blackmailing
-
నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్కి వెళ్ళిపోదాం
హైదరాబాద్: దుబాయ్లో ఓ పబ్లో డ్యాన్సర్గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతికి అక్కడే పరిచయయమైన యువకుడు మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత డ్యాన్సర్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దుబాయ్కు చెందిన నౌషాద్ అబూ బాకర్పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్లో నివసించే యువతి (38) 2018 అక్టోబర్ 6వ తేదీన ఉపాధి నిమిత్తం దుబాయ్కు వెళ్లింది.దుబాయ్లోని సౌత్ ఇండియా పబ్లో డ్యాన్సర్గా చేరింది. పబ్ సూపర్వైజర్ ఆమెకు ఏదైనా పని ఉంటే నౌషాద్ అబూబాకర్ను సంప్రదించాలని నెంబర్ ఇచ్చాడు. అప్పటి నుంచి తరచూ నౌషాద్ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. అయితే వీడియోలు తీసుకుని కొంతకాలంగా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నాడు. 2020లో ఆమె హైదరాబాద్కు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే అబూబాకర్ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ తిరిగి దుబాయ్ పబ్కు రావాలని, లేకపోతే వీడియోలు, ఫోటోలు కుటుంబసభ్యులకు షేర్ చేస్తానంటూ బెదిరించడంతో ఆమె తిరిగి దుబాయ్కు వెళ్లింది. ఇద్దరి మధ్య వీడియోల విషయంలో గొడవ జరిగింది. ఫోన్లో నుంచి వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించి తిరిగి హైదరాబాద్కు వచ్చింది. ఆరు నెలల తర్వాత అబూబాకర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటి నుంచి బయటకు రావాలని లేకపోతే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వీడియోలు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇదే అదునుగా నిందితుడు ఆమె ఫోటోలు, వీడియోలను భర్తకు, కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానని, వదిలిపెట్టాలంటూ భర్తను హెచ్చరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక, అబూబాకర్ బ్లాక్మెయింలింగ్ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్ఫోన్కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్మెయిలింగ్లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ముసుగులో మూర్తి.. అసలు రంగు వేణు స్వామి వీడియో..
-
ముసుగులో మూర్తి.. అసలు రంగు
-
క్యాబ్లో ఏం మాట్లాడుతున్నారు? డ్రైవర్కు దుర్భుద్ధి పుడితే ఎలా?
క్యాబ్లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్లో చేసిన పర్సనల్ టాక్ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది. అసలేం జరిగింది? ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్లో వెనుక సీట్లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు. ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు. ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు. జాగ్రత్త... మాటలు వింటారు మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు. పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త! ఎలా దొరికాడు? జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు. ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్లో ఖర్చు పెట్టేశాడు. -
ఆ ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: నటి
తమిళ నటి లుబ్నా అమీర్ తన మాజీ ప్రియుడు వేధిస్తున్నాడంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీస్ కమీషనర్ని ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగి మాసి ఉల్లాతో లుబ్నీ అమీర్కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే మాసిఉల్లాకు అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి తాను దూరం పెట్టానని, అప్పట్నుంచి తనను వేధిస్తున్నాడంటూ లుబ్నా పేర్కొంది. ఇదే విషయంపై అతడిపై కేసు పెడితే ఇటీవలె బెయిల్పై బయటకు వచ్చి హింసిస్తున్నాడని, అతనితో పాటు మాసి ఉల్లా భార్య నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. అంతేకాకుండా రిలేషన్లో ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష' అయితే మాసి ఉల్లా సైతం లుబ్నీ అమీర్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలతో డబ్బు సంపాదిస్తుందని, ఇదే తమ మధ్య గొడవలకు కారణమై విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం -
యువతికి వేధింపులు.. ఆ ఫోటోలు కాబోయే భర్తకు పంపుతానంటూ..
అమీర్పేట(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. అమీర్పేటకు చెందిన నాగ అభినయ్ అనే వ్యక్తికి మధురానగర్లో ఉండే ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఉండేవాడు.పెళ్లి ప్రస్తావన తేవడంతో నిరాకరించాడు. ఈ క్రమంలో గత నెలలో మరో వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడడం, కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించి నిశ్ఛితార్థం కూడా చేశారు. విషయం తెలుసుకున్న అభినయ్ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను కాబోయే భర్తకు పంపుతానని వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు
సాక్షి, వరంగల్: వరంగల్లో ఓ సీఐ వేధింపుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తన న్యూడ్ వీడియోలు, ఫొటోస్తో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్ పీఎస్లో పనిచేస్తున్న సీఐ సతీష్కుమార్ను సస్పెండ్ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బులు కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తన భర్త కొంతమంది మహిళల న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్ పీఎస్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేల లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి. సీఐ వ్యవహారాలపై విచారణ చేపట్టిన సీపీ తరుణ్ జోషి.. సతీష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. చదవండి: (ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం) -
ఆపరేషన్ ‘మేఘ్చక్ర': 50 మంది అనుమానితులు అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కంటెంట్తో మైనర్లపై బ్లాక్మెయిల్కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్చక్ర’తో సీబీఐ శనివారం మెరుపుదాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో దాడులు జరిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేశారు. తెలంగాణలో హైదరాబాద్లో విస్తృత సోదాలు నిర్వహించారు. న్యూజీల్యాండ్లోని ఇంటర్పోల్ యూనిట్ సమాచారంతో సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. క్లౌడ్ స్టోరేజిని ఉపయోగిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ను సర్క్యులేట్ చేస్తున్న నిందితులను గుర్తించారు. దాడుల్లో 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస, వీడియో చిత్రీకరణపై విచారణ బాధితులను గుర్తించేందుకు సీబీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
Russia-Ukraine War: ఉక్రెయిన్కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్గా వారితో చాటింగ్
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్స్ట్రాగామ్ అకౌంట్ క్రియేట్ చేసి, అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్గా వారితో చాట్ చేస్తూ... నగ్నంగా వీడియో కాల్ మాట్లాడించి బ్లాక్ మొయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్న ఓ కేటుగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ కాలనీలో నివాసం ఉండే కూచికుల సాయకృష్ణారెడ్డి (31) నగరంలో ఈవెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఇన్స్ట్రాగామ్ ద్వారా అమ్మాయి పేరుతో ఇతరులను పరిచయం చేసుకుని ఫ్యాషన్ డిజైనర్గా పని చేస్తున్నానని పేర్కొని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో నగరానికి చెందిన ఓ యువకుడు చాట్ చేయగా, అతడితో అతను నగ్న వీడియో కాల్ చేయడానికి ప్రేరేపించాడు. అనంతరం సెల్ఫోన్ స్కీన్ రికార్డ్ చేసి దాని వీడియో క్లిప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే.. -
బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అతని ఫొటోను షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. ''ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది. అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి ''నేను 1 తేదిన గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. 14 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబయి పోలీస్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా'' అని ఉర్ఫీ రాసుకొచ్చింది. అలాగే తనను వేధిస్తున్న వ్యక్తి పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని కూడా తెలిపింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
వివాహితను నమ్మించి కోర్కెలు తీర్చుకుని.. ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్..
అమీర్పేట(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు సమాచారం మేరకు... ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్ చేస్తూ బీకేగూడ ఎస్ఆర్నగర్లో ఉంటోంది. భర్తతో విడిపోయిన ఆమె కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్లో ఉన్న సమయంలో అమర్తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురుని కూడా బాగా చూసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా అయితే అమర్తేజకు సైతం వివాహం జరిగినట్లు తెలియడంతో ఆయనను నిలిదీసింది. దీన్ని మనుసులో పెట్టుకుని ఆమెను వేధింస్తుండటంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరియీ కౌన్సిలింగ్ చేసి పంపారు. అయినా అతడిలో మార్పు రాలేదు. దీంతో బీకేగూడకు వచ్చి ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫొటోలను చూపించి తనవద్దకు రావాలని, లేదంటే ఫొటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఆడాళ్లూ.. జాగ్రత్త! ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం తప్పదు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిలో సుమారు 19 మంది మహిళలు బ్లాక్మెయిల్కు గురైనట్లు గుర్తించారు. వివరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా కొండేరు మండలం కొండ్రపల్లి గ్రామానికి చెందిన భీమిని గణేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం హైదరాబాదులోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగం చేశాడు. చేస్తున్న ఉద్యోగం మానేసిన గణేష్ సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నాడు. ఫేస్బుక్లో ఉండే మహిళలను టార్గెట్గా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో ప్రైవసీ లాక్ చేసుకోని మహిళల అకౌంట్లను ఎంచుకుని వారికి వేరే వ్యక్తుల ఫొటోలు కొత్త కొత్త పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. కొంతకాలం మంచి ఫ్రెండ్గా నటిస్తూ వారి ఫేస్బుక్ను హ్యాక్ చేసి అందులోని వారి ఫొటోలు డౌన్లోడ్ చేయడంతో పాటు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అనేక మంది యువతులు, వివాహితులను తన ట్రాప్లో పడేసి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. మోసపోయిన 19 మంది మహిళలు.. గణేష్ చేస్తున్న సైబర్ నేరాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 19 మంది అమాయక మహిళలు మోసపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆన్లైన్ ఉద్యోగం చేసే క్రమంలో భాగంగా ఒక యాప్ను ప్రమోట్ చేసేందుకు ఫేస్బుక్ స్టేటస్లో షేర్ చేసింది. అదే సమయంలో వికాస్రామ్ అనే దొంగ పేరుతో గణేష్ ఆ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి పెట్టిన ఫేస్బుక్ స్టేటస్ను ప్రమోట్ చేస్తానని నమ్మించాడు. మాటలు కలిపి యాప్ డౌన్లోడ్ చేయగానే ఓటీపీ వస్తుందని ఆ నంబరును తనకు ఫార్వర్డ్ చేయాలని చెప్పాడు. యువతి ఫోన్ నంబరు చెప్పగా ఆ నంబరు కలవడం లేదని ఇంట్లో వాళ్ల నంబర్లు ఏవైనా ఉంటే చెప్పాలని అడిగాడు. నమ్మిన యువతి కుటుంబసభ్యుల నంబర్లు అతనికి మెసేజ్ చేసింది. నంబర్లు తీసుకున్న వెంటనే గణేష్ ఆమె ప్రొఫైల్ ఫొటోపై బాధితురాలి ఫోన్ నంబరుతో పాటు ఇంట్లోవాళ్ల నంబర్లు పెట్టి సెక్స్ గాళ్గా అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. కాదు అంటే నూడ్గా వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో సదరు యువతి అతనికి వీడియో కాల్ చేసింది. గణేష్ ఆమె వీడియో కాల్ను స్క్రీన్ రికార్డు ద్వారా వీడియో రికార్డు చేసి మరింత బ్లాక్ మెయిల్ చేయసాగాడు. యువతి ఫిర్యాదుతో విచారణ.. గణేష్ చేతిలో మోసపోయిన యువతి జరిగిన విషయాన్ని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్పీ ఆదేశాలతో గాలింపు చేపట్టిన పోలీసులు బాధితురాలి చేత అతనికి ఫోన్ చేయించారు. అడిగినంత డబ్బు ఇస్తానంటూ నమ్మించి గూడూరుకు పిలిపించారు. అప్పటికే అక్కడ కాపు కాసిన దిశ సీఐ నరేష్కుమార్, గూడూరు ఎస్ఐ ఇతర సిబ్బంది యువతి వద్దకు వస్తున్న గణేష్ను వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఎస్పీ మాట్లాడుతూ యువతులు, మహిళలు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్లపై స్పందించవద్దని సూచించారు.ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరగాడిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకట రామాంజనేయులు, దిశ సీఐ నరేష్కుమార్, ఎస్ఐ మస్తాన్ఖాన్, ఐటీ కోర్ ఎస్ఐ దీపిక, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్ఐ -
వాట్సప్లో పరిచయం ఆపై చనువు.. కొన్ని రోజుల తర్వాత ఒకరు కాల్ చేసి..
