానికి, తనకు ప్రాధాన్యమిచ్చిన అఖిలేశ్ ఇప్పుడు అధికారంకోసం పరితపిస్తున్నారని విమర్శించారు. బాబాయి, అబ్బాయి, నాన్న, దాయాది వ్యవహారాలతో ప్రభుత్వం తీరికలేకుండా ఉందని, జనం తమ ఓట్లతో ‘స్కాం’ పార్టీలను నిర్మూలిస్తేనే మార్పు వస్తుందని ములాయం కుటుంబ గొడవలను ప్రస్తావిస్తూ అన్నారు. వనరులు ఉన్న యూపీ.. ప్రభుత్వాల నిర్వాకం వల్ల పేదరికం, నిరుద్యోగం నుంచి బయటికిరావడం లేదని, కేంద్రనిధులను అఖిలేశ్ సర్కారు సద్వినియోగం చేయడంలేదన్నారు. -
పంజాబ్లో ఆప్–కాంగ్రెస్ హోరాహోరీ!
► మీడియా సర్వే అంచనా ► పంజాబ్లో 75%, గోవాలో 83% పోలింగ్ న్యూఢిల్లీ/చండీగఢ్/పణజి: నోట్ల రద్దు పరిణామాలతో బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకంగా మారిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సంచలన తీర్పు ఇవ్వనున్నాయా? పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ)–బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోనుందా? విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మధ్య హోరాహోరీ పోరు సాగి, ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందా? శనివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మీడియా ప్రతినిధులు పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఫలితాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. అకాలీ–బీజేపీ, కాంగ్రెస్, ఆప్ల మధ్య త్రిముఖ పోటీలో ఆప్ పైచేయి సాధిస్తుందని పలువురు ఓటర్లు చెప్పారు. కాంగ్రెస్కు కూడా విజయావకాశాలు ఉన్నాయని కొందరు చెప్పగా, అధికార కూటమికి ఫలితాలు తీసికట్టుగా ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది చెప్పారు. మొత్తం 117 సీట్లకుగాను చీపురు పార్టీకి(ఆప్) దాదాపు 60, హస్తానికి 40 వస్తాయన్నారు. మార్పు కోసం తాము ఆప్ ‘జాడూ’కు ఓటేశామని పలువురు తెలిపారు. దాదాపు 800 జనాభా ఉన్న ఒక గ్రామంలో అయితే ఏకంగా 600 మంది కేజ్రీ పార్టీకి ఓటేసి ఉంటారని స్థానికులు చెప్పారు. పదేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చాలామందిలో కనిపించింది. రాష్ట్రం అవినీతి, నిరుద్యోగంతో కుదేలైందని, నోట్ల రద్దుతో చిన్నవ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. అవినీతి ప్రక్షాళనకు నడుం కట్టిన ఆప్కు ఒకసారి అవకాశమిచ్చి చూడాలనుకుంటున్నామని చెప్పారు. గత లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో 4 స్థానాలు గెలుచుకున్న ఆప్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి 112 సీట్లలో పోటీ చేసింది. దాని మిత్రపక్షం లోన్ ఇన్సాఫ్ 5 స్థానాల్లో బరిలో ఉంది. ప్రశాంతంగా పోలింగ్ నోట్ల రద్దు తర్వాత దేశంలో తొలిసారి శనివారం రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. పంజాబ్లో 75 శాతం, గోవాలో 83 శాతం మంది ఓటేశారు. 117 స్థానాలున్న పంజాబ్లో 1,145 మంది, 40 స్థానాలున్న గోవాలో 251 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పంజాబ్లో ప్రాథమిక వివరాల ప్రకారం సుమారు 75 శాతం పోలింగ్ నమోదైంది. సంగ్రూర్ జిల్లా సుల్తాన్ పూర్ గ్రామంలో ఆప్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు గాయపడ్డారు. తరన్ తారన్ జిల్లా లాలూ గుమాన్లో అకాలీదళ్ మద్దతుదారుడు పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని రోపోవాలి గ్రామంలో కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు. ‘సాంకేతిక’ ఇబ్బందులు పంజాబ్ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామో తెలియజేసే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) యంత్రాలను తొలిసారిగా వినియోగించారు. 6వేలకుపైగా పోలింగ్ బూత్లలో వాడారు. మజితా, సంగ్రూర్ల్లోని కొన్ని చోట్ల వీవీపీఏటీ యంత్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, దీనిని ఎన్నికల సంఘానికి తెలియజేశామని అధికారులు చెప్పారు. యంత్రాల్లో సాంకేతిక సమస్యలతో చాలా ప్రాంతాల్లో పోలింగ్కు అంతరాయం కలిగిందని పంజాబ్ ముఖ్య ఎన్నికల అధికారి వీకే సింగ్ చెప్పారు. అమృత్సర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరిగింది. పంజాబ్, గోవా ఎన్నికలు అద్భుతమని, అవి ఒక విప్లవంలా సాగాయని కేజ్రీవాల్ చెప్పారు. తామే అధికారంలోకి వస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగినందుకు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గోవాలో రికార్డు పోలింగ్ గోవాలో రికార్డు స్థాయిలో 83 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదవడం ఇక్కడ ఇదే మొదటిసారి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్తో పాటు ఎంజీపీ–శివసేన–జీఎస్ఎం పార్టీల కూటమి కూడా పోటీ పడటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగినా.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం 83 శాతం పోలింగ్ నమోదైనా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. పణజీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ బయట నిలబడిన 78 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో 81.8 శాతం పోలింగ్ నమోదైంది. -
రాయ్బరేలీ, అమేథీలకే ప్రియాంక పరిమితం
పణజీ: ప్రియాంకా గాంధీ తన రాజకీయ జీవితాన్ని ప్రస్తుతానికి అమేథీ, రాయ్బరేలీల వరకే పరిమితం చేసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. రాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి. -
పంజాబ్ ఎగ్జిట్పోల్ సర్వే.. బీజేపీకి షాక్!
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే- యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్పోల్ సర్వేలో బీజేపీకి షాకింగ్ ఫలితాలొచ్చాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో చతికిలపడుతుందని.. కేవలం 11-15 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కుతాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. పంజాబ్పై భారీ ఆశలు పెట్టుకున్న ఆప్కు కూడా అక్కడ ఆశించినమేర ఫలితాలుండవని సర్వేలో తేలింది. ఆ పార్టీకి 40 నుంచి 44 సీట్ల వరకు దక్కొచ్చని తేలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఆ పార్టీకి 60 నుంచి 65 సీట్లు దక్కుతాయని ఇండియా టుడే- యాక్సిస్ సర్వే ఫలితాలు తేల్చాయి. -
ఆర్బీఐపై మొట్టికాయలేసిన ఈసీ
న్యూఢిల్లీ: నగదు విత్ డ్రా లిమిట్ పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించడంపై ఎలక్షన్ కమిషన తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారం నగదు ఉపసంహరణ పరిమితి పెంపుపై ఆర్ బీఐ వైఖరిపై మండిపడిన ఈసీ మళ్లీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు మరో లేఖ రాసింది. నగదు విత్ డ్రా పరిమితులు ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా ఉండకూడదని మొట్టికాయలేసింది. ఈ చర్య సరైంది కాదనీ, అంగీకరించలేమని ఈసీ తెలిపింది. కనీసం చట్టబద్ధమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులకు నగదు విత్ డ్రాలపై నిరోధం ఉండకూడదని సూచించింది. నగదు ఉపసంహరణకు అనుమతి నివ్వాలని మరోసారి కోరింది. ప్రస్తుతం వారానికి ఉన్న రూ. 24 వేల పరిమితిని రూ. 2లక్షలకు పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయా అభ్యర్థులకు రూ. 28 లక్షల దాకా ఖర్చుచేసే హక్కు వుందని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్బీఐ తొందరపడిందని తన లేఖలో పేర్కొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు క్యాష్ విత్ డ్రా లిమిట్ ను పెంచేందుకు అంగీకరించాలని ఈసీ ఆర్బీఐకి లేఖ రాసింది. రాసింది. ఎన్నికల సందర్భంగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అనేక బిల్లులు ఉన్నాయని పేర్కొంది. అభ్యర్థులు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన ఈసీ ఆర్బీఐని ముందు ఒక లేఖ రాసింది. నిస్పాక్షికమైన ఎన్నికలు జరగాలంటే అభ్యర్ధుల విత్ డ్రా పరిమితిని పెంచాలంటూ ఈ లేఖలో పేర్కొంది ఈసీ. అయితే ఈ అభ్యర్థనను ఆర్ బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
గోవా కోరుకునే మార్పు ‘ఆప్’!
