alok Verma
-
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కి పంపించింది. -
నిఘా జాబితాలో అనిల్ అంబానీ
ముంబై: నిఘా పెట్టిన ఫోన్ల జాబితాలో రిలయన్స్ అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ చెందిన నెంబర్లు ఉన్నట్లు ‘ది వైర్’ బయటపెట్టింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్కు భారత భాగస్వామిగా అనిల్ సంస్థను ఎంపిక చేయడం వెనుక ఆయను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. డసాల్ట్ ఏవియేషన్కు భారత ప్రతినిధి వెంకటరావు పోసిన, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ల నెంబర్లు నిఘా జాబితాలో ఉన్నాయని వైర్ తెలిపింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై నిఘా కొనసాగిందని వైర్ వెల్లడించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను 2018లో పదవిలోనుంచి తొలగించగానే ఆయన ఫోన్లపైనా నిఘా పెట్టారు. -
న్యాయవాది భూషణ్కు ఏ శిక్ష విధిస్తేనేం?
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేత్రికన్ తిరప్పినమ్, కుట్రమ్ కుట్రమే’ అన్న తమిళ వ్యాక్యానికి ‘శివుడు మూడో కన్ను తెరిచినాసరే, తప్పు తప్పే’ అని అర్థం. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనపై దాఖలైన ‘కోర్టు ధిక్కార నేరం’ కేసులో దాదాపు ఇదే అర్థంలో వాదించారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డావని సుప్రీం కోర్టు తేల్చినా, శిక్ష పడుతుందని హెచ్చరించినా ప్రశాంత్ భూషణ తన మాటలకే కట్టుబడి ఉన్నారు. కోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలు సబబేనని పునరుద్ఘాటించారు. అత్యున్నత న్యాయవ్యవస్థ పనితీరు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అవడం, దీనిపై స్వయంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనపై కోర్టు ధిక్కార నేరం మోపడం తెల్సిందే. భూషణ్ నేరం చేసినట్లు గత వారమే నిర్ధారించిన సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించేందుకు మంగళవారం నాడోసారి కొలువుదీరింది. క్షమాపణలకు అవకాశం ఇచ్చినప్పటికీ భూషణ్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనకు కోర్టు ఏ శిక్ష విధించినా అది ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుందే తప్పా, తగ్గించేదేమీ లేదు. భూషణ్ ధిక్కారం కేసులో కోర్టు వ్యవహారం ‘గోరుతో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్న’ చందంగా మారింది. కోర్టు పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను విమర్శిస్తూ భూషణ్ చేసిన ట్వీట్లు అస్పష్టంగానే ఉన్నాయి. కానీ తనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసుకు సమాధానంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో కోర్టు వ్యవహరించిన తీరును సమూలంగా వివరించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన బిల్లు, కశ్మీర్లో పౌరసత్వ హక్కుల పునరుద్ధణకు సంబంధించిన కేసుల్లో కోర్టు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. అయోధ్య–రామ జన్మభూమి కేసులో గొగొయ్ ఇచ్చిన తీర్పును సైతం ఆయన వదిలిపెట్టలేదు. (క్షమాపణ కోరితే తప్పేముంది) అంతేకాకుండా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్కి వ్యతిరేకంగా దాఖలైన లైంగిక వేధింపుల కేసులో కోర్టు వ్యవహరించిన తీరును, గొగొయ్ పదవీ విరమణ తర్వాత ఆ కేసును దాఖలు చేసిన యువతికి కోర్టులో మళ్లీ అదే పోస్ట్ ఇవ్వడం లాంటి పరిణామాలను భూషణ్ కూలంకుషంగా ప్రస్తావిస్తూ వాటిపై తన అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించారు. బిర్లా–సహారా కేసు నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలిఖోపాల్ ఆత్మహత్య నోట్లో చేసిన ఆరోపణల వరకు ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను విధులు నిర్వహించకుండా కేంద్రం అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన గత నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పులనే ఎక్కువగా ప్రస్థావించారు. దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ అనేక కేసుల్లో అనేక సార్లు తీర్పు చెప్పిన మన న్యాయ వ్యవస్థ తన విషయంలో మాత్రం ఎందుకు ‘ధిక్కారం’ అంటుందో...!! -
సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డీఎస్పీ దేవేందర్ కుమార్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన క్లీన్చిట్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమర్థించింది. రాకేష్ ఆస్థానా, దేవేందర్ కుమార్ల అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్లపై దాఖలైన కేసులకు ఆధారాలు లేవంటూ కోర్టు తెలిపింది మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ, సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మోయిన్ ఖురేషీ వ్యవహారంలో విచారణ సందర్భంగా.. కేసు నుంచి బయటపడేందుకు తాను రూ.2 కోట్ల లంచం పది నెలల్లో చెల్లించానని హైదరాబాద్ వ్యాపారి సతీష్ సానా ఫిర్యాదు మేరకు అక్టోబరు 15న ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
‘వర్మా.. ఈ ఒక్కరోజు పనిచేయండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ తీరుతో పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్కరోజు పనిచేయాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. కాగా,సీబీఐ చీఫ్గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్ధానాను వేరే శాఖకు బదలాయించింది. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు: మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్గా అలోక్వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
‘కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ కొరకే’
సాక్షి, హైదరాబాదు : డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 25 వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు అనుమతించడం వల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక మోదీ కక్షపూరితంగానే ఆలోక్ వర్మను ట్రాన్స్ఫర్ చేయించారని ఆరోపించారు. ఆలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక కేరళలో కమ్యూనిస్ట్లపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జేఎన్యూ విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ లబ్ధి కొరకే : చాడ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఫిరాయిస్తే ఒక రకంగా.. టీఆర్ఎస్లోకి వెళ్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరారు. -
సీబీఐలో మరో నలుగురిపై వేటు
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్గా ఆలోక్వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
సీబీఐని చుట్టుముట్టిన ఆ రహస్యాలు ఏమిటి?
సీబీఐ డైరెక్టర్ పదవినుంచి ఆలోక్ వర్మను బదిలీ చేయడం అంటే తొలగించడమనే అర్థం. అర్ధరాత్రి హఠాత్తుగా ఆలోక్ వర్మను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, సీబీఐ చట్టం కింద కాకుండా నియామకాలు, తొలగింపుల కోసం ఏర్పాటయిన అత్యున్నత అధికార కమిటీకి మాత్రమే ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తే, ఇంకా న్యాయం మినుకుమినుకు మని మెరుస్తున్నదని సంతోషించాం. అంతలోనే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నతాధికార కమిటీ హఠాత్తుగా సమావేశమైంది. ముందే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపించే వాతావరణం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హాజరైనప్పటికీ, తొలిరోజు ఏ నిర్ణయానికి రాలేదు. మరునాడు మళ్లీ కమిటీ సమావేశమైంది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రధాన న్యాయమూర్తి ప్రతినిధిగా జస్టిస్ ఎ.కె. సిక్రీ హాజరయ్యారు. సమావేశం వేగంగా నిర్ణయం తీసుకున్నది. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆలోక్ వర్మను ఏ ప్రాధాన్యతాలేని ఫైర్ శాఖకు బదిలీ చేశారు. కేవలం ఆ అధికారం ఉంది కనుక కమిటీ ఆయన్ను తొలగించేయవచ్చా? అందుకు ఆధారం ఏదీ ఉండనవసరం లేదా అని న్యాయపరమైన ప్రశ్న. కమిటీలోని ముగ్గురిలో ప్రతిపక్ష నాయకు డుగా ఉన్న ఖర్గే ఒక్కరే తొలగింపు చర్యను వ్యతిరేకించారు. జనవరి 10న అత్యున్నతాధికార కమిటీ సమావేశంలో జరిగిన చర్చలను, నిర్ణయాన్ని వివ రించే మినిట్స్ పత్రం ప్రతి కావాలని అడిగారు. సీవీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ డైరెక్ట ర్ను తొలగించారని అంటున్నారు. మొదటిసారి వర్మను తొలగించినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. తొలగింపునకు కారణాలని భావిస్తున్న అంశాలను సీవీసీ పరిశోధించాలనీ, ఆ పరిశోధనను మాజీ న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్ పర్య వేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పట్నాయక్ వర్మను తొలగించేంత తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలకు ఏవిధమైన సాక్ష్యాలు లేవని, కనుక వర్మ తొలగింపు చాలా తొందరపాటు చర్య అని విమర్శించారు. సీవీసీ నివేదికను, పట్నాయక్ నివేదికను చదివిన తరువాత, ఆలోక్ వర్మ వివరణను విని సొంత బుర్ర ఉపయోగించి నిర్ణ యం తీసుకోవలసిన బాధ్యత కమిటీపైన ఉందని మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి రాసిన లేఖలో వ్యాఖ్యా నించారు. మరొక డైరెక్టర్ తాత్కాలిక నియామక ప్రతిపాదనను కమిటీ ముందుకు ఎందుకు తీసుకురాలేదని కూడా ఆయన నిలదీశారు. జస్టిస్ పట్నాయక్ గారు ఆ సీవీసీ నివేదికతో తనకు ఏ ప్రమేయమూ లేదని, అది కేవలం íసీవీసీకి మాత్రమే చెందిన నివేదిక అనీ, సీవీసీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి స్వయంగా వివరిస్తూ ఉంటే ఆ నివేదికను కమిటీ సభ్యులకు ఇవ్వకుండా, పట్నా యక్ నివేదికను కమిటీలో పరిశీలించకుండా, ఇంత తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ప్రభుత్వం తనకు అధికారం లేకున్నా ఆలోక్ వర్మను తొలగించేసింది. ఆయన సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఆయనకు కోల్పోయిన పదవి ఇచ్చింది. కానీ ఆలోక్ వర్మను రెండురోజుల్లో మళ్లీ తొలగించేశారు. తొలగించే నిర్ణయం తీసుకున్న కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి రోజు ఉన్నారు. మరునాడు ఆయన ప్రతినిధిగా మరో జడ్జిగారు రావడమే కాకుండా ప్రధానితో పాటు ఏకీభవించి ఆలోక్ వర్మ తొలగింపు నిర్ణయాన్ని సమర్థించారు. ఇవి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశాలు. ఈ పరిణామాల్లో ఎక్కడా పారదర్శకత మచ్చుకైనా లేకపోవడం ప్రమాదకరం. జస్టిస్ పట్నాయక్ నివేదికను, సీవీసీ నివేదికను ఎవరు చూశారు? అందులో ఏముంది? వాటి ప్రతులు మల్లిఖార్జున ఖర్గేకు ఎందుకు ఇవ్వలేదు. ప్రధాన మంత్రి, న్యాయమూర్తి అయినా ఆ నివేదికలు చదివారా? అర్థం చేసుకున్నారా? అందులో కొంపముంచే ఆరోపణలు ఏమున్నాయని, ఎందుకు డైరెక్టర్ను తొలగించవలసి వచ్చిందో చెప్పవలసిన బాధ్యత ఆ పెద్దల మీద లేదా? ఇవి చాలా తీవ్రమైన ప్రశ్నలు. నిజానికి ఈ దేశంలో ప్రతిపౌరుడికి తెలియాల్సిన వివరాలు ఇవి. సీబీఐ వంటి అత్యున్నతస్థాయి సంస్థలో అర్ధరాత్రి దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులను ఉన్నట్టుండి, ఏ కారణమూ చెప్పకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెల్లాచెదురుగా విసిరేస్తూ బదిలీలు జరపడం, అందుకోసం నంబర్ వన్, నంబర్ టు స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను పదవిలోంచి తప్పించడం ఆశ్చ ర్యకరమైన పరిణామాలు. ఆ బృందం దర్యాప్తు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఏ కీలకమైన నాయకులను రక్షించడానికి ఈ తతంగమంతా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ -
రాకేష్ ఆస్ధానాపై బదిలీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్గా తొలగించిన ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్ధాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐలో నెంబర్ టూగా ఉన్నరాకేష్ ఆస్థానాను దర్యాప్తు ఏజెన్సీ నుంచి ప్రభుత్వం తప్పించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేసింది. కాగా తనపై నమోదైన అవినీతి కేసుపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు.ఆలోక్ వర్మ పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే ఆస్ధానాపై బదిలీ వేటు పడింది. -
వ్యవస్థల్ని ఇంత పతనం చేయాలా?
