area hospital
-
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
పురుడు పోసిన ఎమ్మెల్యే..
భద్రాచలం అర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడుపోసి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్నకు పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, మంగళవారం స్వప్నకు పురిటినొప్పులు తీవ్రం కాగా, డ్యూటీ డాక్టర్ (ఈఎన్టీ) పరీక్షించి వెంటనే ప్రసవం చేయాలని నిర్ధారించారు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే వెంకట్రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన సిజేరియన్ ద్వారా స్వప్నకు ప్రసవం చేయడంతో 3.2 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. -
లంచం అడిగిన డాక్టర్పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు
గచ్చిబౌలి (హైదరాబాద్): కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్కు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డాక్టర్ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆస్పత్రికి వచ్చారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లో గెజిటెడ్ సిగ్నేచర్ కోసం సెక్యూరిటీ గార్డు ద్వారా సంప్రదిస్తే డాక్టర్ డబ్బు లు అడిగాడని ఓ వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలిచిన హరీశ్, తమ సంభాషణను వీడియో తీయాల్సిందిగా అధికారులను ఆదేశించి.. ఏ డాక్టర్, ఎంత అడిగాడంటూ నిలదీశారు. మూర్తి (పీవీఎస్ఎన్ మూర్తి) అనే డాక్టర్ రూ.500 అడిగాడని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అక్కడికక్కడే ఆ డాక్టర్ను సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ ప్రసవాలు పెంచాలి తనిఖీల్లో భాగంగా అవుట్ పేషెంట్ విభాగంతో పాటు అన్ని వార్డుల్లో హరీశ్ కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందులు, స్కానింగ్తో పాటు ఇతర పరీక్షలు బయటకు రాయవద్దని ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమారిని ఆదేశించారు. 60 శాతానికి పైగా సాధారణ డెలి వరీలు కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్లు చేయాలని ఆదేశిస్తూ మరో రెండు అల్ట్రా సౌండ్ మెషీన్లు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు. -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
ఏరియా ఆసుపత్రిలో దారుణం
సాక్షి, వనస్థలిపురం(హైదరాబాద్): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు. చదవండి: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి! అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్కు రిఫర్ చేశామని చెప్పారు. చదవండి: పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు కొత్త విధానం బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్పేట కార్పొరేటర్ రాజ్కుమార్, తదితరులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ చావా యుగంధర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు
బెల్లంపల్లి: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఏకంగా ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చిందులేశారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ అనుమానితులను అబ్జర్వేషన్లో ఉంచడానికి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏరియా ఆస్పత్రి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ వ్యవహారాన్ని కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మనస్పర్ధలే కారణమా?: సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే సెల్ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇటీవల నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో కేక్ కట్ చేయడానికి ఓ ప్రజా ప్రతినిధి వెళ్లినట్లు సమాచారం. ఐసోలేషన్ వార్డు ఏర్పా టు చేసినందువల్ల వేడుకలు నిర్వహించరాదని ఓ వైద్యుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి నర్సుల వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. దీన్ని కొందరు సిబ్బంది అవమానకరంగా భావించడంతోనే వైద్యులు, సిబ్బందిలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. -
24 వేళ్లతో శిశువు జననం
విజయనగరం, పార్వతీపురంటౌన్: పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జన్మించింది. మండలంలోని మరికి గ్రామానికి చెందిన బి.లావణ్య మొదటి కాన్పులో 24వేళ్లతో ఉన్న శిశివుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి తెలిపారు.చేతులు, కాళ్లకు ఆరు చొప్పున వేళ్లు ఉన్నాయన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. జన్యుపరమైన కారణాలవల్ల ఇటువంటి అరుదుగా జరుగుతాయని తెలిపారు. లావణ్య ఆడపడుచుకు కూడా ఇలాగే 24 వేళ్ల ఉన్నాయని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్నర్స్ ఆత్మహత్య
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్నర్స్గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. -
బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
సాక్షి, బాపట్ల: బాపట్లలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో అరకోటి రూపాయలకు పైగా జరిగిన నిధుల స్కామ్లో ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం చర్యలకు పూనుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో గత రెండు నెలలుగా ప్రచురించిన వివిధ కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఆడిట్ నిర్వహించేందుకు ముందుకు రాగా ఒక్కొక్కటిగా తవ్వేకొద్దీ ఆవినీతి బయటపడింది. రెండు నెలలుగా జిల్లా ఆడిట్, రాష్ట్ర అడిట్ అధికారులు నిర్వహించిన రెండేళ్ల ఆడిట్లో రూ.50,19,820 నిధులు స్వాహా అయ్యాయని ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ప్రకటించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన గత సూపరింటెండెంట్ డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రహ్మణ్యస్వామి, చిరంజీవిలను విధుల నుంచి తొలగించారు. వీరి ముగ్గురిపై బాపట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ బాపట్ల ఏరియా వైద్యశాలలో రెండేళ్లుగా ఆడిట్ నిర్వహించకపోవటంతో అభివృద్ధి నిధులు, స్పెషల్ రూముల అద్దెలు, పలు షాపుల అద్దెలు, ఆపరేషన్లు, గర్భిణులకు ఇవ్వాల్సిన చెక్కులు, కాంట్రాక్టు ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లించేందుకు పలు అకౌంట్ల సృష్టికి నిధులను దారిమళ్లించినట్లు గుర్తించామన్నారు. అభివృద్ధి కమిటీ, సూపరింటెండెంట్ ఉమ్మడిగా చెక్కులను డ్రా చేయించి సొంత ఖాతాల్లో నిధులు జమ చేసుకోవటంతో రాష్ట్ర ఆడిట్, జిల్లా ఆడిట్ విభాగాలతో పరిశీలన చేయించి పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయించామని చెప్పారు. ఈ పరిశీలన రెండు నెలలుగా జరుగుతుండగా మొత్తం రూ.50,19,820 నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు. నోటీసులు జారీ.. గత రెండేళ్లుగా బాపట్లలో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేసి, నోటీసులు జారీ చేశామని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు. జిల్లా కోఆర్డినేటర్తో పాటు ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ శుక్రవారం బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ హజరత్తయ్యకు లిఖిత పూర్వకంగా ఈమేరకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఆశీర్వాదంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రమణ్యస్వామి, చిరంజీవిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నిధుల దుర్వినియోగం తీరు చూస్తే ఇంకా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని, అంతర్గత ఆడిట్లు కూడా నిర్వహించి ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. -
ప్రాణం ఉండగానే పాడి కట్టేందుకు ఏర్పాట్లు
-
మెడాల్.. పరీక్షలు నిల్
తణుకు అర్బన్: తణుకు ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ప్రైవేటు వైద్య పరీక్షల సంస్థ మెడాల్ వారం రోజులుగా మూతపడింది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని ల్యాబ్ కొన్ని పరీక్షలకే పరిమితం చేసి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థచే 48 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాని సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతనాల బకాయిలు అందకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. థైరాయిడ్, ప్లేట్లెట్స్ కౌంట్, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, క్యాన్సర్ నిర్ధారణ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్న ఈ సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. మూడు నెలలుగా వేతనాల్లేవ్ మెడాల్ సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ వైద్యపరీక్షలను నిలిపివేసింది. తమకు రావాల్సిన మొత్తాన్ని మెడాల్ సంస్థ చెల్లించలేదని ప్రభుత్వం నుంచి వారికి బిల్లులు రాకపోవడంతో తమకు కూడా నిలిపివేశారని మెడాల్ అనుబంధ సంస్థ అయిన ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. వైద్యపరీక్షలు చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది కూడా విధులకు హాజరుకావట్లేదని తెలుస్తోంది. నిత్యం 500 మందికి పైగా.. తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యవర్గాలు అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవల కారణంగా ఇటీవల కాలంలో నిత్యం 500కు పైగా రోగులు, గర్భిణులు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఇందులో 70 శాతం మందికి వివిధ పరీక్షలు వైద్యులు రాస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్ల్లో వైద్య పరీక్షలు చేయించుకుని తమ జేబులు గుల్లచేసుకుంటున్నామని వాపోతున్నారు. ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాల్సిందే.. మా నాన్నకు ఆరోగ్యం సరిగాలేదని వైద్యులు కొన్నిరకాల పరీక్షలు చే యించుకోమన్నారు. ఆస్పత్రిలో మెడాల్ వైద్యపరీక్షలు నిలిచిపోవడంతో ప్రైవేట్ ల్యాబ్లో చేయించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఈ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.– బి.సాయి కమార్, తణుకు వారం రోజులుగా నిలిచిపోయాయి ఆస్పత్రిలో అందుబాటులో ఉండే మెడాల్ వైద్య పరీక్షలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పారు కాని ఇప్పటివరకు విధుల్లోకి రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరీక్షలు మాత్రమే బయటికి రాస్తున్నాం.– డాక్టర్ వెలగల అరుణ, తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మందుబాబుల అడ్డాగా ఏరియా ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్ : మలక్పేట ఏరియా ఆసుపత్రి మందుబాబుల అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. రాత్రుళ్లు ఏరియా ఆసుపత్రి బార్ను తలిపించేలా మారుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. సీసీ కెమరాలు ఉన్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి పార్టీలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు మద్దతుగా పార్కింగ్ సిబ్బంది తోడు అవ్వటంతో అర్ధరాత్రి అవ్వగానే ఆసుపత్రిలా కాకుండా మలక్పేట ఏరియా బార్లా కనిపిస్తోంది. -
కుప్పం ఏరియా ఆస్పత్రిలో దయనీయ పరిస్థితులు
-
లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు
జంగారెడ్డిగూడెం : ఒక్కసారిగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యపరికరాలు వచ్చేశాయి. ఆయా విభాగాల్లో వైద్యపరికరాలు ఏర్పాటు చేసేశారు. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా కనిపించేలా ముస్తాబు చేశారు. దీంతో ప్రజలు, రోగులు ఆహా ఏరియా ఆసుపత్రికి అన్ని సదుపాయాలు, వైద్యపరికరాలు వచ్చేశాయి అనుకున్నారు. మూడు రోజుల పాటు వైద్యసేవలు కూడా వైద్యులు అలాగే అందించారు. వైద్యులు సిబ్బంది ఠంచన్గా విధులకు హాజరయ్యారు. రోగులంతా ఓహో అనుకున్నారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం మాట. అయితే శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు షాక్ ఎదురైంది. సినిమా సెట్టింగ్లు మాదిరిగా ప్యాకప్ చెప్పినట్లు ఏరియా ఆసుపత్రికి వచ్చిన వైద్య పరికరాలు ప్యాక్ చేసి తరలిస్తున్నారు. ఏం జరుగుతుందో రోగులకు అర్థం కాలేదు. ఇంతకీ వైద్యపరికరాలన్నీ ఏలూరు ఆసుపత్రివట. మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి వాటిని శుక్రవారం ప్యాక్ చేసి తిరిగి ఏలూరు ఆసుపత్రికి తరలించేశారు. దీనికి కారణం ఏమిటంటే ఏరియా ఆసుపత్రి పనితీరుపై గ్రేడింగ్ ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యబృందం వచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో కేంద్ర బృందంలోని వైద్యులు డాక్టర్ మినీ మోలా, డాక్టర్ బీఎన్ వ్యాస్, డాక్టర్ అర్చన వర్మలు ఇక్కడే మకాం చేసి ఏరియా ఆసుపత్రి ప్రతి అంగుళం పరిశీలించి, వైద్యులు, వైద్యపరికరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పనితీరు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బృందం వస్తున్న సందర్భంగానే ఏరియా ఆసుపత్రిలో లేని వైద్యపరికరాలన్నీ తీసుకువచ్చి హడావుడిగా ఆయా విభాగాల్లో అమర్చారు. హృద్రోగ విభాగం, స్కానింగ్ ఇలా అన్ని విభాగాల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి ఇక్కడ అన్నీ ఉన్నట్లు సినీమాయ చేశారు. గురువారం సాయంత్రం కేంద్ర బృందం వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం ప్యాకప్ చెప్పేశారు. ఏలూరు నుంచి వచ్చిన పరికరాలను ప్యాక్ చేసి లారీలో ఏలూరుకు తరలించేశారు. చివరకు కేంద్ర బృందాన్ని కూడా మన వైద్యాధికారులు, వైద్యులు తమ నైపుణ్యంతో లేనిది ఉన్నట్టుగా చూపి మహా మాయ చేశారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈ తతంగం చూసి మరో శంకర్దాదా సినిమాలో హీరో తన తండ్రి వస్తున్నాడని తెలియగానే ఇంటిని ఆసుపత్రిగా మార్చి చేసిన మాయను, మరోసారి ఇక్కడ చూస్తున్నట్లుగా ఫీలయ్యారు. -
మృగాళ్ల దాష్టీకం
నెల్లూరు , గూడూరు: మతిస్థిమితంలేని యువతిని కొందరు మృగాళ్లు తల్లిని చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ కామవాంఛ తీర్చుకుని గర్భవతిని చేశారు. పురిటి నొప్పులతో అల్లాడుతుండగా గూడూరు ఏరియా ఆస్పత్రి సీమాంక్ సెంటర్లో స్థానికులు చేర్చారు. ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 7వ తేదీన పురిటి నొప్పులు పడుతూ కింద పడి అల్లాడుతున్న ఓ యువతిని అక్కడే పండ్లు అమ్ముకునే ఓ మహిళ చూసింది. ఆమె ఆ పరిసరాల్లో ఎంత సేపు చూసినా కూడా ఆ యువతి వద్దకు ఎవరూ రాకపోవడంతో ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, ఆ యువతి నిండు గర్భిణిగా గుర్తించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని స్ట్రెక్చర్పై తీసుకెళ్లి సీమాంక్లో చేర్పించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు పురుడు పోశారు. మృగాళ్ల కామవాంఛకు బలైన ఆ యువతి ఆడ బిడ్డను ప్రసవించింది. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యులు, సిస్టర్లు ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, తన పేరు నాగమణి, తండ్రి పేరు రమణయ్య, తల్లి లక్ష్మమ్మగా చెబుతోంది. తాను కోట, గూడూరులోనూ భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తుంటానని కొంత సేపు చెబుతోంది. కొంత సేపు ఏమీ చెప్పుకుండానే మౌనంగా అమాయక చూపులు చూస్తూ ఉంటుంది. ఆస్పత్రి సిబ్బంది 1వ పట్టణ పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి విచారించి వెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆమె కోసం ఎవరూ రాలేదు. ఐసీడీఎస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వగా, వారు వచ్చి తమతో రావాలని కూడా చెప్పగా, తాను రానని, మా అవ్వ వస్తోందని మీతో రానని చెబుతుందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. -
పేద రోగులకు కష్టం.. నష్టం
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో ఏకైక 100 పడకల వైద్యశాలగా ఉన్న మార్కాపురంలోని ఏరియా వైద్యశాలలో గత 10 రోజుల నుంచి ఎక్స్రే యూనిట్ చెడిపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా వైద్యశాలకు గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల్లోని రోగుల వైద్యసేవల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రధానంగా నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం కచ్చితంగా ఎక్సరే తీయాలి. రోజుకు 400 నుంచి 450 మంది వరకు రోగులు ఓపీ విభాగంలో చికిత్స పొందుతారు. వీరిలో ప్రతి రోజూ 60 నుంచి 70 మంది వరకు ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు విరిగిన వారికి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాద బాధితులకు మెడనొప్పి, పంటి నొప్పితో బాధపడుతున్న వారికి చికిత్స చేయాలంటే ఎక్స్రే అవసరం. అయితే ఎక్స్రే ప్లాంట్ లేకపోవటంతో వైద్యశాలలోని వైద్యులు రోగులకు బయట ఎక్స్రే తీయించుకోమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులకు ఆర్థిక భారం తప్పటం లేదు. కొన్ని రకాల చికిత్సలకు కచ్చితంగా ఎక్స్రే ఆధారంగానే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రోగులు 150 నుంచి 200 రూపాయలు చెల్లించి బయట తీయించుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎక్స్రే ప్లాంట్ చెడిపోయిన విషయాన్ని వైద్య విధాన పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో బాగు చేయించి రోగులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం.- చక్కా మాలకొండ నరసింహారావు -
టెక్కలి ఆస్పత్రిలో ఉద్రిక్తత
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు. బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్స్టేషన్కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు. బాధితులకు అందించే సౌకర్యాలు మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు. -
మంత్రి ఇలాకాలో మృత్యు ఘోష!