బనశంకరి(బెంగళూరు): సోషల్ మీడియాలో యువతి వలలో పడిన వ్యక్తి డబ్బు పోగొట్టుకుని ఇబ్బందుల్లో పడిన ఘటన ఉద్యాననగరిలో చోటుచేసుకుంది. ఒక యువకునికి వాట్సప్ ద్వారా యువతితో చనువు పెరిగి నగ్నంగా వీడియో కాల్ చేయగా, అమ్మాయి రికార్డు చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. పలుమార్లు డబ్బు ఇచ్చిన బాధితుడు, చివరకు డబ్బులు లేవని చేతులెత్తేశాడు. దీంతో మరికొందరు దుండగులు అతనికి కాల్ చేసి నీతో వీడియో కాల్స్ మాట్లాడిన యువతి చనిపోయింది, అందుకు నీవే కారణం అని బెదిరించడం మొదలుపెట్టారు. నీపై సీబీఐలో కేసు నమోదైందని చెప్పారు. ఒక జాబితా తీసుకుని అందులో అతనిపేరును చేర్చి పంపించారు. ఇలా దశలవారీగా అతడి నుంచి రూ.5 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారు. వారి వేధింపులతో విరక్తిచెందిన బాధితుడు స్నేహితులతో కలిసి ఆగ్నేయ విభాగం సైబర్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. యువతి, మోసగాళ్ల ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: లోకేష్తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి... భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. -
సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు
సాక్షి, చెన్నై: ఎమ్మెల్యేపై వస్తున్న ఫిర్యాదులను సీఎం దృష్టికి వెళ్లకుండా చూడడానికి రూ. 25 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసు అధికారి, అతడి భార్యను తిరువళ్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 25న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి తాను హోంశాఖలో డీఎస్పీనని పరిచయం చేసుకున్నాడు. తిరుత్తణిలో అక్రమాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నట్టు వివరిస్తూ, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సంబంధిత ఫిర్యాదులు సీఎందృష్టికి వెళితే ఎమ్మెల్యే పదవిపోవడం ఖాయం. అయితే తమకు రూ.25 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లకుండా చూస్తామని చెప్పారు. చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్టైమ్ సంఘ్ కార్యకర్తలు వెల్లాతికుళం ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తామే పరిష్కరించామని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు ఎస్పీ వరుణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పోలీసు అధికారి విజయకుమార్, యశోదను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, రూ.10వేల నగదు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వీరు అంబత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరు గతంలో వెల్లాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్ను సైతం బెదిరించినట్టు నిర్ధారించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్పై వేటు -
ఫోన్లో మహిళ పరిచయం.. తరచూ మాట్లాడుతూ మరింత దగ్గరయ్యి..
సాక్షి,సనత్నగర్(హైదరాబాద్): ఫోన్లో ఓ మహిళను పరిచయం చేసుకొని∙బెదిరింపులకు పాల్పడి రూ.2 లక్షలు కాజేసిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ వివరాల ప్రకారం.. సనత్నగర్ ఎస్సార్టీ కాలనీకి చెందిన ఓ మహిళకు మూడున్నర నెలల క్రితం ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన కూడా ఆమె ముందుకు తెచ్చాడు. ( చదవండి: వరుడొస్తాడనుకుంటే పోలీసులొచ్చారు! ) అయితే.. తనకు పెళ్లయిందని ఓ కుమార్తె కూడా ఉందని ఆ మహిళా చెప్పినా వినిపించుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే మన మధ్య ఉన్న పరిచయం గురించి చెడుగా ప్రచారం చేస్తానని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే తనకు డబ్బు పంపాలని వేధింపులకు గురి చేయగా సదరు మహిళ గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల నగదు పంపింది. డబ్బు తీసుకున్న తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో గురువారం బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. -
అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానించి.. ఆపై..
తమ ప్రైవేట్ క్షణాలకు సంబంధించిన వీడియోలు లేదా ఫొటోలు లీక్ అయినప్పుడు అమ్మాయిలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎక్కువగా మాజీ బాయ్ఫ్రెండ్స్ గర్ల్ఫ్రెండ్స్ని బ్లాక్మెయిల్ చేయడానికి లేదా డబ్బు గుంజడానికి ఇటువంటి వ్యూహాలను ఎన్నుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మార్చి, 2021లో లక్నోలో ఒక వివాహిత తన తల్లితో పాటు ఉరివేసుకుంది. ఆ అమ్మాయి మాజీ ప్రియుడు అతనితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సమాజంలో తమ పరువేమవుతుందోననే భయంతో తల్లితో పాటు ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మార్చి, 2020లో అహ్మదాబాద్లో ఓ అమ్మాయి బాయ్ఫ్రెండ్ ఆమె తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు లీక్ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మే, 2019 లో మీరట్లో ఒక మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాజీప్రియుడు మొబైల్ అమ్మేముందు వారిద్దరి వ్యక్తిగత ఫొటోలను తొలగించలేదు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మహిళ తన ప్రాణాలు తీసుకుంది. పెరిగిన సైబర్ క్రేమ్ కేసులు ఇటీవల విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం సైబర్ నేరాల రేటు (లక్ష జనాభాకు) 2019తో పోలిస్తే 2020లో 3.7 శాతం పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు సైబర్క్రైమ్లో రెండవస్థానంలో ఉన్నట్టు బ్యూరో నివేదికలు చూపుతున్నాయి. డిజిటల్ నేరం అమెరికాలోని వార్విక్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, కరోనా సమయంలో అంతటా సైబర్ నేరాలు వేగంగా పెరిగాయి. ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు మొబైల్, కంప్యూటర్లలో మరింత చురుకుగా మారారు. దీనితో పాటు ఇంటర్నెట్ దుర్వినియోగం కూడా పెరిగింది. ఇటీవల తెలంగాణలోని ఓ రెస్టారెంట్ వాష్రూమ్లో ఫోన్ కెమరా రహస్య ప్రదేశంలో ఉంచి, రికార్డ్ చేస్తున్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్ సక్సేనా ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354(సి) దీనిని నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరం ఎలక్ట్రానిక్, డిజిటల్ గాడ్జెట్ల ద్వారా జరుగుతుంది. మహిళల వ్యక్తిగత క్షణాలు ఒక పరికరంలో రికార్డ్ చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. మహిళల వ్యక్తిగత చిత్రాలు స్టోర్ చేయడం, షేర్ చేయడం, ప్రసారం చేయడం.. అన్నీ నేరం పరిధిలోకి వస్తాయని, సెక్షన్ 292, సెక్షన్ 294 కు వర్తిస్తాయని వారు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67(ఎ) కింద శిక్షలను అమలుచేసే నిబంధన కూడా ఉంద’ని వివరించారు. సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక దోపిడి సోషల్ మీడియాలో అపరిచితులతో చేసే స్నేహాల పట్ల ఎప్పుడూ అప్రమత్తత అవసరమనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ‘సెక్స్టోర్షన్తో సంబంధం గల ముఠా మిమ్మల్ని అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానిస్తుంది. మీరు ఆ వీడియోల పట్ల ఆసక్తి చూపినప్పుడు ఆ గ్యాంగ్ మీకు అలాంటి వీడియోలనే చూపించడం మొదలుపెడుతుంది. మానసికంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ నుంచి వీడియోలను సేకరిస్తుంది. తర్వాత వాటిని లీక్ చేస్తానని బెదిరించి, బ్లాక్ మెయిల్కు దిగుతుంది’ అని చెబుతున్నారు. సర్వత్రా డిజిటల్మయమైన ఈ కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు అడ్డుకట్టవేయడానికి ముందు నేరాలకు అవకాశం ఇవ్వరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై -
బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి గాడ్ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
వలపు వలలో చిక్కుకున్న గ్రామ ప్రజాప్రతినిధి.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ
సాక్షి,కామారెడ్డి: ఓ మహిళ విసిరిన వలపు వలలో గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు విలవిల్లాడుతున్నారు. దీని నుంచి రక్షించుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతున్నాడు. అటు పోలీస్ కేసు, ఇటు మహిళ బ్లాక్ మెయిల్ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో మారుమూల గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా కేంద్రం అయినా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయనకు కాకతీయ నగర్లో రెండస్తుల ఇళ్లు ఉంది. సదరు ప్రజాప్రతినిధి ఇంటి అడ్రస్ను పట్టుకుని వచ్చిన మహిళలు తమకు ఇళ్లు కిరాయి కావాలంటూ అడిగారు. అందులో ఓ యువతి మర్యాదగా మాట్లాడుతూ.. ఆ ప్రజాప్రతినిధిని నమ్మించి ఇళ్లు కిరాయికి ఇచ్చే లా చేసుకుంది. ఆ అద్దె ఇంట్లో చేరిన ఆ మహిళ కొద్ది రోజులకే సదరు ప్రజాప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది. నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని లేదంటే తనను లైంగికంగా వేధింనట్లు పోలీ సులకు ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్మెయిలింగ్కు దిగింది. ఆ ప్రజాప్రతినిధి మొండిగా వ్యవహరించడంతో దేవునిపల్లి పోలీసులను ఆశ్రయింంది. అక్కడ పోలీసులు మహిళ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తాను ఆ మహిళ పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ ప్రజాప్రతినిధి ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ బ్లాక్మెయిలింగ్ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు కూపీ లాగారు. గతంలో లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఆ మహిళ పలువురిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోకుండా కేసును పెండింగ్లో ఉంచి దర్యాప్తు మొదలు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకు టార్గెట్గా చేసుకుని ఆ మహిళ ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని త్వరలోనే అన్ని విషయాలు తెలసుస్తాయని పేర్కొన్నారు. -
యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ అపరిచిత యువతి.. వ్యక్తికి మార్ఫింగ్ ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేసిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నారు. తరువాత యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోలు, చాటింగ్ చేసిన వీడియో వచ్చాయి. దాంతోపాటు డబ్బులు పంపించాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చదవండి: Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం బ్లాక్మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను -
పీసీబీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్కి గత ఏడాది గుడ్బై చెప్పిన అతను ఐపీఎల్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా అమీర్ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్షిప్ని తీసుకుని ఐపీఎల్లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్షిప్ తీసుకుని.. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్బై చెప్పేశాడు. కాగా పాక్ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’ టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
బలవంతంగా ఫోటోలు.. ఆపై వాట్సాప్.. కట్చేస్తే!