సీబీఐలో తాజాగా సాగిన రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. ఇందులో ప్రధాన డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆస్థానా ఆరోపణలను భుజానికెత్తుకుంది. రఫేల్ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్ వర్మ అక్కడ ఉండకూడదు. ఈ పథకంలో విజిలెన్స్ కమిషనర్, సుప్రీం జడ్జి కూడా మోదీకి దన్ను కాస్తూ భాగం కావడం రాజ్యాంగ వ్యవస్థల పరిపూర్ణ పతనానికి గుర్తు. ‘‘నీవు శిక్షణ ఫలితంగా అబ్బిన గుణగ ణాల వల్ల, నీవు జతకట్టిన స్నేహితులను బట్టి, నీలో కొన్ని వర్గ భావాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు నీవు ఇతరుల అభిప్రాయాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు నీవు చెప్పాలనుకున్న నీ మంచి అభిప్రాయాన్ని నిశితమైన నీ తీర్పును ప్రకటించలేవు. శ్రమజీవుల పట్ల తీర్పులు ప్రకటించేటప్పుడు న్యాయమూర్తులకు (జడ్జీలు) ఎదురయ్యే సమస్యే ఇది. నిజానికి నిష్పాక్షికంగా వ్యవహరించగల నీ జడ్జీలెక్కడ? ఈ జడ్జీలు విద్యాధికులైనప్పటికీ, పారిశ్రామిక యాజమాన్యాలు పెరిగిన మూస భావాల్లోనే వారూ పెరుగుతూవచ్చారు. అలాంటప్పుడు ఒక శ్రామికుడు కానీ, ఒక ట్రేడ్ యూనియన్ కానీ, నిష్పాక్షికమైన తీర్పుల్ని ఎలా పొందగలడు? ఈ భిన్న దృక్పథాలు గల వర్గాల్లో ఒకరైన శ్రామికునికి దానికి విరుద్ధమైన వర్గానికి చెందిన మరొకరి (జడ్జి)కి మధ్య నిష్పాక్షిక నిర్ణయం అనేది క్లిష్టమైన విషయం!’’ – సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ స్క్రూటన్, కేంబ్రిడ్జి లా సొసైటీలో ఉవాచ. ‘‘న్యాయమూర్తులనేవారు కూడా ఒక వర్గానికి చెందినవారే. ఫలి తంగా ఆ వర్గ లక్షణాలు వారికి అలవడటం సహజం. జడ్డీలు కూడా ప్రజాప్రయోజనాలను నిర్వచిస్తూ ఉంటారు, అయితే తామేవర్గం నుంచి వచ్చారో ఆ వర్గ భావాలనే వల్లిస్తారు. వారి దృక్పథం నుంచే భాష్యం చెబుతారు’’ – (ప్రొఫెసర్ గ్రిఫిత్ : ‘‘ది పాలిటిక్స్ ఆఫ్ ది జ్యుడీషియరి’’) నేడు దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో, రిపబ్లిక్ రాజ్యాంగం పేరిట ఘటిల్లుతున్న పరిణామాలు దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒక్కటొక్కటిగా పాలక పక్షాలు కూలగొట్టడం వైపుగానే సాగుతున్నాయనిపిస్తోంది. సుమారు 19 ఏళ్ల నాడు భారత సుప్రీం కోర్టు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున (జనవరి 26) సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్ కృష్ణయ్యర్ ధర్మాసన చైతన్యం ప్రజా ప్రయోజనానికి ఎంత ఉపయోగకారిగా ఉందో అంత దుర్వినియోగపడుతోందని చెప్పారు. ఇంతకూ దేశాన్ని ఎదుర్కొంటున్న అసలు సవాలంతా– సుప్రీం కోర్టును భారత ప్రజల సమున్నత స్థాయి వాణిగా మార్చేయడమేనని అదే నిజమైన వ్యవస్థా, ప్రజాస్వామిక పరివర్తన అనీ ఆయన వర్ణించారు. ఈ ప్రజాస్వామిక పరివర్తనా దశకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో మన పాలకులు గాని, వారి సమక్షంలో కొలువు తీరుతున్న న్యాయవ్యవస్థగానీ నడుచుకోగలుగుతున్నాయా? అప్పుడప్పుడూ అవాంఛనీయమైన ఒత్తిళ్లకు కేంద్రపాలకులు (ప్రధానమంత్రితో సహా) న్యాయవ్యవస్థను గురిచేస్తున్నప్పటికీ ఒక మేరకు న్యాయమూర్తులు కొందరు నిభాయించుకుని రాగలుగుతున్నట్లు కన్పిస్తున్నా, తిరిగి ఏదో ఒక దశలో పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పులను పాలకులు లొంగదీసుకునే స్థితికి అలవాడుపడుతున్నారు. ఇందుకు ఇటీవల కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. వీటిలో తాజా ఘటనగా రఫేల్ విమానాల కొనుగోలు కుంభకోణంలో మోదీ (బీజేపీ) ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎదుర్కొన్న అనేక విమర్శలు, చివరికి ఫ్రెంచి మాజీ ప్రెసిడెంట్ హయాంలో అనిల్ అంబానీ ప్రయోజనాలు నెరవేర్చే దసాల్ట్ ఫైటర్ విమానాల కంపెనీతో కుదిర్చిన ‘వియ్యం’ తాలూకు (రూ.30,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్టు) ఒప్పందం రగడ అక్కడితో కూడా ఆగకుండా దాని తాలూకు ప్రకంపనలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పెద్దల దాకా విస్తరించాయి. స్వతంత్ర భారతంలో ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో రాజ్యాంగ విధులను పక్కకు తోసేసి రాజ్యాంగ ప్రధాన బాహ్య శాఖలలో ఒకటైన న్యాయ వ్యవస్థలోనే రాజకీయ పాలనా వర్గం జోక్యం చేసుకోవడానికి, తీర్పులను బలవంతంగానో లేదా నర్మగర్భంగా ‘సన్నాయి నొక్కుళ్ల’ ద్వారానో తారుమారు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలూ, సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంస్థలూ గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయమై బీజేపీ మాజీ మంత్రి అరుణ్ శౌరి పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ లోథా మాట్లాడుతూ చాలా బరువైన సందేశాన్ని అందజేశారు: ‘‘సుప్రీంకోర్టు ప్రస్తుతం నడుస్తున్న దశ, తీరూ వినాశకరమయింది. సుప్రీంను నడపగలిగిన సుప్రీం నాయకత్వం అత్యవసరం. స్వతంత్ర న్యాయస్థానం ఒత్తిళ్లకు రాజీ బేరాలకు అతీతంగా ఉండాలి. అందుకు చొరవ అగ్రస్థానం నుంచే రావాలి. లేనిపక్షంలో దేశ న్యాయ వ్యవస్థే అరాచకం పాలయ్యే సమయం దగ్గర పడుతుంద’’ని హెచ్చరించారు జస్టిస్ లోథా. ఒరిస్సా మెడికల్ ఇనిస్టిట్యూట్ నిర్వహణ నియామకాల్లో ఒక న్యాయమూర్తి అవినీతిని శిక్షించకుండా సమర్థించి రక్షించినందుకు అది పెద్ద వివాదాస్పద సమస్యగా మారినప్పుడు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలో సుప్రీం పాలనా నిర్వహణ శాఖాధికారిగా ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించకుండానే ఆ అధికారాన్ని చట్ట పరిధులకు లోబడి హేతుబద్ధంగా నిర్వహించాలన్న సత్యాన్ని గుర్తింపజేస్తూ నలుగురు సుప్రీం జడ్జీలతో పత్రికా గోష్ఠి నిర్వహించి తొలిసారిగా సుప్రీంలో ప్రజాస్వామిక పద్ధతుల్లో స్పష్టమైన భిన్నాభిప్రాయాన్ని ప్రకటించి చరిత్ర సృష్టించారు. సుప్రీం నిర్వహణలో ఇదొక ఆహ్వానించదగ్గ ప్రజాస్వామ్య మలుపు. ఇక తాజాగా, రఫేల్ కుంభకోణం పూర్వ రంగంలో మొత్తం సీబీఐ– కేంద్ర పాలకవర్గం తేనెతుట్టెంతా కదిలింది. సీబీఐ నాయకత్వంలో రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. అయితే ఇందులో ప్రధాన డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆస్థానా ఆరోపణలను ప్రధానంగా భుజానికెత్తుకుంది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు హత్యలో అమిత్ షా పాత్ర తెరమీదికొచ్చినప్పుడు, తరువాత జస్టిస్ లోయా అనుమానాస్పద మరణం వెనుక గాథ వెల్లడైనప్పుడు అమిత్ షాను ఉదహరిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా మాట్లాడారు, జస్టిస్ లోయా మరణవార్త చుట్టూ పాకిపోయిన అనుమానాన్ని తేలిగ్గా తోసిపుచ్చుతూ లోయా కేసును కాస్తా మూసేయడం న్యాయ శాస్త్రం రీత్యా అనుమతించదగింది కాదని ఆయన చెప్పారు. తీరా ఇప్పుడు ‘వయా రఫేల్’ జరిగిన తంతు– అసలు మోదీ బర్తరఫ్ చేసిన సీబీఐ చీఫ్ డైరెక్టర్ ఆలోక్ వర్మను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తిరిగి పదవిలో ప్రతిష్టించి న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడారు. కానీ రఫేల్ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్ వర్మ అక్కడ ఉండకూడదు. కనుకనే సీబీఐకి పోటీగా కేంద్ర విజిలెన్స్ (నిఘా) కమిషనర్ కేవీ చౌదరి రహస్యంగా ఒక పని నెరవేర్చారని ప్రధాన ప్రతిపక్షం బయట పెట్టింది. ఈ ‘రహస్యం’ ఏమిటి? ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా తప్పించడానికి 17 రోజుల ముందు (అక్టోబర్ 6) సీవీసీ చౌదరి ‘అర్ధరాత్రి మద్దెలదరువు’ అన్నట్టు అకస్మాత్తుగా వెళ్లి వర్మకు ఉద్వాసన ఉత్తర్వును అందజేయడానికి వెళ్లినప్పుడు ఆయనకు సీవీసీ పదవి పరువు కూడా గుర్తుకు రాలేదు. ఈ వ్యవహా రంలో మరో పరువు తక్కువ కార్యం ఏమిటంటే, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ తరఫున ప్రధాని ఆధ్వర్యంలో ఉన్న ‘త్రిసభ్య ఉన్నతాధికార నిర్ణయ సంఘానికి సీనియర్ న్యాయమూర్తి ఎ.కె. సిక్రీని మూడవ సభ్యునిగా నిర్ణయించారు. అయితే ఈ నియామకానికి ముందే ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన పని లండన్లోని అంతర్జాతీయ కామన్వెల్త్ సెక్రటేరి యట్ ఆర్బిట్రేషన్ (తీర్పరి) ట్రిబ్యునల్ సంస్థలో ప్రభుత్వ ప్రతినిధిగా సిక్రీని నియమించడం. ఈ వార్త పొక్కి పోవడంతోనే సిక్రీ లండన్ ట్రిబ్యునల్లో తన నియామకం వార్తను ఖండిస్తూ ప్రకటించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు (పాలకులు) అందరినీ ఎలా ‘నీతిమంతులు’గానో అవినీతిపరులుగానో మూకుమ్మడి ముద్ర ఎలా వేయలేమో పోలీసు అధికారులు సహా యావత్తు అధికార గణాన్ని అలా బదనాం చేయలేం. కానీ ‘నాపై అవినీతి ఆరోపణలను రుజువు చేయండి అవి రుజువూ పత్రంలేని ఆరోపణలు. నాపట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్న స్పెషల్ డైరెక్టర్ వేసిన అభాండాలు’’ అని ఆలోక్ వర్మ సవాలు చేశారు. కనుకనే వర్మను పదవినుంచి బర్తరఫ్ చేస్తూ 2018 అక్టోబర్ 23 నాటి సీవీసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడమే వర్మ వాదనకు బలం అవుతోంది. సీబీఐ స్వతంత్ర సంస్థగా, ఎలాంటి రాజకీయ పాలకుల ప్రలోభాలకు లోనుకాని కేవలం స్టాట్యుటరీ సంస్థగా వర్ధిల్లకుండా పాలకుల ‘చేతి ఎత్తుబిడ్డ’గా ఎదుగుతూ పాక్షిక విచారణలు, శత్రుపూర్వక ఆరోపణలతో ఎలా వ్యక్తులను, ప్రత్యర్థులను పాలకులు వేధిస్తారో– కొందరు న్యాయమూర్తుల్ని, సీబీఐ అధికారులను గత పాతికేళ్లలో తాను కేసుల్నుంచి బయట పడటానికి లేదా జగన్మోహన్ లాంటి యువ ప్రత్యర్థుల్ని అక్రమంగా జైళ్లపాల్జేయడానికీ ఏ మాత్రం వెరవని బాబు లాంటి పయోముఖ విషకుంభాలు నిరూపించాయి. ఇక అలాంటి చరిత్రలు పునరావృతం కావడాన్ని తెలుగు గడ్డపై సహించరాదు. కొందరు జడ్జీలు నేనా కేసును చూడను (నాట్ బిఫోర్) అని తప్పుకుంటారు. జగన్ కేసులో జస్టిస్ లోకూర్, సుప్రీంలో అంబానీ ప్రవేశంతో జస్టిస్ భండారీ ఇలాగే తప్పుకున్నారు. ఈ వైఖరి స్వతంత్ర శక్తికి, నిజాయితీకి అగ్నిపరీక్ష! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న. ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు? అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్లోని ‘కామన్వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా! -
అలోక్ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ శనివారం మీడియా ముందు స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్ వర్మపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అంతేకాకుండా అలోక్ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా కూడా అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్ న్యూస్. అలోక్ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ యజమాని మాటలను పలికే పంజరంలో రామ చిలక’ అంటూ 2013లో వ్యాఖ్యానించినదీ కూడా జస్టిస్ ఆర్ఎం లోధానే. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్ లోధా, జస్టిస్ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందన్నది కోటి రూకల ప్రశ్న. సీవీసీ కూడా పంజరంలో రామ చిలకేనా? వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం కోర్టుకు అందజేసిన పట్నాయక్ నివేదికను సుప్రీం కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపి ఉండకపోవచ్చు. పంపినా పట్టించుకోక పోవచ్చు. నరేంద్ర మోదీకి మంచి విశ్వాసపాత్రుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అలోక్ వర్మ ప్రయత్నించడం, అలోక్ వర్మపైనే రాకేశ్ అస్థాన ప్రత్యారోపణలు చేయడంతో సీబీఐలో ముసలం పుట్టడం, వారిద్దరిని బలవంతపు సెలవుపై మోదీ సర్కార్ పంపించడం, అలోక్ వర్మ తనపై చర్యను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. చదవండి: అలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు -
భయంతోనే ఆలోక్వర్మ బదిలీ: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్గా ఆలోక్ వర్మ కొనసాగితే రఫేల్ కుంభకోణం మొత్తం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అగ్నిమాపక శాఖకు మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పు డూ జరగలేదన్నారు. ఆలోక్వర్మను సీబీఐ డైర్టెకర్గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్ సర్వీస్కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. అస్సాం పౌరసత్వం బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