పణజీ: ‘గోవా మార్పును కోరుకుంటోంది. ఆ మార్పే ఆప్’ అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు దూసుకెళుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ వీధి వీధిన పోస్టర్లను అతికించడంతోపాటు పెద్ద పెద్ద హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేసింది. కొంకణి భాషలో ఎన్నికల పాటలను ప్రతి కూడలిలో వినిపిస్తోంది. గల్లీ గల్లీకి తిరగడమే కాకుండా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం సాగిస్తోంది. ప్రచార లోపం కారణంగా ఓడిపోరాదన్నది పార్టీ అభ్యర్థుల మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ఢిల్లీ నుంచే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఆప్ కార్యకర్తలు వచ్చి గోవాలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమెరికాలోని ఆప్శాఖ కార్యకర్తలు కొందరు గోవా వచ్చి ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుండగా, ఎక్కువ మంది అక్కడి నుంచి గోవాలోని 3.8 లక్షల ఫోన్లకు ఫోన్చేసి ఆప్ తరఫున ప్రచారం సాగిస్తున్నారు. తాను బెంగళూరు నుంచి 500 మంది కార్యకర్తలతోని గోవా ప్రచారానికి వచ్చానని రమేశ్ అనే ఆప్ కార్యకర్త మీడియాకు తెలిపారు. తాము ఎక్కువగా కర్ణాటక నుంచి వలసవచ్చిన ప్రజల ఓట్లపై దృష్టిని కేంద్రీకరించి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. గోవా సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షిస్తాం.. గోవాను సింగపూర్ నగరంగా మారుస్తామని, ఫ్రీవేలు, స్కైవేలు, క్యాసినోలు ఏర్పాటు చేస్తామంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుండగా, గోవాకున్న ప్రత్యేక గుర్తింపును, సాంస్కృతిక వారసత్వపు సంపదను పరిరక్షిస్తామన్న నినాదంతో ఆప్ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. బీజేపీ ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత ఆకర్షణ పథకాలను కొనసాగిస్తామని, నిరుద్యోగులకు నెలకు ఐదువేల రూపాయల భృతి కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తామని చెప్పింది. ఇక ఆప్ తరఫున పోటీ పడుతున్న అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. వారు ఇప్పటి వరకు 350కు పైగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. అరవింద్ కేజ్రివాల్ ఎనిమిది బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. అందరూ కొత్తవారే... రాష్ట్రంలోని 40 అసెంబ్లీ సీట్లకుగాను ఆప్ తరఫున 39 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్విస్ గోమ్స్ అనే క్రైస్తవుడు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 27 శాతం క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. ఆప్ అభ్యర్థులందరూ రాజకీయాలకు కొత్తే. వారికి రాజకీయపరమైన ఎలాంటి అనుభవం లేదు. ఇదే అంశాన్ని అరవింద కేజ్రివాల్ ఎన్నికల ప్రచార సభల్లో, మీడియా ఇంటర్వ్యూలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా, అవినీతి చరితలేని వారినే తమ పార్టీ బరిలోకి దించిందని ఆయన చెబుతున్నారు. ఎన్నికయ్యాక తమ ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేసినా వారిని పార్టీ కఠినంగా శిక్షిస్తుందని ఆయన హామీ కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ను ఎన్నికునే సంస్కృతిని ఇకనైనా వదులుకోవాలని, గోవా సంస్కృతి పరిరక్షణకు ఆప్ను గెలిపించాలని ఆయన కోరుతున్నారు. పాలక పక్ష బీజేపీ తరఫున 36 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున 37 మంది పోటీ చేస్తున్నారు. ఇక మహారాష్ట్రావాది గోమంతక్ పార్టీ, గోవా సురక్షా మంచ్, శివసేన కూటమి 35 సీట్లకు పోటీ చేస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది? గోవా ఎన్నికల బరిలోకి తొలిసారిగా ఆప్ దిగడం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూరుతోందని తామే విజయం సాధిస్తామని అధికార పార్టీ బీజేపీ వాదిస్తోంది. కొన్ని సర్వేలు కూడా ఆ పార్టీ వాదనతో ఏకీభవించాయి. ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్తో విసిగిపోయిన గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మొదట్లో రెండు సీట్లు కూడా రావన్నవారే ఖాయంగా 12 సీట్లు వస్తాయని ఇప్పుడు చెబుతున్నారని, దీనర్థం తమ గెలుపు ఖాయమని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అండర్ కరెంట్గా ఆప్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని, ఈ కారణంగా ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2015లో ఢిల్లీ ఆప్ సృష్టించిన చరిత్ర గోవాలో పునరావృతం అవుతుందేమో చూడాలి. -
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
-
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల చిత్రపటంలో ఓ ఆసక్తికరమైన అంశం నమోదైంది. ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటిస్తున్న వ్యక్తి షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి చౌదరి బహిరంగంగా ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో రావడానికి కారణం కేవలం డబ్బు సంపాదించడానికే.. ప్రజల్ని అవివేకులను (ఫూల్స్) చేస్తానంటున్నాడు. అంతేకాదు దాదాపు అందరూ రాజకీయాల్లోకి పరోక్షంగా అదే ఉద్దేశ్యం తో వస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోఅడుగు ముందుకేసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టి, విమర్శలు గుప్పించారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి...ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నపుడు ..తానెందుకు చేయలేనని ప్రశ్నించారు. తానూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటున్నారు .ప్రజలను ఫూల్స్ ని చేసిన ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. -
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటన మాజితా (పంజాబ్): ఫిబ్రవరి 4న పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా అమరీందర్ సింగ్ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా పంజాబ్కు వచ్చిన రాహుల్ మాజితా నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ప్రజల సహకారంతో అమరీందర్ మాత్రమే పంజాబ్ను మార్చగలరని అన్నారు. ‘పంజాబ్ను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే పాలిస్తారు. పంజాబ్ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. ‘రిమోట్ కంట్రోల్’ ద్వారా పంజాబ్లో పాలన నడవబోదు. తాము అధికారంలోకి వస్తే మత్తుపదార్థాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం’ అని రాహుల్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు ఏకకాలంలో సీఎం అవ్వాలని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘పంజాబ్ను అధికార బాదల్ కుటుంబం నాశనం చేస్తోంది. సామాన్య ప్రజల కోసం వీళ్లు చేసిందేమీ లేదు. కాని ప్రధాని వారికే మద్దతిస్తూ.. అవినీతిని నిర్మూలిస్తామంటున్నారు.’ అని ఆరోపించారు -
మార్పు దిశగా పంజాబ్!