సాక్షి, జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హనుమాన్వాడకు చెందిన బొక్కల మనీషతో బలవంతంగా ఫొటోలు దిగి వాట్సప్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న కుర్మ శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శంకర్నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన బొక్కల మనీషకు జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కుర్మ శ్రీకాంత్కు పరిచయం ఏర్పడింది. దీంతో మనీషను వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచగా ఆమె నిరాకరించింది. దీంతో 10.12.2020న హనుమాన్వాడలో ఉన్న మనీషను శ్రీకాంత్తోపాటు కుర్మ రమేశ్ బలవంతంగా కారులో తీసుకెళ్లి జయ్యారంలో శ్రీకాంత్ వివాహం చేసుకున్నాడు. దీంతో నెలతర్వాత మనీష తప్పించుకుని జగిత్యాలకు చేరుకుంది. వివాహం జరిగినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనీష ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల నుంచి బలవంతంగా వివాహ సమయంలో దిగిన ఫొటోలు మనీష తమ్ముళ్లు, వినయ్, మణిదీప్కు వాట్సప్లో పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లో దారుణం: సోదరిపై అత్యాచారం
బంజారాహిల్స్: వావీవరుసలు మరిచిన ఓ యువకుడు వరుసకు సోదరి అయిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని మహాత్మాగాందీనగర్లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్హోస్టెస్గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ కర్ణాటకలోని బాలీ్కలో నివసిస్తుంటాడు. ఇటీవల నిఖిల్(27) హైదరాబాద్కు వచ్చి మహాత్మాగాందీనగర్లో అద్దెకుంటూ టైలర్గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. నిందితుడు నిఖిల్ ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్ తన గదికి పిలిచి కూల్డ్రింక్లో మద్యం కలిపి ఆమెకు తాగించి మత్తులో నిద్రలోకి జారిన ఆమెపై అత్యాచారం చేసి వాటిని ఫోన్లో చిత్రీకరించాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఏమైందని నిఖిల్ను నిలదీసింది. ఆ డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో షాక్గురై ఆందోళన చెందిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.88 ఫిలింనగర్ దుర్గాభవాని నగర్లో నివసించే బి.శివరామ్(29) అమీర్పేటలోని బ్యాంక్కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ మేరకు భార్య మీనాక్షి పోలీస్లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు -
'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా'
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన భార్గవ్ ఫోన్ ద్వారా హైదరబాద్కు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకు తెలియకుండా వ్యక్తిగత చిత్రాలు సేకరించాడు. ఆపై తనతో స్నేహం కొనసాగించాలని లేకపోతే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ భార్గవ్ ఆ యువతిని బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి భార్గవ్పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో భార్గవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!
ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కరోనా సమయంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజులు పేరుతో వసూళ్లకు తెగబడుతోంది. నీట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మెస్సేజ్లు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది. హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలని, లేకపోతే మెటీరియల్, బట్టలు, సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదరగొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకునికి చెంది జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ కళాశాల శాఖల్లో సుమారు 12వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో మార్చి 22 నుంచి కళాశాల, వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. హాస్టల్లో ఉన్న మెటీరియల్, వివిధ సర్టిఫికెట్స్, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి పంపేశారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు.ఇందుకు ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేశారు. భోజనం పెట్టకపోయినా మెస్ బిల్లులు కట్టాలట! లాక్ డౌన్ నేపథ్యంతో కళాశాలలు, వసతి గృహాలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయినా ఆ కళాశాల యాజమాన్యం లాక్డౌన్ సమయంలో కూడా మెస్ బిల్లులు చెల్లించాలంటూ విద్యార్థుల సెల్ఫోన్లకు మెసేజ్లు పంపడంతో బిత్తరపోయారు. అంతేకాకుండా మెస్ బిల్లు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న మెటీరియల్, గదుల్లోని బట్టలు, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని మెస్సేజ్ ఇవ్వడంతో హడలిపోయారు. నీట్ పరీక్షలకు స్టడీ మెటీరియల్ కోసం కళాశాల వద్దకెళితే హాస్టల్కి తాళాలు వేసి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. మెస్ బిల్లులు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న వస్తువులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే
డెహ్రాడూన్: బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ కేసు నమోదు చేయడం కలకలం రేపింది. తన భర్తపై అత్యాచారం కేసు పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తామని బెదిరించిందనీ, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ ఎమ్మెల్యే భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పొరుగున ఉండే తాను 2016లో తన తల్లి అనారోగ్యానికి సంబంధించి తొలిసారి అతణ్ని కలిశానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2016 - 2018 మధ్య తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, తన పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు భర్త దగ్గరకు వెళ్లొద్దని ఆదేశించాడని, ఆయన ఒత్తిడి కారణంగానే తన అత్తమామలు,భర్తపై తప్పుడు కేసులు పెట్టానని చెప్పారు. దీంతో విషయాన్ని భర్తకు వివరించడంతో అతను తనతో తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఫలితంగా తను ఈ ఏడాది మే18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. అటు తన భర్త రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని, తన కొడుకును చంపేస్తానంటూ బెదిరించిందని నేగి భార్య ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన డెహ్రాడూన్ డీఐజీ అశోక్ కుమార్ బ్లాక్ మెయిల్ ఆరోపణలపై మహిళ, తల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు జరుగుతోందన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను నిరాధారమైనవంటూ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులుగా మారడానికి ఒక ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. త్వరలోనే నిజాలు బహిర్గతమవుతాయన్నారు. పోలీసుల దర్యాప్తు ఫలితాల ఆధారంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ ప్రకటించారు. దీనిపై రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఎందుకు ఫిర్యాదు చేసిందనేది కూడా తేలాల్సి ఉందన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ మండిపడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
ఫేక్ అకౌంట్లతో విద్యార్థినుల నగ్న చిత్రాలు..
గుంటూరు ఈస్ట్: సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనుకకు పంపించారు. ఫేక్ వాట్సప్ , ఫేక్ ఇన్స్ట్రాగామ్ సృష్టించి తనతో చదువుకున్న పూర్వ విద్యార్థులను, పరిచయం ఉన్న యువతుల నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో వివరాలు వెల్లడించారు. నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలోని కొచ్చిలో యానిమేషన్ మల్టీ మీడియాలో బీఎస్సీ పూర్తి చేశాడు. గుంటూరులో కొంతకాలం సొంతంగా ఐటీ కంపెనీ నిర్వహించాడు. లాక్డౌన్ సమయంలో తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. రెండు నెలల క్రితం మొబైల్ ఫోన్ ద్వారా numero Sim యాప్ ద్వారా ఒక నెల వ్యాలిడిటీ గల ఫేక్ వర్చువల్ నంబర్లు తీసుకుని వాటితో ఫేక్ వాట్సప్ సృష్టించాడు. PIC AQTయాప్ ద్వారా తనతో పాటు 9వ తరగతి వరకు చదువుకున్న యువతుల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్ చేసి పంపాడు. తిరిగి ఆ యువతుల అసలైన నగ్నఫొటోలను తనకు పంపాలని..లేకపోతే తన వద్ద ఉన్న నగ్నఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, మిత్రులకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. కొంతమంది ఆ ఫేక్ నంబర్ను దైర్యం చేసి బ్లాక్ చేయగా ఓ యువతి భయపడి అతను చెప్పినట్లు చేసింది. దీంతో మరింత బరితెగించిన రఘుబాబు numero Sim యాప్ ద్వారా మరొక ఫేక్ నంబర్ తీసుకుని దానితో ఫేక్ వాట్సప్, ఫేక్ ఇన్స్ట్రాగామ్ సృష్టించాడు. చిన్ననాటి సహ విద్యార్థినీల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. మొదటి యువతులను బ్లాక్ మెయిల్ చేసిన విధంగానే వీరిని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో గుంటూరు నగరంపాలెం పరిధిలో నివశించే యువతి ధైర్యం చేసి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు యువతి తనకు లొంగిపోయిందనే ధైర్యంతో తన మొబైల్ ఫోన్ ద్వారా 10MINUTEMAIL.COM అనే వైబ్సైట్ ద్వారా రెండు డిస్పోజబుల్ మెయిల్స్ తీసుకుని వాటి ద్వారా రెండు ఫేక్ ఇన్స్ట్రాగామ్లను సృష్టించి యథాతదంగా ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. మొత్తం 10 మంది విద్యార్థినీలను ఇలా బెదిరించినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్ అకౌంట్లను ఛేదించారు. నిందితుడి ఫోన్ నంబర్, అడ్రస్ గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో బాపట్ల డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేపల్లె రూరల్ సీఐ జి.శ్రీనివాసరావు, నగరం ఎస్ఐ ఎం.వాసు, సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
యువతులు, వివాహితల ఫోన్నంబర్లు సేకరించి..
