gv Prakash Kumar
-
భార్యకు విడాకులిచ్చి హీరోయిన్తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో
సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ (G. V. Prakash Kumar)- సింగర్ సైంధవి (Saindhavi)ల విడాకులను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరంభం నుంచి ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడ్డ ఈ దంపతులను ఇకపై జంటగా చూడలేమన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదే సమయంలో జీవీ ప్రకాశ్.. హీరోయిన్ దివ్య భారతి (Divya Bharathi)తో ప్రేమలో పడ్డాడన్న ప్రచారం జరుగుతోంది.హీరోయిన్తో లవ్ రూమర్స్..ఈ పుకార్లపై జీవీ ప్రకాశ్ పెదవి విప్పాడు. అతడు మాట్లాడుతూ.. మేము బ్యాచిలర్ సినిమా కోసం కలిసి పని చేశాం. అంతమాత్రానికే మేమిద్దరం డేటింగ్లో ఉన్నామని జనాలు ఏవేవో ఊహించుకుంటున్నారు. అది నిజం కాదు. ఒకరితో మరొకరికి ఏ సంబంధమూ లేదు. కేవలం సాధారణ స్నేహితులం మాత్రమే. సినిమా షూటింగ్ అయ్యాక ఒక్కసారి కూడా కలుసుకోలేదు. మళ్లీ ఇలా ప్రమోషన్స్లో మాత్రమే కలుసుకున్నాం అని చెప్పాడు. దివ్య భారతి మాట్లాడుతూ.. జీవీ ప్రకాశ్ భార్యకు విడాకులివ్వడానికి నేనే కారణమని చాలామంది మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో నన్ను టార్గెట్ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తనతో నాకెలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది.వైవాహిక జీవితానికి ముగింపుజీవీ ప్రకాశ్- సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో దాంప్యత బంధంలోకి అడుగుపెట్టిన వీరు 2020లో కూతురికి జన్మనిచ్చారు. పదకొండేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సినిమాల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్, దివ్య భారతి 'కింగ్స్టన్' మూవీ కోసం మరోసారి జతకట్టారు. బ్యాచిలర్ సక్సెస్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఈ మూవీ మార్చి 7న విడుదల కానుంది.చదవండి: ఒంటరి జీవితం చాలా కష్టం.. సమంత పోస్ట్ వైరల్ -
విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్
తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్కు గురి చేసింది. విడాకులు తీసుకున్నజంట11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, హీరోగా..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా, హీరోగానూ ఫామ్లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024 உங்களுக்கு என்ன நா Rights இருக்கு 🥲🥲😭 எங்க அழ வைக்க @gvprakash #GVPrakash #GVPrakash @singersaindhavi #Saindhavi pic.twitter.com/RCXgse4wFO— 𝕽𝖔𝖇𝖎𝖓 𝕮𝖍𝖗𝖎𝖘 😈🛡️🗡️ (@robinthebadguy) December 8, 2024Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024 Thanks #Malaysia kuala lampur for making my live in concert a BLOCKBUSTER hit …. @dmycreationoffl pic.twitter.com/SUigJNaVwK— G.V.Prakash Kumar (@gvprakash) December 8, 2024 చదవండి: టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా.. -
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024 -
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
ఆ అంశాలు ఆకట్టుకుంటాయి: జీవీ ప్రకాష్ కుమార్
‘‘మట్కా’ సినిమా నేను చూశాను. చక్కని యాక్షన్ ఫిల్మ్. అద్భుతమైన కథ, నటన, డైరెక్షన్.. ఈ అంశాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్ తేజ్గారు ఈ సినిమా కోసం తన కెరీర్లోనే బెస్ట్గా నటించారు. ఈ చిత్రం కచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిం చిన చిత్రం ‘మట్కా’.కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను. కరుణ కుమార్గారు అద్భుతమైన డైరెక్టర్. ‘మట్కా’ పీరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా అదే తరహాలో తీసుకురావడం నాకు పెద్ద సవాల్గా అనిపించింది.ఈ మూవీలో రెట్రో జోన్లో చేసిన ‘లేలే రాజా..’ పాట నాకు చాలా ఇష్టం. నిర్మాతలు పెద్ద బడ్జెట్తో ఈ సినిమా తీశారు. నెలలో 12 రోజులు నటన కోసం కేటాయిస్తాను. మిగతా రోజులన్నీ సంగీతం కోసం కేటాయిస్తాను. తెలుగులో ‘దసరా’ సినిమాలో ఒక పాత్ర చేయాల్సింది. కానీ, నా డేట్స్ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే తెలుగులో నటిస్తాను. వ్యక్తిగతంగా ప్రేమకథలకు సంగీతం ఇవ్వడం నాకు ఇష్టం’’ అన్నారు. -
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది: జీవీ ప్రకాశ్కుమార్
‘‘టెక్నాలజీని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి కొందరు ప్రముఖ సంగీత దర్శకులు చేసిన సంగీతం, పాటలు శ్రోతలను ఎందుకు మెప్పించలేకపోయాయి? అనే విషయాలపై నేను మాట్లాడను. కానీ సినిమా స్క్రిప్ట్, అందులో నుంచి వచ్చే సందర్భాలపైనే సంగీత దర్శకులు ఇచ్చే సంగీతం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు జీవీ ప్రకాశ్కుమార్. విక్రమ్ హీరోగా నటించిన తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జీవీ ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ కథ ప్రధానంగా ట్రైబల్స్ నేపథ్యంలో ఉంటుంది. దాంతో ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ ట్రైబ్స్కు చెందిన సంగీతాన్ని కూడా పరిశీలించాను.సినిమా సంగీతానికి, ట్రైబల్స్ సంగీతానికి మధ్యలో నేను ఓ వారధిగా ఉంటూ ఈ సినిమా మ్యూజిక్ను ప్రేక్షకులకు చేరువ చేయడం సవాల్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. విక్రమ్గారితో ఇది నా మూడో సినిమా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్, ఆకాశం నీ హద్దురా!’ లాంటి మ్యాజిక్ ‘తంగలాన్’తో రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు. -
విడాకుల తర్వాత మళ్లీ అలా కలిసిన జీవీ ప్రకాశ్, సైంధవి
కోలీవుడ్ యంగ్ హీరో వేమల్ నటించిన SIR సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమల్తో పాటు ఛాయా దేవి కన్నన్, శరవణన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంఘిక డ్రామాగా ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎస్ పిక్చర్స్ పతాకంపై సిరాజ్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు.ఎస్ఐఆర్ (SIR) చిత్రం నుంచి తాజాగా విడుదలైన సాంగ్ కోలీవుడ్లో భారీగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం జీవీ ప్రకాశ్, ఆయన మాజీ సతీమణి సైంధవి అని చెప్పవచ్చు. వీరిద్దరు కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వారిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. కానీ, వాటిని సున్నితంగానే ఇద్దరూ తప్పుపట్టారు. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి కలిసి ఎస్ఐఆర్ (SIR) సినిమా కోసం ఒక పాటకోసం తమ గొంతు కలిపారు. వారిద్దరూ కలిసి పాడిన ఆ సాంగ్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.ఈ ఏడాది మే నెలలో సైంధవి, జీవీ ప్రకాశ్ విడిపోతున్నట్లు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆ సమయంలో ప్రకాశ్ ఇలా చెప్పాడు 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఇద్దరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. -
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
ఇటీవలే కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్, అతని భార్య, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" అని జీవీ ప్రకాశ్ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్ను తన ఇన్స్టాలో రాసుకొచ్చారు.జీవీ ప్రకాశ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్ బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) -
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అతడు ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్వన్. దీన్ని తెలుగులో చోరుడు పేరిట రిలీజ్ చేయాలని భావించారు. ఈ మేరకు గతేడాది ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదిలారు. ఇవానా, భారతీరాజా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశే సంగీతం అందించాడు. ఓటీటీ రిలీజ్ డేట్ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 14 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నట్లు హాట్స్టార్ ప్రకటించింది. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారికోసం సింప్లీ సౌత్, టెన్కోట్టా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ ఈ మూవీ మే 10 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీజర్ కూడా వదిలారు. కల్వన్ సినిమా విషయానికి వస్తే పీవీ శంకర్ దర్శకరచయితగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్గానూ పని చేశాడు. ఢిల్లీ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సాన్ లోకేశ్ ఎడిటర్గా వ్యవహరించాడు.Tamil film #Kalvan @disneyplusHSTam / @Tentkotta / @SimplySouthApp 🎬💥 pic.twitter.com/PbSz2PXu9E— Tamilmemes3.0 (@tamilmemes30) May 7, 2024 -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న గురక సినిమా
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొన్నే రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా రెండు వారాలు తిరగకుండానే అందుబాటులోకి రానుంది. ఇదే ఇక్కడ షాకింగ్గా అనిపిస్తుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చూసిన ప్రేక్షకులు.. ఇంత మాత్రం దానికి థియేటర్లలో రిలీజ్ ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇదే మూవీ? ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.తమిళంలో గతేడాది రిలీజైన సినిమా 'గుడ్ నైట్'. గురక వల్ల కొత్తగా పెళ్లయిన జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఎంటర్టైనింగ్గా చూపించారు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో హిట్ అయింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తో తీసిన మరో తమిళ సినిమా 'డియర్'.ఏప్రిల్ 11న 'డియర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపుగా 'గుడ్ నైట్' కథతోనే తీశారు. దానికి తోడు కనీసం ఎంటర్టైన్ చేసే సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీంతో సినిమా ఫట్ అయింది. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి మాయమైంది. మరోవైపు ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అని ప్రకటించేశారు. దీంతో మరీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురావడం ఏంట్రా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.'డియర్' కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్ అవ్వాలనుకునే అర్జున్ (జీవీ ప్రకాశ్).. చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేదే కథ. -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. గుడ్నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అర్జున్కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
భార్య గురక పెడితే... ఫన్నీగా సినిమా ట్రైలర్
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. గుడ్నైట్ సినిమాలో భర్తకు గురక ఉంటే ఇక్కడ భార్యకు గురక ఉంది. ఈమె గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం సరికొత్తగా అనిపిస్తుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. -
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో జతకట్టిన టాలీవుడ్ హీరో కూతురు!
తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్న దర్శకుడు పా.రంజిత్. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్ప థం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే నీలం ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. ఇంతకుముందు దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ పుల్ దర్శకులను పరిచయం చేశారు. తాజాగా తన మరో శిష్యుడు అకిరన్ మోసెస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్నారంటే ఆ చిత్రానికి కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తంగలాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. A start to a new chapter✨ The shoot for our next production begins today with bright smiles and fond memories🎆 Written and directed by @AkiranMoses Produced by @beemji #NeelamProductions Starring @gvprakash @Rshivani1@sreenathbhasi @PasupathyMasi @LingeshActor @EditorSelva… pic.twitter.com/P5KrELtXGX — Neelam Productions (@officialneelam) February 29, 2024 -
కోట్లు ఇస్తామన్నా రిజెక్ట్ చేశా.. హీరో
చల్లని పానీయాల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానన్నా తాను అంగీకరించడం లేదని నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు జీవీ ప్రకాష్కుమార్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్ బృందం స్టార్డా అనే సరికొత్త ప్లాట్ఫామ్ ప్రారంభించింది. దీనికి జీవీ ప్రకాష్కుమార్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలోనే చిత్ర రంగ ప్రవేశం చేశానన్నారు. హీరోగా 23 సినిమాలు చేశా పలు చిత్రాలకు సంగీతాన్ని అందించానని, అదే విధంగా కథానాయకుడిగా 23 చిత్రాలు చేశానన్నారు. వెట్రిమారన్, ఏఎల్ విజయ్, అట్లీ వంటి పలువురు దర్శకులతో తొలి రోజుల్లో తాను పనిచేసినట్లు చెప్పారు. పనిచేసిన దర్శకుల్లో 17 మంది కొత్త వారేనన్నారు. ఇక్కడ ప్రతిభకు కొరత లేదని, అయితే దానిని ప్రదర్శించడానికి సరైన మార్గం చాలా మందికి తెలియడం లేదన్నారు. ఇలాంటి వారికి ఈ స్టార్డా మంచి ప్లాట్ఫామ్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూదం, కూల్ డ్రింక్స్.. నో! ఈ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన నరేష్ బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. శీతల పానీయాలు, జూదం ఆడటం వంటి సంస్థల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానంటున్నారని, అయినా తాను వాటిలో నటించడానికి అంగీకరించడం లేదన్నారు. ఈ స్టార్డా ప్లాట్ఫామ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం సంతోషంగా ఉందని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: వాలంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ -
హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్ఫుల్ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్కుమార్. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్ ఆర్ఎస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్కుమార్ విద్యార్థిగా చాలా పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్కుమార్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్, వెంకటేశ్. వీపీ, ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
డూడుం డుక్కుడుం బాగుంది
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్. -
కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్.. గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్ చిత్రంలో విలన్గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్కుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్కశ్యప్ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్కుమార్ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్, కల్వన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్, సియాన్ విక్రమ్ 62వ చిత్రం, శివకార్తికేయన్ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార -
మ్యూజిక్ డైరెక్టర్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్!
సంగీతం,నటనతో సక్సెస్ఫుల్గా రాణిస్తున్న జీవీ ప్రకాష్కుమార్ హీరోగా ప్రస్తుతం 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కింగ్స్టర్ అనే టైటిల్ను మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్కుమార్కు చెందిన పార్లర్ యూనివర్శల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి కథ, దర్శకత్వం కమల్ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో జీవీకి జోడీగా నటి దివ్యభారతి నటిస్తున్నారు. ఇంతకుముందు ఈ జంట నటించిన బ్యాచిలర్ మంచి విజయాన్ని సాధించింది. కింగ్స్టర్ చిత్రం షూటింగ్ను నవంబర్ 10వ తేదీ నటుడు కమలహాసన్ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో జీవీ ప్రకాష్కుమార్ మత్స్యకారుడిగా నటించడం మరో విశేషం. సముద్రంలోని రహస్యాలను కనుగొనే యువకుడిగా ఈయన నటిస్తున్నారు. ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతోంది. కథానాయకుడి గెటప్ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంది. దీంతో ఆయన అభిమానులు చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్స్టర్ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
Rebel Teaser Out: హీరోగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మూవీ.. టీజర్లో యాక్షన్ మాత్రం
ఆ మ్యూజిక్ డైరెక్టర్.. సంగీతం కంపోజ్ చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు హీరోగానూ డిఫరెంట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. అలా ఓ వైపు స్టార్ హీరోల మూవీస్ కి పనిచేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. ఇప్పుడు 'రెబల్' అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన జీవీ.. 'రెబల్'తో యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) స్టూడియో గ్రీన్ పతాకంపై కే.జి.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూనే సంగీతం కూడా అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో సూర్య.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్.. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. టీజర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట ఓ ఫైట్ సీన్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాపై టీజర్ దెబ్బకు అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
‘రెబల్’గా వస్తోన్న జీవీ ప్రకాష్
సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా యమా బిజీగా ఉన్నాడు నటుడు జీవీ ప్రకాష్ కుమార్. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్, విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్, టాలీవుడ్ నటుడు రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా తాజాగా కథానాయకుడిగా కనిపించిన అడియే చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందింది. తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రెబెల్. కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నికేష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ జీవీ ప్రకాష్ కుమార్ మంగళవారం తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో ఇది గేమ్ చేంజ్ కథా చిత్రంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నవ దర్శకుడు ఎంతో నమ్మకంగా రెబల్ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం పేరు వింటేనే ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని పిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథాచిత్రాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. It’s a wrap for #rebel . Will be a game changer in tamil cinema . One promising director is on his way … thanks @kegvraja sir @NikeshRs @Arunkrishna_21 @NehaGnanavel @Dhananjayang @StudioGreen2 pic.twitter.com/A53pTsnRzs — G.V.Prakash Kumar (@gvprakash) October 2, 2023 -
10 ఏళ్ల తర్వాత అలా చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
దక్షిణాది సినిమాల్లో జీవీ ప్రకాశ్ కుమార్కు ఒక బ్రాండ్ ఉంది. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. 'డార్లింగ్' మూవీతో హీరోగా మారాడు. అది హిట్ కావడంతో నటుడిగానూ సక్సెస్ అయ్యాడు. అలా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ గా సత్తా చాటుతున్న జీవీ ప్రకాశ్ కుమార్.. 2013లో నిర్మాతగా ఓ సినిమా తీశాడు. (ఇదీ చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్కు గవర్నర్ పదవి?) ఖదీర్-ఓవియా జంటగా విక్రమ్ సుకుమారన్ దర్శకత్వంలో 'మదయానై కూట్టం' అనే సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మించాడు. కోటి రూపాయల బడ్జెట్ పెడితే.. రూ.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయినా మరో సినిమాని నిర్మించలేదు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త మూవీ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. హీరోగానూ నటిస్తున్నాడు. దీనికి 'కింగ్స్టన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది జీవికి నటుడుగా 25వ చిత్రం. కమల్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకుడు.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: నామినేషన్స్లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే?) -
హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అలాంటి కాన్సెప్ట్!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్'. నట్ మెగ్ ప్రొడక్షన్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆయిరమ్' ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 'డియర్' షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డియర్' స్టోరీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల తేదీని వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కొత్త సినిమా
సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళంలో డార్లింగ్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ కుమార్ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్ కుమార్ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: జైలర్కు తెలుగు సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు? -
శివ కార్తికేయన్, సాయి పల్లవి కొత్త సినిమా వేడుక (ఫొటోలు)
-
యంగ్ హీరోతో జతకడుతున్న ఐశ్వర్య రాజేశ్
సంగీత దర్శకుడిగా, నటుడి రాణిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈయన హీరోయిజానికే కాకుండా కంటెంట్కు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడిగా తమిళంతోపాటు తెలుగులోనూ దూసుకుపోతున్నారు. త్వరలో అతడు నటి ఐశ్వర్య రాజేష్తో సినిమా చేయనున్నట్లు సమాచారం. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన ఐశ్వర్య రాజేశ్ తానేమిటో నిరూపించుకుని కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు. కాగా శుక్రవారం చెన్నైలో జరిగిన ఫ్రూబే షాపు ప్రారంభోత్సవ వేడుకలో జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కాంబినేషన్లో సినిమా రానున్నట్లు ధ్రువీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చదవండి: ఆ విషయంలో నయనతార కంటే హన్సిక ముందంజ సుశాంత్ బర్త్డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్, వీడియో వైరల్ -
జీవీ ప్రకాశ్తో తేజు అశ్విని రొమాన్స్
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడిగా జోడి గుర్రాలను స్వారీ చేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ ఆ మధ్య కథానాయకుడిగా నటించిన బ్యాచిలర్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. దీనికి ఎం.మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అరుళ్ నిధి హీరోగా ఇరవుక్కు అయిదు కన్గళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా కన్నై నంబాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో దర్శకుడు ఎం.మదన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడు. దీనికి బ్లాక్ మెయిల్ అనే టైటిల్ను నిర్ణయించారు. జయక్కొడి పిక్చర్స్ పతాకంపై అమల్రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో జీవీ ప్రకాష్కుమార్కు జంటగా నటి ప్రజ్ఞ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి తేజు అశ్విని ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఆదిలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించిన ఈ చెన్నై చిన్నది 2020లో ఎన్నై సొల్లపోగిరాయ్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సంతానం సరసన ప్యారీస్ జయరాజ్ చిత్రంలో నటించింది. తాజాగా జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. బ్లాక్ మెయిల్ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. -
తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా?
