Badrinath
-
'అశ్విన్ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్కు గురిచేశాడు. అయితే టెస్టు క్రికెట్లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అతడికి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్ధామ్గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్ధామ్లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
అయోధ్య, బద్రీనాథ్లో ఓడిన బీజేపీ కేదార్నాథ్ కోసం ఏం చేస్తోంది?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని నాలుగు ధామ్లలో కేదార్నాథ్ ధామ్ ఒకటి. త్వరలో కేదార్నాథ్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. సోమవారం ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. యూపీలోని అయోధ్య, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ స్థానాల్లో ఓడిపోయిన దరిమిలా బీజేపీకి ఇప్పు కేదార్నాథ్ కీలకంగా మారింది. 2013లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, కేదార్నాథ్ ధామ్, కేదార్నాథ్ లోయలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పని ప్రారంభమైంది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక కేదార్నాథ్ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ తరచూ కేదార్నాథ్ను సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రలో అత్యధిక సంఖ్యలో యాత్రికులు కేదార్నాథ్ను దర్శించుకున్నారు. 2002 నుంచి ఉనికిలోకి వచ్చిన కేదార్నాథ్ అసెంబ్లీలో బీజేపీ మూడుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి.కేదార్నాథ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ మృతి చెందడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది అయోధ్యతో కూడిన ఫైజాబాద్ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ, బద్రీనాథ్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. అయోధ్య, బద్రీనాథ్ రెండూ కూడా హిందువుల ఆదరణకు నోచుకున్న ప్రాంతాలు. అందుకే వీటిపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పుడు కేదార్నాథ్ సీటును దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది.బీజేపీ తన సంప్రదాయాలకు భిన్నంగా దివంగత ఎమ్మెల్యే శైలారాణి రావత్ కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వకుండా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా నౌటియాల్ను ఎన్నికల్లో పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల సమీకరణల విషయానికి వస్తే ఠాకూర్ ఓటర్ల సంఖ్య ఈ ప్రాంతంలో అత్యధికం. బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టగా, కాంగ్రెస్ ఠాకూర్ అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చింది.ఇది కూడా చదవండి: 19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు -
రూ. 5 కోట్ల అప్పు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన టీచర్
అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్లో తెలుగు టీచరు దివాకర్నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్జైల్కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది. విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.రెండు నెలలుగా రావడం లేదు గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. – మధురవాణి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, హావలిగి -
చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్హెచ్, బీఆర్ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.నంద్ప్రయాగ్లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. -
Badrinath Highway: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. ఉత్తరాఖండ్లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు..
గోపేశ్వర్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. -
Chardham Yatra: తెరుచుకున్న బద్రీనాథ్ .. భారీగా తరలివచ్చిన భక్తులు!
మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.బద్రీనాథ్ ధామ్లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీశ్గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. #WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx— ANI (@ANI) May 12, 2024 -
Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
-
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్ను సందర్శించిన తర్వాతే చార్ధామ్కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: దేవభూమిలో ఈసారీ... కమల వికాసమే!
హిమాలయ పర్వత సిగలో బద్రీనాథ్, కేధార్నాథ్ వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాంచల్గా ఏర్పాటైన ఈ రాష్ట్రం పేరు 2006లో ఉత్తరాఖండ్గా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసే చక్రం తిప్పుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ (యూకేడీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా కాస్త ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లుగా ఉత్తరాఖండ్ పూర్తిగా కాషాయమయమైంది. అటు అసెంబ్లీలో, ఇటు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవాయే నడుస్తోంది. గత రెండు లోక్సభ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారింది. 2012 నుంచీ మాత్రం రాష్ట్రం బీజేపీ గుప్పిట్లోనే ఉంది. 2002లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ తివారీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్కు మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి చేపట్టిన తొలి, ఏకైక నేతగా చరిత్ర సృష్టించారు. 2007లో ఉత్తరాఖండ్లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ, యూకేడీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ బహుగుణ, హరీశ్ రావత్ రూపంలో ఆ ఐదేళ్లలో ఇద్దరు సీఎంలను మార్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ విశ్వాస పరీక్షలో నెగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 5 సీట్లను దక్కించుకున్న బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచి్చంది. మొత్తం 70 సీట్లలో ఏకంగా 57 స్థానాలను కొల్లగొట్టింది! 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి క్లీన్స్వీప్ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ 47 సీట్లతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 19 సీట్లతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 5 ఎంపీ సీట్లలో ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. సర్వేలు ఏం చెబుతున్నాయి... రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యంతో బీజేపీ మంచి జోరు మీదుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెసేమో ఇండియా కూటమి దన్నుతో మొత్తం ఐదు స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ సర్కారు కుమ్మక్కు వంటివాటిని ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. కులగణన, సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలను గుప్పిస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా 5 సీట్లూ గెలుచుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(నవంబర్ 21) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్ ధృవీకరించారు. కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్ను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్ఎస్ బద్రీనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన శంకర్ నేత్రాలయ స్థాపకుడు. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్గా వ్యవహరించారు. My Prayers and condolences to family and friends on demise of Dr Badrinath Founder Sankar nethralaya , a premier eye care hospital in chennai and that has served many poor patients ! 🙏🏽#sankarNethralaya #eyecare pic.twitter.com/ZO6dwIImqI — 𝗥𝗮𝗺𝗮 𝗦𝘂𝗴𝗮𝗻𝘁𝗵𝗮𝗻 (வாழப்பாடி இராம சுகந்தன்) (@vazhapadi) November 21, 2023 బద్రీనాథ్ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మా నాయకుడి మరణంపై శంకర్ నేత్రాలయ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్.. యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. తల్లిదండ్రుల మృతి అనంతరం వచ్చిన భీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్లో డాక్టర్ వృత్తిని ప్రారంభించి.. అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందాడు. తిరిగి భారత్కు వచ్చి 1978లో డాక్టర్ బద్రీనాథ్, వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు. ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్ సతీమణి వాసంతి పీడియాట్రిషియన్, హెమటాలజిస్ట్గా పనిచేస్తున్నారు. -
Mukesh Ambani Visits Badrinath Dham: బద్రీనాథ్ తీర్థయాత్రలో ముఖేష్ అంబానీ కుటుంబం (ఫొటోలు)
-
బద్రీనాథ్ను సందర్శించిన ముఖేష్ అంబానీ, కాబోయే చిన్న కోడలు సందడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం బద్రీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్తో కూడా ఉండటం విశేషం. అలాగే RIL డైరెక్టర్ మనోజ్ మోడీ ఈసారి ముఖేష్ అంబానీకి తోడుగా ఉన్నారు. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ), సీఈవో బీడీ సింగ్, ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం కేదార్నాథ్ను కూడా సందర్శించారు అంబానీ. ఈ సందర్బంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి అంబానీ 5 కోట్ల రూపాయలli విరాళంగా ఇచ్చారు. కాగా అంబానీ కుటుంబం దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిత్యం సందర్శిస్తుంటారు. గతంలో కూడా ఈ కమిటీకి విరాళాన్ని ప్రకటించారు అంబానీ. అంతేకాదు 2019లో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా అనంత్ అంబానీ నియమితులయ్యారు. అలాగే అనంత్ అంబానీ, రాధిక వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె తన అత్తమామలతో కలిసి అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా , మనవడు పృథ్వీ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్లో అంబానీ బద్రీనాథ్ ధామ్, కేదార్నాథ్ ధామ్లను సందర్శించారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ 'అన్నదానం' నిధికి 1.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ తిరుపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు దాదాపు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్లో అంబానీ రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే #WATCH | Reliance Industries Chairman, Mukesh Ambani offered prayers at Badrinath Dham in Uttarakhand. pic.twitter.com/fUUvdljevr — ANI (@ANI) October 12, 2023 -
ఆస్తి కోసం అమానుషం