పంజాబ్ నుంచి కె.ఆర్.మూర్తి పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనడంలో సందేహం లేదు. ప్రస్తుత అకాలీదళ్–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం స్థానంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం ఇంకా సందిగ్ధమే. 1.92 కోట్లమంది ప్రజలు ఫిబ్రవరి 4న ఎవరికి ఓటు వేసి పట్టం కడతారనే ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్కూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కీ అనుకూలంగా దాదాపు సమానంగా వచ్చింది. ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ను గద్దె దింపాలనే విషయంలో మాత్రం చండీగఢ్, జలంధర్, అమృత్సర్, లుధియానా, పటియాలా పర్యంతం ఏకాభిప్రాయమే. ‘బదలావ్ జరూర్ చాహియే’ అన్నది అందరినోటా వినిపిస్తున్న మాట. నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా పంజాబ్ను మూడు విభాగాలుగా పరిగణిస్తున్నారు. రాబీ, బ్యాస్ నదుల మధ్య ప్రాంతాన్ని మఝా అనీ, సత్లుజ్కి దక్షిణ భాగాన్ని మాల్వా అనీ, సుత్లెజ్, బ్యాస్ నదుల మధ్య ప్రాంతాన్ని దొయాబీ అనీ పిలుస్తారు. అమృత్సర్, గురుదాస్పూర్, పఠాన్ కోట్ పట్టణాలు మఝాలో ఉన్నాయి. ఫరీద్కోట్, లుధియానా, పటియాలాలు మాల్వాలోనివి. జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్లు దొయాబా ప్రాంతంలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల చరిత్ర, సంస్కృతీసంప్రదాయాలు వేరు. అసెంబ్లీలోని మొత్తం 117 స్థానాలలో మఝాలో 25, దొయాబాలో 23, మాల్వాలో 69 ఉన్నాయి. అన్ని ప్రాంతాలలోనూ అకాలీ, కాంగ్రెస్ల ప్రాబల్యం ఉంది. బీజేపీకి మాత్రం పట్టణాలలోనే పట్టు ఎక్కువ. ‘అందరూ దొంగలే..’ ‘సబ్ చోర్ హై. హమ్ బదలావ్ లాయింగే’ అన్నాడు ఫగ్వాడాలో మెకానిక్ షెడ్ యజ మాని హర్మిందర్సింగ్.పెద్దనోట్ల రద్దుపై ఆగ్రహం వెలిబుచ్చాడు. ‘మా దగ్గర పని చేసేవారికి రోజువారీ వేతనం ఇవ్వలేకపోయాం. మా ఆదాయం సగానికి పైగా పడిపోయింది. మోదీ ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఏమీ జరగడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. అవినీతి అట్లాగే ఉంది. మోదీ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నాడు ’ అన్నాడు. పాలక పక్షంపై వ్యతిరేకత ఉందని, అయితే కాంగ్రెస్పై సద్భావమూ లేదని పేర్కొన్నాడు. ఈసారి ఎవరికి ఓటు వేస్తావంటే ఆప్కే అని నిస్సంకోచంగా బదులిచ్చాడు. ఫగ్వాడా దొయబా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. కెప్టెన్ పై నమ్మకం.. అమృత్సర్లో ‘సాక్షి’ బృందం ప్రశ్నించినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. బాదల్ పాలనలో ఒక కుంటుంబం మాత్రమే బాగుపడిందని చెబుతూనే ‘ఫిర్భీ థోడా బదలావ్ హోనీచాహియే’ అని ముక్తాయించారు. మాల్వాలో ఆప్ ప్రభావం ఎక్కువ. అక్కడి నుంచే 2014లో ఆప్ నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ పార్టీ హవా ఇప్పుడు కొంచెం తగ్గింది. నలుగురు ఎంపీలలో ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేసింది. మూడో ఎంపీ అనారోగ్యం వల్ల క్రియాశీలంగా లేరు. ఆప్ తరఫున సంగ్రూర్ ఎంపీ భగవంత్మన్ ఒక్కడే చురుగ్గా ప్రచారం చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పైన జలాలాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఆయనే ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశముంది. ఆప్ నాయకత్వ స్థాయిలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఆ పార్టీపై సాధారణ ప్రజానీకంలో, ముఖ్యంగా అవినీతిరహిత సమాజం కోరుకునేవారిలో విశ్వాసం ఉంది. సీ ఎం ప్రకాశ్సింగ్ బాదల్ మాల్వాలోని లం బీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. అమరీందర్ లంబీతోపాటు తన సంస్థానం పటియాలా నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారు. చీలిపోనున్న దళితుల ఓట్లు.. పంజాబ్లో దళితుల సంఖ్య అధికం. జనాభాలో దాదాపు 32 శాతం. యూపీ తర్వాత పంజాబ్ని స్థావరంగా చేసుకోవడానికి బీఎస్పీ నేత మాయావతి యత్నాలు ఫలించలేదు. యూపీలోలా ఇక్కడ దళితుల్లో అభద్రతాభావన లేదు. 2015 నుంచి మాయావతి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఎన్ని అభియాన్ లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దళితులు కాంగ్రెస్కూ, అకాలీదళ్కూ మార్చి మార్చి ఓటు చేయడం రివాజు. 2014లో మాల్వాలో ఎక్కువ మంది దళితులు ఆప్కు వేశారు. ఈ సారీ దళిత ఓట్లు మూడు పార్టీల మధ్యా చీలిపోయే వీలుంది. కాంగ్రెస్కు ఎక్కువ శాతం దక్కొచ్చని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా చెప్పారు. ఎస్సీలకు రిజర్వు అయిన 34 స్థానాల్లో సగం స్థానాలకు పైగా ఏ పార్టీ సంపాదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బండ లెక్క. -
ప్రియాంకపై ఆయన వ్యాఖ్యలు ఊహించినవే
పనాజీ: ప్రియాంక గాంధీ అందం గురించి బీజేపీ నేత వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. కతియార్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆయన నుంచి ఇలాంటి మాటలు రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. ‘ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి కతియార్ వచ్చారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన కతియార్ నుంచి ఇలాంటి మాటలను ఊహించాను. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా’ అని దిగ్విజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం గురించి కతియార్ మాట్లాడుతూ.. ‘ఆమె స్టార్ కాంపెయినర్ ఏంటి? ప్రియాంక కంటే అందమైన మహిళ నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ జాబితాలో హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇంకా అందమైన మహిళలు ఉన్నారు’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఎవరికి ప్రయోజనం?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో అతి పెద్ద సమరాంగణం ఉత్తర్ప్రదేశ్లో పాలకపక్షం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పొత్తు సంచలనం సృష్టిస్తోంది. వృద్ధ లోహియా సోషలిస్ట్ నేత ములాయంసింగ్ స్థాపించిన ఎస్పీ తన 24 ఏళ్ల చరిత్రలో తొలిసారి కాంగ్రెస్తో కలిసి యూపీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. రాష్ట్రంలో బలమైన రెండు పక్షాల్లో ఒకదానితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్కు ఇది రెండోసారి. ఇప్పటి పొత్తు బీజేపీని ఎంత వరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుని, విజయం సాధిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. ఎస్పీతో ఏ పార్టీ అయినా విలీనం కావచ్చుగాని, దేనితో పొత్తు ఉండదని డిసెంబర్ వరకూ ములాయం చెబుతూ వచ్చారు. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖేలేశ్ యాదవ్ పార్టీ అంతర్గత పోరాటంలో విజయం సాధించి, పార్టీపై పట్టు సాధించడంతో ఈ పొత్తు సాధ్యమైంది. 1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధాని కాకుండా ములాయం అడ్డుకున్నప్పటి నుంచీ రెండు పార్టీలూ దాదాపు శత్రుపక్షాలుగానే ఉన్నాయి. 2003–07 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొడిచిన స్నేహం చివరికి తీవ్ర ద్వేషభావంతో ముగిసింది. 2008లో భారత–అమెరికా అణు ఒప్పందానికి నిరసనగా అప్పటి యూపీఏ సర్కారుకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించినప్పుడు తాత్కాలికంగా మన్మోహన్సింగ్ ప్రభుత్వాన్ని ఎస్పీ నిలబెట్టింది. ఈ మైత్రి కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. 