bus stand
-
తిరుమలలో విషాదం.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటంతిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం. -
పండగ పూట ప్రయాణికులకు పాట్లు
-
ఇసుక వేస్తే రాలనంత జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
బస్టాండ్లో మహిళ ప్రసవం
కరీంనగర్ టౌన్: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్స్టేషన్ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. -
మంచిర్యాల బస్టాండ్ లో ఓవర్ యాక్షన్
-
వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్స్టేషన్ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
ఎన్నికల పండగ..కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
Hyderabad : పేరుకే మహా నగరం..తీరు చూస్తే మహా నరకం (ఫొటోలు)
-
సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెబాట పట్టిన జనం
-
సంక్రాంతి వేళ.. ప్రయాణం కిటకిట (ఫొటోలు)
-
మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
ప్రమాదం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం
-
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్కు కొత్త కళ
సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్మల్లో నిర్మించే టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే.. 1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం. 3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు. 4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం. 5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు. 6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సీడీ తెరల ఏర్పాటు 7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. 8. మరో 10 తరాలకు అడ్వాన్స్గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 9. టీఎస్ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు. -
మన రోల్ మోడల్.. ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ!
పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది. ఈ మహిళ వీడియో క్లిప్ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP — Adarsh Hegde (@adarshahgd) April 10, 2023 -
బస్టాండ్లో యువతికి తాళి కట్టిన యువకుడు
వేలూరు: బస్టాండ్లో ఒంటరిగా ఉన్న యువతి మెడలో యువకుడు తాళి కట్టిన సంఘటన ఆంబూరులో సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు బస్టాండ్లో మంగళవారం సాయంత్రం సుమారు 8 గంటలకు బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. రాత్రి సమయం కావడంతో దుకాణదారులు దుకాణాలను మూసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో పంజాబ్ దస్తులు వేసుకున్న యువతితో యువకుడు కలిసి వచ్చారు. కొద్ది సమయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక ప్రైవేటు బస్సు వెనుకకు వెళ్లారు. యువకుడు జేబులో ఉన్న తాళి బొట్టును తీసి యువతి మెడలో కట్టాడు. ఆ యువతి కూడా తాళిని సర్వ సాధారణంగా దుస్తులు లోపల వేసుకుని అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వెళ్లారు. గమనించిన కొందరు ప్రయాణికులు కలికాలం అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా బస్టాండ్లో జరిగిన ఈ తంతు వీడియో కొందరు ఫేస్బుక్లో పెట్టారు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు యువతీ, యువకుల కోసం బస్టాండ్లో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకి తెలియరాలేదు. -
సారీ.. నో ఏసీ.. అలంకారప్రాయంగా ఏసీ బస్ షెల్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏసీ బస్షెల్టర్లు అలంకారప్రాయంగా మారాయి. ఏ ఒక్క షెల్టర్లోనూ ఏసీ సదుపాయం లేదు. ఏసీ ఉంటే తప్ప ఆ షెల్టర్లలో కూర్చోవడం సాధ్యం కాదు. ఒక్క ఏసీ మాత్రమే కాదు. తాగునీళ్లు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కరకు రాని షెల్టర్లలో కూర్చొని ఎదురు చూసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలోనే పడిగాపులు కాయాల్సివస్తోంది. ఏర్పాటులోనే ఆర్భాటం.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా అయిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్లు నేతిబీర చందంగా మారాయి. అద్దాల డోర్లతో బ్రహ్మాండమైన లుక్ కనిపిస్తుంది. కానీ డోర్లు తెరిస్తే అన్నీ లుకలుకలే. ఏసీ షెల్టర్లతో పాటు నాన్ ఏసీ షెల్టర్ల ఏర్పాటును అప్పట్లో ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వ్యాపార ప్రకటనలపై వచ్చే ఆదాయంతో వీటిని నిర్వహించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సదుపాయాలను ప్రయాణికులకు అందజేయాలి. ఈ షెల్టర్లను ఏర్పాటు చేసిననప్పటి నుంచి వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా సంస్థలకు ఆదాయం లభిస్తోంది. ప్రయాణికులకు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు అందడం లేదు. తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, బషీర్బాగ్, కోఠి, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, శిల్పారామం, ఖైరతాబాద్ తదితర చోట్ల బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. రెండు కేటగిరీలుగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ నివేదిక ప్రకారం నగరంలో సుమారు 1800 బస్షెల్టర్లు అవసరం. కొన్ని చోట్ల పాతకాలపు షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని శిథిలమయ్యాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా, గతంలో మెట్రో పనుల దృష్ట్యా షెల్టర్లను తొలగించారు. ఇలా షెల్టర్లు లేని చోట ఆధునిక పద్ధతిలో కట్టించేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే మొదట ఏసీ షెల్టర్లకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు, శిల్పారామం, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, తదితర 10 ప్రాంతాల్లో ఏసీ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రమే ఏసీ ఉంది. ఆ తరువాత ఎక్కడా పని చేయడం లేదు. అప్పట్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు, ప్యానిక్ బటన్లు, మొబైల్ చార్జింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయాలు ఏవీ అందుబాటులో లేదు. ప్రకటనలకే.. తార్నాక, బేగంపేట్ వంటి పలు చోట్ల ఏర్పాటు చేసిన నాన్ ఏసీ షెల్టర్లు బస్టాపులతో సంబంధం లేకుండా ఉన్నాయి. కేవలం వాటికి వ్యాపార ప్రకటనలకే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ఆ షెల్టర్లకు పర్లాంగ్ దూరంలో బస్సులు ఆగుతాయి. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా జనం దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉన్న చోట ఈ తరహా ప్రకటనలతో షెల్టర్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
పులివెందుల బస్టాండ్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
తప్పుదారి చూపిన గూగుల్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణికులు!
అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు. దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు -
CM Jagan: సీఎం జగన్ నరసాపురం పర్యటన ఖరారు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం): ఈ నెల 21న నరసాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి పనులు పరిశీలించారు. చిన్నచిన్న పెండింగ్ పనులు ఉంటే రెండురోజుల్లో పూర్తి చేసుకోవాలని చెప్పారు. చినమామాడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్ను, 25 వార్డు వీవర్స్కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. బహిరంగసభ వద్ద పార్కింగ్ విషయంలో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సీఎం పర్యటన 21న ఖరారు అయ్యిందని చెప్పారు. ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కావడంతో నరసాపురంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బస్టాండ్, ఆసుపత్రి వంటి పూర్తయిన పనులను ప్రారంభిస్తారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నరసాపురం సబ్కలెక్టర్ ఎం.సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు) -
వరంగల్లో ఆధునిక బస్టాండ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్లో సరికొత్త, ఆధునిక బస్టాండ్ నిర్మితం కానుంది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్ను కూల్చివేసి, దానికి పక్కనే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లకు చెందిన స్థలాలను కూడా కలిపి 2.32 ఎకరాల స్థలంలో, రూ.75 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల్లో కొత్త బస్టాండ్ నిర్మించనున్నారు. కేవలం బస్సులు ఆగే ప్రాంగణంగానే కాకుండా, భారీ వాణిజ్య సముదాయంగా, భవిష్యత్తులో వరంగల్లో మెట్రో రైలు ప్రాజెక్టు సాకారమైతే దానితో అనుసంధానించేందుకు వీలుగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శుక్రవారం బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్లు దీని ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. పురపాలక శాఖ నిధులతో.. పురపాలక శాఖ నిధులతో ఈ బస్టాండ్ను నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్కు భారీ సెల్లార్, బస్సులు నిలిపేందుకు 32 ప్లాట్ఫామ్స్, సమీపంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్కు స్కైవాక్తో అనుసంధానం, ఎస్కలేటర్లు, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఒకవేళ మెట్రోతో అనుసంధానిస్తే ఎలాంటి ఏర్పాట్లు అవసరమో, నాగ్పూర్ మెట్రో అధికారులతో సంప్రదించినట్టు బాజిరెడ్డి వెల్లడించారు. అలాగే రైల్వేతో అనుసంధానంపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్తో చర్చల నేపథ్యంలో, పురపాలక శాఖ నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అజిత్రెడ్డి, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ ఇంజనీర్ రామ్ప్రసాద్, వరంగల్ ఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. -
వార్తల్లోకెక్కిన శ్రీకార్యం బస్టాండ్.. కూల్చేసిన ప్రభుత్వం
తిరువనంతపురం: ఏమాత్రం సిగ్గుపడకుండా అబ్బాయి వడిలో అమ్మాయిలు కూర్చుని ఆ మధ్య సోషల్ మీడియాలో ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. స్థానికులు ఓ బస్టాండ్లో చేసిన పనితో.. మండిపోయిన కాలేజీ స్టూడెంట్స్ ఈ ట్రెండ్ను పుట్టించారు. అయితే వార్తల్లో చర్చనీయాంశంగా మారిన ఆ బస్టాండ్ను.. రెండు నెలల తర్వాత ఇప్పుడు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్ బెంచ్ను మూడు ముక్కలు చేశారు స్థానికులు. ఇది నచ్చని కొందరు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.. ఆ మూడు ముక్కలపై ఒళ్లో కూర్చుని ఫొటోలు పెట్టి వైరల్ చేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చున్న ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ బస్ షెల్టర్ను తాత్కాలికంగా సీజ్ చేశారు పోలీసులు. జులైలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం ప్రభుత్వం దాకా వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్టాండ్ను పడగొట్టాలని నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ స్థానంలో కొత్త బస్టాండ్ను, అదీ లింగ వివక్షకు తావు లేకుండా ఉండేలా చూస్తామని విద్యార్థులకు మాటిచ్చారు మేయర్ ఆర్య రాజేంద్రన్. స్థానికులు చేసిన ఆ పని అనవసరమైందని, ప్రొగ్రెసివ్ స్టేట్గా పేరున్న కేరళలలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదన్న ఆమె.. అలా కనిపించిన వాళ్లను వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: వాళ్లు చదువుకునేలా ఏదైనా సాయం చేయండి -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
RTC Buses: బస్సులో ఓ చార్జి .. కౌంటర్లో మరో చార్జి.. ఎందుకీ గందరగోళం?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకీ గందరగోళం.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు. గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్వేర్నే ఇప్పుడు కామన్గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు. బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్కు, కౌంటర్లో ఉండే ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు. ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. -
బస్టాండ్ బాత్రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి
సాక్షి, వనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి మార్గమధ్యంలో బస్టాండ్ బాత్రూంలోనే ప్రసవించ గా.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు చనిపోయింది. తల్లి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘ టన వనపర్తి జిల్లా కొత్తకోటలో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి చెందిన చంద్రకళ, చంద్రయ్యల కూతురు మంజుల వివాహం గతేడాది ఆత్మకూర్ మండలం తిపుడంపల్లికి చెందిన కృష్ణయ్యతో జరిగింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కృష్ణయ్య తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. మంజుల ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఆమె ప్రతినెలా వనపర్తి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. మంగళవారం మంజుల వనపర్తి ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి తిరిగి హైదరాబాద్కు బస్సులో బయల్దేరింది. కొత్తకోటకు వచ్చే సరికి పురిటినొప్పులు రావడంతో అక్కడి బస్టాండ్లో దిగింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. బాత్రూంకు వెళ్లిన మంజుల అంబులెన్స్ వచ్చేసరికి అందులోనే ప్రసవించింది. ఆడశిశువు పురిటిలోనే కన్నుమూసింది. అంబులెన్స్ సిబ్బంది మంజులను కొత్తకోట పీహెచ్సీకి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి ఆమె ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. -
నిన్న అమ్మాయిలు.. నేడు అబ్బాయిలు.. అక్కడ అసలేం జరుగుతోంది..
చెన్నై: విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలంటారు. కానీ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలో చూస్తుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం వేయక మానదు. ముఖ్యంగా విద్యార్థులు బస్సులో ఫుట్బోర్డ్పై ప్రయాణించడం, టీచర్లపై దాడి చేయడం, గ్రూపులుగా ఏర్పడి గొడవలకు పాల్పడడం వంటి ఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. తాజాగా కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్లోని బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ పక్క గొడవ జరుగుతుండగానే మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. విద్యార్థుల యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్కు చెందినవారుగా గుర్తించారు. ఇక బుధవారం చెన్నైలోని కొత్త వాషర్మెన్పేట బస్టాండ్ వద్ద కాలేజీ విద్యార్థినుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో మహిళా విద్యార్థులు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హెచ్చరించి వారిని వదిలేశారు. అయితే ఈ రెండు ఘటనలపై డీజీపీ శైలేంద్ర బాబు స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గర్తు చేసుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు స్తోమత లేక ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదివిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు పాఠశాల సంపదైన చైర్లు, కుర్చీలను ఎలా ధ్వంసం చేస్తాం అని ఆయన ప్రశ్నించారు. మన భవిష్యత్తు కోసం శ్రమించే టీచర్లపై ఎందుకు దాడి చేస్తున్నారు? అని డీజీపీ ఆ వీడియోలో నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డవద్దని విద్యార్థులకు హితవు పలికారు. చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా.. -
ప్రయాణికుడి ట్వీట్.. స్పందించిన సజ్జనార్
వేములవాడ: ప్రయాణికుడు చేసిన ట్వీట్కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్కు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్లో సజ్జనార్కు పోస్టుచేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే! అదేరోజు కరీంనగర్లో దిగి బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే క్రమంలో కండక్టర్ మాస్క్ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్ చేయడంతో కండక్టర్పై చర్యలు తీసుకోవాలన్నారు. -
మేక అడ్డురావడంతో.. బస్టాండ్లోకి దూసుకెళ్లిన కంటైనర్
సాక్షి, గుడిహత్నూర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనబోయిన కంటైనర్ బస్టాండ్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బస్టాండ్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్ వైపు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకొని గుడిహత్నూర్ బస్టాండ్ చేరింది. మేక అడ్డురావడంతోనే.. బస్సు బస్టాండ్లోకి వస్తుండగా మేక అడ్డు రావడంతో డ్రైవర్ కొంచెం ముందుకు తీసుకెళ్లి నిలుపడంతో ప్రయాణికులు దిగుతున్నారు. అంతలోనే వెనుక నుంచి ఒక భారీ కంటైనర్ వేగంగా వస్తోంది. వేగం అదుపు కాకపోవడంతో డ్రైవర్ దానిని బస్టాండ్లోకి తీసుకెళ్లాడు. లేకుంటే వేగం తీవ్రతకు బస్సును ఢీకొనేదే. తేరుకున్న డ్రైవర్ కంటైనర్ను బస్టాండ్ ప్లాట్ఫాంపై నిలిపి దాక్కున్నాడు. స్థానికులు ఆర్టీసీ డ్రైవర్దే తప్పని ఆయనతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకొని కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తప్పెవరిది? డోంగర్గావ్ యూటర్న్ నుంచి బస్సు బస్టాండ్ వచ్చే క్రమంలో స్పీడ్ లిమిట్ 40 కి.మీగా ఉంది. కాని ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఓ భారీ కంటైనర్ నేరుగా బస్టాండ్లోనికి దూసుకెళ్లడంతో దాని స్పీడ్ కనీసం 90 కి.మీ వేగం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బంజారాల బతుకమ్మ... తీజ్ పండుగ -
గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ లో పాప్ కార్న్ షాప్ యజమాని పై దాడి
-
పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం
-
అమ్మను రోడ్డున పడేశారు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
సొంతూళ్లకు రయ్ రయ్!