వనపర్తి: ఆస్తి ముందు అన్నదమ్ముల అనుబంధం, చిన్నప్పటి నుంచి కలసి ఉన్న సోదర ప్రేమ చిన్నబోయాయి. నడిరోడ్డుపై సొంత తమ్ముళ్లే తోడబుట్టిన అన్నను కత్తులతో వేటాడి హత్య చేశారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాకు చెందిన మంగ్లీ, పూల్య నాయక్లకు ఐదుగురు కుమారులున్నారు. 20 ఎకరాల భూమిని తండ్రి తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. రెండో కుమారుడు బద్రీనాథ్ నాయక్ (51) వీపనగండ్లలో ఏపీఓగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడంతో వంశోద్ధారకుడు లేడని.. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలైన తమ్ముళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన కుటుంబంలో తెచ్చారు. అందుకు బద్రీనాథ్ ఒప్పుకోకపోవడంతో, తాను పంచి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేయడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పదేళ్లుగా ఈ ఆస్తి వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. చాలాసార్లు ఘర్షణపడ్డారు. సోదరుల నుంచి ప్రాణభయం ఉండటంతో బద్రీనాథ్ కొంతకాలంగా బయట తిరిగే సందర్భంలో హతీరాం అనే వ్యక్తిని వెంటబెట్టుకునేవారు. బుధవారం విధి నిర్వహణలో భాగంగా కలెక్టరేట్కు వచ్చిన బద్రీనాథ్ తిరిగి వెళుతుండగా.. ఇద్దరు తమ్ముళ్లు సర్దార్ నాయక్, కోట్యా నాయక్తో పాటు సర్దార్ నాయక్ కుమారుడు పరమేశ్లు కాపుకాసి మరికుంట సమీపంలో కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా నరకడంతో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న హతీరాంకు కత్తి గాయం కావడంతో భయంతో పరారయ్యాడు. అనంతరం రెండు బైక్లపై నిందితులు అక్కడి నుంచి పారిపోయి.. వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేశ్వర్రావు తెలిపారు. -
కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
-
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్కుండ్ సాహిబ్కు రోప్వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్నాథ్లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్నాథ్కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్కుండ్ సాహిబ్కు రోప్వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్నాథ్లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్నాథ్ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్కు రావడం రెండోసారి. రోప్వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్కుండ్ సాహిబ్ రోప్వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్వే అనుసంధానించనుంది. -
బద్రినాథ్యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి
సాక్షి, వరంగల్: బద్రినాథ్ యాత్రకు వెళ్లిన ఓ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చామర్తి ఉషారాణి(52), భర్త డాక్టర్ నందకిషోర్లు శ్రీనివాస నర్సింగ్హోం నిర్వహిస్తున్నారు. ఓ వైపు డాక్టర్గా పనిచేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దంపతులిద్దరు 12 యాత్రల దర్శనంలో భాగంగా ఈ నెల 9వ తేదీన వెళ్లారు. శనివారం ఉదయం బద్రినాథ్లో ఉషారాణికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహం రాత్రి నర్సంపేటకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డాక్టర్ ఉషారాణి కుటుంబ సభ్యులతో ఫొన్లో మాట్లాడి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస నర్సింగ్హోంలో ప్రత్యేకంగా ఉషారాణి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో డాక్టర్ మనోజ్లాల్, డాక్టర్ భారతి, గుడిపూడి అరుణ, నల్ల భారతి, చిలువేరు రజినిభారతి, పెండెం రాజేశ్వరి, గుర్రపు అరుణ, వాసం కరుణ తదితరులు ఉన్నారు. -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ
గోపేశ్వర్ (ఉత్తరాఖండ్): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్నాథ్ మే 6, బద్రీనాథ్ మే 8న తెరుచుకోనున్నాయి. చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి) -
చార్ధామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చొద్దు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మరోసారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం గాడిన పడుతుందనుకున్న సమయంలో, గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఈ ఏడాది జరుగబోయే చార్ధామ్ యాత్రపై పడింది. మే 14 న అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 న గంగోత్రి ధామ్ తెరుచుకున్న అనంతరం చార్ధామ్ యాత్ర అధికారికంగా భక్తుల కోసం ప్రారంభమౌతుంది. అదే సమయంలో మే 17 న కేదార్నాథ్, మూడవ కేదార్ తుంగ్నాథ్, మే 18న బద్రీనాథ్ ధామ్ ద్వారా లు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారైనా పర్యాటక రంగం గాడిన పడుతుందని భావించిన స్థానిక వ్యాపారులకు తాజా పరిస్థితులు మరో ఏడాది దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. ఇప్పటికే చార్ధామ్ యాత్రలో పాల్గొనాలనుకున్న భక్తులు, పర్యాటకులు గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ (జిఎంవిఎన్) ఏర్పాటు చేసిన హోమ్ స్టే, హట్స్, కాటేజీలు, రెస్టారెంట్లకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు చేసుకుంటున్నారు. ఊగిసలాటలో భక్తులు కేదర్ఘాటితో సహా ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ మహమ్మారి వారి ఆశలను దెబ్బతీసింది. గఢ్వాల్ మండల్ వికాస్ నిగం వద్ద జరిగిన సుమారు మూడు కోట్ల బుకింగ్స్లో, గత ఒక వారంలో ఎనిమిది లక్షల బుకింగ్స్ రద్దు అయ్యాయి. అంతేగాక కేదర్ఘాటి, తుంగ్నాథ్ ఘాటి, మద్మాహేశ్వర్ ఘాటిల్లో హోమ్ స్టే ఆపరేటర్లకు చెందిన సుమారు రెండు లక్షల బుకింగ్లు సైతం రద్దు చేసుకున్నారు. వీటితోపాటు జీఎంవీఎన్ కార్యాలయానికి తమ బుకింగ్ను పోస్ట్పోన్ చేయాలనే భక్తుల మెయిల్స్ ప్రతీరోజు 15 నుంచి 20 వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు అవుతున్నాయి. అయితే కరోనాకు సంబంధించి గత 15 రోజుల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా, చార్ధామ్ యాత్ర ప్రారంభంపై భక్తుల్లో సందేహాలు ఉన్నాయని గౌరికుండ్ ట్రేడ్ అసోసియేషన్ భావిస్తోంది. విధివిధానాలు ప్రచురించండి దేశంలో పెరుగుతున్న కోవిడ్–19 కేసులను దష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్రకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను వెంటనే ప్రకటించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను మరో కుంభ్మేళాలా మార్చేందుకు అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తూ ఆ ఆదేశాలు జారీచేసింది. -
సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు లేరు..
సిడ్నీ : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్లో భారత్ వరుస పరాజయాల పట్ల అభిమానులతో పాటు మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూసుడైన ఆటతీరుకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డపై సరైన ప్రణాళిక లేకుండా టీమిండియా బరిలో నిలిచిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడిచేయకపోగా.. అనుభవజ్ఞులైన పేసర్లు సైతం ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రాతో పాటు ఐపీఎల్ ద్వారా జట్టులో చోటుదక్కించుకున్న నవదీప్ సైనీ సైతం చేతులెత్తేశాడు. ఓవైపు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్నప్పటికీ.. బౌలింగ్లో పసలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పసలేని భారత్ బౌలింగ్ను చితకబాదిన ఆసీస్ ఆటగాళ్లు.. తొలి వన్డేలో 375, రెండో వన్డేలో 390 పరుగులు సాధించారు. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమిచెంది సిరీస్ను కోల్పోయిన భారత్.. చివరిదైన మూడే వన్డేకు సిద్ధమయ్యింది. (రవి శాస్త్రిని టీంనుంచి బయటకు పంపాలి) ఈ నేపథ్యంలో గత మ్యాచ్ల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. భారత్ టాప్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్ సీరిస్లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు. అయితే అన్ని పిచ్లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్ఆర్డర్లో సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్కు పేస్కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆసీస్ గడ్డపై ఇదే తొలిసారి..) వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్టైం బౌలర్లు లేరు. ధావన్, అగర్వాల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్ చేయలేరు. గతంలో రోహిత్ స్పిన్నర్గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్రౌండర్ హర్థిక్ పాండ్యా సైతం బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు. కాగా చివరి వన్డే బుధవారం జరుగనున్న విషయం తెలిసిందే. -
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
కేధార్నాథుడిని దర్శించుకున్న మోదీ
కేధార్నాథ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేధార్నాథుడిని సందర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఉత్తరాఖండ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం బద్రీనాథ్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెరుచుకున్న కేదార్నాధ్ ఆలయం
-
కేధార్నాథ్కు పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్: ఆరు నెలల అనంతరం కేధార్నాథ్ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది. కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. -
కేదార్నాథ్లో రాష్ట్రపతి పర్యటన
డెహ్రాడూన్ : రాఫ్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్లు కూడా రాష్ట్రపతితో కలిసి ఆలయాలను దర్శించారు. కేదార్నాథ్లో పరమశివుడికి దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేసుకున్న ఆరాష్ట్రతి రామ్నాథ్ కోవింగ్ ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయించుకున్నారు. అనంతరం బద్రీనాథ్ వెళ్లిన ఆయన శ్రీమన్నారాయణుడిని దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హిమాలయాల్లో ప్రత్యేకంగా లభించి ఒక గంధపు మొక్కను రాష్ట్రపతి భవన్లో నాటేందుకు కోవింద్ సతీమణి ప్రత్యేకంగా తీసుకున్నారు. -
బద్రీనాథ్కు లక్షల్లో భక్తులు
డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆలయం తెరిచిన మే 6 నుంచి ఇప్పటివరకూ.. 7.5 లక్షల మంది బద్రీనారాయణుడిని దర్శించుకున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ చెప్పారు. భక్తులు కానుకల రూపంలో హుండీలో వేసిన మొత్తం రూ.11.50 కోట్లని ఆయన చెప్పారు. 2013లో వరదల తరువాత బద్రీనీనాథ్కు ఇంత పెద్ద సంఖ్యలు భక్తులు హాజరుకావడం ఇదే మొదటిసారని సింగ్ ప్రకటించారు. 2013లో అత్యధికంగా 9.25 లక్షల మంది భక్తులు హాజరయ్యారని.. ఆ తరువాత వరదలు ముంచెత్తడంతో భక్తుల రాక తగ్గిందని సింగ్ తెలిపారు. చెప్పారు. ఆలయాన్ని మూసివేసే సమయానికి మరో లక్ష మంది భక్తులు బ్రదీనారాయణుడిని దర్శించుకుంటారనే ఆశాభావాన్ని సింగ్వ్యక్తం చేశారు. -
భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే?!