నెల్లూరు(క్రైమ్): స్నేహితులు, తెలిసిన వారి ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్నంబర్లు సేకరించి వారితో మాటలు కలుపుతాడు. ఆపై వ్యక్తిగత, ప్రైవేట్ ఫొటోలను సేకరించి తన కోర్కె తీర్చమని లేకపోతే వాటిని అంతర్జాలంలో పోస్టుచేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. వారిని లొంగదీసుకుని కోర్కె తీర్చుకోసాగాడు. ఓ యువతి ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.నాగరాజు సమాచారం మేరకు.. వింజమూరుకు చెందిన ప్రశాంత్ ఎమ్మెస్సీ చదివాడు. పరిచయస్తులు, స్నేహితుల ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్నంబర్లు సేకరించి వారితో పరిచయాలు పెంచుకుంటాడు. అనంతరం నీవంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వారిని తన వలలో చిక్కుకునేలా చేస్తాడు. వ్యక్తిగత, ప్రైవేట్ చిత్రాలు సేకరించి తన కోర్కె తీర్చాలని వారిపై ఒత్తిడి తెస్తాడు. మాట వినకపోతే ప్రైవేటు చిత్రాలను ఇంటర్నెట్లో పోస్టుచేస్తానని బ్లాక్మెయిల్ చేసి వారిని లొంగదీసుకుని తన వాంఛ తీర్చుకోసాగాడు. అతని మాయలోపడి ఎందరో మహిళలు, యువతులు ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో ఉదయగిరికి చెందిన ఓ యువతి ప్రశాంత్ మోసాలపై దిశ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ఫోన్ పరిశీలించగా కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. మెయిల్లో మహిళలు, యువతుల నగ్నచిత్రాలు, చాటింగ్ స్క్రీన్షాట్లు, వీడియోలను గుర్తించారు. ఎనిమిది మంది అమ్మాయిలను మోసం చేసిన ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు. అతని ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల కల్లబొల్లి మాటలకు లొంగిపోయి వ్యక్తిగత చిత్రాలు షేర్ చేయవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా మహిళలు, యువతులకు సూచించారు. -
అశ్లీల వెబ్సైట్లు చూశారంటూ డబ్బు డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్ ఎక్స్ట్రాక్షన్... ఇటీవల కాలంలో నగరంలో పెరుగుతున్న సైబర్ నేరం ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 18 రోజుల్లోనే ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీరిని బెదిరించడానికి సైబర్ నేరగాళ్లు వాడుతున్న అస్త్రమే... అశ్లీల వెబ్సైట్లు సందర్శన. అలా చేయనివారు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తుండగా.. వీక్షించిన వాళ్లు మాత్రం గప్చుప్గా నేరగాళ్లు కోరిన మొత్తాలు చెల్లించేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా అశ్లీల వెబ్సైట్ల వీక్షణం గణనీయంగా పెరిగిందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్సైట్గా పేరుగాంచిన పోర్న్ హబ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్లోనూ ఈ ధోరణి కొనసాగుతోంది. దేశంలోని దాదాపు ప్రతి టెలికం సంస్థా అశ్లీల వెబ్సైట్స్ను బ్యాన్ చేశాయి. అయినప్పటికీ మిర్రర్ డొమైన్స్ ద్వారా వీటిని చూస్తున్నారని పోర్న్ వెబ్ సంస్థ స్పష్టం చేస్తోంది. సాధారణ సమయాల్లో కంటే లాక్డౌన్ వేళ వీటి వినియోగం ఏకంగా 35 శాతం పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది. దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి, తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్ హబ్ గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి నైజీరియా సహా మరికొన్ని సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్సైట్స్ను రన్ చేస్తున్నారు. వీటికి బ్యాక్ గ్రౌండ్లో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్ అయి ఆ వ్యక్తి ఫొటోను సంగ్రహిస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది. ఈ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలా తన చేతికి చిక్కిన వివరాలతో ఆ సైబర్ క్రిమినల్స్ అసలు పని ప్రారంభిస్తున్నారు. పోర్న్ సైట్ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు. నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామనో, మీ మెయిల్ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామనో బెదిరిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే నిర్ణీత మొత్తం బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్ అందుకున్న వారిలో 95 శాతం మంది బెదిరింపులకు లొంగిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. వీక్షించకపోయినా బెదిరింపులు... అశ్లీల వెబ్సైట్లు వీక్షించిన వారితో పాటు చూడని వారికీ ఈ ఈ–మెయిల్ బెదిరింపులు తప్పట్లేదు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మందీ ఈ కోవకు చెందిన వారే అని అధికారులు చెబుతున్నారు. అనేక డొమైన్లకు చెందిన ఈ–మెయిల్ ఐడీలను, పాస్వర్డ్స్ ను అనునిత్యం కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇలా సంగ్రహించిన వివరాలను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. డీప్ వెబ్, డార్క్ వెబ్ గానూ పిలిచే ఈ డార్క్ నెట్ అనేది ఇంటర్ నెట్ ప్రపంచంలో అథోజగత్తు లాంటిది. సాధారణ బ్రౌజర్లు, విండోస్ ద్వారా ఎవరూ డార్క్ నెట్లోకి వెళ్లలేదు. దీనికి ప్రత్యేకమైన ట్రోజర్లు ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే డార్క్ నెట్లోకి వెళ్లి, బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపు చేస్తూ సైబర్ క్రిమినల్స్ కొన్ని ఈ–మెయిల్ ఐడీలు, వాటి పాస్వర్డ్స్ ఖరీదు చేస్తున్నారు. వారందరికీ బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిస్తూ అశ్లీల వెబ్సైట్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నేరగాళ్లు పంపుతున్న మెయిల్స్లో తమ పాస్వర్డ్స్ సైతం ఉంటుండటంతో వీటిని అందుకున్న వాళ్లు ఆందోళనకు గురై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మంది విషయంలో ఓ సారూప్యత ఉంది. వీళ్లందరూ వినియోగిస్తున్నది హాట్ మెయిల్.కామ్ కాగా... బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన వారంతా ఔట్లుక్.కామ్ వాడారు. వీరిలో కొందరికి వచ్చిన మెయిల్స్లో వారి ప్రస్తుత పాస్వర్డ్స్ కాకుండా గతంలో వినియోగించినవి పొందుపరిచారు. ఇలాంటి మెయిల్స్ వచ్చిన వాళ్లు భయపడవద్దని, తక్షణం తమ మెయిల్స్కు చెందిన పాస్ వర్డ్స్ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నదీ నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే అని అనుమానిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. -
ఓయో లాడ్జిలో గడిపిన వీడియోతో బెదిరింపులు..
కేపీహెచ్బీకాలనీ: అశ్లీల వీడియోలను బహిర్గతం చేస్తామని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికి వరకు ఇద్దరూ కలిసి బాధితుడి నుంచి రూ. 4.50 లక్షలు వసూలు చేయడమేగాక మరో రూ.1.5లక్షలు డిమాండ్ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి హిల్స్లో ఉంటున్న మణికంఠకు టెండర్ ఆన్లైన్ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో మహేశ్వరి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆధారంగా ఈ నెల 14న వీరిద్దరూ కూకట్పల్లి విజయానగర్ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా సంతోష్తో మణికంఠకు ఫోన్ చేయించి తాము కూకట్పల్లి పోలీసులమని చెబుతూ లాడ్జిలో గడిపిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని అతడిని బెదిరించి అతడి నుంచి రూ.4.49 లక్షలు వసూలు చేయడంతో పాటు ఐఫోన్ కూడా తీసుకున్నారు. మరో రూ. 1.5లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఈ నెల 22న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేపీహెచ్బీ పోలీసులకు బదిలీ చేశారు. కేపీహెచ్బీ పోలీసులు మణికంఠ ద్వారా నిందితులకు ఫోన్ చేయించి డబ్బులు తీసుకునేందుకు ఫోరంమాల్ వద్దకు రావాలని చెప్పారు. గురువారం ఉదయం మహేశ్వరి, సంతోష్ అక్కడికి రాగానే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 4.09లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
పరాన్నజీవులు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు. విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు. మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు. అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు. అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఉపేక్షించం.. కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
ఫేస్బుక్ ప్రేమాయణానికి మోసపోయిన మరో బాలిక
-
ఫేస్బుక్ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!