2009, 2014 లోక్సభ ఎన్నికలు, 2007, 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు ‘సెక్యులర్’ పార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేదు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ములాయం పెద్ద కోడలు డింపుల్ను ప్రస్తుత యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకా వాడ్రా బీఎస్పీ, ఎస్పీలు రెంటినీ శత్రుపక్షాలుగానే చిత్రించారు. ఎస్పీ నేతలను గూండాలుగా రాహుల్ అభివర్ణించారు. ఈ ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్ది ఒంటరి పోరు. ఎన్నికల్లో గెలుపునకు బ్రాహ్మణ నేతను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఎన్నికల కన్సల్టెంట్, ఐప్యాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సలహా పాటించి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ను కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఎంపికచేసింది. ఎంత చేసినా యూపీలో వచ్చేది పాతిక సీట్ల లోపేననే అంచనాలు, పది లోపు స్థానాలేనని ఎన్నికల సర్వేల జోస్యాల కారణంగా ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కిందటి అక్టోబర్ నుంచి సమాజ్వాదీ యాదవ పరివారంలో మొదలైన ముసలంలో అఖిలేశ్ విజయం కాంగ్రెస్ ఎత్తుగడకు అనుకూలంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి యూపీలో ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీతో పొత్తు తప్పదనే అంచనాతో మూడు నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత 105 సీట్లలో పోటీకి కాంగ్రెస్ అంగీకరించింది. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తులో కీలక పాత్రదారులు డింపుల్, ప్రియాంక! మొత్తం 403 సీట్ల పంపిణీలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయి, ఒప్పందం కుదరడానికి అఖిలేశ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్, ప్రియాంక ముఖ్య పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక ఫోన్ కాల్కు స్పందించని ఎస్పీ సీఎం మొబైల్ను స్విచాఫ్ చేస్తే, డింపుల్కు ప్రియంక ఫోన్ చేశారని, అప్పుడు అఖిలేశ్ ఆమెతో మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ స్థాయిలో ఇద్దరు ప్రముఖ మహిళలకు మంచి ప్రచారం లభించింది. ఈ ఇద్దరి మధ్య విరిసిన స్నేహం ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని విజయపథంలో నడిపిస్తుందని రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆశిస్తున్నారు. గతంలో అన్న, అమ్మ లోక్సభ సీట్లు రాయ్బరేలీ, అమేఠీకే పరిమితమైన ప్రియాంక ఈసారి రాష్ట్రమంతా కాంగ్రెస్ తరఫున, కుదిరితే డింపుల్తో కలిసి కూటమి తరఫున సుడిగాలి ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. 1993 ఎస్పీ–బీఎస్పీ పొత్తు పాక్షిక విజయం 1993 యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటి ఎస్పీ– బహుజన్సమాజ్ పార్టీ(బీఎస్పీ) పొత్తు కొంత మేరకు విజయం సాధించిపెట్టింది. 1992 బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగిన ఎన్నికలివి. బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం, ములాయం మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు ఈ కూటమికి 176 సీట్లు తెచ్చిపెట్టింది. మెజారిటీకి 213 సీట్లు(ఉత్తరాఖండ్ ఏర్పాటుకు ముందు మొత్తం 424 సీట్లు) అవసరం కాగా జనతాదళ్(27), కాంగ్రెస్(28), వామపక్షాల(4) మద్దతుతో ఎస్పీ, బీఎస్పీలు కలిసి ములాయం యాదవ్ నేతృత్వంలో తొలి, చివరి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. ములాయం, మయావతి మధ్య విభేదాలతో ఈ ప్రభుత్వం ఏడాదిన్నరకే 1995 జూన్లో కూలిపోయింది. 1996 బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు నూరు సీట్లు! 1996 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పి.వి.నరసింహారావు బీఎస్పీ నేత కాన్షీరాంతో మాట్లాడి అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 110 ఏళ్ల చరిత్రలో తొలిసారి జూనియర్ భాగస్వామిగా దళితుల నేతృత్వంలోని బీఎస్పీ నాయకత్వాన్ని అంగీకరించింది. బీఎస్పీ 296, కాంగ్రెస్ 126 సీట్లకు పోటీచేసి, వరుసగా 67, 33 సీట్లను మాత్రమే సాధించాయి. బీజేపీ 174 సీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 110 సీట్లతో ఎస్పీ రెండో స్థానం సంపాదించింది. బీఎస్పీ పోటీచేయని స్థానాల్లో ఈపార్టీ ఓటర్లైన బహుజనులు(ఎస్సీలు, బీసీలు) కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేశారు. బీఎస్పీ పోటీచేసిన చోట్ల మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల వారు బీఎస్పీకి ఓటేయలేదని ఫలితాలు వచ్చాక కాన్షీరాం వివరించారు. కాంగ్రెస్తో ఎన్నికల పొత్తుపెట్టుకున్న బీఎస్పీ చివరికి బీజేపీ మద్దతుతో మాయావతిని రెండోసారి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. ఇలా రెండోసారి ఎన్నికల ముందు కుదిరిన ‘లౌకికపక్షాల’ స్నేహం విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత కాంగ్రెస్తో బీఎస్పీ ఏనాడూ ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. 27 సాల్ బురా హాల్ నినాదం ఇచ్చాక ఎస్పీతో పొత్తు ఎందుకు? 1989 డిసెంబర్లో యూపీలో ప్రతిపక్షస్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అప్పటి నుంచీ అక్కడే నిలబడిపోయింది. అందుకే ఈ 27 ఏళ్లలో యూపీ అధ్వాన్న పరిస్థితికి చేరుకుందంటూ నాలుగు నెలల క్రితం ‘27 సాల్ బురా హాల్’ నినాదం ఇచ్చింది. కిందటి అక్టోబర్లో యూపీలోని 48 జిల్లాల్లోని 141 అసెంబ్లీ స్థానాల్లో3,500 కిలోమీటర్ల కిసాన్ యాత్ర ముగించుకు వచ్చిన రాహుల్కు పరిస్థితి అర్ధమైంది. ఒంటరి పోరులో ఉన్న 28 సీట్లు నిలబెట్టుకోలేమని తెలిసొచ్చింది. అప్పటి నుంచీ ఎస్పీ సర్కారుపై ఆయన విమర్శల్లో వాడి, వేడి తగ్గడం మొదలైంది. ఎస్పీతో పొత్తుకు అఖిలేశ్తో మాట్లాడే పని పంజాబ్లో ఉన్న ప్రశాంత్ కిశోర్కు రాహుల్ అప్పగించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా, వ్యూహంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందిన ములాయం ‘మూలన’పడడంతో రాహుల్ ఎత్తుగడ ఫలించింది. పొత్తు విజయం సాధించేనా? యూపీలో కాంగ్రెస్ దాదాపు 40 ఏళ్లు పాలన సాగించింది. దళితులు, ముస్లింలు, యాదవుల తర్వాత అధిక జనాభా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన అయిదుగురు నేతలు సీఎంలు కావడానికి కూడా అవకాశం ఇచ్చింది. అయితే, ఈ వర్గంతోపాటు మిగిలిన అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు ఈ పార్టీకి దూరమయ్యారు. మండల్–మసీదు ఆందోళనల ఫలితంగా 1989 నుంచీ అసెంబ్లీలో పార్టీ బలం పడిపోతూ వచ్చింది.(1989లో 94, 91లో 46, 93లో 27, 96లో 33, 2002లో 25, 2007లో 22 సీట్లు) బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు –ఇలా అన్ని ప్రధాన వర్గాల అత్యధిక ఓట్లు బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ వైపు తరలిపోయాయి. తొలుత స్నేహ హస్తం అందించినా ఎన్నికల ముందు కాంగ్రెస్తో పొత్తుకు బీఎస్పీ నాయకురాలు మాయావతి తిరస్కరించారు. దాంతో అఖిలేశ్, డింపుల్, రాహుల్, ప్రియాంక రూపంలోని యువ ముఖాలు ముందు పెట్టి బీజేపీతో తలపడడం మేలని అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం భావించి చివరి నిమిషంలో పొత్తును కాపాడారు. బీజేపీపై వ్యతిరేకత మినహా ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేని ఈ రెంటి కలయిక వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్కు ఇంకా మద్దతిస్తున్న దళితులు పార్టీ అభ్యర్థులు లేని స్థానాల్లో బీఎస్పీకి ఓటేస్తారని, బ్రాహ్మణులు బీజేపీ లేదా బీఎస్పీకి మద్దతు పలుకుతారని వారు అంటున్నారు. అయితే, ఎస్పీకి విధేయులైన ముస్లింలు, బీసీలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని, ఈ పొత్తు ఎస్పీ కన్నా కాంగ్రెస్కే ఎక్కువ ప్రయోజనకరమని కూడా వారు విశ్లేషిస్తున్నారు. అదీగాక ఎస్పీ ఈ అనవసర పొత్తు వల్ల కాంగ్రెస్కు మూడు దశాబ్దాలుగా దూరమైన ముస్లింలను చే జేతులా అప్పగించి నష్టపోతుందని కొందరు ఎన్నికల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే, 2014 నాటి నరేంద్ర మోదీ హవా లేని ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో ఎన్నికల సమరాన్ని చతుర్మఖ పోటీల నుంచి త్రిముఖ పోటీలకు పరిమితం చేస్తే బీజేపీ మెజారిటీ సాధించలేదని, ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు ఈసారి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. వారసత్వ రాజకీయాలకు పునాదిగా మారిన యూపీలో నలుగురు కొత్త తరం నేతలను రంగంలోకి దింపి చేస్తున్న ఈ పొత్తు ప్రయోగం భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేక లౌకిక కూటమి ఏర్పాటుకు ఉపకరిస్తుందని కూడా భావిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
