Shardul Thakur
-
‘అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది’
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు కోపమొచ్చింది. విమర్శలు చేసే వాళ్లు.. ముందుగా తమ పరిస్థితి ఏమిటో గమనించుకోవాలని.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలంటూ మండిపడ్డాడు. స్టూడియోలో కూర్చుని మైదానంలోని పరిస్థితులను ఎవరూ అర్థం చేసుకోలేరని.. కామెంట్రీ పేరుతో శ్రుతిమించిన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటినా ఫ్రాంఛైజీలు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను పట్టించుకోలేదు. అయితే, లక్నో యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయం కారణంగా.. శార్దూల్కు ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది.జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడుసీజన్ మొత్తానికి దూరమైన మొహ్సిన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అంతేకాదు తుదిజట్టులోనూ చోటిచ్చింది. అయితే, శార్దూల్ కూడా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లలో కలిపి 11 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.200 స్కోరు అనేది కామన్ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్పై శనివారం నాటి మ్యాచ్లో లక్నో విజయానంతరం శార్దూల్ ఠాకూర్ విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేము బాగానే బౌలింగ్ చేస్తున్నాం. అయితే, చాలాసార్లు కామెంట్రీలో మా గురించి విమర్శుల చేస్తూనే ఉన్నారు.బౌలర్ల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఈరోజుల్లో 200 స్కోరు అనేది కామన్ అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. క్రికెట్ ఆడే తీరు రోజురోజుకూ మారిపోతోంది. స్టూడియోలో కూర్చుని ఒకరి బౌలింగ్ గురించి వ్యాఖ్యానాలు చేయడం సులువే.అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుందికానీ మైదానంలో ఉన్న వాళ్లకే వాస్తవ పరిస్థితుల గురించి తెలుస్తుంది. వేరే వాళ్లను విమర్శించే వాళ్లు.. వారి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సమీక్షించుకోవాలి’’ అని శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్లకు చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో ఓటమి పాలైన లక్నో త్వరగానే కోలుకుంది. ఇప్పటికి ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచింది. గుజరాత్ టైటాన్స్తో శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఘన విజయంబాధ్యతాయుతమైన బౌలింగ్కు తోడు.. దూకుడైన బ్యాటింగ్తో సొంత మైదానంలో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయంతో మెరిసి సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంత్ సేన.. గుజరాత్ను 180 పరుగులకు కట్టడి చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 బంతుల్లో 58) మరోసారి విజృంభించగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18 బంతుల్లో 21) మరోసారి విఫలమయ్యాడు. అయితే, నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) ధనాధన్ దంచికొట్టగా.. ఆయుశ్ బదోని (20 బంతుల్లో 28 నాటౌట్) అతడికి సహకరించాడు. ఫలితంగా 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: నేను కెప్టెన్ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్ అయ్యర్ -
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్ను ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేశారు. రూథర్ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ గైర్హాజరీలో రిషబ్ పంత్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. పంత్ 17, మార్క్రమ్ 38 క్రీజ్లో ఉన్నారు.శార్దూల్ డబుల్ సెంచరీఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ టీ20ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన శార్దూల్ 3, 4 బంతులకు వరుసగా రూథర్ఫోర్డ్, తెవాటియా వికెట్లు తీశాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన 18వ భారత బౌలర్గా, ఓవరాల్గా 103వ బౌలర్గా శార్దూల్ రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 467 మ్యాచ్ల్లో 637 వికెట్లు తీశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 316 మ్యాచ్ల్లో 365 వికెట్లు తీశాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్లురషీద్ ఖాన్- 637డ్వేన్ బ్రావో- 631సునీల్ నరైన్- 579టీ20ల్లో 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు..చహల్-365పియూశ్ చావ్లా- 319భువనేశ్వర్ కుమార్- 315అశ్విన్- 315బుమ్రా- 295అమిత్ మిశ్రా- 285హర్షల్ పటేల్- 248అక్షర్ పటేల్- 239హర్భజన్ సింగ్- 235జయదేవ్ ఉనద్కత్- 234రవీంద్ర జడేజా- 227సందీప్ శర్మ- 219అర్షదీప్ సింగ్- 213మహ్మద్ షమీ- 209కుల్దీప్ యాదవ్- 208ఉమేశ్ యాదవ్- 202హార్దిక్ పాండ్యా-200శార్దూల్ ఠాకూర్- 200 -
శార్ధూల్ ఠాకూర్ 'సెంచరీ'.. స్పెషల్ జెర్సీ అందజేత! వీడియో
టీమిండియా వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో వంద మ్యాచ్ల మైలు రాయిని అందుకున్నాడు.. ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా శార్ధూల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు శార్థూల్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చేతిల మీదగా వంద నెంబర్ గల ప్రత్యేక జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆఖరి నిమిషంలో ఎంట్రీ?వాస్తవానికి శార్థూల్ ఠాకూర్ ఐపీఎల్-2025లో అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్రౌండర్కు... లక్నో మెంటార్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని శార్ధూల్ అందిపుచ్చుకున్నాడు.ఇప్పటివరకు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన లార్డ్ ఠాకూర్.. 7 వికెట్లు పడగొట్టాడు. శార్ధూల్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, లక్నో జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్.. ఐపీఎల్లో తొలి కెప్టెన్గా అరుదైన ఫీట్ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 💯Shardul Thakur steps into his 1️⃣0️⃣0️⃣th #TATAIPL match 👏👏He receives a momentous jersey from #LSG mentor Zaheer Khan 👌#KKRvLSG | @imShard pic.twitter.com/G7jA3exxvE— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
వద్దనుకున్నవాడే... ఆపద్బాంధవుడయ్యాడు!
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్ 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!దూకుడే మంత్రంగా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో రాజస్తాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు!! ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్రితం మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ను వరుస బంతుల్లో పెవిలియన్కు పంపి ఆరెంజ్ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్పై ప్రత్యేక కథనం... జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం... మీడియం పేస్తో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్ ఠాకూర్ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్రౌండర్కు... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చిoది. ‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్మెంట్గా నువ్వు టీమ్లో చేరితే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చెప్పిన మాటలతో శార్దుల్ తనను తాను టి20 ఫార్మాట్కు సిద్ధం చేసుకున్నాడు. లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్ తొలి మ్యాచ్ నుంచే తనదైన ముద్ర వేశాడు. తొలి మ్యాచ్లో 2 ఓవర్లే... విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో శార్దుల్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో తొలి ఓవర్లోనే శార్దుల్ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి మెక్గుర్క్ను ఔట్ చేసిన ఈ ముంబైకర్... ఐదో బంతికి అభిõÙక్ పొరెల్ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. అయితే ఆ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... శార్దుల్ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్లో హైదరాబాద్పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు. దాని ఫలితమే శార్దుల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్బాల్తో అబిషేక్కు బైబై చెప్పిన శార్దుల్... తదుపరి బంతికే ఇషాన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్కు వచి్చన అతడు... అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమీని ఔట్ చేశాడు. రైజర్స్కు కళ్లెం... హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్ వెల్లడించాడు. ‘రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్ తీసుకోవాలనుకున్నా.ఫ్లాట్ పిచ్పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకోవడం సన్రైజర్స్ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్ అన్నాడు. ఐపీఎల్లోని అన్నీ జట్లలో బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్ మ్యాజిక్తో ముందుకు సాగుతోంది. లీగ్లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్రౌండర్ వెల్లడించాడు. జహీర్ ఫోన్ కాల్తో.. ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్రౌండర్ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు. ‘రంజీ నాకౌట్ మ్యాచ్ల సమయంలో జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్ ముందు ఫోన్ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు. –సాక్షి, క్రీడావిభాగం -
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరైన రైజర్స్కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్రైజర్స్తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్రైజర్స్పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
SRH Vs LSG: జెయింట్స్ సూపర్ విక్టరీ
ఉప్పల్ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్రైజర్స్ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది. బలహీన బౌలింగ్గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్ మార్ష్లు సన్రైజర్స్కు వారి బ్యాటింగ్ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్లు), అనికేత్ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్లు), నితీశ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్లో కీలక పరుగులు సాధించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. అభిషేక్, ఇషాన్ విఫలం సన్రైజర్స్కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను పూరన్ వదిలేశాడు. అదే ఓవర్లో బిష్ణోయ్ కూడా కఠినమైన మరో రిటర్న్ క్యాచ్ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్ను ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రిన్స్కు ఐపీఎల్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో ఎండ్లో బాగా తడబడిన నితీశ్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అయితే అనికేత్, ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18; 3 సిక్స్లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్లు బాదిన అనికేత్...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. మెరుపు భాగస్వామ్యం... షమీ తన తొలి ఓవర్లో మార్క్రమ్ (1)ను అవుట్ చేసిన ఆనందం రైజర్స్ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్ కలిసి రైజర్స్ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్ ఓవర్లో పూరన్ ఫోర్, 2 సిక్స్లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్లు కొట్టాడు. అభిషేక్ ఓవర్లో కూడా పూరన్ 2 సిక్స్లు కొట్టడంతో పవర్ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్ మరింత చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్ (15) అవుటైనా... మిల్లర్ (13 నాటౌట్), సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు. మూడు బంతులు, మూడు సిక్సర్లు... సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అతను, అవేశ్ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనూహ్య రనౌట్... టాప్–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్ ఆశలన్నీ క్లాసెన్పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతను రనౌట్ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్ వేసిన బంతిని నితీశ్ బలంగా బాదగా బౌలర్ దానిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్ స్ట్రయికింగ్ స్టంప్స్ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటిన క్లాసెన్ రనౌటవక తప్పలేదు. ఎవరీ అనికేత్ వర్మ...? ఐదు సిక్సర్లతో సన్రైజర్స్ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్ వర్మ గత మ్యాచ్తోనే ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్ కొట్టాడు. ఐపీఎల్కు ముందు అతను సీనియర్ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అనికేత్ హైదరాబాద్తో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. దేశవాళీ అండర్–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో కూడా చెలరేగిన తీరును చూసి సన్రైజర్స్ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు. ఐపీఎల్లో నేడుచెన్నై X బెంగళూరువేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) ప్రిన్స్ 47; అభిషేక్ (సి) పూరన్ (బి) శార్దుల్ 6; ఇషాన్ కిషన్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; నితీశ్ రెడ్డి (బి) రవి బిష్ణోయ్ 32; క్లాసెన్ (రనౌట్) 26; అనికేత్ (సి) మిల్లర్ (బి) రాఠీ 36; అభినవ్ మనోహర్ (సి) సమద్ (బి) శార్దుల్ 2; కమిన్స్ (సి) రాఠీ (బి) అవేశ్ 18; హర్షల్ (నాటౌట్) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్ల్ 1; సిమర్జీత్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–34–4, అవేశ్ ఖాన్ 4–0–45–1, దిగ్వేశ్ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్ 4–0–42–1, ప్రిన్స్ యాదవ్ 4–0–29–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) కమిన్స్ 52; మార్క్రమ్ (సి) కమిన్స్ (బి) షమీ 1; పూరన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 70; పంత్ (సి) షమీ (బి) హర్షల్ 15; బదోని (సి) హర్షల్ (బి) జంపా 6; మిల్లర్ (నాటౌట్) 13; సమద్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్: అభిషేక్ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్ సింగ్ 2–0–28–0, కమిన్స్ 3–0–29–2, ఆడమ్ జంపా 4–0–46–1, హర్షల్ పటేల్ 2–0–28–1, ఇషాన్ కిషన్ 0.1–0–4–0. -
పూరన్, మార్ష్ విధ్వంసం.. సన్రైజర్స్ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఊదిపడేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం తన బ్యాట్కు పనిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు.నాలుగేసిన శార్ధూల్..ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ -
IPL 2025: మెగా వేలంలో అన్ సోల్డ్.. కట్ చేస్తే పంత్ టీమ్లోకి ఎంట్రీ
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ లేట్గా ఐపీఎల్-2025లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ మెగా వేలంలో అన్ సోల్డ్గా ఉన్న శార్దూల్ను తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. లక్నో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహిసిన్ ఖాన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరం కావడంతో అతనికి ప్రత్యామ్నాయంగా శార్దూల్ ఎంపిక జరిగింది. శార్దూల్ను రిజిస్టర్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) నుంచి లక్నో ఎంపిక చేసుకుంది. లక్నో అతన్ని బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. శార్దూల్ ఎంపికతో బలహీనంగా ఉన్న లక్నో పేస్ బౌలింగ్ విభాగానికి కొత్త జోష్ వచ్చింది. ఈ సీజన్లో లక్నో పేస్ బౌలింగ్ యూనిట్ గాయాలతో సతమతమవుతుంది. ఆ జట్టు పేస్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్, సీనియర్లు ఆవేశ్ ఖాన్, ఆకాశ్దీప్ గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న మయాంక్ ఏప్రిల్ 15 తర్వాత జట్టులో చేరతాడని తెలుస్తుంది. ఆవేశ్ ఖాన్, ఆకాశ్దీప్ లక్నో తొలి మూడు మ్యాచ్ల తర్వాత జట్టులో చేరతారని సమాచారం.ఇటీవలికాలంలో దేశవాలీ మ్యాచ్ల్లో అదరగొట్టిన శార్దూల్ను ఎందుకో మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. లేట్గా అయినా శార్దూల్ ఐపీఎల్ 2025లోకి ఎంట్రీ ఇచ్చాడు. 33 ఏళ్ల శార్దూల్కు ఐపీఎల్లో 95 మ్యాచ్ల అనుభవం ఉంది. ఇందులో అతను 94 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో శార్దూల్ ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఇటీవలి దేశవాలీ సీజన్లో శార్దూల్ బ్యాట్తోనూ మెరిపించాడు. శార్దూల్కు ఐపీఎల్లో ఐదు జట్లకు (పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సీఎస్కే, ఢిల్లీ, కేకేఆర్) ఆడిన అనుభవం ఉంది. అతను ఐపీఎల్లో రెండు టైటిళ్లలో భాగమయ్యాడు. 2018, 2021లో సీఎస్కే విన్నింగ్ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ టైటిల్ వేటను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్తో ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ సెకెండ్ హోం గ్రౌండ్ అయిన వైజాగ్లో జరుగనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లలో (2022, 2023) మూడో స్థానంలో నిలిచి, గత సీజన్లో (2024) ఏడో స్థానానికి పడిపోయింది. గత సీజన్లో లక్నో ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. ఈ కారణంగానే ఆ జట్టు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా దించేసి రిషబ్ పంత్ను కొత్త కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. పంత్ను లక్నో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్..రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హిమ్మత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, యువరాజ్ చౌదరీ, షాబాజ్ అహ్మద్, మిచెల్ మార్ష్, అర్శిన్ కులకర్ణి, ఆర్ఎస్ హంగార్గేకర్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆకాశ్దీప్, మణిమారన్ సిద్దార్థ్, షమార్ జోసఫ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రతీ -
ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్లోకి ఎంట్రీ?
ఐపీఎల్-2025 ఆరంభానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తేరలేవనుంది. ఈ క్రమంలో మొత్తం పది ఫ్రాంచైజీలు గాయాల కారణంగా దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన లక్నో పాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్ధూల్ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్ వైజాగ్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్తో కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్లో ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో శార్ధూల్ ఠాకూర్ అమ్ముడు పోలేదు. రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.కానీ ఇప్పుడు మరోసారి అతడికి ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం లక్నో జట్టు కల్పించింది. కాగా శార్థూల్తో ఒప్పందంపై లక్నో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. శార్ధూల్ ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో ఢిల్లీ జట్టు సభ్యులతో కన్పించాడు.ఐపీఎల్లో అదుర్స్.. కాగా ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ మంచి రికార్డు ఉంది. శార్థూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 95 మ్యాచ్లు ఆడిన లార్డ్ ఠాకూర్.. 307 పరుగులతో పాటు 94 వికెట్లు పడగొట్టాడు. 2017 నుంచి అతడు అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆడాడు. గతేడాది మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది.వీక్గా పేస్ బౌలింగ్ యూనిట్..కాగా లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలింగ్ విభాగం చాలా వీక్గా కన్పిస్తోంది. పేస్ అటాక్లో భాగంగా ఉన్న ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరూ ఇంకా లక్నో జట్టుతో చేరలేదు. మోహ్షిన్ ఖాన్ అయితే పూర్తిగా ఈ ఏడాది సీజన్కే దూరమయ్యాడు. ప్రస్తుతం షెమార్ జోషఫ్, ప్రిన్స్ యాదవ్, రాజవర్ధన్ హంగర్గేకర్ వంటి యువ పేసర్ల లక్నో జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో శార్థూల్ ఠాకూర్ లక్నో జట్టుకు కీలకంగా మారే అవకాశముంది.చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్ 2025-26 కౌంటీ సీజన్ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్తో డీల్లో శార్దూల్ ఏడు మ్యాచ్లు ఆడనున్నాడు. శార్దూల్ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్.. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్ చివరిగా 2023 బాక్సింగ్ డే టెస్ట్లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్ దేశవాలీ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్లో రాణిస్తుండటంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాట్తోనూ సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో శార్దూల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో ముంబై సెమీస్కు చేరడంలో శార్దూల్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్ విదర్భతో జరుగుతున్న సెమీస్లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఓ వికెట్ తీసి, 37 పరుగులు చేశాడు.కష్టాల్లో ముంబైవిదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (67 నాటౌట్), తనుశ్ కోటియన్ (5) ముంబైను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విదర్భ యువ స్పిన్నర్ పార్థ్ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ షోరే (74), దనిశ్ మలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు. -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్లో రహానే విఫలంఈ క్రమంలో కోల్కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్డౌన్లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. తొలుత హ్యాట్రిక్, ఇప్పుడు..?
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్లో ముంబై ఆల్రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది. 90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు. -
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
మేఘాలయ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన మేఘాలయ తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul Thakur) హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి దెబ్బతీశాడు. అతడి ధాటికి మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మేఘాలయ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.152 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆరు వికెట్లకు అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా మేఘాలయ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఎసీసీ క్రికెట్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంది. 1872లో లార్డ్స్లో సర్రేతో జరిగిన మ్యాచ్లో ఎంసీసీ ఖాతా తెరవకుండానే తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ లిస్ట్లో ఎంసీసీ, మేఘాలయ తర్వాతి స్ధానాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (3-6), లీసెస్టర్షైర్(4-6), నార్తాంప్టన్షైర్(4-6) ఉన్నాయినాలుగేసిన శార్ధూల్..ఇక ఈ మ్యాచ్లో శార్థూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. మేఘాలయ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్గా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్.. 43 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.అతడితో పాటు మొహిత్ అవస్థి మూడు, సిల్వస్టర్ డిసౌజా రెండు , షామ్స్ ములానీ ఒక్క వికెట్ సాధించారు. మేఘాలయ బ్యాటర్లలో టెయిలాండర్ హీమ్యాన్(28) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: RT 2025: హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై స్టార్ ఆల్రౌండర్, టీమిండియా వెటరన్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో శార్ధూల్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు.ముంబై బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించిన శార్దూల్ తొలి ఓవర్లోనే మేఘాలయ ఓపెనర్ నిశాంత చక్రవర్తిని డకౌట్ చేసి పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.దీంతో తొలి ఫస్ట్క్లాస్ క్రికెట్ హ్యాట్రిక్ను ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి దెబ్బకు మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మేఘాలయ కెప్టెన్ ఆకాష్ చౌదరి(14), ప్రింగ్సాంగ్ సంగ్మా(18) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఓవర్లకు మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ,జైశ్వాల్,రహానే, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట, ఠాకూర్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో ఈ ముంబై క్రికెటర్ రాణించాడు.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఠాకూర్ చివరగా భారత్ తరుపున 2023లో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే శార్ధూల్ తన రిథమ్ను తిరిగి పొందాడు. దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్తో టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చదవండి: SA 20: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్చేస్తే! సూపర్ సెంచరీ
శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ-కాశ్మీర్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో ముంబై తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లో ముంబై స్టార్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానే వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. లార్డ్ శార్థూల్ విరోచిత పోరాటంతో తన జట్టును అదుకున్నాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో 188 పరుగుల ఆధిక్యంలో ముంబై కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శార్థూల్తో పాటు మరో ఆల్రౌండర్ తనీష్ కొటియన్(58 నాటౌట్) ఉన్నారు.జమ్మూ బౌలర్లలో ఔకిబ్ నబీ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమర్ నజీర్ మీర్, యుధ్వీర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా పదేళ్ల తర్వాత రంజీ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్లలోనూ తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అతడితోపాటు జైశ్వాల్(4, 26), రహానే(12, 16) విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో ముంబై 120 పరుగులకు ఆలౌట్ కాగా.. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది. ఇక శార్దూల్ తొలి ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి భారత జట్టులోకి పునరాగమనం చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఠాకూర్కు సెలక్లర్లు రీకాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విశ్వరూపం ప్రదర్శించాడు. నాగాలాండ్తో ఇవాళ (డిసెంబర్ 31) జరుగుతున్న మ్యాచ్లో శార్దూల్ బ్యాట్తో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.సిక్సర్ల సునామీ సృష్టించిన శార్దూల్ 260.71 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుశ్ మాత్రే రికార్డు శతకంఈ మ్యాచ్లో ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్.భారీ భాగస్వామ్యంఈ మ్యాచ్లో మాత్రే.. అంగ్క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మాత్రే.. సిద్దేశ్ లాడ్తో కలిసి మూడో వికెట్కు 96 పరుగులు జోడించాడు. డబుల్ సెంచరీకి చేరువైన మాత్రే మూడో వికెట్గా వెనుదిరిగాడు.మాత్రే, శార్దూల్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవుముంబై ఇన్నింగ్స్లో మాత్రే, శార్దూల్ ఠాకూర్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు. బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నాగాలాండ్404 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతం జరిగేతే తప్ప ఈ మ్యాచ్లో నాగాలాండ్ గెలవలేదు. 36.4 ఓవర్ల అనంతరం నాగాలాండ్ స్కోర్ 115/6గా ఉంది. జగదీష సుచిత (46), లెమ్టూర్ (2) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్ రుపేరో (53) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో నాగలాండ్ గెలవాలంటే 80 బంతుల్లో 289 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.బంతితోనూ రాణించిన శార్దూల్బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఈ మ్యాచ్లో బంతితోనూ రాణించాడు. బౌలింగ్ అటాక్ను మొదలుపెట్టిన శార్దూల్ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఓవర్ ఉంది.స్టార్లకు విశ్రాంతిఈ మ్యాచ్లో ముంబై యాజమాన్యం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్గా అతడే!? -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్కు అనుకూలమైన ఆసీస్ పిచ్లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
వంద శాతం ఫిట్గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఆరంభ మ్యాచ్లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్నెస్పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు ముందు రెడ్బాల్తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్న్యూస్ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్అయితే, ఆల్రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ 2-0తో క్లీన్స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
కెప్టెన్గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్బాల్ మ్యాచ్లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ఆల్రౌండర్ వచ్చేశాడు..!