సాక్షి, హైదరాబాద్ : ఫేస్బుక్ ప్రేమాయణానికి మరో బాలిక మోసపోయింది. ఏకంగా రూ.11 లక్షలు సమర్పించింది. ఈ ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముండే ఓ మైనర్ బాలికకు రాజమండ్రికి చెందిన హేమంత్సాయితో ఫేస్బుక్లో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇదే అదునుగా భావించిన హేమంత్సాయి బాలికకు సంబంధించిన ఫొటోలను సేకరించి బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని హెచ్చరించాడు. ఇప్పటికే.. ఆమె వద్ద నుంచి రూ.11 లక్షలు వసూలు చేసిన హేమంత్.. తాజాగా ఆమె తండ్రిని కూడా రూ.40 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హేమంత్సాయి మిత్రులు కూడా.. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నట్టు తేలింది. పోలీసులు నిందితులను రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్టు సమాచారం. -
ఫొటోలు అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్
బంజారాహిల్స్: ప్రేమించిన సమయంలో తనతో తీసుకున్న ఫొటోలను అడ్డు పెట్టుకొని తనను పెళ్లి చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టుచేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానగర్కు చెందిన యువతి(17) జూబ్లీహిల్స్లోని ఓ పత్రికా కార్యాలయంలో హౌజ్కీపింగ్గా పని చేసేది. అక్కడే పని చేస్తున్న శివ అనే అటెండర్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. అయితే గత కొద్దిరోజులుగా అతని వేధింపులు తట్టుకోలేక ఆమె శివను దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. దీనిని జీర్ణించుకోలేని శివగత నెల రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తల్లి తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ తనకు ఇచ్చి పెళ్లి చేయకపోతే అందరినీ చంపే స్తానని బెదిరిస్తున్నాడు. ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.శివ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోపేర్కొంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని..
నెల్లూరు , నాయుడుపేటటౌన్: తనకు సంబంధించిన అశ్లీల వీడియోలను తనకే తెలియకుండా డౌన్లోడ్ చేసుకుని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని స్నేహితుడిని పథకం ప్రకారం అతి కిరాతకంగా హత్య చేశాడని నాయుడుపేట ఇన్చార్జి సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. బాలయపల్లి మండలం చిలమనూరు గ్రామ తిప్ప సమీపంలో అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన జడపల్లి శ్రీనివాసులు (25) ఈ నెల 8న హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృతుడి స్నేహితుడిగా గుర్తిం చారు. అతనితో పాటు మరోక వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి హత్యకు సంబంధించి వివరాలను వివరించారు. చిలమనూరు తిప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన జడపల్లి శ్రీనును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన వైనం ఈ నెల 9న వెలుగుచూసింది. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. గూడూరు ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసచారి సారథ్యంలో సీఐతో పాటు బాలాయపల్లి ఎస్సై పీ నరసింహరావు, ఐడీ పార్టీ పోలీసులతో కలిసి హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం శ్రీశ్రీనగర్కు చెందిన జూటూరి తులసిరామ్ అలియాస్ జిమ్ రవి కోవూరులో జిమ్ నిర్వహిస్తున్నాడు. అతనికి జడపల్లి శీను స్నేహితుడు. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవారు. జిమ్ రవి ఫోన్లో ఒంగోలు చెందిన ఓ యువతితో శారీరకంగా కలిసి ఉన్న అశ్లీల వీడియోలను తీసుకున్నాడు. ఘటన స్థలంలో జాగిలంతో దర్యాప్తు, వేలి ముద్రలు సేకరిస్తున్న పోలీసులు శ్రీను (ఫైల్) ఈ వీడియోలను శీను తన ఫోన్లోకి డౌన్ లోడు చేసుకున్నాడు. ఆ వీడియోలను శీను దగ్గర పెట్టుకుని వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని, ఇతరులకు చూపిస్తానని బెదరిస్తూ డబ్బులు ఇవ్వాలని జిమ్ రవి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. స్నేహితుడే తనను బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో అతన్ని హత్య చేయాలని పథకం రూపొందించుకున్నాడు. ఈ క్రమంలో జిమ్ రవి మరో స్నేహితుడైన కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల మాలకొండయ్య అలియాస్ సూర్యతో కలిసి ఈ నెల 8న శీనుకు ఫోన్ చేసి చిలమనూరు తిప్ప సమీపంలో ఉన్నామని చెప్పి పిలిపించారు. వారు తెచ్చిన మద్యంను ముగ్గురు కలిసి తాగారు. శీను మద్యం మత్తులో ఉండడంతో ఇదే అదనుగా భావించి జిమ్ రవి, సూర్య వారు తెచ్చుకున్న ఇనుప రాడ్లతో శీను తలపై కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సెల్ఫో న్ కాల్ డిటైల్స్ ఆధారంగా పలు కోణాల్లో దర్యా ప్తు ముమ్మరం చేశారు. నిందితులైన జిమ్ రవి, సూర్య పోలీసులకు పట్టుబడితే కొడతారనే భయంతో బాలయపల్లి తహసీ ల్దార్ వద్దకు వెళ్లి లొంగిపోయా రు. వారు చెప్పి న వివరాలను నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను నాయుడుపేట సీఐకు అప్పగించారు. ఈ మేరకు హత్య కేసులో నిందితులైన జిమ్ రవి, సూర్యను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. శీను హత్య కేసును వారం రోజుల్లోనే ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంపై సీఐతో పాటు బాలాయపల్లి ఎస్సై సీ నరసింహరావు, ఐడీ పార్టీ ఏఎస్సై పీ శ్రీనివాసులురెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు షేక్ కరీమ్, పీ కృష్ణారెడ్డి, హోంగార్డు దారా వెంకి, బాలాయపల్లి పోలీసు సిబ్బందికి నగదు రివార్డుకు జిల్లా ఎస్పీకు సిఫారసు చేస్తామన్నారు. -
ఫొటోలతో కాపురం కూలుస్తానంటున్నాడు..!
‘తెలిసీ తెలియక పెళ్లికాక ముందు నకరి కల్లు మండలానికి చెందిన బేగ్ అమీర్బాషాతో స్నేహం చేశా. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని నాతో ఫొటోలు దిగాడు. వాటిని నా భర్తకు చూపించి కాపురం కూలుస్తానంటూ బెదిరిస్తున్నాడు.. అలా జరగకూడదంటే వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకుని నా కాపురం నిలబెట్టండి’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ తక్షణం ఆ మృగాడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐని ఆదేశించారు. గుంటూరు: ‘‘స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని నాతో ఫొటోలు దిగాడు. వాటిని ఇప్పుడు చూపిస్తూ అతనితో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. లేకుంటే ఫొటోలను నీ భర్తకు చూపుతానని బెదిరిస్తున్నాడు’’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి మాటల్లో... నకరికల్లు మండలం చల్లగుళ్ల అడ్డరోడ్డుకు చెందిన బేగ్ అమీర్బాషాతో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరం కలసి ఫొటోలు దిగాం. ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో నా వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అతనితో దిగిన ఫొటోలు చూపించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడు. నేను అందుకు అంగీకరించకపోవడంతో అతని వద్ద ఉన్న ఫొటోలు, ఫోన్ రికార్డింగ్లను నాభర్తకు పంపుతానని, వాటిని అందరికీ తెలియ చేసి నీకాపురం కుప్పకూల్చుతానని హెచ్చరిస్తున్నాడు. తెలిసీ తెలియక అతనితో స్నేహం చేసిన పాపానికి నిత్యం మానసిక వేదనకు గురవుతున్నాను. ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాను. అతని వద్ద ఉన్న ఆధారాలను మొత్తం నాకు అప్పగించి నాకు మనశ్శాంతిని చేకూర్చండి అంటూ వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సదరు యువకుడిని స్టేషన్కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాలని నకరికల్లు ఎస్ఐను ఆదేశించారు. ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వివాహితకు ఎస్పీ ధైర్యం చెప్పారు. -
వివాహితకు సెల్ షాపు యజమాని బ్లాక్మెయిల్
నిడదవోలు : పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ ఉన్న సిరి సెల్షాపు యజమాని పి.శేఖర్ ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఏస్సై జి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాటి మీద సెంటర్కు చెందిన యువతికి ఈ ఏడాది మార్చిలో వివాహమైంది. ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. ఆమె ఫొటోలు తన దగ్గర ఉన్నాయని, తనకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని శేఖర్ ఆ వివాహితను, ఆమె కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా ఆ వివాహిత తల్లి ఇంటికి వెళ్లి బెదిరించడం ప్రారంభించాడు. దీంతో వివాహిత తల్లి, శేఖర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆ తల్లిపై దాడి చేసి కొట్టి వెళ్లిపోయాడు. వివాహిత తల్లిదండ్రులు, బంధువులు సుమారు 20 మంది మహిళలు సెల్షాపును చుట్టుముట్టారు. షాపు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో శేఖర్ పరారయ్యాడు. వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
టెక్నాలజీ సాయంతో బ్లాక్మెయిలింగ్
-
తమిళనాడులో సెక్స్ సైకో అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్వేర్ సాయంతో మహిళల వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ నీచుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత చెల్లిసహా పలువురు బంధువుల అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఇతని వద్ద ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. చివరికి నిందితుడ్ని పోలీసులు కటకటాల వెనక్కిపంపారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్ కుమార్ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు. ఫోన్కాల్ చేయాలని వారి ఫోన్ అడిగి తీసుకుని ‘ట్రాక్ వ్యూ’ అనే రహస్య యాప్ ఇన్స్టాల్ చేసి తన ఫోన్తో అనుసంధానం చేసేవాడు. దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్ ఫోన్లోకి చేరేవి. తర్వాత తన కోరిక తీర్చకుంటే వీటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ యువతికి దినేశ్ ఫోన్చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు. వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్ను చావబాది పోలీసు లకు అప్పజెప్పారు. 80 మంది యువతులు, వివాహితల డేటాను దినేశ్ ఈ మార్గంలో సంపాదించాడు. దర్యాప్తులో దొరికిన డేటాలో దినేశ్ సొంత చెల్లెలి వివరాలూ ఉండటం పోలీసులను విస్తుగొలిపేలా చేసింది. లొంగిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారి దుస్తుల్ని దాచుకున్న దినేశ్.. లొంగని వారి వీడియోలు, సంభాషణల్ని అశ్లీల సైట్లకు అమ్మిన ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. -
యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ పట్టుబడ్డ యువకుడు
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యువతులపై లైంగిక వేధింపులు రోజు రోజుకు మరింత ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి విషయాలు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. కొందరు అలాంటి విషయాలను చెప్పుకోలేక లోలోపల మధనపడుతుంటే, మరి కొందరు ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొంటున్నారు. తాజాగా గచ్చిబౌలికి చెందిన ఓ యువతిని బ్లాక్మెయిల్ చేసున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజమండ్రికి చెందిన మొహమ్మద్ ఖాదర్ బుఖారి గత కొద్ది రోజులుగా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు డబ్బులు పంపాలని లేకపోతే నగ్న ఫొటోలు ఫేస్బుక్, వాట్సప్లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాదర్ బుఖా పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
ప్రియుడిని భయంకరంగా చంపింది.. కానీ!