‘‘నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్ సినిమా. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్తో పాటు ఫ్యామిలీ వాల్యూస్ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్ అవుతారు’’ అని హీరో అరుణ్ విజయ్ అన్నారు. హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. వేదిక కారన్పట్టి, ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది. జగన్మోహిని సమర్పణలో సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు.‘‘ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలని వినోదాత్మకంగా చూపిస్తూ, మంచి సందేశం ఇచ్చాం’’ అన్నారు హరి. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారు’’ అన్నారు సీహెచ్ సతీష్ కుమార్. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్ -
హీరోగా మ్యూజిక్ డైరెక్టర్.. మరో హర్రర్ చిత్రం '13'
చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ 'డార్లింగ్' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్. నందగోపాల్ సమర్పణలో మద్రాస్ స్టూడియోస్, అన్షు ప్రభాకర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్ ఫోన్ చేసి మంచి హారర్ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్ నేపథ్యంలో డార్లింగ్ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చదవండి:👇 రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_71236443.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Siddharth: ‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ రివ్యూ
టైటిల్ : ఒరేయ్ బామ్మర్ది నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ ఫిలిమ్స్ నిర్మాతలు : రమేష్ పి పిళ్లై తెలుగు రిలీజ్ : శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ - ఏ.ఎన్ బాలాజీ దర్శకత్వం: శశి సంగీతం : సిద్ధూ కుమార్ సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్ ఎడిటింగ్: సాన్ లోకేష్ విడుదల తేది : ఆగస్ట్ 13,2021 ‘బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్, టీజర్,ట్రైలర్కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ని క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఆగస్ట్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా సిద్దార్థ్ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? ‘ఒరేయ్ బామ్మర్ది’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ రాజ శేఖర్ అలియాస్ రాజ్(సిద్దార్థ్) ఓ సిన్సియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ ట్రాఫిక్ పోలీసు అవుతాడు. అతను రాజేశ్వరి అలియాస్ రాజీ (లిజోమోల్ జోస్)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఈ పెళ్లి రాజీ తమ్ముడు, బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన మదన్(జీవీ ప్రకాశ్ జీవీ)కి ఇష్టం ఉండదు. గతంలో రాజ్కి, మదన్కి మధ్య జరిగిన ఓ గొడవనే దీనికి కారణం. అయితే రాజ్ మాత్రం రాజీని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఏలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి రాజీని రాజ్ పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఇంతకి మదన్కి రాజ్పైన ఎందుకు కోపం? వారి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? తను అంటేనే కోపంగా చూసే మదన్తో రాజ్ ఏవిధంగా ‘బావ’అని పిలిపించుకున్నాడు? అనేదే మిగతా కథ నటీ నటులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో సిద్దార్ధ్ ఒదిగిపోయాడు. మంచి భర్తగా, బావమరిదిని దారికి తీసుకొచ్చే బావగా చక్కగా నటించాడు. బైక్ రేసులంటూ తిరిగే యువకుడు మదన్ పాత్రలో జీవీ ప్రకాశ్ పరకాయ ప్రవేశం చేశాడు. తనదైన ఎమోషనల్ యాక్టింగ్తో దరగొట్టేశాడు. హీరోయిన్లు కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్తో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. బిచ్చగాడులో తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తే.. ఒరేయ్ బామ్మర్దిలో బావ, బామ్మర్ది మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఢిపరెంట్ స్టోరీ లైన్ తీసుకున్నప్పటీ.. సినిమాలో బలమైన సీన్స్ రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభంలోనే అన్ని పాత్రలను పరిచయం చేసి, కథ ఎలా ఉండబోతుందో ముందే చెప్పేశాడు. ఫస్టాఫ్లో అక్కా,తమ్ముడి మధ్యల వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నప్పటీకీ.. ఒక్క సంఘటనతో తల్లిలా ప్రేమించే అక్కతో విడిపోవడానికి సిద్దపడే తమ్ముడి పాత్రలో సీరియస్ నెస్ లేదనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా అతికించినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్గా ఉంటుంది. కథలో ఎలాంటి ట్విస్ట్లు లేకుండా చివరి వరకు ఒకే ఎమోషన్తో నడిపించడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు మామలుగా ఉన్నప్పటీకీ.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ సాన్ లోకేష్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫ్లస్ పాయింట్స్ సిద్దార్థ్, జీవీ ప్రకాశ్ నటన సంగీతం లవ్ ట్రాక్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ వర్కౌట్ కానీ ఎమోషనల్ డ్రామా సెకండాఫ్లో కొన్ని సాగదీత సీన్స్ స్క్రీన్ప్లే సింపుల్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
రజనీకాంత్పై విమర్శలు: జీవీ ప్రకాష్ చిత్రానికి సెన్సార్ వేటు
నటుడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రజనీ రాజకీయరంగ ప్రవేశంపై విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు ఆ చిత్రంపై వేటువేసింది. సంబంధించిన వివరాల్లోకి వెళితే జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం అడంగాదే. ఈ చిత్రానికి షణ్ముఖం ముత్తుస్వామి దర్శకత్వం వహించారు. చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రాన్ని ఇటీవల సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. చిత్రంలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి పలు విమర్శలు చోటుచేసుకోవడంతో ఆయన తరఫున ఈ చిత్రంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డు అడంగాదే చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. చిత్ర వర్గాలు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై విమర్శలకు సంబంధించిన 100 సన్నివేశాలతో కూడిన పది నిమిషాలు నిడివిని కట్ చేసి చివరికి చిత్రానికి సర్టిఫికెట్ అందించారు. చదవండి: ఈసారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు: దర్శకుడు రాజ్ మెహతా -
'ఒరేయ్ బామ్మర్ది' టీజర్ వచ్చేసింది..
ఒకానొక సమయంలో యూత్ ఆడియన్స్ను ఆకర్షించి తనకంటూ అభిమానులను సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హీరో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత హిందీ, తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడమే మర్చిపోయాడు. ఆయన చివరిగా 'గృహం' అనే తెలుగు సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన 'మహా సముద్రం'తో పాటు, 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రాలు చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఒరేయ్ బామ్మర్ది టీజర్ రిలీజైంది. 'రోడ్డే నా ఆఫీస్, మాడ్చే ఎండే నా ఏసీ..' అన్న డైలాగ్తో తనో ట్రాఫిక్ పోలీస్ అని చెప్పకనే చెప్తున్నాడీ హీరో. ట్రాఫిక్లో, అదీ గ్యాపులో బండి నడిపేవాడే తోపు అని చెప్తున్నాడు మరో హీరో జీవీ ప్రకాశ్ కుమార్. 'దేశం గురించి తెలుసుకోవాలంటే ఇంటింటికీ వెళ్లనవసరం లేదు, రోడ్లు చెప్పేస్తాయ్ ఆ దేశం గురించి..' అంటూ సిద్దార్థ్ చెప్పే డైలాగులు బాగున్నాయి. 'బిచ్చగాడు' ఫేమ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్పై రమేశ్ పిల్లై నిర్మిస్తున్నారు. చదవండి: రష్మిక సినిమా: గాయపడ్డ హీరో -
తండ్రైన ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జీవీ
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గాయని సైంధవి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నారు. పలు హిట్ మూవీలకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్.. నటుడిగా కూడా మెప్పించారు. తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రం.. తమిళ రీమేక్ ‘డార్లింగ్’తో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓ వైపు మ్యూజిగ్ డైరక్టర్ కొనసాగుతూనే.. నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చదవండి : జీవీ సోదరి బిజీబిజీ -
సూర్య రెండో లుక్.. పక్షి ఎందుకుంది?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ హీరోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన హీరోగా తమిళంలో తెరకెక్కే ప్రతీ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తుంటారు. అయితే గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపంచేలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఓ విలక్షణమైన కథతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు హీరో సూర్య. తెలుగులో విక్టరీ వెంకటేష్కు ‘గురు’ తో మంచి విజయాన్ని అందించిన దర్శకురాలు సుధ కొంగర డైరెక్షన్లో సూర్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సురరై పోట్రుగా తమిళంలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’అనే టైటిల్తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా న్యూఇయర్ కానుకగా సూర్య ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ చిత్రంలో సూర్యకు సంబంధించిన రెండో లుక్ను మూవీ యూనిట్ కాసేపటి క్రితమే విడదల చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, మాసిన గడ్డంతో గంభీరంగా ఉన్న సూర్యతో పాటు ఓ పక్షి కూడా పోస్టర్లో కనిపిస్తుంది. దీంతో సినిమా కథపై నెటిజన్లు ఏవేవో ఊహించుకుంటున్నారు. ఇక ఈ లుక్లో పక్షి ఎందుకు ఉందనే దానిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో సూర్య ఖాతాలో భారీ విజయం పడటం ఖాయమని పలువురు నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జాకీష్రాఫ్, కరుణాస్లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. Wishing you all a year full of great moments! Here's #SooraraiPottruSecondLook#AakaasamNeeHaddhuRa#SudhaKongara @gvprakash @nikethbommi @Aparnabala2 @gopiprasannaa @2D_ENTPVTLTD @rajsekarpandian @SakthiFilmFctry @guneetm @sikhyaent pic.twitter.com/JXbW2oUSPz — Suriya Sivakumar (@Suriya_offl) January 1, 2020 -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన జీవీ సోదరి
తమిళసినిమా: 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్. ఈయన సంగీతదర్శకుడిగా బిజీగా ఉంటూనే కథానాయకుడిగానూ రంగప్రవేశం చేసి ఆ శాఖలోనూ సక్సెస్ఫుల్ నటుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న జీవీ.ప్రకాశ్కుమార్ది సినీ వారసత్వం అన్నది తెలిసిందే. ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ మేనల్లుడు అంతేకాదు జీవీ భార్య సైంధవి యువ గాయకురాలన్నది తెలిసిందే. ఈయనకు సోదరి కూడా ఇప్పుడు నటిగా రంగప్రవేశం చేసి వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు. జీవీ సోదరి భవానీశ్రీ. ఈమె ఇప్పటికే క పే.రణసింగం అనే చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. విజయ్సేతుపతి, ఐశ్వర్యరాజేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భవానీశ్రీ రెండవ హీరోయిన్గా నటిస్తున్నారు. నవ దర్శకుడు విరుమాండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తొలి చిత్రం తెరపైకి రాకముందే భవానీశ్రీ మరో రెండు సూపర్ అవకాశాలు తలుపుతట్టాయన్నది తాజా న్యూస్. ఈ చిన్నదానికి ధనుష్కు జంటగా నటించే అవకాశంతో పాటు మహిళా దర్శకురాలు సుధ కొంగర చిత్రంలోనూ నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తాజా సమాచారం. ధనుష్ త్వరలో పరియేరుం పెరుమాళ్ చిత్రం ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కర్ణన్ అనే టైటిల్ను నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. ఇందులో నటి భవానీశ్రీ ఒక ముఖ్యపాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సుధ కొంగర దర్శకత్వంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్య హీరోగా సూరరై పోట్రు చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సుధ కొంగర చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద జీవీ.ప్రకాశ్కుమార్ కుటుంబం నుంచి హీరోయిన్ తయారైందన్నమాట. చూద్దాం భవానీశ్రీ నటిగా ఏ స్థాయికి చేరుకుంటారో! -