టెక్కలి : టెక్కలి ఏరియా ఆస్పత్రి తరచూ వివాదాల్లోకి వెళ్తోంది. వైద్యం కోసం వచ్చేవారిలో ఎవరో ఒకరు.. ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. దీనికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆస్పత్రిలోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్కలి భూలోకమాతవీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనం ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వైద్యం కోసం ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. చికిత్స అనంతరం యువకుడు మృతి చెందాడు. దీనికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ యువకుడి మృతదేహంతో భూలోకమాతవీధికి చెందిన ప్రజలు ఏరియా ఆస్పత్రిని ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అక్కడకు కొద్ది రోజుల తరువాత ఆంజేయపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇదే ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. అప్పట్లో గ్రామస్తులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన ఓ యువకుడు అనారోగ్యం బారిన పడడంతో ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతను మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా యువకుడు చనిపోయాడంటూ ఆదిఆంధ్రావీధికి చెందిన వారంతా మృతదేహంతో ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తాజాగా నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే బాలింత మృతి చెందడంపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట నిరసన చేశారు. ఇదంతా కేవలం ఏడాది కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకంగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు మరణాలు జరుగుతుండడంపై తాత స్థాయిలో మంత్రి వైఫల్యాన్ని ప్రజలు ఎండ గడుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై పెల్లుబికుతున్న విమర్శలు ఏరియా ఆస్పత్రిలో కొంతమంది వైద్య సిబ్బంది అనుసరిస్తున్న తీరు, నిర్లక్ష్యంపై తారస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిండమే కాకుండా అత్యవసర సమయంలో అందుబాటులో ఉండడం లేదంటూ ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కొన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం లేదు. అంతేకాకుండా వార్డుల్లో ఉన్న రోగుల పట్ల కూడా సిబ్బంది కసురుకోవడం పరిపాటిగా మారిందంటూ రోగులు చెబుతున్నారు. అలాగే ప్రసూతి విభాగంతో పాటు ఇతర విభాగాల్లో ఆపరేషన్లకు డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు ఉన్నతాధికారులు రావడం, ఇరువర్గాలను కూర్చోబెట్టడం సామరస్యంగా రాజీలు చేయడం పరిపాటిగా మారిందం టూ బహిరంగంగా విమర్శలు ఉన్నాయి. తాజాగా శనివారం జరిగిన బాలింత మృతి విషయంలో ఆపరేషన్కు ముందు ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్న సిబ్బంది 2100 రూపాయలు తీసుకున్నారని మృతురాలి సోదరుడు ఉన్నతాధికారుల వద్ద రోదిస్తూ చెప్పడం గమనించదగ్గ విషయం. మంత్రి ఏం చేస్తున్నారు? ఏరియా ఆస్పత్రిలో తరచూ నిర్లక్ష్యపు మరణాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా ఆస్పత్రిని సందర్శించడం ఆ తరువాత ఆస్పత్రిలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో కనీసం దృష్టి సారించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్య సేవలపై ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరో వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు కూడా సన్నగిల్లడంతో, ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తీరు మారడం లేదంటూ బాధితులు చెబుతున్నారు. మంత్రి మాటలు.. నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తా. – పలు బహిరంగ సభల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. వాస్తవం ఇలా.. మంత్రి ఇలాకాలోని వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కొద్ది రోజులుగా మరణ ఘోష వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా బాలింత చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిందంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్కు రూ.2,100 తీసుకున్నారు మా చెల్లి లక్ష్మిని కాన్పు కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాం. ఆపరేషన్ కోసం థియేటర్ వద్దకు తీసుకువెళ్లాం. అక్కడ సిబ్బంది మా దగ్గర 2,100 తీసుకున్నారు. ఆపరేషన్ తరువాత పట్టించుకోకపోవడంతో మా చెల్లి మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ఘోరం జరిగింది. –గుర్రాల గణపతి, పాలవలస, నందిగాం మండలం. సరిగ్గా పట్టించుకోవడం లేదు జ్వరం, నీరసంతో వారం కిందట ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు. నర్సులకు అడిగితే ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ మాత్రలు వేసుకున్న తరువాత కడుపులో మంటతో నరకాన్ని చూస్తున్నాను. నర్సులకు అడిగితే కసిరేస్తున్నారు. –బొచ్చ రాము, రోగి, భగవాన్పురం, టెక్కలి మండలం. ప్రజా రోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో వరుసగా నిర్లక్ష్యపు మరణాలు సంభవిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేనా ప్రజలకు అందజేసే మెరుగైన వైద్యం. కమీషన్ల వైపే కాకుండా ప్రజల ఆరోగ్యంపై మంత్రి దృష్టి పెడితే మంచిది. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలతో ప్రజలు ఆస్పత్రికి రావాలంటే భయపడుతున్నారు. ఈ సంఘటనలపై ప్రజలకు మంత్రి సమాధానం చెప్పాలి. –పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి!
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే శిశువు చనిపోయిందంటూ బాలింత బంధువులు ఆరోపించారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ పరహానా గర్భిణి కావడంలో తొమ్మిది నెలలుగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. పరీక్షలు చేయించడంతో పాటు మందులు వాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పరిహానాకు కడుపులో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటివరకూ ఆమెకు వైద్యం చేసిన వైద్యురాలు ఆసమయంలో అందుబాటులో లేరు. వైద్యురాలి సూచన మేరకు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఆరోజు, తర్వాత రోజు ఆదివారం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గర్భిణి పరహానాను పట్టించుకోలేదు. సోమవారం వైద్యురాలు వచ్చిన తర్వాత పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారని, అవసరమైతే మరో రోజు కూడా ఆగవచ్చని అన్నారని బంధువులు అంటున్నారు. తాము ఆపరేషన్ చేసేం దుకు అంగీకరించగా సోమవారం ఉద యం ఆపరేషన్ చేయగా మృత శిశువు జన్మించిందని వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ శివప్రసాద్ స్పందిస్తూ పరహానాకు వైద్యసేవలు అందించామన్నారు. అన్ని వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకరరావుకు తెలియజేశామన్నారు. డాక్టర్ల్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని బాధితురాలి బంధువులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. -
అమ్మో... ఎన్నాళ్లీ నరకం
పెద్దాపురం: ‘‘ఇవెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచాం అంటారు.. ఇక్కడ చూస్తే వైద్యులు అందుబాటులో ఉండరు.. కనీసం పట్టించుకునే వారే కనిపించరు. ఇలాగేనా సేవలందించేంది’’ అంటూ పలువురు హోంమంత్రి నియోజకవర్గంలోని పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు ప్రయాణికులతో వెళుతున్న ఆటోను పెద్దాపురం జి.రాగంపేట గ్రామంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పంక్చరై అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో పెద్దాపురానికి చుందిన అడబాల వీర సత్యవేణి, ముక్కొల్లుకు చెందిన భార్యభర్తలు పద్మరాజు, సీతాయ్యమ్మ , రాయవరం మండలం వెదురుపాకకు చెందిన పెదిరెడ్డి కామేశ్వరరావు, పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన సీకోటి అప్పలరాజు, సామర్లకోటకు చెందిన సీహెచ్ ప్రభావతిలకు తీవ్ర గాయాలు కాగా, విరవకు చెందిన సీకోటి అప్పారావు, మరో ఇరువురుకి స్పల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో వారి బంధువులు తీవ్ర నిరసనకు దిగారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యులు రవికాంత్కు ఫోన్చేసి.. ‘‘ఇదెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ఆసుపత్రి వైద్య సేవలు మెరుగుపరిచాం అంటారు.. ఇలాగేనా సేవలందేది? అంటూ వైద్యులపై మండిపడ్డారు. దీంతో ఆయన అందుబాటులో అతిరాత్రం వద్ద ఉన్న వైద్యురాలు సుదీప్తిని ఆసుపత్రికి పంపించగా ఆమె ప్రాథమిక చికిత్స చేసి అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిబ్బంది అందుబాటులో లేక.. క్షతగాత్రులను తరలించేందుకు ఆసుపత్రిలో సరైన వాహనం అందుబాటులో లేక పోవడంతో సుమారు మూడు గంటలకు పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. అనంతరం వచ్చిన 108లో తమ పేషెంట్ను తీసుకువెళ్ళాలంటూ 108 సిబ్బందిపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108లో ఇద్దరిని మాత్రమే తీసుకువెళ్లే వీలుందని సిబ్బంది చెబుతున్నా ఇరు వర్గాలవారు మొండిగా వ్యవహరించడంతో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది సముదాయించి తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని ముందుగా కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భద్రాచలం ఆసుపత్రిలో ‘అంబులెన్స్’ దందా
భద్రాచలం: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజు రోజుకూ పెరుగుతోంది. మృతదేహం తరలింపు పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.టేకులపల్లికి చెందిన జ్యోతి, ఈ నెల 6న ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. పోస్ట్మార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్దమయ్యారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆసుపత్రి బయట ఉన్న ఓ అంబులెన్స్ నిర్వాహకులు లోపలికి వచ్చారు. తమది కూడా ఆసుపత్రికి సంబంధించినదేనని, ఐదువేల రూపాయలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అయినట్టయితే డబ్బులు ఎందుకు అడుగుతారని మృతురాలి కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వచ్చిన వారిని ఇదే విషయం అడిగి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పరారయ్యారు. ఆస్పత్రి అధికారు లే వేరే అంబులెన్స్ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని టేకులపల్లి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ముందున్న ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు తరచూ ఇలాగే రోగులను మోసగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల ఓ ఆసుపత్రితో కమీషన్ ఒప్పందాలు చేసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగానే సేవలు అందుతాయని రోగులను మభ్యపెట్టి అక్కడికి తరలిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై ఆస్పత్రి అధికారులు దృష్టి సారించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి
టెక్కలి/టెక్కలిరూరల్: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో.. మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రంలో 110 పడకల ఏరియా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందజేయడంతోనే స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన యువకుడు సంకిలి తిరుపతిరావు(27) మృతిచెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిరావుకు కడుపునొప్పి, తలనొప్పి రావడంతో భార్య పుష్పతో పాటు స్థానికులు ఆయనని శనివారం టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు జ్యోతి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో, శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. ‘108’లో రిమ్స్కు తరలించగా, తిరుపతిరావు మృతిచెందారు. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు జ్యోతి సక్రమంగా వైద్యసాయం అందజేయలేదని, మరో వైద్యుడు లక్ష్మణరావుకు సమాచారమిచ్చినా స్పందించలేదని మృతుని కుటుంబసభ్యులతో పాటు వీధి ప్రజలంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి 2 గంటల వరకు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్బాబు అక్కడికి చేరుకుని వారిని వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీరు.. ఆదివారం ఉదయం మళ్లీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించి వైద్యురాలు జ్యోతిని నిలదీస్తూ ఫర్నీచర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు వద్ద బైఠాయించి జ్యోతి, సూపరింటెండెంట్ కె.కేశవరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మన్నగారి కిరణ్, యు.శంకర్, శ్యామలరావు, వార్డు సభ్యుడు దోని బుజ్జి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థికసాయంతో పాటు ఆయన పిల్లలకు వసతి గృహంలో సీట్లు వచ్చేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఆరా తీశారు. వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ తిరుపతిరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యం అందించాక పరిస్థితి విషమించిందని తెలిపారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, పలాస సీఐ తాతారావు, ఎస్ఐ లు సురేష్బాబు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
తాళం తెరవలే..!
భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.18.14 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను గత ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆస్పత్రి తాళాలే తెరుచుకోలేదు. దీంతో ఇవి నిధులు ఖర్చు చేయడానికే తప్ప మరెందుకూ పనికి రావనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు తోడు మరో వంద పడకలు మంజూరైన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రధానంగా గిరిజనులకు వైద్య సేవలు అందించటంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడికి నిత్యం 450 – 550 మంది రోగులు వస్తుంటారు. 150 – 200 మంది ఇన్పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు. నెలకు 350 – 450 వరకు కాన్పులు జరుగుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ మెరుగైన వైద్య సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా ఖ్యాతి గడిచింది. ప్రత్యేక సౌకర్యాలున్నా.. ప్రయోజనం సున్నా కార్పోరేట్కు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఆప్పత్రి భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ప్లోర్లో గర్భణీ పరీక్షలు, యాక్సిటెండ్ విభాగం, క్యాజువాలటీ, చిన్నపిల్లల విభాగంల కోసం తగిన సౌకర్యాలను కల్పించారు. మొదటి అంతస్తులో క్లినిక్, పేథాలజీ, డెంటల్, ఈఎన్టీ, ఇన్పేషెంట్, ఆపరేషన్స్ విభాగం, ఐసీయూ విభాగాల కోసం, రెండో అంతస్తులో పరిపాలనకు ప్రత్యేక గదులు, డబ్బులు చెల్లించి అద్దెకు ఉండే రోగుల కోసమని 15 గదులు(స్పెషల్రూమ్స్) సిద్దం చేశారు. బర్నింగ్ కేసుల కోసమని 6 గదులను నిర్మించారు. ప్రసవాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లేబర్ రూమ్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమని 6 గదులు కేటాయించగా, ప్రతీ గదిలోనూ అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. కొత్త ఆసుపత్రిలో దాదాపుగా అన్ని వార్డులు, గదుల్లో కూడా ఏసీలను అమర్చారు. కానీ వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ప్రసుత్తం ఉన్న పాత ఆసుపత్రి భవనాల్లోనే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా వచ్చాయి. కానీ దీనిని ప్రస్తుతం ఉపయోగపడటంలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం ఎదురుచూపులు.. 100 పడకల ఆస్పత్రి నుంచి 200కు అప్గ్రేడ్ చేశారు. ఈ లెక్కన వైద్యులు, సిబ్బందిని కూడా అదనంగా నియమించాలి. 40 మంది వైద్యులు, 30 మంది స్టాఫ్ నర్సులు, సుమారు 100 మంది పారామెడికల్ సిబ్బందిని కేటాయించాలి. కానీ ఈ పోస్టులను భర్తీ చేయలేదు. స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రెండు హెడ్ నర్సు పోస్టులూ ఖాళీనే. 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్గా అయినందున ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనేది అక్షర సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్ శుక్రవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలన కోసం వస్తున్నందున, ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
కాన్పు సమయంలో శిశువు మృతి
కావలిరూరల్: కాన్పు సమయంలో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చోటుచేసుకుంది. శిశువు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్కు చెందిన సన్నగిరి శివప్రసాద్ భార్య కావ్య కాన్పుకోసం బిట్రగుంటలోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. రాత్రి 9.51 గంటలకు ఆమెకు సహజ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించాడు. అయితే కాసేపటికి శిశువు మరణించాడు. దీంతో కావ్యతోబాటు ఆమె కుటుంబసభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు. కాన్పు సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేరు. కాల్ ఆన్ డ్యూటీలో ఉన్న చిన్న పిల్లల వైద్యనిపుణులు అర్ధగంట తర్వాత ఆస్పత్రికి రాగా, డ్యూటీ డాక్టర్ మరో పావు గంట తర్వాత చేరుకున్నారు. శిశువు మృతిచెందాడని వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుబ్బారావు, చైర్మన్ గుత్తికొండ కిషోర్బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. డాక్టర్లు సకాలంలో స్పందించలేదు ఇక్కడ కాన్పులు బాగా జరుగుతున్నాయంటే తీసుకువచ్చాం. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేరు. సిబ్బందే కాన్పు చేశారు. వారు ఫోన్ చేయగా చిన్నపిల్లల డాక్టర్ అర్ధగంటకు వచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.– దరిశి సుధీర్, కావ్య సోదరుడు పూర్తి స్థాయిలో విచారిస్తాం కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మా సిబ్బంది తీసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే విషయంపై విచారిస్తున్నాం. కాన్పు సమయంలో గర్భంలో మలం కలసిపోయి శిశువు ముక్కులు, నోట్లోకి వెళ్లి చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తాం. – డాక్టర్ కె.సుబ్బారావు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం శిశువు మృతి చెందాడనే విషయం తెలియగానే కమిటీ సభ్యులతో కలసి ఇక్కడికి చేరుకున్నాం. డాక్టర్లు అందుబాటులో లేరనే ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. ఈ ఘటనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – గుత్తికొండ కిషోర్బాబు, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చెర్మన్ -
వైద్యాలయం.. మందుల వ్యాపారం
తణుకు అర్బన్:తణుకు ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ ఒత్తిడో, మరే ఇతర కారణాలో కాని వైద్యాధికారుల కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. గతేడాది నుంచి విజయవాడకు చెందిన ఉషా కార్డియాక్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆస్పత్రిలో ప్రతి మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈసీజీ, ఎకో వంటి గుండె పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. మెరుగైన సేవలు అవసరమైన వారిని విజయవాడకు రావాల్సిందిగా సం బంధిత వైద్యులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రాసిన మందులు కార్పొరేట్ సంస్థ ప్రతినిధుల వద్దే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవి మరే దుకాణంలో దొరకని దుస్థితి. దీంతో రోగులు వీరి వద్దే మందులు కొంటున్నారు. బయట దుకాణాల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఎమ్మార్పీకే మందులు విక్రయిస్తున్నారని రోగులు అంటున్నారు. తణుకు ఆస్పత్రిలో జరుగుతున్న ఈ మందుల విక్రయాలను మంగళవారం తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ పరిశీలించారు. ఎంఓయూ ఉందంటూ తప్పుదోవ మందులు విక్రయించేందుకు తమకు మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ధ్రువీకరణ పత్రం ఉందని సదరు విక్రయాలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్కు చెప్పారు. ఎంఓయూ చూపించమని విక్రమ్ అడగడంతో అందుబాటులో లేదని సదరు సిబ్బంది సమాధాన మిచ్చా రు. మందుల అమ్మకంపై గతంలోనే ‘సా క్షి’ కథనాలు ప్రచురించినా వైద్యాధికారులు స్పందించలేదు. రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన కార్పొరేట్ ఆస్పత్రి కావడంతో తెరవెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా అనే విమర్శలు లేకపోలేదు. రూ.లక్షకు పైగా అమ్మకాలు జిల్లాలో తణుకుతో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ తరహా మందుల అమ్మకాలు సదరు కార్పొరేట్ సంస్థ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకులో వైద్య శిబిరానికి సుమారుగా 50 నుంచి 70 మంది వరకు వస్తున్నారు. రూ.లక్షకు పైగా మందుల విక్రయం జరుగుతున్నట్టు అంచనా. ఎంఓయూ ఉందంటున్నారు మందుల అమ్మకాలకు ఎంఓయూ ధ్రువీకరణ పత్రం పొందామని విజయవాడ ఉషా కార్డియాక్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పారు. అయితే అది విజయవాడలో ఉందంటున్నారు. వచ్చే వారం ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని ఆదేశించాను. తీసుకురాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– విక్రమ్, తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్ మందుల విక్రయాలు జరపరాదు. ఇందుకోసం ఎవరికీ ఎటువంటి ఎంఓయూ ధ్రువీకరణ పత్రాలు జారీచేయలేదు. వచ్చే మంగళవారం జరిగే వైద్య శిబిరంలో మందుల విక్రయాలు మానకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
చిమ్మచీకటిలో పసిబిడ్డ
కావలిరూరల్: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల సిబ్బంది నిర్వాకంతో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మూడు గంటల పాటు చిమ్మచీకటిలో ఆర్తనాదాలు చేస్తూ ఉండాల్సి వచ్చింది. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన యు.అంజలి పురుడు కోసం గురువారం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చింది. మధ్యాహ్నం 2.50 గంటలకు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి మగబిడ్డను కాన్పు చేశారు. అనంతరం 3.20 గంటలకు ఆమెను అప్పుడే పుట్టిన బిడ్డతో సహా పే వార్డులోని రూం నంబరు 2లోకి మార్చారు. అయితే రూంలో లైటు పని చేయలేదు. ఈ విషయం గమనించిన డ్యూటీ సిస్టర్ వెంటనే ఎలక్ట్రీషియన్కు సమాచారమందించారు. అయితే ఎలక్రీషియన్ 6.25 గంటలకు వచ్చి లైట్ను సరిచేసి వెళ్లాడు. అయితే మూడు గంటల పాటు ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ పొత్తిళ్లలో బిడ్డతో సహా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వీరి బాధ చూడలేక అక్కడ విధులలో ఉన్న సిబ్బంది పదే పదే ఫోన్లు చేయడంతో ఎలక్ట్రీషియన్ తీరుబడిగా 3గంటల తర్వాత వచ్చి లైటు సరిచేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు బాగా చేస్తున్నారని వస్తే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటని అంజలి కుటుంబ సభ్యులు వాపోయారు. -
నిలిచిపోయిన డయాలసిస్
పార్వతీపురం: కిడ్నీవ్యాధిగ్రస్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న పార్వతీపు రం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. హైఓల్టేజ్ కారణంగా ముఖ్యమైన యంత్రాలు ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు 72మంది రోగులు ఈ కేం ద్రం ద్వారా సేవలు పొందుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసి 13నెలలు అయినప్పటికీ ఇక్కడి సేవలకు ఎంతో గుర్తింపు లభించింది. గత శుక్రవారం హైఓల్టేజ్ రావడంతో డయాలసిస్ యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ పాడైంది. డయాలసిస్ యంత్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు రోగులను పక్క జిల్లాలోని పాలకొండలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ వారికి సేవలు అందిస్తున్నారు. రూ. 10 లక్ష లమేర నష్టం.. ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డయాలసిస్ కేంద్రానికి నేరుగా విద్యుత్ సరఫరాను అందించే కేబుల్ను కూడా డయాలసిస్ యూనిట్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. స్టెబిలైజర్ను కూడా ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్ సరఫరా అయిన సమయంలో వాటిని సరిదిద్ది పంపించే స్టెబిలైజర్లో న్యూట్రల్ వ్యవస్థ పాడవ్వడం, వైర్లు కాలిపోయి తెగిపోవడంతో ఒక్కసారిగా స్టెబిలైజర్ ద్వారా అత్యధిక ఓల్టేజీ ప్రసారం కావడంతో డయాలసిస్ కేంద్రంలోవున్న ఆరు మిషన్లకు విద్యుత్ సరఫరా జరగడంతో అందులోవున్న ఎస్ఎంపీఎస్ బోరŠుడ్స,(స్విచ్మోడ్ ఫవర్ సప్లై), కొన్ని హీటర్ ఫ్యూజులు కాలిపోవడంతో మిషన్లు పనిచేయకుండా పోయాయి. సుమారు రూ. 10లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అవసరమైన స్పేర్ పాట్స్ వచ్చిన తరువాత యంత్రాలను బాగుచేస్తామని, తరువాత రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాం. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అత్యధిక ఓల్టేజీ రావడంతో మిషన్లు పాడై రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం న్యూట్రల్ పాయింట్ను సరిచేశాం. తద్వారా సేవలు కొనసాగించడానికి పక్క కేంద్రాలనుంచి డయాలసిస్ మిషన్లను తెప్పిస్తాం. పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో తిరిగి సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– డా. జి.నాగభూషణరావు,సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి న్యూట్రల్ పాయింట్ కాలిపోవడంవల్లే... డయాలసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ న్యూట్రల్ వైర్లు కాలిపోవడంవల్లే స్టెబిలైజర్ గుండా 450 ఓల్టేజ్ ప్రవహిం చింది. తద్వారా మిషన్లోవున్న ఎస్ఎంపీఎస్ బోర్లు కాలిపోయాయి. కేంద్రం లోవు న్న అన్ని మిషన్లు పనిచేయకుండా పోవడంతో రోగులకు ప్రత్యామ్నాయంగా పాలకొండ డయాలసిస్ కేంద్రానికి పంపిస్తున్నాం. – జితేంద్ర, నెప్రో ఇంజనీర్ -
మీ ఇళ్లూ ఇలాగే ఉంటాయా..?