సాక్షి, అమరావతి బ్యూరో/కంచికచర్ల/హైదరాబాద్: సంక్రాంతి పండుగకు వారాంతపు సెలవులు కలిసిరావటంతో హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు శనివారం ఏపీలోని తమ సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు.. సొంత వాహనాల్లో బయల్దేరే వారితో జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. దీంతో వివిధ టోల్ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ మేర బారులుతీరుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థవల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్ప్లాజాల వద్ద పోలీసులను నియమించారు. కొన్నిచోట్ల అదనపు గేట్లను ఏర్పాటుచేశారు. ప్లాజాల నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. ఆది, సోమవారాల్లో వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ రెండు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గత ఏడాదికంటే రెట్టింపు బస్సులను సిద్ధంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 700 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం వైపునకు 500 బస్సులను తిప్పుతున్నారు. ఇక పండుగ తర్వాత 16 నుంచి 21 వరకు తిరుగు ప్రయాణికుల కోసం మరో 800 బస్సులను నడపనున్నారు. బస్సులు లేవని ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చూస్తున్నామని కృష్ణా రీజియన్ ఆర్టీసీ ఆర్ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు. తొలిసారిగా ఆర్టీసీ 40 % రాయితీ మునుపెన్నడూ లేనివిధంగా ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికులకు 40శాతం రాయితీ ఇస్తోంది. సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నంత రద్దీ విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సుల్లో ఉండదు. ఇది ఆర్టీసీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇలా వెళ్లే స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులకు సాధారణ చార్జీలో 40 శాతం రాయితీ ఇవ్వాలని సంకల్పించింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి హైదరాబాద్–విజయవాడ మార్గంలో పండుగ సమయాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టోల్ నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. –వంశీ, నెల్లూరు ఇబ్బంది పడ్డాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాం. మా వాహనానికి ఫాస్టాగ్ ఉంది. అయినా టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నాం. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఏమాత్రం ఫాస్ట్గా వెళ్లలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. –నర్సింహా, విజయవాడ ఈనెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి ప్రతి వాహనానికి జనవరి 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఆ గడువును డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం వాహనదారులకు మరోసారి గడువిచ్చారు. 2020 జనవరి 15వ తేదీ నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులపై 65 శాతం వాహనదారులు ఫాస్టాగ్ వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫాస్టాగ్ల అమ్మకాలు 1.50 లక్షలు దాటాయి. ఈ నెల 14వ తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమల్లో ఉంటుంది. జనవరి 15వ తేదీ నుంచి ప్రతి టోల్ప్లాజాలో క్యాష్ లైన్ కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రాష్ట్ర రహదారులపైనా అమలు జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లోనే కాకుండా రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే, రాష్ట్ర రహదారులపై ఇప్పటికీ ఈ విధానం అమలు కావడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేస్తామని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. హోటళ్లలోనూ ఫాస్టాగ్ల అమ్మకాలు రాష్ట్రంలో 22 బ్యాంకుల ద్వారా 5 లక్షల ఫాస్టాగ్లను విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ఫాస్టాగ్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. జనవరి 15వ తేదీ తర్వాత టోల్ప్లాజాల్లో క్యాష్లైన్ ఒక్కటి మాత్రమే ఉంటుందని, తర్వాత అది కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ప్లాజాల వద్దే కాకుండా జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లలోనూ ఫాస్టాగ్లు విక్రయించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
నగరంలో మరో బస్టాండ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అధునాతన ఇంటర్సిటీ బస్టాండ్ ఏర్పాటు కానుంది. 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో బస్టాండ్ ప్రాంగణం, దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలను నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. మెట్రోరైల్ స్టేషన్తో అనుసంధానిస్తూ నిర్మించే ఈ ప్రాంగణం విజయవాడవైపు రాకపోకలు సాగించే జిల్లా బస్సులతోపాటు దిల్సుఖ్నగర్ మీదుగా ప్రయాణించే సిటీ బస్సులకు కూడా కేంద్రంగా మారనుంది. నగరంలో ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్, సికింద్రాబాద్లోని జేబీఎస్ బస్టాండ్ల తర్వాత ఇది మరో పెద్ద బస్టాండ్గా ఏర్పడనుంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో కొత్తపేటలో బస్టాండ్ను వాణిజ్య హంగులతో నిర్మిస్తే ఆర్టీసీకి పెద్ద ఆదాయ వనరుగా మారనుంది. అయితే ఇది భారీ ఖర్చుతో కూడుకోవడం, ఆర్టీసీకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం సహకరిస్తేనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కొత్త బస్టాండ్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉండటం, దిల్సుఖ్నగర్ ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందన్న ఆశతో ఆర్టీసీ ఉంది. – సాక్షి, హైదరాబాద్ కొత్తపేట మార్కెట్ తరలింపుతో... కొత్తపేటలోని పండ్ల మార్కెట్కు నిత్యం వందల సంఖ్యలో లారీలు వస్తుండటంతో ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, చిరువ్యాపారాలు అక్కడ అధికం. కొత్తపేట పరిసరాల్లో వందల సంఖ్యలో కాలనీలు ఉండటం, గత పదేళ్లలో అక్కడ భారీగా అపార్ట్మెంట్లు వెలియడంతో జనాభా కూడా పెరిగి రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. వెరసి కీలక సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్జాం నెలకొంటోంది. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొత్తపేట పండ్ల మార్కెట్ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డుకు చేరువగా ఉన్న కోహెడలో ఇందుకు స్థలాన్ని సేకరించింది. త్వరలో మార్కెట్ అక్కడికి మారనుంది. మార్కెట్ తరలింపుతో కొత్తపేటలో 21 ఎకరాల స్థలం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఉంది. విజయవాడ వైపు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు అక్కడ ఆగుతాయి. ఆ పక్కనే దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలున్నాయి. వెరసి ఆ రోడ్డు చిక్కుముడిలా మారింది. దీంతో ఆర్టీసీ ప్రాంగణాలను కొత్తపేట మార్కెట్ స్థలంలోకి తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయవాడ వైపు నిత్యం వందలాదిగా వచ్చే బస్సులను కొత్తపేట బస్టాండ్ వరకే పరిమితం చేస్తే ఎంజీబీఎస్పైనా భారం తగ్గుతుందని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ల వైపు నుంచి వచ్చే బస్సుల్లో మూడొంతులను సికింద్రాబాద్లోని జేబీఎస్కే పరిమితం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గిందని, ఇదే పద్ధతిని కొత్తపేట బస్టాండ్ వద్ద అమలు చేయాలనుకుంటోంది. ఆర్టీసీకి ఆదాయ వనరు... దిల్సుఖ్నగర్ ప్రాంతం వాణిజ్యపరంగా కీలకమైంది. ఇక్కడ ఆర్టీసీ షాపింగ్ మాల్ నిర్మిస్తే ఎంతో ఆదాయం సమకూరుతుంది. మల్టీప్లెక్స్లు, గేమింగ్ జోన్, రెస్టారెంట్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని ఆర్జించ వచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై 8 ఎకరాల్లో ఉన్న బస్టాండ్, రెండు డిపోలను తొలగించి ఆ స్థలంలో భారీ మల్టీలెవల్ పార్కింగ్ టవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కొత్తపేట మార్కెట్ స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే, ఆర్టీసీ తన స్థలాన్ని జీహెచ్ఎంసీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వీటన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో ఆర్టీసీ, మార్కెటింగ్శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. -
నెరవేరనున్న ఏళ్ల కల
సాక్షి, సిర్పూర్(టి): నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరనున్నది. పట్టణంలో బస్టాండ్ నిర్మాణం నియోజకవర్గ ప్రజలకు కలగా మిగిలిపోగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషితో బస్టాండ్ నిర్మాణం కోసం ఆర్టిసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిర్పూర్(టి)లో నూతన బస్టాండ్, బస్డిపో నిర్మాణం, బస్డిపోలోనే సినిమా హాల్ నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో మండలంలోని ప్రజలతోపాటు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థల పరిశీలన మండల కేంద్రం మీదుగా నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర ప్రజలు ఇబ్బందుల నడుమ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్, బస్డిపో, సినిమాహాల్ నిర్మాణానికి ఇటీవలే సర్వే నిర్వహించి స్థల పరిశీలన, రికార్డులను పరిశీలించారు.నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు వసతులు కల్పిస్తే ఇక్కట్లు తీరినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఆనుకోని మహారాష్ట్ర గ్రామాలు, పట్టణాలు ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో అధిక ధరలు వెచ్చించి ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు తక్షణమే పనులు ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు. -
ఏపీ అధికారుల అత్యుత్సాహం..!!