జీవీ హాలీవుడ్ ఎంట్రీ షురూ
యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ హాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. కోలీవుడ్లో వెయిల్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయమయ్యి అతి పిన్న వయసు సంగీత దర్శకుడిగా పేరొందారు జీవీ. ఇక డార్లింగ్ చిత్రంతో హీరోగా తెరపైకి వచ్చారు. ఈ తర్వాత సంగీతం, నటన అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సక్సెస్పుల్గా కొనసాగిస్తున్నారు. తాజాగా నటుడిగా కోలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ట్రాప్ సిటీ’అనే హాలీవుడ్ చిత్రంలో జీవీ ప్రకాశ్కుమార్ నటించనున్నారు. దీనికి బాలీవుడ్ దర్శకుడు నిక్కీ బ్రూచ్చల్ దర్శకత్వం విహించనున్నారు. దీన్ని కైబా అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థపై టెల్ గణేశన్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు నెపోలియన్ ప్రధాన పాత్రలో నటించిన వెవిల్స్ నైట్, క్రిస్మస్ కూపన్ వంటి హాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. కాగా జీవీ నటించనున్న చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాండన్ టీ.జాక్సన్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. జీవీ.ప్రకాశ్కుమార్ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నా రు. ఆయన నటించిన 100% కాదల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా ఐన్గరన్, అడంగాదే, జెయిల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం బ్యాచ్చిలర్, ఆయిరం జన్మంగళ్,కాదలిక్క యారుమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడిగానూ ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న అసురన్, సూర్య దర్శకురాలు సుధ కొంగరల కాంభినేషన్లో రూపొందుతున్న సూరరై పోట్రు చిత్రాలకు పని చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లిన ధనుష్ వంటి అతి కొద్ది మంది నటుల సరసన ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ చేరనున్నారన్నమాట. -
జీవీకి ఉత్తమ నటుడు అవార్డు
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది. సంగీతదర్శకత్వం, నటన అంటూ రెండు పడవలపైనా సక్సెస్ఫుల్గా పయనిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్కుమార్. ఈయన నటుడిగా ఇటీవల వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంచుకుంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య బాలా దర్శకత్వం వహించిన నాచియార్ చిత్రంలో చాలా భిన్నమైన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల సర్వం తాళమయం చిత్రంలో నటించారు. ప్రముఖ ఛా యాగ్రాహకుడు రాజీవ్మీనన్ దర్శకత్వం వ హించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. చిత్రం పలువురి ప్రశంసలను అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడింది. కాగా ఈ చిత్రంలో నటనకుగానీ నటుడు జీవీ.ప్రకాశ్కుమార్కు ప్రోవోక్ మేగజైన్ ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డుల వేడుక బుధవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ వేదికపై అవార్డును అందుకున్న జీవీ.ప్రకాశ్కుమార్ చిత్ర దర్శకుడు రాజీవ్మీనన్కు తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సంగీతప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళీ నటించింది. నెడుముడి వేణు, వినీత్, కుమరవేల్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం ఇసైజ్ఞానం మణిదరిన్ పిరప్పు పార్తు వరువదిలై అనే కథ నుంచి తీసుకున్న పాయింట్తో రూపొందించబడింది. సర్వం తాళమయం చిత్రం గత ఫిబ్రవరిలో విడుదలైంది. కాగా జపాన్లో ఇటీవల జరిగిన టోక్యో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఆ దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖుల నుంచి విశేష ఆదరణను పొంది ప్రశంసలు అందుకుంది. కాగా ప్రోవోక్ మేగజైన్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న జీవీ ప్రకాశ్కుమార్ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. జీవీ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రాఫిక్ సిగ్నల్ కథేంటి
‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్గా ఫిక్స్ చేశారు తమిళ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని రూపొందించిన శశి కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా నటించారు. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్తో అనువదిస్తున్నారు. రమేశ్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, బైక్ రేసర్కి మధ్య సాగే ఎమోషనల్ కథ ఇది. మంచి ఫ్యామిలీ డ్రామా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’ని బాగా ఆదరించారు. నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఆలోచించి ఈ కథ తయారు చేశాను. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు శశి. -
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం
షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించిన సర్వం తాళమయం చిత్రం ప్రదర్శించనున్నారు. జీవీ.ప్రకాశ్కుమార్, నెడుముడి వేణు, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సర్వం తాళమయం. ప్రముఖ ఛాయాగ్రహకుడు రాజీవ్మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 22వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మనోరమ విభాగంలో అధికారికపూర్వకంగా ఎంపికైనట్లు చిత్ర వర్గాలు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. -
జీవీ చిత్రానికి సెన్సార్ ప్రశంసలు
సామాజిక సేవాభావం కలిగిన అతి కొద్ది మంది నటుల్లో జీవీ.ప్రకాశ్కుమార్ ఒకరు. నిజ జీవితంలోనే కాదు తన చిత్రాల్లోనూ సామాజికపరమైన అంశాలు ప్రతిభించాలని కోరుకునే నటుడు. అలాంటి జీవీకి నాచ్చియార్ తరువాత మంచి సక్సెస్ పడలేదు. తాజాగా ఐంగరన్ చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. నటి మహిమా నంభియార్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కామన్మెన్ పిక్చర్స్ పతాకంపై పి.గణేశ్ నిర్మించారు. ఈటీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రవిఅరసు తెరకెక్కించిన చిత్రం ఐంగరన్. నిజానికి ఐంగరన్ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాల్లో ఉంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విశేషం ఏమిటంటే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు మంచి కథా చిత్రం అని ప్రశించించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఐంగరన్ నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ గత చిత్రాలకు భిన్నంగా వేరే కోణంలో ఉంటుందని దర్శకుడు రవిఅరసు పేర్కొన్నారు. ఇందులో ఆయన యాక్షన్ కోణాన్ని కూడా చూస్తారని చెప్పారు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల దర్శకుడు ఏఆర్.మురుగదాస్ చేతుల మీదగా విడుదల చేయగా కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల నుంచి అత్యధికంగా లైక్స్ వచ్చాయని తెలిపారు. అంతే కాదు సినీవర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఐంగరన్ చిత్రం కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
అఫీషియల్.. అమ్మ పాత్రలో కంగనా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. సినిమాగానే కాక వెబ్ సిరీస్గానూ అమ్మ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు. తాజాగా మరో బయోపిక్కు సంబంధించి అధికారిక ప్రటకన వెలువడింది. ఎన్టీఆర్ బయోపిక్కు సహ నిర్మాతలుగా వ్యవహరించిన విబ్రీ మీడియా తలైవి పేరుతో జయలలిత బయోపిక్ను నిర్మిస్తున్నారు. ఈబయోపిక్లో అమ్మ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. ఈ విషయాన్ని కంగనా రనౌత్ పుట్టిన రోజు సందర్భంగా తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు. After #gangsofwasseypur this will be my venture back into Hindi .. #GV72 #KanganaRanaut will play the lead role in #Thalaivi, the #Jayalalithaabiopic produced by @vibri_media @vishinduri and directed by #Vijay #Vijayendraprasad #NiravShah @gvprakash #HBDKanganaRanaut — G.V.Prakash Kumar (@gvprakash) 23 March 2019 -
గుండె లోతులను తాకే ‘సర్వం తాళమయం’
కమర్షియల్ సినిమా మూసలో అప్పుడప్పుడు మెరిసే కళాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సామాజిక అంశాలను ప్రస్థావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కే సినిమాలను జయాపజయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ అక్కున చేర్చుకుంటారు. ఆ బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగీత ప్రధాన చిత్రమే సర్వం తాళమయం. దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. పీటర్ జాన్సన్ (జీవీ ప్రకాష్ కుమార్) సంగీత వాయిద్యాలు తయారు చేసే దళితవర్గానికి చెందిన కుర్రాడు. తమిళ సినీ హీరో విజయ్ అంటే పీటర్కు విపరీతమైన అభిమానం. ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పీటర్ జీవితంలోకి అనుకోకుండా కర్ణాటక సంగీతం ప్రవేశిస్తుంది. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పాలకొల్లు రామశాస్త్రీ దగ్గర సంగీత నేర్చకునేందుకు చేరతాడు. ఎలాగైన గురువు తగ్గ శిష్యుడు అనిపించుకోవాలన్న ప్రయత్నంలో పీటర్కు ఎదురైన సమస్యలేంటి..? ఈ ప్రయాణంలో పీటర్లో వచ్చిన మార్పులేంటి..? చివరకు పీటర్ అనుకున్నది సాధించాడా? అన్నదే మిగతా కథ. కథగా చెప్పటానికి ఏమీ లేకపోయినా దర్శకుడు మనసును తాకే భావోద్వేగా సన్నివేశాలను సినిమాను తెరకెక్కించాడు. శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పదనాన్ని చెబుతూనే సమాజంలో వేళ్లూనుకుపోయిన అంతరాలను తెర మీద ఆవిష్కరించాడు. సుధీర్ఘ విరామం తరువాత దర్శకత్వం వహించినా.. తన మార్క్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. రొటీన్ స్టైల్లో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుడిని కథలో లీనం చేయటంలో సక్సెస్ అయ్యాడు. సంగీత విద్వాంసుడు రామశాస్త్రీ పాత్ర పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తొలి భాగం పాత్రల పరిచయం, ఆసక్తికర సన్నివేశాలతో మలచిన దర్శకుడు.. ద్వితీయార్థాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కథాపరంగా మరిన్ని ఎమోషనల్ సీన్స్కు అవకాశం ఉన్నా దర్శకుడు సినిమాను రియలిస్టిక్గా చూపించే ప్రయత్నమే చేశాడు. రాజీవ్ మీనన్ తయారు చేసుకున్న కథలోని పాత్రలకు ప్రతీ ఒక్క నటుడు జీవం పోశారు. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతూ వస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అల్లరి చిల్లరి కుర్రాడి, తరువాత సంగీత కళాకారుడిగా మారే క్రమంలో ప్రకాష్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఇక కీలక పాత్రలో నెడుముడి వేణు నటన సినిమాకే హైలెట్గా నిలిచింది. హీరోయిన్ అపర్ణ బాలమురళి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో తనవంతు ప్రయత్నం చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒకప్పటి హీరో వినీత్ మంచి నటన కనబరిచాడు. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత హైప్ తీసుకువచ్చింది. తన పాటలు, నేపథ్య సంగీతంతో రెహమాన్ ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుల గుండె లోతుల్లోకి చేరేలా చేశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫి, ప్రతీ సన్నివేశాన్ని సహజంగా తెర మీద చూపించటంలో కెమెరామేన్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