గోవాలో క్యాసినోలు బంద్: కాంగ్రెస్ మేనిఫెస్టో
పణజీ: అధికారంలోకి వస్తే గోవాలోని అన్ని క్యాసినో(జూద శాలలు)ల్ని మూసి వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. నదుల్లో సాగుతున్న క్యాసినోల్ని కూడా శాశ్వతంగా మూసివేస్తామని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధికి ఎలాంటి నష్టం వాటిల్లదని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలైరో చెప్పారు. -
కెప్టెన్ వర్సెస్ జనరల్: మాటల యుద్ధం
-
యూపీలో పొత్తు కోసం బీజేపీ రాజకీయాలు
-
అందులో శివపాల్ పేరు లేదు
సమాజ్వాద్ పార్టీలో తండ్రికొడుకుల మధ్య నెలకొన్న సైకిల్ సమరానికి సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటనతో తెరపడింది. కొడుకు అఖిలేష్కే సైకిల్ గుర్తు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించడంతో, ఇక నేతాజీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసీ ప్రకటన అనంతరం రెండో సారి తండ్రితో భేటీ అయిన ఎస్పీ చీఫ్, కొడుకు అఖిలేష్కు, ములాయం 38 అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొడుకుకు ఇష్టంలేని తన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ పేరును ములాయం చేర్చలేదని వెల్లడవుతోంది. కొడుకు వ్యతిరేకతతో తీవ్రంగా మనస్తాపం పొందిన సమయంలో నేతాజీకి వెన్నంటే ఉన్న శివ్పాల్ పేరును ములాయం తన అభ్యర్థుల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. అయితే శివ్ పాల్ కొడుకు ఆదిత్య యాదవ్ పేరును మాత్రం నేతాజీ తన జాబితాలో చేర్చారు. అంతేకాక, ములాయం వారసత్వం కోసం పాకులాడుతున్న ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్, ఓం ప్రకాశ్ సింగ్, నారద్ రాయ్, షదాబ్ ఫాతిమా, గాయత్రి ప్రసాద్ ప్రజాపతిలకు ములాయం తన జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. అఖిలేష్కు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని ఫైర్ అయిన ములాయం సింగ్, ఇక కొడుకు అభ్యర్థనకు తలొగ్గినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సైకిల్ గుర్తు అఖిలేష్కే కేటాయిస్తు ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం అఖిలేష్ తండ్రితో భేటీ అయి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం కూడా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని అఖిలేష్ చెప్పారు. ప్రతిఒక్కర్ని తనతో కలుపుకుని పోటీ చేస్తామని పేర్కొన్నారు. నేతాజీని కూడా కలుపుకుని పోటీ చేస్తామని, తమ బంధుత్వం ఎన్నటికీ విడదీయరానిదని అఖిలేష్ అన్నట్టు తెలిసింది. -
మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం కాంగ్రెస్ వెల్లడించింది. ఫిబ్రవరి 4న జరగనున్న ఎన్నికలకు గాను ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో 77 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మధుసుధన్ మిస్త్రీ ప్రకటించిన మూడో జాబితాలో ఎక్కువగా అకాలీదళ్ నుంచి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభించింది. అకాలీదళ్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన రాజ్విందర్ కౌర్, కమల్జిత్ సింగ్, దేవిందర్ గుబయ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 117 సీట్లకు గాను తాజా జాబితాతో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా 100కు చేరింది. మిగిలిన 17 సీట్ల కోసం భారీగా లాబీయింగ్ జరుగుతుందని సమాచారం. -
ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!
రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినీ గ్లామర్ తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సినీస్టార్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, జాకీష్రఫ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించారు. ఈ ఇద్దరు నటులు కూడా పార్టీ కార్యాలయం బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం మంచి పనులు చేస్తున్నదని, వాటికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలైన స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుకు తాను గట్టిగా మద్దతునిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు. -
‘ఫిట్గా ఉన్నా, ఎన్నికలకు రెడీ’
డెహ్రడూన్: తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. మెడ సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో జరగనున్న ఎన్నికలను వెళతానని చెప్పారు. మెడనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆస్పత్రి దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఫిట్గా ఉన్నానని ఉన్నానని అన్నారు. మార్చి 26న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తాను రెండు స్థానాల్లో పోటీ చేయాలని హరీశ్ రావత్ భావిస్తున్నారు. కుమావ్, గర్వాల్ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. రెండు సీట్లలో పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్ ఒకే వ్యక్తి రెండు సీట్లలో పోటీ చేయడం సమంజసం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
'నో కాంప్రమైజ్.. బడ్జెట్ ఫిబ్రవరి 1నే'
పంజాబ్: గతంలో దేశ రక్షణ కోసం భారత సరిహద్దు దాటిన దమ్మే గత ప్రభుత్వానికి లేకుండాపోయిందని(సర్జికల్ దాడిని పరోక్షంగా చెబుతూ), తమలాగా నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి ఏ ప్రభుత్వం చేయలేదని కేంద్రం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు దూషణలతోనే సరిపెడుతుందని అన్నారు. ఫిబ్రవరి 1నే బడ్జెట్ను ప్రవేశపెట్టి తీరుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. తాము ప్రవేశ పెట్టనున్న బడ్జట్ను మూడు నెలల కిందటే ఫైనల్ చేశామని ఆయన చెప్పారు. ఆదివారం పంజాబ్లోని అమృత్సర్లో బీజేపీ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్ను వాయిదా వేయాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ను కూడా కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన జైట్లీ బడ్జెట్ పెట్టితీరుతామన్నారు. బడ్జెట్ను వాయిదా వేసే సంప్రదాయం ఎప్పుడూ లేదని అన్నారు. ఇక పంజాబ్ రాజకీయాల గురించి 2002 నుంచి 2007 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్కు ఒక్కపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఎంతసేపటికి ఆ పార్టీ కక్షపూరిత రాజకీయాలతో, ఇతరులపై నిందలు వేస్తూ ముందుకెళ్లిందని గట్టిగా ఆరోపించారు. నియంత్రణ రేఖ దాటే దమ్ము గతంలో ఏ ప్రభుత్వానికి లేకుండా పోయిందని, నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి చేయలేకపోయిందని అరుణ్ జైట్లీ చెప్పారు. -
మేం పిల్లల్ని కనలేదు.. బహుమతి ఇస్తారా!
- ఒక వర్గం వారు ఎంతమందినైనా కనొచ్చా? - మళ్లీ పేలిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ న్యూఢిల్లీ: ‘ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్నల్ని కనాలి’అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ప్రధాని మోదీ చీవాట్లతో కొంతకాలంగా మౌనముద్రను దాల్చారు. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి రాజకీయ సందడి నెలకొన్నవేళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన సాక్షి మహారాజ్.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణిస్తూనే ఒక వర్గాన్ని టార్గెట్చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అప్పట్లో నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలేమీ పిల్లల్ని కనే మిషన్లుకాదు! అయితే దేశంలో జనాభా పెరిగిపోతోంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి.. నలుగురిని పెళ్లిచేసుకుని, 40 మంది పిల్లల్ని కని, మూడు సార్లు తలాక్ తీసుకుంటాడు. ఇకపై ఇలాంటి పద్ధతిని సహించబోయేది లేదు’ అని సాక్షి మహారాజ్ అన్నారు. తన కుటుంబవ్యవహారాన్ని వివరిస్తూ..‘మేం నలుగరు అన్నదమ్ములం. అందరం సన్యాసం స్వీకరించాం. తద్వారా పిల్లల్ని కనకుండా మా వంతు జనాభా ఉత్పత్తిని తగ్గించాం. ఇందుకుగానూ ప్రభుత్వాలు మాకు బహుమతి ప్రదానం చెయ్యాలి’అని పేర్కొన్నారు. -
అధిక జనాభాకు వాళ్లే కారణం!