నరసరావుపేట టౌన్ : ‘ఏమిటీ ఈ దుర్వాసన.. మీ ఇళ్ళు కూడా ఇలానే ఉంటాయా.. రిజిష్టర్లో డ్యూటీ డాక్టర్ సంతకమేది? ఫ్యాన్లు, లైట్లు తిరగకపోతే పట్టించుకోరా..’ అంటూ వైద్యాధికారులను కాయకల్ప బృందం రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ షాలినీదేవి, డాక్టర్ ఇ.ప్రశాంత్ ప్రశ్నించారు. స్థానిక ఏరియా వైద్యశాలను బుధవారం సందర్శించిన వారు పలు విభాగాలను పరిశీలించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర విభాగంలోని రిజిష్ట్రర్లో డ్యూటీ డాక్టర్ సంతకం చేయకపోవటాన్ని తప్పుపట్టారు. విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న సేవల నాణ్యత, పారిశుద్ధ్యం, వైద్యశాల భవన పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. మొదటి స్థానంలో నిల్చిన వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. రెండో బహుమతిగా రూ.10 లక్షలు, మూడో బహుమతిగా రూ.6 లక్షలు ఇస్తారన్నారు. జిల్లా అంతటా వైద్యశాలలను పరిశీలించి నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు అందజేస్తామని డాక్టర్ షాలినీ తెలిపారు. ఆమె వెంట సూపరింటెండెంట్ డాక్టర్ మోహనశేషు ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ అంకినీడు ప్రసాద్, డాక్టర్ మాధవీలత, సిబ్బంది ఉన్నారు. -
ఏరియా ఆస్పత్రిలో ఆడశిశువు మృతి
వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు మహబూబాబాద్ రూరల్ : మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆడ శిశువు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శిశువు తండ్రి బోడ వీరన్న, అమ్మమ్మ జ్యోతి కథనం ప్రకారం.. గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి శివారు జంగుతండాకు చెందిన వీరన్న తన భార్య సోనియాకు నొప్పులు రావడంతో మానుకోట ఏరియా ఆస్పత్రికి ఈనెల 16వ తేదీన తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ లేరని చెప్పడంతో సోనియాను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు పేదవారు కావడంతో డబ్బులు లేక మళ్లీ ఏరియా ఆస్పత్రికి సోనియాను తీసుకొచ్చారు. కాగా వైద్యురాలు మాలతీరెడ్డి సోనియాకు పరీక్షించిన అనంతరం డెలివరీకి ఇంకా నెల రోజులు సమయం ఉందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు వెంటనే ఆపరేషన్ చేయాలని తమకు చెప్పారని సోనియా తల్లి జ్యోతి వైద్యురాలు మాలతిరెడ్డికి చెప్పారు. అనంతరం వారు తమ తండాకు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మళ్లీ నొప్పులు పెరగడంతో ఆటోలో సోనియాను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆమెను సిబ్బంది పట్టించుకోలేదు. వైద్యురాలు మాలతిరెడ్డి వచ్చాక సాయంత్రం 5.30 గంటలకు సోనియాకు ఆపరేషన్ చేసి పుట్టిన ఆడ శిశువును ఎస్ఎన్సీయూలో పెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎన్సీయూ సిబ్బంది పాలు పట్టించమని శిశువును తల్లి వద్దకు పంపించారు. కాగా ఆ శిశువుకు పాలు తాగకపోవడంతో వెళ్లి ఆస్పత్రి సిబ్బందికి పరిస్థితిని వివరించగా పాపకు బాగోలేదని, ఆక్సిజన్ పెట్టారు. ఆ వెంటనే పాప మృతి చెందిందని చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటికీ సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని శిశువు తండ్రి బోడ వీరన్న, అమ్మమ్మ జ్యోతి అన్నారు. తమ పాప మృతిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైద్యురాలు మాలతిరెడ్డిపె చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతారణం నెలకొంది. వైద్యం కోసం వచ్చిన గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందించక పోవడంతో.. కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన బోగ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ మంగళవారం రాత్రి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడ సమయానికి వైద్యం చేయకపోవడంతో పాటు.. పరిస్థితి విషమించిన తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండని సూచించారు. దీంతో బుధవారం ఉదయం పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందిందని వైద్యలు తెలిపారు. దీంతో ఆమె బంధువులు ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
పెద్దాస్పత్రిలో ఒక్కటే అంబులెన్స్
నాలుగు అవసరం.. ఒకటి గజ్వేల్ ఆస్పత్రికి కేటాయింపు మరమ్మతులు లేక మూలనపడిన మరో వాహనం.. అంబులెన్సుల కొరతతో రోగులకు అవస్థలు అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేరేందుకు పాట్లు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ డివిజన్లోనే అతి పెద్దదైన మెదక్ ఏరియా ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సౌకర్యం కరువవుతోంది. దీంతో ప్రమాదంలో గాయపడినవారు, ఆపదలో ఉన్నవారు సరైన సమయంలో వైద్యం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ పట్టణంలోని డివిజన్లోనే అతి పెద్దది కాగా గతంలోనే వంద పడకల ఆస్పత్రిగా విస్తరించారు. ఈ ఆస్పత్రికి మెదక్ పట్టణం, మండలంతోపాటు పాపన్నపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, రామాయంపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలతోపాటు నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. ఆయా మండలాల నుండి తరలివచ్చే రోగులతో ఆస్పత్రి నిత్యం కిటకిటలాడుతుంది. ఈ ఆస్పత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింగా ఇటీవలే ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందజేసింది. కానీ ఈ వంద పడకల ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు అధికారులుగానీ, ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఆస్పత్రిలో కేవలం ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడం గమనార్హం. ఆస్పత్రిలో అంబులెన్స్ కొరత వల్ల రోగులు అత్యవసర సమయంలో హైదరాబాద్కు తరలివెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేసున్నారు. కాగా ఆస్పత్రికి ఒకే ఒక అంబులెన్స్ ఉండడంతో అత్యవసర ‡సమయంలో బాధితులను హైదరాబాద్కు తరలిస్తే మరోచోట ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతున్నారని రోగులు వాపోతున్నారు. మెదక్ ఆస్పత్రికి నాలుగు అంబులెన్స్లు అవసరముంటే ఒక్కటి మాత్రమే ఉన్నట్లు సమాచారం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాజీ ఎంపీ నరేంద్ర హయాంలో ఒక అంబులెన్స్ను అందించారు. కొన్ని రోజులు ఆ అంబులెన్స్ రోగులకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే అంబులెన్స్ చెడిపోవడంతో తిరిగి దానికి మరమ్మతు చేయించకుండా మూలన పడేశారు. అనంతరం మాజీ ఎంపీ విజయశాంతి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్ మంజూరు చేశారు. నిత్యం వందలాది సంఖ్యలో వివిధ రోగాలతో వచ్చే వారికి అందుబాటులో అత్యవసర సేవల కోసం ఆరు నెలల క్రితం మెదక్ ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి çపద్మాదేందర్రెడ్డి మరో అంబులెన్స్ను మంజూరు చేశారు. అయితే ఆ అంబులెన్స్ను 3నెలల క్రితమే గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి అక్కడి అవసరాలకోసం పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కాని వంద పడకల ఆస్పత్రికి నాలుగు అంబులెన్స్లు ఉండాల్సి ఉండగా, ఒక్కటి మాత్రమే ఉండడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ లేక రోగులు పడుతున్న బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఉన్నవి మరమ్మతులు చేయించకుండా, స్థానిక ఎమ్మెల్యే మంజూరు చేసిన అంబులెన్స్ను మరో ఆస్పత్రికి తరిలించి ఏరియా ఆస్పత్రి నిర్వాహకులు ఇక్కడికి వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్లు అందుబాటులో ఉంచి రోగులకు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆస్పత్రికి వచ్చే రోగులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. 07ఎండికె06: ఏరియా ఆస్పత్రిలో చెడిపోయి వృథాగా పడిఉన్న అంబులెన్స్ ======================================== -
ఏరియా ఆస్పత్రిలోనే
మహబూబాబాద్ : డీసీహెచ్ఎస్, డీఎంఅండ్హెచ్ఓ కో ఆర్డినేషŒS కోసం డీహెచ్ఓ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలయం ఏరియా ఆసుపత్రిలోని క్వార్టర్స్లోనే ఉండేలా పనులు ముమ్మరం చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏడు క్వార్టర్లు ఉన్నాయి. ఒక క్వార్టను మూడు రోజుల క్రితం ఖాళీ చేయించారు. మానుకోట జిల్లాకు డీహెచ్ఓను నియమిస్తారని, ఏరియా ఆసుపత్రిలోని సివిల్ సర్జ¯ŒS లేక సివిల్ అసిస్టెంట్ సర్జ¯ŒSలో సీనియారిటీని బట్టి ఆ పోస్టుకు నియమించే అవకాశం ఉందని సమాచారం. మానుకోట ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జ¯ŒS సీనియర్ వైద్యులు ఉన్నారు. ఆయనకే డీహెచ్ఓగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. డీసీహెచ్ఎస్ పరిధిలో మానుకోట ఏరియా ఆస్పత్రి, గూడూరులోని సివిల్ ఆస్పత్రి ఉంటాయి. డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 16 పీహెచ్సీలు ఉన్నాయి. ఆ రెండింటిని కో ఆర్డినేష¯ŒS చేసేలా డీహెచ్ఓను నియమించనున్నారు.జిల్లా వైద్య విధాన పరిషత్లో ఉన్న ఆసుపత్రులు, డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో ఉన్న ఆసుపత్రులను కలిపి ఒకే విభాగంగా చేసి వీటికి జిల్లా అధికారిగా డీహెచ్ఓకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మానుకోట ఏరియా ఆసుపత్రి 100 పడకలకే పరిమితమైంది. మానుకోట డివిజ¯ŒSతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రోజుకు 700–800 మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే సీటీ స్కా¯ŒS, బ్లడ్ బ్యాంక్, రేడియాలజిస్ట్, నేత్ర వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పాడై నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఏర్పాౖటెతే అయినా ఈ సమస్యలు గట్టెక్కుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో.. బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
పద్ధతి మార్చుకోండి
రోగులకు మెరుగైన వైద్యం అందించండి నిజాయితీగా పనిచేయండి.. లేదంటే చర్యలు తప్పవు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్పై మంత్రి హరీశ్రావు ఆగ్రహం ఆధునిక పరికరాలు నిరుపయోగంగా ఉండటంపై మండిపాటు సిద్దిపేట జోన్: మెరుగైన వైద్యం కోసం కోట్లు ఖర్చు పెట్టినా వైద్యుల్లో మార్పు రాకపోవడం బాధకరంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. సెమిఆటో ఎనలైజర్ పరికరం నిరుపయోగంగా ఉండడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని బదులివ్వాలని అక్కడే ఉన్న సూపరింటెండెంట్ శివరాంను ప్రశ్నించారు. డాక్టర్ శివరాం బదులిస్తూ ఆర్డీఓ సమస్య, నోట్ఫైల్ సమస్య అంటూ ఎదో చెప్పబోయాడు. వెంటనే మంత్రి అందుకోని ఆర్డీఓ పట్టణంలోనే ఉన్నప్పటికీ, రెండు లైన్ల నోట్ఫైల్ను తయారు చేయక మూడు నెలలుగా విలువైన పరికరాన్ని నిరుపయోగంగా ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కష్టపడి అధునిక వసతులు కల్పిస్తే..మీరు చేసే నిర్వాకం వల్ల వినియోగంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఐదు నెలల్లో 6 కోట్లతో ఆధునిక పరికరాలను సమకూర్చామన్నారు. మీలో మార్పు రాకపోతే ప్రజలకు వైద్యం అందడం కష్టమన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది, వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని పర్యవేక్షించే తీరిక లేకపోవడం సమంజసం కాదన్నారు. ఒక దశలో సూపరింటెండెంట్ వేతనం గూర్చి తెలుసుకున్న మంత్రి హరీశ్రావు ప్రభుత్వ ఉద్యోగిగా, వైద్యునిగా తీసుకున్న జీతానికి సార్థకత చేయాలన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలను తీసుకుంటానని హెచ్చరిస్తూ అక్కడే ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాం అధికారి జగన్నాథ్రెడ్డిని ఆదేశించారు. 13 మంది ఉన్నప్పటికీ బయటికా...? సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో 13 మంది ల్యాబ్ టెక్నిషియన్లు ఉన్నప్పటికీ వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపడం ఆశ్చర్యకరంగా ఉందని మంత్రి అన్నారు. బ్లడ్బ్యాంక్ పనితీరుపై జిల్లా రెడ్క్రాస్ సోసైటీ సెక్రటరీ వనజారెడ్డి, జిల్లా డీపీఓ జగన్నాథరెడ్డి, బ్లడ్బ్యాంక్ ఇన్చార్జి రామ్మోహన్తో వివరాలు సేకరించారు. పలుసార్లు పరీక్ష కోసం బయటకు చిట్టీలు రాస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్బ్యాంక్లో టెక్నిషియన్లుగా పనిచేస్తున్న వారిలో కొందరిని ఏరియా ఆసుపత్రికి, ఎంసీహెచ్కు సేవల కోసం కేటాయించాలని వైద్యాధికారులను అదేశించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం కోట్లు ఖర్చు చేస్తే వైద్యలు, సిబ్బందిలో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తానని వారే ఆసుపత్రుల్లో కూర్చుని సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్రాజు, హై రిస్కు ఇన్చార్జి కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
కంటి ఆపరేషన్లు బంద్
10 రోజులుగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు పట్టించుకోని అధికారులు కంటి ఆపరేషన్లకు అవసరమైన బీఎస్ఎస్ (బయలాజిక్ సాల్ట్ సొల్యూషన్) లేకపోవడంతో శస్త్రచికిత్సలు బంద్ అయ్యాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రతి రోజూ ఆసుపత్రికి వచ్చి, ఆ మందు రాలేదని తెలుసుకుని తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడూరు: గూడూరు ఏరియా ఆసుపత్రిలో నేత్ర వైద్యనిపుణులుగా పనిచేసే వైద్యులు గోపీనాథ్ శస్త్రచికిత్సల్లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఆపరేషన్ల కోసం గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, కోట, వాకాడు తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో 10 రోజులుగా ఆపరేషన్కు అవసరమైన బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్ఎస్ తెప్పించాల్సిన ఆసుపత్రి అదికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యులు చెపుతున్నారు. ఈ మేరకు డీపీఎంతో మాట్లాడం జరిగిందని, ఆమె కూడా పలు పర్యాయాలు కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా వారు పంపలేదని, ఈ మందును బయట నుంచి తెప్పించకూడదని ఆమె చెపుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారుల స్పందించి బాగా ఆపరేషన్లు చేసే గూడూరు ఏరియా ఆసుపత్రి వైద్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన మందు సామగ్రిని సరఫరా చేయాలని కూడా కోరుతున్నారు. వాళ్లను తిప్పుకుంటుంటే బాధగా ఉంది : గోపీనాద్. నేత్ర వైద్యులు బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. అది ఎప్పుడొస్తుందో తెలీదు. దీంతో రోజూ వాళ్లు వస్తుంటే ఆ మందు రాకపోవడంతో వాళ్లను తిప్పాల్సి వస్తోంది. ఎన్ని సార్లు తిరగాలి : రమణయ్య, దగ్గవోలు ఆపరేషన్ కోసం రెండు సార్లు వచ్చాం. వస్తే ఆ మందు ఇంకా రాలేదు అంటున్నారు. ఎన్ని సార్లు తిరగగలం. అధికారులు సమస్యను పరిష్కరించాలి. -
అడిగేవారు లేరనుకున్నారా!