కదిలించేలా ‘సర్వం తాళమయం’ ట్రైలర్
నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన సంగీత ప్రధాన చిత్రం సర్వం తాళమయం. వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడు సంగీత విద్వాంసుడు కావాలనుకుంటే అతనికి ఎదురైన కష్టాలు, అవమానాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది లాంటి సూపర్ హిట్ సినిమాలన తెరకెక్కించిన రాజీవ్ మీనన్ 18 ఏళ్ల విరామం తరువాత ఈ సినిమాతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే తమిళ నాట రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో ఈ నెల 8న తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రాయూనిట్. జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
నాది 18 ఎళ్ల వనవాసం
‘‘కర్ణాటిక్ సంగీతం మీద డాక్యుమెంటరీ చేస్తున్న సమయంలో, మృదంగం తయారు చేసేవాళ్లతో సంభాషిస్తున్నప్పుడు ఈ చిత్రకథ ఆలోచన వచ్చింది. నచ్చిన కళను ఇష్టపడి నేర్చుకుంటూ, ఆ మార్గంలో అడ్డంకులు ఎదుర్కొని గెలిచిన యువకుడి కథే ఈ ‘సర్వం తాళమయం’’ అని రాజీవ్ మీనన్ అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, అపర్ణా బాలమురళి జంటగా ‘మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది’ వంటి హిట్స్ను ఇచ్చిన రాజీవ్ మీనన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్వం తాళమయం’ ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘గత కొన్నేళ్లుగా కథలు రాస్తూనే ఉన్నాను. కానీ అవి సినిమా వరకు వెళ్లలేదు. ఆ గ్యాప్లో యాడ్స్ చేశా, మా ఇన్స్టిట్యూట్ పనుల్లో బిజీగా ఉన్నాను. రామాయణంలో రాముడు 14 ఏళ్లే వనవాసం చేశాడు, నాది 18 ఏళ్ల వనవాసం (దర్శకుడిగా వచ్చిన గ్యాప్ను ఉద్దేశించి). యాడ్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో రెహమాన్ నాకు పరిచయం. కొన్ని వందల యాడ్ ఫిల్మ్ కలసి చేశాం. రెహమానే నన్ను దర్శకుడిగా సిఫార్సు చేసింది. ఈ సినిమాలో నేనో ట్యూన్ కంపోజ్ చేశా. రెహమాన్కు చెబుదామంటే భయం. కానీ ట్యూన్ నచ్చడంతో ఇష్టంగా స్వీకరించి సినిమాలో పెట్టుకున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. కె. విశ్వనాథ్గారు మా సినిమా చూసి, నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. క్లైమాక్స్లో కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా’’ అన్నారు. ‘‘ఈ మూవీ నాకు చాలా స్పెషల్. రాజీవ్ మీనన్గారు క్లాస్ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు జీవి ప్రకాశ్. ‘‘ఈ ఆఫర్ రాగానే ముందు నమ్మలేదు. ఎవరో ఆటపట్టించడానికి కాల్ చేశారేమో అనుకున్నాను. నిజంగానే రాజీవ్గారు అని తెలిసి చాలా ఆనందపడ్డా’’ అన్నారు అపర్ణ. -
ఎళిల్ దర్శకత్వంలో జీవీ
ఎళిల్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎళిల్ ఇంతకు ముందు విజయ్, అజిత్ హీరోలుగా హిట్ చిత్రాలను అందించారు. ఆ మధ్య విష్ణువిశాల్ హీరోగా వేలైయవందుట్టాల్ వందాల్ వెళ్లైక్కారన్ చిత్రంతో తన సక్సెస్ కెరీర్ను కొనసాగించారు. తాజాగా జీవీ. ప్రకాశ్కమార్ హీరోగా చిత్రం చేయనున్నారు. ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలను నిర్మించిన అభిషేక్ ఫిలింస్ రమేశ్ పి.పిళ్లై సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సంస్థ ఇప్పటికే సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్కుమార్ హీరోలుగా శశి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. అది నిర్మాణంలో ఉండగానే ఎళిల్ దర్శకత్వంలో జీవీ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం చెన్నైలోని దేవాలయంలో నిరాడంబరంగా జరిగాయి. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ను మార్చి నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సత్య.సీ సంగీతాన్ని అందించనున్నారు. ఇది దర్శకుడు ఎళిల్ బాణీలోనే సాగే వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. -
స్పెషల్ సాంగ్లో అఖిల్ హీరోయిన్..!
నటి సాయేషా సైగల్ కూడా ఐటమ్ సాంగ్కు సై అనేసింది. తెలుగులో అఖిల్ చిత్రంతోనూ, తమిళంలో వనమగన్ చిత్రంతోనూ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. తెలుగులో ఒక్క చిత్రంతోనే పక్కన పెట్టేసినా, కోలీవుడ్ మాత్రం మంచి అవకాశాలనే కల్పించింది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్తోనే మంచి డాన్సర్ అని ప్రశంసలు పొందిన సాయేషా ఆ తరువాత కార్తీ, ఆర్య వంటి స్టార్స్తో జత కట్టింది. తాజాగా సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ చిత్రం మినహా చేతిలో మరో అవకాశం లేదు. దీంతో కాప్పాన్పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్కు సై అనేసింది. జీవీ.ప్రకాశ్కుమార్, కామెడీ నటుడు యోగిబాబులతో కలిసి సిందేసింది. జీవీ.ప్రకాశ్కమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో వాచ్మన్ ఒకటి. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జీవీకి జంటగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది. జీవీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ర్యాప్ టైప్లో సాగే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటుంది. ఈ పాటలో జీవీ.ప్రకాశ్, యోగిబాబులతో కలిసి సాయేషాసైగల్ నటించింది. ఈ పాటను ప్రచార చిత్రం కోసం చిత్రీకరించినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఇప్పుడీ పాట సామాజిక మాధ్యమాల్లో ఫుల్గా వైరల్ అవుతోంది. -
జీవీతో ఐశ్వర్య
మణిరత్నం చిత్రంలో యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్తో కలిసి నటించడానికి ఐశ్వర్యరాజేశ్ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. కోలీవుడ్లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటుడు జీవీ ప్రకాశ్కుమార్. ఈయన చేతిలో ఇప్పుడు 10 చిత్రాల వరకూ ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 7 చిత్రాలు తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. ఆ మధ్య నటుడిగా కాస్త తడబడ్డా, నాచియార్తో హిట్ట్రాక్లో పడ్డ జీవీ తాజాగా దర్శకుడు మణిరత్నం నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు. మణిరత్నం శిష్యుడు ధనశేఖరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇకపోతే ఇందులో నటి ఐశ్వర్యరాజేశ్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో తను జీవీ ప్రకాశ్కుమార్కు అక్కగా కనిపించబోతోందని సమాచారం. ఇంతకు ముందే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె ఇటీవల హీరోయిన్గా బాగా బిజీ అయిపోయింది. అంతే కాదు కనా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో చాలా ఉత్సాహంలో ఉన్న ఐశ్వర్యరాజేశ్కు మరోసారి మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరింత సంబరపడిపోతోంది. ఈమె ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్కుమార్తో జత కట్టే హీరోయిన్ ఎంపిక జరుగుతోందట. త్వరలో సెట్పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి 96 చిత్రం ఫేమ్ గోవింద్వసంత్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం జయంరవి, విక్రమ్, శింబు, అమితాబచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారాగణంతో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి’
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్. ‘డార్లింగ్’ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కాగా జీవీ నటించిన తాజా చిత్రం ‘సర్వం తాళమయం’. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మ్యూజికల్ డ్రామాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జీవీ, రాజీవ్ మీనన్, రెహమాన్ ఫేస్బుక్లో లైవ్చాట్ నిర్వహించారు. వీరి సరదా సంభాషణలో భాగంగా.. ‘నిజంగా నాకు రెహమాన్ అంటే చాలా భయం. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వచ్చేది’ అంటూ జీవీ చెప్పుకొచ్చాడు. మేనల్లుడి వ్యాఖ్యలకు స్పందించిన రెహమాన్.. ‘ నేను నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి. కానీ నువ్ మాత్రం అంతలా భయపడ్డావా. ఇదంతా నటనే కదా జీవీ. మంచి నటుడివి అని నిరూపించుకున్నావులే’ అంటూ చమత్కరించాడు. -
మ్యూజికల్ డ్రామాగా ‘సర్వం తాళమయం’
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మ్యూజికల్ డ్రామా ‘సర్వం తాళమయం’. మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళమయం. ఈ సినిమాలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ను రిలీజ్ చేశారు.జియో స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
జపాన్ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం
సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈయన నటించిన తాజా చిత్రాల్లో సర్వం తాళ్ మయం ఒకటి. ఇంతకు ముందు మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళ మయం. ఇందులో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం జపాన్, టోక్యో నగరంలో జరుగుతున్న 31వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని జీవీ.ప్రకాశ్కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఝాన్సీగా జ్యోతిక
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాల దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా నాచియార్. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి జోత్యిక పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. రిలీజ్కు ముందు వివాదాస్పదమైన జ్యోతిక పాత్రకు సినిమా రిలీజ్ తరువాత మంచి ప్రశంసలు దక్కాయి. యువ నటుడు జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ను ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత జ్యోతిక తెలుగు తెర మీద కనిపించనుండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫీల్ గుడ్ మూవీగా సెమ
తమిళసినిమా: నాకు పెళ్లి కూతురుని కుదర్చడం కోసం పడే పాట్లే సెమ చిత్రం అని అన్నారు నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం సెమ. దర్శకుడు పాండిరాజ్ పసంగ ప్రొడక్షన్స్, పి.రవిచంద్రన్ లింగా భైరవి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో జీవీకి జంటగా అర్తన నటించగా యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. పాండిరాజ్ శిష్యుడు వల్లికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న జీవీ.ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ సెమ పూర్తిగా వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. సాధారణంగా సినిమాల్లో హీరోలు పనీ పాటా లేకుండా తిరుగుతుంటారన్నారు. అయితే సెమ చిత్రంలో హీరో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారన్నారు. చేపలను అమ్మడానికి వెళతాడని, అవి అమ్ముడు పోకపోతే ఎండ బెట్టి మరుసటి రోజు వాటినే మళ్లీ అమ్ముతాడన్నారు. ఇలా చాలా హుషారుగా ఉండే పాత్ర అది అని చెప్పారు. హీరోకు వధువును చూసే సన్నివేశాలు చాలా వినోదంగా ఉంటాయన్నారు. నాలుగైదు పెళ్లి చూపులకు వెళ్లినా సెట్ కాదని, ఆ తరువాత ఒక అమ్మాయి ఓకే అయినా ఆ పెళ్లి జరగదని, అందుకు కారణాలు ఏమిటి, చివరికీ హీరో పెళ్లి జరిగిందా? లేదా? అన్న పలు జాలీ సన్నివేశాలతో కూడిన చిత్రంగా సెమ ఉంటుందని చెప్పారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన మంచి ఫీల్ గుడ్ మూవీగా ఉంటుందని జీవీ పేర్కొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ స్టెర్లైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో ప్రజలు పోరాడుతూ తుపాకీ గుళ్లకు బలవుతున్న సమయంలో ఈ చిత్ర సమావేశాన్ని నిర్వహించడం బాధగా ఉందన్నారు. పోరాటం ప్రజల హక్కు అని, దాన్ని పోలీసులు అణచి వేసే ప్రయత్నం, పోరాటంలో పాల్గొన్నవారిని కాల్చి చంపడం ఖండించదగ్గ విషయంగా జీవీ పేర్కొన్నారు. -
ఎలాంటి పాత్రకైనా రెడీ!