నోయిడా: ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై దారుణహత్య చేసిన కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగానే కక్ష పెంచుకుని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ధన్కౌర్ స్టేషన్ ఆఫీసర్ ఫర్మూద్ అలీ పండీర్ కథనం మేరకు.. సోనమ్ అలియాస్ సోను(23), జితేంద్ర(37)లు ధన్కౌర్లోని లోడిపూర గ్రామానికి చెందినవారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల కిందట సోనమ్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వివాహేతర సంబంధాల అనంతరం ఇటీవల వీరిమధ్య మనస్పర్థలొచ్చాయి. అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నీ భార్యకు పంపిస్తానంటూ జితేంద్రను సోనమ్ బెదిరించేది. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని జితేంద్ర చెప్పడంతో ప్రియుడి హత్యకు ప్లాన్ చేసింది. పథకం ప్రకారం ఫోన్ చేసి బిలాస్పూర్ ఏరియాకు రావాలని జితేంద్రను కోరింది. జితేంద్ర అక్కడకు రాగానే అంతకుముందే మంచం కోళ్లతో సిద్ధంగా ఉన్న సోనమ్.. అతడి తలపై పలుమార్లు కొట్టగానే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం తన స్కూటర్పై సోనియా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జితేంద్రను ఎవరో హత్య చేశారని అతడి తమ్ముడు హతీమ్ సింగ్ ధన్కౌర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సోనియాపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసిన పోలీసులు సోనియాను అదుపులోకి తీసుకుని విచారించగా.. జితేంద్రను హత్యచేసినట్లు అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన మంచం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం పోలీసులు వివరించారు. -
ఆ చాటింగ్స్ను యువతి తండ్రికి..
సాక్షి,సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతితో పాటు ఆమె తండ్రిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడో శాడిస్ట్. అతడి తీరు శృతిమించడంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినికి కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు చాటింగ్ చేసుకున్నారు. చనువు పెరగటంతో సదరు యువతి వ్యక్తిగత విషయాలనూ చాట్ చేయడం మొదలెట్టింది. అయితే పరీక్షలు సమీపిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె చాటింగ్కు దూరంగా ఉంది. దీంతో ఆమెను సోషల్మీడియా ద్వారా సంప్రదించిన ఆ యువకుడు తనతో చాటింగ్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. గతంలో చాటింగ్ ద్వారా చర్చించుకున్న వ్యక్తిగత విషయాలను మీ తండ్రికి పంపిస్తానంటూ బెదిరించేవాడు. తనకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తాను చదువుకోవాలని, అందుకే ప్రస్తుతం చాటింగ్ చేయలేనంటూ ఆమె వేడుకున్నా అతగాడు వినకుండా ఆ చాటింగ్స్ను యువతి తండ్రికి పంపాడు. అంతటితో ఆగకుండా తన ఇంట్లో ఎవరూ లేరని, మీ కుమార్తెను నాకు భోజనం పెట్టేందుకు పంపించాలంటూ యువతి తండ్రినే కోరడం మొదలెట్టాడు. చాటింగ్ హిస్టరీని సోషల్మీడియాలో పెట్టి మీతో పాటు మీ కుమార్తెను బజారుకు ఈడుస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇతడి వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు సోమవారం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్మెయిలింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
కడపలో తెలుగుదేశం కార్పొరేటర్ల రాజీ'డ్రామా'
-
తెలుగుదేశం కార్పొరేటర్ల రాజీ'డ్రామా'
సాక్షి, కడప : నగర కార్పోరేషన్లో తెలుగుదేశం కార్పొరేటర్లు హైడ్రామాకు తెరతీశారు. విచారణలో తమ అవినీతి బండారం బయటపడుతుందని భావించిన నేతలు రాజీనామా డ్రామాను తెరమీదకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పేదలకు నీడను అందిచాల్సిన పథకాన్ని తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిలువ నీడలేని పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ గృహాలపై పచ్చతమ్ముళ్లు పాగావేశారు. పేదలకు మంజూరైన ప్రభుత్వ గృహాలను తమకు అనుకూలంగా ఉన్నవారికి, పార్టీనేతలకు మాత్రమే మంజూరు అయ్యే విధంగా తెలుగుదేశం కార్పోరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారు. ఈ అవినీతి దందా గురించి ఉన్నతాధికారులకు సమచారం అందింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా గృహాల మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. ఇందులో తెలుగుదేశం నేతల అవినీతి లీలలు చూసి అధికారులు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఈ అవినీతిలో కీలక పాత్ర పోషించిన కడప తహశీల్దార్పై రెండు రోజుల క్రితమే బదిలీ వేటు వేశారు. అయితే తమ ఆస్తులు పోగేసుకోవడానికి సహకరించిన సదరు అధికారిపై తెలుగుదేశం నేతలు విపరీతమైన అభిమానం చూపించారు. తహశీల్దార్ బదిలీని అడ్డుకోవడానికి తెలుగుదేశం కార్పొరేటర్లు చేయాల్సిన ప్రయాత్నాలు అన్నీ చేశారు. అయినా కుదరకపోవడంతో రాజీ'డ్రామ'కు తెరలేపారు. తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. ఇంఛార్జ్ కమీషనర్, జయింట్ కలెక్టర్ తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారంటూ నానాహంగామా సృష్టించారు. తహసీల్దార్ బదిలీని ఆపకపోతే రాజీనామకు పాల్పతామంటూ బెదిరింపు రాజకీయాలకు దిగారు. -
అరచేతిలో అశ్లీలం
బరంపురం: ఆధునిక గ్లోబలైజేషన్ యుగంలో పెరిగిన టెక్నాలజీ ఒకవైపు ఉపయోగం, మరోవైపు అపకారాన్ని తలపెడుతోంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే అధునిక పరిజ్ఞానం కొంతమందికి మంచికి ఉపయోగపడుతుంటే మరి కొంత మందికి చెడు సావాసాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన స్మా ర్ట్ ఫోన్ల కారణంగా అరచేతిలో అశ్లీల చిత్రాలు, అసభ్య వీడియోలతో కొంతమంది యువకులు వారి బంగారు భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం గంజాం జిల్లాలో జరిగిన పలు సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. జిల్లాలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో వంచించి మొబైల్ ఫోన్లలో ప్రే యసుల అభ్యంతరకర(నగ్న) చిత్రాలు చిత్రీకరిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ కీలు బొమ్మ ల్లా ఆడిస్తునట్లు జిల్లాలో గల పలు పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసులే రూజువు చేçస్తున్నాయి. సెల్ఫోన్లలో నెట్ ద్వారా అశ్లీచి త్రాలు డౌన్లోడ్ చేయడం, స్మార్ట్ఫోన్లలో నెట్ ప్యాకేజీతో నేరుగా అరచేతిలో అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసుకోవడంపై కొంతమంది యువకులు ఎక్కుగా అసక్తి చూపుతున్నారు. అంతేకా కుండా ఇతరులకు ఇబ్బందికర చిత్రాలను వా ట్సాప్లలో పంపుతున్నట్లు బాధితుల నుంచి బరంపురం పోలీస్ మండలి పరిధిలో గల వివి ధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందుతు న్న నమోదవుతున్న కేసులతో రుజవవుతోంది. తక్కువ ఖరీదుకే కెమెరా ఫోన్లు బజారులో అతి తక్కువ ఖరీదుకే కెమెరా, వీడియోతో ఉన్న చైనా సెట్లు లభిస్తున్నాయి. దీంతో కొంత మంది యువకులు సెల్ఫోన్ల ద్వారా అర చేతిలో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డుదారి తొక్కుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒకవైపు నేటి యువతరాన్ని మాదకద్రవ్యాల మత్తు పీడిస్తుంటే మరోవైపు కొత్త సమస్యగా సెల్ఫోన్లలో అసభ్య చిత్రాలు, వీడియోలు చూస్తూ తప్పుదారి పడుతున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలియజేస్తున్నారు. మరికొంత మంది అకతాయి యువకులు ప్రేమ పేరుతో యువతులను వంచించి ఫోన్ల ద్వారా అభ్యంతరకర చిత్రాలు, వీడియో క్లిపింగ్లను తీసి ఆ యువతుల తల్లిదండ్రులకు చూపి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న సందర్భాలు లేకపొలేదని, మరికొంత మంది ప్రేయసి అభ్యంతరకర చిత్రాలు చిత్రీకరించి చెప్పినట్లు చేయక పోతే ఇతరులకు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తామని బెదిరిస్తూ యువతులను బెదిరిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నట్లు ఇటీవల నగరమంతా సంచలనం రేగిన వాట్సాప్ చిత్రాలు, వీడియోల్లో వచ్చిన క్లిప్పింగ్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇదేవిధంగా జిల్లాలోని పురుషోత్తంపూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమపేరుతో వంచించి సెల్లో అభ్యంతరకర చిత్రాలు తీసి ఇతరుల మొబైల్ ఫోన్లకు ఎంఎంఎస్ల ద్వారా పంపడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. జరిగిన సంఘటనపై పురుషోత్తంపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా ఆ యువకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇదేవిధంగా కొన్ని నెలల క్రితం నీస్ట్ కళాశాల విద్యార్థినిని అదే కళాశాల విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి అభ్యంతరకర క్లిప్పింగ్లు చిత్రీకరించి ఏకంగా నెట్లో పెట్టడంతో బరంపురంలో సంచలనం రేగింది. ఆ యువతి తల్లి దండ్రులు కేసు పెట్టడంతో టౌన్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ విధంగా బయటపడినవి కొన్నైతే బయట పడనివి ఎన్నో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. పటిష్టంగా సైబర్ నేరాల చట్టం గంజాం జిల్లాలో అకతాయి రోమియోలు ఎక్కువయ్యారని యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల ఒక కన్ను వేసి వారి నడవడికలపై దృష్టిసారించాలని కోరుతున్నారు. గంజాం జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల రాష్ట్ర హోం శాఖ దృష్టిసారించి గంజాం జిల్లాలోని బరంపురం పోలీస్ మండలి, గంజాం పోలీసు మండలిలో ప్రత్యేకంగా రెండు సైబర్ పోలీసు స్టేషన్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలియజేస్తున్నారు. -
పెళ్లి పేరుతో యువతికి మోసం