ముస్లింలపై సాక్షి మహరాజ్ పరోక్ష వ్యాఖ్యలు మీరట్: దేశంలో అధిక జనాభాకు వాళ్లే కారణమని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం మీరట్లో జరిగిన ‘సంత్ సమ్మేళన్’లో మాట్లాడుతూ... ‘నలుగురు భార్యలు... 40 మంది పిల్లలు ఉన్నవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు. ఇందుకు హిందువులు బాధ్యులు కారు. ’అన్నారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక పంపించాలని మీరట్ జిల్లా అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో కుల, మతాల పేరు చెప్పి ఓట్లడగటం నేరమని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. విరుచుకుపడిన విపక్షాలు... ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆయన ప్రసంగం అభ్యంతరకరంగా, సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకుడు కేసీ మిట్టల్ చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నక్వీని వివరణ కోరగా... తాను ఆ వ్యాఖ్యలు చదవలేదని, అవి కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. -
లైవ్ కవరేజీ... భలే క్రేజీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజున కేంద్ర ప్రసార, సమాచార శాఖ(ఎంఐబీ) ట్విటర్ పేజీకి భారీగా వ్యూస్ వచ్చాయి. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 4న ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీకి ట్విటర్ పేజీ లేకపోవడంతో ఈ ప్రకటనను ఎంఐబీ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటనకు 55,127 వ్యూస్ వచ్చాయి. 1,448 సార్లు రీట్వీట్ గా, 550 లైకులు వచ్చినట్టు ఎంఐబీ వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఉన్నతాధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని యూట్యూబ్ లో చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని 1,700 మంది వీక్షించారని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) చేసిన ట్వీట్లకు భారీ స్పందన వచ్చింది. 6.5 లక్షల వ్యూస్, 951 లైకులు వచ్చాయి. 4,410 సార్లు రీట్వీట్ చేశారు. పీఐబీ పేస్ బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని 3.04 లక్షల మంది వీక్షించారు. జాతీయ ఎన్నికల సంఘం(ఈసీఐ) ఫేస్ బుక్ పేజీలో విలేకరుల సమావేశం లైవ్ ప్రసారానికి 6,400 లైకులు రాగా, 624 మంది షేర్ చేశారు. -
అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?
లక్నో: సమాజ్వాదీ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ యాదవ్.. ఎన్నికల పొత్తులపై దృష్టిసారించారు. దూకుడుమీదున్న బీజేపీని, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బీఎస్పీని గట్టిగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం ఇతర ముఖ్యపార్టీలతో పొత్తు తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నట్లే.. అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి వచ్చీరాగానే.. ఎస్పీ చీఫ్ హోదాలో అఖిలేశ్ ఢిల్లీకి పయనం అవుతారని, జనవరి 9న జరగబోయే భేటీలో పొత్తు ఖరారు కానుందని, ఆ వెంటనే ఇరు నేతలూ ప్రకటన విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్తోపాటు ఆర్ఎల్డీతోనూ ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ మేరకు పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. ఇప్పటికి లభించిన సమాచారం ప్రకారం.. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 90 నుంచి 105 స్థానాల్లో పోటీ చేయనుంది. కొన్ని రోజుల కిందట అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకా గాంధీల మధ్య జరిగిన రహస్య భేటీలోనే పొత్తు ఖాయమైపోయిందని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేది మాత్రం రాహుల్- అఖిలేశ్లు నిర్ణయించుకోనున్నారని తెలిసింది. టార్గెట్ 300 సంప్రదాయ దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పక ఉత్తమ ఫలితాన్నిస్తుందని మొదటి నుంచీ నమ్ముతోన్న అఖిలేశ్.. ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తద్వారా బీఎస్పీని, బీజేపీని ఒకేసారి దెబ్బకొట్టొచ్చన్నది ఆయన వ్యూహం. కాంగ్రెస్తో జతకడితే కనీసం 300 స్థానాల్లో విజయం ఖాయమని అఖిలేశ్ నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూడ్ విడుదలైన నేపథ్యంలో ఎంత త్వరగా పొత్తులు ఖరారుచేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తే అంతమంచిదని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, జనవరి 9న జరగబోయే రాహుల్- అఖిలేశ్ భేటీలో ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలిసింది. (చదవండి: ములాయం-అఖిలేష్ వివాదంలో మరో ట్విస్ట్) మాయ ‘ముస్లిం’ మంత్రం అభ్యర్థులను ప్రకటించే విషయంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) శుక్రవారం ఉదయం 100 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాతో కలిపి బీఎస్పీ ఇప్పటి వరకు 200 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, మొత్తం 403 స్థానాలకుగానూ బీఎస్పీ ఈసారి ఏకంగా 97స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టనుంది. ముజఫర్నగర్ అల్లర్లు, అసహన పరిస్థితులు, దాద్రీ ఘటన.. తదితర సంఘటనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యక్తమైన వ్యతిరేకతను మాయావతి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారని, అందుకే పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. -
స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!
- ప్రియనేస్తం ములాయం కోసం అమర్ సింగ్ కీలక నిర్ణయం! - అఖిలేశ్ డిమాండ్ మేరకు మూడు నెలలు పార్టీకి దూరంగా.. లక్నో: ఎవరి కోసమైతే తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేశ్లు తగువులాడుకుంటున్నారో.. ఆ అమర్సింగ్ చివరికి త్యాగానికి సిద్ధపడ్డట్టు తెలిసింది. ప్రియ స్నేహితుడి కొడుకు, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీఎం అఖిలేశ్ డిమాంఢ్ మేరకు.. ఎంపీ అమర్ మూడు నెలలపాటు రాజకీయ సన్యాసం తీసుకొనబోతున్నారని సమాచారం. ఈ మూడు నెలలూ పార్టీకి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాధికారాలు అఖిలేశ్ తీసుకుంటారు. ఈ అంశం ప్రాతిపదికనే గురువారం రాత్రి నుంచి ములాయం, అఖిలేశ్ల నివాసాల్లో ఎడతెరిపిలేకుండా మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అనూహ్యంగా బాబాయి శివపాల్ యాదవ్.. అఖిలేశ్ ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ అమర్ సింగ్.. ములాయంతో భేటీ అయ్యారు. మరి కొద్ది గంటల్లోనే అమర్ త్యాగానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంచనా. (ఆయన గుండెల్లో నేను లేని క్షణాన.. ) ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారం సాధించేలా మార్చి వరకు సర్వనిర్ణయాధికారాలూ తనకే కట్టబెట్టాలని సీఎం అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ను కోరినట్లు.. అఖిలేశ్ వర్గీయుడైన మంత్రి రవిదాస్ మల్హోత్రా మీడియాకు చెప్పారు. నేతాజీ(ములాయం) కూడా ఇందుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 214 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే పార్టీని స్వాధీనం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి ములాయంను పార్టీ ‘మార్గదర్శి’గా నియమించారు. పార్టీని తిరిగి కైవసం చేసుకోలేని స్థితిలో ములాయం.. కొడుకుకు జై కొట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అఖిలేశ్ వర్గంలోని అతివాదులు వ్యాఖ్యానించారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) అఖిలేశ్ డిమాండ్ ప్రకారం అమర్సింగ్, శివపాల్ యాదవ్లు వచ్చే మూడు నెలల పార్టీకి దూరంగా ఉండేలి. అభ్యర్థుల ఎంపిక సహా ఎలాంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకుదు. అయితే ఈ మాటను ములాయం చేతే చెప్పించాలని అఖిలేశ్ పట్టుపడుతున్నారు. సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన ములాయం.. కమిషన్ను కలవకుండానే లక్నోకు తిరుగుపయనం అయ్యారు. ఆ విధంగా సైకిల్ గుర్తు అఖిలేశ్కే దక్కేలా ములాయం వ్యవహరించారని తేలింది. (మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!) -
కళంకిత నేతలు పోటీచేయొచ్చా?
వారి భవితవ్యం తేల్చేందుకు త్వరలో ఐదుగురు జడ్జీల బెంచ్ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో.. సుప్రీం కోర్టు కీలకనిర్ణయం తీసుకోనుంది. కళంకిత నేతల భవిష్యత్ నిర్ణయించడానికి త్వర లో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతున్నామని గురువారం సుప్రీం కోర్టు తెలిపింది. తీవ్రమైన నేరారోపణలతో విచారణ ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు, విచారణ ఏ దశలో ఉండగా ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే అంశాలపై ఈ ధర్మాసనం తీర్పునివ్వనుంది. ‘ఈ అంశాలపై స్పష్టతనిస్తే.. వచ్చే ఎన్నికల్లోగా చట్టం గురించి ప్రజలు తెలుసుకుంటారు’ అని ఒక పిల్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. కొంతమంది నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో క్రిమినల్స్ పోటీపై అత్యవసరంగా తేల్చాల్సి ఉందంటూ బీజేపీ ప్రతినిధి అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఖేహార్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. తప్పుడు కేసులు దాఖలయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయా లని, విచారణను రోజువారీ విధానంలో కొనసాగించాలని కింది కోర్టులను ఆదేశించింది. విచారణ జాప్యంతో తీవ్ర నేరారోపణ ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు పదవుల్లోనే కొనసాగుతు న్నారని ధర్మాసనం వాఖ్యానించింది. -
ఢిల్లీ వెళ్లిన పెద్దాయన!