తమిళ సినిమా : ఎలాంటి పాత్రకైనా రెడీ అంటోంది నటి కృతి కర్బంద. ఈ ఢిల్లీ భామ మోడలింగ్ రంగం నుంచి సినీరంగానికి పరిచయమైంది. చాలా మంది ఉత్తరాది తారల మాదిరిగానే తొలుత తెలుగులో ‘బోణి’ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం భాషాల్లో వరుసగా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్న కృతి కర్బంధ తమిళంలో జీవీ.ప్రకాశ్కుమార్తో బ్రూస్లీ అనే ఒక్క చిత్రంలోనే రొమాన్స్ చేసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందుకేనేమో ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. తాజాగా మళ్లీ కోలీవుడ్లో ఎలాగైనా అవకాశాలందుకోవాలని ఆరాట పడుతోంది. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాకు వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించే అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉంది. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు అని అడుగుతుంటారు. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ. పాత్రలను బట్టి లంగా ఓణి, చీరలు, మోడ్రన్ ఇలా అన్ని రకాల దుస్తులైనా ధరించాల్సి ఉంటుంది. అలా ఆయా పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటాను. అయితే ఢిల్లీ అమ్మాయిని కదా స్వతహాగా నాకు మోడ్రన్ దుస్తులు ధరించడమంటేనే ఇష్టం. అలాంటి పాత్రలైతే మరింత ఆసక్తి. ఇకపోతే తమిళంలో మంచి పాత్రల్లో నటించాలనుంది. అలాంటి అవకాశాలు ఆశిస్తున్నాను’ అన్నారు. -
ప్రేమలో చిక్కులు
జీవీ ప్రకాష్కుమార్ హీరోగా, నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వీడి లవ్లో అన్నీ చిక్కులే’ అన్నది ఉపశీర్షిక. శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జీవీ ప్రకాష్కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్ కుమార్ని అభినందిస్తూ, తనకు నిర్మాతగా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారి దగ్గర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో జీవాగారు గెస్ట్ రోల్లో కనిపిస్తారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
వీడి లవ్లో అన్నీ చిక్కులే
జీవీ ప్రకాష్ కుమార్, నిక్కీ గల్రానీ జంటగా ఎం. రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘వీడి లవ్ లో అన్నీ చిక్కులే’ అన్నది ఉప శీర్షిక. యశ్వంత్ సాయికుమార్ సమర్పణలో వి.జయంత్ కుమార్ (బి.టెక్) తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని నిర్మాత కేవీవీ సత్యానారాయణ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నేను కూడా డబ్బింగ్ సినిమాలతో నిర్మాతగా పరిశ్రమకు పరిచయమై తర్వాత పెద్ద సినిమాలు నిర్మించా. జయంత్ కూడా భవిష్యత్ లో మంచి సినిమాలు నిర్మించి, పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ప్రకాశ్రాజ్గారి పోలీస్ పాత్ర సినిమాకు హైలైట్. జి.వి. ప్రకాష్ అద్భుతమైన నటనతో పాటు, మంచి సంగీతం అందించారు. అందమైన ఫారిన్ లోకేషన్లలో పాటలు చిత్రీకరించారు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.కృష్ణ, పాటల రచయిత సీహెచ్ పూర్ణాచారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: వెలిదెండ్ల రామ్మూర్తి. -
జీవీతో ఓకే అంటుందా?
జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా నటించడానికి మిల్కీబ్యూటీ తమన్నా ఓకే అంటుందా? బాహుబలి, తోళా, దేవి వంటి భారీ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో మంచి జోరుమీదున్న తమన్నా ప్రస్తుతం శింబుకు జంటగా అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తోంది. మరోసారి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన 100% లవ్ చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా కోలీవుడ్లో రీమేక్ కానుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ తమిళ వెర్షన్కు నిర్మాతగా మారారు. ఎం.ఎం. చంద్రమౌళి అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈయన హాలీవుడ్ ప్రముఖ ఛాయాగ్రహకుడు ఫ్రైడ్మాబీ శిష్యుడన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభమయ్యింది. త్వరలో చిత్రం సెట్పైకి వెళ్లనుంది. ఇందులో జీవీ ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో నటించిన తమన్నానే తమిళంలోనూ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ బ్యూటీ జీవీతో నటించడానికి సై అంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ 100% లవ్ చిత్రంలో క«థానాయకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు చిత్రంలో నటించిన తమన్నాకు మంచి పేరు వచ్చింది. ఇది హీరోహీరోయిన్ల మధ్య చిన్న ఈగోతో కూడిన ప్యూర్ లవ్ స్టోరీ అన్నది గమనార్హం. -
నూరు శతవిధం కాదల్!
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన లవ్లీ ఎంటర్టైనర్ ‘హండ్రెడ్ పర్సంట్ లవ్’ తమిళంలో రీమేక్ కానుంది. ఈ చిత్రాన్ని సుకుమారే నిర్మించనుండటం విశేషం. సంగీతదర్శకుడిగా ప్రతిభ చాటుకుని, హీరోగా మారిన జీవీ ప్రకాశ్కుమార్ ఇందులో హీరో. చంద్రమౌళి దర్శకత్వం వహించనున్నారు. వంద శాతం ప్రేమ అంటే.. తమిళంలో నూరు శతవిధం కాదల్ అని అర్థం. మరి.. తమిళంలో ఈ టైటిలే పెడతారేమో? -
జీవీతో ఆ ఇద్దరు..
కోలీవుడ్లో మోస్ట్వాంటెడ్ యువ కథానాయకుల్లో జీవీ.ప్రకాశ్కుమార్ ముందున్నారని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇటు సంగీతదర్శకుడిగా అటు కథానాయకుడిగా రెండు పడవలపై సక్సెస్ఫుల్గా పయనిస్తున్న జీవీకి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఈయన నటించిన బ్రూస్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం జీవీ 4జీ, అడంగాదే, ఐన్ గరన్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు రాజీవ్మీనన్ దర్శక్వంలో ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్న చిత్రంలోనూ నటించనున్నారు. తాజాగా మరో అవకాశం జీవీ.ప్రకాశ్కుమార్ తలుపుతట్టిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగులో మంచి విజయం సాధించిన ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్ర తమిళ రీమేక్లో కథానాయకుడి అవకాశం జీవీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆయనతో అందాల భామలు సమంత, హన్సిక రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ అధినేత పి.మదన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఇందులో నటించడానికి జీవీ.ఇంకా ఒప్పుకున్నట్లు లేదట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కాస్త టైమ్ పడుతుంది. ఇప్పటికే నటి సమంత కోలీవుడ్లో మూడు చిత్రాల్లో నటించడానికి అంగీకరించారు. అందులో ఇళయదళపతి విజయ్తో నటించే చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇకపోతే తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునకు జంటగా కొత్త చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్లో ప్రస్తుతం ఒక్క చిత్రం లేని నటి హన్సికకు జయం రవికి జంటగా నటించిన భోగన్ విజయం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు మాలీవుడ్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. -
ప్రేమ వివాహానికే నా ఓటు
ప్రేమ వివాహానికే నా ఓటు అంటోంది నటి కృతికర్బంద. ఈ ఢిల్లీ బ్యూటీ బ్రూస్లీ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం కానుంది. ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న కృతికర్బంద మొదట మోడలింగ్ రంగంలో రంగప్రవేశం చేసి ఆ తరువాత సినిమాల్లోకి దిగుమతి అయ్యింది. ఈ అమ్మడు తెలుగులో బోణి చిత్రంతో బోణీ కొట్టింది. సుమంత్తో రొమాన్స్ చేసిన ఆ చిత్రం కృతికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ఆ తరువాత కూడా తీన్ మార్, ఒంగోలుగిత్త తదితర చిత్రాల్లో నటించింది. అయినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ బరిలోకి దిగాలని ప్రయత్నించి, చివరి దశలో వెనక్కు తగ్గింది. కాగా ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో నటి కృతి కర్బంద మాట్లాడుతూ తాను ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నంచి వచ్చానని చెప్పింది. అయితే ఇప్పటికే తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తున్నానని తెలిపింది. అందువల్ల ఆ భాషల్లో కొంచెం మాట్లాడగలననని అంది. కా గా ప్రస్తుతం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. కోలీవుడ్ లో మణిరత్నం దర్శకత్వంలో న టించాలన్న కోరిక ఉందని చెప్పింది. ఇక సూర్యకు జంటగా ఒక్క చిత్రంలోనైనా నటించాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. పెళ్లి గురిం చి అడుగుతున్నారని, తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపింది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని, ముఖ్యంగా తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్లు కృతి కర్బంద పేర్కొంది. -
జీవీతో మడోనా సెబాస్టియన్ రొమాన్స్
యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్తో ప్రేమమ్ చిత్రం మడోనా సెబాస్టియన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారు. కోలీవుడ్లో ప్రామిసింగ్ యువ కథానాయకులలో జీవీ.ప్రకాశ్కుమార్ ఒకరు.అలాగే యమ బిజీగా ఉన్న హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నది ఈయనే. ప్రస్తుతం జీవీ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.అడంగాదే, 4జీ, సర్వం తాళ మాయం, విర్గిన్ మాప్పిళ్లై చిత్రాలతో పాటు, రాంబాలా దర్శకత్వంలో ఒక చిత్రం, శశి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. తాజాగా మరో చిత్రం కమిట్ అయ్యారు. ఇంతకు ముందు విజయ్సేతుపతి కథానాయకుడిగా ఆరంజ్ మిఠాయ్, రెక్క చిత్రాలను నిర్మించిన గణేశ్ తన కామ్న పతాకంపై నిర్మించనున్న తాజా చిత్రంలో జీవీ కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా ప్రేమమ్ చిత్రం ఫేమ్ మడోనా సెబాస్టియన్ నటించనున్నట్లు సమాచారం. దీనికి ఇంతకు ముందు ఈటీ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రవిఅరసు దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రానికి సంబంధించి నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన జీవీపై ఫొటో షూట్ చేశారు. ఆ ఫొటోలు చూసిన జీవీ.ప్రకాశ్ కుమార్ చాలా బాగున్నాయంటూ దర్శకుడిని అభినందించారట.ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే జీవీ.ప్రకాశ్ కుమార్ నటించిన బ్రూస్లీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం
నటుడు ప్రకాశ్రాజ్ చేత బాగా దెబ్బలు తిన్నాం అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. నిక్కీగల్రాణి, ఆనంది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఆర్జే.బాలాజి జీవీకి స్నేహితుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మా క్రియేషన్స్ పతాకంపై టీ.శివ నిర్మిస్తున్నారు. ఇది ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి రాజేశ్.ఎం దర్శకుడు. జీవీనే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టీజర్ బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. చిత్ర టీజర్ను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ తనకు సంగీత దర్శకుడిగా దశాబ్దం పూర్తి అయ్యిందన్నారు. అదే విధంగా ఈ చిత్ర నిర్మాత టీ.శివ 25 ఏళ్లుగా చిత్ర నిర్మాణ రంగంలో రాణిస్తున్నారన్నారు. దర్శకుడు రాజేష్ వద్ద 20 మందికి పైగా సహాయ దర్శకులు ఉన్నారని తెలిపారు. తన శిష్యులకు అవకాశాలను కల్పించే దర్శకుడు ఈయనని వ్యాఖ్యానించారు. రాజేష్ శిష్యులు పది మందికి పైగా తనకు కథలు చెప్పారని, వారందరికీ చిత్రం చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. నటి నిక్కీగల్రాణి, ఆనందిలిద్దరూ చాలా చ క్కగా నటించారని, ఆర్జే.బాలాజీ లెవలే వేరని అన్నారు. ఇందులో తాను ప్రకాశ్రాజ్తో తొలిసారిగా నటించానని తెలిపారు. ఆయనతో నటించడానికి చాలా భయపడేవాడినన్నారు. అందులోనూ ఆయన్ని తిట్టే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉన్నాయని తెలిపారు. ఆయన తనను, ఆర్జే.బాలాజీని కొట్టే సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆ సన్నివేశాల్లో ప్రకాశ్రాజ్ నిజంగానే తమను కొట్టేశారని తెలిపారు. అలా ఆర్జే.బాలాజీ బాగా దెబ్బలు తిన్నారని జీవీ చెప్పారు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం మంచి విజయం సాధించి ఇందులో పనిచేసిన వారందరికీ మంచి పేరు తె చ్చి పెడుతుందనే నమ్మకాన్ని జీవీ.ప్రకాశ్కుమార్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాత పీఎల్.తేనప్పన్, నాజర్, మనోబాలా, సంతానం, నిక్కీగల్రాణి, ఆనంది, తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై నిర్మాత టీ.శివ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. -
జీవీ అడంగాదేకు ప్రముఖుల మద్దతు
యువ సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగానూ సక్సెస్ అయ్యి చే తి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న బ్రూస్లీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. దీనికి అడంగాదే అనే టైటిల్ను నిర్ణయించారు. కాగా ఈ చిత్రంలో ఆయనతో కలిసి పలువురు ప్రముఖ నటీనటులు నటించనుండడం విశేషం. ప్రముఖ నటుడు శరత్కుమార్ ఈ చిత్రంలో జీవీతో కలిసి నటించనున్నారు. కథానాయకిగా నటి సురభి నటిస్తున్నారు. చిన్న గ్యాప్ తరువాత తను నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఉత్తరాది తార మందిరాబేడీ సుదీర్ఘ గ్యాప్ తరువాత అండంగాదే చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించడం మరో విశేషం. ఈమె చాలా కాలం క్రితం శింబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన మన్మథన్ చిత్రంలో అతిథిగా మెరిశారు. ఆ తరువాత ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. క్రికెట్ క్రీడ యాంకరింగ్కే ఎక్కువగా పరిమితమైన మందిరాబేడీ జీవీతో కలిసి రీఎంట్రీ అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో తంబిరామయ్య, రోబోశంకర్ తదితర సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. శ్రీగ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి షణ్ముగ ముత్తుసామి దర్శకత్వం వహిస్తున్నారు. -
మరోసారి హారర్తో జీవీ
హారర్ చిత్రాల ట్రెండ్ కోలీవుడ్లో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ తరహా చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. జయం రవి మిరుదన్ చిత్రంతో తాజాగా హిట్ కొట్టారు. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా జంటగా హారర్ చిత్రంలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఇక నటుడు కార్తీ నయనతారతో కలిసి కాష్మోరా అంటూ భయపెట్టడానికి రానున్నారు. అదే విధంగా యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ తొలి సారిగా డార్లింగ్ అంటూ హారర్ చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత పెన్సిల్, త్రిషా ఇల్లన్నా నయనతార, ఎనక్కు ఇన్నోర్ పేరు ఇరుక్కు చిత్రాలు విడుదలై సక్సెస్ అయినా, డార్లింగ్ చిత్రానిదే పెద్ద విజయం అని చెప్పక తప్పదు. తాజాగా మరోసారి జీవీ.ప్రకాశ్కుమార్ హారర్ను నమ్ముకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కడవుల్ ఇరుక్కాన్ కమారు చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంతకు ముందు శివ మనసుల శక్తి, భాస్ ఎందిర భాస్కరన్ తదితర విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాజేశ్.ఎం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జీవీకి జంటగా డార్లింగ్లో జత కట్టిన నిక్కీగల్రాణియే నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగప్పేర్లో జరుపుకుంటుంటోంది. ఇప్పటికి 95 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డార్లింగ్ విజయాన్ని రిపీట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాయట యూనిట్ వర్గాలు. వినోదాన్ని పండించడంలో అందె వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని హారర్తో కూడిన కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. -
విడుదలకు ముందే నెట్లో రిలీజ్
జీవీ.ప్రకాశ్కుమార్ ఫిర్యాదు తమిళసినిమా: తన చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్లో రిలీజ్ కావడంతో ఆ చిత్ర హీరో జీవీ.ప్రకాశ్కుమార్, యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతకు ముందు చిత్రానికి సంబంధించిన ఒకటిరెండు పాటలు గానీ, కొన్ని సన్నివేశాలు గానీ అనధికారికంగా నెట్లో ప్రచారం అయ్యేవి. అలాంటిది చిత్రం మొత్తం విడుదలకు ముందే నెట్లో రిలీజ్ కావడం అన్నది ఇదే మొదటి సారి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం ఉనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. అయితే అంతకు ముందు రోజే నెట్లో రిలీజైన విషయం చిత్ర యూనిట్కు తెలిసింది. దీంతో చిత్ర హీరో జీవీ.ప్రకాశ్కుమార్ సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ కమిషనర్ టీకే.రాజేంద్రన్కు ఫిర్యాదు చేశారు. చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్లో రిలీజ్ కావడంతో తాము తీవ్ర నష్టానికి గురవుతున్నట్లు, కాబట్టి దొంగతనంగా తమ చిత్రాన్ని ఇంటర్నెట్లో ప్రచారం చేసిన వారెవరో కనిపెట్ట వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కమిషనర్ తగిన చర్చలు చేపడుతామని హామీ ఇచ్చారు. -
జీవీతో సాయిపల్లవి రొమాన్స్
జీవీ ప్రకాశ్కుమార్తో రొమాన్స్కు సిద్ధం అవుతోంది నటి సాయిపల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్తో ఒక్క సారిగా పాపులరైన ముగ్గురు హీరోయిన్లలో నటి సాయిపల్లవి ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇద్దరిలో మడోన్నా సెబాస్టియన్ ఇప్పటికే కోలీవుడ్కు పరిచయమై కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంతో విజయాల ఖాతా ఓపెన్ చేసుకున్నారు. ఇక మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్లో అవకాశాలను అందుకుంటున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రం అఆ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా సాయిపల్లవి మాత్రం ఇతర భాషల్లోకి రంగప్రవేశం చేయలేదు. అయితే అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అది ఈ బ్యూటీని నిరాశపరచే సంఘటనే అయినా తాజాగా లక్కీ ఛాన్స్ సాయిపల్లవిని వరించింది. సక్సెస్ఫుల్ యువనటుడు జీవీ ప్రకాశ్కుమార్తో జతకట్టే అవకాశం అభించింది. డార్లింగ్ అంటూ కథానాయకుడిగా తెరపైకి వచ్చిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్. ఆ చిత్రంతో పాటు, ఆ తరువాత విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార, పెన్సిల్ చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆయనకు హీరోగానూ పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం జీవీ నటించిన బ్రూస్లీ, ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. తాజాగా జీవీ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి రాజీవ్మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మిన్సారకనవు, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా ఎంపికైనట్లు తాజా సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుందని తెలిసింది. -
శశి దర్శకత్వంలో జీవీ