‘ఎన్నికల సంఘం టీఆర్ఎస్కు తొత్తుగా మారింది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ లిస్ట్లో పొరపాట్లు జరిగాయని స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పిందన్నారు. మరి ఆ తప్పులకు బాధ్యులేవరు.. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేసేంత చిత్తశుద్ధి కూడా లేదంటూ విమర్శించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రజస్వామ్యాన్ని ఫుట్బాల్ అడుకుంటుందని శశిధర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం ఏంటో జనాలకు బాగా అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఓటర్ లిస్ట్లో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే నంబర్ వన్గా ప్రజస్వామ్యన్ని ఎలా ఖూని చేయాలో కేసీఆర్ చూపించారంటూ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : మల్లు రవి సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని మల్లు రవి ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ను ఆఘమేఘాల మీద ఎందుకు ట్రాన్సఫర్ చేశారని ప్రశ్నించారు. రఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే సీబీఐ డైరెక్టర్ను ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. ఆలోక్ వర్మను తప్పించడం వంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థమవుతుందన్నారు. -
ఆలోక్ వర్మ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత పోలీస్ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ శుక్రవారం ప్రకటించారు. ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బదిలీ చేసిన మరుసటి రోజే సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. సీబీఐ అత్యున్నత పదవి నుంచి వర్మను ప్రభుత్వం తొలగించడం ఇది రెండవసారి కావడం గమనార్హం. సీబీఐ చీఫ్గా తనను తప్పించి ప్రభుత్వం అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం విచారణ చేపట్టి తిరిగి ఆలోక్కు సీబీఐ పగ్గాలు అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, అంతకుముందు సీబీఐ చీఫ్గా ఆలోక్కు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ ఆలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాతో విభేదాల నేపథ్యం చివరికి తీవ్ర మనస్ధాపంతో ఆలోక్ వర్మ రాజీనామాకు దారితీసింది.సీబీఐ చీఫ్గా ప్రభుత్వం తనను తప్పించడంపై న్యాయపోరాటంలో ఆలోక్ నెగ్గినా ప్రభుత్వం తిరిగి వేటు వేయడం ఆయనను కలిచివేసింది. -
ఆలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపించడం చెల్లదని, ఆయన్ని ఆ పదవిలో పునర్నియమిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మరునాడే అంటే, గురువారం సాయంత్రం ఆయన్ని ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్ వర్మను ఆ పదవిలో కొనసాగించడం సీబీఐ ప్రతిష్టకే భంగకరం కనుక ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక సర్వీసుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయంతో సీబీఐ ప్రతిష్ట మరింత మసకబారింది. ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ రహస్య నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఎంపిక కమిటీ వర్మపై వేటు వేసింది. ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ మోదీ, జస్టిస్ సిక్రీలు నిర్ణయం తీసుకోగా ఖర్గే వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయం కనుక ఆలోక్ వర్మను బదిలీ చేశారు. సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోదీ ప్రభుత్వం అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? ఆయన అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చుగదా! అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? రాకేశ్ అస్థాన నియమకం నుంచే అనుమానాలు 1984, గుజరాత్ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాకేశ్ అస్థానను 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోదీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా ‘సూపర్కాప్’గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోదీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది. హవాలా కేసులో ముడుపులు ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులు జరపడం తెల్సిందే. అదే రోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై కేంద్రం పంపించింది. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అన్ని సమాధానం లేని ప్రశ్నలే అప్పటి నుంచి అన్ని ప్రశ్నలు, అనుమానాలు తప్ప, ఏ ఒక్కదానికి సరైన జవాబు దొరకడం లేదు. ఎంపిక కమిటీ నిర్ణయం లేకుండా వర్మపై చర్య చెల్లదని అప్పుడే తేల్చి చెప్పాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నాయకత్వంలోని బెంచీ అలా చేయకుండా వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది ? ఎందుకు రహస్య నివేదిక అడిగింది ? అస్థానపై అదే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు? సీవీసీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తప్పని ఎందుకు పేర్కొంది? మళ్లీ మోదీ నాయకత్వంలోని ఎంపిక సమీక్షించే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వర్మను సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది? తాను తెప్పించుకున్న సీవీసీ రహస్య నివేదికను మోదీకి ఎందుకు పంపించింది? అలోక్ వర్మపై చర్య తీసుకున్న మోదీ కమిటీ రాకేశ్ అస్థానపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు ఇప్పుడు స్వచ్ఛంద సెలవుపై వెళ్లారు? హిందూత్వ వాదిగా ముద్రపడిన నాగేశ్వర రావునే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించారు? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం ఎందుకు జరుగుతోంది? ‘సీబీఐ యజమాని మాటలు పలికే పంజరంలో రామ చిలక’గా అభివర్ణించిన సుప్రీం కోర్టే ఎందుకు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. అప్పుడే ప్రభుత్వం సచ్చీలతగానీ, సీబీఐ ప్రతిష్టగానీ తేలేది. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్పూర్కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్కు ఏడురోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
బ్రేకింగ్ : సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ చీఫ్గా అలోక్వర్మకు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. (సీబీఐ చీఫ్గా మళ్లీ అలోక్ వర్మ) సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు సీబీఐ చీఫ్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. (‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ) -
‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ స్థానంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. తన స్థానంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. ఆలోక్ వర్మ కేసులో తీర్పును వెలువరించే బెంచ్లో సీజేఐ కూడా భాగమై ఉన్న కారణంగా కమిటీ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నేతృత్వంలోని ఈ అత్యున్నత కమిటీ ఆలోక్పై నిర్ణయం తీసుకోనుంది. -
నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు
న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్(ఇన్చార్జ్)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్ హోదాలో విధులకు హాజరైన ఆలోక్ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు. -
సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్గా అలోక్వర్మను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నా రు. సుప్రీంకోర్టు ఆక్షేపణలకు ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దేశానికి క్షమాపణ చెప్పి, నైతిక బాధ్యత వహించాలన్నారు. మఖ్దూంభవన్లో పార్టీ నేత చాడ వెంకటరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 20 కోట్ల మంది కార్మికులు రెండు రోజు ల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేశారన్నా రు. అయితే ఈ సందర్భంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని కార్మిక వ్యతిరేక చట్టాలతో సిటిజన్ రిజిస్ట్రేషన్ బిల్లును తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలన్నారు. -
సీబీఐ చీఫ్గా మళ్లీ అలోక్ వర్మ
సంస్థ డైరెక్టర్గా ఆయననుతిరిగి నియమించిన సుప్రీంకోర్టు తొలగించే, బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టీకరణ ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అధికారాలకు కోత రఫేల్ దర్యాప్తు నుంచి మోదీ తప్పించుకోలేరు: రాహుల్ సమతూకం ఉన్న తీర్పు ఇది: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: సీబీఐ అంతఃకలహం కేసులో కేంద్రా నికి మంగళవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను పునఃనియమిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అలోక్వర్మ ఎలాంటి ప్రధాన విధానప రమైన నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలు వరించింది. సీబీఐ చీఫ్ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృ త్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డైరెక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంది. ఈ నెలాఖరుతో అలోక్ వర్మ పదవీకాలం ముగియనుండటంతో మరో వారంలోపు కేసుపై నిర్ణయం తీసుకోవాలని కమిటీని కోర్టు ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవ డం, ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసుల ఆధా రంగా గతేడాది అక్టోబర్ 23 అర్ధరాత్రి కేంద్రం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. ప్రభుత్వం తనను అక్ర మంగా పదవి నుంచి తప్పించిందంటూ అలోక్ వర్మ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అలోక్ వర్మకు మళ్లీ డైరెక్టర్ పదవిని ఇచ్చినప్పటికీ అధికారాలను కోర్టు కత్తిరించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తొలగించలేరు, బదిలీ చేయలేరు.. సీబీఐ డైరెక్టర్ను ఒకసారి నియమించాక ప్రభు త్వం రెండేళ్లలోపు తొలగించడం కుదరదనీ, ఒకవేళ తొలగించాలంటే నియామకం చేపట్టిన అత్యున్నత స్థాయి కమిటీనే ఆ పని చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సంస్థ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆమోదం లేకుండా సీబీఐ డైరెక్టర్ను బదిలీ చేయడానికీ వీల్లేదని కోర్టు పేర్కొంది. అలోక్వర్మపై సీవీసీ ఇంకా విచారణ జరుపు తున్నందున, వారంలోపు సమావేశమై ఈ కేసు ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీని కోర్టు ఆదే శించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిం ది. అయితే తీర్పును జస్టిస్ గొగోయ్ రాసి నప్ప టికీ ఆయన మంగళవారం కోర్టుకు హాజరుకా లేదు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించే అధికారం సీవీసీకి, కేంద్రానికి ఉందా లేదా అన్న దానిపైనే ఈ కేసులో వాద నలు జరిగాయి. పదవి నుంచి అలోక్, అస్థానా.. ఇద్దరినీ కేంద్రం తప్పించినా అలోక్ మాత్రమే కేంద్రంపై కోర్టులో కేసు వేశారు. సీబీఐ డైరెక్టర్పై మధ్యంతర చర్యలు తీసుకునే అధికారాన్నీ ప్రభుత్వానికి చట్టం ఇవ్వలేదనీ, సీబీఐని బయటి ప్రలోభాలు, ప్రభావాలకు దూరంగా ఉంచి స్వేచ్ఛ ఇవ్వగలిగితేనే ఆ సంస్థ ఏ భయం, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయగలదని కోర్టు పేర్కొంది. కాబట్టి సీబీఐ డైరెక్టర్ విధుల్లో ఏ అధికారీ, సంస్థా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ డైరెక్టర్పై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగ్గ తీవ్ర కారణం, ప్రజాప్రయోజనం ఉండాలనీ, ఈ విషయాన్ని పరిశీలించే అధికారం కూడా ఎంపిక కమిటీకే ఉంటుందంది. ప్రభుత్వానికి గుణపాఠం: ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ గుణపాఠమనీ, చెంపదెబ్బ లాంటిదన్నారు. రఫేల్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించను న్నారనే కారణంతోనే అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో కొంత న్యాయం జరిగిందనీ, రఫేల్పై విచారణ నుంచి మోదీ తప్పించుకోలేరని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రధాని, ఆయన కార్యాలయంపై నేరారోపణ చేసినట్లుగా ఉందనీ సీపీఎం, ఆర్జేడీ, పీడీపీ, ఆప్ తదితర పార్టీలు పేర్కొన్నాయి. కాబట్టి మోదీ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అలోక్ వర్మకు తిరిగి పదవి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆయన అధికారా లను తగ్గించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను కాపాడేం దుకు తాము అలోక్, అస్థానాలను సీవీసీ సిఫారసుల ఆధారంగానే సెలవుపై పంపా మనీ, తమ నిర్ణయం పూర్తిగా సదుద్దేశంతో కూడుకున్నదేనని జైట్లీ సమర్థించుకున్నారు. ఇద్దరు అధికారులు గొడవ పడినందున తమ ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేననీ జైట్లీ చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి దురదృష్టకరం అలోక్పై అవినీతి ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీ సీవీసీకి పంపడం, ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి అలోక్ను తప్పించాలంటూ సీవీసీ ఆదేశించేలా పరిస్థితులు రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘సీవీసీ చెబుతున్న దాని ప్రకారం.. అలోక్పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. అయితే అలోక్ సీవీసీకి సహకరించడంపోయి, ఈ ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీకి ఎవరు చేశారో చెప్పాలని కోరా రు. అస్థానాపై ఆరోపణలు చేసేవరకు ఆయన వెళ్లారు. అస్థానాపై అవినీతి ఆరోపణలున్న అనేక కేసులను అలోక్ సీవీసీకి అందించారు. అలాగే అలోక్ వర్మపై అస్థానా ఆరోపణలు చేశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లోనే అలోక్, అస్థానా ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించడం సరైన చర్య అని సీవీసీ భావించి, సీవీసీ చట్టంలోని సెక్షన్–8, 11ల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. సీబీఐ ‘ఫైట్’లైన్! ►2017 అక్టోబర్: సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా రాకేశ్ అస్థానాను నియమించడంపై సీవీసీ ముందు అలోక్ వర్మ అభ్యంతరం. ►2018 జూలై 12: సీబీఐలో ప్రమోషన్లపై జరిగిన సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా అస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ►ఆగస్టు 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి అలోక్ వర్మ, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సానా 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రటరీకి అస్థానా లేఖ. ►అక్టోబర్ 4: సానాను సీబీఐ అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు సానా ఆరోపించారు. ►అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై అస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. ►అక్టోబర్ 23: రాకేశ్ అస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్కు ఏడు రోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న అస్థానాపై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. ►అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో అలోక్, అస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. ►అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్ను నియమించిన సుప్రీంకోర్టు. ►నవంబర్ 12: సుప్రీంకోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. -
సీబీఐ వివాదం : సుప్రీం తీర్పుపై జైట్లీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచన మేరకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపాలనే నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థను పరిరక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో సీవీసీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జైట్లీ చెప్పుకొచ్చారు. సీబీఐ విశ్వసనీయత, నిష్పాక్షిక విచారణను కొనసాగించే క్రమంలో దర్యాప్తు సంస్థ విస్తృత ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వ్యవహరించిందన్నారు. సీబీఐ డైరెక్టర్గా తిరిగి అలోక్ వర్మను నియమించాలని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసిన క్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ తాత్కాలిక చీఫ్గా ఎం నాగేశ్వరరావును నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య విభేదాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం వీరిని సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. -
సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
-
కేంద్రానికి ఎదురుదెబ్బ.. సీబీఐ కేసులో కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, ఆయననే సీబీఐ డైరెక్టర్గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలోక్ వర్మను సెలవులపై పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను కొటివేస్తూ... సీబీఐ డైరెక్టర్పై చర్యలు తీసుకునేముందు అపాయింట్మెంట్ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని పేర్కొంది. అలోక్ వర్మపై ఆరోపణలు ఉన్నందున హైపవర్ కమిటీ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం పేర్కొంది. కమిటీ విచారణ పూర్తి అయ్యి నివేదికను అందించిన తరువాతనే నిర్ణయాలు తీసుకుంటారని ధర్మాసనం తీర్పులో పొందుపరిచింది. అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్ 23న సెలవుపై పంపంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య
న్యూఢిల్లీ: అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ చర్యలు అవసరమవుతాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) పేర్కొంది. తనను సెలవులో పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పెట్టుకున్న పిటిషన్పై గురువారం వాదనలు ముగియగా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నట్లు చెబుతూనే రాత్రికి రాత్రే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీని సంప్రదించకుండా డైరెక్టర్ అధికారాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యా ఉత్తమ ఫలితం సాధించేదిగా, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేసేదిగా ఉండాలి’ అని పేర్కొంది. సీబీఐలో విభేదాలకు జూలైలోనే బీజాలు పడ్డాయన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. సీవీసీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సీబీఐలో సంభవించిన ఆశ్చర్యకర, అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు సీవీసీ విచారణ చేపట్టిందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలు కేసుల విచారణ మానేసి, ఒకరిపై మరొకరు దర్యాప్తు చేసుకోవడం మొదలుపెట్టినందునే కేంద్రం జోక్యం చేసుకుంది. వారిపై దర్యాప్తు చేపట్టే అధికారం సీవీసీకి ఉంది. అలోక్ ఆరోపణలపై విచారణ చేపట్టనట్లయితే, సీవీసీ విధులను నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. దీనిపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు సీవీసీ సమాధానం చెప్పుకోవాల్సి ఉండేది. దర్యాప్తునకు అవసరమైన పత్రాలను సీవీసీకి చాలా రోజుల దాకా అలోక్ వర్మ అందివ్వలేదు’ అని తుషార్ మెహతా అన్నారు. అలోక్ వర్మపై సీవీసీ దర్యాప్తునకు కేంద్రం న్యాయబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆస్తానా తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. సీబీఐ డైరెక్టర్కు రెండేళ్ల పదవీకాలానికి అర్థం అధికారాలు లేని హోదా, విజిటింగ్ కార్డు కాదని అలోక్ వర్మ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ వ్యాఖ్యానించారు. నిర్ణీత పదవీ కాలమైన ఆ రెండేళ్లలో సీబీఐ డైరెక్టర్ ఏం చేసినా కేంద్రం, సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఎక్కడైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం, సీవీసీలకు లేదంటూ లాయర్ ఫాలి ఎస్.నారిమన్తోపాటు కామన్కాజ్ అనే ఎన్జీవో తరఫున వాదించిన దుష్యంత్ దవే పేర్కొనడంపై స్పందించిన ధర్మాసనం.. ‘రెండేళ్ల పదవీ కాలం ఉన్నంత మాత్రాన సీబీఐ డైరెక్టర్ అతీతుడా? ఆయనకు నిబంధనలు వర్తించవా? పార్లమెంట్ ఉద్దేశం ఇదేనా అని నిలదీసింది. సీబీఐ అధికారులను బాధ్యతల నుంచి తప్పించడం/సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వరాదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్ను బదిలీ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉండాలన్నారు. అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్ 23న సెలవుపై పంపిన విషయం తెలిసిందే. -
సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్ కాజ్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. సీబీఐ చీఫ్గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుందని అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సీబీఐలో పరిస్థితులు ఈ ఏడాది జులైలోనే గాడితప్పడం ప్రారంభించాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సెలక్షన్ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్ కమిషన్ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది. సీబీఐ ఉన్నతాధికారులు కేసుల దర్యాప్తును గాలికొదిలేసి వారిద్దరి మధ్య కేసులపై విచారణ చేపడుతున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలను చక్కదిద్దాల్సిన పరిధి విజిలెన్స్ కమిషన్కు ఉందని, లేకుంటే భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టులకు సీవీసీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చిందని, విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించినా నెలల తరబడి వర్మ సంబంధిత పత్రాలను ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసులో తమ క్లెయింట్ ముందస్తు హెచ్చరికలతో వ్యవస్థను మేలుకొల్పేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం ఆయననూ అదే తరహాలో చూస్తోందని రాకేష్ ఆస్ధానా తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ వాదించారు. వర్మపై సీవీసీ విచారణను ప్రభుత్వం ముందుకుతీసుకువెళ్లాలని కోరారు. ఇక రాకేష్ ఆస్ధానా సహా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులను కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ కేసులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్లో ఉంచామని సుప్రీం బెంచ్ పేర్కొంది. -
వారు పిల్లుల్లా పోట్లాడుకున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ సీనియర్ అధికారుల మధ్య వివాదంలో ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సీబీఐ ఉన్నతాధికారులు ఇరువురూ పిల్లుల మాదిరిగా కీచులాడుకున్నారని సుప్రీం బెంచ్ ఎదుట అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. వర్మ, ఆస్ధానాల మధ్య వివాదం తీవ్రస్ధాయికి చేరి బహిరంగ చర్చలా మారిందని ఆయన కోర్టుకు నివేదించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై తీసుకున్న చర్యలు బదిలీ వేటు కాదని, ఆయన విధులను ప్రభుత్వం ఉపసంహరింపచేసిందని కేంద్రం వివరణ ఇచ్చింది. సీబీఐ పట్ల ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టవలసివచ్చిందని వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వర్మను విజిలెన్స్ కమిషన్ ప్రశ్నించడంపై కొన్ని వార్తాపత్రికల క్లిప్పింగ్స్ను కూడా అటార్నీ జనరల్ కోర్టుకు సమర్పించారు. కాగా ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
రెండేళ్లకు ముందే తొలగించలేరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్గా తనను రెండేళ్ల నిర్దిష్ట కాలానికి నియమించారనీ, అంతకుముందే విధుల నుంచి తప్పించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని ఆ సంస్థ చీఫ్ అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత నెలలో డైరెక్టర్ అలోక్ వర్మను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు గురువారం కొనసాగించింది. అలోక్వర్మ తరపున ఆయన న్యాయవాది ఫాలీ నారిమన్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ తదితరులు వాదనలు వినిపించారు. సీబీఐ డైరెక్టర్ను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్ర విజిలెన్స్ కమిషన్కు లేదని నారిమన్ అన్నారు. ‘1997లోనే వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ డైరెక్టర్కు రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది’ అని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం – 1946 ప్రకారం సీబీఐ డైరెక్టర్ను తొలగించాలంటే ఆ అధికారం ఆయనను ఆ పదవికి ఎంపిక చేసిన ప్యానెల్ (ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ)కే ఉంటుందనీ, సీవీసీ ఆదేశాలపై అలోక్ వర్మను తొలగించడం చట్ట విరుద్ధమని నారిమన్ కోర్టుకు తెలిపారు. కేంద్రం చేసిన పనితో వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయిందన్నారు. బదిలీ చేయలేదు, వర్మనే డైరెక్టర్: ఏజీ నారిమన్ వ్యాఖ్యలతో ఏజీ వేణుగోపాల్ విభేదించారు. అలోక్ వర్మ తన అధికారిక బంగ్లాలోనే నివసిస్తున్నారనీ, కాబట్టి ఆయనను కేంద్రం బదిలీ చేసిందని అనుకోవడానికి వీల్లేదన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ కలగజేసుకుని.. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. డీఎస్పీఈ చట్టంలోని నిబంధనలను సీవీసీ, ప్రభుత్వం ఉల్లంఘించజాలవనీ, సీబీఐ డైరెక్టర్ను పదవీకాలం మధ్యలో బదిలీ చేయాలన్నా, తీసేయాలన్నా ఆయనను నియమించిన కమిటీకే ఆ అధికారం ఉంటుందని వివరించారు. విజిలెన్స్ చట్టం కింద అధికారాల్లేకుండానే, నిబంధనలను ఉల్లంఘించి వర్మను విధుల నుంచి కేంద్రం తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈరోజు సీబీఐ డైరెక్టర్కు జరిగినట్లుగానే రేపు కాగ్కు, సీవీసీకి జరగదని భరోసా ఏంటనీ, ఈ ప్రభుత్వానికి చట్టాలపై ఏం గౌరవం ఉందనీ, చట్టబద్ధ సంస్థల స్వతంత్రత ఏమవుతుందని సిబల్ ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తులు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ తాము ఈ కేసులో అలోక్, అస్థానా వర్గాల ఆరోపణల జోలికి పోమనీ, ముందుగా కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించిందా, లేదా అన్న దానిపైనే విచారిస్తామని స్పష్టం చేశారు. సీబీఐలో ఓఎస్డీ నియామకం? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో ప్రస్తుతం డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేడీ నాగేశ్వరరావు ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలువరించడం తెలిసిందే. ఈ కారణంగా సీబీఐలో పాలన సరిగా సాగడం లేదనీ, కాబట్టి సీబీఐలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్లో ఓఎస్డీ (ప్రత్యేక విధులపై నియమితులైన అధికారి)ని నియమించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. ఓఎస్డీ నియామకానికి అయితే∙ప్యానెల్ అనుమతి అవసరం లేదనీ, కాబట్టి ఓఎస్డీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీబీఐ డైరెక్టర్ కేసు ఇప్పట్లో తేలేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తనను విధులను తప్పించి బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడంలేదు. ఆయన పదవీ విరమణ ముగియనున్న జనవరిలోగానైనా సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందా? అన్నది ఇప్పుడు కోటి రూకల ప్రశ్న. అలోక్ వర్మ పదవీ విరమణలోగా తీర్పు వెలువడితే అది తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే తమకు ప్రయోజనం ఉండదని, పైగా అప్పుడు తీర్పు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే అది అలోక్ వర్మకు అప్రయోజనమే అవుతుంది. ఇప్పటి వరకు అలోక్ వర్మ పిటిషన్పై విచారణ జరిగిన తీరే పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. సీబీఐ డైరెక్టర్ విధుల నుంచి వర్మను తప్పించి, బలవంతపు సెలవుపై పంపిస్తూ మోదీ ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నియామకమిటీ అనుమతి లేకుండా కేంద్రం ఏకపక్షంగా తనపై చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ వర్మ అక్టోబర్ 26వ తేదీన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్ను రెండేళ్ల కాల పరిమితికి నియమించేందుకు ప్రధాన మంత్రి, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి సూచించిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టే గతంలో మార్గదర్శకాలను సూచించింది. సీబీఐ డైరెక్టర్ను రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే విధులను తొలగించాలన్న ఈ కమిటీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా తనను తొలగించారన్నదే అలోక్ వర్మ వాదన. హవాలా కేసులో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారంటూ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ కేసు నమోదు చేయడంతో కలహం మొదౖలñ న విషయం తెల్సిందే. అలోక్ వర్మనే ముడుపులు తీసుకుంటారని, తనకు అలాంటి అలవాటు లేదని అస్థాన ప్రత్యారోపణలు చేశారు. దీంతో మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా జోక్యం చేసుకొని ఇద్దరిని విధుల నుంచి తప్పించి బలవంతపు సెలవులపై పంపించింది. రాకేశ్ అస్థాన మోదీకి మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. అలోక్ వర్మ పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచీ అక్టోబర్ 26వ తేదీన విచారణ చేపట్టింది. అలోక్ వర్మను తొలగించడంలో మోదీ ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించిందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాల్సిన బెంచీ అందుకు భిన్నంగా వర్మపై అస్థాన చేసిన ఆరోపణల్లో నిజమెంతో దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివీసీ)’ను ఆదేశించింది. రెండు వారాల తర్వాత సివీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ ఓ సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్ని నియమించింది. సీవీసీ దర్యాప్తుపై అనుమానం ఉంటే అప్పుడే సుప్రీం కోర్టు జడ్జీని నియమించి ఉండాల్సిందని, రెండు వారాల అనంతరం నియమించడం అంటే దర్యాప్తును సాగదీయడానికే కావొచ్చని న్యాయ వర్గాలే అనుమానిస్తున్నాయి. వర్మ పిటిషన్ తదుపరి విచారణ నవంబర్ 12వ తేదీన ఉండగా అదే రోజు ఉదయం సీవీసీ తన నివేదికను సమర్పించింది. నివేదికను పరిశీలించినప్పటీకీ లోతుగా పరిశీలించేందుకు సమయం చాలదంటూ కేసు విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది. ఆరోజున విచారణ చేపట్టాక నివేదిక కొన్ని అంశాల్లో వర్మను ఎక్కువ అభినందించిందని, కొన్ని అంశాల్లో తక్కువ అభినందించిందని, తక్కువ అభినందించిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా వర్మను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఆదేశిస్తూ కేసు విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. నవంబర్ 19వ తేదీనే వర్మ తన సమాధాన పత్రాన్ని సమర్పించారు. సీవీసీ నివేదిక, వర్మ సమాధాన పత్రంలోని పలు అంశాలు ఓ న్యూస్ వెబ్సైట్లో రావడం పట్ల 20వ తేదీ విచారణలో ప్రధాన న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. అసలు కేసునే విచారించమంటూ విసుక్కున్నారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఆ రోజు కూడా ఏ కారణంతో వాయిదా వేస్తారో చూడాలి. -
సీబీఐ ‘లీక్’పై సుప్రీం ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఇచ్చిన సమాధానాలు, సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా వేసిన పిటిషన్లోని అంశాలు బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరెవరో వచ్చి తమకిష్టమొచ్చిన విషయాలను చెప్పేసి వెళ్లిపోయే స్థలం సుప్రీంకోర్టు కాదని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సీవీసీ తరఫు న్యాయవాది సహా ఎవ్వరి వాదనలూ ఇప్పుడు తాము వినదల్చుకోలేదనీ, అలోక్ వర్మ స్పందన, సిన్హా ఆరోపణలు బయటకు పొక్కడంపైనే మాట్లాడతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ‘ఈ రోజు మీరు ఒక్క పదం కూడా మాట్లాడకండి. మేం మీ వాదన వినం’ అని సీజేఐ గొగోయ్ అలోక్ వర్మ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్తో అన్నారు. అలోక్వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ ప్రాథమిక విచారణలోని అంశాలపై గోప్యత పాటించాలని గతంలోనే తాము ఈ కేసులోని కక్షిదారులను కోరామని కోర్టు గుర్తుచేసింది. సీబీఐ నైతికత, గౌరవాలను కాపాడేందుకే తాము ఆ ఆదేశాలిచ్చామనీ, కానీ ఆ విషయాలు మీడియాలో వచ్చాయంది. సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి లంచం తీసుకున్నారనీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై విచారణను అడ్డుకున్నారనీ, న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర మధ్యవర్తిగా వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ విషయాలు బయటకు రావడంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ గౌరవాన్ని కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే కక్షిదారులు అన్నీ బహిరంగంగా చెప్పేస్తున్నారని న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండుసార్లు విచారణ.. మంగళవారం ఉదయం తొలిసారి విచారణ ప్రారంభమైన వెంటనే ‘ద వైర్’ వెబ్సైట్లో వచ్చిన కథనం ప్రతిని అలోక్ వర్మ తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్కు న్యాయవాదులు అందించి, ఆయన స్పంద నను కోరారు. వర్మ తరఫు మరో లాయర్ గోపాల్ శంకరనారాయణన్ సోమవారం వర్మ స్పందనను సమర్పించేందుకు మరికొంత సమయం అడగడాన్ని నారిమన్ ప్రశ్నించారు. తర్వాత కోర్టు ‘విచారణను జరిపించుకునేందుకు మీలో అర్హులున్నారని మేం అనుకోవడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్ని నిమిషాలకే నారిమన్ మళ్లీ కోర్టు లోపలకు వచ్చి విచారణను కొనసాగించాలని కోరడంతో కోర్టు సమ్మతించింది. నారిమన్ వాదిస్తూ ‘ఈ కథనం నవంబర్ 17న ప్రచురితమైంది. ఇది సీవీసీ విచారణలో అలోక్ ఇచ్చిన సమాధానాలకు సంబంధించినది. సీవీసీ విచారణపై స్పందన తెలపాల్సిందిగా అంతకుముందు రోజే కోర్టు వర్మను కోరింది’ అని చెప్పారు. -
అలోక్ వర్మపై అగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
-
సీబీఐ వివాదం : సుప్రీంలో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వివాదంపై విచారణ జుగుప్సాకరంగా మారుతుండటం పట్ల సర్వోన్నత న్యాయస్ధానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్లోని ఓ మంత్రికి ముడుపులు ముట్టాయని, మరో సీబీఐ అధికారిపై దర్యాప్తులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జోక్యం చేసుకుంటున్నారని దర్యాప్తు సంస్థకు చెందిన సీనియర్ అధికారి మనోజ్ కుమార్ సిన్హా చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సిన్హా ఆరోపణలు సంచలనం సృష్టిస్తుంటే దర్యాప్తులో భాగంగా అలోక్ వర్మ ఇచ్చిన సమాధానాలు లీక్ కావడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో సీబీఐ వివాదంపై విచారణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. కాగా, దర్యాప్తులో భాగంగా అలోక్ వర్మ చెప్పిన అంశాలను మీడియాకు లీక్ చేయడం పట్ల సీబీఐ డైరెక్టర్ వర్మ తరపు న్యాయవాది ఫాలి నారిమన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక వార్తాపత్రికల్లో వెలువడ్డ సిన్హా సంచలన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ప్రస్తావించగా నారిమన్ ఈ మేరకు పేర్కొన్నారు. అలోక్ వర్మ కేసుకు సంబంధించిన అంశాలు మీడియాకు లీక్ కావడంపై జస్టిస్ గగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ పిటిషన్లు ఏవీ విచారణార్హమైనవని తాము భావించడం లేదని ఓ దశలో అసహనానికి లోనైన జస్టిస్ గగోయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని నవంబర్ 29న విచారణకు చేపడతామని తదుపరి విచారణను వాయిదా వేశారు. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ చీఫ్ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సీవీసీ నివేదికపై సుప్రీంకు వర్మ వివరణ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ప్రాథమిక నివేదికలోని అంశాలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సోమవారం సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. దీనిపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ మధ్యాహ్నం ఒంటిగంటకు సీల్డు కవర్లో సమాధానం అందజేశారు. అంతకుముందు ఆయన.. సమాధానం ఇచ్చేందుకు మరికాస్త సమయం కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ద్వారా కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. ‘విచారణ తేదీని మేం మార్చట్లేదు. సాధ్యమైనంత తొందరగా మీరు సమాధానమిస్తే, రేపు చేపట్టే విచారణ కోసం దానిని చదవాల్సింది ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వర్మ లాయర్కు తెలిపింది. దీంతో వర్మ..సరిగ్గా ఒంటి గంట సమయానికి తనపై ఆరోపణలకు సంబంధించి వివరణలున్న సీల్డు కవర్ను కోర్టుకు అందజేశారు. -
అసమగ్రంగా సీవీసీ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్కుమార్ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అలోక్ వర్మకు సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ పట్నాయక్కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని అలోక్వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్కాజ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అలోక్ వర్మ చేతికి సీవీసీ నివేదిక ప్రతి
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీవీసీ నివేదిక ప్రతిని వర్మకు అందచేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. నివేదికపై సీల్డ్ కవర్లో సమాధానం తెలపాలని కోరింది. వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలపై సీవీసీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు సీవీసీ న్యాయవాదినైనా తానిప్పటివరకూ దర్యాప్తు నివేదికను చూడలేదని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది తుషార్ మెహతా పేర్కొన్నారు. నివేదికను రూపొందించింది మీరే అయినా దాన్ని మీరు చూడలేదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొనగా, ఓ న్యాయవాదిగా తాను నివేదికను పరిశీలించలేదని మెహతా చెప్పుకొచ్చారు.ఇక నివేదిక ప్రతిని తనకు అందచేయాలన్న రాకేష్ ఆస్ధానా వినతిని ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. -
అలోక్ వర్మకు సీవీసీ క్లీన్చిట్!