♦ వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరావు ఆకస్మిక తనిఖీ ♦ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం ♦ రోగులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిక వికారాబాద్ రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు సంతకం చేసి ప్రైవేటులో సేవలు చేస్తారా.. అడిగేవారు లేరనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యే సంజీవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ’’ఇందులో శైలజ అనే నర్సు సంతకం ఉంది.. ఆమె స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది కదా.. ఇప్పుడే నేను అక్కడ చూశాను.. ఆమె సంతకం ఇక్కడ ఎలా పెట్టిందని అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ను ప్రశ్నించారు. ఉదయం వచ్చి సంతకం చేసి పని ఉంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిందని సమాధానం రావడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ నోటీసులు పంపించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అంతా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. రోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. సూపరింటెండెంట్ స్థానికంగా ఉండడని, ఫోన్ తీయడని, అతనికి భయం లేనప్పుడు మిగతా వారు అలాగే ప్రవర్తిస్తారని చురకలంటించారు. పనులు చేసేవారు ఉండండి లేదంటే ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లండన్నారు. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నో బాధలతో వచ్చే వారికి ఉపశమనం కలిగేలా చూడాలిగానీ కొత్త ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్పటేల్, నాయకులు భూమోళ్ల కృష్ణయ్య, చంద్రకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ఏరియా’.. అదిరెనయా
♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ ఈనెల 11న హైదరాబాద్లో ప్రదానం ♦ హైరిస్క్’లో టార్గెట్కు మించి ప్రసవాలు మెదక్ : స్థానిక ఏరియా ఆస్పత్రి.. ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మెదక్ ఏరియా ఆస్పత్రితోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా ఆస్పత్రులుగా గుర్తించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు ఈ నెల 11న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఏడాదికి 1400 ప్రసవాలు చేయాలనే టార్గెట్ ఉండగా, 2,400 చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అలాగే నెలకు 10యూనిట్ల రక్తానికి గాను, ప్రస్తుతం నెలకు 60-70 యూనిట్ల రక్తాన్ని వినియోగిస్తున్నారు. హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో ప్రసవాలు రెట్టింపుస్థాయిలో అవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మెరుగైన సేవలే అందుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఆరు మాసాల క్రితం కొత్త బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ బెడ్షీట్స్ రోజుకో కలర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మెదక్లో ప్రథమంగా బెడ్షీట్ల మార్పిడిని పెలైట్గా ఏర్పాటు చేసి మంచి ఫలితాలను సాధించారు. మూడు నెలల క్రితం ఏరియా ఆస్పత్రిలో రూ.12లక్షలు వెచ్చించి అధునాతన ఎక్స్రేలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిరుపేదలకు మెరుగైన సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకు ఇప్పటికే డయాలసిస్తోపాటు ఐసీయూ మంజూరు చేయించాం. 100 నుంచి 250 పడకల ఆస్పత్రిగా, గర్భిణులకు అదనంగా 50 పడకల కోసం ప్రతిపాదనలు పంపాం. -డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఏడాదిగా మెదక్ ఏరియా ఆస్పత్రిలో నిరుపేదలకు అనేక రకాలుగా సేవలందిస్తున్నాం. ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా గుర్తించింది. ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. -పి.చంద్రశేఖర్, సూపరింటెండెంట్ -
కరెంటు షాక్తో వ్యక్తి మృతి
బల్మూరు(మహబూబ్నగర్ జిల్లా): బల్మూరు మండలం జినుకుంట సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తూ కరెంటు షాక్తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని నాగర్కర్నూలు ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంత మెరుగైన చికిత్స అందించేందుకు ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
గుంటూరు జిల్లాలో ఏసీబీ దాడులు
నరసరావుపేట: గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్ బిల్లు మంజూరుకు లంచం అడగటంతో సదరు చిరుద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏరియా వైద్యశాలలో జూనియర్ శానిటరీ వర్కర్గా విధులు నిర్వహించే తలమాల దుర్గారావుకు పది రోజుల క్రితం రూ.62,500లు ఇంక్రిమెంట్ ఎరియర్స్ కింద మంజూరయ్యాయి. వాటికి సంబంధించి బిల్లు పాస్చేసి చెక్కు ఇచ్చేందుకు వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ కె.నరేంద్రబాబు రూ.15వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో దుర్గారావు రూ.5వేలకు బేరం కుదుర్చుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్రబాబు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
వైద్యం అందక నిండు గర్భిణి మృతి
తూర్పుగోదావరి జిలా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నిండు గర్భిణి వైద్యం అందక కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కళావతికి నెలలు నిండాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయం నొప్పులు వస్తుండటంతో ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో.. శనివారం ఒక్కరు కూడా లేరు.. దీంతో స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ చేసింది. అనంతరం కళావతి చనిపోయినట్టు ఆమె భర్త, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పోవడం వల్లే కళావతి చనిపోయిందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
బతికించాల్సిన వారే.. బయటికి గెంటేశారు
- గాయపడిన వ్యక్తికి 13 రోజులుగా చికిత్స అందించని ప్రభుత్వ వైద్యులు - కుళ్లిపోరున బాధితుడి కాలు - దుర్వాసన వచ్చి పురుగులు పట్టినా పట్టించుకోని సిబ్బంది - కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో అందిన చికిత్స - సూపరింటెండెంట్ను సస్పెండ్ - చేయూలని ఆస్పత్రి ఎదుట ధర్నా మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి 13 రోజుల క్రితం ఏరియా ఆస్పత్రికి రాగా వైద్యులు కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అతడి కాలికి సెఫ్టిక్ అరుు్య పురుగులు పడి కుళ్లిపోరుుంది. దుర్వాసన వస్తుండడంతో రోగులిచ్చిన సమాచారంతో కాంగ్రెస్ నాయకులు రాగా అసలు విషయం బయటపడింది. మానుకోట ఏరియూ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్కు చెందిన భాస్కర్ల మోహన్ 13 రోజుల క్రితం పని మీద మానుకోటకు వచ్చాడు. పట్టణంలోని పాతబజారులోని రూరల్పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. స్థానికుల సహకారంతో ఏరియా ఆస్పత్రికి చేరుకున్న అతడికి వైద్యులు చికిత్స అందించలేదు. కనీసం అడ్మిట్ కూడా చేసుకోలేదు. సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో చేసేదేమి లేక ఆస్పత్రి ఆవరణలోనే జీవచ్ఛవంగా ఉండిపోయాడు. ఎడమ కాలి నుంచి రక్తం కారి చివరికి కుళ్లిపోరుు కాలి ఎముకలు కూడా బయటకెళ్లారు. కుళ్లిపోరు పురుగులు వస్తున్నా, కంపు కొడుతున్నా అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు నుంచి వైద్యులు, రోగులు వెళ్తూ ఆ దుర్వాసన భరించలేక ముక్కు మూసుకున్నారే తప్పా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చిన కొందరు రోగులు కాంగ్రెస్ నాయకులకు సమాచారమిచ్చారు. జెడ్పీ ఫ్లోర్లీడర్ మూలగుండ్ల వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.వెంకట్రాములు అక్కడికి చేరుకోగా.. విధుల్లో ఇంత నిర్లక్ష్యమా అని నాయకులు నిలదీశారు. ఆయన మాత్రం తనకు ఈ విషయం తెలియదని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వారికి ఆయనతో తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో వారు డీఎంఅండ్హెచ్ డీసీహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన వైద్యులు మోహన్ను ఆస్పత్రిలోని వార్డుకు తీసుకె ళ్లి చికిత్స ప్రారంభించారు. సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయూలి : కాంగ్రెస్ నాయకులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏరియూ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.వెంకట్రాములును సస్పెండ్ చేయూలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ కాలు కోల్పోవడానికి కారణం వైద్యులేనన్నారు. కార్యక్రమంలో నాయకులు పంజాల శ్రీను, బొల్లు రాజు, అప్పె వేణు, గుగులోత్ వెంకట్, సోమ శ్రీనివాస్, వెంకటాచారి, భాస్కర్, వీరభద్రం, మహమూద్, ప్రసాద్, రోగులు, నాయకులు పాల్గొన్నారు. -
ఏరియా ఆస్పత్రిలో రక్తం నిల్వలు నిల్
పార్వతీపురం: స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధిలో నిల్వలు నిండుకున్నాయి. వేసవి కారణంగా రక్తదాతలు ముందుకురాకపోవడంతో మంగళవారం నాటికి 8 ప్యాకెట్ల(యూనిట్ల) రక్తం మాత్రమే నిల్వ ఉంది. ఈ విషయమై రక్తనిధి ఇన్చార్జి జి.వాసుదేవరావు మాట్లాడుతూ పార్వతీపురం సబ్ప్లాన్ ప్రాంతంతోపాటు సమీప శ్రీకాకుళం జిల్లా, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన రోగులు ఆస్పత్రికి అధికంగా వస్తున్నారని చెప్పారు. వీరిలో పలువురికి రక్తం అవసరమవుతోందని చెప్పారు. కానీ రక్తదానం చేసేందుకు కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తుండటంతో అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 8 నుండి 10 ప్యాకెట్ల(యూనట్ల) రక్తం అవసరమవుతుందని తెలిపారు. దీనికితోడు అన్-స్క్రీన్డ్ రక్తం నిల్వ చేసేందుకు ఫ్రిజ్ లేదని చెప్పారు. మరోవైపు ఏపీసాక్స్ కి ట్ల పంపిణీ ఆగిపోయిందన్నారు. దీంతో అవస్థలు తప్పడం లేదన్నారు. రక్తదానానికి ఎప్పుడూ ముందుకొచ్చే దాతలు తప్ప కొత్తవారు రావడం లేదన్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థల వారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానంపై యువతకు అవ గాహన కల్పించాలని సూచించారు. -
సౌకర్యాల స్థాయి పెరగలేదు!