టీమిండియాకు శుభవార్త. స్టార్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు నెలల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులో జరిగిన కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో శార్దూల్ పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతను ముంబై జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. నిన్న కేఎస్సీఏ సెక్రటరీ ఎలెవెన్తో జరిగిన మ్యాచ్లో శార్దూల్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. బ్యాటింగ్లో డకౌటైన అతను.. బౌలింగ్లో ఎనిమిది ఓవర్లు వేసి వికెట్ లేకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ రాణించకపోయినా లాంగ్ టెస్ట్ సీజన్కు ముందు భారత్కు ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అందుబాటులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు భారత సెలెక్టర్లు శార్దూల్ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కుదరకపోయినా ఆసీస్లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శార్దూల్కు అవకాశం ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఆసీస్లో జరిగిన గత బీజీటీలో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. అక్కడి పిచ్లు శార్దూల్ బౌలింగ్ స్టయిల్కు అనుకూలిస్తాయి. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా కావడంతో శార్దూల్ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు. కాగా, శార్దూల్ 2024 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. శార్దూల్కు జూన్ 12న లండన్లో కాలి మడమకు సర్జరీ జరిగింది. శార్దూల్ త్వరలో జరిగే ఇరానీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడతాడు. ఆ మ్యాచ్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్ సీజన్ త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి వరకు భారత్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో రెండు, న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లలో భారత్ పాల్గొంటుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాతో రెండు టెస్ట్ల అనంతరం భారత్ అదే జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి -
టీమిండియా స్టార్ ప్లేయర్కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం
కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఠాకూర్కు శస్త్ర చికిత్స నిర్వహించారు.అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను ఠాకూర్ షేర్ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్గా ఠాకూర్ ఇచ్చాడు. కాగా ఠాకూర్ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్కు ఠాకూర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్ భావోద్వేగం
“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను. బౌలింగ్లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు. అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. I.C.Y.M.I The Mumbai team gave a Guard Of Honour on Day 1 to Dhawal Kulkarni, who is playing his final first-class game 👏@dhawal_kulkarni | @IDFCFIRSTBank | #Final | #MUMvVID Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/LTCs0142fc — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024 కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్కు చేరుకున్న ముంబై.. టైటిల్ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్కు దిగిన విదర్భను ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. The experience of Dhawal Kulkarni provides Mumbai a wicket in the evening session! Vidarbha lose the crucial wicket of Karun Nair. Follow the match ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/VNk7HAkgSU — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024 ధవళ్ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI) మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్ రెండు, శార్దూల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ధవళ్ కులకర్ణి రిటైర్మెంట్ ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్ కులకర్ణి ఈ మ్యాచ్ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్ పేసర్.. మోహిత్ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధవళ్ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు. చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్ దంచికొట్టి హీరోలుగా! -
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. భీకరఫామ్లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్పాండే (14) ఈ మ్యాచ్లో చేతులెత్తేశారు. బ్యాటింగ్లో రాణించిన శార్దూల్.. బౌలింగ్లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
తమిళనాడును చిత్తు చేసిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశం
ముంబై క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ జట్టు ఇన్ని సార్లు ఫైనల్స్కు అర్హత సాధించలేదు. ముంబై తర్వాత ఆత్యధికంగా (14) కర్ణాటక/మైసూర్ ఫైనల్స్కు చేరింది. ఈ రెండు జట్ల తర్వాత ఢిల్లీ (15), మధ్యప్రదేశ్/హోల్కర్ (12), బరోడా (9), సౌరాష్ట్ర (5), విదర్భ (2), బెంగాల్ (15), తమిళనాడు/మద్రాస్ (12), రాజస్థాన్ (10), హైదరాబాద్ (5) అత్యధిక సార్లు ఫైనల్స్కు అర్హత సాధించాయి. దేశవాలీ టోర్నీలో 48 సార్లు ఫైనల్స్కు చేరిన ముంబై ఏ జట్టుకు ఊహకు సైతం అందని విధంగా 41 సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు అనూహ్య రీతిలో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళ (మార్చి 4) ముగిసిన రెండో సెమీఫైనల్లో ముంబై తమిళనాడును ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండ్ షోతో (109, 4 వికెట్లు) ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. శార్దూల్ ఠాకూర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో సైతం చేతులెత్తేసిన తమిళనాడు 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు మధ్యప్రదేశ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ 199 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతుంది. -
శార్దూల్, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్ పైచేయి
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. హిమాన్షు సూపర్ సెంచరీ.. నాగ్పూర్లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్గా నిలిచాడు. శతక్కొట్టిన శార్దూల్.. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్.. మొట్టమొదటిది
ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్ను సాధించాడు. జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్కు ఇది మొదటి సెంచరీ. Shardul Thakur 🫡pic.twitter.com/6ySG9JOwcA — CricTracker (@Cricketracker) March 3, 2024 శార్దూల్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 88 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి, 157 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తనుశ్ కోటియన్ (40), తుషార్ దేశ్పాండే క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. హార్దిక్ తామోర్ (35) పర్వాలేదనిపించాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. కుల్దీప్ సేన్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ దక్కించకున్నారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు. ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్లో ఉంది. -
దుమ్ములేపిన శార్దూల్, తుషార్.. విఫలమైన పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత.. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్.. తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్బౌలర్లు మోహిత్ అవస్థి, తుషార్ దేశ్పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్.. ఎన్ జగదీశన్(4) రూపంలో వికెట్ దక్కించుకోగా.. ప్రదోష్ పాల్(8), కెప్టెన్ సాయి కిషోర్(1), ఇంద్రజిత్ బాబా(11) వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్ శంకర్(44)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేసి మరోసారి బ్రేక్ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్ సుందర్(43)ను స్పిన్నర్ తనుశ్ కొటియాన్ పెవిలియన్కు పంపాడు. ఓవరాల్గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో పేసర్లు శార్దూల్ రెండు, తుషార్ దేశ్పాండే మూడు, మోహిత్ అవస్థి ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు తనుశ్ కొటియాన్, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్ చేసి.. బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది. Early Breakthroughs for Mumbai 🙌 Shardul Thakur and Mohit Avasthi get the big wickets of Sai Sudharsan and N Jagadeesan, respectively 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2 Follow the match ▶️ https://t.co/697JfqUC9i pic.twitter.com/H1cgkXWzpO — BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024 -
రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఇరగదీశారు. సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్లో శివమ్ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్కే ఆటగాళ్లు ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఐదో సారి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్కు సంబంధించి సీఎస్కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. కాగా, సీఎస్కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్ ఠాకూర్ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్ క్రీజ్లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్లో ఉంది. సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/59), వరుణ్ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. -
మెరుపు శతకంతో విరుచుకుపడిన శివమ్ దూబే
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఆటగాడు శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్లో రెండో అత్యధిక స్కోర్ 31 పరుగులు (షమ్స్ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. గత మ్యాచ్లో రెస్ట్ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ (2) క్రీజ్లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్లో పృథ్వీ షా 30, భుపేన్ లాల్వాని 0, హార్దిక్ తామోర్ 22, కెప్టెన్ అజింక్య రహానే 22, సుయాంశ్ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్ తొలి ఇన్నింగ్స్లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్ జోహ్రి, రాహుల్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ లచిత్, కునాల్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే మొదలైన ఈ మ్యాచ్లో అసోం టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసోం ఇన్నింగ్స్లో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్.. 84 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ది
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఆసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. కేవలం 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అసోం 84 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అసోం ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. SHARDUL THAKUR MASTERCLASS 🤯 - Thakur took 6 wickets for just 21 runs against Assam in Ranji Trophy. pic.twitter.com/usthQsPu2Z — Johns. (@CricCrazyJohns) February 16, 2024 అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై టీ విరామం (24.4 ఓవర్లు) సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లలో పృథ్వీ షా వేగంగా 30 పరుగులు చేసి ఆకట్టుకోగా.. భుపేన్ లల్వాని డకౌటయ్యాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన హార్దిక్ తామోర్ 22 పరుగులు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు సుయాంశ్ షేడ్గే డకౌటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే (18), శివమ్ దూబే (26) క్రీజ్లో ఉన్నారు. అసోం బౌలర్లలో రాహుల్ సింగ్ 2, సునలీ లచిత్, దిబాకర్ జోహ్రి తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
శివం దూబే దూరం.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ!
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్రౌండర్ శివం దూబే ఫస్ట్క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బెంగాల్తో మ్యాచ్లో కెప్టెన్గా హిట్ ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో దూబే 72 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ నాకౌట్ మ్యాచ్ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్గఢ్తో మ్యాచ్కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు. చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
IND Vs SA: 'దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. అతడి కంటే అశ్విన్ను తీసుకోవడమే బెటర్'
కేప్ టౌన్లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్లో తిరిగి పుంజుకుని సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తమ సొంత గడ్డపై మరోసారి భారత్ను చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కేప్టౌన్కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు భారత తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. జడ్డూ ప్లేయింగ్ ఎలెవన్లోకి వస్తే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బదులుగా అశ్విన్ ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. అశ్విన్ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలి. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ అని నేను భావిస్తున్నాను. జడేజా ఫిట్నెస్ సాధించినప్పటికీ శార్దూల్ స్థానంలో అశ్విన్ను ఆడించాలి. అశ్విన్ ఐదు వికెట్ల హాల్స్ సాధించికపోయినప్పటికీ.. ఒకట్రెండు వికెట్లైనా తీయగలడు. అతడు జడేజాతో కలిసి ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వీరిద్దరూ కలిసి నాలుగు-ఐదు వికెట్ల తీయగలరు. కేప్టౌన్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ కూడా సఫారీలను ఓడించవచ్చు. కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడిన పేసర్ ప్రసిద్ద్ కృష్ణను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్ధూల్పై వేటు వేయడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: Aus Vs Pak 3rd Test: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్కు దిగలేదు. దీంతో అతను కేప్టౌన్లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
నెట్స్లో రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా స్టార్కు గాయం
South Africa Vs India 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్కు సన్నద్ధం అవుతోంది. లోపాలు సవరించుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు వీలుగా నెట్స్లో చెమటోడుస్తోంది. ముఖ్యంగా సెంచూరియన్ టెస్టులో ఓపెనర్గా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ మరింత కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హిట్మ్యాన్ కఠిన ప్రాక్టీస్ నెట్స్లో వైవిధ్యమైన బంతులు ఎదుర్కొంటూ కేప్టౌన్ టెస్టుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ సందర్భంగా భారత పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడినట్లు సమాచారం. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. The Indian skipper @ImRo45 at Centurion nets. #INDvSA Video Courtesy: @kushansarkar pic.twitter.com/p0pvmbkyEX — Kushan Sarkar (@kushansarkar) December 30, 2023 షార్ట్ బాల్ను ఆడటంలో విఫలమైన శార్దూల్.. బంతి ఎడమ భుజానికి తాకడంతో నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి ఐస్ప్యాక్ పెట్టాడు. అయితే, నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించకపోవడంతో అతడు మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్కు కూడా అందుబాటులో ఉండలేకపోయాడు. పూర్తిగా విఫలమైన శార్దూల్.. యువ పేసర్ ఎంట్రీ! ఒకవేళ నొప్పి తీవ్రతరమైతే అతడిని స్కానింగ్ పంపాలని వైద్య సిబ్బంది భావిస్తోంది. కాగా ఒకవేళ గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలా గాకుండా శార్దూల్ అందుబాటులో ఉన్నా కూడా మేనేజ్మెంట్ అతడిపై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆల్రౌండర్గా అతడి ప్రదర్శన దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. సెంచూరియన్లో జరిగిన బాక్సింగ్ డే మ్యాచ్లో శార్దూల్ 19 ఓవర్ల బౌలింగ్లో ఏకంగా 100 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక బ్యాటర్గా తొలి ఇన్నింగ్స్లో 24 పరుగులతో పర్వాలేదనిపించిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం రెండు పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: Future Legend: గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్ సైతం... STORY | Shardul Thakur gets hit on shoulder at nets in South Africa READ: https://t.co/CCreEtNC8Q VIDEO: #INDvsSA pic.twitter.com/4357zyDm3J — Press Trust of India (@PTI_News) December 30, 2023 -
IND Vs SA: దక్షిణాఫ్రికా బౌలర్ రాకాసి బౌన్సర్.. శార్దూల్కు తప్పిన ప్రమాదం
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు పెను ప్రమాదం తప్పింది. ఏమి జరిగిందంటే? భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్గా సంధించాడు. శార్ధూల్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి హెల్మెట్కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్లో మళ్లీ బంతి శార్ధూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు. చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ -
IPL 2024: స్టార్క్, కమిన్స్లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్కు జాక్పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్ను 17.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక..
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్తో మ్యాచ్కు దూరమైన పాండ్యా.. మరికొన్ని మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. లిగమెంట్ టియర్(మోకాలి జాయింట్లో) కూడా ఉందనిపిస్తోంది. కాబట్టి కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమవుతుంది. గాయం పూర్తిగా తగ్గకముందు ఎన్సీఏ అతడిని ఆడేందుకు అస్సలు పంపించదు. అయితే, వైద్య బృందం నిరంతరం పాండ్యాను పర్యవేక్షిస్తూ మేనేజ్మెంట్కు ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తోంది. అతడు కోలుకునేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అతడు మైదానంలో దిగేలా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. అయితే, పాండ్యా లీగ్ దశ ముగిసేనాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్న మేనేజ్మెంట్ అతడి స్థానాన్ని వేరే ప్లేయర్తో భర్తీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిపింది. కాగా ప్రపంచకప్-2023లో హార్దిక్ పాండ్యా బ్యాట్తో రాణించడంతో పాటు కీలక వికెట్లు తీసి బౌలింగ్లోనూ రాణించాడు. అయితే, మరో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నప్పటికీ పాండ్యా స్థానాన్ని అతడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవచ్చు. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్తో ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్తో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్ ఠాకూర్.. మహ్మద్ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అఫ్గనిస్తాన్ వంటి జట్టుతో మ్యాచ్లో కూడా నంబర్ 8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత గొప్ప బ్యాటరేమీ కాదు! కానీ.. ఇలాంటి టీమ్స్తో ఆడినపుడు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్ ఏమీ గొప్ప బ్యాటర్ కాదు. ఎనిమిదో నంబర్లో అతడు కేవలం రన్-ఏ- బాల్ ప్లేయర్ మాత్రమే. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్తో మ్యాచ్లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెపాక్లో అశ్విన్.. ఢిల్లీలో శార్దూల్ చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ‘లోకల్ స్టార్’ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో రెండో మ్యాచ్లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అరుణ్జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్ను తీసుకోవడం సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలకు నచ్చలేదు. పాక్తో మ్యాచ్లో షమీని ఆడిస్తేనే బెటర్ ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆసీస్పై 6 వికెట్లు, అఫ్గన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్జోష్లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్! కానీ.. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ
తొలి వన్డేలో ఆసీస్పై విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన బావిస్తోంది. ఇక రెండో వన్డేలో భారత ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో వన్డేలో విఫలమైన శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొదటి మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలి వన్డేకు దూరమైన మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, కారీ .. ఇండోర్ వన్డేకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అబాట్, షార్ట్, ఇంగ్లీస్ బెంచ్కు పరిమిత మయ్యే ఛాన్స్ ఉంది. పిచ్ రిపోర్ట్ ఇండోర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఈ వికెట్పై భారీ స్కోర్లు నమోదు అవ్వడం ఖాయం. అయితే ఈ వికెట్పై కాస్త బౌన్స్ కూడా ఉంటుంది. ఇది బౌలర్లకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాక్స్వెల్, ఆడమ్ జంపా -
ఇదేమి బౌలింగ్రా బాబు.. ఇతడితోనా వరల్డ్కప్ ఆడేది! రోహిత్ సపోర్ట్తోనే!!
వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ప్రదర్శన మాత్రం అందరనీ కలవరపెడుతోంది. మొహాలీ వన్డేలో శార్ధూల్ ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో శార్ధూల్ పూర్తిగా తేలిపోయాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. మిగితా నలుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టగా.. శార్ధూల్ మాత్రం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. వికెట్ మాట పక్కన పెడితే.. తన బౌలింగ్తో బ్యాటర్లను కనీసం కట్టడి కూడా చేయలేకపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన శార్ధూల్ ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు. అర్ష్దీప్ను ఎంపిక చేయాల్పింది.. కాగా వరల్డ్కప్కు ఎంపిక చేసిన భారత జట్టులో శార్ధూల్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వరల్డ్కప్కు ముందు ఇటువంటి ప్రదర్శన చేసిన శార్ధూల్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతడు ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఆర్హుడు కాదని, అతడిలో ఏమి టాలెంట్ చూసి సెలక్టర్లు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. Shardul Thakur potentially will bowl at the death for us in the World Cup..#INDvsAUS pic.twitter.com/B3Dz3VI2NO — Sanchit Desai (@sanchitd43) September 22, 2023 అతడి స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ను ఎంపిక చేయాల్సందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సపోర్ట్తోనే శార్థూల్ జట్టులో కొనసాగతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక రెండో వన్డేకు అతడిపై వేటు పడే ఛాన్స్ ఉంది. What a shame that shardul thakur will be our third Pacer in the world cup, he is nothing without luck!😭#INDvsAUS pic.twitter.com/AVBkuns8pC — Y𝕏 Samar (@Yrtweets) September 22, 2023 -
పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్ల ధాటికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో నేపాల్పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జరిగిన రెండు మ్యాచ్లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. షమీని కాదని శార్దూల్ను తీసుకుంటే ఇందులో భాగంగా పాక్తో మ్యాచ్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. షమీ- శార్దూల్ (PC: BCCI) ఇక నేపాల్తో మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్తో తదుపరి మ్యాచ్లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే ‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి. అలా కాకుండా.. పాకిస్తాన్తో మ్యాచ్లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు. రిజర్వ్ డే కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? -
IND Vs PAK: ప్రాక్టీస్లో టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ ‘గెలుపు’! కానీ..
Asia Cup 2023 Ind vs Pak: ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థిపై గెలవాలనే పట్టుదలతో నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్బౌలర్ల బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పెనాల్టీ షూటౌట్ ఇక ఆదివారం(సెప్టెంబరు 10) నాటి మ్యాచ్ కోసం గురవారం నుంచే నెట్ సెషన్ ఆరంభించిన టీమిండియా.. శుక్రవారం కూడా ప్రాక్టీసులో తలమునకలైంది. శుబ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు.. పెనాల్టీ షూటౌట్తో సరదాగా గడిపారు. అయ్యర్ గెలిచాడు భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి ఫుట్బాల్ను కిక్ చేస్తూ పోటీపడ్డారు. ఇందులో సూర్య, గిల్, శార్దూల్ ఓడిపోగా.. శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్టంప్ను హిట్ చేయగా.. దిలీప్ తన్నిన బంతి మూడు స్టంప్స్ను తాకింది. దీంతో వాళ్లిదరిని ఎత్తుకుని విన్నర్స్ అంటూ సెలబ్రేట్ చేశారు మిగతా ఆటగాళ్లు. పాక్తో ఆ మ్యాచ్ రద్దు.. ఈసారి ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘లక్ష్యం చేరుకోవడంలో అలసత్వం లేదు. ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మున్ముందుకు’’ అంటూ దీనికి #TeamIndia #AsiaCup హ్యాష్ట్యాగ్లతో క్యాప్షన్ జతచేసింది. కాగా పాకిస్తాన్తో పల్లెకెలె మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ క్రమంలో రోహిత్ సేన 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం తేలలేదు. ఇక మరి కొలంబోలో ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి! చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
జింబాబ్వేపై ఆడాడని వరల్డ్కప్కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజువేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. అయితే ఈ మెగా టోర్నీ కోసం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై చాలా మంది భారత మాజీ క్రికెటర్లు పెదవివిరుస్తున్నారు. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేరాడు. ఆల్రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ను తీసుకువడంపై శ్రీకాంత్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఇంకా పూర్తిస్థాయి ఆల్రౌండర్గా మారలేదని అతడు చెప్పుకొచ్చాడు. అసలేందుకు ఎంపిక చేశారు? "శార్దూల్ ఠాకూర్ను వరల్డ్కప్కు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. 8వ స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు కావాలని అందరూ అంటున్నారు. ఆ స్దానంలో అతడు వచ్చి 10 పరుగులు మాత్రమే చేస్తున్నాడు. అది సరిపోతుందా? అలాగే 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేయడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో అతడు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో మనం చూశాం. కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడు జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై చేసిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై ప్రదర్శన చేస్తే ఒత్తడి ఎలా ఉంటుందో తెలుస్తోంది. చిన్న జట్లపై ఆడింది వేరు వరల్డ్కప్ వంటి టోర్నీల్లో వేరు. వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేముందు ఓవరాల్ సగటు కాకుండా వ్యక్తిగత ప్రదన్శనలను పరిగణలోకి తీసుకోవాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ఓ సారి పరిశీలించండి. అన్నివిధాలగా సమతుల్యతగా ఉందని స్టార్స్పోర్ట్స్ షోలో కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ప్రపంచకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్కప్ విన్నర్ అరెస్టు! -
WC 2023: శ్రేయస్ అయ్యర్కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు..
Gautam Gambhir's Picks For India's ICC World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన జట్టును ఎంచుకున్నాడు. అనూహ్యంగా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్కు మాత్రం చోటివ్వని గౌతీ.. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత తొలిసారి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో వరల్డ్కప్ టోర్నీకి తెరలేవనుంది. సొంతగడ్డపై ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్ ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. టీమిండియాతో పాటు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్కప్ టైటిల్ వేటకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల తుది జట్ల కూర్పు ఎలా ఉండాలన్న అంశంపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయ్యర్తో పాటు వాళ్లకూ నో ఛాన్స్ ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ 15 మంది సభ్యుల టీమిండియాను ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా.. శ్రేయస్ అయ్యర్ను విస్మరించిన గౌతీ.. ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కని వాషింగ్టన్ సుందర్కు స్థానం కల్పించాడు. అంతేకాదు.. సూర్యకుమార్ యాదవ్ తప్పక జట్టులో ఉండాలన్న ఈ కామెంటేటర్.. తిలక్ వర్మకు అవకాశం ఇవ్వలేదు. ఇక సంజూ శాంసన్ను పక్కనపెట్టి.. కేఎల్ రాహుల్కు బ్యాకప్ కీపర్గా ఇషాన్ కిషన్ను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా నాలుగో ఫాస్ట్బౌలర్గా శార్దూల్ ఠాకూర్ను కాదని కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణకు టాప్-15లో చోటు కల్పించాడు. గౌతీ జట్టుపై ఫ్యాన్స్ కామెంట్స్ దీంతో వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న అయ్యర్ను కాదని.. సూర్యకు చోటివ్వడం.. అలాగే పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కేఎల్ రాహుల్ కోసం సంజూను బలిచేయాలనడం సరికాదంటూ గౌతీ టీమ్పై టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ఏ ప్రాతిపదికన ఈ జట్టును ఎంపిక చేశాడో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం గౌతం గంభీర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
నేపాల్తో మ్యాచ్.. శార్ధూల్పై వేటు! షమీకి ఛాన్స్!
ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూనపై గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్పై భారత్ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. బ్యాటింగ్కు మంచి ఛాన్స్.. ఇక పాకిస్తాన్తో మ్యాచ్తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్ టాపర్డర్ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్లోకి రావడానికి నేపాల్తో మ్యాచ్ మంచి అవకాశం. నేపాల్పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్పై టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా(87) ఇషాన్ కిషన్(82) మాత్రం కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు. శార్ధూల్పై వేటు.. షమీకి ఛాన్స్ ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో షమీకి కాదని శార్థూల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్ ఆల్రౌండర్కు జట్టు మెన్జ్మెంట్ అవకాశం ఇచ్చింది. మెనెజ్మెంట్ నమ్మకన్ని శార్ధూల్ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్తో మ్యాచ్కు శార్ధూల్ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెన్జెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
IND VS PAK: షమీని కాదని శార్దూల్ను తీసుకుంది ఇందుకేనా..?