జోషిమఠ్ : హిందూ-ముస్లింల ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటారు. కేవలం కొందరి స్వార్థప్రయోజనాల వల్లే ఈ రెండు వర్గాల మద్య ఘర్షణలు తప్ప వాస్తవంగా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఇరు వర్గాలు మరోసారి తమ చర్యల ద్వారా స్పష్టం చేశాయి. ముస్లింల పవిత్ర దినమైన ఈద్ పండుగ రోజు నమాజ్చేసుకోవడానికి తమ గురుద్వారాను ఇచ్చి.. మత సామరస్యానికిమరో సారి నిలువుటద్దంలా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఆసక్తిర విషయాలు ఇవి. చార్దామ్ యాత్రలో మజిలీ అయినా బద్రినాథ్కు వెళ్లే దారిలో జోషిమఠ్ వస్తుంది. ఇక్కడ సిక్కులు, హిందువులు, ముస్లింలు చాలామంది నివసిస్తుంటారు. ఈ జోషిమఠ్లో శనివారం ఈద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పెద్దఎత్తున గాంధీ మైదాన్లో నమాజ్కు ఏర్పాట్లు చేసుకున్నారు. వర్షం భారీగా కురవడంతో ప్రార్థన చేసుకునేందుకు ముస్లింలు ఇబ్బంది పడ్డారు. వారి పరిస్థిని మగనించిన హేమకుండ్ గురుద్వారా ప్రభంధక్ కమిటీవారు.. తమ గురుద్వారాలో నమాజ్ చేసుకునేందుకు సిక్కు సోదరులు అవకాశం కల్పించారు. సిక్కు సోదరులు ప్రేమగా నమాజ్చేసుకోవడానికి ఆహ్వానించడంతో సుమారు వెయ్యిమంది ముస్లింలు గురుద్వారా నమాజ్ చేసుకున్నారు. ఆ సమయంలో ముస్లింలు టీ, పాలు ఇతర పదార్థాలను అందించారు. -
బద్రీనాథ్లో కూలిన హెలికాఫ్టర్
లక్నో: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో శనివారం ఉదయం ఓ ప్రయివేట్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తి కూలిపోయింది. బద్రినాథ్ నుంచి హరిద్వార్కు భక్తులను తీసుకొని వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా....ఇద్దరు పైలెట్లతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే హెలీకాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపాన్ని ప్రకటించారు. -
ఉత్తరాఖండ్లో మళ్లీ విలయం!
- విష్ణుప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు - నిలిచిన చార్ధామ్ యాత్ర.. చిక్కుకుపోయిన 15000మంది భక్తులు న్యూఢిల్లీ: భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్లోని చార్ధామ్లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో నేటి సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందలల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించేపనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సిఉంది. నాలుగేళ్ల కిందట చార్ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
‘చార్ధామ్ యాత్ర’
గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్లో శ్రీ మహావిష్ణువు, కేదార్నాథ్లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర. యమునోత్రి చార్ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట. గంగోత్రి చార్ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. భగీరథుడి తపఃఫలంగా ఉద్భవించిన గంగ 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళ నాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు. కేదార్నాథ్ అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్నాథ్. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్లో తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. బద్రీనాథ్ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు.. కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చార్ధామ్ యాత్రలో RVటూర్స్ –ట్రావెల్స్ గత 15 ఏళ్లుగా కొన్ని వేలమందికి చార్ధామ్ యాత్ర దర్శనాన్ని అందించి అనతి కాలంలోనే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా పేరొందిన RVటూర్స్ – ట్రావెల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ప్యాకేజీలతో సకల సదుపాయాలతో అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లతో చార్ధామ్ దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. మీరు కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే RVటూర్స్ – ట్రావెల్స్ వారిని సంప్రదించగలరు. -
రంజీ ట్రోఫీ క్వార్టర్స్లో హైదరాబాద్
లక్నో: బ్యాట్స్మెన్ బద్రీనాథ్ (84 బంతుల్లో 14 నాటౌట్), కొల్లా సుమంత్ (59 బంతుల్లో 10 నాటౌట్) సంయమనంతో ఆడటంతో... ఆంధ్రతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ ‘డ్రా’ చేసుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 47 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా చివరిరోజు లంచ్ తర్వాతే ఆట మొదలైంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినందుకు ఆంధ్రకు 3 పాయింట్లు లభించగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక హైదరాబాద్ (నాలుగు విజయాలు) 31 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్గా నిలిచి క్వార్టర్ ఫైనల్కు అర్హత పొందింది. హరియాణా కూడా 31 పాయింట్లతో (మూడు విజయాలు) రెండో స్థానంలో నిలిచి ఈ గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
బద్రీనాథ్ శతకం
వల్సాడ్ (గుజరాత్): ఛత్తీస్గఢ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ బద్రీనాథ్ (254 బంతుల్లో 134; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. బావనక సందీప్ (135 బంతుల్లో 73 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. దీంతో ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స నిలకడగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఛత్తీస్గఢ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... హైదరాబాద్ ఇన్నింగ్సను తన్మయ్ అగర్వాల్, అక్షత్ రెడ్డి ప్రారంభించారు. రెండో ఓవర్లోనే అక్షత్ (1) అవుట్ కావడంతో హైదరాబాద్కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద అతను పంకజ్ రావు బౌలింగ్లో నిష్క్రమించాడు. అనంతరం తన్మయ్కి జత కలిసిన బద్రీనాథ్ జట్టు స్కోరును నడిపించాడు. ఇద్దరు కుదురుగా ఆడటంతో మరో వికెట్ పడకుండా హైదరాబాద్ స్కోరు 100 పరుగులకు చేరింది. అనంతరం కాసేపటికి తన్మయ్ (39) కాంత్ సింగ్ బౌలింగ్లో మనోజ్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 120 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సందీప్ అండతో బద్రీనాథ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యం కూడా సెంచరీ మార్కును దాటింది. మూడో వికెట్కు 122 పరుగులు జోడించాక బద్రీనాథ్... అభిమన్యు చౌహాన్ బౌలింగ్లో నిష్క్రమించాడు. అదే ఓవర్లో బెంజమిన్ థామస్ (0) డకౌటయ్యాడు. తర్వాత మెహదీ హసన్ (10 బ్యాటింగ్), సందీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) మనోజ్ (బి) కాంత్ సింగ్ 39; అక్షత్ రెడ్డి (సి) మనోజ్ (బి) పంకజ్ రావు 1; బద్రీనాథ్ (సి) మనోజ్ (బి) అభిమన్యు చౌహాన్ 134; బి. సందీప్ బ్యాటింగ్ 73; బెంజమిన్ థామస్ (సి) మనోజ్ (బి) అభిమన్యు చౌహాన్ 0; మెహదీ హసన్ బ్యాటింగ్ 10; ఎక్స్ట్రాలు 10; మొత్తం (88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 267. వికెట్ల పతనం: 1-2, 2-122, 3-244, 4-244 బౌలింగ్: కాంత్ సింగ్ 18-7-30-1, పంకజ్ రావు 22-3-74-1, అభిమన్యు చౌహాన్ 10-3-22-2, అభిషేక్ 16-3-64-0, సుమిత్ రురుుకర్ 20-4-66-0, సాహిల్ గుప్తా 2-0-7-0 హైదరాబాద్ సారథి బద్రీనాథ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తన వ్యక్తిగత స్కోరు 89 పరుగుల వద్ద ఈ ఘనత సాధించాడు. -
హైదరాబాద్ కెప్టెన్గా బద్రీనాథ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ (2016-17) అఖిల భారత రంజీ ట్రోఫీ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టుకు బద్రీనాథ్ కెప్టెన్గా, భరత్ అరుణ్ కోచ్గా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 6 నుంచి నాగ్పూర్లో జరిగే తమ తొలిమ్యాచ్లో హైదరాబాద్ జట్టు... గోవా జట్టుతో తలపడుతుంది. హైదరాబాద్ జట్టు: ఎస్. బద్రీనాథ్, పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, బి. అనిరుధ్, కె. సుమంత్ (వికెట్ కీపర్), బెంజమిన్ సి థామస్, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, విశాల్ శర్మ, సీవీ మిలింద్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ ముదస్సిర్, హబీబ్ అహ్మద్ (వికెట్ కీపర్). -
హైదరాబాద్ కెప్టెన్గా బద్రీనాథ్
భరత్ అరుణ్కు కోచ్ బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ’సి’ గ్రూప్లో ఉన్న హైదరాబాద్ జట్టు కొత్త ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. భారత జట్టు మాజీ ఆటగాడు, తమిళనాడు వెటరన్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ 2015-16 సీజన్లో హైదరాబాద్ టీమ్కు నాయకత్వం వహించనున్నాడు. 136 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల అనుభవం ఉన్న 36 ఏళ్ల బద్రీనాథ్ ప్లేయర్ కం మెంటర్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న హనుమ విహారి ఈసారి ఆంధ్రాకు తరలి వెళ్లిపోయాడు. అయితేమరో రాష్ట్రానికి చెందిన ఆటగాడిని ఇలా మెంటర్ పేరుతో నాయకత్వ బాధ్యతలు అప్పగించడం హైదరాబాద్ జట్టుకు ఇదే మొదటిసారి. ఆంధ్రా జట్టు కూడా వరుసగా రెండు సీజన్లు సీనియర్లు అమోల్ మజుందార్, మొహమ్మద్ కైఫ్లను ఇలాగే తీసుకుంది. అనుభవం తక్కువగా ఉన్న తమ యువ క్రికెటర్లను నడిపించేందుకు సీనియర్ ఆటగాడి అవసరం ఉందంటూ హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ విజ్ఞప్తి చేయడంతో అతను హైదరాబాద్ తరఫున ఆడేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తమిళనాడు జట్టు తర్వాత గత రెండేళ్లు విదర్భ తరఫున ఆడిన బద్రీనాథ్... వాస్తవానికి తమిళనాడు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పోటీ పడినా అవకాశం దక్కలేదు. భారత్ తరపున బద్రీనాథ్ 2 టెస్టులు, 7 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. 136 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 56.19 సగటుతో 9,778 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నారుు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతను కరైకుడి కాలై జట్టు తరఫున ఆడుతున్నాడు. అరుణ్కు అవకాశం... జట్టు కోచ్ పదవి కోసం కూడా హెచ్సీఏ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇంటర్వ్యూల అనంతరం భరత్ అరుణ్ను ఎంపిక చేసినట్లు హెచ్సీఏ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. మీడియం పేస్ బౌలర్ అరుున అరుణ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ వరకు భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్గా వ్యవహరించారు. భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడిన ఆయన 48 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 110 వికెట్లు పడగొట్టారు. -
పెద్ద చిన్ని...!