శశి దర్శకత్వంలో నటించడానికి జీవీ ప్రకాశ్కుమార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. రోజాకూట్టం, సోల్లామలై, డిష్యుం, పూ తదితర వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శశి. కొంత కాలంగా సరైన హిట్లు లేక కాస్త వెనుక పడ్డ ఈ దర్శకుడిని పిచ్చైక్కారన్ విజయం మళ్లీ ప్రైమ్ టైమ్లో నిలబెట్టింది. దీంతో పునరుత్తేజం పొందిన శశి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సారి తన కథకు యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్కుమార్ను కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇటీవల ఆయన్ని కలిసి కథ వినిపించడం, అందులో నటించడానికి జీవీ పచ్చజెండా ఊపడం జరిగి పోయినట్లు సమాచారం. శశి దర్శకత్వంలో నటించడానికి కాల్షీట్స్ సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఆయన కాల్షీట్స్ కేటాయించడమే ఆలస్యం చిత్రం ప్రారంభం అవుతుందని సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్తో కూడిన కథా చిత్రంగా ఉంటుందట. జీవీ ప్రకాశ్కుమార్ ప్రస్తుతం బ్రూస్లీ చిత్రంతో పాటు రాజేశ్ దర్శకత్వంలో కడవుల్ ఇరుక్కిరాన్ కుమారు చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, రాజీవ్మీనన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే శశి చిత్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒకే సారి ఇద్దరితో జీవీ రొమాన్స్
చెన్నై : యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా యమ జోష్లో ఉన్నారు. విజయాలతో పాటు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటి వరకూ డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాలు విడుదలవ్వగా రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం.కాగా ప్రస్తుతం బ్రూస్లీ చిత్రంలో నటిస్తున్న జీవీ.ప్రకాశ్కుమార్ ఇంద కార్తీ కొట్టవన్,తదితర రెండు చిత్రాలలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో చిత్ర అవకాశం ఆయన ఇంటి తలుపు తట్టింది. ఒరు కల్ ఒరు కన్నాడి, శివ మనసుల శక్తి, ఇటీవల వాసు శరవణన్ ఇన్నా పడిచవంగ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.దీనికి కడవుల్ ఇరుకాన్ కుమారు అనే టైటిల్ నిర్ణయించారు.ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా నటించనున్నారన్నది తాజా సమాచారం. కాగా జీవీ ఇటీవల తన చిత్రాలలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం ప్రారంభించారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో ఆనంది,మనీషాయాదవ్లతో డ్యూయెట్లు పాడిన జీవీ కడవుల్ ఇరుకాన్ కుమారు చిత్రంలో నటి కీర్తీసురేశ్,ప్రియాఆనంద్లతో రొమాన్స్ చేయనున్నారని తెలిసింది.ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
డార్లింగ్ కాంబినేషన్ రిపీట్
చెన్నై : ఒక చిత్రం విజయం సాధిస్తే ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడితో మళ్లీ చిత్రాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడం అన్నది సర్వసాధారణ విషయం. అలాంటి ఆసక్తే డార్లింగ్ చిత్ర దర్శక కథానాయకులపై నెలకొంది. యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించిన డార్లింగ్ చిత్రాన్ని శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఆనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో జీవీకి హీరోగా డిమాండ్ పెరిగిపోయింది. వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉందాయన పరిస్థితి. ఈ మధ్య విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కలెక్షన్లను ఇరగదీసింది. ప్రస్తుతం బ్రూస్లీ అనే యాక్షన్ కథా చిత్రంలో నటిస్తున్న జీవీ ప్రకాశ్కుమార్ తదుపరి కెట్టవన్ ఇంద కార్తీ చిత్రంలో నటించనున్నారు. తాజాగా డార్లింగ్ చిత్ర దర్శకుడికి జీవీ పచ్చజెండా ఊపారు. ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం చేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నించారు. డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా కూడా ఈ కాంబినేషన్లో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారని, అయితే ఆయన తక్కువ పారితోషికం చెల్లిస్తాననడంతో అంతకంటే అధిక పారితోషికం అందిస్తానన్న లైకా ప్రొడక్షన్లో జీవీ హీరోగా శ్యామ్ ఆంటన్ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. లైకా సంస్థ ఇంతకు ముందు విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో సూపర్స్టార్తో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంస్థా లైకానేనన్నది గమనార్హం. -
బ్రూస్లీకి శ్రీకారం
జీవీ, ప్రకాష్కుమార్ బ్రూస్లీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాల విజయాలతో యమ జోరుమీదున్న జీవీ.ప్రకాష్కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తదుపరి చిత్రం బ్రూస్లీ. కెనన్యా ఫిలింస్ పతాకంపై సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ పాండిరాజ్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్ నాలుగవ సీజన్లో పోటీలో నిలిచారు. ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన దర్శకుడు పాండిరాజ్ వద్ద ఇదునమ్మ ఆళు, పసంగ-2 చిత్రాలకు ప్రశాంత్ పాండిరాజ్ సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో జీవీ.ప్రకాష్కుమార్కు జంటగా కీర్తీ కర్భరదన నటిస్తున్నారు. బాలశరవణన్, మునీస్కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఇప్పటి వరకు హర్రర్, రొమాంటిక్ కథా చిత్రాలను చేసిన జీవీ.ప్రకాష్కుమార్ను ఈ బ్రూస్లీ చిత్రంలో వేరే కోణంలో చూపించనున్నానన్నారు. ఇది చిన్న పిల్లల్ని సైతం అలరించే విధంగా వినోదం, యాక్షన్ అంటూ డిఫరెంట జార్న్లో ఉంటుందని చెప్పారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందని వెల్లడించారు. -
త్రిష ఇల్లన్న నయనతారలో సిమ్రాన్
త్రిష ఇల్లన్న నయన తార చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించనున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, యువ కథనాయకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. పెన్సిల్ చిత్రంతో కథనాయకుడుగా అవతారం ఎత్తిన జీవీ తన రెండో చిత్రం డార్లింగ్ తొలుత విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి చిత్రం పెన్సిల్ త్వరలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవీ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. త్రిష ఇల్లన్న నయనతార చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఆయనకు జంటగా కయల్ చిత్రం ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను సీనియర్ నటి ఒక ప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ నటించనున్నారన్నది తాజా సమాచారం. సిమ్రాన్ 90వ దశకంలో దక్షిణాదిలో నంబర్ వన్ కథానాయకీగా వెలుగొందారు. ప్రముఖ హీరోలు అందరితో నటించి మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆహా కల్యాణం వంటి పలు చిత్రాల్లో నటించినా, ఎక్కువగా బుల్లి తెర కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష ఇల్లన్న నయన తార పాత్రను పోషిస్తూ, మళ్లీ సినిమాలపై దృష్టి సారించనున్నారన్నది కోలీవుడ్ భోగట్టా. -
అవన్నీ వదంతులే
ప్రస్తుతం అదృష్టం వెంటాడుతున్న యువ కథనాయికల్లో నటి శ్రీదివ్య ఒకరు. కోలీవుడ్లో తొలి చిత్రమే (వరుత్త పడదా వాలిభర్ సంఘం) శత దినోత్సవ చిత్రంగా ఈ బ్యూటీకి అమరింది. ఆ తర్వాత మరో చిత్రం తెరపైకి రాలేదు. అయినా ఈ భామకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతుండడం విశేషం. సక్సెస్ పవర్ ఏమిటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీదివ్య సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సరసన పెన్సిల్, అధర్వకు జంటగా ‘ఈటి’, శివకార్తికేయన్తో ‘తాణా’ విష్ణు విశాల్కో జోడిగా ‘జీవా’, విక్రమ్ ప్రభుకు జంటగా ‘వెళ్ళైక్కారదురై’, విమల్ సరసన ‘కాట్టుమల్లి’, నగర్పురం అంటు ఏక కాలంలో సప్త చిత్రాలతో యమ బిజీగా ఉన్న శ్రీ దివ్యపై పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా పారితోషికం పెంచేశారని, నిర్మాతని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని శ్రీదివ్య ఖండిస్తున్నారు. అవన్నీ వదంతులేనంటున్న ఈ లక్కీ గర్ల్ మాట్లాడుతూ, తాను చాలా శ్రమ జీవినన్నారు. తానెలాంటి అమ్మాయినో తన నిర్మాతలకు బాగా తెలుసన్నారు. వృత్తిపరంగా తన పని తాను కరెక్ట్గా చేసుకుపోతానని చెప్పారు. ఏ నిర్మాతనూ తాను ఇబ్బంది పెట్టింది లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు ఎందుకు ప్రచా రం చేస్తున్నారో అర్థం కావడం లేదని నటి శ్రీదివ్య వాపోతున్నారు. -
ఆర్యతో విజయ్ మరో చిత్రం
దర్శకుడు విజయ్, నటుడు ఆర్య కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. వీరి కలయికలో ఇంతకుముందు మదరాసుపట్టణం వంటి సంచలన చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఒక చారిత్రక నేపథ్యానికి ప్రేమను మేళవించి తెరకెక్కించిన మదరాసు పట్టణం విశేషకులను సైతం మెప్పించింది. ఈ చిత్రం ద్వారానే లండన్ భామ ఎమిజాక్సన్ కోలీవుడ్కు పరిచయమైంది. ఇలాంటి హిట్ కాంబినేషన్లో మరో చిత్రం రానుం దంటే ఆ చిత్రం పై మంచి అంచనాలే నెలకొంటాయి. ఈసారి కూడా విజయ్, ఆర్య కలయికలో చారిత్రక కథా చిత్రం ఉంటుందని సమాచారం. అలాగే దర్శకుడు విజయ్ సాంకేతిక వర్గమే ఈ చిత్రానికి పని చేయనున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, చాయాగ్రాహకుడు నిరవ్షాతో మరోసారి విజయ్తో కలసి పని చేయనున్నారు. ఆర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తి అయిన తరువాత ఈ చిత్రంలో నటించనున్నారు. అయితే హీరోయిన్ ఇతర తారాగణం గురించి వెల్లడించడానికి ఇంకా చాలా సమయం ఉందంటున్నారు దర్శకుడు విజయ్. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం శైవం. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క అమలాపాల్తో ఏడు అడుగులు వేసే కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత తన నూతన చిత్రం వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
శైవం మూవీ ఆడియో ఆవిష్కరణ
-
రాజా రాణి' ఆడియో ఆవిష్కరణ