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇషాన్, హార్ధిక్ ఔటవ్వగానే రవీంద్ర జడేజా (14), శార్దూల్ ఠాకూర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లారు. కేవలం 3 పరుగుల వ్యవధిలో హార్దిక్, జడేజా, శార్దూల్ ఔటయ్యారు.దీంతో 48.5 ఓవర్లలో టీమిండియా ఇన్నింగ్స్కు తెరపడింది. 266 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఆఖర్లో బుమ్రా (16) అడపాదడపా బ్యాట్ను ఝులిపించడంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. ఇదిలా ఉంటే, షమీని కాదని శార్దూల్ను తుది జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తలాతోకా లేని లాజిక్ చెప్పి షమీని పక్కకు పెట్టాడని దుయ్యబడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసమని కీలక బౌలర్ను పక్కకు పెట్టడమేంటని అక్షింతలు వేస్తున్నారు. శార్దూల్ కేవలం 3 పరుగులు చేసి ఔటైన విధానాన్ని చూసి, ఇందుకేనా షమీని కాదని ఇతన్ని తీసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ మాత్రం బ్యాటింగ్ షమీ చేయలేడా అని అంటున్నారు. శార్దూల్ కోసమని షమీని పక్కకు పెట్టి టీమిండియా తగు మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓ మోస్తరు స్కోర్ను డిఫెండ్ చేసుకోవాలంటే షమీ ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పిచ్ కూడా పేసర్లకు సహకరిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ విషయంలో రోహిత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, షమీని ఇలా పొంతనలేని కారణాల చెప్పి పక్కకు పెట్టిడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో బలమైన కారణాలు లేకుండా షమీని బెంచ్కు పరిమితం చేశారు. ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. -
Ind Vs Pak: షమీకి నో ఛాన్స్.. అందుకే ముందు బ్యాటింగ్: రోహిత్ శర్మ
Asia Cup, 2023 Pakistan vs India- Toss- Rohit Sharma Comments: ‘‘మేము ముందు బ్యాటింగే చేస్తాం. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు కదా! మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం.సవాళ్లు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వెస్టిండీస్ పర్యటన తర్వాత మాకు కావాల్సినంత సమయం దొరికింది. బెంగళూరులో మా ఆటగాళ్లంతా కఠినంగా శ్రమించారు. ఈ టోర్నీలో మా ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రత్యర్థి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా.. జట్టుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి ఉంది. అయ్యర్, బుమ్రా తిరిగి వచ్చారు. ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్తో ప్రయాణం ఆరంభం పాకిస్తాన్తో మ్యాచ్కు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. ఆసియా కప్-2023లో భారత్.. దాయాది పాక్తో మ్యాచ్తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇందుకు వేదిక అయింది. ఆశ్చర్యపరిచిన రోహిత్ నిర్ణయం ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయాల నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేశామని హిట్మ్యాన్ ధీమాగా ఉన్నప్పటికీ.. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. షమీకి నో ఛాన్స్ కాగా క్యాండీలోని హై క్వాలిటీ పిచ్పై బౌలర్లు లేదంటే బ్యాటర్లు.. ఎవరు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చకుంటే వారికే మేలు చేకూర్చే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హైవోల్టేజీ వన్డేలో శార్దూల్ ఠాకూర్కు అవకాశమిచ్చిన మేనేజ్మెంట్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని పక్కనపెట్టింది. ఆసియా కప్-2023 పాకిస్తాన్తో మ్యాచ్కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ -
అలాంటి వాడిని కాదు! ఆ విషయంలో నేనేం చేయలేను: శార్దూల్ ఠాకూర్
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. విండీస్తో మూడు మ్యాచ్లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బార్బడోస్లో తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(17) వికెట్ తన ఖాతాలో వేసుకున్న ఈ పేస్ ఆల్రౌండర్.. అదే వేదికపై రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు. వరల్డ్కప్ సన్నాహక సిరీస్లో.. ఇక ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్ల(4/37)తో చెలరేగాడు. వన్డే వరల్డ్కప్-2023 సన్నాహకంగా భావిస్తున్న సిరీస్లో ఈ అద్భుతంగా రాణించి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురుకాగా శార్దూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 8 వికెట్లు పడగొట్టి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో 8 వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఓ క్రికెటర్గా జట్టులో స్థానం కోసం మేము ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి మెరుగ్గా రాణిస్తాం.. మరికొన్నిసార్లు నిరాశ తప్పదు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేనైతే నా కెరీర్లో ఆడిన ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. జట్టులో స్థానం సంపాదించాలనే ఆలోచనతో ఉండే మనస్తత్వం కాదు నాది. అది సెలక్టర్ల ఇష్టం జట్టుకు ఉపయోగపడే విధంగా ఆడాలని మాత్రమే అనుకుంటాను. ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తారో చేయరో అన్నది సెలక్టర్ల ఇష్టం. ఆ విషయంలో నేనైతే ఏమీచేయలేను. ముందుగా చెప్పినట్లు పరిస్థితులకు అనుగుణంగా జట్టును గెలిపించేలా ఆడటంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది’’ అని రైట్ ఆర్మ్ సీమర్ శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాను కాబట్టే గత రెండేళ్లలో తాను జట్టులో రెగ్యులర్ సభ్యుడినయ్యానన్న ఈ మహారాష్ట్ర ఆల్రౌండర్.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం తనను కీలక ఆటగాళ్లలో ఒకడిగా మార్చిందన్నాడు. జట్టును గెలిపించే క్రమంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్ను 200 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్గా ఉండటం కష్టం.. ఎప్పుడు, ఎక్కడైనా: సంజూ శాంసన్ విండీస్ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. -
చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
విండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/25), ఉనద్కత్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ఆటగాళ్ల పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (32), కారియా (19), అల్జరీ జోసఫ్ (26), గడకేశ్ మోటీ (39 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్పై.. తర్వాత పసలేని బౌలింగ్పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్డౌన్లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది. బార్బోడస్ వేదికగా విండీస్తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజా ధాటికి కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3 వికెట్లు సాధించాడు. అనంతరం 115 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శార్దూల్పై రోహిత్ సీరియస్.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. సహాచర ఆటగాడు శార్ధూల్ ఠాకూర్పై రోహిత్ సీరియస్ అయ్యాడు. ఫీల్డింగ్లో శార్ధూల్ బద్దకంగా వ్యవహరించడంతో రోహిత్ కోపమయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో షాయ్ హోప్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే షాట్లో పవ్ర్ లేకపోవడంతో బంతి బౌండరికి వెళ్లలేకపోయింది. అయితే కవర్స్లో ఉన్న శార్ధూల్ బంతిని అందుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. ఈ క్రమంలో విండీస్తో బ్యాటర్లు 3 పరుగులు పూర్తి చేశారు. దీంతో శార్ధూల్ పేలవ ఫీల్డింగ్పై రోహిత్ ఆసహనం వ్యక్తం చేశాడు. అతడి వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs WI: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్ Rohit Sharma praising Shardul Thakur for his fielding effort.#INDvsWI pic.twitter.com/121NrAKQhY — Foax Cricket News (@FoaxCricket) July 27, 2023 -
Ind vs WI: బార్బడోస్ చేరుకున్నాం.. జడ్డూ ఫొటో వైరల్! ఇక వాళ్లిద్దరు..
India tour of West Indies, 2023: టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెస్టిండీస్కు చేరుకుంటున్నారు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సహా పలువురు శుక్రవారమే కరేబియన్ దీవిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శనివారం విండీస్కు చేరుకున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ శార్దూల్ ఠాకూర్తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘బార్బడోస్ చేరుకున్నాం’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. రోహిత్, కోహ్లి ఆలస్యంగా! ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ తర్వాత లభించిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కుటుంబాలకు కేటాయించారు. దీంతో పారిస్, లండన్లలో చక్కర్లు కొడుతున్న ఈ బ్యాటింగ్ స్టార్లు కాస్త ఆలస్యంగా విండీస్కు పయనం కానున్నట్లు తెలుస్తోంది. పాపం వెస్టిండీస్ కాగా డొనిమినికా వేదికగా విండీస్- భారత్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఆతిథ్య జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రెగ్ బ్రాత్వైట్ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు నెట్స్లో శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ రేసు నుంచి వెస్టిండీస్ అధికారికంగా నిష్క్రమించింది. జింబాబ్వేలోని హరారే వేదికగా సూపర్ సిక్సెస్ దశలో శనివారం జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన విండీస్ కనీసం ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేక చతికిలపడింది. ఇక క్వాలిఫయర్స్లో జూలై 7న ఆఖరి మ్యాచ్ ఆడనున్న విండీస్ ఆటగాళ్లు.. ఆ వెంటనే స్వదేశంలో భారత్తో సిరీస్కు సిద్ధం కానున్నారు. వెస్టిండీస్తో టెస్టు 'సిరీస్ ఆడనున్న టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! Touchdown Barbados🛬 pic.twitter.com/netOxNARuY — Ravindrasinh jadeja (@imjadeja) July 1, 2023 -
కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు. 2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంగ్లండ్తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు. కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి. -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. శార్దూల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్. సీఎస్కేతో మ్యాచ్లో ఇలా ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జడ్డూను కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్రౌండర్’ శార్దూల్ ఠాకూర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! -
మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బ్యాటింగ్లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. శార్దూల్కు కలిసి రాని ప్రమోషన్ ఇక శార్దూల్ ఠాకూర్కు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్లో క్వాలిఫయర్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్తో మ్యాచ్లో పించ్ హిట్టర్గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్గా వెనుదిరిగాడు. Mohit Sharma you beauty 🔥🔥 A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH — IndianPremierLeague (@IPL) April 29, 2023 చదవండి: ట్రాక్లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా! -
టీమిండియా ఆల్రౌండర్కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానే అవకాశం దక్కింది. దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్తో పాటు అదనపు పేసర్గా శార్దూల్ ఉండనున్నాడు. అదే విధంగా ప్లేయింగ్ ఎల్వన్లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్ వికెట్ హాల్తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్గా భారత్ తరపున 8 టెస్టు మ్యాచ్లు ఆడిన శార్ధూల్.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్కు చుక్కదరైంది. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో (ఇంపాక్ట్ ప్లేయర్గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్తో తమ ఆరంభ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్కు గత రెండు మ్యాచ్లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో సన్రైజర్స్ కేవలం 8 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్లో సైతం కోల్కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్తో చివరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్కతాను నిలువరించడం సన్రైజర్స్కు సాధ్యమవుతుంది. కేకేఆర్తో మ్యాచ్ సన్రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్
IPL 2022- KKR vs RCB: ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్కు తొలి విజయం అందించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ పేస్ ఆల్రౌండర్ తన అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడంటూ కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు ఊహించలేదంటూ ఆకాశానికెత్తాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ టాపార్డర్లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(57) మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. చుక్కలు చూపించిన శార్దూల్ ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రింకూ సింగ్(46), ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. శార్దూల్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 68 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేకేఆర్ 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ రెండు, సూయశ్ శర్మ మూడు వికెట్లతో మెరిశారు. బ్యాటింగ్లో అదరగొట్టి శార్దూల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రసెల్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటివి ఊహిస్తాం.. కానీ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్లో కూర్చున్న వేళ మైదానంలోకి దిగిన శార్దూల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఊహించని రీతిలో శార్దూల్ నిజానికి ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. శార్దూల్ 30-35 పరుగులు చేస్తే ఎక్కువని భావిస్తాం. అలాంటిది అతడు ఎవరూ ఊహించని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నమ్మకం నిలబెట్టుకున్నాడు టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరనుకుంటా. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వికెట్లు తీస్తాడని.. ఆరు.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి వారు తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్.. శార్దూల్ ఠాకూర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ 9న తలపడనుంది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
శార్దుల్ ధనాధన్...కేకేఆర్ ఘన విజయం
కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో ఈడెన్ గార్డెన్స్లో గురువారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సుయశ్ శర్మ (3/30) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు. ఆ ఇద్దరి దూకుడుతో... తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్ జోరు కొనసాగించడంతో కోల్కతా పవర్ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్కతా కెపె్టన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్తో జత కలిసి గుర్బాజ్ కోల్కతా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్ను సిరాజ్ అవుట్ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. తడబాటు... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. హిట్టర్లు బ్రేస్వెల్, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. కోల్కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్లో సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు లక్నోVs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహా్మనుల్లా గుర్బాజ్ (సి) ఆకాశ్దీప్ (బి) కరణ్ శర్మ 57; వెంకటేశ్ అయ్యర్ (బి) విల్లీ 3; మన్దీప్ సింగ్ (బి) విల్లీ 0; నితీశ్ రాణా (సి) దినేశ్ కార్తీక్ (బి) బ్రేస్వెల్ 1; రింకూ సింగ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ 46; రసెల్ (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 0; శార్దుల్ ఠాకూర్ (సి) మ్యాక్స్వెల్ (బి) సిరాజ్ 68; నరైన్ (నాటౌట్) 0; ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్: సిరాజ్ 4–0–44–1, డేవిడ్ విల్లీ 4–1–16–2, ఆకాశ్దీప్ 2–0–30–0, బ్రేస్వెల్ 3–0–34–1, షహబాజ్ అహ్మద్ 1–0–6–0, కరణ్ శర్మ 3–0–26–2, హర్షల్ పటేల్ 3–0–38–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) నరైన్ 21; డు ప్లెసిస్ (బి) వరుణ్ చక్రవర్తి 23; బ్రేస్వెల్ (సి) నితీశ్ రాణా (బి) శార్దుల్ ఠాకూర్ 19, మ్యాక్స్వెల్ (బి) వరుణ్ చక్రవర్తి 5; హర్షల్ పటేల్ (బి) వరుణ్ చక్రవర్తి 0; షహబాజ్ అహ్మద్ (సి) శార్దుల్ (బి) నరైన్ 1; దినేశ్ కార్తీక్ (సి) వరుణ్ (బి) సుయశ్ శర్మ 9; అనూజ్ రావత్ (సి) నరైన్ (బి) సుయశ్ శర్మ 1; విల్లీ (నాటౌట్) 20, కరణ్ శర్మ (సి) నితీశ్ రాణా (బి) సుయశ్ శర్మ 1, ఆకాశ్దీప్ (సి అండ్ బి) వరుణ్ చక్రవర్తి 17; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 123. వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–17–0, టిమ్ సౌతీ 2–0–25–0, సునీల్ నరైన్ 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్ శర్మ 4–0–30–3, శార్దుల్ ఠాకూర్ 2–0–15–1. -
#Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్ పవర్ చూపించిన శార్దూల్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఇక కేకేఆర్ తరపున ఏడు, ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి 50ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు. ఇంతకముందు ఆండ్రీ రసెల్ ఐదుసార్లు, పాట్ కమిన్స్ మూడుసార్లు, సాహా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఇక ఏడు ఆ తర్వాత స్థాన్లాల్లో బ్యాటింగ్కు వచ్చి ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్ చోటు సంపాదించాడు. ఓవరాల్గా శార్దూల్ 29 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 150 కూడా కష్టమనుకున్న తరుణంలో రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్కు 103 పరుగులు జోడించి కేకేఆర్ స్కోరు 200 మార్క్ అందుకునేలా చేశాడు. Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్ అతడేనా..?
ఐపీఎల్-2023 సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయ్యర్ గత కొంత కాలంగా వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్ గాయం మళ్లీ తిరిగి బెట్టింది. దీంతో అతడు నాలుగో టెస్టులో బ్యాటింగ్ కూడా రాలేదు. ఈ క్రమంలో అతడు ఆసీస్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. కాగా తన వెన్నుముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని అయ్యర్ను నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం సూచించింది. ఒక వేళ సర్జరీ జరిగితే అతడు దాదాపు ఏడాది వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండంతో అయ్యర్ ఎన్సీఏ సలహాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్ ప్రస్తుతం డాక్టర్ల సలహా మెరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏదిఏమైనప్పటికీ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్కు మాత్రం దూరంగా ఉండనున్నాడు. కేకేఆర్ కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్.. ఇక ఈ ఏడాది సీజన్కు అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్ తమ కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో పడింది. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ జట్టు మేనెజ్మెంట్ శార్దూల్ ఠాకూర్ వైపు మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా శార్దూల్ను ఢిల్లీ కొనుగోలు చేసింది. మరోవైపు యూఏఈ టీ20లీగ్లో కేకేఆర్ ఫ్రాంచైజీ అబుదాబి నైట్రైడర్స్ కు సారథ్యం వహించిన సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు కెప్టెన్సీలోని నైట్రైడర్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో నరైన్ను కాదని శార్దూల్కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ దృఢ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ కొత్త కెప్టెన్ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. చదవండి: BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను? జట్టులో చోటు గురించి ఆలోచనే లేదు!
India vs Australia- WTC Final: ‘‘నేను ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా.. నిజాయితీగా ఉంటాను. జట్టులో చోటు దక్కించుకునేందుకు చేయాల్సిన దాంట్లో కనీసం 10 శాతం కూడా సాధించలేదు. పది దాకా ఎందుకు.. కనీసం ఒక్క శాతం కూడా నేను అందుకు అర్హుడిని కాను. అలాంటిది.. ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చి వేరే వాళ్ల స్థానాన్ని ఆక్రమించలేను కదా! అది సరైంది కాదు కూడా!’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లేదు.. ఆ ఆలోచనే లేదు! ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాండ్యాకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్-2023 తర్వాత జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్కు మీరు అందుబాటులో ఉంటారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. అసలు ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు గురించి అసలు తనకు ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా 2017 జూలైలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ పేస్ ఆల్రౌండర్.. 2018లో ఇంగ్లండ్తో ఆడిన టెస్టు ఆఖరిది. అప్పటి నుంచి ఇంతవరకు అతడు టెస్టు మ్యాచ్ ఆడలేదు. పేస్ ఆల్రౌండర్ కావాలి కదా! పోటీలో లేను ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో భవిష్య కెప్టెన్గా ఎదుగుతున్న 29 ఏళ్ల పాండ్యా.. ఇప్పటికే పలు టీ20 సిరీస్లకు సారథ్యం వహించి పలు విజయాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ ఆవశ్యకత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడగా.. శార్దూల్ ఠాకూర్ ప్రస్తావన వచ్చింది. విదేశాల్లో ముఖ్యంగా ఆసీస్పై అతడికి మంచి రికార్డే ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు కూర్పుపై ప్రశ్న ఎదురుకాగా.. హార్దిక్ పాండ్యా ఇలా తాను పోటీలో లేనంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే! Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్ను కలిసిన యువీ.. ఫొటో వైరల్ -
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)
-
ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్రౌండర్ పెళ్లి
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబర్లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా సోమవారం రాత్రి వివాహబంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాలతీ చాహర్ వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టీమిండియా తరపున శార్దూల్ ఠాకూర్ 8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన శార్దూల్ 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీయడంతో పాటు 120 పరుగులు చేశాడు. గతేడాది మినీ వేలంలో శార్దూల్ ట్రేడింగ్లో కేకేఆర్కు బదిలీ అయ్యాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ షురూ కానుంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1 — Lalit Tiwari (@lalitforweb) February 27, 2023 చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్బాల్' పనికిరాదు పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు -
Viral Video: శార్దూల్ ఠాకూర్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో శ్రేయస్ అయ్యర్ రచ్చ
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇవాళ (ఫిబ్రవరి 27) ముంబైలో తన ఫియాన్సీ మిథాలీ పరుల్కర్ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. పెళ్లి ఇవాళే అయినప్పటికీ కొద్ది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెహందీ ఫంక్షన్లో శార్దూల్ ఓ కర్రాడితో కలిసి మాస్ డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా శార్దూల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో టీమిండియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. గత కొన్ని రోజులుగా ఏదో ఒక వీడియోతో సోషల్మీడియాను షేక్ చేస్తున్న అయ్యర్.. ఈ వీడియోలోనూ తన స్టయిల్లో హంగామా చేశాడు. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్తో కలిసి శార్దూల్-మిథాలీ ప్రీవెడ్డింగ్ ఫంక్షన్కు హాజరైన అయ్యర్.. బ్రహ్మాస్త్ర సినిమాలోని పాపులర్ 'కేసరియా' పాటను పాడాడు. సింగర్తో పాటు శ్రేయస్, నాయర్లు పాట పాడుతుండగా.. కాబోయే భార్య మిథాలీతో కలిసి శార్దూల్ కొన్ని రొమాంటిక్ స్టెప్పులేశాడు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) అనంతరం శార్దూల్ స్టేజ్పైకి ఎక్కి కేకేఆర్ సహచరులతో పాటు కొన్ని లైన్లు పాట కూడా పాడాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు క్యాప్షన్గా పలు ఆసక్తికర కామెంట్స్ను కూడా జోడించింది. ఒక్క విషయం చెప్పండి.. కేకేఆర్ బాయ్స్పై ఎవరైనా ఎలా మనసు పారేసుకోలేరు అంటూ కామెంట్స్ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ఇన్స్టాలో పోస్ట్ చేసిన 3 గంటల్లోనే ఈ వీడియోకు రికార్డు స్థాయిలో 65000 లైకుల వచ్చాయి. కాగా, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రేయస్.. కేకేఆర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. శార్దూల్ను ఇటీవలే కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసాక జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రేయస్-శార్దూల్ కలిసి పాల్గొంటారు. అనంతరం ఐపీఎల్లో కేకేఆర్ తరఫున వీరి జర్నీ ప్రారంభమవుతుంది. శ్రేయస్, శార్దూల్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారే కావండతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడింది. -
గ్రాండ్గా భారత స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
రెండు రోజుల్లో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి.. డ్యాన్స్ అదిరిపోయిందిగా! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి మితాలీ పారుల్కర్ ఫిబ్రవరి 27న (సోమవారం) శార్దూల్ మనువాడనున్నాడు. ముంబైలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. వీరిద్దరి వివాహానికి 250 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో జరగబోయే వీరి పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ముగిశాయి. హల్దీ వేడుకలో శార్దూల్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పెళ్లికూతురు మిథాలీ స్వయంగా వారిద్దరి పెళ్లి గురించి ప్రస్తావించింది. 2021 నవంబర్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి వివాహం టీ20 ప్రపంచకప్-2022 అనంతరం జరగాల్సింది. కానీ వివిధ కారణల వలన వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ వివాహం కాగా..అక్షర్ పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్ను పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Shardul Thakur FC🔵 (@shardulthakur16) చదవండి: Dinesh Karthik: 'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్లో అదరగొడతాడు' -
WC 2023: ప్రపంచకప్ జట్టులో శార్దూల్కు చోటు ఖాయం! అంతలేదు..
India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారత పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. రాణించిన శార్దూల్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో శార్దూల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్లో జరిగిన మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్పూర్ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆఖరిదైన ఇండోర్ మ్యాచ్లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చోటు ఖాయం ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్తో ఫైనల్ వన్డేలో శార్దూల్ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్కప్ జట్టులో ఫాస్ట్బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల శార్దూల్ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతలేదన్న మంజ్రేకర్ అయితే, మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్ జట్టులో శార్దూల్కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్ ఆల్రౌండరే. కాబట్టి శార్దూల్కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. -
అప్పటికే 2 వికెట్లు.. అయినా శార్దూల్పై రోహిత్ ఫైర్! మరీ ఇంత ఓవరాక్షనా?
India vs New Zealand, 3rd ODI: మైదానంలో ఉన్నపుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా వరకు కూల్గానే ఉంటాడు. కానీ.. కీలక సమయంలో ఆటగాళ్లు.. ప్రత్యర్థి పని సులువు చేస్తూ.. మరీ చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాట్లు చేస్తే మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తాడు. సహనం కోల్పోయి నోటికి పని చెప్తాడు. న్యూజిలాండ్తో మూడో వన్డే సందర్భంగా పేసర్ శార్దూల్ ఠాకూర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇండోర్ వేదికగా మంగళవారం జరిగిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పర్యాటక కివీస్పై ఏకంగా 90 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. అయితే, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం కాస్త భయపెట్టాడు. 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 138 పరుగులు చేసి ప్రమాదకరంగా పరిణమించిన ఈ బ్యాటర్ను ఉమ్రాన్ మాలిక్ 31.4వ ఓవర్లో పెవిలియన్కు పంపాడు. శార్దూల్పై రోహిత్ ఫైర్ కాన్వే ఇన్నింగ్స్కు బ్రేక్ వేశాడు. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి కాన్వే మైదానాన్ని వీడాడు. అంతకు ముందు అంటే.. 26వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కాన్వే వరుసగా రెండు బౌండరీలు బాదడంతో రోహిత్ సహనం కోల్పోయాడు. శార్దూల్ దగ్గరికి వెళ్లి.. ‘‘చూసుకుని బౌలింగ్ చేయొచ్చు కదా.. అసలేం ఏం చేస్తున్నావు’’ అన్నట్లు కోపం ప్రదర్శించాడు. ఇంత ఓవరాక్షనా? అయితే, ఆ ఓవర్లో అప్పటికే మిచెల్ సాంట్నర్(24), టామ్ లాథమ్(0) వికెట్లు తీసిన శార్దూల్ .. రోహిత్ మాటలు పట్టించుకోనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రోహిత్పై ఫైర్ అవుతున్నారు. ‘‘పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు.. రెండు ఫోర్లకే అంత ఓవరాక్షనా? తను అంతకు ముందే కదా రెండు వికెట్లు తీశాడు. పాపం శార్దూల్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కాగా మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ 6 ఓవర్ల బౌలింగ్లో 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా 17 బంతుల్లో 25 పరుగులు సాధించాడు ఈ పేస్ ఆల్రౌండర్. చదవండి: SEC Vs PR: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్రైజర్స్కు తప్పని ఓటమి.. అయినా.. మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! pic.twitter.com/uZ3wpkU3qd — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) January 25, 2023 -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ ఈ మ్యాచ్లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
రెండో వన్డేలోనూ ఉమ్రాన్కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
India vs New Zealand: న్యూజిలాండ్తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్ లేదంటే పేస్ బౌలింగ్ చేయగల ఆల్రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్.. ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఓ స్పిన్ ఆల్రౌండర్ సహా ఓ స్పిన్నర్, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లతో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించింది. బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్ ఠాకూర్కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం ‘‘నాకు తెలిసి ఉమ్రాన్కు రెండో వన్డేలో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్ ఠాకూర్ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్ చేస్తాడు. ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు. అలెన్ వికెట్ సహా ఆఖర్లో యార్కర్తో బ్రేస్వెల్ను బౌల్డ్ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్రౌండర్లు కావాలి జట్టులో ఆల్రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్ కచ్చితంగా ఆల్రౌండర్ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో శార్దూల్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్లో భాగంగా మూడు పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్లు ఇలా..? -
లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్లు ఇలా..?