ఒకటా.. రెండా.. మూడా... అన్నీ పెద్ద సినిమాలే... స్క్రీన్ మీద పడితే బాంబుల్లా పేలాయ్... ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాయ్... అంత పెద్ద సినిమాలు రాసింది చిన్నికృష్ణ... మరి అలాంటి పెద్ద రైటర్ చిన్నబోయాడు ఎందుకు? పెద్ద కథ వెనక ఓ చిన్ని గాథ... ♦ ‘నరసింహనాయుడు’ (2001)తో రైటర్గా ఎంటరై, ఈ పదిహేనేళ్లల్లో జస్ట్ ఐదు సినిమాలే చేశారేం? 2002లో ‘ఇంద్ర’, 2003లో ‘గంగోత్రి’, 2011లో ‘బద్రినాథ్’, 2012లో ‘జీనియస్’ చేశా. ఆమిర్ఖాన్తో వర్క్ చేయాలనేది నా జీవితాశయం. ‘జీనియస్’ తర్వాత ఆమిర్ కోసం స్క్రిప్ట్, స్క్రీన్ప్లే రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. లాస్ట్ ఇయర్ పూర్తి చేశా. హిందీ వాళ్ల తో డైలాగ్స్ రాయించా. వచ్చే నెల్లో ఆమిర్కి సబ్మిట్ చేస్తా. ♦ నరసింహనాయుడు, ఇంద్ర.. ఇలా మీరిచ్చినవన్నీ మామూలు కథలు కాదు. అసలా కథలకు ఇన్స్పిరేషన్ ఏంటి? నేను గాడ్ బిలీవర్ని. ఉదయం నిద్ర లేచాక మంచం మీద నుంచి కాలు కింద పెట్టేటప్పుడు నా భారాన్ని మోసే భూదేవిని క్షమించమని అడుగుతాను. నిద్రపోయే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తా. దేవుడి ఇన్ఫ్లూయన్స్, నేచర్ ఇన్ఫ్లూయన్స్ లేకుండా నాకు స్క్రిప్ట్ రాయడం అనేది రాదు. రాసే ప్రతి అక్షరం నేను రాశానని ఎప్పుడూ ఫీల్ కాలేదు. ఆ భగవంతుడే, ఆ అమ్మవారే రాయిస్తున్నారు. ♦ మధ్య మధ్యలో మీ కెరీర్లో వచ్చే బ్రేక్స్కి కారణం ఏంటి.. ఎవరూ అవకాశాలు ఇవ్వడంలేదా? అవకాశాలు రాలేదు అనేది లేదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. చిరంజీవిగారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరిన మీదట గ్రాండి యర్గా ఓ కథ రెడీ చేశాను. కానీ, చిరంజీవిగారు ‘కత్తి’ రీమేక్ చేయాలనుకున్నారు. నా కథ కంటే ‘కత్తి’ బాగుందనుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన మేటర్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చెప్పలేదు. అది నా నమ్మకం. చిరంజీవిగారు నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకూ నా జడ్జ్మెంట్ ఫ్లాప్ కాలేదు. నేను డెలివర్ చేసిన ఏ గూడ్స్ (సినిమాలు)నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. ఆ క్లారిటీ నాకుంది. ♦చిరంజీవిగారికి ‘ఇంద్ర’లాంటి హిట్ స్టోరీ ఇచ్చారు. ఇప్పుడు మీ కథను నమ్మలేదంటే..? నేను చెప్పింది ఆయన అంగీకరించలేదని చెడుగా మాట్లాడితే నేను క్రియేటర్నే కాదు. అది చిరంజీవిగారి వ్యక్తిగత నిర్ణయం. దట్సాల్. సినిమా వాళ్లందరూ కష్టపడేది ప్రేక్షకుడి కోసమే. నూన్ షో తర్వాత ప్రేక్షకుడు డిసైడ్ చేసే వరకూ ఎవరూ మాస్టర్స్ కాదు. రిలీజ్కి ముందే రిజల్ట్ చెప్పేమాస్టర్స్ ఎవరైనా ఉంటే దేవుడితో సమానం. తమిళ ‘కత్తి’ చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ♦రైటర్స్ ఎంత రాసినా స్క్రీన్ మీద కనిపించే హీరోనే ఆరాధిస్తారు.. దీనికి మీరేమంటారు? నాకు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఇష్టం. సంక్రాంతి, శివరాత్రి అప్పుడు ఎన్టీఆర్, ఏయన్నాఆర్ గార్లలా గెటప్స్ వేసుకుని కొందరు డ్యాన్సులు చేసేవాళ్లు. అప్పటివరకూ అదే వ్యక్తులు బీడీ తాగుతూ కనిపించేవాళ్లు. ఏమీ అనిపించేది కాదు. మేకప్ వేసుకుని స్టేజి మీద డ్యాన్సులు చేస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నదీ, స్క్రీన్ మీద కనిపించేదీనటుడు. నటుడికున్న వేల్యూ అది. గత జన్మలో మినిమమ్ వంద గుళ్లు కట్టిస్తే.. ఈ జన్మలో ఆర్టిస్ట్లు అవుతారని నమ్ముతా. దటీజ్ స్టార్డమ్. ♦స్టార్డమ్ గురించి గొప్పగా చెప్పారు.. మరి ఆ స్టార్స్ దగ్గరకు మీరే వెళ్లి కథలు చెప్పడానికి ఎందుకు మొహమాటం? మొహమాటం కాదు. ‘నరసింహనాయుడు’లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘కళామతల్లి అనేది సరస్వతి అమ్మవారితో సమానం. కళ దగ్గరికి మీ అమ్మాయి రావాలి గానీ, మీ అమ్మాయి దగ్గరికి కళ రాదు’. ఈ డైలాగ్ నేనే రాశాను. రియల్ లైఫ్లో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాను. ♦ రామ్చరణ్ డెబ్యూ మూవీ కోసం ‘పూరీ జగన్నాథ్’ అని కథ రాశారట. రియల్ పూరీ జగన్నాథ్ (దర్శకుడు) ఎంటర్ కాగానే ఆ సినిమా మీ చేతుల్లోంచి తీసేసుకున్నారట? కథ రాశాను. క్లైమాక్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు చిన్నికృష్ణ రైటర్, పూరీ జగన్నాథ్ డెరైక్టర్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూరీగారు తెలుగులో వన్నాఫ్ ది రెస్పెక్టబుల్ రైటర్స్. వెరీ గుడ్ ఫిలాసఫికల్ రైటర్. నా కథ ఓకే చేసిన తర్వాత ‘పోకిరి’ అనే సినిమా విడుదలై, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. సో, అతనితో వెళ్లడం కరెక్టే. నా కొడుకు హీరో అవుతున్నా.. నేనూ అదే నిర్ణయం తీసుకుంటా. ఓ రచయిత కథ కంటే.. మహేశ్బాబుతో పెద్ద హిట్టిచ్చిన ఓ రైటర్ కమ్ డెరైక్టర్తో వెళ్లడంలో తప్పు లేదు. ♦మీ దగ్గర ఉన్న కథల గురించి చెబితే తప్పేంటి? నేను రాస్తానని అందరికీ తెలుసు కదా. కొందరు బిచ్చగాళ్లు గంగిరెద్దులతో అడుక్కోవడానికి వస్తుంటారు. చిన్నికృష్ణ ఆల్రెడీ ఓ గంగిరెద్దులా అడుక్కుని, ఓ హిట్ ఇచ్చాడని తెలుసు కదా. నాకు మళ్లీ గంగిరెద్దు వేషం ఎందుకు? నేనిక్కడే (హైదరాబాద్) ఉంటున్నానని తెలుసు. నా ఇంటి గృహప్రవేశానికి కూడా వచ్చారు. గత పదిహేనేళ్లుగా నా ఫోన్ నంబర్ మారలేదనీ తెలుసు కదా. ♦ఇలా మాట్లాడతారు కాబట్టే, కొంతమంది మిమ్మల్ని ‘హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ చిన్నికృష్ణ’ అని అంటుంటారు.. గుడ్ క్రెడిట్. ఆఫీసు రూముల్లోనో, బెడ్రూమ్లోనో అనుకోకుండా ఏదైనా అవార్డు వేడుకలో ‘అండ్ ది హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ అవార్డ్ ఫర్ 2016 గోస్ టు చిన్నికృష్ణ’ అని బహిరంగంగా అవార్డు ఇస్తే ఆనందపడతా. అది మంచి క్రెడిట్. నన్ను ఈగోయిస్ట్ అనడం వల్ల వాళ్లకు ఆనందం దక్కుతోందంటే కాదనడానికి నేనెవర్ని? ♦తారాచౌదరి విషయంలో మీపై విమర్శలు వచ్చాయి కదా.. పాపం.. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్బ్యాలెన్స్. ఆ తర్వాత చాలాసార్లు అరెస్ట్ అయ్యింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ సోదరుడిగా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి లైఫ్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకా అమ్మాయి మీద కోపం లేదు. ♦మీ మీద వచ్చే కాంట్రవర్శీస్ గురించి మీరేమంటారు? ఐశ్వర్యా రాయ్తో అభిషేక్ బచ్చన్ పెళ్లి జరుగుతోంటే ‘నాకు ఇతను కడుపు చేశాడు’ అని ఓ అమ్మాయి వస్తుంది. ఇలాంటి గాసిప్స్ సినిమావాళ్లకు కామన్. టీవీలో 10 సెకన్ల యాడ్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఏ ఖర్చూ లేకుండా వార్త వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కూర్చుని నవ్వుకుంటా. టీవీ వాళ్లకీ రేటింగ్ బాగుంటుంది. ♦యాడ్ పాజిటివ్గా ఉంటే ఓకే.. మీ మీద వచ్చేవి నెగిటివ్...? (ప్రశ్న పూర్తి కాకముందే..) యాడ్ నెగిటివ్గా ఉంటేనే బాగుంటుంది. ‘చిన్నికృష్ణ 200 మందికి అన్నదానం చేశాడు’ అంటే, దాని గురించి రాయరు, చూపించరు. ‘చిన్నికృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మా యి తప్పించుకుంది. ఓ సీసీ కెమేరాలో దొరికాడు’ అంటే రేటింగ్ ఎంత ఉంటుందో చూడండి. మీడియాలో నెగిటివ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ పాజిటివ్ ఎనర్జీ. ♦జనరల్గా గ్యాప్ వచ్చినప్పుడు ‘వీళ్లు ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? ఇప్పటి తరానికి కావల్సినది ఇవ్వగలుగుతారా?’ అనే సందేహం ఉంటుంది.. మరి.. మీ కథలు? ఆర్టిస్టులకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ, రైటర్స్కి రిటైర్మెంట్ ఉండదు. ఆ మధ్య ఓ పెద్ద నిర్మాతను కలిశా. ఆయన పేరు కేయస్ రామారావు. ఆయన తారక్కి (ఎన్టీఆర్) కథ ఇవ్వాలన్నారు. అలా అంటూనే... ‘‘ఇప్పుడున్న హీరోలందరూ మంచి యంగ్స్టర్ స్క్రిప్ట్స్ ఇష్టపడుతున్నారు. మీరు, విజయేంద్రప్రసాద్గారు.. ఓల్డ్ స్మెల్ కదా’’ అన్నారు. పాపం ఆయనది తప్పు కాదు. రామారావుగారికి ఎవరో యంగ్ హీరో యంగ్స్టర్ స్టోరీ కావాలని చెప్పి ఉంటారు. ఆయన చెప్పినది ఈయన నాతో అని ఉంటారు. కానీ, వాళ్ల మనసుకి అర్థం కావాలి కదా. రామారావుగారు అలా అనగానే నేనేం మాట్లాడలేదు. జస్ట్ ‘అవునండి..’ అని వచ్చేశాను. నేను బాగా గౌరవించే వన్నాఫ్ ది బెస్ట్ రైటర్స్ విజయేంద్రప్రసాద్. ఆయనంటే చాలా అభిమానం. రామారావుగారు నాతో అలా మాట్లాడిన కొన్నాళ్లకు మా విజయేంద్రప్రసాద్గారు రాసిన ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజన్’ విడుదలయ్యాయి. అలాగని రామారావుగారికి ఫోన్ చేసి, ‘దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న ఆ రెండు కథలూ రాసినది మా ఓల్డ్ రైటరే. ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నవ్వలేదు. అంత దిగజారే మనిషి కాదు నేను.. నాకో ఐడెంటిటీ, గుర్తింపు వచ్చింది రజనీకాంత్గారి ‘నరసింహా’ వల్లే. ఆ కథను యాక్సెప్ట్ చేసినందుకు రజనీగారికీ, చిత్రదర్శకుడు కేయస్ రవికుమార్గారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగులో బాలకృష్ణగారు, చిరంజీవిగారు. పేర్లు ఆర్డర్లో చెబుతున్నాను. ఒకళ్లు ఎక్కువ, ఒకళ్లు తక్కువ అని కాదు. అల్లు అర్జున్గారు, ఓంకార్గారు. వీళ్లందరూ నన్ము నమ్మి కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుల్లో బి.గోపాల్గారు, రాఘవేంద్రరావుగారు, వీవీ వినాయక్గారు.. వీళ్లందరికంటే ముందు ఇతని కథ హిట్ అవుతుందని, ఇతను పెద్ద రైటర్ అవుతాడని చెప్పిన పరుచూరి బ్రదర్స్లో పరుచూరి గోపాలకృష్ణగారికి.. జన్మజన్మలకు నేను రుణపడి ఉంటా. ఎటువంటి ఈగో లేకుండా వాళ్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ♦ మీరన్నట్లు హీరోల్లా రైటర్కి రిటైర్మెంట్ లేకపోయినప్పటికీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటేవెనకపడిపోయినట్లే కదా? నన్ను చూస్తే.. వెనకపడిపోయినట్లుగా అనిపిస్తోందా? గడ్డం పెంచుకుని, చెట్టు కింద కూర్చుని కథలు రాసుకుంటూ, ఓ చేత్తో సగం కాలిన సిగరెట్టు పట్టుకుని ఆకాశంలో శూన్యంలోకి చూస్తూ..అదే చెట్టు కింద నేను పడిపోయి.. ‘అయ్యో... ఫలానా రచయిత’ అంటూ ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, జాలిపడేలా నేను కనిపిస్తున్నానా? లేదు కదా. హ్యాపీగానే ఉన్నానుగా. నేను ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీని నమ్ముతాను. ఏదీ మన చేతుల్లో ఉండదని నా ఫీలింగ్. ♦మీ భవిష్యత్తు గురించి మీ ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీ ఏం చెబుతోంది.. రేసీగా సినిమాలే చేస్తారంటోందా? అక్టోబర్ నుంచి బాగుంటుందని చెబుతోంది. అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నవ్వొచ్చే విషయం ఒకటి చెప్పాలి. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడితే కిక్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక్కటే ఆడితే? కిక్ ఉండదు కదా. ఇప్పుడున్న సినిమాల పరిస్థితి కూడా అంతే. కిక్ లేదు. ♦అదేంటి..? ఇప్పుడు కాంపిటీషనే లేదు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’, చిరంజీవిగారి ‘మృగరాజు’, వెంకటేశ్గారి ‘దేవీపుత్రుడు’ ఒకే రోజున (జనవరి 11) విడుదలయ్యాయి. స్టేట్ మొత్తం హీట్. ఏది బెస్ట్ రిజల్ట్ అనే ఎగ్జైట్మెంట్. అలాంటి కిక్ ఇప్పుడు లేదు. సినిమాలన్నీ దాదాపు కాంపిటీషన్ లేకుండా సోలోగా విడుదలవుతున్నాయ్. ♦వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పడనున్నాయి? ఇద్దరితోనూ మీరు సినిమాలు చేశారు. మరి.. ఈ రెండు సినిమాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రెండు సినిమాలూ ఆడితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవిగారు చేస్తున్న సినిమా ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీలాంటిది. తమిళ ‘కత్తి’కి రీమేక్ అది. పోటీలో ఉన్నవి రెండూ స్ట్రయిట్ చిత్రాలైతే మాట్లాడగలను. రీమేక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమా. ఇంకోటి చరిత్ర చెప్పే సినిమా. సో.. రెండింటినీ పోల్చలేం. కంపేర్ చేయాలంటే రెండూ స్ట్రెయిట్ సబ్జెక్ట్సే తీసుకోవాలి. అప్పుడది కాంపిటీషన్ అవుతుంది. దట్ ఈజ్ ద రియల్ వర్త్ ఆఫ్ రన్నింగ్ రేస్. ♦ఎక్కడ కామెడీ, ఎక్కడ రౌద్రం ఉండాలో చిన్నికృష్ణకు తెలు సని వినాయక్ ఓ సందర్భంలో అన్నారు. ఎలా నేర్చుకున్నారు? భాగ్యరాజాగారు నా గురువుగారు. ఏది ఎక్కడ ఎంత కొలతలో ఉండాలో నేర్చుకున్నది ఆయన దగ్గరే. డెరైక్టర్ శంకర్గారి దగ్గర చేయకపోయినా ఆయన కూడా నా గురులాంటివారే. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్టిక్ట్స్ అని రెండు ఉంటాయి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనుబంధాల చుట్టూ తిరుగుతాయ్. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్ సమాజంతో ముడిపడి ఉంటాయ్. శంకర్గారు, మురుగదాస్గారు చేసే సినిమాలన్నీ అవుటర్ కాన్ఫ్లిక్ట్స్. నా ‘బద్రినాథ్’ అలాంటి సినిమానే. ఆ సినిమా అప్పట్నుంచీ నా ఆలోచనా విధానం మారిపోయింది. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్లో కథలు రాస్తున్నా. ♦సాధారణంగా అల్లు అరవింద్గారు కథ రాశాక పారితోషికం ఇస్తారట.. కానీ, మీకు ముందే ఇచ్చారట? ఆయన హృదయంలో నాకు సెపరేట్ స్థానం. మా పాప ఫైనలియర్ అప్పుడు బన్నీ హీరోగా నాతో మళ్లీ సినిమా చేస్తా అన్నారు. ♦మరి ఏమైంది..? అన్నారు కదా అని కథ రాసేసుకుని, తెల్లారేసరికల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడలేం కదా. ఆ సమయంలో ఏ పనావిడో కళ్లాపి జల్లుతూ ఉంటుంది. ఆ కళ్లాపికి నేనెందుకు అడ్డం పడాలి (నవ్వుతూ). అభిమానంతో అంటారు. అన్నారు కదా అని వెంటాడేస్తే ఎలా? ♦మీ పెద్ద అబ్బాయిని హీరోని చేయబోతున్నారట? మా అబ్బాయి హీరోనా? పోయిన జన్మలో వంద గుళ్లు కట్టుంటే ఈ జన్మలో హీరోలవుతారని ఇంతకు ముందు చెప్పాను కదా. మరి మావాడు కట్టాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ వాడు వంద గుళ్లు కట్టుంటే హీరో అవుతాడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. ♦మీ కథలో యాక్ట్ చేసిన హీరోలతో మీరు టచ్లో ఉన్నారా? అందరితోనూ నాకు మంచి అనుబంధమే ఉంది. కాకపోతే నేను ‘భజన సంఘం’లో లేను. మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా భజన సంఘం ఉంటుంది. నేనా ట్రూప్కి చెందిన వ్యక్తిని కాదు. నా దగ్గర చిడతలు లేవు. ఒకట్రెండు సార్లు అవి ఇచ్చి, ఎలా కొట్టాలి? ఎలా కొడితే వాళ్లకు నచ్చుతుంది? ఏ సౌండ్ని ఇష్టపడతారు... అని కొందరు టిప్స్ ఇచ్చారు. నేను ట్రై చేసినా అవి పగిలిపోయాయి. దాంతో భజన సంఘానికి పనికి రానని ఫిక్సయ్యాను. అందుకే ఎప్పుడూ వాళ్ల చుట్టూ కనిపించను. ♦మరి.. భజన చేయకపోతే దగ్గరకు రానివ్వరట కదా? ఐ డోంట్ మైండ్. ఎవరు నన్ను కాదనుకుని సినిమా తీశారో.. ఎవరు నన్ను కాదనుకుని డెరైక్ట్ చేశారో.. ప్రకృతి వాళ్లకు అన్నీ కరెక్ట్గా ఇచ్చేసింది. ఆల్రెడీ వాళ్లకు దక్కింది కాబట్టి, ఇప్పుడు పనిగట్టుకుని ఎవరెవరికి ఏం దక్కింది? అని పర్టిక్యులర్గా నేను చెప్పడం అనవసరమైన సబ్జెక్ట్. ఎవరూ దగ్గరకు రానివ్వకపోయినా చిన్నికృష్ణ భజన చేయడు.. దట్సాల్. - డి.జి. భవాని -
భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్
లక్నో/డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతుండటంతోపాటు దిగువ ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రికుల ప్రయాణాలను గురువారం ఎక్కడికక్కడ నిలిపేశారు. బద్రీనాథ్, కేదర్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ ధామ్ అంటారనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లోని దైవాలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్ క్షేత్రానికి బయలు దేరిన దాదాపు పదివేల మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గత పన్నెండుగంటలుగా ఏమాత్రం తెరపునివ్వకుండా వర్షం కురుస్తుందని, అది తగ్గిన తర్వాత తిరిగి యాత్రలకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. -
కాలినడకన కేదార్నాథ్ చేరుకున్న రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలనడకన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. రాహుల్ 16 కిలో మీటర్ల మేర నడిచివెళ్లారు. కేదార్నాథ్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2013లో అకాల వర్షాలు, వరదల వల్ల మరణించిన చార్ధామ్ యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించినట్టు రాహుల్ చెప్పారు. అంతకుమించి దేవుణ్ని ఏమీ కోరుకోలేదని అన్నారు. 2013లో వరదల సమయంలో కేదార్నాథ్లో పర్యటించి విపత్తును కళ్లారా చూశానని రాహుల్ గుర్తుచేసుకున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. హెలికాప్టర్లో వస్తే వారిని అగౌరవపరిచినట్టు అవుతుందని, అందుకుని వారి ఇక్కడి వచ్చిన కాలిబాటలోనే తాను వచ్చానని రాహుల్ తెలిపారు. కాగా 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు. -
నాయనమ్మ బాటలోనే రాహుల్
న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను హెలికాప్టర్ పంపిస్తానని చెప్పినా వద్దన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. గౌరికుంద్ నుంచి కేదార్ నాథ్ వరకు ఆయన మొత్తం 17 కిలో మీటర్లు నడిచి వెళ్తారని చెప్పారు. చాలా రోజుల విరామం తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ వారం రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో ధీటుగా స్పందిస్తూ తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కేదార్ నాథ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. దీనిపైనే హరీశ్ రావత్ మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇందిరతో ఉన్నానని, ఇప్పుడు రాహుల్తోనని నాడు ఇందిరా బద్రీనాథ్ బాబా దీవెనలు పొందితే ఇపుడు రాహుల్ కేదార్ బాబా దీవెనలు పొందనున్నారని చెప్పారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కాలినడకన ఆలయాన్ని చేరుకొని రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికే రాహుల్ మరికొందరు నేతలతో కలసి కేదార్ నాథ్ బయలు దేరారు. -
బయటపడ్డ బద్రీనాథ్ యాత్రికులు
ధైర్యం కూడదీసుకుని వర్షంలోనే తిరుగుముఖం రుషికేశ్లో కొందరు..హరిద్వార్కు మరికొందరు బుధవారం నాటికి హైదరాబాద్చేరుకునే అవకాశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యాత్రికుల ధ్వజం విజయవాడ బ్యూరో: భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఎట్టకేలకు బయటపడ్డారు. నాలు గు రోజులపాటు నరకయాతన అనుభవించిన 38 మంది యాత్రికులు ఆదివారం ఉదయం ధైర్యం కూడదీసుకుని ప్రైవేటు వాహనాల్లో హరిద్వార్ బయలుదేరారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రాణ భయంతో ఇంటి ముఖం పట్టారు. 50 కిలోమీటర్లు ప్రయాణించి కొందరు రుషికేశ్లో ఆగిపోగా.. మిగిలిన వారు అవే వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వీరు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడి నుంచి దక్షిణ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ చేరతారు. ఆదివారం కూడా బద్రీనాథ్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చినజీయర్ ఆశ్రమంలో ఉన్న తెలుగు యాత్రికుల్లో ఆందోళన పెరిగిం ది. నాలుగు రోజులుగా నానా ఇక్కట్లు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సాయం చేయకపోగా, అక్కడి నుంచి బయటకు చేర్చే ప్రయత్నాలు చేయకపోవడంతో యాత్రికులు మరింత కుంగిపోయారు. మరో రెండు రోజులు అక్కడే ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని భావించి వర్షంలోనే తిరుగుముఖం పట్టారు. మొదట వాహనాలు తీయడానికి విముఖత వ్యక్తం చేసిన అక్కడి డ్రైవర్లు కొందరు.. అధిక మొత్తంలో కిరాయి చెల్లిస్తామని చెప్పడంతో ప్రయాణానికి అంగీకరించారు. దీంతో 3 ప్రైవేటు వాహనాల్లో 38 మంది యాత్రికులు బయలుదేరారు. కృష్ణా జిల్లా వేకనూరు గ్రామానికి చెందిన తుంగల భాస్కరరావు కుటుంబీకులు మొత్తం 11 మంది రుషికేశ్ వరకూ ప్రయాణించి ఆదివారం రాత్రి అక్కడే ఆగిపోయారు. హైదరాబాద్, విశాఖ, చిత్తూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన మిగతా వారు రెండు వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు తుకులి ప్రాంతానికి చేరుకున్న వీరు సోమవారం మధ్యాహ్నానికి హరిద్వార్ చేరతారు. మార్గమధ్యంలో కొండలు ఎక్కి దిగే క్రమంలో రోడ్లకు అడ్డుపడిన పెద్ద పెద్ద రాళ్లను తామే తొలగించి ప్రయాణం సాగిస్తున్నామని హైదరాబాద్కు చెందిన సోమయాజులు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్లో తెలిపారు. హరిద్వార్లో దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరుకుంటామనీ, అక్కడి నుంచి బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరతామని ఆయన వివరించారు. ఒక్కరన్నా పట్టించుకున్న పాపాన పోలేదు.. నాలుగు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నా.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నా కేంద్రంగానీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వంగానీ పట్టించుకున్న పాపాన పోలేదని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేశారు. చార్ధామ్ యాత్ర తమకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని యాత్రికులు పేర్కొన్నారు. -
భయం గుప్పెట్లో..