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను బలపరిచేలా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారిని కేంద్రం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం, ఆరోపణలపై సీవీసీ విచారణ చేస్తుండటం తెలిసిందే. అలోక్ వర్మపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సీవీసీకి గడువును నిర్దేశించింది. ఈ గడువు పూర్తవ్వడంతో విచారణ నివేదికను శుక్రవారం సుప్రీంకర్టుకు సీవీసీ అందించనుంది. అయితే విచారణలో అలోక్ వర్మకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్కుమార్ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్ బైండింగ్ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు సీల్డ్కవర్లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్ పట్నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్రావ్కు వ్యతిరేకంగా ఎన్జీవో దాఖలు చేసిన కామన్కాజ్ అనే పిల్ను సుప్రీం కొట్టేసింది. -
సీబీఐ వివాదం : సీల్డ్ కవర్లో సుప్రీంకు నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో ప్రాధమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సోమవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సమర్పించింది. నివేదికను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశంపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. ఇక అక్టోబర్ 23న తాను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలపై నివేదికను సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం సైతం రిజిస్ర్టీ తెరిచిఉంటుందని, అయితే నివేదిక సమర్పించే విషయమై రిజిస్ర్టార్కు ఎలాంటి సమాచారం లేదని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై క్షమాపణలు చెబుతూ నివేదిక సమర్పించడంలో తమవైపు నుంచి కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. కాగా, అలోక్ వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది -
సీబీఐ వివాదం : సుప్రీం ముందుకు సీవీసీ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో నిగ్గుతేలిన అంశాలపై సుప్రీం కోర్టు సోమవారం ఆరా తీయనుంది. ప్రాధమిక దర్యాప్తు నివేదికను నేడు సుప్రీం కోర్టు పరిశీలించనుంది. వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలను పాయింట్ల వారీగా అలోక్ వర్మ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన సుప్రీం బెంచ్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తోంది. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణకు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ను సుప్రీం కోర్టు పర్యవేక్షకుడిగా నియమించింది. వర్మపై అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీం ఆయన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, సీవీసీలకు గత నెల 26న నోటీసులు జారీ చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ రగడ : సీవీసీ ఎదుట హాజరైన వర్మ
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఎదుట హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో వర్మ విచారణకు హాజరైనట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. కేవీ చౌదరి నేతృత్వంలో విజిలెన్స్ కమిషనర్లు శరద్ కుమార్, టీఎం భాసిన్, ఇతరులతో కూడిన కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. వర్మపై ఆస్థానా చేసిన ఆరోపణలను రెండు వారాల్లోగా నిగ్గుతేల్చాలని సుప్రీం కోర్టు గత నెల 26న సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం వర్మ గురువారం సైతం విజిలెన్స్ ఉన్నతాధికారులు చౌదరి, కుమార్లను కలిసిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ వర్మపై ఆస్ధానా చేసిన ఆరోపణలకు సంబంధించి పలువురు సీబీఐ అధికారులను సీవీసీ ప్రశ్నించినట్టు సమాచారం. సీబీఐలో ఇన్స్పెక్టర్ స్ధాయి నుంచి ఎస్పీ వరకూ పలువురు సిబ్బందిని విచారించి సీవీసీ సీనియర్ అధికారి సమక్షంలో వారి వాదనలను సీవీసీ రికార్డు చేసింది. మొయిన్ ఖురేషీ ముడుపుల కేసు, లాలూ ప్రసాద్ ప్రమేయం ఉన్న ఐఆర్సీటీసీ స్కామ్ సహా పలు కేసులను విచారించిన అధికారుల స్టేట్మెంట్లను సైతం సీవీసీ రికార్డు చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సీవీసీని కలిసిన సీబీఐ డైరెక్టర్ వర్మ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురువారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. విజిలెన్స్ కమిషనర్ శరద్ కుమార్తో వర్మ భేటీ అయ్యారని సీవీసీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం సీవీసీ కార్యాలయానికి వెళ్లిన అలోక్ వర్మ దాదాపు రెండు గంటలపాటు అక్కడ ఉన్నారు. వర్మపై అస్తానా చేసిన లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణను చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సీవీసీని గత నెల 26వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘సీబీఐ వార్’లోకి కాంగ్రెస్
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం(డీఎస్పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్ను ఎంపికచేసే హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు అలోక్ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా. డైరెక్టర్ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తికి బెయిల్ నిరాకరణ సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ప్రసాద్ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్ పిటిషన్తో కోర్టు విభేదించింది. అక్టోబర్ 17న అరెస్టయిన ప్రసాద్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్కు అక్టోబర్ 31నే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ చీఫ్ తొలగింపు.. సుప్రీంకు కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం, తదుపరి ఘటనలు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సీబీఐ చీఫ్ అలోక్ వర్మను సెలవుపై ఇంటికి పంపిచడం, ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా సీబీఐ డైరెక్టర్ను అలోక్ వర్మను సెలవుపై ఇంటికి పంపించడాన్ని కాంగ్రెస్ పార్టీ శనివారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సీబీఐ చీఫ్ను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ డైరెక్టర్కు రెండేళ్ల నిర్ణీత పదవీకాలం ఉంటుందని, సెలక్షన్ కమిటీ ఆమోదం లేకుండా డైరెక్టర్ను తప్పించడం, ట్రాన్స్ఫర్ చేయడం చట్ట విరుద్దమని తెలిపారు. సెలక్షన్ కమిటీలో ఉండే ముగ్గురు సభ్యులలో ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ జస్టిస్లతో పాటు తాను సభ్యుడినని, కానీ కేంద్ర విజిలెన్స్ కమిషన్తో కలిసి సీబీఐ చీఫ్ను తొలగించేలా కుట్ర పన్నారని ఆరోపించారు. కేంద్రం, విజిలెన్స్ కమిషన్ సీబీఐ చీఫ్ను తప్పిస్తూ రాత్రికిరాత్రి తీసుకున్న నిర్ణయం అక్రమమని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేలా కేంద్రం జోక్యం చేసుకుందని మండిపడ్డారు. అసలేం జరిగింది.. గత కొన్నేళ్లుగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాకేశ్ ఆస్థానా లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మ ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇక అరెస్టును తప్పించుకోవడానికి రాకేష్ ఆస్థానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలిద్దరినీ సెలవుపై ఇంటికి పంపింది. చదవండి: ఇదెక్కడి న్యాయమో ‘సుప్రీం’కే తెలియాలి! సీబీఐలో మిడ్నైట్ డ్రామా -
సీబీఐ డైరెక్టర్గా తెలుగువాడెలా అయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సంక్షోభ పరిస్థితులను సకాలంలో చక్కదిద్దే సమర్థుడు’గా పలు బిరుదులతోపాటు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద పోలీసు అధికారి మన్నెం నాగేశ్వరరావును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్గా నియమించడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. అంతుచిక్కని ఆయన నియామకం వెనకనున్న అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తెలుగువాడైన మన్నెం నాగేశ్వర రావు 1986 ఒడిశా క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 1994లో ఒడిశాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మత మార్పిడులకు వ్యతిరేకంగ, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించవద్దంటూ కరపత్రాలు పంచారట. 1998లో ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ముస్లింలు, క్రైస్తవులు సహనం ఏమాత్రంలేని హింసోన్మాదులు. మెజారిటి హిందువుల పన్నుల చెల్లింపులతో ఈ మైనారిటీలు బతుకుతున్నారు. ఇదీ మానవ హక్కులను ఉల్లంఘించడమే. అసలు భారత రాజ్యాంగ నిర్మాతలే మైనారిటీ పక్షపాతులు’ అని ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై అప్పటి ఒడిశా సీపీఎం కార్యదర్శి అలీ కిశోర్ పట్నాయక్ హైకోర్టులో కేసు వేయడంతో బరంపురం నుంచి నాగేశ్వరరావును బదిలీ చేశారు. 2008లో కాందమల్ అల్లర్లు చెలరేగినప్పుడు ఒడిశాలో నాగేశ్వరారావు సీఆర్పీఎఫ్ ఇనిస్పెక్టర్ జనరల్గా పనిచేశారు. క్రైస్తవుల సెటిల్మెంట్లపై కాషాయ దళాలు దాడులు జరిపి మారణ కాండను సష్టిస్తుంటే సీఆర్పిఎఫ్ దళాలను అటు వెళ్లకుండా నివారించారని పట్నాయక్ ఆరోపించారు. పైగా ఆ అల్లర్ల సందర్భంగా ‘క్రైసెస్ మేనేజర్’గా పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఒడిశాలో నేరప్రదేశంలో నేరస్థుల డీఎన్ఏను సేకరించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఆయన కాస్త మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో అగ్నిమాపక సిబ్బంది యూనిఫామ్ల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒడిశా ఆర్థిక శాఖ విచారణ చేపట్టింది. ఓపక్క విచారణ కొనసాగుతుండగానే అదే ఏడాది ఆయన సీబీఐ కేంద్ర కేడర్కు బదిలీపై వెళ్లారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ ఇంటలెజెన్స్ విభాగం పూర్తి ప్రతికూల నివేదికను ఇచ్చినా కేంద్ర పాలకులు పట్టించుకోలేదు. అందుకు హిందూత్వ వాదే కాకుండా ఆరెస్సెస్ ప్రచారక్, ప్రస్తుత బీజేపీ వ్యూహకర్త రామ్మాధవ్కు ఆయన మంచి మిత్రుడవడం కూడా కారణం కావచ్చు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమితులుకాగానే గుజరాత్ క్యాడర్కు చెందిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు సహా మొత్తం 13 మంది అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించిన విషయం తెల్సిందే. -
రాయని డైరీ: సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
వ్యక్తుల్ని సెలవుపై పంపించగలం. వాళ్ల నిజాయితీని సెలవుపై పంపించగలమా? అలోక్ వర్మని సెలవుపై పంపించినప్పుడు.. మోదీజీ అసలు దేశంలోనే ఉంటున్నారా అనే సందేహం కలిగింది నాకు. దేశాధినేతలతో కలిసి ప్రీతికరమైన ఆహారాన్ని ఆరగించడానికే నాలుగున్నరేళ్లుగా ఆయన సమయం సరిపోతోంది! అలోక్ ఎంత ఆనెస్టో నాకు తెలుసు. ఎవరి ఇంటికైనా వెళితే కనీసం మంచినీళ్లు కూడా తాగరాయన. మంచినీళ్లు తాగినందుకు ప్రతిఫలంగా.. ‘మంచిది కాని సహాయం’ ఏదైనా ఆ ఇంటì వాళ్లకు చెయ్యవలసి వస్తుందేమోనని ఆయన భయం! సీబీఐకి ఇలాంటి వాళ్లే కదా డైరెక్టర్లుగా ఉండాల్సింది? కానీ ఏం జరిగింది? నీళ్లయినా ముట్టని సీబీఐ ఆఫీసర్కి తన ఆఫీస్లోనే నీళ్ల గ్లాసు లేకుండా చేశారు. నీళ్లుంచి గ్లాసు తీసేయడమూ, పదవి ఉంచి సెలవుపై పంపించడమూ.. రెండూ ఒకటే. అవినీతిపరుడైన అస్థానాతో పాటు, నిజాయితీపరుడైన అలోక్నీ సెలవుపై పంపించగానే.. మోదీజీకి వివరంగా ఒక బహిరంగ లేఖ రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది నాకు. అలా కాకుండా ‘టు’ అడ్రస్ పెట్టి నేరుగా మోదీజీకే లేఖ పంపిస్తే ఒక ప్రమాదం ఉంది. అరుణ్ జైట్లీ ఆ లేఖను మధ్యలోనే అందుకుని ముక్కలుముక్కలుగా చింపేసి, ఆ ముక్కల్ని నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తాడు. అలాక్కూడా కాకుండా నేనే స్వయంగా పీఎంవో ఆఫీస్కి వెళ్లి మోదీజీతో మాట్లాడాలనుకున్నా.. అప్పుడు కూడా జైట్లీనే అడ్డు పడతాడు. ఆర్థికశాఖ నాకు రాకుండా అడ్డుకున్న మనిషికి, ఏ శాఖా లేని వట్టి రాజ్యసభ సభ్యుడిని అడ్డుకోవడం ఏమంత కష్టం! బహిరంగలేఖను ఎలా మొదలుపెట్టాలో తేల్చుకోలేక రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనే ఉన్నాను. ‘డియర్ మోదీజీ’ అనాలా? ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అనాలా? ‘రెస్పెక్టెడ్ మోదీజీ’ అనాలా? చివరికి ఒకటనిపించింది. దేశాధినేతలు మోదీజీకి పంపే ఆహ్వాన పత్రాలపై ఉన్నట్లు.. ‘ఆనరబుల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్’ అని ప్రారంభిస్తే!! అప్పుడైతే ఆయన ఆసక్తిగా చూసే అవకాశాలుంటాయి. కరప్షన్పై పని చేస్తున్న మోదీజీ, కరప్షన్ పైనే పనిచేస్తున్న ఒక సీబీఐ ఆఫీసర్ని కరప్షన్పై కంప్లయింట్ చేసినందుకు సెలవిచ్చి పంపడం కూడా కరప్షనేనని బహిరంగ లేఖలో రాయాలి. ఈ స్టెయిల్ ఆఫ్ రైటింగ్ మోదీజీకి నచ్చుతుంది. లెటర్ మొత్తమంతా ఇలాగే రాయగలిగితే ఆయన లెటర్ మొత్తమంతా ఇంట్రెస్టుగా చదవగలుగుతారు. ఇంకో పేరాలో.. ‘‘మోదీజీ, మీరిలాగే మంచిమంచి సీబీఐ ఆఫీసర్లని సెలవుపై పంపించేస్తుంటే.. నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యాలు.. దసరా సెలవులకో, దీపావళి సెలవులకో, కోర్టు సెలవులకో వెళ్లినట్లుగా వెళ్లి, విదేశాల్లోనే ఉండిపోతారు. అప్పుడిక కరప్షన్ చేసినవాళ్లు దేశంలో ఉండరు. కరప్షన్ జరక్కుండా చూసేవాళ్లు దేశంలోని సీబీఐ ఆఫీసులలో ఉండరు’’.. అని రాయాలి. అలోక్ని చేసినట్లే, రాజేశ్వర్ సింగ్నీ టార్గెట్ చేయబోతున్నారని నాకు అనిపిస్తోంది. సీబీఐలో అలోక్ ఎలాగో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో రాజేశ్వర్ అలాగ. కుర్రాడు. స్మైలింగ్ ఫేస్. చిదంబరం కరప్షన్ కేసుల్ని డీల్ చేస్తున్నది అతడే. అతడిని తప్పించి, చిదంబరాన్ని కేసుల నుంచి తప్పించాలని బీజేపీలోనే కొందరు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే సోనియా మీద, రాహుల్ మీద, చిదంబరం మీద, శశి థరూర్ మీద.. ఇంకా కాంగ్రెస్ వాళ్ల మీద నేను పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకుంటానని మోదీజీకి రాసే బహిరంగ లేఖలోని చివరి పేరాలో చిన్న పంచ్ ఇవ్వాలి. మాధవ్ శింగరాజు -
ఇదెక్కడి న్యాయమో ‘సుప్రీం’కే తెలియాలి!