సాక్షి, వైఎస్సార్ కడప : అధికార పార్టీ అండతో ఏపీ ప్రభుత్వాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొద్దుటూరు బస్టాండ్లోని దుకాణాలను కూల్చి అన్నా క్యాంటీన్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రొద్దుటూరు బస్టాండ్లో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపట్టొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసింది. దుకాణాలు కూల్చి క్యాంటీన్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. దీంతో క్యాంటీన్ నిర్మాణంపై వెనక్కి తగ్గిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిడితో మరోమారు క్యాంటీన్ నిర్మించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశమైంది. -
ఎవరొచ్చినా ‘స్టాండ్’ అయ్యేనా?
ఖమ్మంమామిళ్లగూడెం: ఎన్నికలు పూర్తయ్యాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. రెండు రోజుల్లో ఫలితాలు కూడా రానున్నా యి. అయితే, ఎవరొచ్చినా, ఏ అభ్యర్థి గెలిచినా ఖమ్మంలో ప్రధానంగా బస్టాండ్ను పూర్తి చేస్తారా? అని పలువురు అంటున్నారు. పాత బస్టాండ్ సరిపోకపోవడం, కొత్త బస్టాండ్ పనులు ప్రారంభించారు కానీ, పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో కనీసం ఎన్నికల ఫలితాల తర్వాతనైనా బస్టాండ్ నిర్మిస్తారోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. ఖమ్మం నగరం రోజురోజుకూ అభివృద్ధి చెం దుతుండటంతో.. నగరానికి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే గతంలో ఎప్పుడో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం సరిపోకపోవడంతో మరో బస్టాండ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నిర్మాణానికి శం కుస్థాపనచేసి ఏడాది దాటిపోయినా నిర్మాణ పను ల్లో పురోగతి అంతగా లేదు. ఈ బస్టాండ్ ప్రజ లకు అందుబాటులోకి రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు. నగరంలోని ఎన్ఎస్టీరోడ్లో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పను లు 7ఎకరాల 13కుంటల స్థలంలో, రూ.25 కోట్ల తో కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో చేపడతామని అప్పటి సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నూతన బస్టాండ్కు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించి సంవత్సరం కాలం కావస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. నిధులు విడుదల చేసినా.. ఎన్నో ఏళ్ల కిందట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ప్రస్తుతం ఉన్న బస్సులకు సరిపడడం లేదనే ఉద్దేశంతో నూతన బస్టాండ్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులను స్థలం కేటాయించాలని ఆదేశించి, నిధులను సైతం విడుదల చేసింది. అయితే నిర్మాణ పనులు మాత్రం అడుగు వేయడానికి ఆరు మాసాలు అన్నచందంగా సాగుతున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు కనీసం పిల్లర్లు కూడా పైకి లేవలేదు. బస్టాండ్ నిర్మాణ పనులు చూసిన వారంతా ఇలా పనులు జరిగితే ఇంకా పది సంవత్సరాలు అయినా పూర్తికాదని చర్చించుకుంటున్నారు. పని ప్రదేశాల్లో కనీసం పనికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేసుకోకపోవడం కూడా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని స్థానికులు మారోపిస్తున్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం సంబంధిత అధికారులు పనులను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాత బస్టాండ్లో ఇక్కట్లు నూతన బస్స్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావిస్తే అదికాస్తా జాప్యం అవుతుండటంతో పాత బస్స్టాండ్కు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతిరోజు జిల్లా కేంద్రమైన ఖమ్మం బస్టాండ్కు దాదాపు 1,250 బస్సులు నిత్యం ఇతర జిల్లాలు, రాష్ట్రాల ద్వారా వస్తూ పోతుంటాయి. వేల మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్ నుంచి వారివారి గమ్య స్థానాలకు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్ లేక పోవడంతో బస్సులు బస్టాండ్లో తిరగటానికి ఇబ్బంది కరంగా మారింది. వర్షాకాలంతో ప్రయాణికులకు అనుకూలంగా లేని బస్టాండ్లో ఆరుబ యట తడవక తప్పడంలేదు. బస్సు లోనికి రావాలన్నా,బయటకు వెళ్లాలన్నా నరకమే కనిపిస్తోంది. ఇక బస్టాండ్ బయట ఆటోలు, తోపుడు బండ్లతో బస్సులులోనికి రావడానికి ఎక్కువ సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ట్రాఫిక్తో సమస్య నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా ఉంది. వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం లేకపోవడంతో ఇక్కట్లు తప్పడంలేదు. సమస్యలను ఎవ రూ పట్టించుకోక పోవడంతో స్థానిక ప్రజలకు ఇ బ్బందులు తప్పడంలేదు. ఈసారి ఎన్నికల్లో గెలిచే ప్రజాతినిధులు పట్టించుకొని బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, నగరం లో ప్రయాణికులకు అనుగుణంగా మినీబస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నప్పటికీ రోడ్లు అనుకూలంగా లేకపోవడంతో మినీబస్సులు జాడలేకుండా పోయాయి. -
నరసాపురం బస్టాండ్ ఎదుట విద్యార్ధులు ఆందోళన
-
కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్(సీబీఎస్) గురువారం నిలువునా కుప్పకూలింది. ఈ సమయంలో బస్టాండ్లో బస్సులు, ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోనే మొట్టమొదటి బస్సు డిపో గౌలిగూడ. బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంజినీర్ల సూచన మేరకు జూన్ 30 నుంచి బస్ స్టేషన్ను మూసివేశారు. నాటి నుంచి బస్సులను, ప్రయాణికులను బస్ స్టేషన్లోకి అనుమతించడం లేదు. బస్సులు, ప్రయాణికులు లేని సమయంలో బస్ స్టేషన్ కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 88 ఏళ్ల క్రితం ఈ బస్టాండ్ను ఏర్పాటు చేశారు. మూసీ నదీ తీరాన అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించి ఈ షెడ్డును నిజాం బస్టాండ్గా మార్చారు. 1932 జూన్లో గౌలిగూడ బస్టాండ్ ప్రారంభమైంది. 30 ప్లాట్ ఫారాలతో 27 బస్సులతో గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల రాకపోకలు కొనసాగాయి. 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్పోర్టు ఉద్యోగులతో సేవలు ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత కేవలం లోకల్ బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. సందర్శించిన మంత్రి మహేందర్ రెడ్డి కుప్పకూలిన సిటీ బస్టాండ్ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సందర్శించారు. బస్టాండ్ కూలడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కట్టడం కూలినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదం జరలేదని చెప్పారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన విమాన స్థావరం కోసం దీన్ని ఏర్పాటు చేయించారని వెల్లడించారు. 1930లో అమెరికాకు చెందిన బట్లర్ కంపెనీ దీన్ని తయారు చేసిందని తెలిపారు. దీనికి మిసిసిపి ఏయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్గా నామకరణం చేశారని చెప్పారు. కొద్దికాలం తర్వాత నిజాం రోడ్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ కింద తొలి డిపోగా ఏర్పాటు చేయించారని వివరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాల్లో గౌలిగూడ బస్టాండ్ కూడా ఒకటని అన్నారు. కూలిన కట్టడం స్థానంలో ఆర్టీసీ అదనపు ఆదాయం సాధించడం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో చోరీకి పాల్పడిన జంట
-
కలెక్టర్ ఔదార్యం
సంగారెడ్డి టౌన్: నిస్సహాయులకు మానవతా దృక్పథంతో చేతనైన సాయం చేసి చేయూతనివ్వాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి పరిసరాలు, బైపాస్రోడ్డు, పోతిరెడ్డిపల్లి ఎక్స్రోడ్, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, అపరిశుభ్రంగా, మతిస్థితిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన ఎనిమిది మందిని గుర్తించి వారిని అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ (మానసిక దివ్యాంగుల వార్డు)కు తరలించారు. అక్కడ జట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత కలెక్టర్ వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను అందజేశారు. అల్పాహారాన్ని తెప్పించి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. మళ్లీ రోడ్ల మీదకు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మనోహర్కు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిరాధరణకు గురైన, మతిస్థిమితం లేని వారు ఎవరైనా తారసపడితే వారిని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో అప్పగించాలని అన్నారు. వారికి చేయూత నివ్వడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సంగారెడ్డి, కంది తహసీల్దారులు విజయ్కుమార్, గోవర్థన్ ఉన్నారు. -
ప్లాట్ఫాం ‘పైకే’ వచ్చెను
రాజోలు: ‘ఫలానా బస్సు ఫలానా ప్లాట్ఫాంపైకి వస్తుంది’ అన్న అనౌన్స్మెంట్లు ఆర్టీసీ బస్టాండ్లలో మామూలే. ‘ప్లాట్ఫాం పైకి’ అంటే ఆ ప్లాట్ఫాంకు సంబంధించి, ‘దిగువన బస్సులు నిలిచే చోటికి ’అనే అర్థం. అయితే రాజోలు బస్టాండ్లో ఆదివారం ఓ బస్సు ప్లాట్ఫాం పైకే వచ్చేసి, అందరినీ బెంబేలెత్తించింది. ఉదయం 6 గంటల సమయంలో రాజోలు నుంచి అమలాపురం వెళ్లే బస్సును డ్రైవర్ నాలుగో నంబరు ప్లాట్ఫాంకు తీసుకువచ్చాడు. బస్సు ఇంజన్ ఆపివేసి, తాళం ఆన్చేసి డ్యూటీ చార్టర్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో తాళం ఆన్చేసి ఉన్న బస్సు ఇంజన్ స్టార్టయి, ఒక్కసారిగా ప్లాట్ఫాంపైకి ఎక్కేసింది. గమనించిన కొందరు డ్రైవర్లు బస్సు ఎక్కి ఇంజన్ను ఆపి వేశారు. బస్సు పైకి దూసుకొచ్చిన సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరు. బస్సు ముందు భాగం ధ్వంసం కావడంతోపాటు, ప్రయాణికులు కూర్చునే బల్లలు విరిగిపోయాయి. 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన టెలివిజన్ పగిలిపోయింది. ఈ సంఘటనపై ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. -
బస్ స్టాప్లో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: బస్స్టాప్లో నిల్చున్న వ్యక్తి వంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన నగర శివారులోని హయత్నగర్లో వెలుగుచూసింది. వర్డ్ అండ్ డీడ్ పాఠశాల ఎదురుగా ఉన్న బస్టాప్లో ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పేలోపే అగ్నికి ఆహుతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ హనుమాన్ నగర్కు చెందిన కనకయ్యగా గుర్తించారు. -
అడిగేవారు లేరని..