రాజాం సిటీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకున్న అనంతరం మొహం చాటేసిన ఓ యువకుడిన పోలీసులు అరెస్టుచేశారు. ఆమెతో శృంగారం చేసిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. నగ్నచిత్రాలు చూపించి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు కటకటాల పాలుకానున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రాజాం పట్టణంలో తెలగవీధికి చెందిన గట్టి కృష్ణప్రసన్నకుమార్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఇదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మబలికి శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెతో శృంగారం చేసిన చిత్రాలు, వీడియోను మొబైల్ ఫోన్లో బంధించి భద్రపరిచాడు. ఇలా కొన్నాళ్లు జరిగిన అనంతరం ఆమెకు మొహం చాటేశాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లిచేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తనను ఒత్తిడి తెస్తే ఈ చిత్రాలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. అయితే ఈలోగా వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు వాట్సాప్, ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో మోసపోయిన యువతి తల్లిదండ్రులతో కలిసి రాజాం టౌన్ సర్కిల్ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. సీఐ శంకరరావు కేసు నమోదు చేయగా పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి ప్రత్యేక పర్యవేక్షణలో రెండు రోజుల పాటు దర్యాప్తు నిర్వహించారు. అనంతరం నిందితుడు కృష్ణప్రసన్నకుమార్ను పట్టుకోవడంతో అతడు తప్పు ఒప్పుకోవడం వల్ల అరెస్టుచేసి శుక్రవారం విలేకరుల ముందు హాజరుపరిచారు. మోసపోయిన యువతి దళిత కుటుంబానికి చెందినది కావడంతో ఎస్సీ, ఎస్టీ, సైబర్ క్రైం విభాగంలో కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. మహిళా కమిషన్ అండగా ఉంటుంది దగాపడ్డ యువతికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి అన్నారు. విషయం తెలుసుకున్న ఈమె రాజాం పోలీసుస్టేషన్కు శుక్రవారం చేరుకుని బాధిత యువతితో మాట్లాడారు. యువతి తీవ్ర ఒత్తిడికి గురై భయపడుతుందని, ఈమెను స్టేట్హోంకు తరలించి రక్షణ కల్పిస్తామని విలేకరులకు తెలిపారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇటీవల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎవరూ భయపడకపోవడం విచారకరమని, దోషులకు శిక్ష పడే విధంగా కృషిచేస్తామన్నారు. -
విశాఖలో ఫేస్బుక్ చీటర్ అరెస్ట్
-
నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి..
విజయవాడ: అమాయక యువతులను ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని.. వారి నగ్న చిత్రాలు తీసి బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సింగపాలెం గ్రామానికి చెందిన సింగం అనిల్కుమార్ ప్రేమ పేరుతో యువతులను ముగ్గులోకి దించి వారి నగ్న చిత్రాలు సేకరించి వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్య కెమెరాలతో చిత్రించి వాటి సాయంతో వారిని లైగింకంగా వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. అతని బారిన పడిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు నిందితుడు సింగం అనిల్కుమార్ను మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ సెల్ఫోన్, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది మంది యువతులకు చెందిన నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
అశ్లీల దృశ్యాలతో యువతిని బ్లాక్మెయిల్
బెంగళూరు: బెంగళూరులోని బార్లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాన్ని వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే....నగరంలోని రెసిడెన్సీ రోడ్లోనున్న ఓ బార్లో పని చేస్తున్న ముంబైకి చెందిన యువతి(21)కి రామ్మూర్తి నగర్కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ చక్రధర్రెడ్డితో పరిచయమైంది. పరిచయం ప్రేమతో మారడంతో ఇద్దరూ రామ్మూర్తినగర్లో సహజీవనం సాగించారు. అయితే కొద్ది కాలంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గత ఫిబ్రవరిలో చక్రధర్రెడ్డి గొడవలు పరిష్కరించుకుందామంటూ యువతిని తన గదికి పిలుపించుకున్నాడు. యువతి గదికి రాగానే మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో యువతి రెండు రోజుల క్రితం రామ్మూర్తినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చక్రధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మధుమేహంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స పూర్తి కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతికి నగ్నచిత్రాలు పంపి బ్లాక్మెయిల్
హైదరాబాద్కు చెందిన టెక్కీ అరెస్ట్ బెంగళూరు (బనశంకరి): ఓ యువతికి నగ్న చిత్రాలు పంపి వివాహం చేసుకోవాలని బ్లాక్మెయికు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను గురువారం బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరంచి రాజు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. గతంలో ఇదే సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా మెలిగారు. ఏడాది క్రితం ఆ యువతికి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో ఉద్యోగం లభించింది. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి నగరానికి కుటుంబంతో కలసి వచ్చేసింది. అప్పటి నుంచి బోరంచి రాజు ఆమెకు మెసేజ్లు పంపుతూ, కాల్ చేస్తూ వివాహం చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకోసం దాదాపు 8 సిమ్కార్డులను ఉపయోగించాడు. అతని మెసేజ్లు, ఫోన్కాల్స్ను ఆమె పట్టించుకోలేదు. ఇటీవల ఆమెకు వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ సమా చారం తెలుసుకున్న రాజు.. ఆమె ల్యాప్టాప్ నుంచి గతంలో దొంగి లించిన కొన్ని నగ్న చిత్రాలను పంపి తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అయినా ఆమె ఖాతరు చేయకపోవడంతో వాటిని కాబోయే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులకు మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని వారు ఆమెకు తెలిపి.. అనంతరం హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి గుర్తింపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సాదిక్పాషా రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని గుర్తించి గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నిందితుడు తాను ఇంటెలిజెన్స బ్యూరో అధికారినంటూ పోలీసులను కూడా బెదిరించాడని బెంగళూరు తూర్పు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) బోరలింగయ్య తెలిపారు. -
భర్తకు ఫొటోలు పంపి.. అమెరికా మహిళకు బెదిరింపులు!
కోల్కతా: తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపి.. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగి అమెరికా మహిళను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ వ్యవహారంలో కోల్కతాకు చెందిన అవినాష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. 30 ఏళ్లకుపైగా వయస్సున్న అవినాష్ గుప్తా ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత ఏడాది ఓ అమెరికా మహిళ కోల్కతాకు వచ్చింది. వీరిద్దరూ కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు. ఆమె అమెరికాకు తిరిగి వెళ్లిన తర్వాత ఈ ప్రణయ సంబంధం దెబ్బతిన్నది. దీంతో తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలను తన భర్తకు పంపించడం ద్వారా అవినాష్ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నాడని అమెరికా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోల్కతా పోలీసులు ఆదివారం ముకుందనగర్లోని తన నివాసం నుంచి అవినాష్ను అరెస్టు చేశారు. అమెరికా మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ ఆమె భర్తకు పంపిస్తూ అవినాష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని, దీంతో ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్టుచేశామని పోలీసులు తెలిపారు. -
అసభ్యకర ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్
ముంబై: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అదే కాలేజీకి చెందిన విద్యార్థిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత ఆర్నేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... బాధిత యువతి(20), నిందితుడు నౌషద్ జబ్బర్ సిద్ధిఖీ మహారాష్ట్రలోని ధారవి ప్రాంతానికి చెందినవారు. కాగా, వీరిద్దరూ బంద్రా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. యువతికి సంబంధించిన అసభ్యకర ఫొటోలు తనవద్ద ఉన్నాయంటూ తాను చెప్పినట్లు చేయకపోతే సోషల్ నెట్వర్కింట్ సైట్లో ఫొటోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరించి యువతిని అత్యాచారం చేసేవాడని డీసీపీ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు. గత ఆర్నేళ్లుగా వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పారు. కాలేజీ సమీపంలోని ఓ భవనం పైభాగంలో ఈ నెలలో కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు తట్టుకోలేని యువతి ఆదివారం ఉదయం తల్లికి విషయం తెలిపింది. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ వారిద్దరూ ఖేర్వడీ పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సిద్ధిఖీని ఆరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై 376, 377, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, గతంలో ఇలాంటి ఘటనలతో నిందితుడికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. -
ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....
దుబాయ్: మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి, తనని పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్న శ్రీలంక దేశస్థుడుకి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. భారత్కు చెందిన 23 ఏళ్ల యువతి, ఈత శిక్షకుడు(34) అయిన ఆ వ్యక్తి గతంలో సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో ఆమె నగ్న చిత్రాలను అతను తీశాడు. ఇప్పుడు వాటిని చూపించి, తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆ చిత్రాలను కుటుంబసభ్యులకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాక ఆ ఫొటోలను అతను తన మామ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ యువతి సోదరికి కూడా పంపాడు. నిందితుడు డబ్బు కోసం తనను బెదిరించాడని ఆమె కోర్టుకు తెలిపింది. -
డబ్బు కోసం యువతి బ్లాక్మెయిల్!