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా ఘోర పరాభవం గేట్ల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. భారీ ఛేదనలో విధ్వంసకర శతకంతో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మైఖేల్ బ్రేస్వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో ఔట్ కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా బౌలర్లను అందరూ ఆడిపోసుకునే వారు. 349 పరుగుల భారీ స్కోర్ను కూడా కాపాడుకోలేకపోయారని దుమ్మెత్తి పోసేవారు. ముఖ్యంగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్లను అందరూ టార్గెట్ చేసేవారు. వీరిలో మరి ముఖ్యంగా లార్డ్ శార్దూల్ భారత అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యేవాడు. కీలక దశలో వరుస వైడ్ బాల్స్ (39వ ఓవర్లో 4 వైడ్లు, 3 ఫోర్లు) వేయడంతో పాటు బేసిక్స్ మరిచి బౌలింగ్ చేసినందుకు గానూ శార్దూల్ను ఓ రేంజ్లో ఆటాడుకునేవారు. అయితే ఆఖరి ఓవర్లో విరాట్ కోహ్లి సలహా మేరకు, చాకచక్యంగా యార్కర్ బాల్ వేయడంతో బ్రేస్వెల్ ఔటయ్యాడు. అప్పుడు శార్దూల్ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బ్రేస్వెల్ ఔట్ కాకుండా.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, లార్డ్ శార్దూల్కు సీన్ సితార అయ్యేది. భారత్ మ్యాచ్ గెలిచినా ఫ్యాన్స్ మాత్రం శార్దూల్పై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అసలు ఇతన్ని ఆల్రౌండర్గా ఎలా పరిగణిస్తారు.. అటు బ్యాటింగ్కు న్యాయం చేయడం లేదు, ఇటు బౌలింగ్లోనూ తేలిపోతున్నాడు.. ఇతనికి ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారని సెలక్టర్లను నిలదీస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఏమో.. లార్డ్ శార్దూల్.. ఇలా అయితే ఎలా అమ్మా.. నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఇంకెన్ని మ్యాచ్లు కావాలమ్మా.. జట్టులో చోటు కోసం చాలా మంది వెయిటింగ్ అక్కడ అంటూ సోషల్మీడియా వేదికగా సున్నితంగా చురకలంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో శార్దూల్.. 7.2 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు. అయితే కీలకమైన ఫిన్ అలెన్ (40), బ్రేస్వెల్ వికెట్లు పడగొట్టాడు. కాగా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదిస్తున్న లార్డ్ శార్దూల్.. కెరీర్ ఆరంభం నుంచే తన ప్రాతకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడపాదడపా రాణించినప్పటికీ.. అవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా బ్యాట్తో పాటు బంతిలోనూ రాణించాలని మేనేజ్మెంట్ అతని నుంచి ఆశిస్తుంది. శార్దూల్ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనే టాక్ నడుస్తుంది. మరో వైపు హార్ధిక్ మినహా టీమిండియాకు మరో ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడంతో శార్దూల్ పప్పులు ఉడుకుతున్నాయి. వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శివమ్ దూబేలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఫ్యాన్స్ అయితే అండర్19 జట్టు యువ ఆల్రౌండర్ రాజ్ అంగడ్ బవా, శివమ్ మావీలకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో వేచి చూడాలి. -
WC 2023: ఆ ఇద్దరు వరల్డ్కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా
ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిలో ఉంటే ప్రపంచకప్ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వాళ్లు నలుగురు చాలు స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్కప్ జట్టులో శుబ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు. కాబట్టి తను అవసరం లేదు. దీపక్ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల యూసఫ్ పఠాన్ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్ పంత్. క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంత్ ఉంటేనే పదింట మూడు మ్యాచ్లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు. రిషభ్ పంత్కు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు జోడీగా రాహుల్తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, గిల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్రౌండర్
టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.ఎంట్రప్రెన్యూర్ అయిన మితాలీ పారుల్కర్ను ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. గతేడాది నవంబర్లో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటినుంచి శార్దూల్ క్రికెట్లో బిజీగా ఉండడంతో సమయం కుదరలేదు. ముంబై సమీపంలోని కర్జత్ ప్రాంతంలో వీరిద్దరి వివాహం జరగనుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్రవరి 25వ తేదీన మొదలు అవుతాయి. కాగా శార్దూల్తో పెళ్లిపై స్వయంగా పెళ్లి కూతురు మితాలీ స్పందించింది. ''శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24 వరకు అతనికి మ్యాచ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 25న మాతో కలుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వస్తారని అనుకుంటున్నాం. మేము మొదటగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో అందరినీ గోవా తీసుకెళ్లడం కష్టమని ఆ నిర్ణయం వాయిదా వేశాం '' అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో శార్దూల్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్కతా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్ధూల్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్కతాకు అమ్మేసింది. -
Ind Vs Ban: కచ్చితంగా గెలుస్తాం! అతడు గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు!
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI: ‘‘సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడటం మాకేమీ కొత్తకాదు. ఇదే తొలిసారి కూడా కాదు. కఠిన పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో మాకు తెలుసు’’ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. బంగ్లాదేశ్తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకు పరిమితం కావడం ప్రభావం చూపిందని.. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదని వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించి సిరీస్ను సమం చేస్తామని గబ్బర్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లా పర్యటనలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రోహిత్ సేన మొదటి మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా బుధవారం రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ధావన్.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కచ్చితంగా తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్లో కండరాల నొప్పితో బాధపడ్డ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం పూర్తి ఫిట్గా ఉన్నాడని.. రెండో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. న్యూజిలాండ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ! బంగ్లాతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధావన్.. టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడని కితాబులిచ్చాడు. కాగా గాయాల బెడదతో కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్తో అర్ధ శతకం సాధించాడు. అతడు గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. న్యూజిలాండ్లో అతడి ప్రదర్శన మనమంతా చూశాం. తను మంచి ఆల్రౌండర్. ఆఫ్ స్పిన్నర్గా.. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా జట్టుకు ఉపయోగపడతాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ తను మరింత రాటుదేలతాడు. ఒత్తిడిలోనూ రాణించగల సుందర్.. ప్రపంచంలో గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడని నమ్మకంగా చెప్పగలను’’ అని వాషీని ప్రశంసించాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డేలో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. 2 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కివీస్ టూర్లో వన్డే సిరీస్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించగా.. 1-0తో టీమిండియా ట్రోఫీని ఆతిథ్య జట్టుకు అప్పగించింది. ప్రస్తుతం రెండో వన్డేలో గెలిస్తేనే బంగ్లా చేతిలో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోగలదు. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ IPL 2023: విండీస్ విధ్వంసకర ఆల్రౌండర్పై కన్నేసిన రాజస్తాన్! 🗣️ 🗣️ We know how to bounce back from tough situations.#TeamIndia batter @SDhawan25 ahead of the second #BANvIND ODI. pic.twitter.com/YgHpfI7IeZ — BCCI (@BCCI) December 6, 2022 -
ఈజీగా గెలుస్తామనుకున్నాం.. కానీ సిరాజ్, శార్దూల్ వల్ల..
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: బంగ్లాదేశ్ లక్ష్యం 187 పరుగులు... ఒకదశలో 136/9... మరో వికెట్ తీస్తే తొలి వన్డే భారత్దే. కానీ మెహదీ హసన్, ముస్తఫిజుర్ టీమిండియాకు షాక్ ఇచ్చారు. 41 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించారు. బౌలర్లు చివరి వికెట్ తీయలేకపోయినా... బ్యాటింగ్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణం. పేలవ ఆటతో పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 186 పరుగులకు కుప్పకూలడంతో ఓటమికి బాట పడింది. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోగా, షకీబ్ 5 వికెట్లతో, ఇబాదత్ 4 వికెట్లతో భారత జట్టును పడగొట్టారు. తద్వారా ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ మాట్లాడుతూ.. భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. లక్ష్య ఛేదన సులువు అనుకున్న తరుణంలో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రాణించిన తీరును అమోఘమంటూ కొనియాడాడు. ‘‘ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను, షకీబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సులభంగానే విజయం సాధిస్తామని భావించాను. అయితే, సిరాజ్, శార్దూల్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను వాళ్లవైపు తిప్పేశారు. మేమిద్దరం అవుటైన తర్వాత గెలుపు కష్టమనిపించింది. భారత బౌలర్లు విజృంభించిన తీరు టెన్షన్కు గురిచేసింది. అయితే, మెహదీ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆఖర్లో 6-7 ఓవర్లలో అతడు బ్యాటింగ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయా’’ అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో సిరాజ్ 3, శార్దూల్ ఠాకూర్ ఒకటి, వాషింగ్టన్ సుందర్ 2, అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ 2, దీపక్ చహర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ సాగిందిలా... రాహుల్ మినహా... అటు స్పిన్కు, ఇటు బౌన్స్కు అనుకూలించిన పిచ్ పై బంగ్లా బౌలర్లు షకీబ్, ఇబాదత్ పండగ చేసుకున్నారు. ముస్తఫిజుర్ వేసిన ‘మెయిడిన్’తో భారత ఇన్నింగ్స్ మొదలు కాగా, శిఖర్ ధావన్ (7) వైఫల్యం కొనసాగింది. మరో ఎండ్లో రోహిత్ శర్మ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్ప్లేలో భారత్ స్కోరు 48 పరుగులకు చేరింది. అయితే షకీబ్ తన తొలి ఓవర్లోనే రోహిత్, కోహ్లి (9)లను అవుట్ చేసి భారత్ను దెబ్బ కొట్టాడు. ఈ దశలో జట్టును రాహుల్ ఆదుకున్నాడు. అయ్యర్ (39 బంతుల్లో 24; 2 ఫోర్లు), సుందర్ (19) కొద్దిసేపు అతనికి సహకరించారు. మిరాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన రాహుల్, ఇబాదత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 49 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో సుందర్, షహబాజ్ (0) వెనుదిరగ్గా, ఆ తర్వాత షకీబ్ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబాదత్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం 9వ వికెట్గా రాహుల్ అవుట్ కావడంతో భారత్ 200 పరుగుల మార్క్ను కూడా చేరలేకపోయింది. రాణించిన సిరాజ్... ఇన్నింగ్స్ తొలి బంతికే నజ్ముల్ (0)ను అవుట్ చేసి చహర్ శుభారంభమిచ్చాడు. అయితే తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో బంగ్లా సులువుగానే లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. దాస్, షకీబ్ (38 బంతుల్లో 29; 3 ఫోర్లు) బాధ్యత గా ఆడారు. వీరిద్దరిని సుందర్ అవుట్ చేసినా... ఒకదశలో 128/4తో బంగ్లా సురక్షిత స్థితిలోనే ఉంది. చేతిలో 6 వికెట్లతో మరో 91 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈ దశలో సిరాజ్, శార్దుల్, కుల్దీప్ సేన్ ఒక్కసారిగా విజృంభించడంతో బంగ్లాదేశ్ 26 బంతుల వ్యవధిలో 8 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. అద్భుత భాగస్వామ్యం... బంగ్లా 9వ వికెట్ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉంది. చివరి వికెట్ కాబట్టి భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే మెహదీ అపార పట్టుదలను కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) నుంచి అతనికి సరైన సహకారం లభించింది. సేన్ ఓవర్లో రెండు సిక్సర్లతో ఆశలు పెంచిన మెహదీ, చహర్ ఓవర్లోనూ 3 ఫోర్లు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. చహర్ తర్వాతి ఓవర్ చివరి బంతికి సింగిల్ రావడంతో బంగ్లా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది. చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్లో చహర్ను కాదని ఠాకూర్ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్కే ఠాకూర్ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్ను తప్పించి చహర్కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్గా పంత్ను కాదని శాంసన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
Ind vs NZ: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.. ఆ ఓవర్లో: ధావన్
New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan Comments On Loss: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో మెరుగైన స్కోరు చేసినప్పటికీ పరాజయం తప్పలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ విచారం వ్యక్తం చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు. కాగా ఆక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి వన్డేలో భారత జట్టు కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో మెరిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ముగ్గురూ అద్బుతంగా రాణించడంతో 306 పరుగులు స్కోరు చేసిన టీమిండియా.. బౌలర్ల వైఫల్యం కారణంగా ఆతిథ్య జట్టు ముందు తలవంచకతప్పలేదు. స్పష్టంగా కనిపించిన వైఫల్యం బ్యాట్తో మెరిసిన వాషింగ్టన్ సుందర్(42 పరుగులు- ఎకానమీ 4.20) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రపంచకప్-2022లో రాణించిన అర్ష్దీప్ సింగ్ 8.1 ఓవర్లలో 68, ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లలో 66, యజువేంద్ర చహల్ 10 ఓవర్లలో 67 పరుగులు ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ మ్యాచ్ను కివీస్కు అనుకూలంగా మార్చివేసింది. ఆ ఓవర్లోనే అంతా తలకిందులు ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ధావన్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘మొదటి 10- 15 ఓవర్లు కాస్త కష్టంగా తోచింది. అయితే, పిచ్ను అంచనా వేసి మా వ్యూహాలు అమలు చేసి మెరుగైన స్కోరు నమోదు చేశాం. కానీ, ఈ రోజు మేము సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. ముఖ్యంగా గుడ్ లెంత్తో బౌలింగ్ చేయడంలో మా వాళ్లు విఫలమయ్యారు. ఆ బలహీనతను లాథమ్ సరిగ్గా వాడుకున్నాడు. నిజానికి 40 ఓవర్లోనే మ్యాచ్ మా చేజారి... కివీస్కు అనుకూలంగా మారింది. ఒకవేళ గెలిచి ఉంటే మేము సంతోషించేవాళ్లం. కానీ ఆటలో ఇవన్నీ సహజమే. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఇదొక పాఠం లాంటిది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆట తీరు మెరుగుపరచుకుని.. తదుపరి మ్యాచ్లో మా వ్యూహాలు మరింత పక్కాగా అమలు చేస్తాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. అద్భుత, అజేయ శతకం కివీస్ ఇన్నింగ్స్లో 40వ ఓవర్ వేసిన శార్దూల్ బౌలింగ్లో.. న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్.. భారీగా పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్స్గా మలిచిన అతడు.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇక ఓవర్లో వైడ్ల రూపంలో రెండు పరుగులు రాగా.. ఆఖరి బంతికి ఒక పరుగు తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తంగా కివీస్కు 25 పరుగులు వచ్చాయి. ఇక మొత్తంగా ఈ మ్యాచ్లో 145 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరోవైపు శార్దూల్.. 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..! FIFA WC: బ్రెజిల్ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్క్రీంలు అమ్మి -
మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పేలవమైన బౌలింగా అని మండిపడుతున్నారు. భారత బౌలర్ల ప్రదర్శన నానాటికీ మరీ తీసికట్టుగా మారుతుందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా.. కీలక దశలో ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకుని, జట్టు ఓటమికి ప్రధాన కారణమైన శార్దూల్ ఠాకూర్పై దుమ్మెత్తిపోస్తున్నారు. శార్దూల్ను బౌలర్ అనే వాడిని గూబ గుయ్ అనేలా వాయించాలని సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 8.1 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ను సైతం ఏకి పారేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబూ అని తలలుపట్టుకుంటున్నారు. కశ్మీర్ ఎక్స్ప్రెస్ అని గొప్పలు చెప్పుకున్న ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మండిపడుతున్నారు. ఎన్ని మ్యాచ్లు అవకాశం ఇచ్చినా చహల్ తీరు మారడం లేదని, ఇతన్ని కూడా పక్కకు పెడితే బుద్ధి వస్తుందని అంటున్నారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ (4.2 ఎకానమీ)ను మినహాయించి భారత బౌలర్లందరిపై ఓ రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు. -
IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో విజయం దిశగా సాగుతున్న టీమిండియాను శార్దూల్ ఠాకూర్ భ్రష్టు పట్టించాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు (4 ఫోర్లు, సిక్స్, 2 వైడ్లు) సమర్పించుకుని టీమిండియా కొంపముంచాడు. అప్పటి దాకా న్యూజిలాండ్ గెలుపుకు 66 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దూల్ దెబ్బకు సమీకరణలు (60 బంతుల్లో 66) ఒక్కసారిగా మారిపోయాయి. మ్యాచ్ కివీస్పైపు తిరిగింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన శార్దూల్ను టామ్ లాథమ్ ఆటాడుకున్నాడు. ఆ ఓవర్కు ముందు 70 బంతుల్లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న టామ్.. 40వ ఓవర్ ఆఖరి బంతికి సింగల్ తీసి కెరీర్లో 7వ సెంచరీ (76 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఒకే ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. ఒక్క ఓవర్తో మ్యాచ్ మొత్తాన్ని చెడగొట్టిన శార్దూల్ను టీమిండియా అభిమానులు ఆడుకుంటున్నారు. ఈ మాత్రం సంబరానికి ఈయనని ఆడించడం ఎందుకని మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. బ్యాటింగ్లో కూడా చేసిందేమీ లేదు.. ఇలాంటి వాళ్లను ఆల్రౌండర్గా ఎలా పరిగణిస్తారని సెలక్టర్లపై ధ్వజమెత్తుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. -
IPL 2023: కేకేఆర్కు మారిన స్టార్ ఆల్రౌండర్
IPL 2023 Trading: భారత ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీకి మారాడు. ఈ సీజన్లో ఢిల్లీకి ఆడిన శార్దుల్ 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 120 పరుగులు చేశాడు. క్యాపిటల్స్ జట్టు మెగా వేలంలో అతన్ని రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శార్దుల్ను ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్లో భాగంగా కోల్కతా తీసుకుంది. ఫ్రాంచైజీలకు రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం), రిలీజ్ (విడుదల) లేదంటే ట్రేడింగ్ (కొనుగోలు) గడువు మంగళవారంతో ముగియనుంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వచ్చే సీజన్ ఐపీఎల్కు గైర్హాజరవుతానని ప్రకటించాడు. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్ (టెస్టు)పై మరింత దృష్టిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉంటానన్నాడు. -
శార్దూల్ ఠాకూర్కు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్బై!
ఐపీఎల్-2023కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్-16న ఇస్తాంబల్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ డిసెంబర్ 16న వేలం జరినట్లయితే.. నవంబరు 15లోపు టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శార్దూల్ ఠాకూర్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ను 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది సీజన్లో ఠాకూర్ అంతగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్లు ఆడిన ఠాకూర్.. 15 వికెట్లతో పాటు 120 పరుగులు సాధించాడు. క్రిక్బజ్ కథనం ప్రకారం.. ఠాకూర్తో పాటు బ్యాటర్లు వికెట్ కీపర్ కెఎస్ భరత్, మన్దీప్ సింగ్కు కూడా ఢిల్లీ గుడ్బై చెప్పనుంది. కాగా ఆంధ్ర ఆటగాడు కెఎస్ భరత్కు ఈ ఏడాది సీజన్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన భరత్.. 18 పరుగులు సాధించాడు. చదవండి: IND vs NED: నెదర్లాండ్స్ జట్టులో వాళ్లతో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతి? -
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియాకు బయల్దేరనున్న ట్రిపుల్ 'ఎస్'
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత సెలెక్షన్ కమిటీ రకరకాల వడపోతలు పట్టి అంతిమంగా ముగ్గురు పేర్లను ఫైనల్ చేసింది. షమీ, సిరాజ్, శార్ధూల్లలో (ట్రిపుల్ ఎస్) ఒకరు బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తారని టీమిండియా యాజమాన్యం డిసైడ్ చేసింది. దీంతో ఈ ముగ్గురు టీమిండియాను కలిసేందుకు ఇవాళో రేపో ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు. వీరితో పాటు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్లు కూడా ఆస్ట్రేలియా విమానమెక్కనున్నారు. మరో స్టాండ్ బై ప్లేయర్ దీపక్ చాహర్కు గాయం తిరగబెట్టడంతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మరోవైపు నెట్ బౌలర్లుగా ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వీసా సమస్యల కారణంగా భారత్లోనే ఉండిపోయారు. వీసా ఇష్యూస్ క్లియర్ అయితే ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు బయలుదేరతారు. ఇదిలా ఉంటే, బుమ్రా స్థానంలో తుది జట్టులో ఎవరుంటారనే అంశం టీమిండియా అభిమానులను తెగ వేధిస్తుంది. కొందరేమో షమీనే అందుకు అర్హుడని అభిప్రాయపడుతుంటే.. మరికొందరేమో సిరాజ్కు ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్లపై మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అతన్నే ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో శార్ధూల్కు ఓటేస్తున్నారు. మరోపక్క టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న హర్షల్ పటేల్ ఫామ్ లేమి సమస్య అటు సెలక్టర్లను ఇటు అభిమానులను తెగ కలవరపెడుతుంది. ఇప్పటికే బుమ్రా దూరమై నైరాశ్యంలో ఉన్న వీరికి.. హర్షల్ సమస్య మరో తలనొప్పిగా మారింది. ఇన్ని సమస్యల నడుమ టీమిండియా వరల్డ్కప్లో ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. -
'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం'
రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్రకెక్కాడు. తాజాగా రాంచీ వేదికగా ఇవాళ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ధోని రిటైర్మెంట్ అయిన తర్వాత రాంచీలో ఎప్పుడు టీమిండియా మ్యాచ్ ఆడినా తప్పకుండా హాజరయ్యేవాడు. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ధోని ఈ మ్యాచ్కు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధోని సొంత పట్టణంలో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ స్పందించాడు. ధోని భయ్యాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు "ధోనీని ప్రతి ఒక్కరం మిస్ అవుతున్నాం. జట్టులో అనుభవజ్ఞుడు లేని కొరత కనిపిస్తోంది. అతడు 300 కంటే ఎక్కువగా వన్డేలు, దాదాపు 90 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి ఇంత అనుభవం ఉన్న ఆటగాడిని తప్పనిసరిగా మిస్ అవుతాం. ఇలాంటి ఆటగాడు దొరకడం చాలా అరుదు.'' అని పేర్కొన్నాడు. జట్టులో బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ.. "ఇక్కడ బౌలర్లు కూడా పరుగులు కోసం కొట్టుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో మన బౌలర్లును విమర్శిస్తే.. ప్రత్యర్థి బౌలర్లను కూడా విమర్శించాలి. ఎందుకంటే మనం సిరీస్ గెలిచాం. అలాగే మీరు నిలకడ గురించి ఆడిగితే.. పిచ్ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు వన్డేల్లో 350 కంటే ఎక్కువ పరుగులు నమోదవుతాయి. భారత్ ఎప్పుడూ ఏకపక్షం పోరు ఆడలేదు. ఫైట్ ఎల్లప్పుడూ ఉంటుంది. మేము ఒకటి, రెండు మ్యాచ్లు ఓడిపోయి ఉండొచ్చు.. కానీ గరిష్ఠ సంఖ్యలో గెలిచాం. కాబట్టి జట్టులో స్థిరత్వం ఉంది." అని శార్దూల్ అన్నాడు. ఇక ఎంఎస్ ధోనీ 2020లో తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. వీటితో పాటు 2014 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. చదవండి: తండ్రిగా ప్రమోషన్ పొందిన స్పెయిన్ బుల్ చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్ మిల్లర్! -
Ind A Vs NZ A: మూడో వన్డే.. అర్ధ శతకాలతో మెరిసిన సంజూ, తిలక్, శార్దూల్
India A vs New Zealand A, 3rd unofficial ODI: న్యూజిలాండ్- ఏ జట్టుతో మూడో వన్డేలో భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 33 బంతులు ఎదుర్కొని.. 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా యువ బ్యాటర్, హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ, కెప్టెన్ సంజూ శాంసన్ సైతం హాఫ్ సెంచరీలు సాధించారు. కాగా భారత్- న్యూజిలాండ్ ఏ జట్ల మధ్య మూడు వన్డేల అనధికారిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించిన సంజూ శాంసన్ సేన.. మంగళవారం(సెప్టెంబరు 27) జరుగుతున్న మూడో వన్డేలో మెరుగైన స్కోరు నమోదు చేసింది. రాణించిన సంజూ, తిలక్, రిషి, శార్దూల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(39 పరుగులు) శుభారంభం అందించాడు. రాహుల్ త్రిపాఠి(18 పరుగులు) నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ 68 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ 62 బంతులు ఎదుర్కొని అర్ధ శతకం(50 పరుగులు) సాధించాడు. మరో తెలుగు క్రికెటర్ కేఎల్ భరత్ మాత్రం నిరాశపరిచాడు. 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్కోరు ఎంతంటే! ఇక రిషి ధావన్ 34 పరుగులు చేయగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించాడు. 33 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. ఇక ముగ్గురు ఆటగాళ్లు అర్ధ శతకాలతో రాణించడంతో భారత ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్కు రెండు, జో వాకర్కు ఒకటి, మైఖేల్ రిప్పన్కు రెండు, రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ T20 WC 2022: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్ -
Ind A vs NZ A: చెలరేగిన భారత బౌలర్లు.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్
India A vs New Zealand A, 1st unofficial ODI- NZ Score: న్యూజిలాండ్- ఏ జట్టుతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. శార్దూల్ ఠాకూర్ 4, కుల్దీప్ సేన్ 3 వికెట్లు పడగొట్టి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక కుల్దీప్ యాదవ్ సైతం 9 ఓవర్ల బౌలింగ్లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 40.2 ఓవర్లకే న్యూజిలాండ్ కథ ముగిసింది. 167 పరుగులు చేసి రాబర్ట్ ఒడొనెల్ బృందం ఆలౌట్ అయింది. కాగా మూడు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడే నిమిత్తం న్యూజిలాండ్- ఏ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో మ్యాచ్లో భారత ఏ జట్టు 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గురువారం మొదటి వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్.. చెలరేగిన బౌలర్లు టాస్ గెలిచిన భారత ఏ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆది నుంచే చుక్కలు చూపించారు బౌలర్లు. ఓపెనర్లు చెరో పది పరుగులు చేసి అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం వరుసగా 4,1,22,0,5 పరుగులు చేసి పెవిలియన్కు క్యూ కట్టారు. టాపార్డర్ కుప్పకూలిన వేళ మైఖేల్ రిప్పన్ 104 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టెయిలెండర్ జో వాకర్ సైతం 36 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో 167 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే! LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం -
'ఓపెనర్గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ఆటగాళ్లకు సరైన జెర్సీలు లేకుండా పోయాయి'
ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ తమ సహచరుల జెర్సీలను ధరించడం చూస్తూనే ఉన్నాం. గత నెలలో విండీస్తో జరిగిన వన్డే సిరీస్లో దీపక్ హుడా ప్రసిద్ధ్ కృష్ణ జర్సీని ధరించగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు పేసర్ ఆర్ష్దీప్ సింగ్ జర్సీ ధరించి కన్పించారు. తాజాగా ఈ జాబితాలోకి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేరాడు. హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో ధావన్.. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ జెర్సీని ధరించి బ్యాటింగ్ వచ్చాడు. కాగా ఆ జెర్సీపై టేప్ అతికించబడి ఉంది. అయిన్పటికీ శార్దూల్ ఠాకూర్ జెర్సీ నంబర్ 54 మాత్రం సృష్టంగా కన్పిస్తోంది. కాగా ఠాకూర్ టీ షర్ట్ను ధావన్ ధరించడానికి గల కారణం ఏమిటో మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కాగా ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ధావన్ జర్సీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత మంది ఫన్నీ కామెట్లు చేస్తుండగా.. మరి కొంత మంది బీసీసీఐ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఓపెనర్గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు సరైన జెర్సీలను ఎందుకు అందించలేక పోతుందో అర్ధం కావడం లేదంటూ" కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. Very happy to see shardul Dhawan opened for india . I don't know why million dollars @BCCI don't have Jersey for players. #MPL #mplsports worst kit sponsor ever.. — Ajay Krishnan (@_ajaykrishnan_) August 22, 2022 All the while we thought Shikar Dhawan was 'GABBAR' but came out wearing 'THAKUR' today! Aise kyu kia bhai @SDhawan25 #ZIMvIND #ShikharDhawan — Ravi Kalle (@rt_Kalle) August 22, 2022 చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్! -
IPL 2022: ఏంటో! చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో..!