►బస్టాండ్లో ప్రయాణికుల దోపిడీ ► వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న షాపుల యజమానులు ►అటకెక్కించిన ఎంఆర్పీ విక్రయ నిబంధన ► చూసీచూడనట్లు వెళ్తున్న ఆర్టీసీ అధికారులు ► రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు ► నిద్రిస్తున్న తూనికలు, కొలత శాఖ అధికారులు కర్నూలు(రాజ్విహార్): జిల్లాలో 12డిపోల్లో 430 షాపులుండగా కర్నూలు బస్స్టేషన్లో 80, ఆరుబయట మరో 130 షాపులున్నాయి. ఐదేళ్లకోసారి తిరిగి టెండర్లు పిలుస్తారు. ఒకసారి టెండరు ఖరారు అయితే మూడేళ్ల వరకు ఒక అద్దె ఉంటుంది. నాలుగో సంవత్సరం 10శాతం పెంచుతారు. చివరి సంవత్సరం నాలుగో ఏడు చెల్లించిన నెలవారి అద్దెపై 15శాతం అదనంగా వసూలు చేస్తారు. జిల్లాలోని షాపుల నుంచి నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. దోపిడీ ఇలా.. బస్టాండ్లలోని షాపుల్లో వస్తువులు, తినుబండరాలను నిబంధనల ప్రకారం ఎంఆర్పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్)కే అమ్మాలి. షాపులు దక్కించుకున్న యజమానులకు ఇచ్చే అగ్రిమెంట్లలో ఈవిషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే, ఈ నిబంధన అమలు కావడం లేదు. రూ.10 ఎంఆర్పీ ఉన్న వస్తువును రూ.15కి అమ్ముతున్నారు. తినుబండరాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ సైతం ఇదే తరహాలో విక్రయిస్తున్నారు. రూ.20 ఉన్న నీళ్ల బాటిల్ను రూ.25కి అమ్ముతున్నారని నంద్యాలకు చెందిన ప్రయాణికులు శ్రీకాంత్ వాపోయాడు. దీనిపై ప్రశ్నిస్తే ‘ఇది బస్టాండ్, మాకు బాడుగ ఎక్కువగా ఉంటుంది. ఎలా అమ్ముకోవాలి’ అంటు సమాధానం చెబుతున్నారని తెలిపారు. ప్రదర్శనల వరకే ధరల పట్టిక: షాపుల్లో అమ్మే వస్తువుల పేర్లు, వాటి ఎంఆర్పీ పట్టికను ప్రయాణికులకు కనిపించేలా పెట్టాలి. అందులో చూపిన ధరలనే అమ్మాలి. కానీ ఒకటి రెండు షాపుల వద్ద తప్ప ధరల పట్టిక ఎక్కడా కన్పించదు. పట్టిక ప్రదర్శనకు పెట్టిన వాళ్లు సైతం దీనిని అమలు చేయకపోవడం గమనార్హం. చర్యలు ఇలా.. ఎంఆర్పీ విస్మరిస్తే మూడంచెల తరహాలో చర్యలు తీసుకుంటారు. మొదటి సారి రూ.500, రెండో సారి రూ.1000 జరిమాన విధిస్తారు. మూడో సారి కూడా ఆదే షాపుపై కేసు నమోద అయితే షోకాజ్ నోటీసు ఇచ్చి షాపు టెంటరు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇప్పటి వరకు కేవలం పాతికలోపే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శ్రీబాలాజీలో రాత్రిపూట అధిక ధరలు కొత్త బస్టాండ్లోని శ్రీ బాలాజీ క్యాంటీన్ చీకటి వ్యాపారానికి తెర లేపిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రయితే చాలు ధరలు మరిపోతున్నాయని, పగలు ఉన్న ధరలను పెంచి రాత్రి వేళల్లో అధిక రేట్ల తినుబండరాలు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తదితర పానియాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వీటిపై గతంలో ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారిపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని తూనికలు, కొలతల శాఖ బస్టాండ్లలో ప్రయాణికులు దోపిడీకి గురవుతుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. ఎప్పుడో ఓసారి దాడులు నిర్వహించి వదిలేస్తున్నారు. కర్నూలు బస్స్టేషన్ నుంచి ప్రతీరోజు దాదాపు 50వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి నుంచి రూ.లక్షల దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కొత్త బస్టాండ్లోని బాలాజీ క్యాంటీన్లో వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పగలు ఒక రేటు, రాత్రి వేళల్లో ఒక రేటు పెట్టి తినిబండరాలు విక్రయిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎంఆర్పీ కంటే రూ.2 నుంచి రూ.5వరకు అధికంగా అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - ఎం. గోవిందు, పాతబస్తీ ఫిర్యాదు చేస్తే చర్యలు: బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మరాదు. ఎమ్మార్పీకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయిస్తే ప్రయాణికులు కంట్రోలర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసులు, డీసీటీఎం -
బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ఫాం వద్ద ఆగాల్సిన బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్టాండ్లలో కిక్కిరిసిపోయిన ప్రయాణీకులు
-
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్కు చెప్పడంతో వారు బస్సును పోలీస్స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్కు చెప్పడంతో వారు బస్సును పోలీస్స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్కు చెప్పడంతో వారు బస్సును పోలీస్స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
రాజధాని బస్టాండ్లో ధరల బాదుడు
► మరుగుదొడ్డికి వెళితే యూజర్ చార్జీలు ► ప్రతి వస్తువుపై అదనపు ధరలు వసూలు ► రూ.5 నుంచి రూ.10 వరకు వసూలతో ప్రయాణికుల జేబులకు చిల్లు ► ఆర్టీసీ ఎండీ ఉండే బస్టాండ్లోనే అదనపు ధరలపై చర్యలు నిల్లు విజయవాడ బ్యూరో : ప్రకృతి పిలుస్తుందని వెళితే యూజర్ చార్జీలు వాత పడాల్సి వస్తోంది. దాహం తీర్చుకుందామని మినరల్ వాటర్ కొంటే దాని ధర చూసి గొంతులో తడారిపోతోంది. పోనీ లూజ్ వాటర్ కొని దప్పిక తీర్చుకుందామంటే అది తాగితే ఖచ్చితంగా విరేచనాలు కావడం కాయం. అల్పాహారం, భోజనం ఏదైనా ధరలు చూస్తే బెదరాల్సిందే. ఇవి ఎక్కడో కాదు రాజధాని ప్రాంతంలోని విజయవాడ పండిట్ నెహ్రు బస్స్టేషన్(పీఎన్బిఎస్)లో ప్రయాణీకుల జేబులకు చిల్లుపడుతున్న వైనాలు. ఆర్టీసీ పరిపాలన కార్యాలయం కూడా బస్టాండ్పైనే ఏర్పాటు చేయడంతో దీన్ని ఎయిర్పోర్టు తరహాలో బస్పోర్టుగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సౌకర్యాలు, అందాలు, హంగులతో దీన్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేయడం ఒక ఎత్తు అయితే దానికి మరోవైపు జరుగుతున్న తంతు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ మూత్ర విసర్జనకు వెళితే రూ.5, మరుగుదొడ్డికి వెళితే రూ.10 యూజర్ చార్జీలు ఇచ్చుకోవాల్సిందే. మరోవైపు బస్టాండ్లోనే నీళ్లు, ఆహారం తీసుకోవాలంటే సగటు ప్రయాణికులు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బస్టాండ్లో ఉన్న స్టాల్స్ వద్ద ఏర్పాటు చేసిన ధరల పట్టిక బోర్డులకే పరిమితం. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడ మంచినీళ్లు బాటిల్ నుంచి బిస్కెట్ ప్యాకెట్ ధరలు మారిపోతుంటాయి. మామూలుగా రూ.20 ఉంటే మినరల్ వాటర్ బాటిల్ ధర ఇక్కడ రూ.25, రూ.10 ఉండే బిస్కెట్ ప్యాకెట్ రూ.15, రూ.30 ఉండే కూల్ డ్రింక్ బాటిల్ రూ.40, రూ.45 వసూలు చేస్తున్నారు. రెండు ఇడ్లీ రూ.25, దోశ రూ.50, భోజనం రూ.90, టీ రూ.10, స్పెషల్ టీ రూ.20, హార్లిక్స్, బూస్ట్ రూ.30 ఇలా ఇష్టానుసారం ధరలు పెట్టి ప్రయాణీకులను బెదరగొడుతున్నారు. బయట కంటే ప్రతిదీ రూ.5 నుంచి రూ.10పైగా అదనపు ధరలకు విక్రయాలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు అటువైపు దృష్టి పెట్టారు. ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరరావు ఉండే ప్రధాన బస్టాండ్లోనే హైటెక్ మాటున అదనపు ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరని ప్రయాణికులు అంటున్నారు. -