-
ప్రమాదకరంగా బద్రీనాథ్ వాతావరణం
బద్రినాథ్: చార్ధామ్ యాత్రకు వెళ్లి బద్రినాథ్లో చిక్కుకుపోయిన తెలుగువాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. యాత్రికుల్లో పది మందికిపైగా తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అందడం లేదని వారు వాపోతున్నారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గతేడాదిలాగే ఇప్పుడు కూడా వరదలు వణికిస్తున్నాయి. ఈ యాత్ర కోసం వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు బద్రినాథ్లో చిక్కుకుపోయారు. రెండు రోజులుగా వారు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకునేందుకు వారికి కొంత చోటు దొరికింది. ఆశ్రమం వారే ప్రస్తుతం వారి ఆలనాపాలన చూస్తున్నారు. చలిగాలుల తీవ్రత పెరగడంతో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న ఒక వైద్యుడు వారికి చికిత్స చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్రంలో వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. బద్రినాథ్ నుంచి రుషికేష్ వెళ్లే రోడ్డు వరదల కారణంగా కొట్టుకుపోయింది. 24 గంటల వ్యవధిలో ఏడు సెంటీమీటర్ల వర్షం కురవడంతో అక్కడికి వెళ్లిన యాత్రికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బద్రీనాథ్ వాతావరణం ప్రమాదకరంగా మారిందని వాళ్లంటున్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా వరసగా నాలుగో రోజు కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రను రద్దు చేసింది . యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు ఎప్పుడు మెరుగైతే అప్పుడు తిరిగి యాత్ర ప్రారంభిస్తారు. -
బద్రీనాథ్లో యాత్రికులకు జ్వరాలు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చినజీయర్ ఆశ్రమంలోతెలుగు భక్తులకు ఆశ్రయం చలిగాలుల తీవ్రతకు ఆస్తమా రోగులకు అస్వస్థత నీటి ఉధృతికి కొట్టుకు పోయిన రోడ్లు విజయవాడ బ్యూరో: చార్ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాలతో బద్రీనాథ్లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు యాత్రికులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. బద్రీనాథ్లోని చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న యాత్రికుల్లో 10 మందికి పైగా జ్వరాలు సోకాయి. కొందరు జలుబు, దగ్గు సమస్యలతో బాధ పడుతుండగా నలుగురు ఆస్తమా రోగులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత పెరిగి వాతావరణం బాగా చల్లబడటంతో శ్వాస పీల్చుకోవడం కష్టమవుతోందని ఆశ్రమంలోని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఒక వైద్యుడు వీరికి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి శనివారం సాయంత్రం ఫోన్ చేయగా పలువురు యాత్రికులు తమ దయనీయ పరిస్థితిని వివరించారు. ఉత్తరాఖండ్ సీఎం ఫోన్ చేసినా... ‘వర్షాలు మరింత పెరిగాయి. ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్రావత్ ఫోన్ చేసి ఎవరూ కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే లైన్లోకి రావటంతో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని ఆశ పడ్డాం. కానీ శనివారం సాయంత్రం వరకూ ఎవరూ రాలేదు. ఒకరిద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లు వచ్చి ఎలా ఉన్నారని పలకరించి వెళ్లారు’ యాత్రికులు పేర్కొన్నారు. ఆశ్రమంలో ఉన్న సాంబశివరావు, శివయ్య, సుమంత్(డ్రైవర్), సూర్యనారాయణ, రజని, సోమయాజులు జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. వృద్ధులైన యల్లప్ప, సాయమ్మ, సోమయాజులు ఆస్తమాతో ఊపిరి ఆడక అవస్థ పడుతున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న సూర్యనారాయణకు జ్వరం రావడంతో ఆయన బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులు ఇచ్చిన దుప్పట్లు కప్పుకుని మునగదీసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఎస్వీఎస్ రావు చెప్పారు. రుషికేశ్ మార్గంలో కొట్టుకు పోయిన రోడ్డు నదీ ప్రవాహ వేగానికి బద్రీనాథ్ నుంచి రుషికేశ్కు వెళ్లే మార్గంలో 35వ కి.మీ. దగ్గర రోడ్డు 100 గజాల మేర కొట్టుకు పోయింది. దీంతో బద్రీనాథ్ పోలీసులు అక్కడ ఉన్న భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రయాణం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ నుంచి జోషిమఠం వెళ్లే రోడ్డు కూడా బాగా దెబ్బతినటంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ సుమారు 7 సెంటీమీటర్ల వర్షం కురిసి ఉండవచ్చని చెబుతున్నారు. ఆకాశమంతా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో బద్రీనాథ్ వాతావరణం ప్రమాదకరంగా మారిందని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికుల కుటుంబీకుల్లో ఆందోళన యాత్రికులు మూడు రోజులుగా బద్రీనాథ్లో చిక్కుకుపోవటంతో వారి బంధువుల్లో ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా వేకనూరు గ్రామానికి చెందిన 11 మంది బద్రీనాథ్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చెన్నైలో ఉన్న తుంగల భాస్కరరావు కుమారుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు, అక్కబావల క్షేమ సమాచారాలను ఫోన్ ద్వారా తెలుసుకుని ధైర్యం చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన సోమయాజులు, రజని బంధువులు, హరిబాబు కుటుంబీకులు ఆందోళనతో టీవీలో వార్తలు తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వారిని తమ దగ్గరకు చేర్చాలని కోరుతున్నారు. చార్ధామ్ యాత్ర నాలుగో రోజూ బంద్ ప్రతికూల పరిస్థితులతో వరుసగా నాలుగో రోజు చార్ధామ్ యాత్రను రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో శనివారం కూడా యాత్ర రద్దయింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యాత్రను శనివారం నిలిపివేసినట్లు ఉత్తరకాశి కలెక్టర్ రవిశంకర్ తెలిపారు. యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభం కావచ్చని అయితే వాతావరణం, రహదారుల పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. చంపావట్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 150 వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. -
భయం గుప్పెట్లో...