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తుంటే స్టేడియం ఈలలతో మారుమోగిపోవాల్సిందే! భారీ హిట్టర్లు, ఫ్యాన్స్కు ఇలా పండుగ చేసుకుంటే.. పాపం ఆ బ్యాటర్ ప్రతాపానికి బలైపోయిన బౌలర్ మాత్రం ఉసూరుమంటాడు. ఒక్క పరుగు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల సందర్భాల్లో ఇలా జరిగితే ఆ బౌలర్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొంతమందేమో వికెట్లు పడగొట్టినా పరుగులు ఎక్కువగా సమర్పించుకుని విమర్శల పాలవుతారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లు ఎవరో గమనిద్దాం! 1.మహ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఇష్టపడి మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో 15 మ్యాచ్లు ఆడిన అతడు 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 31 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు ఇచ్చిన బౌలర్గా సిరాజ్ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2. వనిందు హసరంగ ఐపీఎల్-2022 సీజన్లో శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. మొత్తంగా 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్నకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. అయితే, ఎక్కువ సిక్స్లు ఇచ్చిన రెండో బౌలర్గా నిలిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన అతడు 16 మ్యాచ్లలో సిక్సర్ల రూపంలో 180 పరుగులు(30 సిక్స్లు) సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు. 3. యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో పర్పుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ యజువేంద్ర చహల్. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. ఒక 4 వికెట్, 4 వికెట్హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతాబాగానే ఉన్నా ఐపీఎల్-2022లో తాను సమర్పించుకున్న 527 పరుగులలో 27 సిక్సర్ల రూపంలో ఉండటం గమనార్హం. 4. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 473 పరుగులు ఇచ్చి 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి. మెగా వేలంలో 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజీ అంచనాలకు అనుగుణంగా ఈ సీమర్ రాణించలేదనే చెప్పాలి. 5. కుల్దీప్ యాదవ్ ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ కోసం చహల్తో పోటీ పడ్డాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్లలో ఈ చైనామన్ స్పిన్నర్ 21 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 419 పరుగులు ఇచ్చాడు. ఇందులో 22 సిక్సర్ల రూపంలో ఇచ్చినవే. ఇక తనదైన శైలితో రాణించిన కుల్దీప్ యాదవ్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి భారత్లో టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న దక్షిణాఫ్రికాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. చదవండి: Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'దటీజ్ లార్డ్ ఠాకూర్.. ఈ సారి కూడా ధావన్ను ఔట్ చేశాడు'
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం (మే 16) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంలో ఆజట్టు పేసర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్లో రాజపాక్స, శిఖర్ ధావన్ను ఔట్ చేసి ఠాకూర్ మ్యాచ్ను ఢిల్లీ వైపు మలుపు తిప్పాడు. "లార్డ్ ఠాకూర్ అంటే ఇదే మరి. తన వేసిన మొదటి ఓవర్ చాలా క్లిష్టమైనది. ఎందుకంటే పవర్ప్లేలో అది అఖరి ఓవర్. అప్పటికే పంజాబ్ బ్యాటర్లు రిథమ్లో ఉన్నారు. అయినప్పటికీ శిఖర్ ధావన్, భానుక రాజపక్సను అతడు ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. చాలా సార్లు ఠాకూర్ బౌలింగ్లో ధావన్ తన వికెట్ను చేజార్చుకున్నాడు. ఈ సారి కూడా ధావన్పై ఠాకూర్ పైచేయి సాధించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలో ఫాస్ట్ బౌలర్ రెండు వికెట్లు సాధించడం అంత సులభం కాదు. అప్పటికే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేయవలసి ఉంది. వారు వికెట్లు సాధిస్తారని నాకు తెలుసు. కానీ శార్దూల్ వికెట్లు తీస్తాడని నేను అస్సలు ఊహించ లేదు. అతడు రెండు దశల్లో బౌలింగ్ చేశాడు. అతడు తన నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడికి ఇవే ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: బౌలర్ల పాలిట సింహ స్వప్నాల్లా మారిన బ్యాటర్లు.. ఐపీఎల్ 2022 పేరిట అరుదైన రికార్డు -
నో బాల్ రాద్ధాంతం.. పంత్, శార్దూల్లకు భారీ షాక్.. ఆమ్రేపై నిషేధం
DC VS RR: రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన హై ఓల్టేజీ సమరంలో నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన అనవసర రాద్ధాంతానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఫీల్డ్లో ఉన్న ఆటగాళ్లను రీకాల్ చేయడంపై కన్నెర్ర చేసిన ఐపీఎల్ యాజమాన్యం.. పంత్తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. #DC#DC #RRvsDC #RishabhPant #NoBall #IPL2022 #ChotiBachiHoKya No ball Pant Gully Cricket 😅😅 #CSKvMI https://t.co/5izO2o75tX pic.twitter.com/XoS3DUc79d#ChotiBachiHoKya — Mankesh Meena (@Mankesh1212) April 23, 2022 ఈ మ్యాచ్ కోసం రిషబ్ పంత్కు లభించే మ్యాచ్ ఫీజు మొత్తంపై 100 శాతం కోత విధించగా, శార్దూల్ ఠాకూర్కు 50 శాతం జరిమానా పడింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అతిక్రమించినందుకు గాను ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరి డేనియల్ మనోహర్ వెల్లడించాడు. కాగా, రాజస్థాన్ నిర్ధేశించిన 223 పరుగుల ఛేదనలో ఢిల్లీ గెలుపుకు 3 బంతుల్లో 18 పరుగులు అవసరమైన సందర్భంలో నో బాల్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మెక్ కాయ్ వేసిన ఓ బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్గా ప్రకటించకపోవడంతో ఢిల్లీ బృంద సభ్యులు ఓవరాక్షన్ చేశారు. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి డగౌట్లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేయగా, శార్ధూల్ అతనికి మద్ధతుగా నిలిచాడు. ఇదే సమయంలో మ్యాచ్కు అంతరాయం కలిగిస్తూ మైదానంలోకి వెళ్లిన ఆమ్రే అంపైర్తో వాగ్విదానికి దిగాడు. చదవండి: కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్ను మెడపట్టి తోసిన చహల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా శార్ధూల్.. అద్భతమైన రన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శార్ధూల్ ఠాకూర్ అద్భతమైన క్యాచ్తో మెరిశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో నాలుగో బంతికి రహానే భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ ఠాకూర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా అంతకు ముందు మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర(61), పృథ్వీ షా(51) అర్ధ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. ఇక 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 171 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54), నితీష్ రాణా(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్ యాదవ్ నాలుగు వికెట్లు, ఖాలీల్ ఆహ్మద్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు, లలిత్ యాదవ్ ఒక వికెట్ సాధించారు. చదవండి: IPL 2022: ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపించాడు! శార్ధూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయంది -
అంపైర్తో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ వాగ్వాదం
క్రికెట్లో ఎమోషన్స్కు కొదువ ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అంపైర్లతో ఆటగాళ్లకు గొడవలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.అందులో ఒక అంపైర్ తప్పు చేస్తే.. అవసరంగా మరొక అంపైర్తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్ అంపైర్తో వాగ్వావాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఉమేశ్ ఫుల్టాస్ యార్కర్ వేశాడె. బంతి వైడ్ లైన్ అవతల పడినప్పటికి అంపైర్ వైడ్ ఇవ్వలేదు. అయితే శార్దూల్ అది వైడ్ కదా అని అంపైర్ను చూసినప్పటికి అతని వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఇదేం నిర్ణయమో అంటూ తర్వాతి బంతికి సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో డగౌట్లో ఉన్న పాంటింగ్.. ''అదేంటి అంత క్లియర్గా వైడ్ అని తెలుస్తుంటే అంపైర్ ఇవ్వకపోవడమేంటి'' అని అరిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో అంపైర్తో వైడ్ ఇవ్వకపోవడమేంటని వాగ్వాదానికి దిగాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు #RickyPonting fighting with umpire pic.twitter.com/3jPYobJZAe — Raj (@Raj93465898) April 10, 2022 -
IPL 2022 Auction Day 1: శార్దూల్ ఠాకూర్కు అత్యధిక ధర.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఎవరంటే..
ఐపీఎల్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిరోజు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ రూ. 10.75 కోట్లతో రికార్డు ధరకు అమ్ముడు కాగా.. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్(రూ. 6.50 కోట్లు), డేవిడ్ వార్నర్(రూ. 6.25 కోట్లు) అమ్ముడుపోయారు. మిగతావారిలో కేఎస్ భరత్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్లు ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్లో భాగంగా రిషబ్ పంత్(రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), అన్రిచ్ నోర్ట్జే(రూ.6.5 కోట్లు) ను తమవద్దే ఉంచుకుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 16.50 కోట్లు మిగిలి ఉన్నాయి. 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 4 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దుల్ ఠాకూర్ : రూ. 10 కోట్ల 75 లక్షలు మిచెల్ మార్ష్ : రూ. 6 కోట్ల 50 లక్షలు డేవిడ్ వార్నర్ : రూ. 6 కోట్ల 25 లక్షలు కేఎస్ భరత్ : రూ. 2 కోట్లు కుల్దీప్ యాదవ్ : రూ. 2 కోట్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్ : రూ. 2 కోట్లు కమలేశ్ నాగర్కోటి : రూ. 1 కోటి 10 లక్షలు సర్ఫరాజ్ : రూ. 20 లక్షలు అశ్విన్ హెబర్ : రూ. 20 లక్షలు -
IPL Auction Day 1: చహర్ 14 కోట్లు... అదరగొట్టిన శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, హసరంగ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మరోసారి అంచనాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 10 మంది ఆటగాళ్లు కనీసం రూ. 10 కోట్లకంటే ఎక్కువ విలువ పలకగా, పెద్ద సంఖ్యలో ప్లేయర్లు మిలియన్ డాలర్ల మార్క్ను దాటారు. గతంతో పోలిస్తే ఈసారి వేలంలో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టాప్–10లో ఏడుగురు భారత ఆటగాళ్లు ఉండగా... ఆ పది మందిలో ఏడుగురు బౌలర్లే ఉండటం లీగ్లో బౌలింగ్ విలువను కూడా చూపించింది. వేలంలో ఎప్పటిలాగే కొన్ని అనూహ్య, అసాధారణ అంకెలు ఆశ్చర్యపరచగా... అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఫ్రాంచైజీలు ఆచితూచి వేసిన అడుగుల ముద్ర కూడా కనిపించింది. 23 ఏళ్ల ఇషాన్ కిషన్ అందరికంటే ఎక్కువగా రూ.15 కోట్ల 25 లక్షలతో శిఖరాన నిలిచాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు; 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్) తర్వాత రెండో ఖరీదైన భారతీయ ప్లేయర్గా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు. టాప్–10 (కనీసం రూ. 10 కోట్లు) ఇషాన్ కిషన్ - ముంబై ఇండియన్స్ ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్. 23 ఏళ్ల వయసు, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఈ జార్ఖండ్ ప్లేయర్ సొంతం. గత రెండేళ్లు ముంబైకి విజయాలు అందించడంలో కీలక పాత్ర. అందుకే ప్రతీ జట్టు అతని కోసం పోటీ పడ్డాయి. అంబానీ టీమ్ కూడా అతడిని వదలదల్చుకోలేదు. అందుకే అందరికంటే ఇషాన్కు ఎక్కువ విలువ. రూ. 15 కోట్ల 25 లక్షలు దీపక్ చహర్ - చెన్నై సూపర్ కింగ్స్- రూ. 14 కోట్లు పవర్ప్లే స్పెషలిస్ట్ బౌలర్. స్వింగ్ అతని బలం. చెన్నైకి ఆడిన గత నాలుగు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. గత రెండేళ్లుగా బ్యాటింగ్లోనూ బాగా మెరుగయ్యాడు. అందుకే రాజస్తాన్కు చెందిన దీపక్ చహర్ను చెన్నై మళ్లీ తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ -కోల్కతా నైట్రైడర్స్ - రూ. 12 కోట్ల 25 లక్షలు ప్రతిభావంతుడైన బ్యాటర్. పరిస్థితికి తగినట్లుగా తన ఆటను మార్చుకోగలడు. ముంబై రంజీ జట్టు నుంచి వచ్చిన సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కెప్టెన్ అవసరం ఉన్న కోల్కతా అందుకే ఎంచుకుంది. శార్దుల్ ఠాకూర్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్గా మారిన బౌలింగ్ ఆల్రౌండర్. ఇటీవలి అతని ప్రదర్శనలు అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్ నేర్పుతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఈ ముంబైకర్ సొంతం. హర్షల్ పటేల్ - బెంగళూరు - రూ. 10 కోట్ల 75 లక్షలు 2021 ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. పవర్ప్లేలో, డెత్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అందుకే భారీ మొత్తానికి ఈ హరియాణా బౌలర్ను బెంగళూరు మళ్లీ తీసుకుంది. వనిందు హసరంగ- బెంగళూరు -రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా లీగ్లలో ఆకట్టుకుంటున్న ఈ శ్రీలంక స్పిన్నర్ టి20 ప్రపంచకప్లో, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అయినా ఒక భారతీయేతర స్పిన్నర్ ఇంత విలువ పలకడం అనూహ్యం. అయితే లెగ్స్పిన్నర్గా అతనిది ప్రత్యేక శైలి. ‘గుగ్లీ’ పదునైన ఆయుధం. నికోలస్ పూరన్- సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 10 కోట్ల 75 లక్షలు ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే అసాధారణ విలువ. ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్కు హిట్టర్గా పేరు ఉన్నా గతంలో పంజాబ్ జట్టుకు ఉపయోగపడలేదు. హైదరాబాద్ అనూహ్య మొత్తాన్ని వెచ్చించింది. లోకీ ఫెర్గూసన్ - గుజరాత్ టైటాన్స్ - రూ. 10 కోట్లు న్యూజిలాండ్కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్. కోల్కతా తరఫున మూడు సీజన్లలో అక్కడక్కడ రాణించాడు. అతని స్థాయికి, అంతర్జాతీయ గుర్తింపునకు ఇది చాలా పెద్ద మొత్తం. అవేశ్ ఖాన్ - లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 10 కోట్లు చాలా రోజులుగా భారత క్రికెట్లో అందరి దృష్టీ ఉంది. 2016 అండర్–19 ప్రపంచకప్లో ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ భారత యువ పేస్ బౌలర్లలో చక్కటి ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కూడా ఆకట్టుకోవడంతో ఫ్రాంచైజీలు ఇతని కోసం పోటీ పడ్డాయి. ప్రసిధ్ కృష్ణ - రాజస్తాన్ రాయల్స్ - రూ. 10 కోట్లు ఐపీఎల్లో గొప్ప రికార్డు లేకపోయినా (9.26 ఎకానమీ) ఇటీవలి వన్డే ప్రదర్శన ప్రసిధ్ కృష్ణకు భారీ మొత్తం అందించింది. తాజా ఫామ్లో ఈ కర్ణాటక బౌలర్ ప్రత్యరి్థని కట్టడి చేయగలడని ఫ్రాంచైజీలు నమ్మాయి. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! -
'అతడు వచ్చేశాడు.. టీమిండియాకు ఇక తిరుగు లేదు'
టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో మూడు టీ20లు, మూడు వన్టేలు ఆడనుంది. ఈ క్రమంలో విండీస్తో తలపడే వన్డే, టీ20 భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. గతేఏడాది శ్రీలంకతో జరగిన వన్డేలో కుల్దీప్ చివరిసారిగా ఆడాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కుల్దీప్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా విండీస్తో సిరీస్కు కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయడం పట్ల భారత సెలెక్టర్లపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ కుల్దీప్ యాదవ్ సేవలను కచ్ఛితంగా కోల్పోయింది అని అతడు తెలిపాడు. "భారత వన్డే జట్టులోకి కుల్దీప్ యాదవ్ పునరాగమనం చేయడం శుభపరిణామం. దక్షిణాఫ్రికాతో జరగిన వన్డేల్లో భారత్కు వికెట్ టేకింగ్ బౌలర్లు చాలా తక్కువ ఉన్నారు. జట్టులో అంత ప్రభావవంతమైన ఆల్రౌండర్లు లేరు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పేస్ లోపించినట్లు అనిపించింది. బహుశా అతను టెస్టు క్రికెట్ ఆడి కాస్త అలసిపోయి ఉండవచ్చు. కాగా పిచ్ నుంచి అతడికి సహాయం అందితే తప్ప బ్యాటర్లను ఇబ్బంది పెట్టే పేస్ శార్దూల్కి లేదు. ఇక భారత జట్టుకు కుల్దీప్ యాదవ్ చాలా మంచి ఆప్షన్. ఆఫ్-స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్, లెగ్గీగా రవి బిష్ణోయ్తో భారత స్పిన్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది" అని సల్మాన్ బట్ పేర్కొన్నాడు. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్కు 155 పరుగులు.. అయినా! -
IPL Auction: రాహుల్ భయ్యా.. నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? దేవుడికి కూడా వెల కట్టగలరా?
IPL 2022 Auction- Chahal, Rahul, Shardul Funny Video: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.... కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ సైతం తాము ఎంచుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తమ సారథిగా ఎంపిక చేసుకోగా.. అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించనుంది. ఇక రాహుల్ కోసం గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు భారీగానే ఖర్చు చేసిన విషయం తెలిసిందే. సుమారు 17 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, రాహుల్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగా వేలం గురించి ప్రస్తావించిన శార్దూల్.... తనకోసం లక్నో ఫ్రాంఛైజీ వెచ్చించగల బడ్జెట్ ఎంత అంటూ రాహుల్ను ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన రాహుల్... బేస్ ప్రైస్(కనీస ధర) అంటూ సమాధానమిచ్చాడు. ఇంతలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న చహల్.. ‘‘దేవుడికి(లార్డ్) కూడా బడ్జెట్ కేటాయించగల మనుషులు ఉంటారా’’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఓ హోటల్లో ఈ సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ జట్టును విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో నలుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై అతడిని వదిలేసింది. దీంతో శార్దూల్ వేలంలోకి రానున్నాడు. ఇక ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లతో చెలరేగి అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. లార్డ్ అన్న ట్యాగ్ విషయానికొస్తే... ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా శార్దూల్ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అప్పటి నుంచే తన పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్గా మారిపోయిందని ఈ యువ ఆటగాడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: చెన్నై చేరుకున్న ధోని.. టార్గెట్ అదేనా! India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి View this post on Instagram A post shared by Cricket bloggers (@_cricblog_) -
ఆ ఇద్దరి రాకతో హార్ధిక్ స్థానం గల్లంతు.. !