ఆర్టీసీ బస్టాండ్పై పచ్చ తమ్ముళ్ల కన్ను
-
‘బస్టాండ్’ చదువులు..!
♦ రెండేళ్లుగా బస్టాండే పాఠశాల.. ♦ నిధులు మంజూరుకాక అర్థాంతరంగా నిలిచిపోయిన పాఠశాల ♦ నిర్మాణ పనులు మెదక్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామంటూ చెబుతున్న అధికారులు, పాలకుల హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రెండేళ్లుగా ఓ గిరిజన తండాలో ప్రాథమిక పాఠశాల బస్టాండ్లోనే కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల తీరుకు అద్ధం పడుతున్న ఈ దుస్థితి మెదక్ మండలం వాడి పంచాయతీ పరిధి మెట్టుతండాలోని ప్రాథమిక పాఠశాలకు ఎదురైంది. సుమారు 25మంది గిరిజన విద్యార్థులు 1 నుంచి 5 వరకు చదువుతున్నారు. తండాలో పాఠశాల లేకపోవడంతో బస్టాండ్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. దీంతో వానకు తడుస్తూ..ఎండకు ఎండుతూ విద్యార్థులు బస్టాండ్లో చదువులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మెట్టుతండాలో గత ఏడాది క్రితం ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం ఆర్వీఎం కింద రూ.20లక్షలు మంజూరయ్యాయి. పనులు చేజిక్కుంచుకున్న సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చాలా వరకు పూర్తికానిచ్చారు. కాని కేవలం రూ.5లక్షలు మాత్రమే ఇప్పటి వరకు విడుదలయ్యాయని, నిధులు వస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. -
కారు,బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు
జడ్చర్ల(మహబూబ్నగర్): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల న్యూ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైక్ ఢీకొనడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది, ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తుతెలియని మహిళ మృతి
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. ఈ సంఘటన మార్కాపురం బస్టాండ్లో చోటుచేసుకుంది. కర్నూలు బస్సు కోసం సదరు మహిళ వేచిచూస్తున్న క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె కర్నూలు జిల్లా చెందిన మహిళగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండ్ వద్ద శిశువు మృతదేహం
-
బస్టాండ్ వద్ద శిశువు మృతదేహం
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఆదివారం ఉదయం కడప పట్టణ బస్టాండ్ సమీపంలో కనిపించిన చిన్నారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు బస్టాండ్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్లడంతో గుక్కపెట్టి ఏడ్చి ఏడ్చి మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బెజవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్షం ధర్నా
-
ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా సీపీఎం ధర్నా
-
మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య
అనంతపురం : తాగటానికి భార్యను డబ్బులడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం పట్టణం సున్నపుగేడు ప్రాంతానికి చెందిన బసురుల్లా(50) బస్టాండ్ క్యాంటిన్లో పనిచేస్తుంటాడు. తాగుడుకు బానిసైన అతడు డబ్బుల కోసం తరచూ భార్యను వేధిస్తుంటాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా డబ్బులడగగా ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన బసురుల్లా స్థానిక బస్టాండ్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో అటుగా వెళ్లిన వారు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాఖీ కట్టి వెళుతుండగా చైన్ స్నాచింగ్
(కరీంనగర్) సుల్తానాబాద్ : రాఖీ కట్టి స్వగ్రామానికి వెళుతుండగా శనివారం సుల్తానాబాద్ బస్టాండ్లో వివాహిత మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు అపహరించారు. వివరాల్లోకి వెళితే.. నల్లవెల్లి సత్తమ్మ అనే మహిళ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో ఉన్న సోదరునికి రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళుతుండగా సుల్తానాబాద్ బస్టాండ్లో గుర్తు తెలియని యువకులు పుస్తెలతాడును అపహరించారు. వరంగల్ జిల్లా జనగాంకు చెందిన సత్తమ్మ బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు లాక్కుని పరారయ్యారు. బస్సును పోలీస్స్టేషన్కు తరలించి పోలీసులు పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండ్ ఎదుట బైఠాయించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు
-
తిరుపతిలో ఆర్టీసీ బస్సు దగ్ధం
-
బస్టాండ్ వద్ద బాంబు కలకలం
వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఓ అట్టపెట్టె చాలా సేపటి నుంచి ఉండటంతో సిబ్బంది అనుమానించారు. దీనిపై వారు వన్ టౌన్ పోలీసులకు వారు అందించారు. విషయం ఆనోటా.. ఈనోటా తెలియటంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని పెట్టెను తెరిచి చూడగా పై భాగంలో అంతా రంపం పొట్టుతో పాటు అడుగున చిన్న రాగి చెంబు కనిపించాయి. ఎలాంటి ప్రమాదం లేదని తెలియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బస్టాండ్లో వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి బస్టాండ్లో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా... చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం మద్దూరుకు చెందిన మొహమ్మద్ రసూల్(35) మంగళవారం కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి బనగానపల్లి బస్టాండ్కు చేరుకున్నాడు. సాయంత్రం అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రసూల్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు. -
బస్టాండ్లో గుర్తుతెలియని వృద్ధుని మృతి
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న వృద్ధుడు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. కాగా మంగళవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలో హఠాత్తుగా మృతిచెందాడు. గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పంచాయతీవారికి అప్పగించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్డ్రైవ్ తెచ్చిన తంటా...