పేదల వైద్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమన్వయం, పర్యవేక్షణ లోపంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి రాజాం ఏరియా ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆస్పత్రిని 60 పడకల నుంచి 100 పడకల స్థాయికి రెండేళ్ల క్రితం మార్చారు. సుమారు రూ.4 కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించారు. అయితే వైద్య పరీక్షలు, చికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చడంలో మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థాయి పెరిగినా.. ఆ స్థాయి వైద్యసేవలు అందక పేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద జబ్బులు చేస్తే వేరే ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సకాలంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు రాజాం ఎమ్మెల్యేల కంబాల జోగులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. వైద్యాధికారులను, ఇతర సిబ్బందితో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, అవసరాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి తన స్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. వివిధ వర్గాలవారితో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా.. రోగులతో.. ఎమ్మెల్యే జోగులు(గైనిక్ వార్డులో): మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆపరేషన్ చేశారా లేక సాధరణ డెలివరీయా? ఎంత ఖర్చు అయింది? స్టాఫ్కు డబ్బులు ఏమైనా ఇచ్చారా? మడ్డు దుర్గ(రోగి): రాజాం మండలం బొద్దాం నుంచి జనవరి 29న వచ్చి జాయిన్ అయ్యాను. సాధారణ డెలివరీ చేశారు. రూ.200 ఖర్చు అయ్యింది. స్టాఫ్ ఎవరూ డబ్బులు అడగలేదు. ఎమ్మెల్యే : మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? ఆస్పత్రి పనితీరుపై మీ అభిప్రాయమేంటి? ముగడ నరిశింహులు(రోగి సహాయకుడు) : నా పేరు ముగడ నరిశింహులు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామం. పేషెంట్తో వచ్చా. జ్వరం, జలుబు, ఒళ్లుపీకులు ఉన్నాయని డాక్టర్కు చెప్పాం. మందులు ఇచ్చారు. గవర్నెమెంట్ మందులు కావడం వల్ల తగ్గడం లేదని చెప్పాం. మరి అవే ఉన్నాయని డాక్టర్ చెప్పారు. బయట మందులు కొనలేం. ఏం చేయాలో తోచడం లేదు. ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏంటి ప్రాబ్లమ్? ఎప్పుడు జాయిన్ అయ్యావ్? బాత్రూంలు బాగున్నాయా? నీటి సౌకర్యం ఉందా? జి.అప్పలనరసమ్మ(రోగి): విరేచనాలు, కడుపునొప్పితో వచ్చి జాయిన్ అయ్యాను. బాతరూంలు కంపు కొడుతున్నాయి. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. తాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏం జరిగింది? కాలుకి ఎలా దెబ్బ తగిలింది? వైద్యులు ఏమన్నారు? మందులు ఇస్తున్నారా? గురవాన లక్షుం(రోగి): పొలంలో కాలు జారి పడ్డాను. ఎముక విరిగింది. వైద్యులకు చూపిస్తే కట్టు కట్టారు. మందులు ఇస్తున్నారు. పరవాలేదనిపిస్తోంది. ఆపరేషన్ చేయడానికి షుగర్ ఉందన్నారు. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో జాయిన్ అయ్యావు, ఏమైంది బాబూ? ఏంటి నీ సమస్య? నాగళ్ల దుర్గారావు(రోగి): కడుపు నొప్పితో జాయిన్ అయ్యాను. మందులు ఇచ్చారు. గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు. ఇప్పుడు బాగుంది. సూపరింటెండెంట్తో.. ఎమ్మెల్యే: ఆపరేషన్లు ఎందుకు చేయటం లేదు? అవసరమైతే ఎలా మరీ? గార రవిప్రసాద్(సూపరింటెండెంట్): ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగులేకపోవడటంతో విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇంకా రెస్పాండ్ కాలేదు. ఎమ్మెల్యే: ఓపీ, ఇతర వైద్య సేవలకు ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఎంతమంది అవసరం? రవిప్రసాద్: ప్రతి రోజూ ఓపీకి 350 నుంచి 400 కేసులు వస్తాయి. ఐపీకి మరో 30 వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 8 మంది వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్ మెడిసన్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, ఎముకలు, మానసిక వైద్య నిపుణులు సాయిరాం, డెంటిస్టు, అనస్థసిస్ట్ ఉన్నారు. మరో ఆరుగురు వైద్యులు అవసరం. ఎమ్మెల్యే: కనీస అవసరాలకు కావల్సిన సిబ్బంది ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి? రవిప్రసాద్: బెడ్షీట్లు ఉతకడానికి దోబీ లేడు. పోస్టు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను కోరినా స్పందించడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయలేకపోతున్నాం. ఎలక్ట్రీషియన్ లేడు. కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నాం. సొంత డబ్బులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నాం. చాలా కష్టంగా ఉంది. ఎమ్మెల్యే: ప్రస్తుతం స్వైన్ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది కదా.. దాని నివారణకు ఏమైనా సౌకర్యాలు కల్పించారా? కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? ప్రత్యేక నిధులు ఏమైనా మంజూరు అయ్యాయా? రవిప్రసాద్: స్వైన్ఫ్లూ లక్షణాలు కలిగిన రోగులు ఇంతవరకు రాలేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలు ఏమీ కల్పించలేదు. నిధులు కూడా మంజూరు కాలేదు. ఇక్కడికి వచ్చే రోగుల్లో అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రిమ్స్కు తరలిస్తాం. ఎమ్మెల్యే: ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదు కదా!.. ఎలా మేనేజ్ చేస్తున్నారు? రవిప్రసాద్: ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అవసరమైతే హెచ్డీఎఫ్సీ నిధులు ఖర్చు చేయమని చెప్పారు. కానీ ఇంతవరకూ కమిటీ ఏర్పాటు కాలేదు. మీటింగ్ కూడా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు నెలకు సుమారు రూ. 15వేల వరకు ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో సగం మంది ఈ ప్రాంతం వారమే కాబట్టి.. సొంత ఊరిపై మమకారంతో ఆస్పత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు భరిస్తున్నాం. చిన్నపిల్లల వైద్యనిపుణుడితో.. ఎమ్మెల్యే: చిన్న పిల్లల ఓపీ ఎంత ఉంటుంది? మందులు పూర్తి స్థాయిలో ఉన్నాయా? కరణం హరిబాబు(చిన్నపిల్లల వైద్యనిపుణుడు): ప్రతి రోజూ ఓపీ 50 నుంచి 60 వరకు ఉంటుంది. కొన్ని మందులు ఆస్పత్రిలోనే లభిస్తాయి. మరికొన్ని బయట మందులు షాపుల్లో దొరుకుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటి మందులు రాస్తాం. నర్సులతో.. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో దుర్వాసన వస్తోంది. రోగులు ఉండలేక పోతున్నామంటున్నారు. పారిశుధ్ధ్య సిబ్బంది పనులు చేయటం లేదా? కాంట్రాక్టర్ రావటం లేదా? సోఫియా(హెడ్ నర్సు): దోబీ లేకపోవటంతో బెడ్షీట్లు ఉతకటం కుదరడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయటం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం రావటం లేదు. సూపర్వైజరే అన్నీ చూస్తున్నారు. గదులు శుభ్రంగా ఉంచుతున్నాం. ఎమ్మెల్యే: ఏమమ్మా.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందా? పని విషయంలో భద్రత దొరుకుతుందా? విజయలక్ష్మి(స్టాఫ్ నర్స్): పదో పీఆర్సీ అమలు చేయటం లేదు. పనిలో భద్రత దొరకడం లేదు. పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. పని పెరిగింది. సిబ్బంది తక్కువగా ఉన్నారు. మరో 14 మంది స్టాఫ్ నర్సులను నియమించాల్సి ఉంది. ఎమ్మెల్యే(ముక్తాయింపు): మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.. పరిష్కారానికి చొరవ చూపుతా.. -
గోదావరిఖని ఆస్పత్రిలో బాలింత మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఒక బాలింత మృతి చెందింది. మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన అరుణ(21) కాన్పు కోసం ఆదివారం ఆస్పత్రిలో చేరింది. సోమవారం కవల ఆడశిశువులకు జన్మినిచ్చింది. ఒక పసికందు మృతి చెందగా, మరో శిశువు ఆరోగ్యంగా ఉంది. కాగా, శుక్రవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైన అరుణ చనిపోయింది. ఉదయం నుంచి అరుణకు కళ్లు కన్పించటం లేదని, చెవులు వినిపించటం లేదని.. ఈ విషయం డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆమె తల్లి పోచమ్మ తెలిపింది. కొద్దిసేపటికే పరిస్థితి విషమించి అరుణ మృతి చెందిందని ఆమె విలపించింది. అరుణ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త రమేష్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
సదరం క్యాంపులో గందరగోళం
మహబూబాబాద్ :మానుకోటలో బుధవారం జరిగిన సదరం క్యాంపు వద్ద గందరగోళం నెలకొంది. రోజూ 150 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేల సంఖ్యలో వికలాంగులు క్యాంపునకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి సిబ్బంది చేతులెత్తేశారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి సదరంక్యాంపు ని ర్వహిస్తున్నారు. మానుకోట, నర్సంపేట డివి జన్లకు సంబంధించిన వికలాంగులు ఈ క్యాంపునకు హాజరవుతున్నారు. 11 రోజులుగా క్యాంపు ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది. అరుుతే ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరీక్షలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సిబ్బందివారికి ప్రత్యేకంగా స్లిప్లను పంపిణీ చేశారు. బుధవారం వచ్చేందుకు మానుకోట పట్టణంలో 50 మందికి, మండలంలోని ఇతర గ్రామాల్లో 100 మందికి స్లిప్లు పంపిణీ చేశారు. అరుుతే ఆ స్లిప్లపాటు నకిలీ స్లిప్లు కూడా పెద్ద సంఖ్య లో పంపిణీ అయ్యాయి. ఆ స్లిప్లతో శిబిరానికి వందలాదిగా వచ్చిన వికలాంగులు తమకు పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకు దిగారు. వారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పోలపాక మల్లయ్య, సురుగు ఐలయ్య, గార్లపాటి వెంకటేశ్వర్లు, తోట బిక్షం, దుగ్గి సారయ్య మాట్లాడుతూ క్యాంపును పొడగించాలని, వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారందరికి సదరం స ర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ మల్లయ్య, మునిసిపల్ కమిషనర్ రాజలింగు అక్కడికి చేరుకుని డీఆర్డీఏ కేవలం 150 స్లిప్పులు మాత్రమే పంపిణీ చేసిందని, మిగతా కార్డులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సదరం క్యాంపు నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లతోపాటు పింఛ న్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిగతావారిని తిరిగి ఇంటికి పంపిం చారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిలువనీడ లేక వికలాంగులు ఎండలో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా నకిలీ స్లిప్లు తయారు చేసిన వారిపై అధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శంకర్ తెలిపారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణ
ఏరియా ఆస్పత్రిలో విద్యార్థి సంఘాల ఆందోళన వీడియో చిత్రీకరణతో మృతదేహానికి పోస్టుమార్టం పాఠశాలలో విద్యార్థులను విచారించిన అధికారులు మహబూబాబాద్ టౌన్ : మానుకోటలోని మహర్షి విద్యాలయంలో ఆరోతరగతి విద్యార్థి మునిగడప ప్రణయ్ ఆదిత్య(11) అనుమానాస్పద మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రణయ్ ఆదిత్య గురువారం రాత్రి అదే పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, కుల, ప్రజాసంఘాలు, మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఆర్డీఓ మధుసూదన్నాయక్ ఇచ్చిన హామీ మేరకు తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య ఆధ్వర్యంలో టౌన్ సీఐ పింగిళి నరేశ్రెడ్డి, డివిజన్ ఉపవిద్యాధికారి డాక్టర్ ఏ రవీందర్రెడ్డి, ఎంఈఓ నల్ల లింగయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీంసాగర్, తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వైద్యులు దేవేందర్, వెంకటేశ్వర్లు ఆ విద్యార్థి మృతదేహానికి వీడియో చిత్రీకరణ మధ్య శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించా రు. ఈ సందర్భంగా సీఐ పింగిళి నరేశ్రెడ్డి మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఉదయమే డిప్యూటీ డీఈఓ ఏ రవీందర్రెడ్డి, తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంఈఓ నల్ల లింగయ్యతో కలిసి మహర్షి విద్యాలయానికి వెళ్లి మృతిచెందిన విద్యార్థి తోటి పిల్లలను, ఇతర విద్యార్థులను విచారించామన్నారు. తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య మాట్లాడుతూ పోస్టుమార్టం వీడియోను కలెక్టర్కు పంపిస్తామని చెప్పారు. -
ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి
జనరిక్ మందుల అమ్మకానికి చర్యలు ఏపీ వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనకదుర్గమ్మ నర్సీపట్నం టౌన్ : రాష్ట్రంలో 30 ఆస్పత్రుల స్థాయి పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఏపీ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ పి.కనకదుర్గమ్మ తెలిపారు. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా జిల్లాలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. చిన్న పిల్లల వార్డు ఆపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు ఉండి ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు ఎందుకు కొనుగోలు చేయలేదని సూపరింటెండెంట్ దొరను నిలదీశారు. గర్భిణుల ప్రాథమిక తనిఖీ సమయంలో ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని గైనకాలజిస్టులు డాక్టర్ సుధాశారద, విజయశాంతిలకు సూచించారు. ప్రసూతి విభాగంలో పుట్టిన వెంటనే బిడ్డలను సంరక్షించే విధానాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అన్ని కేసులును విశాఖపట్నం రిఫరల్ కాకుండా సాధ్యమైనంత వరకు వైద్యం అందించాలన్నారు. మత్తు డాక్టర్ కొరత ఉన్నప్పుడు ఆస్పత్రి ఆభివృద్ధి నిధులతో అవుట్సోర్సింగ్లో నియమించుకోవచ్చన్నారు. దంత, కళ్లు విభాగంలో అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆదేశించారు. అత్యవసర వార్డులో అత్యావసర మందులు, పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యానికి అవసరమైన వస్తువులను వినియోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని పరుగులెత్తించారు. కాంట్రాక్టర్ అమర్నాథ్తో ఫోన్లో మాట్లాడి పారిశుద్ధ్యం మెరుగు విషయంలో పద్ధతి మార్చుకోకపోతే పని మానేయండని హెచ్చరించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఆస్పత్రుల వరకు స్థాయిని పెంచేందుకు సిద్ధం చేసిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. ఏరియా ఆస్పుత్రుల్లో నిపుణులైన వైద్యుల కొరత అధికంగా ఉండడంతో. పిహెచ్సీల్లో పని చేస్తున్న నిపుణులైన వైద్యులను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జనరిక్ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆమె వెంట జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపీపీ సుకల రమణమ్మ ఉన్నారు. వైద్యుల ఖాళీలు భర్తీ అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న 200కు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ పి. కనకదుర్గమ్మ తెలిపారు. ఇక్కడి ఎన్టీఆర్ వందపడకల ఆస్పత్రిని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం నిర్వహణపైన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం, కోటవురట్ల ఆస్పత్రులను కూడా పరిశీలించామన్నారు. అనకాపల్లి ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. 13 జిల్లాల్లో 118 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయని, వీటిలో స్పెషలిస్టుల కొరత ఉందని, వీటి భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా హెల్త్ సొసైటీ నుంచి ఆస్పత్రికి రూ.10 లక్షల వరకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్రెజరీ ద్వారా తమకు కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. జనరల్ ట్రాన్స్ఫర్లు, హెల్త్ కార్డులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమిషనర్ను కలిసిన వారిలో ఏపీ వైద్య విధాన పరిషత్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్మెంబర్ బి.ఎ. రామ్మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ ఎ. సింహాచలం, జనరల్ సెక్రటరీ బి.సోమేశ్వరరావులు ఉన్నారు. -
డిప్యూటీ సీఎం చెప్పినా.. తీరు మారలేదు
జనగామ ఏరియా ఆస్పత్రిలో బయటపడిన వైద్యుల నిర్లక్ష్యం మరోమారు ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇప్పటికీ తీరు మార్చుకోని వైద్యులు వైద్యాధికారుల నిర్వాకంపై కలెక్టర్ ఫిర్యాదు జనగామ రూరల్ : డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య ఏరియూ ఆస్పత్రిని సందర్శించి.. వైద్యులను, సిబ్బం దిని హెచ్చరించినా వారు పనితీరు మార్చుకోలేదు. ఆయన వచ్చి వెళ్లి 24 గంటలు గడవక ముందే విధు ల్లో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి బుధవారం మరోసారి ఆస్పత్రిని సం దర్శించి.. రికార్డులు పరిశీలించి డ్యూటీ డాక్టర్ పద్మ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు లేఖ రాశారు. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంగళవారం ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా వారు వెళ్లిపోయూక 11 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందిన వ్యక్తిని గురించి వైద్యులు పోలీ సులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టకు చెందిన మృతుడు కంచర్ల రంగాచారి(43) చనిపోయి రోజులు గడుస్తున్నా.. అతడి మరణవార్తను బంధువులకుగాని, పోలీసులకుగాని ఇంతకాలం చెప్పలేదు. సాక్షి మెయిన్ పేజీలో వచ్చిన కథనాన్ని చూసి ఈ విషయమై ఆరా తీసేందుకు స్థానిక బీజేపీ నాయకులు ఉదయం ఆస్పత్రిని సందర్శించగా.. డ్యూటీ డాక్టర్ ఎస్.పద్మ ఉదయం రిజిష్టర్లో సంతకం చేసి 11 గంటల్లోపే వెళ్లిన విషయం వెలుగు చూసింది. దీంతో బీజేపీ నాయకులు కేవీఎ ల్ఎన్రెడ్డి, శివరాజ్యాదవ్, దేవరాయ ఎల్లయ్య, గూడెల్లి కనకారెడ్డి, ముక్కస్వామి వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోమారు ఎమ్మెల్యే ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మృతుడి కుటుం బ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు విఫలయ్యారని ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బందిని నిలదీశారు. రంగాచారి మృతి సమాచా రం అందించడంలో.. రిజిష్టర్లో సంతకం చేసి 11 గంటలలోపే వెళ్లిన డ్యూటీ డాక్టర్ ఎస్.పద్మపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు మేకల కళింగరాజు, తిప్పారపు ఆనంద్, చెవెల్లి సంపత్, ఉల్లేంగుల కృష్ణ, యాదగిరి, సత్యనారాయణ, జోగు రమేష్, కొమురయ్య ఉన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి అనాథలైన భార్యాపిల్లలు మదనపల్లె క్రైం: వారు ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టారు. ఒకే వ్యాపారం చే స్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా కలిసి ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని మృత్యువు కాటేసింది. మరణంలోనూ ఇద్దరూ కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. హృ దయ విదారకమైన ఈ ఘటన ఆది వా రం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యు లు, పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన నారాయణ ప్ప కుమారులు బుడ్డా వెంకట్రమణ(40), బుడ్డా నాగరాజు(35) కొయ్యల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాల ను పోషించుకుంటున్నారు. వెంకట్రమణకు భార్య భాగ్యమ్మ, కుమార్తె కళావతి(20), కుమారుడు అశోక్(18) ఉన్నా రు. నాగరాజుకు భార్య రాధమ్మ, కు మార్తె లక్ష్మి(12), కుమారులు అరుణ్కుమార్(5), అనిల్కుమార్(3) ఉన్నా రు. వ్యాపార పనుల నిమిత్తం వారు ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బ యల్దేరారు. కంటేవారిపల్లె సమీపంలోని మలుపురోడ్డులో మదనపల్లె నుం చి అనంతపురం వైపు వెళుతున్న ఐషర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వెంకట్రమణ అక్కడికక్కడే మృతి చెం దాడు. నాగరాజు తీవ్ర గాయాలతో కొ ట్టుమిట్టాడుతుండగా స్థానికులు 108 లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికి త్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశా రు. మార్గమధ్యంలోనే నాగరాజు మృ తి చెందాడు. ఇద్దరి మృతదేహాలను మ దనపల్లె ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకు న్న ఇరు కుటుంబాల వారు షాక్కు గు రయ్యారు. ‘మాకు అన్యాయం చేసి వెళ్లిపోయారా’ అంటూ రాధమ్మ, భాగ్య మ్మ బోరున రోదించడం పలువురిని కలిచివేసింది. బి.కొత్తకోట ఎంపీపీ, టీ డీపీ కార్యకర్తలు ఏరియా ఆస్పత్రికి చే రుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టా రు. ముదివేడు పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు. సోదరుల అంత్యక్రియలకు స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్ర ముఖులు తరలివచ్చారు. బాధితుల కు టుంబాలకు సానుభూతి తెలిపారు. -
వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా
చంద్రగిరి: చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మార్చేందుకు అవసరమైన జీవో తీసుకురావడానికి కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి చైర్మన్ హోదాలో బోర్డు కమిటీ సభ్యులను నియమించారు. ఈ కమిటీలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి సభ్యులుగా చంద్రగిరి ఎంపీపీ, తిరుపతి రూరల్ ఎంపీపీ, పాకాల ఎంపీపీ, చంద్రగిరి జెడ్పీటీసీ, ఆర్సీ. పురం జెడ్పీటీసీ, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ, చంద్రగిరి సర్పంచ్, తహశీల్దార్, వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, మానవ హక్కుల సభ్యులు ఒకరు, స్థానిక సేవ సభ్యులు ఒకరిని నియమించారు. అలాగే చిన్నగొట్టిగల్లు ఏరియా ఆస్పత్రి కమిటీ సభ్యులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం, రామచంద్రాపురం, ఎంపీపీలు, చిన్నగొట్టిగళ్లు, యర్రావారిపాళెం, పాకాల జెడ్పీటీసీలు, వైధ్యాధికారి, స్థానిక సర్పంచ్, తహశీల్దార్, డీసీహెచ్ఎస్, ఐకేపీ, సేవా సంఘం తరఫున ఒకరిని నియమించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ నియమించిన బోర్డు సభ్యుల పర్యవేక్షణలో అస్పత్రి వర్గాలు పనిచేస్తాయన్నారు. నియోజకవర్గానికి ఎంతో తలమానికంగా చంద్రగిరి ఆస్పత్రి ఉందన్నారు. 31 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందని అయితే ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఏరియా అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా జీవో తీసుకురావాలని అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించానన్నారు. ముఖ్యంగా 100 పడకల జీవోకు ప్రభుత్వం ఆమోదం తెలిపాలని కోరానన్నారు. దీనికి ప్రభుత్వం, సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందంచగలిగే విధంగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎంఎల్ఏ జిల్లా వైద్యాధికారితో ఫోన్తో మాట్లాడి చంద్రగిరి ఏఎన్ఎం నర్సులను కొనసాగించాలని తెలిపారు. ఎంపీపీ కుసుమ, వైఎస్ ఎంపీపీ వనజ, మండల కన్వీనర్, కొటాల చంద్రశేఖర్రెడ్డి, పట్టణ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, వేణుగోపాల్రెడ్డి, హేమేంద్రకుమార్రెడ్డి, ఎంపీటీసీలు బుజ్జి, నవనీతమ్మ, భారతి, జ్యోతి, నాగరాజు, మంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచి ఉమామహేశ్వరి, తొండవాడ సర్పంచ్ సిద్దముని, నాయకులు అగరాల భాస్కర్రెడ్డి, బండారు హేమచంద్ర, ఒంటి శివశంకర్, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, మణి, ఫరూక్, జయకుమారి, అస్పత్రి సూపరింటెండెంట్ కె.శారద, డాక్టర్లు పద్మజ, ఆపర్ణ, దినే్ష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మండలి’ సేవలు మరువలేనివి
సంస్మరణ సభలో వక్తల ఉద్ఘాటన ఘనంగా మండలి వెంకటకృష్ణారావు జయంతి నేతలు, అభిమానుల నివాళి అవనిగడ్డ : దివంగత ప్రజానాయకుడు మండలి వెంకటకృష్ణారావు దివిసీమ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని కేంద్ర సాహిత్య అకాడ మీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు 88వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీక్షేత్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులైన వెంకటకృష్ణారావు 1969లో అవనిగడ్డలో గాంధీక్షేత్రాన్ని ఏర్పాటుచేసి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటి తరం నాయకులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. మరో ముఖ్యఅతిథి, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వెంకటకృష్ణారావు జీవితాంతం సమాజసేవే పరమావధిగా భావించారని పేర్కొన్నారు. 1977 నవంబరు 19న సంభవించిన ఉప్పెనకు మరుభూమిగా మారిన దివిసీమను ప్రపంచ దేశాల్లోని స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో దివ్యసీమగా మార్చిన ఘనత మండలి వెంకటకృష్ణారావుకే దక్కుతుందన్నారు. 1975లో ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ద్వారా తెలుగుభాషా వికాసానికి ఎంతో కృషి చేశారన్నారు. సభలో ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి ఎంపీపీలు బండె నాగ వెంకటకనకదుర్గ, యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, మోర్ల జయలక్ష్మి, అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి), డీసీఎంఎస్ డెరైక్టర్ మురాల సుబ్బారావు, అన్నపరెడ్డి సత్యనారాయణ, రెడ్క్రాస్సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఇళ్లా రవి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వీడీఆర్ కుమార్, చల్లపల్లి రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా) తదితరులు మాట్లాడుతూ వెంకట కృష్ణారావు సేవలను ప్రస్తుతించారు. తొలుత అవనిగడ్డ వంతెన సెంటరులోని మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం సేవాశ్రమంలో ఉన్న మండలి వెంకటకృష్ణారావు సమాధి వద్ద అంజలి ఘటించారు. రక్తదాన శిబిరానికి విశేషస్పందన మండలి జయంతిని పురస్కరించుకుని పట్టాభి రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించగా 205మంది రక్తదానం చేశారు. దాతలను నాయకులు అభినందించారు. 710మందికి కంటి వైద్యం గాంధీక్షేత్రంలో నిర్వహించిన ఉచిత మెగా నేత్రవైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దివిసీమ పరిసర ప్రాంతాల నుంచి 710మంది పరీక్షలు చేయించుకున్నారు. 195మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఎంపికచేయగా మరో 200 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. -
వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు
మదనపల్లె ఏరియా ఆస్పత్రి వైద్యులపై డీసీహెచ్ఎన్ మండిపాటు మదనపల్లెక్రైం: ‘ఓ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వైద్యులు ఓ విధి, విధానం లేకుండా వ్యవరించడం తగదు. తమకు కేటాయించిన ఓపీడీలోని రోగులను మాత్రమే పరీక్షించి, పక్క ఓపీడీకి చెందిన వారు వస్తే నాకు సంబంధం లేదు.. మరోచోటుకు వెళ్లమని కసురుకోవడం వైద్యవృత్తికే కళంకం తెస్తుంది. కొంతమంది డాక్టర్లు గిరగీసుకుని వైద్యం చేయడం ఏంటి?. అత్యవసర విభాగంలో డ్యూటీచేసే వారు రోగులు లేనప్పుడు జనరల్ కేసులను కూడా చూడాలి’ అంటూ జిల్లా వైద్యశాలల సంమన్వయకర్త(డీసీహెచ్ఎన్) డాక్టర్ సరళమ్మ మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక డాక్టర్లు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు కాకముందే కొంత మంది డాక్టర్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఆస్పత్రిలో ఎవరు డాక్టర్లు, ఎవరు సిబ్బంది.. ఎవరు బయటి వ్యక్తులనే తేడా తెలియడంలేదన్నారు. డాక్టర్లు యూనిఫామ్, గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు. అత్యవసర విభాగం నుంచి ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, డ్రగ్స్టోర్రూము, వార్డులను ఆమె పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్థియేటర్లో కొన్ని మార్పులను సూచించారు. ఆప్తాలమిక్ కేసులకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు ఓ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నట్లు తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, దీనికి నేను చాలాషేమ్గా ఫీలవుతున్నానని అన్నారు. ఆస్పత్రిలో ఎంఎన్వో, ఎఫ్ఎన్వోలు తాము చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం తగదన్నారు. పనులు చేయలేని వారు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. ఆదివారాల్లో ఓపీడీ లేకపోయినా వైద్యులు విధిగా ఆస్పత్రికి వచ్చి వార్డుల్లో ఉన్న తమ పేషంట్లను చూడాలన్నారు. డాక్టర్లు లీవు తీసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎంవోనే పూర్తి బాధ్యతలు తీసుకుని ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలన్నారు. మాట వినని వారిపై వేటు వేయాలని, దిక్కరిస్తే తనకు సరెండర్ చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 27 వైద్య పోస్టులు ఖాళీ జిల్లావ్యాప్తంగా 27 వైద్య పోస్టులు కొరత ఉన్నట్టు డీసీహెచ్ఎన్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పోస్టుల భర్తీకి సీఏఎస్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడగానే పోస్టులభర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక పలుకేసులను రెఫర్ చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమా వేశంలో ఆర్ఎంవో గురుస్వామినాయక్, డాక్టర్ జ్ఞానేశ్వర్, హెడ్ నర్సులు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చి నెలాఖరుకల్లా మెద క్లో ‘హైరిస్క్ కేంద్రం’
మెదక్టౌన్, న్యూస్లైన్ : మాతాశిశు మరణాలను నివారించేందుకు మార్చి నెలాఖరు కల్లా మెదక్లో ‘హైరిస్క్ కేంద్రం’ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఆమె, కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అరుణ్సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీలతో కలిసి మెదక్ ఏరియా ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో మార్చి 31లోగా ఏర్పాటు చేయనున్న హైరిస్క్ కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించుకోవడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 125 కాన్పులు జరుగుతున్నాయనీ, వీటిని 250కి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, పరికరాలను సమకూరుస్తామన్నారు. ఆ స్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ప్రారంభించామని త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించి మాతాశిశు మరణాలను తగ్గించేం దుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తెలిపారు. జి ల్లా కలెక్టర్ ఆరోగ్య విషయాలపై చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయిం ట్ కలెక్టర్ మూర్తి, ఆర్డీఓ వనజాదేవి, డీసీహెచ్ వీణాకుమారి, డీఎం,హెచ్ఎం పద్మ, డీపీఎం జగన్నాథ్రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు చంద్రశేఖర్, శివదయాల్, హేమ్రాజ్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం బట్టబయలు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఏజెన్సీ వాసులకు వైద్యం అందించే విషయంలో ఇక్కడి ప్రభుత్వ డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు ఎంత అధ్వానంగా ఉందో రుజువైంది. ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో వస్త్రాన్ని ఉంచి కుట్లు వేశారంటే వారు ఎంత అజాగ్రత్తతో వైద్యం చేస్తున్నారో అర్థమవుతోంది. చింతూరు మండలం మోతుగూడెం గ్రామానికి చెందిన తన్ని సూర్యకుమారి అనే గిరిజన మహిళ ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి వచ్చింది. డిసెంబర్ 15వ తేదీన ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. కుట్లు వేసే సమయంలో రక్తం పీల్చుకునే వస్త్రాన్ని కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆమెకు కడుపులో నొప్పిరావడం, ఉదరభాగం ఉబ్బడం, కుట్లలో నుంచి చీము వస్తుండటంతో శనివారం రాత్రి బాధితురాలికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. మూరెడు బారువున్న మాప్ (రక్తం పీల్చుకునే వస్త్రం)ను బయటకు తీశారు. ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... తన్ని సూర్యకుమారి ప్రసవం కోసం డిసెంబర్ 14వ తేదీన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జాయిన్ అయింది. 15వ తేదీన ఆస్పత్రి వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. పండంటి మగబిడ్డను బయటకు తీశారు. చికిత్స నిర్వహించే సమయంలో రక్తం పీల్చుకునేందుకు వినియోగించే వస్త్రాన్ని వైద్యుడు గమనించకుండా కడుపులోనే ఉంచి కుట్లు వేశాడు. వారం రోజుల అనంతరం సూర్యకుమారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఆమె స్వగ్రామం వెళ్లిపోయింది. పదిరోజుల తర్వాత ఉదరభాగంలో ఉబ్బడం, నొప్పి రావడం, కుట్లలో నుంచి చీము రావడం ప్రారంభమవడంతో భయభ్రాంతులకు గురైన సూర్యకుమారి భర్త అప్పన్న, ఆమె తల్లిదండ్రులు వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ చేయడంతో ఆమె కడుపులో ఓ వస్త్రంలాంటిది కనిపించింది. శనివారం రాత్రి శస్త్రచికిత్స చేసి ఆ వస్త్రాన్ని బయటకు తీశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయరావును ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. నొప్పితో నరకం అనుభవించింది: బాధితురాలి భర్త అప్పన్న కడుపులో మాప్ ఉంచి కుట్లు వేయడంతో తన భార్య నొప్పితో నరకం అనుభవించిందని సూర్యకుమారి భర్త అప్పన్న విలేకరుల ఎదుట వాపోయారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...‘ఏరియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో కడుపు నొప్పిగా ఉందని వైద్యులకు, సిబ్బందికి తెలియజేశాం. అయినా సిబ్బంది పట్టించుకోకుండా ఇదంతా మామూలే...కొద్ది రోజులు ఉంటే నొప్పి తగ్గి పోతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాం. ఆపరేషన్ జరిగిన నాటినుంచి సుమారు 20 రోజుల పాటు నా భార్య నరకం అనుభవించింది. ఇటువంటి బాధ ఎవరికీ రాకూడదు’. అడుగడుగునా నిర్లక్ష్యం వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యానికి, వివాదాలకు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కేరాఫ్గా మారిందని చెప్పడానికి పలు నిదర్శనాలు ఉన్నాయి. ప్రసవానికి వచ్చిన మహిళలను మూకుమ్మడిగా ఖమ్మం వైద్యశాలకు వెళ్లాలని ఇక్కడి వైద్యులు ఇటీవల రిఫర్ చేశారు. దీనిని నిరసిస్తూ ఆ గర్భిణిలు ప్రసూతి విభాగం ముందు ధర్నా చేశారు. వారం రోజుల క్రితం ఇక్కడకు గిరిజన గర్భిణి రాగా.. గైనకాలజిస్ట్ లేరని, ప్రసవం చేయలేమని వైద్యులు చేతుత్తేశారు. ఆమె ఐటీడీఏ పీఓను ఆశ్రయించింది. గర్భ సంచీలో పుండుతో బాధపడుతున్న మోతుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి పది రోజుల క్రితం ఆపరేషన్ కోసం ఈ ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేసేందుకు రేపు మాపు అంటూ వైద్యులు కాలాయాపన చేసి, చివరికి మత్తు మందు డాక్టర్ అందుబాటులో లేరని, వచ్చాక చేస్తామని సెలవిచ్చారు. చివరికి ఆమెను కటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. వారికి రూ.20వేలు ఖర్చయింది. -
భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో ‘కార్పొరేట్’ సేవలు!
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: ఏజెన్సీ వాసులకు శుభవార్త. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మహర్దశ కలగనుంది. కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 100 పడకలకుతోడు మరో 120 పడకలకు సరిపడా భవన నిర్మాణానికి అనుమతి రానుంది. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన కోసం నాబార్డు బృందం ఆస్పత్రి ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పలు విషయాలపై చర్చించింది. అనంతరం నాబార్డు మేనేజర్ సంజయ్ జోక్లేకర్ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు నాబార్డు ముందుకు వచ్చిందన్నారు. భవన నిర్మాణానికి రూ. 19 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 2 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన అనంతరం ముంబాయిలోని నాబార్డు కార్యాలయానికి నివేదిక పంపుతామన్నారు. అనుమతులు వచ్చాక 120 పడకలకు సరిపడా భవనం, సిబ్బంది క్వార్టర్లు, మార్చురీ గది ఆధునికీకరణ, క్యాంటీన్, గ్యారేజ్, సెక్యూరిటీ గది తదితర నిర్మాణాలు చేపడతామని వివరించారు. పరిశీలన బృందంలో నాబార్డు అధికారి జ్ణానేశ్వర్, భద్రాచలం ఏఎంఐ సభ్యుడు డాక్టర్ కాంతారావు తదితరులు ఉన్నారు. హర్షణీయం : ఎమ్మెల్యే సత్యవతి భద్రాద్రిలో కార్పొరేట్ వైద్యశాలకు అనుమతి రావడం ఆనందకరమని ఎమ్యెల్యే కుంజా సత్యవతి అన్నారు. కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం అనంతరం ఇక్కడే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు అనుమతి కోసం కృషి చేస్తానన్నారు. దానికనుగుణంగానే కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం కోసం పాత ఆస్పత్రి వద్ద ఉన్న స్థలాన్ని చూపించినట్లు తెలిపారు. -
ఊరంతా జ్వరాలు
నాతవరం, న్యూస్లైన్ : జిల్లేడుపూడివాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. 25 రోజులుగా మంచానపడి అల్లాడిపోతున్నారు. గ్రామంలోని 1870 మందికి 600కుపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. శుక్రవారం విలేకరులు గ్రామాన్ని పరిశీలించినప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది.ప్రతి ఇంటా మూలుగుతున్నవారు కనిపించారు. గ్రామంలో ప్రస్తుతం కె.రాము , కుమారి, రాంబాబు, ఎల్.రమణ , కె.తులసి, పి.సత్యవతి, గౌరి, ఎస్.సత్యవతి, ఎస్.మోహన్, ఎస్.కుమారి, లాలం మావుళ్లమ్మ , కె.రమణ, కె.వెంకటరమణ, యల్లయ్యమ్మ, నాగరాజుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరికొందరి పరిస్థితి ఇలాగే ఉంది. 25 రోజులుగా కనీసం వైద్యసేవలకు నోచుకోలేదు. నాలుగుడబ్బులున్నవారు నర్సీపట్నం, తుని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు పొందుతున్నారు. మరి కొందరు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళుతున్నారు. పరిస్థితిని పది రోజుల క్రితం సర్పంచ్ లాలం లోవ వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రూ.14 వేలయినా జ్వరాలు తగ్గలేదు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాం. రూ.14 వేలు ఖర్చుచేస్తే ఇంటిలో ఇద్దరికి జ్వరాలు తగ్గుముఖం పట్టగా మరో ముగ్గురికి తీవ్రంగా ఉంది. - రమణ, జిల్లేడుపూడి వైద్య శిబిరం నిర్వహించాలి గ్రామంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యశిబిరం నిర్వహించాలి. ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించి జ్వరాలు తగ్గేవరకు పర్యవేక్షణ చేపట్టాలి. - కొరుపోలు నూకరాజు, జిల్లేడుపూడి.