చాలా కాలంగా టీమిండియాను వేధిస్తున్న ఆల్రౌండర్ల కొరత శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్ల రాకతో తీరినట్లేనని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ ఇరు(టెస్ట్, వన్డే) ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారని పేర్కొన్నాడు. హార్ధిక్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన వీరు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణిస్తున్నారని, ఇది టీమిండియాకు శుభసూచకమని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో శార్ధూల్(43 బంతుల్లో 50 నాటౌట్, 38 బంతుల్లో 40 నాటౌట్), ఆఖరి వన్డేలో చాహర్(34 బంతుల్లో 54) బ్యాట్తో రాణించిన తీరు సంతృప్తికరంగా ఉందని, మున్ముందు కూడా వీరు ఇలాగే రాణిస్తే హార్ధిక్ స్థానం గల్లంతయ్యే ప్రమాదముందని పరోక్షంగా హెచ్చరించాడు. వీరిద్దరూ తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లుగా మారుతున్నారని కితాబునిచ్చాడు. గతంలో భారత-ఏ జట్టు శ్రీలంక పర్యటనలో దీపక్ చాహర్ బ్యాట్తో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. బౌలర్లుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేస్తూ, లోయర్ ఆర్డర్లో వీలైనన్ని పరుగులు చేసే ఆటగాడిని ఏ జట్టైనా కోరుకుంటుందని, ఇలాంటి ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని శార్ధూల్, చాహర్లకు పరోక్షంగా మద్దతు తెలిపాడు. ఆల్రౌండర్లు జట్టు జయాపజయాలు నిర్ధేశిస్తారనడంలో సందేహం లేదని, శార్ధూల్, చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు జట్టుకు మరింత సమతూకాన్ని తెస్తారని అభిప్రాయపడ్డాడు. మున్ముందు ఈ ఇద్దరికి తగినన్ని అవకాశాలు కల్పించి, జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచే దిశగా సాగుతామని పేర్కొన్నాడు. కాగా, వెన్నెముక గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఆల్రౌండర్ కోటాలో ఆటగాడు కరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం వెంకటేశ్ అయ్యర్ ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినప్పటికీ.. జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అతన్ని సరిగ్గా వాడుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: నిన్ను చూసి గర్వపడుతున్నా: చహర్ కాబోయే భార్య భావోద్వేగం -
ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్లో చెత్త రికార్డు.. బ్యాటింగ్లో అదుర్స్
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత మిడిలార్డర్తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్ల కోటాలో 72 పరుగులు శార్దూల్ సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో భారత బౌలర్గా ఠాకూర్ నిలిచాడు. అంతకుముందు 2013లో మోహిత్ శర్మ 82 పరుగులతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాల్తో విఫలమైన ఠాకూర్ బ్యాట్తో అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఠాకూర్ అర్దసెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో ఠాకూర్కి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: SA vs IND: మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు! -
Ind Vs Sa 3rd Test: వారం రోజుల క్రితం చెత్త ప్రదర్శన.. ఇప్పుడేమో 5 వికెట్లతో చెలరేగి..
Ind Vs Sa 3rd Test: దాదాపు వారం రోజుల క్రితం... రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి బుమ్రా చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాపై అతని బౌలింగ్ అస్త్రాలేవీ పని చేయకపోగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తేదీ మారింది, వేదిక మారింది. తాను అరంగేట్రం చేసిన న్యూలాండ్స్ మైదానంలో బుమ్రా మళ్లీ కదం తొక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టి పడేస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఓవరాల్గా 70 పరుగుల ముందంజలో ఉన్న టీమిండియా చేతిలో 8 వికెట్లున్నాయి. మ్యాచ్ మూడో రోజు గురువారం ఎంత స్కోరు సాధిస్తుందనే దానిపైనే టెస్టు, సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పీటర్సన్ అర్ధ సెంచరీ... తొలి ఓవర్లోనే వికెట్తో భారత్కు రెండో రోజు శుభారంభం లభించింది. బుమ్రా వేసిన రెండో బంతికే మార్క్రమ్ (8) క్లీన్బౌల్డ్ కాగా, కేశవ్ మహరాజ్ (25)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. ఈ దశలో పీటర్సన్, వాన్ డర్ డసెన్ (21) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లంచ్ సమయానికి భారత్కు మరో వికెట్ దక్కలేదు. తర్వాతి సెషన్లో మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా జోరు ప్రదర్శించారు. వాన్ డర్ డసెన్ను అవుట్ చేసి 67 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ఉమేశ్ విడదీశాడు. ఆ తర్వాత షమీ ఓవర్తో భారత్కు మరింత పట్టు చిక్కింది. A classy knock from Keegan Petersen during the #Proteas first innings👏 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/2dXHRtyMEB — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 క్రీజ్లో నిలదొక్కుకున్న తెంబా బవుమా (52 బంతుల్లో 28; 4 ఫోర్లు)ను, మరో రెండు బంతులకే కైల్ వెరీన్ (0) కూడా షమీ పెవిలియన్ చేర్చాడు. జాన్సెన్ (7)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో రెండో సెషన్ ముగిసింది. విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి వరకు పోరాడిన పీటర్సన్ను బుమ్రా అవుట్ చేయగా, రబడ (15) చలువతో స్కోరు 200 దాటింది. చివరి వికెట్ కూడా తీసిన బుమ్రా ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్క్రమ్ (బి) బుమ్రా 8; కేశవ్ మహరాజ్ (బి) ఉమేశ్ 25; కీగన్ పీటర్సన్ (సి) పుజారా (బి) బుమ్రా 72; వాన్ డర్ డసెన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమీ 28; వెరీన్ (సి) పంత్ (బి) షమీ 0; జాన్సెన్ (బి) బుమ్రా 7; రబడ (సి) బుమ్రా (బి) శార్దుల్ 15; ఒలీవియర్ (నాటౌట్) 10; ఎన్గిడి (సి) అశ్విన్ (బి) బుమ్రా 3; ఎక్స్ట్రాలు 18; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–10, 2–17, 3–45, 4–112, 5–159, 6–159, 7–176, 8– 179, 9–200, 10–210. బౌలింగ్: బుమ్రా 23.3– 8–42–5, ఉమేశ్ యాదవ్ 16–3–64–2, షమీ 16–4–39–2, శార్దుల్ 12–2–37–1, అశ్విన్ 9–3–15–0. ►బుమ్రా ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే వచ్చాయి. ►కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గావస్కర్, అజహర్ తర్వాత ఈ మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
ఓటమిలోనూ శార్దూల్ అరుదైన రికార్డు
జోహన్నెస్బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక టీమిండియా ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలంటే ఆఖరి టెస్టును కచ్చితంగా గెలవాల్సిందే. ఇక టీమిండియా ఓడినప్పటికి శార్దూల్ ఠాకూర్ మాత్రం తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. టీమిండియా ఓడిన టెస్టులో బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన ఆటగాడిగా శార్దూల్ నిలిచాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో శార్దూల్ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడు వికెట్లు తొలి ఇన్నింగ్స్లోనే రావడం విశేషం. ఇక టీమిండియా ఓడిన టెస్టులో బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన మూడో టీమిండియా పేసర్గా శార్దూల్ నిలిచాడు. ఇంతకముందు జగవల్ శ్రీనాథ్( కోల్కతా వేదికగా 1998-99లో పాకిస్తాన్పై 8/86), కపిల్ దేవ్( అహ్మదాబాద్ వేదికగా 1983-84లో వెస్టిండీస్పై 9/83) ఈ ఫీట్ను నమోదు చేశారు. -
హార్ధిక్ నుంచి ఆశించింది శార్ధూల్ నెరవేరుస్తున్నాడు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు శార్ధూల్ ఠాకూర్(7/61 & 1/24, 0 & 24 బంతుల్లో 28)పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు, రెండో ఇన్నింగ్స్లో వికెట్తో పాటు బ్యాట్తోనూ రాణించిన శార్ధూల్.. స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేస్తున్నాడని అభిప్రాయడ్డాడు. హార్ధిక్ నుంచి ఆశించిన దాన్ని శార్ధూల్.. నూటికి నూరు పాళ్లు నెరవేరుస్తున్నాడని ఆకాశానికెత్తాడు. బ్యాటింగ్లో శార్ధూల్ను హార్ధిక్తో పోల్చలేమన్న ఆకాశ్.. బౌలింగ్లో మాత్రం శార్ధూల్.. ఆశించిన దాని కంటే అధికంగానే రాణిస్తున్నాడని కితాబునిచ్చాడు. శార్ధూల్.. బ్యాట్తోనూ మెరుపు ఇన్నింగ్స్లు ఆడడం చూసామని, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇస్తే అతని నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. శార్ధూల్ రూపంలో టీమిండియాకు అసలుసిసలైన బౌలింగ్ ఆల్రౌండర్ లభించాడని కొనియాడాడు. అయితే, భారీ అంచనాలతో అతనిపై ఒత్తిడి పెంచొద్దని సూచించాడు. ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతున్న రెండో టెస్ట్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. టీమిండియా నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వరుణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడితే తప్ప మ్యాచ్ ఫలితాన్ని ఎవరూ ఆపలేరు. మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికాకు 122 పరుగులు, టీమిండియాకు 8 వికెట్లు కావాల్సి ఉంది. చదవండి: మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం -
శార్ధూల్ ఠాకూర్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగిన టీమిండియా పేసర్ శార్ధూల్ ఠాకూర్కు సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. శార్ధూల్ పేరుకు ముందు "లార్డ్" అనే ట్యాగ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని అభిమానులు ఆరా తీస్తుండగా.. శార్దూలే స్వయంగా "లార్డ్ ట్యాగ్" వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ అనంతరం టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడుతూ.. సదరు విషయంపై వివరణ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. Man of the moment @imShard reacts to the social media frenzy post his 7⃣-wicket haul at The Wanderers. 👏 👍 P.S. How did he get the title of 'Lord'? 🤔 #TeamIndia #SAvIND To find out, watch the full interview by @28anand 🎥 🔽 https://t.co/dkWcqAL3z5 pic.twitter.com/vSIjk2hvyR — BCCI (@BCCI) January 5, 2022 అసలు విషయం ఏంటంటే(శార్ధూల్ మాటల్లో).. నా పేరుకు ముందు లార్డ్ అనే ట్యాగ్ ఎవరు పెట్టారో నాకే తెలీదు. గతేడాది(2021) ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా నా పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్లో నేను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాను. అప్పటి నుంచే నా పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్గా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. శార్ధూల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్లోనూ మెరిశాడు. 24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. చదవండి: లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం -
Ind Vs Sa: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ భేష్: ప్రొటిస్ మాజీ సారథి
Shaun Pollock Comments On KL Rahul Captaincy: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎల్ రాహుల్ను ప్రొటిస్ మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ప్రశంసించాడు. అవసరమైన సమయంలో శార్దూల్ ఠాకూర్ను బరిలోకి దింపి వ్యూహాత్మకంగా వ్యవహరించాడని కితాబిచ్చాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. ఇక అచ్చొచ్చిన వాండరర్స్ మైదానంలో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతున్న వేళ కీలక పేసర్ తొలి రోజు ఆటలో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో భారత శిబిరం ఆందోళనలో మునిగిపోయింది. అయితే, రెండో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి అతడు అందుబాటులోకి వచ్చినా ఎలా రాణిస్తాడోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ రాహుల్ వ్యూహాత్మకంగా శార్దూల్ ఠాకూర్ను రంగంలోకి దింపాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఏడు వికెట్లు కూల్చి సత్తా చాటాడు శార్దూల్. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ సారథి షాన్ పొలాక్ మాట్లాడుతూ... ‘‘నిజంగా రెండో రోజు ఆటకు ముందు టీమిండియా ముంగిట కొన్ని సవాళ్లు ఉన్నాయి. సిరాజ్ గాయపడ్డాడు. కీలక బౌలర్ ఇలాంటి పరిస్థితిలో ఉండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ సిట్యువేషన్లో ఏ కెప్టెన్ అయినా ఒత్తిడికి గురవడం సహజం. అక్కడే రాహుల్ తెలివిగా ఆలోచించాడు. ఫస్ట్ సెషన్ తర్వాత పద్ధతి మార్చాడు. బాగానే బౌల్ చేస్తున్నారు. కానీ వికెట్లు తీయకపోతే కష్టం అనుకున్నాడేమో! ఇంకా ఏం చేయాలి? అని ఆలోచించి ఉంటాడు. శార్దూల్ను పంపాడు. లంచ్కు ముందు అతడు చేసిన అద్బుతం చూశాం కదా’’ అని రాహుల్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక టీమిండియా వెటరన్ దినేశ్ కార్తిక్ సైతం రాహుల్ కెప్టెన్సీ బాగా చేశాడంటూ అభినందించాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-5లోకి బంగ్లాదేశ్... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! -
Ind Vs Sa: వారెవ్వా.. వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ..
Ind Vs Sa 2nd Test: Shardul Thakur 5 Wicket Haul Wonders At Wanderers: గత ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టు... తొలి ఇన్నింగ్స్లో భారత్ 186/6తో కష్టాల్లో పడిన స్థితిలో శార్దుల్ ఠాకూర్ కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. శార్దుల్, వాషింగ్టన్ సుందర్ 123 పరుగుల భాగస్వామ్యం చివర్లో భారత్ గెలుపునకు కీలకంగా మారింది. ఆ తర్వాత ఓవల్ టెస్టులో ఇంగ్లండ్పై మెరుపు బ్యాటింగ్తో రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు (57, 60) జట్టు విజయానికి కారణంగా నిలిచాయి. అయితే బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న శార్దుల్ నుంచి తొలి ఐదు టెస్టుల్లో సరైన బౌలింగ్ ప్రదర్శన ఇంకా రాలేదని భావిస్తుండగా తనేంటో అతను వాండరర్స్లో చూపించాడు. మొదటి స్పెల్లో 14 పరుగుల వ్యవధిలో 3 ప్రధాన వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టిన అతను, ప్రమాదకరంగా మారుతున్న నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసి మ్యాచ్ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. అదే జోరులో తర్వాతా మరో మూడు వికెట్లు శార్దుల్ ఖాతాలో చేరాయి. వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ అనూహ్యంగా అతను వికెట్లు పడగొట్టడం, మ్యాచ్లను మలుపు తిప్పిన క్షణాల కారణంగా సహచరులు ‘లార్డ్’ అంటూ అతనికి ముద్దు పేరు పెట్టారు. స్వల్ప కెరీర్లోనే శార్దుల్కు భిన్నమైన అనుభవాలు ఉన్నాయి. అప్పుడు తొలి టెస్టులో 10 బంతులు వేయగానే.. ఆరేళ్ల పాటు ముంబై తరఫున ప్రధాన పేసర్గా శార్దుల్ రాణించాడు. అయితే హైదరాబాద్లో ఆడిన తన తొలి టెస్టులో 10 బంతులు వేయగానే గాయం కారణంగా తప్పుకోవాల్సి రాగా, రెండేళ్ల తర్వాత గానీ మరో టెస్టు ఆడే అవకాశం రాలేదు. భారత జట్టు తరఫున తొలి వన్డే ఆడినప్పుడు సచిన్ జెర్సీ నంబర్ ‘10’ వేసుకొని బరిలోకి దిగినప్పుడు ‘అంత మొనగాడివా’ అంటూ భారత క్రికెట్ అభిమానులే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే బిత్తరపోయి వెంటనే నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ టీమ్ పంజాబ్ ఇక నీ అవసరం లేదంటూ లీగ్ మధ్యలో ఇంటికి పంపిస్తే బెదరకుండా ఫ్రాంచైజీపై బహిరంగ విమర్శలు చేసి మళ్లీ రంజీ ట్రోఫీకి వెళ్లి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో ప్రతికూలతలను అధిగమించి జట్టులో రెగ్యులర్గా మారాడు. తాజా ప్రదర్శన బౌలర్గా శార్దుల్ను మరో మెట్టు ఎక్కించింది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని గొప్ప ప్రదర్శనలు చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ శార్దూల్! చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! -
Ind Vs Sa 2nd Test: శార్దుల్ సప్తమి.. 7 వికెట్లు పడగొట్టిన పేసర్
Ind vs sa 2nd Test: India Lead By 58 Runs End Of Day 2: వాండరర్స్ మైదానంలో శార్దుల్ ఠాకూర్ వండర్ఫుల్ ప్రదర్శనతో మెరిశాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్గా నిలుస్తూ ఏడు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా టీమిండియా నిలువరించగలిగింది. చేతిలో 8 వికెట్లతో మన జట్టు 58 పరుగులు ముందంజలో ఉండగా మూడో రోజు బ్యాటింగ్ కీలకం కానుంది. భారత బ్యాటర్లు ఎంత స్కోరు చేసి దక్షిణాఫ్రికాకు లక్ష్యం నిర్దేశిస్తారనేది ఆసక్తికరం. జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా... పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్కు 58 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఓవర్నైట్ బ్యాటర్లు ఎల్గర్ (120 బంతుల్లో 28; 4 ఫోర్లు), పీటర్సన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను కొనసాగించారు. అతి జాగ్రత్తగా ఆడిన ఎల్గర్ రెండో రోజు 32వ బంతికి గానీ మొదటి పరుగు తీయలేకపోగా, పీటర్సన్ కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్కు 74 పరుగులు జోడించగా, 103 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తయింది. మంగళవారం రోజు భారత్ వేసిన తొలి 18 ఓవర్లలో శార్దుల్కు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత బంతిని అందుకున్న అతను అద్భుత స్పెల్తో ఆటను మార్చేశాడు. తన రెండో ఓవర్లోనే అతను ఎల్గర్ను వెనక్కి పంపాడు. మరో రెండు ఓవర్ల తర్వాత చక్కటి బంతితో పీటర్సన్ను అవుట్ చేసిన శార్దుల్... మరుసటి ఓవర్లో డసెన్ (1) పని పట్టాడు. లంచ్ సమయానికి శార్దుల్ స్పెల్ 4.4–3–8–3 కావడం విశేషం. ఆదుకున్న బవుమా... స్కోరు 102/4గా నిలిచిన స్థితిలో సఫారీ జట్టు ఇన్నింగ్స్ను బవుమా, కైల్ వెరీన్ (21) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్కు 60 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ మరోసారి రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. వెరీన్, బవుమా లను శార్దుల్ అవుట్ చేశాడు. టీ విరామం తర్వాత కేశవ్ (21), జాన్సెన్ (21) వేగంగా 38 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు ఆధిక్యాన్ని అందించారు. ఈ దశలో శార్దుల్ చెలరేగి ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు తీసి సఫారీల ఇన్నింగ్స్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) శార్దుల్ 28; మార్క్రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (సి) మయాంక్ (బి) శార్దుల్ 62; డసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 1; బవుమా (సి) పంత్ (బి) శార్దుల్ 51; వెరీన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 21; జాన్సెన్ (సి) అశ్విన్ (బి) శార్దుల్ 21; రబడ (సి) సిరాజ్ (బి) షమీ 0; కేశవ్ (బి) బుమ్రా 21; ఒలీవియర్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) పంత్ (బి) శార్దుల్ 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 229. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–101, 4–102, 5–162, 6–177, 7–179, 8–217, 9–228, 10–229. బౌలింగ్: బుమ్రా 21–5–49–1, షమీ 21–5–52–2, సిరాజ్ 9.5–2–24–0, శార్దుల్ 17.5–3–61–7, అశ్విన్ 10–1–35–0. భారత్ రెండో ఇన్నింగ్స్: 85/2 -
కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్గా రికార్డు
IND Vs SA 2nd Test Day 2: దక్షిణాఫ్రికాతో జొహనెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ముందు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో సెషన్లోనూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు సాధించి తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో జొహనెస్బర్గ్ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (6/53) తొలుత ఈ ఫీట్ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్ని అందుకున్నారు. తాజాగా శార్దూల్ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్లో ఆరో టెస్ట్ ఆడుతున్న శార్ధూల్కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. ఇదిలా ఉంటే, రెండో రోజు ఆటలో శార్ధూల్ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది. టీ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్లో జన్సెన్(2), కేశవ్ మహారాజ్(11) ఉన్నారు. శార్ధూల్తో పాటు షమీ(2/52) కూడా రాణించాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు! -
Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు!
Rassie van der Dussen Dismissal: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు రసే వాన్ డెర్ డసెన్ అవుటైన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. బంతి బౌన్స్ అయిన తర్వాత కీపర్ చేతుల్లో పడిందని, అతడిని తిరిగి మైదానంలోకి పిలిపిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వాండరర్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భాగంగా టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 45వ ఓవర్లో లార్డ్ శార్దూల్ సంధించిన రెండో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు డసెన్. కానీ చివరి నిమిషంలో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే, అప్పటికే బంతిని బ్యాట్ తాకడం ఆ తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దానిని అందుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో అంపైర్ డసెన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో లంచ్ సమయానికి ముందు ప్రొటిస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే, లంచ్ విరామ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. డసెన్ అవుటైన తీరుపై తమ జట్టు మేనేజర్ ఖొమొత్సొ మసుబెలెలెతో కలిసి అంపైర్లతో చర్చించినట్లు. సమాచారం. రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడటానికి ముందు బంతి నేలను తాకినట్లు కనిపించింది. సైడ్ యాంగిల్లో మాత్రం క్యాచ్ పట్టినట్లు కనబడింది. దీంతో తాము అనవసరంగా బలైపోయామని ఎల్గర్ వాపోయినట్లు సమాచారం. ఈ విషయం గురించి కామెంటేటర్ మార్క్ నికోలస్ మాట్లాడుతూ... ‘‘ఒక యాంగిల్లో ఒకలా.. మరో యాంగిల్లో ఇంకోలా కనిపిస్తుంది. కాబట్టి అవుట్ కాలేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఇందుకు కచ్చితమైన ఆధారాలు ఉంటే... ఫీల్డింగ్ కెప్టెన్కు సదరు బ్యాటర్ను వెనక్కి పిలిపించమని సూచించేవారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్.. ఇలాంటి అస్పష్టమైన దృశ్యాల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమని, బంతి నేలను తాకిందా లేదా అనేది పంత్కు తెలిసి ఉంటుందని చెప్పుకొచ్చాడు. చదవండి: Shardul Thakur: పాపం బుమ్రా, షమీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.. కానీ శార్దూల్.. అస్సలు ఊహించలేదు కదా! -
Ind Vs Sa: పాపం బుమ్రా, షమీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.. అస్సలు ఊహించలేదు కదా!
Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్రొటిస్ను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న శార్దూల్ పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఈ యువ ఆటగాడిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘లార్డ్ శార్దూల్... టీమిండియా ఫెయిర్ ప్లేను నమ్ముతుంది. అందుకే లార్డ్ ఎప్పుడూ కొత్త బ్యాటర్లకు బౌల్ చేయడు. ప్రత్యర్థి జట్టు భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్న సమయంలో రంగంలోకి దిగుతాడు. వాళ్లను అవుట్ చేసేస్తాడు’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ శార్దూల్ను ఆకాశానికెత్తాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ సైతం... శార్దూల్ అద్భుతంగా బౌల్ చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. ఇంకొంత మంది నెటిజన్లు... ‘‘పాపం దక్షిణాఫ్రికా బుమ్రా, షమీ, అశ్విన్ బౌలింగ్ ఎదుర్కునేందుకు ప్రణాళికలు రచించింది. కానీ లార్డ్ శార్దూల్ ఠాకూర్ రంగంలోకి దిగాడు. అవుటాఫ్ సిలబస్ కదా’’అంటూ ఫన్మీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. ‘‘తక్కువ అంచనాలు.. అత్యద్భుతంగా రాణింపు.. అదీ మరి శార్దూల్ అంటే! నిజమైన పేసు గుర్రం అతడు’’ అంటూ మురిసిపోతున్నారు. కాగా వాండరర్స్లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ ఎల్గర్, పీటర్సన్, వాన్ డెర్ డసెన్ వికెట్లు తీసి లంచ్ బ్రేక్ సమయానికి ముందు శార్దూల్ ఈ టీమిండియా శిబిరంలో జోష్ నింపాడు. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు మార్పు.. ఎందుకంటే! Lord Shardul and team India believe in fair play. That's why Lord never bowls to new batsmen, he's only brought on once there is a partnership and the batsmen are set. Lord still gets them out though 😄 #SAvIND — Wasim Jaffer (@WasimJaffer14) January 4, 2022 South Africa was prepared for Bumrah , Shami and Ashwin but at the End Lord Shardul Thakur came out of the syllabus #INDvsSA pic.twitter.com/3iqr1mpCYM — h-a-m-m-a-d (@iamhmmad1) January 4, 2022 There are only three things which are truly inevitable: 1) Death 2) Taxes 3) Lord Shardul Thakur @imShard #INDvsSA — Shikhar (He/Him) (@Shikhar__T) January 4, 2022 Shardul Thakur ... Dark HORSE 🐎 among INDIAN Pacers....least expectations but maximum returns#INDvsSA #SAvsIND — Cricket Commentary (@sfdepanc) January 4, 2022 -
ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపమా డికాక్..