కేరళ: కేరళలో ఓ పెన్డ్రైవ్ జనాల చేత పరుగు పెట్టించింది. బస్టాండ్లో ఏర్పాటు చేసిన టీవీలో దాదాపు అరగంట సేపు ఒక అశ్లీల వీడియో నిరంతరాయంగా ప్రసారం కావటం కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఉదంతాన్ని డార్క్ ఆరెంజ్ అనే యూజర్ దీన్ని బహిర్గతం చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నెటిజనుడు అందించిన వివరాల ప్రకారం కేరళలోని వాయంద్ జిల్లాలోని కాల్పెట్టా బస్టాండ్లో ఉన్న టీవీలో అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్రసారం కావడం మొదలైంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు, పిల్లలు, కాలేజీ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కంగారు పడిన కొంతమంది టీవీని ఆఫ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే టీవీ స్విచ్ ఉన్న గది తాళం వేసి ఉండటంతో... మరికొంతమంది ఆ టీవీపై గుడ్డ కప్పడానికి ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. చివరికి విసుగొచ్చిన వారు ఒక ఇనుప రాడ్ తీసుకొని పవర్ కేబుల్ను పగుల గొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేబుల్ ఆపరేటర్ మంజూర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పొరపాటున వేరే పెన్డ్రైవ్ పెట్టడం వల్ల ఇదంతా జరిగిందని ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, కంప్యూటర్ని స్వాధీనం చేసుకున్నట్లు కెకె అబ్దుల షరీఫ్ తెలిపారు. -
బస్టాండ్లో పర్సు లాక్కెళ్లారు..
ప్రకాశం : బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ చేతిలోనుంచి పర్సు లాక్కొని పోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల బస్స్టాండ్లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుంతలమర్రికి చెందిన జ్యోతి అనే మహిళ చీరాల వెళ్లింది. సోమవారం ఆమె తిరిగి ఇంటికి బయలుదేరడానికి బస్స్టాండ్లో నిల్చున్న సమయంలో ఓ దుండగుడు ఆమె చేతిలోనుంచి పర్సు లాక్కొని పారిపోయాడు. వెంటనే ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పర్సులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక సెల్ఫోన్ ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. -
బస్టాండ్లో బస్సు ఢీకొని మహిళ మృతి
మిన్నంటిన రోదనలు నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్లో గురువారం ఉదయం బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తున్న మహిళ ఆటో ఎక్కేందుకు బస్టాండ్ బయటకు వస్తుండగా బస్సు లోపలకు వెళ్తూ ఆమెను ఢీకొట్టింది. బస్సు ముందు చక్రం ఆమె ముఖంపై నుంచి వెళ్లటంతో ముఖం నుజ్జునుజ్జు అయింది. ఒకటవ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన మాధవి(34) బాసర త్రిపుల్ ఐటిలో అవుట్సోర్సు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 13 సంవత్సరాల క్రితం ఆర్మూర్ మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రమేష్తో వివాహం అయింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. భర్త రమేష్ బతుకుదెరువు కోసం దుబయ్ వెళ్లాడు. దీంతో ఆమె బాసర త్రిపుల్ ఐటీలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు మునిపల్లికి వచ్చిపోతుండేది. ఇలా మునిపల్లికి వెళ్లేందుకు గురువారం ఉదయం సోదరుడు మహేష్తో కలిసి నిజామాబాద్కు వచ్చింది. బస్సు దిగి ఆటో ఎక్కేందుకు బయటకు వస్తుండగా బస్టాండ్ గేట్ వద్ద హైదరాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఏపీ 29జెడ్2671 నంబరు గల బోధన్ డిపోకు చెందిన బస్సు లోపలకు వస్తూ ఢీకొట్టింది. అప్పటి వరకు తనతో పాటు ఉన్న చెల్లెలు కళ్లముందే ప్రాణాలు కోల్పోవటంతో మహేష్ ఒక్కసారి షాక్కు గురయ్యాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెరవేయటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తూ అక్కడికి చేరుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఒకటవ టౌన్ పోలీసులు బస్టాండ్కు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కానరాని లోకానికి వె ళ్లిపోవటం, తండ్రి బతుకుదెరువు కోసం దుబాయిలో ఉండటంతో పిల్లలను సముదాయించటం ఎవరి వల్లా కాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మునిపల్లి గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చర్యలు నిజామాబాద్ నాగారం : బస్టాండ్లో గురువారం ఉ దయం బస్సు ఢీకొని మహిళ మృతిచెందిన ఘట నపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే సంబంధిత డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని బోధన్ డిపో మేనేజర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేస్తారని, వారిచ్చే ఎఫ్ఐఆర్ ఆధారంగానే డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు డ్రైవర్కు విధు లు కేటాయించకుండా స్పేర్లో పెడతామన్నారు. ఆ డ్రైవర్ 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని, తన డ్యూటీలో ఇదే మొదటి ప్రమాదమని తెలిపారు. -
సీట్లు లేవు...బెర్తులు దొరకవు
*పల్లెకు పోదాం చలో..చలో.. సంక్రాంతి సమీపిస్తోంది. నగరం నుంచి సొంతూళ్లుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు..ఎటు చూసినా కిటకిటే. సీట్లు దొరక్క, బెర్తులు లభించక ప్రయాణికులకు నానాపాట్లు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కోసం బారులుతీరి కన్పించిన దృశ్యం... నగరం పల్లెబాట పట్టింది. మూటాముల్లె సర్దుకుని.. సొంతవారి వద్దకు సాగిపోతోంది. ఉపాధి కోసం ఆశల ‘కాంతి’ని కళ్లల్లో నింపుకుని ఎగిరొచ్చినవారు.. తనవారితో ‘సంక్రాంతి’ ఆనందాలను పంచుకునేందుకు తరలిపోతున్నారు. రైల్లో రిజర్వేషన్ లేనిదే ప్రయాణించనివారు.. పక్కవారి చేయి తగిలితే కసురుకునేవారు ఇప్పుడు ఒకరిపై మరొకరు పడుతున్నా ‘సర్దుకుపోదాం’ అంటున్నారు. బక్కపలచనివారు కూడా బండి ఆగీ ఆగగానే చోటు కోసం ‘బల ప్రదర్శన’కు దిగుతున్నారు. చోటుదొరకినవారు ఉస్సూరు మంటూ మరో బండి కోసం క్యూ కడుతున్నారు. మరికొందరు ‘మరో మార్గం’ దొరక్కపోతుందా.. అన్నట్టు వెనుదిరుగుతున్నారు. సోమవారం సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్లో ఇదే పరిస్థితి కనిపించింది. సీట్లు లేవు..బెర్తులు దొరకవు కిక్కిరిసిన బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు సిటీ ఒక్కరోజే 1700కు పైగా ప్రత్యేక బస్సులు కాకినాడకు జనసాధారణ్ రైళ్లు కొనసాగిన ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ సిటీబ్యూరో: సిటీ నుంచి సోమవారం ఒక్కరోజే 1700 పైగా అదనపు బస్సులు.. ప్రత్యేక రైళ్లు నడిచాయి.. సంక్రాంతికి సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో అన్నీ కిటకిటలాడాయి. బస్సుల్లో సీట్లు..రైళ్లలో బెర్తులు లభించక అవస్థలు పడ్డారు. మంగళ, బుధవారాల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. నగరం నుంచే కాకుండా శివారు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూరి బాట పట్టారు. ఆర్టీసీ ప్రతి రోజు 3500 బస్సులను నడుపుతుం ది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం రాత్రి 11 గంట ల వరకు అదనంగా 1500 బస్సులను ఏర్పాటుచేసింది. విజయవాడ,గుంటూరు, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి,విశాఖ, నెల్లూరు, కర్నూలు,నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు వెళ్లా యి. ప్రైవేటు బస్సులు కూడా సాధారణం కంటే రెండొందలకు పైగా అదనపు బస్సులు నడిచాయి. అమీర్పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు,కాచిగూడ,ఆబిడ్స్,కోఠీ, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచే కాకుండా మెహదీపట్నం, కుత్బుల్లాపూర్, బాలానగర్, జూబ్లీబస్స్టేషన్, ఉప్పల్, హయత్నగర్, తదితర నగర శివారు ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాలు బయలుదేరాయి. నేడు మరింత పెరగనున్న రద్దీ... సంక్రాంతి రద్దీ మంగళవారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీ 2000 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరి వెళ్తాయి. ఎప్పటిలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు వెళ్లే బస్సులను జూబ్లీబస్సే ్టషన్ నుంచి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ హేంగర్ నుంచి బయలుదేరుతాయి. నల్లగొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ నుంచి, వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్రోడ్స్ నుంచి బయలుదేరుతాయి. సూర్యాపేట్, కోదా డ, దేవరకొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, విజయవాడ, గుంటూ రు, బెంగళూరు, షిరిడీ, ముంబయి, చెన్నై, తదితర రూట్లకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ నుంచి వెళ్తాయి. తొమ్మిది లక్షల మంది.. అఫ్జల్గంజ్: ఎంజీబీఎస్లో సోమవారం సాయంత్ర ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు హైరానా పడ్డారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి 8గంటల వరకు సుమారు 9 లక్షల మంది ప్రయాణికులను నగరం నుండి వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ సి.