సాక్షి, న్యూఢిల్లీ : న్యాయం కోసం వెళితే న్యాయమే వెంటాడిందంటే ఇదేనేమో! ‘అయ్యా ! కేంద్రం అనవసరంగా అర్ధంతరంగా నన్ను సెలవుపై పంపించిందీ, ఇది అన్యాయం’ అంటూ సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనపై కేంద్రం చర్య తీసుకోవడం సబబా, కాదా? అన్న అంశాన్ని తేల్చాల్సిన సుప్రీం కోర్టు, ఆ విషయాన్ని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలకు సంబంధించి వర్మపై రెండు వారాల్లోగా ప్రాథమిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ను శుక్రవారం ఆదేశించింది. విచారణను సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని, అంతవరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు రోజువారి కార్యకలాపాలను చూడాలే తప్ప ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా దాఖలైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం, ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను బలవంతంగా సెలవుపై పంపిస్తూ అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. హవాలా కేసులో నిందితుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై అస్థానాపై వర్మ ఎఫ్ఐఆర్ నమోదు చేశాకనే, వర్మ కూడా అవినీతికి పాల్పడ్డారంటూ అస్థానా ఆరోపణలు చేయడం తెల్సిందే. అవి కేవలం కౌంటర్ ఆరోపణలు మాత్రమే. వర్మపై ఎలాంటి అవినీతి ఆరోపణలు మరెక్కడి నుంచి రాలేదు. సీబీఐ డెరెక్టర్ను రెండేళ్ల కాలపరిమితి తీరేవరకు తొలగించడానికి వీల్లేదంటూ 1997 నాటి వినీత్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తొలగించాల్సిన అత్యవసర పరిస్థితులు తలెత్తుతే నియామక కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ స్పష్టం చేస్తోంది. సీబీఐ డైరెక్టర్ను నియమించే కమిటీ అంటే, ప్రధాన మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడా కమిటీ అన్నది తెల్సిందే. ఈ కమిటీ అనుమతి లేకుండానే సీబీఐ డైరెక్టర్పై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఈ చర్యను తప్పు పట్టాల్సిన సుప్రీం కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా వర్మపైనే విచారణకు ఆదేశించడం అసాధారణం. అస్థానపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులందరిని తాత్కాలిక నియామకంపై వచ్చిన నాగేశ్వరరావు అర్ధంతరంగా బదిలీ చేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరం. సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖకు మాత్రం సీబీఐ డైరెక్టర్పై దర్యాప్తునకు ఆదేశించామంటూ సుప్రీం కోర్టు మొక్కుబడిగా ఓ నోటీసును పంపించింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. -
ఢిల్లీలో రాహుల్ అరెస్టు, విడుదల
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఢిల్లీ లోధి రోడ్లోని దయాళ్సింగ్ కళాశాల నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయం వరకు అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించింది. పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్తో పాటు సుమారు 130 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, భూపిందర్సింగ్ హూడా, అహ్మద్ పటేల్, మోతిలాల్ వోహ్రా, వీరప్ప మెయిలీ, ఆనంద్ శర్మలతో పాటు శరద్ యాదవ్(లోక్తాంత్రిక్ జనతాదళ్), డి.రాజా(సీపీఐ), నదిముల్ హక్(టీఎంసీ) తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీబీఐలో అనూహ్యంగా జరిగిన అధికార మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పట్నా, హైదరాబాద్, గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్ తదితర పట్టణాల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగారు. చండీగఢ్లో ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. నిజం దాగదు.. అంతకుముందు, లోధిరోడ్లో ర్యాలీకి హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అన్ని సంస్థల్ని ఎన్డీయే నాశనం చేస్తోందని మండిపడ్డారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ..రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. మోదీ విచారణ నుంచి పారిపోతున్నా, సీబీఐ డైరెక్టర్ను పదవి నుంచి తొలగించినా నిజం మాత్రం దాగదని తేల్చిచెప్పారు. ‘చౌకీదార్(మోదీని ఉద్దేశించి) దొంగతనానికి పాల్పడటాన్ని అనుమతించం. వైమానిక దళం, యువత నుంచి ఆయన డబ్బు దొంగిలించిన సంగతి దేశం మొత్తానికి తెలుసు. మోదీ విచారణ నుంచి పారిపోయినా, నిజం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. నిజమేంటో ప్రధానికి చూపడానికే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం నిజాన్ని బంధించలేదని పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన, తాను జైలులో కూర్చున్నప్పటి ఫొటోలను రాహుల్ ట్వీట్ చేశారు. -
సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావుపై ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారంది. అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. డైరెక్టర్ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వంపై పైచేయి కాదు.. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్ పిటిషన్పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది. సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలంటూ కామన్కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్నూ ఇదే బెంచ్ విచారించింది. ఈ పిటిషన్పై నవంబర్ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్, అలోక్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది. సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి అలోక్ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు. సానుకూల పరిణామం: జైట్లీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు. నిజం నిలిచింది: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు. ‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అనంగ కుమార్ పట్నాయక్ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు. కోల్కతాలోని అమెరికన్ సెంటర్పై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్ అన్సారీ, జములుద్దీన్ నజీర్లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్లో పట్నాయక్ సభ్యుడు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి శ్రీనివాసన్ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్ సభ్యుడే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ వివాదం పూర్వాపరాలు.. 2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ నియామకం. అక్టోబర్ 22: సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా రాకేశ్ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం. నవంబర్ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్ ప్రశాంత్ భూషణ్. పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. 2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ. ఆగస్టు 24: అలోక్పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం. సెప్టెంబర్ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ. అక్టోబర్ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అక్టోబర్ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్ అరెస్ట్. అక్టోబర్ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించిన కేంద్రం. అక్టోబర్ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్. అక్టోబర్ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన -
కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్ ఐపీఎస్ క్యాడర్కు చెందిన రాకేశ్ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎందుకు సవాల్ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ? సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాశ్ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్ నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్ల్యాండ్’ రక్షణ కుంభకోణం, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్కు నాయకత్వం వహించిందీ అశోక్ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే. అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసును కూడా 2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్గా పనిచేస్తుండగా, అభయ్ డిప్యూటీ పోలీసు కమిషనర్గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అభయ్ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది. అద్వానీతో పరిచయం లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట. ఢిల్లీకి పిలుపు.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్ బయోటెక్’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. 3.83 కోట్ల ముడుపులు స్టెర్లింగ్ బయోటెక్ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ వర్గాలే స్పాన్సర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈడీ దాడులతో స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్ సండేసర ఆస్తులపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్ వర్మ అక్టోబర్ 15వ తేదీన అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్కు లేఖ రాశారు. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్ అలోక్ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి. -
అలోక్ వర్మ పిటిషన్ : సీబీఐ, సీవీసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చూస్తూ సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని సీవీసీని ఆదేశించింది. విచారణకు మూడు వారాల గడువు కావాలన్న సీవీసీ అభ్యర్ధనలను తోసిపుచ్చింది. అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాలపై విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షిస్తారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐ నూతన చీఫ్గా నియమితులైన ఎం. నాగేశ్వరరావు కేవలం పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, ఎలాంటి విధాన నిర్ణయాలను తీసుకోరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది. కాగా, తనను అకారణంగా సెలవుపై పంపుతూ, తన స్ధానంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావును డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని అలోక్ వర్మ తన పిటిషన్లో సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు. వర్మ పిటిషన్ను నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన బెంచ్ విచారణకు చేపట్టింది. సీబీఐ చీఫ్ దాఖలు చేసిన పిటిషన్ను తక్షణమే విచారణకు చేపట్టాలని అలోక్ వర్మ తరపు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, విజిలెన్స కమిషన్ తనను సీబీఐ చీఫ్గా తప్పిస్తూ రాత్రికిరాత్రి తీసకున్న నిర్ణయం అక్రమమని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేలా కేంద్రం జోక్యం చేసుకుందని అలోక్ వర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘సిట్’ పిటిషన్కు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల బెంచ్ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్కు తెలిపింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్ కోర్టును కోరారు. కేబినెట్ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. దురుద్దేశపూర్వకం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ‘రాకేష్ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్గా నియమించినప్పుడే అలోక్ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్ 2017 అక్టోబరు 21న కేబినెట్ కన్సల్టేషన్ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్, సందేసర గ్రూప్ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
అలోక్ వర్మ ఇంటిపై ఇంటెలిజెన్స్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు. ‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. భయాందోళనలో ప్రధాని: రాహుల్ ఫ్రాన్స్తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్మన్గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీబీఐ జగడంపై విచారణ నేడే సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. రాజకీయంగా కూడా కీలకం.. సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది. అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు. -
సీబీఐ ప్రతిష్టను దిగజార్చడం కాదా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకే ఇరువురు సిబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఐ సంస్థాగత రుజువర్తన, విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య తీసుకోక తప్పడం లేదు’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు నాటకీయంగా సీబీఐ కార్యాలయంపై దాడిచేసి, తనిఖీలు నిర్వహించడం, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ డిప్యూటీ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపించే ఉత్తర్వులను సర్వ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రస్థావనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ తీసుకరావడానికి సందర్భం ఉంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ రాజకీయ సానుకూలత చూపించడమే కాకుండా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ అస్థానా గత ఆగస్టు 24వ తేదీన కేంద్ర విజిలెన్స్ కమిషన్కు ఓ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకొనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇరువురిని సెలవుపై పంపించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసినట్లు అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. 1988 అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ డైరెక్టర్పై కేసు నమోదైన పక్షంలోనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. లేనట్లయితే జోక్యం చేసుకోకూడదు. అలోక్ వర్మపై ఎలాంటి అవినీతి కేసు దాఖలు కాలే దు. అలాంటప్పుడు విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు జోక్యం చేసుకొంది? అసలు జోక్యం చేసుకుందా? ప్రభుత్వమే విజిలెన్స్ కమిషన్ను ఓ సాకుగా వాడుకుందా? ఇక సీబీఐ డైరెక్టర్ పదవి రెండేళ్లు ఉంటుంది. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ఆయన్ని విధుల నుంచి తప్పించడానికి వీల్లేదు. అయినా చర్య తీసుకోవాల్సినంత తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం అయితే 2013 నాటి లోక్పాల్ చట్టం ప్రకారం ‘సెలక్షన్ కమిటీ’ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన సుప్రీం కోర్టు జడ్జీ సభ్యులుగా ఉంటారన్న విషయం తెల్సిందే. ‘సెలక్షక్ కమిటీ’ అనుమతి లేకుండానే సీబీఐ అధికారులపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ స్పష్టం అవుతుంది. కేంద్రం ఆదేశాల మేరకు అర్ధరాత్రి సీబీఐ కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టడం, డైరెక్టర్ ఆఫీసును తనిఖీ చేయడం, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ వస్తూ రాగానే పాత డైరెక్టర్ అనుచరులుగా భావించిన 13 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం తదితర పరిణామాలు సీబీఐ ప్రతిష్టను నిలబెట్టేవా, మరింత దిగజార్చేవా? -
పట్టుబడింది ఐబీ అధికారులే..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ నివాసం ఎదుట పట్టుబడిన నలుగురు వ్యక్తులు తమ అధికారులేనని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గురువారం అంగీకరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ గస్తీలో భాగంగానే వారు అక్కడ విధుల్లో ఉన్నారని వివరణ ఇచ్చింది. అంతర్గత భద్రత పర్యవేక్షణ, శాంతిభద్రతలకు విఘాతం వంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించే క్రమంలో ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించే బాధ్యతను ఆ నలుగురు అధికారులకు అప్పగించారని ఐబీ వర్గాలు వెల్లడించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ ఐబీ అధికారులను నియోగిస్తారని, స్ధానిక పోలీసుల సహకారంతోనూ వీటిని చేపడతారని తెలిపాయి. తమ పరిశీలనలో తేలిన విషయాలను స్ధానిక పోలీసులకు చేరవేస్తే వారు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఐబీ ఐడీ కార్డులతోనే వారు డ్యూటీలో ఉన్నారని, గురువారం ఉదయం ఐబీ యూనిట్ జన్పథ్ వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటంతో అక్కడ ఆగిందని, దీంతో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి. మరోవైపు నలుగురు ఐబీ అధికారులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారన్న వార్తలను ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తోసిపుచ్చారు. -
అలోక్ వర్మ నివాసం వద్ద కలకలం
-
వర్మ నివాసం వద్ద నలుగురు అనుమానితుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ఉన్నతాధికారుల మధ్య విభేదాల నేపథ్యంలో సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచిరిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం ఉదయం సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను సెలవుపై పంపిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వీరు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులను ధరించి ఉన్నట్టు గుర్తించారు. వర్మ నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న అనుమానితులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను సమర్పించేందుకు ఆయన సహకరించడంలేదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆరోపించింది. కమిషన్ విధినిర్వహణను ఉద్దేశపూర్వకంగా వర్మ అడ్డుకున్నారని తేటతెల్లమైందని సీవీసీ స్పష్టం చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్ధానా దర్యాప్తు ఏజెన్సీ విచారణలకు ఆటంకాలు కల్పిస్తున్నారని వర్మ ఆరోపించారు. -
సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ : సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి సీబీఐ చీఫ్గా నియమించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ప్రముఖ కాంగ్రెస్ నేతలు నిరసనల్లో పాల్గొంటారు. రాష్ట్ర రాజధానుల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట పార్టీ రాష్ట్ర చీఫ్లతో పాటు, రాష్ట్రస్ధాయి నేతలు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గంటారు. సీబీఐ డైరెక్టర్ను అక్రమంగా, రాజ్యాంగవిరుద్ధంగా సెలవుపై పంపడం పట్ల ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిష్ట్మాతక దర్యాప్తు ఏజెన్సీలో వివాదాలతో కీచులాడుకుంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికి రాత్రి సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. వర్మ స్ధానంలో తెలుగు వ్యక్తి ఎం నాగేశ్వరరావును నూతన సీబీఐ చీఫ్గా కేంద్రం నియమించింది. మరోవైపు తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. -
రఫేల్ భయంతోనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటుచేసుకుంటున్న అవినీతి బయటపడుతున్నందున భయంతోనే అలోక్ను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రఫేల్ కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలను అలోక్ సేకరిస్తున్నందునే ఆయనపై వేటు పడిందన్నారు. రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రధాని సందేశం చాలా స్పష్టంగా ఉంది. రఫేల్కు ఎవరు దగ్గరగా రావాలని ప్రయత్నించినా వారు పదవి కోల్పోతారు. తుడిచిపెట్టుకు పోతారు’ అని ఆరోపించారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘రఫేల్లో ఫోబియా’ కారణంగానే అలోక్ను మోదీ తప్పించారన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. మోదీకి ఇష్టుడైన అస్థానాను కాపాడటం కోసమే అలోక్ను కూడా కేంద్రం తప్పించిందని ఆరోపించారు. -
మోదీ, బాబు మధ్య యుద్ధం ఉత్తుత్తిదే.. ఇదిగో రుజువు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్గా నాగేశ్వర రావు నియామకం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సీబీఐలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాల మధ్య విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ సెలవుపై పంపిన ప్రభుత్వం.. సీబీఐ కొత్త డైరెక్టర్గా జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఎం నాగేశ్వర రావును నియమించింది. సీనియారిటీలో తనకన్నా ముందున్న అధికారి ఏకే శర్మను కాదని, నలుగురు జాయింట్ డైరక్టర్లలో ఒకరైన, చెన్నై జోన్ బాధ్యతలు చూస్తున్న నాగేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించడంపై న్యూఢిల్లీ రాజకీయ వర్గాల్లో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నాగేశ్వర రావుపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని.. ఇప్పటికే అలోక్వర్మ, అస్థానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్న సీబీఐ చీఫ్గా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారిని అధిపతిగా నియమించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా ఇవే అంశాలను లేవనెత్తుతూ.. ‘నాగేశ్వర రావుపై వచ్చి న అవినీతి ఆరోపణలపై డైరెక్టర్ హోదాలో విచారణ జరిపిన అలోక్ వర్మ.. నాగేశ్వర రావును సీబీఐ నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు సిఫారసు చేశారు. కానీ సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆయననే సీబీఐ డైరెక్టర్గా నియమించారు’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి అంతర్గత విచారణ, వ్యక్తిత్వ మదింపు జరపకుండానే నాగేశ్వర రావును నియమించడాన్ని సీబీఐలోనే కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పక్కా రాజకీయ నియామకమేనని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, నాగేశ్వర రావు నియామకం వెనుక రాజకీయ కోణం ఒకటి బయటపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు, పార్టీలోని కొందరు కీలక నేతలకు నాగేశ్వర రావు అత్యంత సన్నిహితుడని పేరు. టీడీపీలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలున్నాయి. విచారణ దశలో పలు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి సన్నిహితుడైన అధికారిని అత్యున్నత దర్యాప్తు సంస్థకు చీఫ్గా కేంద్రం నియమించడంలో లోగుట్టేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంపై, ప్రధాని మోదీపై అవకాశం లభించిన ప్రతీసారి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం వెనక మతలబేంటనే చర్చ జరుగుతోంది. ‘మోదీ– బాబు వార్ ఉత్తుత్తి యుద్ధమే.. పై పై ప్రచారమే.. అవసరమైతే, అవకాశం లభిస్తే మోదీతో కలిసి నడిచేందుకు బాబు సిద్దంగానే ఉంటారు. పట్టువిడుపులకు మోదీ కూడా రెడీనే. సీబీఐ చీఫ్గా నాగేశ్వర రావు నియామకం దీన్నే రుజువు చేస్తోంది’ అని ఢిల్లీ– అమరా వతి రాజకీయాలపై పట్టున్న ఓ రాజకీయ విశ్లేషకు డు అన్నారు. ‘మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు లభించే ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోడని, నాగేశ్వర రావు నియామకంపై విపక్షాలు పెద్దగా రాద్ధాంతం చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరెత్తకపోవడం అందులో భాగమేనని, సయోధ్య కోసం బీజేపీ ఒక అడుగేస్తే.. బాబు నాలుగడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య గమనార్హం. చదవండి: ఆపరేషన్ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్క్వార్టర్స్లో తిష్టకు టీడీపీ కుట్ర! -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్బ్లెయిర్కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్పూర్కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం విచారించనుంది. హెడ్క్వార్టర్స్లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
నాగేశ్వర్ రావు ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్నర్సాపూర్ గ్రామం. 1986వ బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారైన ఆయన ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో సీబీఐ డైరక్టర్గా అలోక్ వర్మను తొలగిస్తూ ఆ స్థానంలో నాగేశ్వర రావును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించిన విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పీజీ పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐపీఎస్ అధికారి కాకముందు ఐఐటీ మద్రాస్లో పరిశోధకుడిగా పనిచేశారు. ( చదవండి: అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?) ఒడిశా కేడర్ ఐపీఎస్గా ఎంపికైన అనంతరం ఆయన తన తొలి పోస్టింగ్ను ఒడిశా తాల్చెర్ సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో)గా అందుకున్నారు. అనంతరం ఒడిశాలోని నాలుగు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. అలాగే రూర్కెలా రైల్వేస్ ఎస్పీగా, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఉపయోగించిన తొలి పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. 1996 జగస్తింగ్పూర్లోని ఓ రేప్ కేసులో ఫింగర్ ప్రింట్స్ ద్వారా నేరస్థులను పట్టుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా ఉన్నప్పుడు కటక్లో 200 మందిని చంపిన నేరస్థుడు బెలుదాస్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఒడిశా ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఫైలిన్(2013) హుదూద్ (2014) తుఫానుల్లో చేపట్టిన సహయక చర్యలకుగాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అవార్డులందుకున్నారు. ఆయనందించిన విశేష సేవలకుగాను రాష్ట్రపతి, ఒడిశా గవర్నర్ల చేతుల మీదుగా మెడల్స్ కూడా లభించాయి. ఆయన సీఆర్పీఎఫ్ మణిపూర్ డీఐజీగా కూడా పనిచేశారు. (చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి) -
సీబీఐ వ్యవహారంపై అర్థిక మంత్రి జైట్లీ స్పందన
-
సీబీఐ రగడ : సుప్రీంను ఆశ్రయించిన అలోక్ వర్మ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు చేరింది. తనను డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి అకారణంగా సెలవుపై పంపడం పట్ల అలోక్ వర్మ న్యాయపోరాటం చేపట్టారు. సీబీఐ చీఫ్గా తనను తొలగించిన ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటిషన్ను శుక్రవారం విచారించనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. కాగా, అలోక్ వర్మతో పాటు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికిరాత్రి సెలవుపై పంపిన విషయం తెలిసిందే. మరోవైపు ముడుపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాను కాపాడేందుకే అలోక్ వర్మను తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. నూతన సీబీఐ తాత్కాలిక చీఫ్గా ఒడిషా క్యాడర్కు చెందిన తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమించింది. -
సీబీఐ అధికారుల ఛాంబర్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలో రాత్రికి రాత్రే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే నూతన డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీబీఐ ఆఫీసులో సోదాలు మొదలయ్యాయి. సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో వారిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని అలోక్ వర్మ, అస్థానా, సస్పెండైన డీఎస్పీ దేవేందర్ ఆఫీసుల్లో నాగేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. వారి ఛాంబర్లను సీజ్ చేశారు. ఇతరులెవరూ సీబీఐ కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. (చదవండి : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి) -
ఆస్తానా కేసు పూర్వాపరాలు..
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్ డైరెక్టర్గా స్వయంగా నియమించారు. గుజరాత్ కేడర్కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్ డైరెక్టర్పై కేసు) కేసు ఏమిటి? మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్ చెప్పారు. సతీష్ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా, దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, ప్రసాద్ బంధువు సోమేశ్ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా సతీష్ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్) ఎవరీ ఖురేషీ? ఉత్తర ప్రదేశ్కు చెందిన మొయిన్ అక్తర్ ఖురేషీ డెహ్రాడూన్లోని డూన్ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్లోని రామ్పూర్లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది నిర్మాణం, ఫ్యాషన్ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సింగ్, ఏపీ సింగ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సతీష్ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. సతీష్ వాంగ్మూలం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అక్టోబర్ 4న స్థానిక మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్లో సతీష్కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్పై లుక్ ఔట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మాక్సిస్ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్కు అప్పగించారు. ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు: కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారంటూ హైదరాబాద్ వ్యాపారి సతీష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం... మనోజ్, సోమేశ్లు దుబాయ్లో సతీష్ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సోమేశ్ తనతో సీబీఐ అధికారితో ఫోన్లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్ ఆస్తానా అని సోమేశ్ చెప్పాడని కూడా సతీష్ పేర్కొన్నాడు. వాట్సాప్లో ఆస్తానా ఫోటో కూడా చూపించాడని తెలిపాడు. వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్లో మనోజ్ ప్రసాద్కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్ మిట్టల్ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్ వివరించాడు. అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్కు నోటిసు పంపింది. దాంతో సతీష్ మనోజ్ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. గత నెల్లో సతీష్ హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్ను ఆదేశించింది. అక్టోబర్ 1న సతీష్ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, ఎస్పి జాగ్రూప్లను కలుసుకున్నాడు. జరిగిందంతా సతీష్ మనోజ్కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్ అక్టోబర్ 10న 25 లక్షలు మనోజ్కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్ వచ్చిన మనోజ్ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
సీబీఐ డైరెక్టర్ల మధ్య తారస్థాయికి చేరిన విబేధాలు
-
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్తో ఈ ఏడాది జూన్లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్లు దుబాయ్లో సతీశ్ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్కు దుబాయ్లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్కు అప్పగించారు. -
సీబీఐ స్పెషల్ డైరెక్టర్పై కేసు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీశ్బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది. -
సీబీఐ చీఫ్గా ఢిల్లీ మాజీ సీపీ!
ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధిపతిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అలోక్ వర్మ రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్గా సేవలు అందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామక కమిటీలో ప్రధానితోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్సింగ్ ఖేహర్, లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. వర్మ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెర్రిటరీ)కి చెందిన 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో దేశ రాజధాని ఢిల్లీలో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. దేశాన్ని కుదిపేసిన బొగ్గు కేటాయింపుల కుంభకోణం దర్యాప్తును సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మకు సవాల్గా మారిన సంగతి తెలిసిందే. -
తీహార్ జైలులో కార్ల విడిభాగాల యూనిట్
తీహార్: దేశంలోనే మొట్ట మొదటిసారిగా తీహార్ జైలులో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కార్ల విడిభాగాల తయారీ యూనిట్ను శుక్రవారం ఢిల్లీ జైళ్ల విభాగం డెరైక్టర్ జనరల్ అలోక్ వర్మ తీహార్ జైలు నంబర్-2లో ప్రారంభించారు. జైలులోని ఖైదీలకు శిక్షణతోపాటు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. దీర్ఘకాలిక లేదా స్వల్పకాలికంగా ఇందులో ఖైదీలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేసే కాలంలో వేతనాలను కూడా చెల్లిస్తారు. ఇక్కడ పనిచేసిన అనుభవం జైలు శిక్షాకాలం పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి పొందడానికి దోహదపడుతోందని జైళ్ల విభాగం డీఐజీ, పీఆర్వో ముఖేశ్ ప్రసాద్ తెలిపారు. అ కార్ల విడిభాగాల తయారీ యూనిట్ మిందా ఫరుక్వా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఈఈ) నిర్వహిస్తోంది. స్పార్క్ ఇండియా, అశోక్ మిందా గ్రూప్ ఆఫ్ ఇండియా, జపాన్కు చెందిన ఫరుక్వా జాయింట్ వెంచర్తో ఈ యూనిట్ నడుస్తుంది. ఇందులో వైర్ హార్నెస్ ఉత్పత్తులు, ముఖ్యమైన విడిభాగాలను తయారీతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ మేరకు మార్చి 30న తీహార్ జైలు అధికారులు, ఎంఎఫ్ఈ అధికారులు మారుతీ సుజీకి ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ కార్ల తయారీ యూనిట్లో ఎంఎఫ్ఈ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారు. అత్యధికంగా వేతనాలు కూడా అందజేస్తారు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు జీవితంలో స్థిరపడడానికి ఈ పని అనుభవం తోడ్పడుతుందని, బయట కూడా మంచి అవకాశాలు లభిస్తాయని జైలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని పంపిస్తున్నామని పీఆర్వో ప్రసాద్ అన్నారు. స్పార్క్ మిందా గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎన్ కే తనేజా మాట్లాడుతూ ఈ కార్ల తయారీ యూనిట్ను తీహార్ జైలులో సేవాదృక్పథంలో స్థాపించామని, ఎలాంటి లాభాపేక్ష లేదని అన్నారు. శిక్షపూర్తి అయిన ఖైదీలతోపాటు వారి కుటుంబాలు, బాధితులకు కూడా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో యూనిటను చేపట్టామని అన్నారు. పలు జైళ్లలో ఇలాంటి కార్యక్రమాలను విస్తరించడానికి చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఎంఎఫ్ఈ పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారని చెప్పారు. మిషనరీ, ముడిసరుకు, నాణ్యత ప్రమాణాలను ఎంఎఫ్ఈ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 30 నుంచి 35 మంది ఖైదీలకు అవకాశం కల్పిస్తున్నామని, భవిష్యత్లో ఈ సంఖ్యను పెంచుతామని జైళ్ల డీఐజీ చెప్పారు. కార్యక్రమంలో స్పార్క్ ముండా చైర్పర్సన్, ఎంఎఫ్ఈ అధ్యక్షుడు మెయిన్షీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.