-
యాత్రికులు సురక్షితం : కలెక్టర్
మచిలీపట్నం : జిల్లా నుంచి బదరీనాథ్, కేధార్నాథ్ వెళ్లిన యాత్రికులు సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ ఎం.రఘునందన్రావు శుక్రవారం తెలిపారు. బదరీనాథ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల జిల్లా వాసులు అక్కడ చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. వెంటనే బదరీనాథ్ జిల్లా అధికారులతో, జిల్లాకు చెందిన యాత్రికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నామన్నారు. అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన 10 మంది, మచిలీపట్నంకు చెందిన ఒకరు కేధార్నాథ్ యాత్రకు 20 రోజుల క్రితం బయలుదేరి వెళ్లారన్నారు. వీరంతా ఢిల్లీలోని తమ బంధువుల ఇళ్ల నుంచి బయలుదేరి రుషికేష్, ఉత్తరాఖండ్, ముస్సోరి, కేధార్నాథ్, బదరీనాథ్ యాత్రకు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో బదరీనాథ్ వద్దకు చిక్కుకుపోయారన్నారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారిని సరస్వతి నది ఒడ్డున ఉన్న చినజీయర్స్వామి ఆశ్రమానికి అక్కడి అధికారులు తరలించారని వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. యాత్రికుల వివరాలు అవనిగడ్డ వేకనూరుకు చెందిన తుంగల భవాని, తుంగల సావిత్రి, గుడివాక సాంబశివరావు, గుడివాక అరుణ, విశ్వనాధుని సుబ్బారావు, విశ్వనాధుని నాగరాజకుమారి, సనకా వెంకటశేషగిరిరావు, సనకా రాధ, సనకా ఫణీందర్, కొండవీటి కుమారి, మచిలీపట్నంకు చెందిన సిగిరేటి ఉషాకుమారి ఉన్నారు. మేము క్షేమంగానే ఉన్నాం.... వేకనూరు (అవనిగడ్డ) : కుటుంబసమేతంగా బదరీనాథ్ యాత్రకు వెళ్లిన మండల పరిధిలోని వేకనూరుని గ్రామానికి చెందిన భాస్కరరావు, భార్య సావిత్రి, అల్లుడు విశ్వనాథుని వెంకట సుబ్బారావు, కుమార్తె నగరాజకుమారి,మరో అల్లుడు గుడివాక సాంబశివరావు, కుమార్తె అరుణకుమారి క్షేమంగానే ఉన్నామని బంధువులకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. బద్రీనాధుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యామని,భారీవర్షాల వల్ల రహదారులు మూసుకుపోవడంతో రాలేకపోయామని తెలిపారు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. -
బద్రీనాథ్లో భయం భయంగా..
సాక్షి, న్యూఢిల్లీ, విజయవాడ బ్యూరో: గతేడాది ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రికులపై విరుచుకుపడ్డ భారీ వరదలు మరోసారి వణికిస్తున్నాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు భక్తులు అక్కడ చిక్కుకుపోయారు. జోరు వానలోనే నానా కష్టాలు పడి బద్రీనాథ్ చేరుకుని ప్రస్తుతం అక్కడి చినజీయర్స్వామి ఆశ్రమంలో తలదాచుకుంటున్నా రు. మూడు రోజులుగా ఆశ్రమ నిర్వాహకులు వారికి భోజన వసతి కల్పించి ఆదుకుంటున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, హైదరాబాద్ ప్రాంతాల వారు సుమారు 50 మంది యాత్రికులున్నారు. కరెంటు సదుపాయం, ఫోన్లు, ఏటీఎంలు పనిచేయక అవస్థలు పడుతున్నట్లు యాత్రికులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధులకు తెలిపారు. మరో 100 మందికి పైగా తెలుగువారు బద్రీనాథ్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పారు. వారిలో వృద్ధులు, మహిళలు ఉండటంతో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో తెలియక ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం జీయర్ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడింది. పోలీసులను పంపి తెలుగు యాత్రికుల వివరాలను సేకరిం చింది. ఇక్కడున్న యాత్రికుల్లో ఇద్దరి మొబైల్స్ 9701456187, 9560935988 మాత్రమే పని చేస్తున్నాయి. యాత్రికులు విజయవాడ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి బద్రీనాథ్లోని చినజీయర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఆశ్రమం మేనేజర్ కృష్ణారావు వీరికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం మెరుగుపడ్డాకే యాత్ర పునరుద్ధరణ ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కొనసాగటంతోపాటు నదులు ఉప్పొంగటం, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రను తొలుత నిలిపివేయగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంగోత్రి, యమునోత్రి యాత్రను కూడా సాయంత్రం నిలిపివేశారు. దీంతో చార్ధామ్ యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఉత్తరాఖండ్కు రెండు ఎంఐ-17 హెలి కాప్టర్లు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించింది. జూలై 25వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. గత ఏడాది వరద బీభత్సం అనుభవాల నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. ఆరు సహా యక బృందాలను రంగంలోకి దించారు. అల్మోరా, పౌరి, రుద్రప్రయాగ, చమోలీ, హరిద్వార్లో యాత్రికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంత ప్రమాదమని తెలిస్తే వచ్చే వాళ్లం కాదు భారీ వర్షాల వల్ల కరెంటు సరఫరా నిలిచిపోయి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కొండప్రాంతాల్లోని రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు రోజులుగా యాత్రికులు నానా అవస్థలు పడుతున్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించలేదు. - బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం మూడు రోజుల క్రితం బద్రీనాథ్కి వచ్చాం. అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అంతా చినజీయర్స్వామి ఆశ్రమంలో ఉన్నాం. - సాక్షితో హరిబాబు(కేపీహెచ్బీ, హైదరాబాద్) చినజీయర్స్వామి ఆశ్రమంలో తలదాచుకున్నాం చినజీయర్స్వామి ఆశ్రమంలో తలదాచుకోవటంతో బయటపడగలిగాం. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న తొమ్మిది మంది బంధువులతో కలిసి యాత్రకు వచ్చాం. - ఎస్వీఎస్ రావు (ఢిల్లీలో ఉంటున్న తెలుగు వ్యక్తి) చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న కొందరు తెలుగువారు.. తుంగల భాస్కరరావు, సావిత్రి, అరుణ, నగరాజకుమారి, రాధ, సాంబశివరావు, సుబ్బారావు, ఎస్వీఎస్ రావు (కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు) ఎస్. హరిబాబు (చిత్తూరు) సోమయాజులు, రజని దంపతులు. యల్లప్ప, తాయారమ్మ దంపతులు, సూర్యనారాయణ, సుహాసిని, మౌనిక, మాల్యాద్రి (వీరిది కేపీహెచ్బీ కాలనీ) విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది ఉత్తరాఖండ్లో నదుల పరవళ్లు గత 24 గంటల్లో నైనిటాల్లో గరిష్టంగా 152 మి.మీ. వర్షం కురిసింది. అలకనంద, మందాకినీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాలలో అన్ని పాఠశాలలను సోమవారం వరకు మూసివేశారు. ప్రమాదస్థాయిలో అలకనంద, గంగ, మందాకినీ నదులు యాత్రికులు క్షేమం: కంభంపాటి బద్రీనాథ్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాత్రికులు బద్రీనాథ్లోని చినజీయర్స్వామి ఆశ్రమంలో క్షేమంగా ఉన్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు జాతీయ విపత్తుల సంస్థ సభ్యులతో మాట్లాడి వారికి సాయం అందించాలని కోరాం. ఏపీ భవన్ అధికారులూ యాత్రికులతో మాట్లాడుతున్నారు. - కంభంపాటి రామ్మోహన్రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి -
బద్రినాథ్లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితం
న్యూఢిల్లీ: పత్రికూల వాతావరణం కారణంగా బద్రినాథ్లో చిక్కుకున్న 32 మంది తెలుగువారిని సహాయ సిబ్బంది కాపాడారు. వారిని చిన్నజీయర్ ఆశ్రమానికి తరలించారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. ఆశ్రమంలో బాధితులు ఉండేందుకు అనుమతించాలని కోరారు. వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయాన్ని కూడా కోరారు. భారీ వర్షాలతో బ్రదినాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. వర్షసూచనతో భక్తులను వెళ్లనీయకుండా ఛార్దామ్ యాత్రను రద్దు చేశారు. -
బద్రీనాధ్లో చిక్కుకున్న 35మంది
-
కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
గోపేశ్వర్: మూడు నెలల వ్యవధి తర్వాత హిమాలయ క్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు శనివారం నుంచి యాత్రలు పునఃప్రారంభమయ్యాయి. తొలి బృందంలో రెండువందల మంది యాత్రికులు ఈ రెండు ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్లో సంభవించిన వరదల్లో భారీ ప్రాణనష్టం సంభవించిన దరిమిలా, ఈ క్షేత్రాలకు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ క్షేత్రాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా నిర్మించిన కట్టడాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా కేదార్నాథ్ ఆలయానికి రోజుకు వంద మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు చెప్పారు. కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్న వారిలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ ఉన్నారు. కాగా, యాత్రల కోసం గుప్తకాశీలో రోజూ యాత్రికుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. యాత్రికుల భోజన వసతుల కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ మార్గంలోని భీమబలి, లెంచౌనీలలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ సమితి ప్రధాన కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్ తెలిపారు. -
కేథార్నాథ్లో తొలి పూజలు
-
బద్రీనాథ్లో సాక్షి టీవీ బృందం