హైదరాబాద్ : డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీఐఎల్లోని జినియా ఆస్పత్రి యజమాని ...తనను నగ్నంగా ఫోటో తీశారని ఆరోపిస్తూ ....రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపుకు దిగింది. దాంతో బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతిపై ఆస్పత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం పోలీసులు...సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాబు ఏజెంటు.. తెలంగాణ ద్రోహి: జగదీశ్రెడ్డి
రేవంత్పై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సాక్షి, హైదరాబాద్: బ్లాక్ మెయిల్ చేయడానికే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గువ్వల బాలరాజుతో కలిసి బుధవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రా ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏజెంటుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ‘ఆంధ్రా ప్రయోజనాల కోసం తెలంగాణలో పనిచేస్తున్న రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. దుష్ర్పచారానికి దిగుతున్నాడు. ఆంధ్రా ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడు’ అని ధ్వజమెత్తారు. నిండు శాసనసభలో అసత్యాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా శాసనసభలో ఎలా మాట్లాడతాడని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హెరిటేజ్ పాలపై పరీక్షలు జరిపి, చట్టపరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. హెరిటేజ్ పాలలో విషపూరితమైన రసాయనాలున్నాయంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధించిందన్నారు. దీనిపై సభలో చర్చ జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడంలేదన్నారు. హెరిటేజ్లో రేవంత్ రెడ్డి కూడా భాగస్వామేనా అని మంత్రి ప్రశ్నించారు. -
బ్లాక్ మెయిల్ చేశాడని చంపేశాడు
చెన్నై: మహిళతో సన్నిహితంగా ఉన్న మిత్రుడిని సెల్ఫోన్లో చిత్రించి బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు గుంజిన స్నేహితున్ని హతమార్చిన విద్యార్థి పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి సమీపాన అన్భు(52)కు చెందిన అల్లుగడ్డల తోటలో హనుమన్ తీర్థంకు చెందిన గోపినాథ్(25) కొన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. సమీపంలో అతని స్నేహితుడు విమల్(25) కూడా గాయంతో ప్రాణాలతో పోరాడ సాగాడు. పళ్లిపట్టు పోలీసులు విచారణ జరిపి విమల్ను సేలం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసుల విచారణలో గోపినాథ్ హత్యలో తోట యజమాని అన్భు కుమారుడు అన్భుమణి(22)కి సంబంధం ఉన్నట్లు తెలిసింది. కోయంబత్తూరులో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అన్భుమణి ఈ సంఘటన తర్వాత అదృశ్యమయ్యాడు. అతన్ని సోమవారం ఆరూర్లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద విచారణ జరిపారు. పోలీసులకు అతడు ఇచ్చిన వాంగ్మూలంలో గోపినాథ్ తన స్నేహితుడని ఇద్దరం కలిసి హనుమాన్ తీర్థంలో ఒక మహిళతో గడిపామన్నారు. తనకు తెలియకుండా గోపినాథ్ సెల్ఫోన్లో చిత్రీకరించాడని, అంతేకాకుండా ఆరు నెలలుగా తనను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. గత నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు గోపినాథ్ విమల్ను తీసుకొని మద్యం మత్తులో వచ్చాడన్నారు. ఆ సమయంలో గోపినాథ్, విమల్పై గడ్డపారతో అన్బుమణి దాడి చేసినట్లు తెలిపాడు. దీంతో అతడు స్పృహ తప్పాడన్నారు. తండ్రి అన్భు ఆ సమయంలో అక్కడికి రాగా గోపినాథ్ను హతమార్చినట్టు తెలిపారు. ఇద్దరం కలిసి గోపినాథ్, విమల్ను తమ తోటలో విసిరేశామన్నారు. ఆ తర్వాత విమల్ పరిస్థితి ఏమైంది తెలియలేదన్నారు. అనంతరం తాను పరారయ్యానని ఆరూర్ బస్టాండ్లో పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. దీంతో హత్యకు సహకరించిన తండ్రి అన్భును పాపిరెడ్డి పట్టి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పాపిరెడ్డి పట్టి సెషన్స్ కోర్టులో హాజరు పరిచి సేలం జైలుకు తరలించారు. -
మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు
ఏలూరు: ప్రముఖ టీవీ చానల్లో క్రైమ్ రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం... కేసు నమోదు మరిచిపోకముందే... అదే జిల్లాలో మరో టీవీ రిపోర్టర్పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వర గ్రామానికి చెందిన ఆదిబాబు అనే వ్యక్తిని ఓ టీవీలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న వేండ్ర శ్రీనివాసరావు బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో ఆదిబాబు మిన్నకుండ పోయాడు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్ వేధింపులు ఆదిబాబుపై అధికమయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం నర్సాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వేండ్ర శ్రీనివాసరావుపై 341, 290, 323, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యా సంస్థ నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి .... రెడ్హ్యాండెడ్గా పోలీసులు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
ఆ టేప్ ను నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్!
వెల్టింగ్టన్: ఓ అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నయువకుడు ఆమెపై లైంగిక చర్యలకు ఒడిగట్టి.. ఆపై వీడియోలను నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన న్యూజిలాండ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. తన అపార్ట్ మెంట్ ను క్లీన్ చేయకపోతే ఆ వీడియోలను నెట్ లో పెడతానంటూ హెచ్చరించాడు. 2013 లో ఫెంగ్ ఇయావో(21) అనే యువకుడు ఆక్లాండ్ లాంగ్వేజ్ స్కూల్లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. అంతటి ఆగకుండా ఆ దృశ్యాలను వీడియోల రూపంలో బంధించి ఆమెను వేధిస్తున్నాడు. అంతకుముందు తనకు అధికమొత్తంలో వచ్చిన ఫోన్ బిల్లును కట్టాలంటూ ఆమెకు ఒక మెస్సేజ్ పెట్టాడు. అతను పంపిన ఆ మెస్సేజ్ ను ఆ యువతి తిరస్కరించడంతో మరో సందేశాన్ని పంపాడు. తన అపార్ట్ మెంట్ మొత్తాన్ని క్లీన్ చేయాలని.. లేని పక్షంలో్ ఆ వీడియోలను ఆన్ లైన్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. గత కొన్ని నెలల క్రితం ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నపోలీసులు చార్జిషీటును కోర్టు ముందుంచారు. ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నఅభియోగాలతో ఇటీవలే ఏకీభవించిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. -
అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్మెయిలింగ్
నెల్లూరు : ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధించడంతో పాటు, ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ రౌడీలతో ఆమె ఇంటి మీదకొచ్చిన ఆటోడ్రైవర్ ఉదంతమిది. ఈ ఘటన నాయుడుపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఓజిలిమండలం నెమళ్లపూడికి చెందిన ఓ విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతంలో ఆమె రోజూ కళాశాలకు ఆటోలో వచ్చివెళ్లేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేష్ ప్రేమపేరుతో వేధించాడు. అప్పట్లోనే ఆమె ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి అతడిని మందలించింది. అయితే మూడు నెలల క్రితం నరేష్ ఆ విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీనిపై అప్పట్లోనే విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి మందలించి కేసులు లేకుండా వదిలేశారు. కిడ్నాప్ సమయంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అసభ్యకరంగా ఫొటోలు తీసి, బ్లాక్మెయిలింగ్కు పాల్పడసాగాడు. ఈ ఘటనల నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం నాయుడుపేటకు కాపురం వచ్చేసింది. అయినా నరేష్ వేధింపుల పర్వం ఆపలేదు.శనివారం సాయంత్రం కొందరితో కలిసి నాయుడుపేటలో విద్యార్థిని కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి మీదకు వచ్చాడు. చంపేస్తామంటూ ఆమె తల్లిదండ్రులపై దాడికి యత్నించడంతో పాటు ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఆ విద్యార్థిని ఏఎస్సై బొబ్బిలిరాజును వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్ బుక్, ట్విటర్ ను హ్యాక్ చేసి.. బ్లాక్ మెయిల్: వీణామాలిక్
సోషల్ మీడియా అకౌంట్లతో తలెత్తే ఇబ్బందులు సామాన్యులకే కాదు..సెలబ్రీటిలకు కూడా తప్పడం లేదు. డబ్బులు, చీప్ పాపులారిటీ కోసం తన మాజీ మేనేజర్ ప్రశాంత్ సింగ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని పాకిస్థానీ మోడల్, బాలీవుడ్ తార వీణా మాలిక్ ఆరోపించారు. తన ఫేస్ బుక్, ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని ప్రశాంత్ పై వీణా మాలిక్ నిప్పులు చెరిగారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అతనో అబద్దాల కోరు అని వీణా అన్నారు. బాయ్ ఫ్రెండ్ అంటూ ఆయన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు వీణా మాలిక్ ఖండించారు. ఆయన తనకు సోదరుడు లాంటి వాడు. తనను ఆయన కూడా సోదరిగానే చూశాడు అని వీణా మాలిక్ అన్నారు. దుబాయ్ వ్యాపారవేత్త అసద్ బషీర్ ఖాన్ కట్టక్ ను వివాహామాడిన తర్వాత తాను బిజీగా మారాను. తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కు సంబంధించిన పాస్ వర్డ్స్ ను మార్చడం మరిచిపోయాను అని అన్నారు. సింగ్ భారతీయుడు. తన వద్ద 10 వేల రూపాయలకు ఉద్యోగం చేసేవాడు. అతను తన పరిధిలోనే ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వాన్స్ గా సింగ్ కు 3 లక్షల రూపాయలు చెల్లించానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఇస్లామాబాద్ లోన జియో న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం వైవాహిక జీవితంతో సంతోషంగా ఉన్నాను. తనను కాపాడుకోవడం ఎలానో తనకు భర్తకు తెలుసు అని వీణా ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.