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తుంది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రొటీస్ను దెబ్బ తీస్తున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఆడుతోంది. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా మరో 198 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు రెండు రోజులు సమయం ఉండడంతో వర్షం అంతరాయం కలిగించకపోతే మాత్రం టీమిండియాకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్లో తొలి నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత డికాక్, బవుమాతో కలిసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను కాసేపు నడిపించాడు. అయితే 34 పరుగులతో నిలదొక్కుకున్నట్లు కనిపించిన డికాక్ను శార్దూల్ ఠాకూర్ సూపర్ డెలివరీతో క్లీన్బౌల్డ్ చేశాడు. శార్దూల్ వేసిన గుడ్లెంగ్త్ డెలివరీ ఆఫ్స్టంప్ అవతల పడగా.. డికాక్ థర్డ్మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్టంప్స్ను ఎగురగొట్టింది. దీంతో ఔటయ్యానన్న కోపంతో డికాక్ తన బ్యాట్తో వికెట్లను కొట్టాలనుకొని చివరి నిమిషంలో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. pic.twitter.com/DsqwN8BHZ5 — Addicric (@addicric) December 28, 2021 -
అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే!
దక్షిణాప్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాప్రికా చేరుకున్న టీమిండియా ఒక్క రోజు ఐషోలేషన్లో ఉండనుంది. ఇక టెస్ట్ సిరీస్కు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్కు శార్దూల్ ఠాకూర్ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. “శార్దూల్ ఠాకూర్కు ఖచ్చితంగా స్థానం దక్కుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారత్ సాధించిన ప్రతీ విజయంలో అతడు కీలకపాత్ర పోషించాడు. అదే విధంగా విదేశీ పిచ్లపై కూడా అతడు రాణించగలడు. శార్దూల్ బాల్తో పాటు బ్యాట్తో కూడా రాణించగలడు. ఇటువంటి సమయంలో భారత్కు ఠాకూర్ ఆటగాడు చాలా అవసరం. ఇంగ్లండ్ సిరీస్లో అతడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి సాదరణంగా విదేశాల్లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగుతుంటాడు. కోహ్లి వ్యూహం ఠాకూర్కు ఫేవర్గా ఉంటుందని" అతడు పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly: మొన్న ద్రవిడ్.. నిన్న లక్ష్మణ్.. ఇక సచిన్ వంతు... బిగ్ హింట్ ఇచ్చిన గంగూలీ -
Shardul Thakur: ఘనంగా శార్దూల్ ఎంగేజ్మెంట్.. రోహిత్ శర్మ హాజరు
టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్ఫ్రెండ్ మిట్టాలి పారుల్కర్తో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న శార్దూల్ సోమవారం ఆమెతో ఎంగేజ్ చేసుకున్నాడు. ఆటపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో శార్దూల్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 ముగిసిన అనంతరం వివాహం చేసుకోనున్నాడు. కాగా ఎంగేజ్మెంట్ వేడుకకు టీమిండియా టి20 కెప్టెన్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. అనంతరం రోహిత్ ట్విటర్లో స్పందించాడు." కంగ్రాట్స్ శార్దూల్ ఠాకూర్.. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న నీకు నా తరపున బెస్ట్ విషెస్ అందిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక వేడుకకు కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కాగా బందుమిత్రులతో సరదాగా గడిపిన శార్దూల్ను గేమ్ ఓవర్ అంటూ ఆటపట్టించడం ఆసక్తి కలిగించింది. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న శార్దూల్.. డిసెంబర్లో జరగనున్న దక్షిణాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ అతనికి వర్క్లోడ్ పేరుతో కివీస్ సిరీస్కు విశ్రాంతి ఇచ్చింది. ఇక టీమిండియా తరపున 4 టెస్టులు.. 15 వన్డేలు.. 24 టి20 మ్యాచ్లు ఆడాడు. #RohitSharma too Went For #Shardulthakur engagement 😳❤️👌 pic.twitter.com/A3qHOyEiXp — Kasturi (@missgeminita) November 29, 2021 -
Shardul Thakur: ప్రేయసి మిథాలితో శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్
Shardul Thakur-Mittali Parulkar Engagement: టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి మిథాలీ పారుల్కర్ను మనువాడబోతున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఈ వేడుక జరిగినట్లు శార్దూల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్- మిథాలీ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్లు ఆడిన శార్దూల్ ఠాకూర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో చెన్నై చాంపియన్గా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్... ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్-2021లో పాల్గొన్నాడు. ఇక ఫాల్ఘర్కు చెందిన శార్దూల్ ఠాకూర్ గత కొంతకాలంగా మిథాలీతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: laxman sivaramakrishnan: నా జీవితకాలమంతా వర్ణ వివక్ష ఎదుర్కొన్నా.. అది కూడా మన దేశంలోనే... View this post on Instagram A post shared by Shardul Thakur 🔵 (@shardulthakur_) View this post on Instagram A post shared by Shardul Thakur FC🔵 (@shardulthakur16) -
Ind vs Nz Test Series: ద్రవిడ్ ప్రణాళికలు.. సూర్యకుమార్కు బంపరాఫర్!
Suryakumar Yadav asked to stay back with team for NZ Tests- Reports: టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లనున్నాడా? భారత ‘ఏ’ జట్టుతో ప్రొటీస్ ఆడనున్న టెస్టు జట్టులో భాగస్వామ్యం కానున్నాడా? ‘షేర్’దూల్ సంగతి ఇలా ఉంటే మరో ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైందా? న్యూజిలాండ్తో సిరీస్లో అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ పగ్గాలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసి రోహిత్ సేన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇదే జోష్లో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఏ మ్యాచ్(అధికార, అనధికార సిరీస్లు) ఆడుతున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ప్రతి ఆటగాడిని అన్ని ఫార్మాట్లకు సన్నద్ధంగా ఉంచేలా వివిధ మ్యాచ్లు ఆడించేందుకు ద్రవిడ్ ప్రణాళికలు రచిస్తున్నాడట. ఇందులో భాగంగానే శార్దూల్ను దక్షిణాఫ్రికాకు పంపాలని భావిస్తున్నారట. డిసెంబరు 6 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టుకు సిద్ధంగా ఉండాలని శార్దూల్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తన వంతు పాత్ర పోషించిన శార్దూల్ను తదుపరి సిరీస్లకు సన్నద్ధం చేసేందుకు(ప్రాక్టీసు) ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట. ఇక సూర్యకుమార్ విషయానికొస్తే... న్యూజిలాండ్తో జరుగనున్న టెస్టు సిరీస్కు ముందు ప్రకటించిన జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మొదటి టెస్టులో అతడిని ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాన్పూర్ వేదికగా జరిగే తొలి టెస్టులో ఈ ముంబైకర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని.. రెండు మ్యాచ్లలోనూ అతడిని ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రచురించింది. ఇక మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ ‘ఏ’ జట్టు అనధికారిక సిరీస్ ఆరంభం కానుండగా.. నవంబరు 25 నుంచి భారత్- న్యూజిలాండ్ టెస్టు సిరీస్ మొదలుకానుంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్.. ఆట పట్టించిన శ్రేయస్.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్! Rahul Dravid: నా ఫస్ట్లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి -
భువనేశ్వర్ను తీసేయండి.. అతడిని తీసుకోండి
Shardul Thakur: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్ నేడు కీలక మైన పోరులో న్యూజిలాండ్తో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠత ఇంకా కొనసాగుతోంది. ఇక ఫామ్ కోల్పోయిన భువనేశ్వర్ కుమార్ స్ధానంలో తుది జట్టులో శార్ధూల్ ఠాకూర్కు అవకాశం కల్పించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కోవలోనే భారత్ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా చేరాడు. న్యూజిలాండ్తో జరగబోతున్న ఈ కీలకమైన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ను తప్పించి శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో షేర్ చేసిన ఆకాష్ చోప్రా.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ మార్పులు చేయాలా? వద్దా? అనే ఆంశంపై చర్చించాడు. "నా అభిప్రాయం ప్రకారం.. శార్దూల్ ఠాకూర్ గురించి టీమిండియా ఆలోచించాలి. నేనైతే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తాను. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అయినప్పటీకీ.. ప్రస్తుతం ఫామ్లో లేడు. ఠాకూర్కి వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు పవర్ప్లేలో ఒక ఓవర్, మిడిల్ ఓవర్లలో ఒకటి లేదా రెండు ఓవర్లు, చివర్లో ఒక ఓవర్ వేయగలడు. నిజం చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్ల విషయంలో శార్దూల్ తప్ప వేరే ఆప్షన్ టీమిండియాకు లేదు" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా! -
మెంటార్గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్
Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్గా ఎంఎస్ ధోని ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెంటార్గా ధోని తన పనిని ప్రారంభించాడంటూ ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. ఇంకా టి20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ధోని ఎలా ప్రారంభించాడని సందేహ పడకండి. తాజాగా శార్దూల్ ఠాకూర్ .. అక్షర్ పటేల్ స్థానంలో టి20 ప్రపంచకప్ టీమిండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్ఫిట్.. జట్టులోకి మరో ఆల్రౌండర్! దీనివెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్కే ఈ సీజన్లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే ఆడిన 15 మ్యాచ్ల్లో శార్దూల్ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్కు ప్లస్గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్కే ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్పై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్తో విరుచుకుపడ్డారు. లార్డ్ శార్దూల్ ఈజ్ బ్యాక్.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు.. అతని టాలెంట్తో ఎంపికయ్యాడు.. ధోని మెంటార్గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్తో రెచ్చిపోయారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. 🇮🇳 #T20WorldCup Call up 💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/sf6d9JmS4C — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 13, 2021 Lord Is Here #WorldCup pic.twitter.com/AUHlGEI2OU — Aakash Chopra (@cricketaakash) October 13, 2021 Lord Shardul Thakur replacing Axar Patel in #TeamIndia be like 🙈 pic.twitter.com/I5RSZilRhr — Paapsee Tannu ( Tax chor ) 2.0 🐦 (@tiranga__1) October 13, 2021 -
భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అనూహ్య మార్పు..
Shardul Thakur Replaces Axar Patel In Team India T20 World Cup Squad: టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఇదివరకే ప్రకటించిన 15 మంది రెగ్యులర్ సభ్యుల్లో ఒకడైన అక్షర్ పటేల్ స్థానంలో స్టాండ్ బై ఆటగాడు శార్దూల్ ఠాకూర్కు చోటు కల్పిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అక్షర్ పటేల్ స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. ఈ కీలక మార్పుతో పాటు మరో 8 మంది ఆటగాళ్లను జట్టుతో పాటే ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మాన్ మేరీవాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్లు టీమిండియాతో పాటే యూఏఈలో ఉండనున్నారు. కాగా, ఈ నెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న దాయాది పాకిస్థాన్తో టీమిండియా తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. భారత టీ 20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ. రిజర్వ్ ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్ చదవండి: టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..! -
T20 World Cup 2021: హార్దిక్ అన్ఫిట్.. జట్టులోకి మరో ఆల్రౌండర్!
Aakash Chopra.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా జట్టులోకి ఎంపికైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్ఫిట్ అని.. అతని స్థానంలో మరొకరు రావడం ఖాయమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. టీమిండియా ఫైనల్ లిస్ట్కు సంబంధించి అక్టోబర్ 15 వరకు గడువు ఉండడంతో మార్పు తధ్యమని పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. యూట్యూబ్ చానెల్లో ఆకాశ్చోప్రా మాట్లాడుతూ.. '' టీమిండియా టి20 ప్రపంచకప్ 15 మంది సభ్యుల్లో హార్దిక్ ఉండాలా వద్దా అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. ప్రస్తుతం అతను బౌలింగ్ చేయడం మానేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఒకటి రెండు మ్యాచ్లు మినహా పెద్దగా బౌలింగ్ చేయలేదు. జట్టులోకి ఆల్రౌండర్గా ఎంపికైనప్పుడు అన్ని విధాల టీమిండియాకు సాయపడాలి. ఒక ఆల్రౌండర్గా సేవలు అందించనప్పుడు జట్టులో ఉండడం అనవసరం. అతని స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇచ్చినా బాగుంటుంది. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే హార్దిక్ విషయంలో రానున్న టి20 ప్రపంచకప్లో కీలకంగా ఉంటాడని చెప్పా. కానీ ఆర్నెళ్లు తిరిగేసరికి హార్దిక్ టీమిండియాకు భారంగా తయారయ్యాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా స్థానంలో మరో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం శార్దూల్ ఠాకూర్ను అక్షర్ పటేల్ స్థానంలో 15 మంది జట్టులోకి ఎంపిక చేశారు. అలాగే అక్షర్ను స్టాండ్బై ప్లేయర్స్ ఉంచారు. వీరితో పాటు మరో ఎనిమిది మందిని యూఏఈలోనే ఉండాలంటూ బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వారిలో ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, వెంకటేశ్ అయ్యర్లు నెట్బౌలర్లుగా.. హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె గౌతమ్లను కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది. చదవండి: T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే -
RCB vs CSK: వసీం భాయ్.. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం!
IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాన జట్ల మధ్య సిరీస్ల సందర్భంగా అతడు చేసే పోస్టులకు మంచి ఫాలోయింగ్ ఉంది. తుదిజట్టులోని ఆటగాళ్లు లేదంటే, ఆయా మ్యాచ్లలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్, బౌలర్ల మధ్య జరిగే ఆసక్తికరపోరు అంటూ అతడు చేసే పజిల్ తరహా ట్వీట్లను చాలా మంది నెటిజన్లు ఇష్టపడతారు. ఇక ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్కింగ్స్ మధ్య యూఏఈ వేదికగా మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో.. ‘‘నేటి ఐపీఎల్ మ్యాచ్లో ఈ ఇద్దరి ఫైట్ మనం చూడబోతున్నాం’’ అన్న అర్థంలో వసీం జాఫర్ రెండు ఫొటోలు షేర్ చేశాడు. అందులో ఒకటి.. అమెరికన్ డాలర్ నోటు కాగా.. మరొకటి ప్రసిద్ధ సినిమా.. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’’లోనిది. ఇక ట్వీట్ను డీకోడ్ చేసిన నెటిజన్లు తమ ఆన్సర్లతో సిద్ధమైపోయారు. అయితే మెజారిటీ మంది.. నేటి మ్యాచ్(సెప్టెంబరు 24)లో ఏబీ డివిల్లియర్స్(ఆర్సీబీ), శార్దూల్ ఠాకూర్(సీఎస్కే) మధ్య ఫైట్ ఖాయం అని వసీం చెప్పినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డాలర్ నోటుకు ప్రతిగా.. అబ్రహం బెంజమిన్ ఫ్రాంక్లిన్ డివిల్లియర్స్ పేరును సూచిస్తున్నారు. ఇక ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో రాణించిన శార్దూల్ ఠాకూర్ను ‘లార్డ్’ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తిన నేపథ్యంలో.. సెకండ్ ఫొటోకు ప్రతిగా శార్దూల్ పేరును పేర్కొంటున్నారు. మరికొంత మంది డాలర్ నోటుకు హర్షల్ పటేల్ పేరును సూచిస్తున్నారు. మరికొందరేమో మీరు చెప్పిన ఈ ఇద్దరూ కచ్చితంగా తుదిజట్టులో ఉంటారో లేదో చూద్దాం అంటూ ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఠాకూర్ అత్యధిక వికెట్లు(8 వికెట్లు) తీసిన బౌలర్గా నిలిచిన విషయం విదితమే. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్గా Watchout for these two tonight. #RCBvCSK #IPL2021 pic.twitter.com/sT5rDuPO3F — Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2021 LORD SHARDUL SIR 🤯 he gets the three quick wickets of Bairstow, Morgan and Buttler! Wow wow wow. How quickly this game has changed! 🇮🇳🏴#INDvENG — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) March 23, 2021 -
టాప్-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్
దుబాయ్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో అద్భుత స్పెల్తో ఇంగ్లండ్ వెన్నువిరిచిన బుమ్రా.. 771 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ ప్యాట్ కమిన్స్(908) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(831), న్యూజిలాండ్ టిమ్ సౌథీ(824) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ సారధి జో రూట్(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ కేన్ విలియమ్సన్(901), ఆసీస్ స్టీవ్ స్మిత్(891) రెండు, మూడు ర్యాంక్ల్లో నిలిచారు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో సూపర్ శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(813).. తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నప్పటికీ ఐదో స్థానానికే పరిమితయ్యాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(783) ఆరో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఓవల్ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్.. రెండు విభాగాల్లో తన ర్యాంక్ను మెరుగుపర్చుకుని టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. బ్యాటింగ్లో 79, బౌలింగ్లో 49వ ర్యాంకుకు ఎగబాకాడు. చదవండి: సరికొత్త అవతారంలో ట్రంప్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు -
ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్
లండన్: ఓవల్ టెస్ట్ విజయం అనంతరం టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఈ మ్యాచ్లో శార్దూల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగల్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్లో పేక మేడలా కుప్పకూలుతున్న జట్టును శార్దూల్ తన మెరుపు అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ను చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో క్రీజులో పాతుకుపోయిన రోరీ బర్న్స్ను ఔట్ చేసి తొలి వికెట్ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన శార్దూల్.. అత్యంత కీలకమైన జో రూట్ వికెట్ను కూడా పడగొట్టి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. ఇదిలా ఉంటే, ఓవల్ టెస్ట్ తర్వాత రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నశార్డూల్ ఠాకూర్ కూడా చాలామంది స్టార్ క్రికెటర్లలాగే ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యి, భారీగా బరువు పెరిగిన ఇతను.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. తన బర్త్ డే నెల కలిసొచ్చేలా మొదట్లో జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ‘నీ ముఖానికి అంత సీన్ లేదంటూ' ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, స్వతాహాగా సచిన్ అభిమాని అయిన శార్దూల్.. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించి తన జెర్సీ నెంబర్ను 54గా మార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో అద్భుత ప్రదర్శన అనంతరం శార్దూల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ అభిమానుల చేత ట్రోలింగ్కు గురయ్యాడో వారి చేతనే ప్రస్తుతం శభాష్ అనిపించుకున్నాడు. అతని ఆరాధ్య దైవమైన సచిన్ కూడా అతన్ని ప్రశంసించడంతో శార్దూల్ ఆనందానికి అవధుల్లేవు. చదవండి: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ -
Ind Vs Eng: ఆ విషయం నాకు ముందే తెలుసు: శార్దూల్
లండన్: ఓవల్ మైదానంలో టీమిండియా చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. నాలుగో టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు, మూడు వికెట్లతో రాణించిన అతడి ప్రతిభను క్రీడా ప్రముఖులు, అభిమానులు కొనియాడుతున్నారు. నిజానికి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్నే వరించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డు అందుకున్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగి ఒకే టెస్టు మ్యాచ్లో రెండు అర్థ శతకాలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్మన్గా శార్దూల్ ఠాకూర్ తన పేరిట రికార్డు లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అతడు బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘చాలా గొప్పగా అనిపిస్తోంది. జట్టు విజయంలో నాదైన పాత్ర పోషించాలని, నా ముద్ర వేయాలని ముందే ప్లాన్ చేసుకున్నాను. అందుకు తగ్గట్టుగానే.. ఐదో రోజు ఫలితం నా సంతోషాన్ని పరిపూర్ణం చేసింది. వంద కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీయడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉందని తెలుసు. నెట్స్లో ప్రాక్టీసు చేసేటపుడు ఎన్నోసార్లు బ్యాటింగ్ చేశాను కూడా. ఇప్పుడైతే నేను హ్యాపీ’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 36 బంతులు ఎదుర్కొని 57 పరుగులు(7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి, ఒక వికెట్(ఓలీ పోప్) తీసిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో 72 బంతుల్లో 60 పరుగులు(7 ఫోర్టు, ఒక సిక్సర్) చేసి, రోరీ బర్న్స్', జో రూట్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఓవల్ టెస్టులో 157 పరుగులతో కోహ్లి సేన ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా స్కోరు: తొలి ఇన్నింగ్స్: 191-10 (61.3 ఓవర్లు) రెండో ఇన్నింగ్స్: 466-10 (148.2 ఓవర్లు) ఇంగ్లండ్ స్కోరు: తొలి ఇన్నింగ్స్: 290-10 (84 ఓవర్లు) రెండో ఇన్నింగ్స్: 210-10 (92.2 ఓవర్లు) చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం -
అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు
లండన్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీకి ఎంత విలువ ఉందో.. శార్దూల్ ఠాకూర్ ట్విన్ హాఫ్ సెంచరీలకు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు రెండుగా చీలిపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రోహిత్ శర్మ అర్హుడని కొందరు అంటే.. లేదు శార్దూల్కే ఆ అర్హత ఉందని మరికొందరు వాదించారు. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శర్మ తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడంపై మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర ''నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్ ఠాకూర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకంటే శార్దూల్కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్లో తామంతా బ్యాటింగ్లో విఫలమైనప్పుడు శార్దూల్ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ ప్రధాన బ్యాట్స్మెన్ అవుటైన తర్వాత పంత్తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. 100 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నాకంటే శార్దూల్కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా -
Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్మన్గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ప్రధాన బ్యాట్స్మన్ విఫలమైన చోట శార్దూల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్లో ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఓవరాల్గా ఇప్పటివరకు భారత్ 336 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా 9, ఉమేశ్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: Kohli Frustration: ఔటయ్యానన్న కోపంలో గోడను కొట్టిన కోహ్లి ENG Vs IND: బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ We Call Him "LORD SHARDUL" For A Reason😌💙💙💙...Fearless & Aggressive😎💙💙💙...Well Played @imShard 🙌🏻💙...#LordShardul #ShardulThakur #ENGvINDpic.twitter.com/PsYueXD2WD — Bitan Sangram (@IAmBitan45) September 2, 2021 Indian No.8 or lower batsmen scoring two 50+ scores in a Test match: Harbhajan Singh v NZ, Ahmedabad, 2010 Bhuvneshwar Kumar v Eng, Nottingham, 2014 W Saha v NZ, Kolkata, 2016 Shardul Thakur v Eng, The Oval, 2021*#ENGvIND — Umang Pabari (@UPStatsman) September 5, 2021 Lord shardul 🙏🙏#INDvENG #BCCI @imShard pic.twitter.com/yJEtRlBsgR — Don Abhimanyu (@DonAbhimanyu_) September 5, 2021 -
ఔటయ్యానన్న కోపంతో బ్యాట్ను నేలకేసి కొట్టాడు
లండన్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఓలీ పోప్ 81 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యానన్న కోపంతో బ్యాట్ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్గా మారింది. ఇన్నింగ్స్ 77వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. శార్ధూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికే పోప్ ఔటయ్యాడు. శార్దూల్ వేసిన బంతిని పోప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకి ఇన్నర్ ఎడ్జ్తో వికెట్లను గిరాటేసింది. దీంతో కోపం పట్టలేక బాధతో తన బ్యాట్ను నేలకేసి కొడుతూ నిరాశగా వెనుదిరిగాడు. ఇక పోప్ కీలక సమయంలో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పోప్ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. బెయిర్ స్టో, మొయిన్ అలీలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. క్రిస్ వోక్స్ 28, జేమ్స్ అండర్సన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. Shardul Thakur chops on Ollie Pope, Shardul delivers when the team required. pic.twitter.com/PAlyHcWvue — Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2021 -
శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు
ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్తో టెస్ట్ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని(31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు. Shardul counter-attacks England in style and races to his 50 with a pull over square leg for 6. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Shardul pic.twitter.com/pzGbUPnUI8 — Sony Sports (@SonySportsIndia) September 2, 2021 ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్మన్గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్లో బోథమ్ ఈ ఫీట్ను సాధించాడు. ఇక, 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన సుడిగాలి ఇన్నంగ్స్తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్తో 8వ వికెట్కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. రాబిన్సన్ వేసిన 60వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్లో రెండో అర్థశతకం పూర్తి చేశాడు. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం టీమిండియా బౌలర్లు కూడా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి ఎదురీదుతోంది. బుమ్రా(2/15), ఉమేశ్(1/15) ఇంగ్లండ్ టపార్డర్ పతనాన్ని శాసించారు. చదవండి: అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం -
IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..!