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు. తమ్ముడు శివపాల్ యాదవ్ను తీసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తమకు మద్దతిచ్చేవాళ్లు అందరి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుని.. వాటిని ఎన్నికల కమిషన్కు సమర్పిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు మాత్రం ప్రస్తుతానికి అఖిలేష్కే ఉన్నట్లు తెలుస్తోంది. ములాయం మాత్రం తనకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఆయనకు మద్దతు చెబుతున్నారో మాత్రం ఇంతవరకు బయటపడలేదు. పార్టీ గుర్తు తమదేనని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అంవతరకు ఆగడం ఎందుకని, ఇప్పటికే ములాయం ఢిల్లీ బయల్దేరగా.. అఖిలేష్ కూడా అఫిడవిట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. నోటి మాటగా కాకుండా.. అఫిడవిట్ల రూపంలోనే ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉందో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన అనూహ్య పరిణామంలో.. ములాయం సింగ్ స్థానంలో జాతీయాధ్యక్షుడిగా అఖిలేష్ను ఆయన వర్గం ఎన్నుకుంది. దాంతోపాటు శివపాల్ యాదవ్ను యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
సీఎం జోరు.. బాబాయ్ బేజారు!
సమాజ్వాదీ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో.. ఎవరికి వాళ్లు తమ బలాబలాలు తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరి నుంచి తనకు మద్దతుగా అఫిడవిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. సమాజ్వాదీ పార్టీకి యూపీ అసెంబ్లీలో మొత్తం 229 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలో 214 మంది అఖిలేష్ వెంటే ఉన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలలో కూడా చాలామంది యువ నాయకుడికే మద్దతు చెబుతున్నారు. దాంతో సైకిల్ గుర్తు అఖిలేష్ వర్గానికే దక్కేలా ఉంది. ఆయన ఎన్నికల కమిషన్ను శుక్రవారం కలుస్తారని, ఈలోపలే మొత్తం అన్ని అఫిడవిట్లు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్ తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీలో వచ్చిన ఈ చీలిక ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలని తమ జాతీయాధ్యక్షుడు (అఖిలేష్) చెప్పారని సాజన్ అన్నారు. వాస్తవానికి పార్టీకి ఇప్పటివరకు జాతీయాధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. దాని గురించి ప్రశ్నించగా అఖిలేష్ రాజధర్మాన్ని పాటిస్తున్నారని, తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. సమాజ్వాదీ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ములాయం మద్దతు తమ్ముడికే ఉండటం.. ఎన్నికలు కూడా సమీపించడంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. అసలైన సమాజ్వాదీ పార్టీ తమదేనంటూ ఎవరికి వారు చెబుతుండటంతో ఎన్నికల కమిషన్ కూడా బలాలు నిరూపించుకోవాలని ఆదేశించింది. -
5 రాష్ట్రాలు..35 రోజులు మోగిన నగారా
-
యూపీలో గెలుపు ఎవరిదంటే ?
-
యూపీ కిరీటం బీజేపీకే?
న్యూఢిల్లీ: కీలకమైన యూపీలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే సర్వే వెల్లడించింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిపిన ఈ సర్వేలలో ప్రజలు నోట్లరద్దు ప్రభావం తమపై లేదని చెప్పారు. నోట్ల రద్దుకు ముందు 31 శాతం మంది బీజేపీపై సానుకూలత వ్యక్తం చేయగా.. డిసెంబర్లో ఈ సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఈ లెక్క ప్రకారం 403 సీట్లున్న అసెంబ్లీలో కమలదళానికి 206–216 సీట్లు రావొచ్చని అంచనా. అధికార సమాజ్వాదీ పార్టీ 26 శాతం ఓట్లతో (92–97 శాతం) రెండో స్థానంలో మాయావతి బీఎస్పీకి 79–85 సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది. 27 ఏళ్లుగా యూపీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. సింగిల్ డిజిట్కే పరిమితం (5–9 సీట్లు) కావాల్సి వస్తుందని సర్వే తెలిపింది. కాగా, సీఎంగా 33 శాతం ఓట్లతో అఖిలేశ్ మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు, ఏబీపీ న్యూస్–లోక్నీతీ సీఎస్డీఎస్ ఒపీనియన్ పోల్ ప్రకారం సమాజ్వాదీ పార్టీకి 141–151 సీట్లు (30 శాతం ఓట్లు) వస్తాయని అంచనా. బీజేపీ 27 శాతం ఓట్లతో 124–134 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్–ఏబీపీ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ముస్లిం ఓట్లలో 57% ఎస్పీకి, బీఎస్పీకి 14, బీజేపీకి 9, కాంగ్రెస్కు 7% దక్కనున్నాయి. పంజాబ్లో ఎన్డీఏకు..: పంజాబ్లో అధికార శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమికి మళ్లీ అధికారం దక్కకున్నా పెద్ద కూటమిగా నిలిచే అవకాశం ఉందని ఏబీపీ సర్వే తెలిపింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఎస్ఏడీ–బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం (50–58 సీట్లు) ఇవ్వాలని అభిప్రాయపడగా.. కాంగ్రెస్కు 41–49, ఆప్కు 12–18 సీట్లు వస్తాయంది. ఆప్ రూపంలోనే ఎన్డీఏకు నష్టం జరగొచ్చని చెప్పింది. -
మినీ భారత యుద్ధం!
♦ సెమీ ఫైనల్స్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ♦ బీజేపీకి ప్రతిష్టాత్మకం ♦ ‘నోట్ల రద్దు’పై రిఫరెండం అవుతుందా? ♦ యూపీలో మోదీ హవా కొనసాగుతుందా? ♦ ఆప్ పంజాబ్కు కూడా విస్తరిస్తుందా? ♦ మణిపూర్లో కమలం వికసిస్తుందా? సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కారు రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 543 లోక్సభ సీట్లలో దాదాపు ఐదో వంతు(102 లోక్సభ స్థానాలు) ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కాబట్టి.. మరో రెండేళ్ల తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్గా భావిస్తున్నారు. దేశ ప్రజలను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన ఫలితాలనివ్వలేదన్న విశ్లేషణల నేపథ్యంలో.. ఈ ఎన్నికలు నోట్ల రద్దుపై ‘రిఫరెండం’గా మారతాయా అన్న ఆసక్తీ నెలకొంది. యూపీ అధికార సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) సంక్షోభం, పంజాబ్, గోవాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రంగంలోకి దిగడం, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ సర్కారు ఒడిదుడుకులు కొనసాగుతుండటం, మణిపూర్లో సైతం కమలం వికసిస్తుందన్న అంచనాలు.. ఈ ఎన్నికలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. మోదీకి ఇది అగ్నిపరీక్ష..! కేంద్రంలోని మోదీ సర్కారుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. గత రెండేళ్లలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కీలకమైన ఢిల్లీ, బిహార్లలో ఆ పార్టీ ఘోరంగా ఓడింది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సిన రాష్ట్రం యూపీ! మోదీ లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ.. మొత్తం 80 లోక్సభ సీట్లతో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ హవాతో బీజేపీకి 71 సీట్లు వచ్చాయి. 42.3 శాతం ఓట్లతో 89 శాతం సీట్లు దక్కాయి. ఇంత భారీ ఆధిక్యం సాధించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకలా ఉండాలి. ఎస్పీ సంక్షోభమూ కలిసి రావాలి. అయితే పెద్ద నోట్ల రద్దు బీజేపీ విజయావకాశాలను సందేహాస్పదం చేస్తోంది. ఐదేళ్ల కిందట అధికారం కోల్పోయిన బీఎస్పీ పరిస్థితి ఎలా ఉంటుందన్నదీ చూడాల్సిందే. పంజాబ్లో సరికొత్త పోరు.. పంజాబ్లో పదేళ్లుగా కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ్–బీజేపీ సంకీర్ణ సర్కారుపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆప్ కొత్తగా బరిలోకి దిగి గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ ఎలానూ ఉంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుందన్న అన్న ఉత్కంఠ నెలకొంది. గోవాలో ముక్కోణ పోటీ.. బీజేపీ పాలనలోని గోవాలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆప్ రంగంలోకి దిగడంతో ముక్కోణ పోటీ ఉంది. ప్రస్తుత బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఉంటే.. కాంగ్రెస్, ఆప్లలో దేనివైపు జనం మొగ్గుతారనేది ఆసక్తికరం. మణిపూర్ ఎన్నికలపై ‘నాగా’ ప్రభావం? మణిపూర్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఏడాది జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తొలిసారిగా ఈశాన్యంలో సర్కారును ఏర్పాటు చేసింది. ఇప్పుడు మణిపూర్లోనూ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల అంచనా. అయితే నాగా తీవ్రవాదులు, వారితో శాంతి చర్చల్లో కేంద్ర వైఖరి తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో సర్కారు మళ్లీ మారుతుందా? ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2002 నుంచి ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీ రాష్ట్ర ప్రజలది. దీంతో కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువేనంటున్నారు. అయితే.. ఇటీవల కాంగ్రెస్లో చీలికల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం.. హైకోర్టు తీర్పుతో అభాసుపాలైంది. ఆ పరిణామాల ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుంది.. బీజేపీ గెలుస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. మోదీ నాయకత్వం..రాష్ట్రపతి ఎన్నికపై ప్రభావం! పెద్ద నోట్ల రద్దుతో సొంత పార్టీలో వ్యక్తమవుతున్న అసంతృప్తి.. తనపై అసమ్మతిగా మారకుండా ఉండాలంటే యూపీలో బీజేపీ గెలుపు మోదీకి అత్యవసరం. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంతో 1991 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ మెజారిటీ సాధించింది. ఆ తర్వాత బీఎస్పీతో కలిసి సంకీర్ణ సర్కార్లు నడిపింది. 2014లో మాదిరిగా ఫలితాలు సాధిస్తే, మిగిలిన రెండేళ్లూ ప్రధానిగా మోదీ ప్రయాణానికి ఢోకా ఉండదు. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రధాని అనుకున్న నేతే ఎన్డీఏ అభ్యర్థి అవుతారు(అందరూ అంగీకరిస్తే మాజీ ఉపప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీయే అభ్యర్థి!). ఒకవేళ యూపీలోని మొత్తం 403 సీట్లలో సర్కారు ఏర్పాటుకు అవసరమైన 202 సీట్లు బీజేపీకి దక్కకపోతే, మోదీకి పార్టీలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాష్ట్రపతి పదవికి యూపీ బ్రాహ్మణవర్గానికి చెందిన మాజీ కేంద్ర మాజీ మంత్రి మురళీమనోహర్ జోషీ పేరును మోదీ ఒప్పుకోక తప్పని పరిస్థితి రావొచ్చు.బీజేపీలో, ప్రభుత్వంలో తమకు అడ్డులేకుండా ఉండేందుకు ఆడ్వాణీతోపాటు జోషీని మోదీ–అమిత్షా ద్వయం మార్గదర్శక్ మండల్ పేరుతో 2014లోనే మూలన పెట్టడం తెలిసిందే. -
ఖర్చుపై ఈసీ డేగ కన్ను
♦ రూ. 20 వేలపై లావాదేవీలన్నీ నగదు రహితమే ♦ విస్తృత పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు ♦ విరాళాలు రూ. 2 వేల నగదు వరకే పరిమితం చేసే యోచన సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధనవ్యయం తగ్గించేందుకు, నల్లధన వినియోగం తగ్గించేందుకు వినూత్నరీతిలో ముందుకెళ్లాలని ఈసీ భావిస్తోంది. బుధవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటన సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ప్రకటనలు చేసింది. అభ్యర్థులు రూ. 20 వేలకు మించి చేసే ఖర్చును చెక్ ద్వారా చెల్లించాలని షరతు విధించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ దీనిపై వివరిస్తూ ‘పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ. 28 లక్షలు మాత్రమే. అలాగే మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈ ఖర్చు రూ. 20 లక్షలు మాత్రమే ఉండాలి. ఎన్నికల ఖర్చును పర్యవేక్షించేందుకు 400 మంది పరిశీలకులను ఏర్పాటుచేశాం. నిఘా బృందాలు ఈ దిశగా పనిచేస్తాయి. అభ్యర్థులు బ్యాంకుల్లో ఖాతా తెరవాలి. రూ. 20,000 కంటే ఎక్కువగా ఖర్చు పెట్టినా ఈ ఖాతా నుంచి చెక్ రూపంలో ఇవ్వాలి. విరాళాలు, రుణాలు రూ. 20 వేల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు డీడీ ద్వారా లేదా చెక్ ద్వారా మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విరాళాలు, రుణాలు నగదు రూపంలో అయితే రూ. 2 వేలకు పరిమితం చేయాలన్న యోచనతో ఉందన్నారు. ఎన్నికల తర్వాతే బడ్జెట్పై పరిశీలన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్న పలు రాజకీయ పక్షాల విజ్ఞప్తులను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా వాయిదా వేయాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు తనకు విజ్ఞప్తులందాయని పేర్కొంది. -
మోగిన నగారా
పాంచ్ పటాకా... ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల ♦ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు.. వివిధ దశల్లో ♦ జనవరి 11న తొలి నోటిఫికేషన్ విడుదల.. మార్చి 11న ఫలితాలు ♦ యూపీలో ఏడు విడతల్లో పోలింగ్.. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఒకే విడత.. మణిపూర్లో రెండు విడతలు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్లో రెండు విడతల్లో, ఉత్తరప్రదేశ్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఈవీఎంల కౌంటింగ్, ఫలితాలు మార్చి 11న జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 11 (73 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 15 (67 ప్రాంతాలు), ఫిబ్రవరి 19 (69 ప్రాంతాలు), ఫిబ్రవరి 23 (52 ప్రాంతాలు), మార్చి 3 (49 ప్రాంతాలు), మార్చి 8 (40నియోజకవర్గాల్లో) ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 15న, మణిపూర్లో మార్చి 4, 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 11న పంజాబ్, గోవా ఎన్నికలకు నోటిఫికేషన్ రావటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. నోట్లరద్దు వల్లనల్లదనం భారీగా తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ ఎన్నికల అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు సీఈసీ నసీం జైదీ తెలిపారు. ఎన్నికల కమిషనర్లు ఎ.కె.జోతి, ఓం ప్రకాష్ రావత్లతో కలిసి బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో జైదీ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో కలిపి 1.85 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 690 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఇందులో 16 కోట్ల 80 లక్షలకు పైగా మందికి ఓటుహక్కు ఉందన్నారు. షెడ్యూలు ప్రకటనతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన ప్రకటనలు చేయరాదని పేర్కొంది. అయితే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ఉండబోతుందన్న వార్తలపై.. ఒక రాజకీయ పార్టీ ద్వారా ఫిర్యాదు అందిందని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా వారికోసమే కొన్ని పోలింగ్ స్టేషన్లు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు అనుకూలంగా ఏర్పాట్లు చేయనున్నట్లు జైదీ వెల్లడించారు. ఎవరికి ఓటేశారు? ఓటర్లు తామేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాలను ఈవీఎంలకు అమర్చుతున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. సాధ్యమైనన్ని చోట్ల వీటిని అమర్చుతామని పేర్కొంది. గతంలో పుదుచ్చేరి ఎన్నికల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్టు తెలిపింది. అలాగే అభ్యర్థుల ఫోటో కూడా ఈవీఎం యంత్రాలపై ప్రదర్శించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ‘నో డిమాండ్’ తప్పనిసరి అభ్యర్థులు నామినేషన్ పత్రాలతోపాటు నో డిమాండ్ సర్టిఫికెట్ను, అదనపు అఫిడవిట్ను జతపర్చాలని ఈసీ స్పష్టం చేసింది. విద్యుత్తు చార్జీలు, నీటి వినియోగ చార్జీలు, టెలిఫోన్ చార్జీలు, అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో నివాసం ఉంటే అద్దె బకాయిలు లేవని నో డిమాండ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. స్వాగతించిన రాజకీయ పక్షాలు న్యూఢిల్లీ: యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటాన్ని రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. నోట్లరద్దు తర్వాత ప్రజల్లో సానుకూలత కనబడుతోందని, అదే కలిసొస్తుందని బీజేపీ చెబుతుండగా.. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరగాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఐదు రాష్ట్రాల్లో తామే గెలుస్తామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. అధికారం, డబ్బుల దుర్వినియోగాలపై ఈసీ కఠినంగా ఉండాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. పంజాబ్, గోవాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందని, అది మాకు అనుకూలంగా మారుతుందని ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆపాలని, దీని కారణంగా ఓటర్లు ప్రభావితం అవుతారని అఖిలేశ్ వర్గం ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ అన్నారు.