‘ది ఓవల్’ సీమర్ల అడ్డాగా తయారైంది. ప్రతి సెషన్లోనూ పేసర్లదే పైచేయి. బ్యాట్స్మెన్ను క్రీజులో పాతుకోకుండా వణికిస్తోంది. మొదట ఇంగ్లండ్ పేసర్ల ముందు మన బ్యాట్స్మెన్ తలవంచారు. కోహ్లి అర్ధసెంచరీ భారత్కు ఊరటనిస్తే... ఆఖరి సెషన్లో శార్దుల్ ఠాకూర్ మెరుపులు భారత్ స్కోరులో జోరును పెంచాయి. ఇదే సెషన్లో భారత సీమర్లు దీటుగా సత్తాచాటారు. కీలకమైన 3 వికెట్లను పడగొట్టి తొలి రోజే టెస్టును రసవత్తరంగా మార్చారు. మరో 8 బంతుల్లో రోజు ముగుస్తుందనగా అద్భుత బంతితో రూట్ను బౌల్డ్ చేసిన ఉమేశ్ ఘనంగా ముగించాడు. లండన్: తొలి 7 ఓవర్లలో భారత్ స్కోరు 28/0... టెస్టులో అది కూడా ఆరంభంలోనే 4 రన్రేట్ అసాధారణం. టాస్ గెలిచిన రూట్ నిర్ణయం తప్పనిపించింది. మరో 7 ఓవర్లయ్యాక 14 ఓవర్లలో 28/2. ఇది కూడా అసాధారణమే! వరుసగా ఏడు ఓవర్లను మెయిడిన్లుగా వేసిన ఇంగ్లండ్ సీమర్లు ఓపెనర్ల వికెట్లను పడగొట్టారు. ఇక అక్కడి నుంచి ప్రత్యర్థి పేసర్లు అదరగొట్టారు. తమ నాయకుడి నిర్ణయం సరైందని భారత్ను మళ్లీ తొలి రోజే ఆలౌట్ చేశారు. ఏడాది తర్వాత టెస్టు బరిలోకి దిగిన క్రిస్ వోక్స్ (4/55) భారత్ తొలి ఇన్నింగ్స్ కూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 బంతుల్లో 50; 8 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 53/3 స్కోరు చేసింది. మలాన్ (26 బ్యాటింగ్), ఒవర్టన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాప్ మరోసారి ఫ్లాప్... మొదటి ఏడు ఓవర్లే మురిపించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (11), రాహుల్ (17) అంతలోనే కుదేలయ్యారు. చతేశ్వర్ పుజారా (4) కూడా చేతులెత్తేశాడు. 39 పరుగుల వద్దే టాపార్డర్ ఫ్లాపయింది. కెప్టెన్ కోహ్లి క్రీజులో నిలిచేందుకు ప్రత్యర్థి పేసర్లతో పోరాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా జడేజా (10)ను ఐదో స్థానంలో పంపిన ప్రయోగం ఫలించకపోగా, రహానే (14) తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. అయితే మరో ఎండ్లో కోహ్లి ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. 22 పరుగుల వద్ద స్లిప్లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, 85 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి 85 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు) పూర్తి చేసుకున్నాడు. కానీ రాబిన్సన్ భారత కెపె్టన్ను అక్కడితోనే ఆపేయగా, పంత్ (9) మళ్లీ విఫలమయ్యాడు. స్కోరు 127/7కు చేరగా ఇక ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ తరుణంలో శార్దుల్ అనూహ్యంగా చెలరేగాడు. క్రీజ్లో ఉన్నంత సేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వోక్స్ బౌలింగ్లో బౌండరీలు బాదగా... ఓవర్టన్, రాబిన్సన్, వోక్స్ ఓవర్లలో చెరో సిక్సర్ కొట్టాడు. 31 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్స్లు) చకచకా అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ. విఖ్యాత ఆల్రౌండర్ కపిల్దేవ్ 30 బంతుల్లో సాధించాడు. ఇటీవల కన్ను మూసిన ప్రముఖ కోచ్ వాసు పరాంజపే (82 ఏళ్లు) మృతికి నివాళిగా కోహ్లి సేన నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బెయిర్స్టో (బి) వోక్స్ 11; రాహుల్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 17; పుజారా (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 4; కోహ్లి (సి) బెయిర్స్టో (బి) రాబిన్సన్ 50; జడేజా (సి) రూట్ (బి) వోక్స్ 10; రహానే (సి) అలీ (బి) ఒవర్టన్ 14; పంత్ (సి) అలీ (బి) వోక్స్ 9; శార్దుల్ (ఎల్బీ) (బి) వోక్స్ 57; ఉమేశ్ (సి) బెయిర్స్టో (బి) రాబిన్సన్ 10; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (61.3 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–39, 4–69, 5–105, 6–117, 7–127, 8–190, 9–190, 10–191. బౌలింగ్: అండర్సన్ 14–3–41–1, రాబిన్సన్ 17.3–9–38–3, వోక్స్ 15–6–55–4, ఒవర్టన్ 15–2–49–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ బ్యాటింగ్ 26; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ బ్యాటింగ్ 1; ఎక్స్ట్రాలు 0; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 53. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52. బౌలింగ్: ఉమేశ్ 6–1–15–1, బుమ్రా 6–2–15–2, శార్దుల్ 3–1–11–0, సిరాజ్ 2–0–12–0. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్, సంగక్కర, పాంటింగ్, జయవర్ధనే, కలిస్, ద్రవిడ్ మాత్రమే అతనికంటే ముందున్నారు. -
రెండో టెస్ట్కు ఆ ఇద్దరు స్టార్ పేసర్లు డౌటే..
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న రెండో టెస్ట్కు ముందు ఇరు జట్లకు షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ సందర్భంగా బ్రాడ్ గాయపడగా.. ప్రాక్టీస్ సెషన్లో శార్దూల్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ఇద్దరు పేసర్లు రెండో టెస్ట్ అడేది అనుమానమే. లార్డ్స్లో 150వ టెస్ట్ ఆడాల్సి ఉన్న బ్రాడ్.. జట్టుకు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్ జట్టుపై కూడా ప్రభావం చూపనుంది. సిరీస్ కీలక దశలో సీనియర్ బౌలర్ సేవలు కోల్పోవడం ఇంగ్లీష్ జట్టుకు మింగుడు పడని విషయమే. ఇప్పటికే ఆ జట్టు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. మరోవైపు టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సేవలు కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. తొలి టెస్ట్లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ పిచ్ కూడా పేసర్లకు అనుకూలించనుండటంతో రెండో టెస్ట్లో అతని స్థానం దాదాపు ఖరారైంది. ఇలాంటి తరుణంలో గాయం కారణంగా అతను దూరం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో శార్దూల్ దూరమైతే అతని స్థానంలో అశ్విన్ లేదా పేస్ బౌలర్లు ఇషాంత్, ఉమేష్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. కాగా, తొలి టెస్ట్లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు ఆట మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
'నీకు ఎంపిక చేయడం రాదు.. ఇలాంటివి మానేస్తే మంచిది'
లార్డ్స్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో వరుణుడు అడ్డు పడడంతో చేతిదాకా వచ్చిన విజయాన్ని టీమిండియా అందుకోలేకపోయింది. చేతిలో తొమ్మిది వికెట్లు.. చేయాల్సిన పరుగులు 157 కావడంతో టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే వర్షం రూపంలో చివరిరోజు ఆటకు పూర్తిగా అంతరాయం ఏర్పడడంతో డ్రాగా ముగిసింది. అయినప్పటికి టీమిండియా మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శనను నమోదు చేసింది. ముఖ్యంగా బౌలింగ్లో మంచి ప్రతిభ కనబరిచిన భారత్ ఆతిధ్య జట్టును తక్కువ స్కోర్లకే కట్టడి చేయడంలో సఫలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో ఆగస్టు 12 నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ రెండో టెస్టుకు టీమిండియా ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అతను ఎంపిక చేసిన 11 మందిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారిలను ఎంపిక చేశాడు. వాస్తవానికి తొలి టెస్టులో జడేజా, శార్దూలిద్దరు మంచి ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్లో జడేజా అర్థ సెంచరీతో భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో నాలుగు వికెట్లతో రాణించాడు. ఈ ఇద్దరికి మంజ్రేకర్ తన జట్టులో అవకాశం కల్పించకపోవడంతో ట్విటర వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. '' ఫాంలో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ఏంటి... నీకు ఎంపిక చేయడం రాదు.. ఇటువంటి మానేస్తే మంచిది.. కామెంటేరీ చేసుకో.. ఇలాంటివి నీకెందుకు.. ఆ పని టీమిండియా మేనేజ్మెంట్ చూసుకుంటుంది'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు. -
పరిస్థితులతో సంబంధం లేదు.. రెండో టెస్ట్కు అతన్ని తీసుకోవాల్సిందే..!
లండన్: ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్ట్కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి కచ్చితంగా తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రతిపాదించాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్లో రాణించినా.. ఇంగ్లండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో అతనికి తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ పై విధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే, పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తొలి టెస్ట్లో కోహ్లీ సేన నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగింది. దాంతో అశ్విన్ స్థానంలో నాలుగో పేసర్ కోటాలో శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ ఫార్ములా సెక్సెస్ కావడంతో సిరీస్లోని మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే ఫార్ములాను కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పడంతో లక్ష్మణ్ స్పందించాడు. అశ్విన్ జట్టులోకి వస్తే బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని, తానైతే పరిస్థితులతో సంబంధం లేకుండా అశ్విన్ను జట్టులోకి తీసుకునేవాడినని క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్ మేటి బౌలర్ అని, అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్గా నిలిచి ఇంగ్లండ్పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడని కొనియాడాడు. ఇక తొలి టెస్టులో బౌలింగ్లో రాణించిన శార్ధూల్పై కూడా లక్ష్మణ్ స్పందించాడు. శార్ధూల్ బ్యాట్తో రాణించకపోయినా బంతితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కితాబునిచ్చాడు. అశ్విన్, శార్దూల్ ఇద్దరూ సమర్థవంతులే అయినప్పటికీ.. తన ఓటు మాత్రం అశ్విన్కే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా గెలుపుకు వరుణుడు ఆటంకంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉండి, కేవలం 157 పరుగులు చేయాల్సిన సందర్భంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. -
నీకు గుర్తులేదా అంటూ ఫ్లాష్బ్యాక్లో వెళ్లిపోయాడు!
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ 48వ పుట్టినరోజు(ఏప్రిల్ 24) సందర్భంగా క్రికెట్ ప్రపంచమంతా అభినందనలతో హోరెత్తింది. ఐసీసీ, బీసీసీఐ, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఇలా ప్రతీ ఒక్కరూ సచిన్కు మెసేజ్లు పంపుతూ విషెస్ను తెలియజేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. సీఎస్కే అయితే తన ట్వీటర్ హ్యాండిల్లో ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి అభినందనలు తెలిపింది. అందులో సీఎస్కే పేస్ సంచలనం శార్దూల్ ఠాకూర్ మాట్లాడిన ఒక క్లిప్ను పొందుపరిచింది.ఆ వీడియోలో శార్దూల్ మాట్లాడుతూ.. సచిన్తో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు శార్దూల్. తాను ముంబై డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నప్పుడు ఒక గోల్డెన్ అడ్వైజ్ను సచిన్ నుంచి రిసీవ్ చేసుకున్నానన్నాడు. ‘ నాకు సచిన్ ఎప్పుడూ ఒకేటి చెబుతూ ఉండేవాడు. ప్రాక్టీస్ను వదలకుండా చేయడం, మరింత శ్రమించడం చేయాలని చెప్పాడు. ఒకేవేళ మ్యాచ్లు ఆడకపోయినా ప్రాక్టీస్ను వదలొద్దనే సలహా సచిన్ చెప్పారు.. అది తప్పకుండా లెంగ్త్, పేస్ మిస్సవకుండా ఉండటానికి ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఒకానొక సందర్భంలో సచిన్ను కలిశాడు. అది మేము రంజీ ట్రోఫీ గెలిచిన సమయంలో కానీ రంజీ ఫైనల్కు ముందో సచిన్తో కొన్ని విషయాలు చర్చించాను. అప్పుడు మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. అలా సచిన్ ఫ్లాష్బ్యాక్లో వెళ్లిపోయాడు. నీకు లైన్ అండ్ లెంగ్త్లతో పాటు స్కిల్సెట్స్ గురించి చెప్పా.. దాన్ని ఎప్పుడూ వదలకు అని మళ్లీ వివరించాడు సచిన్’ అని ఆ వీడియోలో శార్దూల్ తెలిపాడు. Master's guidance can never go wrong! Shardul recollects his Dhool memory of Sachin on the legends b'day!#HappyBirthdaySachin #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qNX9EH7IAQ — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 24, 2021 -
థ్యాంక్యూ మహీంద్రా జీ: శార్దూల్
ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఆనంద్ మహీంద్రా తనకు గిఫ్ట్గా పంపిన థార్ ఎస్యూవీ ముందు నిలబడి ఫోటోకు ఫోజిచ్చాడు. అనంతరం ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ''మహీంద్రా జీ.. మీరు పంపిన థార్ ఎస్యూవీ ఇప్పుడే వచ్చింది. మీరిచ్చిన గిఫ్ట్ కంటే మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. నాకు ఇష్టమైన ఎస్యూవీ కారును గిఫ్ట్గా పంపారు.. దీనిని నడపుతుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆసీస్ టూర్ తర్వాత లభిస్తున్న ప్రశంసల్లో మీది ప్రత్యేకంగా కనిపించింది. దేశానికి మేం చేస్తున్న సేవలకు గుర్తుగా మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.''అంటూ కామెంట్ చేశాడు. కాగా, నటరాజన్, శార్దూల్తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవదీప్ సైనీలు కూడా అందుకున్నారు. చదవండి: ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్.. కాగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, సుందర్ ద్వయం ఏడో వికెట్కు 123 పరుగులు జోడించడంతో టీమిండియా 336 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. శార్దూల్ 67, సుందర్ 62 పరుగులు చేశారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా ముందు 329 పరుగుల లక్ష్యం ఏర్పడింది. అయితే రెండో ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్ 91 పరుగులు.. రిషబ్ పంత్ 89 పరుగులు నాటౌట్తో విజృంభించడంతో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేయడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో సగర్వంగా ఎగురేసుకుపోయింది. చదవండి: ఆ వేలు ఎవరికి చూపించావు.. శార్దూల్ IPL 2021: కెప్టెన్గా ధోని.. రైనాకు దక్కని చోటు New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb — Shardul Thakur (@imShard) April 1, 2021 -
ఆ వేలు ఎవరికి చూపించావు.. శార్దూల్
పుణే: ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మూడు వన్డేలు కలిపి 7 వికెట్లతో టీమిండియా తరపున లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు. అంతేగాక మూడో వన్డేలో మొదట బ్యాటింగ్లో 21 బంతుల్లో 30 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్లో 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ 6 వికెట్లు తీసినా.. పొదుపు బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. మూడో వన్డేలో శార్దూల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఓవర్లో శార్దూల్ వేసిన బంతి అతనిపై ఫన్నీ మీమ్స్ వచ్చేలా చేశాయి. బంతిని వేసే క్రమంలో శార్దూల్ అన్ని వేళ్లు కిందకు దించి.. కేవలం మధ్య వేలు పైకి చూపుతూ బంతిని విసిరాడు. సాధారణంగా మధ్య వేలు చూపిస్తే చాలామందిలో డబుల్ మీనింగ్ డైలాగులు బయటికి వస్తుంటాయి. ఇప్పుడు శార్దూల్ను ట్రోల్ చేయడానికి అతని వేలు కారణమైంది. అతనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వచ్చాయి. ''శార్దూల్.. ఆ వేలు ఎవరికి చూపిస్తున్నాడు.. నకల్ బాంతి లాగా శార్దూల్ ఫకల్ బంతిని కనిపెట్టాడు.. శార్దూల్ ఆ వేలిని తనను అసహ్యించుకునేవాళ్లకు చూపిస్తున్నాడు.. ఏంటి శార్దూల్ ఈ పని.. ఒక బ్యాట్స్మన్కు ఆ వేలు ఎలా చూపించగలవు..'' అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఇక టీమిండియా వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: కోలుకోవడానికి కనీసం 5నెలలు పట్టొచ్చంటున్న డాక్టర్లు టీమిండియా బౌలర్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ప్రశంసలు Lord 'Shardul' Thakur To His Haters 🔥 pic.twitter.com/Evs3QtpZUK — G!®!$# (@viratkohliFab) March 28, 2021 How Shardul Thakur shows the middle finger to the batsman #INDvENG pic.twitter.com/tbT4RCQeYd — Shubh Aggarwal (@shubh_chintak) March 28, 2021 Lord thakur showing middle finger to malan buttler and Livingston #INDvsENG pic.twitter.com/UG66SBw2aN — Sarvan 🍁 (@_marvaaadi) March 28, 2021 -
ఆ సిక్స్ దెబ్బకు.. బ్యాట్నే చెక్ చేశాడు!
పుణే: ఇంగ్లండ్తో మూడో వన్డేలో రోహిత్ శర్మ(37), ధవన్(67), పంత్(78), హార్దిక్ పాండ్యా(64)ల ఆట ఒక ఎత్తైతే, శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ మరొక ఎత్తు. టీమిండియా కీలక వికెట్లు కోల్పోయి మూడొందల పరుగుల మార్కును దాటుతుందా అనుకునే సమయంలో శార్దూల్ ఒక సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా బంతులు వృథా చేయకుండా బ్యాట్కు పని చెప్పాడు. 21 బంతులు ఆడిన శార్దూల్ 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు సాధించాడు. ఫలితంగా టీమిండియా 330 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఇంకా పది బంతులు మిగిలి ఉండగా టీమిండియా ఆలౌట్ కావడంతో 329 పరుగులకే పరిమితమయ్యారు. వికెట్లు పడకుంటా ఉంటే మరికొన్ని విలువైన పరుగులు భారత్ ఖాతాలో చేరేవి. శార్దూల్ బ్యాట్ను చెక్ చేసిన స్టోక్స్ ఈ మ్యాచ్లో భారత్ 11 సిక్స్లు కొట్టగా అందులో పంత్, హార్దిక్లు తలో నాలుగు సిక్స్లు కొట్టారు. మిగతా మూడు శార్దూల్ బ్యాట్ నుంచి వచ్చినవే. కాగా, శార్దూల్ కొట్టిన ఒక సిక్స్ మాత్రం హైలైట్గా చెప్పవచ్చు. స్టోక్స వేసిన 45 ఓవర్ నాల్గో బంతికి శార్దూల్ సిక్స్ సాధించాడు. అవుట్ సైడ్ అఫ్ స్టంప్ వేసిన బంతిని శార్దూల్ ఫ్రంట్ ఫుట్కు వచ్చీ మరీ సిక్స్ కొట్టడం అభిమానుల్ని అలరించింది. లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టి శభాష్ అనిపించాడు శార్దూల్. దీనికి స్టోక్స్ సైతం ఆశ్చర్యపోయాడు. తాను బంతిని ఎలా వేస్తే ఏ రకంగా సిక్స్ కొట్టాడో అని స్టోక్స్ తలపట్టుకున్నాడు. అదే సమయంలో నాన్స్టైకింగ్ ఎండ్లోకి వచ్చిన శార్దూల్ ఆపి మరీ బ్యాట్ చెక్ చేశాడు. ఆ క్రాకింగ్ సిక్స్ ఎలా సాధ్యమైందని నవ్వుతూ ప్రశ్నించిన స్టోక్స్.. బ్యాట్ను పట్టుకుని చెక్ చేశాడు. 💥 SHARDUL THAKUR Hits a Cracking Six to Ben Stokes 💥#INDvsENG #INDVENG #HardikPandya #RishabhPant #Krunalpandya #ShardulThakur #BenStokes #IndiavsEngland #HappyHoli #Holi #India pic.twitter.com/FuzqWetZkf — 𝐴𝑦𝑢𝑠ℎ 𝐴𝑛𝑎𝑛𝑑 (@AyushAn99270824) March 28, 2021 -
నాలుగో టి20లో భారత్ గెలుపు
-
వైరల్: శార్దూల్పై కోహ్లి సీరియస్!
అహ్మదాబాద్: బ్యాటింగ్ వైఫల్యం.. పసలేని బౌలింగ్... పేలవమైన ఫీల్డింగ్.. వెరసి మూడో టీ20లో టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో లక్ష్యాన్ని కాపాడుకోలేక సిరీస్లో 2–1తో వెనుకబడింది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి మ్యాచ్లో కోహ్లి శార్దూల్ ఠాకూర్పై అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో, 12వ ఓవర్లో భాగంగా చహల్ బౌలింగ్లో జానీ బెయిర్స్టో బంతిని లెగ్ సైడ్ బాదగా, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ నెమ్మదిగా కదిలాడు. అంతేగాక బంతి దొరకగానే సరిగా త్రో చేయలేకపోయాడు. మిస్ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో కోహ్లి శార్దూల్ను చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అప్పటికే బెదురుగా చూస్తున్న శార్దూల్, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే, కోహ్లి మాత్రం ఇదేమీ బాగాలేదన్నట్లుగా కోపంగా చూశాడు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు(కోహ్లి, చహల్)క్యాచ్లు వదిలేసినా పర్లేదు కానీ, శార్దూల్ సరిగా త్రో చేయనందుకు ఇంతలా కోప్పడ్డతారా’’ అని విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 76 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్ను కోహ్లి, 20 పరుగుల వద్ద బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను చహల్ వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే మ్యాచ్ దాదాపుగా భారత్ చేజారడంతో వాటిని అందుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోయేది! చదవండి: వుడ్ బౌలింగ్తో... బట్లర్ బ్యాటింగ్తో... పంత్ తొందరపడ్డావు.. రెండు రన్స్తో ఆగిపోవాల్సింది Kohli calling Shardul Thakur ‘ BEN STOKES’ 🙆🏼♂️😧 pic.twitter.com/cJm0fABTW6 — ribas (@ribas30704098) March 17, 2021 Shardul Thakur gave an extra run and bully @imVkohli swears...but khud ne catch choda...woh chalega — Paddy (@paddylives) March 16, 2021 Virat Kohli gets angry and abuses Shardul Thakur. This was the moment that the audience would forget the grief of England's batting 😂.#INDvENG — APM Memes (@ApmMemes) March 16, 2021 -
రెండో టీ20: భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు!
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్తో జరుగబోయే రెండో మ్యాచ్లో రోహిత్ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్లో అంతగా ప్రభావం చూపని లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ల స్థానాల్లో లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్, మీడియం పేస్ బౌలర్ దీపక్ చాహర్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్ షాట్కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి? కాగా, ఫామ్లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ రీ ఎంట్రీ, రాహుల్, దీపక్ చాహర్లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్, రాహుల్ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్ను కనబర్చిన రాహుల్ చాహర్ను, తొలి మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్ స్థానంలో పేసర్ దీపక్ చాహర్కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ -
శార్దూల్ మెరుపులు.. సెంచరీ మిస్!
జైపూర్: విజయ్ హజరా ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ రెచ్చిపోయి ఆడాడు. హిమచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో శార్దూల్ బ్యాటింగ్లో విజృంభించాడు. శ్రేయస్ అయ్యర్(2), పృథ్వీ షా(2)లు విఫలమైనప్పటికీ శార్దూల్ మాత్రం బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దూల్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి పోయిన శార్దూల్.. ఈ వన్డే మ్యాచ్లో శార్దూల్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 92 పరుగులు సాధించాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కాగా, సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో శార్దూల్ పెవిలియన్ చేరాడు. ఫలితంగా లిస్గ్-ఎ క్రికెట్లో తొలి సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇది శార్దూల్కు లిస్ట్-ఎ క్రికెట్లో తొలి హాఫ్ సెంచరీగా నమోదైంది, శార్దూల్ మెరుపులతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్(91; 75 బంతుల్లో 15 ఫోర్లు), ఆదిత్యా తారే(83; 98 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో ముంబై మూడొందలకు పైగా స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ 24.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్ ప్రదేశ్ జట్టులో మయాంక్ దాగర్(38 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు.ముంబై బౌలర్లలో స్పిన్నర్ ప్రశాంత్ సోలంకీ నాలుగు వికెట్లతో రాణించి హిమాచల్ ప్రదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. ములాని మూడు వికెట్లు సాధించగా, ధావల్ కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. ఇక్కడ చదవండి: పిచ్ ఎలా ఉంటదో: టెన్షన్ అవసరం లేదు రోహిత్!