వినోద్కుమార్ తెలిపారు. ఎంజీబీఎస్లో ప్రయాణికుల సౌకర్యార్థం 14 సహాయక కేంద్రాలను, ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అధిక చార్జీలతో ఆవిరి... ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలతో పాటు, ప్రైవేట్ ఆపరేటర్లు, ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను దోచేశాయి. సంక్రాంతి సంబరాల కోసం సొంత ఊరుకు వెళ్తున్న ప్రయాణికుల సంతోషం అదనపు చార్జీలతో ఆవిరైపోయింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.450 తీసుకునేవారు సంక్రాంతి హడావుడి ప్రారంభమైన నాలుగు రోజులు నుంచే రూ.900 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. కాకినాడకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ద.మ.రైల్వే సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ (07425) మంగళవారం రాత్రి 10.45కు బయలుదేరి బుధ వారం ఉదయం 9.45 కు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ-కాచిగూడ (07426) బుధవారం సాయంత్రం 6.30కు బయలుదేరి గురువారం ఉదయం 5.25కు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07205) ఈనెల 13,15,17 తేదీల్లో రాత్రి 10.40కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45కు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ-సికింద్రాబాద్ (07206) ఈనెల 14,16,18 తేదీల్లో సాయంత్రం 4.45కు కాకినాడలో బయలుదేరుతుంది. -
అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్
త్వరలో పునరుద్ధరిస్తాం తుఫాన్ ధాటికి దెబ్బతిన బస్షెల్టర్లలో 90 అందుబాటులోకి తెచ్చాం. మిగతావి త్వరలోనే బాగుచేస్తాం. బస్టాండుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిబ్బందికి సూచనలిస్తున్నాం. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నాం. -వై.జగదీష్బాబు, ప్రాంతీయాధికారి బస్టాపుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అసౌకర్యాలకు నిలయంగా ఉండే ఇవి హుద్హుద్ దెబ్బకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైకప్పుల్లేని ప్లాట్ఫారాలు, శిథిలమైన బెంచీలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. గ్రామీణ ..సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి రోజూ 1013 బస్సుల్లో 6.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖలో 420 బస్షెలర్లలో తుఫాన్కు 260 దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ అధికారులు పాడై న వీటిని పట్టించుకోవడం లేదు.షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే నిలబడుతున్నారు. విశాఖలో జాతీయ రహదారి వెంబడి షెల్టర్లు కనుమరుగయ్యాయి. బస్టాపుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్ అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్ * సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో బస్టాప్ల పరిస్థితి దయనీయంగా ఉంది. హుద్హుద్ ధాటితో మరింత అధ్వానంగా తయారయ్యాయి. * అనకాపల్లి బస్స్టాండ్లో ఫ్యాన్లు, మైక్ అనౌస్మెంట్ పనిచేయడం లేదు. 10 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. * అరకు వేలీ బస్స్టాండ్లో తాగునీరు కరువైంది. అరకువేలీ నుంచి లోతేరు వరకూ 90 గ్రామాలకు బస్ సౌకర్యమే లేదు. * చోడవరం నియోజకవర్గంలో 150 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. బస్టాండ్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. 106 సర్వీసుల్లో ఇప్పుడు 86కు కుదించారు. * నర్శీపట్నం అడ్డురోడ్డు నుంచి ఒకే ఒక్క బస్సు తిరుగుతోంది. జల్లూరు వద్ద బ్రి డ్జి దెబ్బతిన్నదంటూ చూపిస్తున్నారు. * పాడేరులో సయమానికి బస్సులు రావడం లేదు. * చింతపల్లి కాంప్లెక్సులో తాగునీరు, మరుగుదొడ్లు లేవు. ఎనిమిది పంచాయతీల్లో గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. * నక్కపల్లిలో మెయిన్రోడ్డుపై బస్టాండ్ ఉన్నా ఎక్స్ప్రెస్లు రావడంలేదు. పా యకరావుపేటలోనూ ఇదే పరిస్థితి. * సబ్బవరం బస్టాండ్ భయానకంగా మారింది. * పెందుర్తిలో రూ.10లక్షలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. * భీమిలిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ లోకి ప్రయాణీకులు వెళ్లడం లేదు. యలమంచిలి బస్టాండ్కి పక్కనే 16వ నెంబర్ జాతీయ రహదారి ఉండటంతో ఎక్స్ప్రెస్లు బస్టాండ్లోకి రాకుండా వెళ్లిపోతున్నాయి. -
మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. బస్టాండ్ సమీపంలోని కొంతమంది వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడే ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు స్థానికులు యత్నించి విఫలమయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొత్త బస్టాండ్ వద్దకు చేరుకుని అతి కష్టం మీద అతడిని ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసు స్టేషన్కు తరలించారు. -
బతుకుపోరులో బాల్యం బందీ
ఆదిలాబాద్ టౌన్ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లలో, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నాయి. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు బిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటులవైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్నీ మొక్కుబడిగా అమలుతున్నాయి. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండగ, బడిబాట, విద్యాపక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండగ.. ఇలా పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే బడి పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఇప్పటికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 500 మందికి పైగా పిల్లలు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలోని ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో నిరక్షరాస్యులు, బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. ఆదిలాబాద్ పట్టణంలో సైతం బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యలోనే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. విద్యాహక్క చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం పేద పిల్లలకు అందడం లేదు. ఐదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువకావడం లేదు. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 అగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని అమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడంతోనే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలుకావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా, బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాది కేడాది బడిబయట పిల్లల సర్వే ఒక్కో రకంగా ఉంటోంది. పిల్లల్ని బడిలో చేర్పించాలి బడి బయట ఉన్న పిల్లలందరినీ తిరిగి బడిలో చేర్పించే బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలంద రూ బడిలోనే ఉండాలి. బడీ ఈడు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమవుతుంది. ఉపాధ్యాయులు బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేలా చూడాలి. -
బస్టాండ్ లో 10వేల నీలిచిత్రాల సీడీలు స్వాధీనం
చెన్నై : కోయంబేడు బస్టాండులో 10వేల నీలిచిత్రాల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబేడు బస్టాండులో 5వీ నంబర్ ప్లాట్ఫాంపై శుక్రవారం ఉదయం రెండు పెద్ద సూట్కేసులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీని గురించి సమాచారం అందుకున్న కోయంబేడు డెప్యూటీ కమిషనర్ మోహన్రాజ్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని సూట్కేసులను తెరచి చూశారు. వాటిల్లో కవర్లు లేకుండా అధిక మొత్తంలో సీడీలు కనిపించాయి. వీటిని పోలీసులు వేసి చూడగా ఇవన్నీ నీలిచిత్రాల సీడీలని తెలిసింది. సుమారు 10వేల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు కనుగొన్నారు. కోయంబేడు బస్టాండు నుంచి వస్తువులు తరలించడం అడ్డుకునేందుకు బస్టాండులో పోలీసులు నిఘా చేపడుతున్నారు. అందువల్ల పోలీసులకు భయపడి ఈ సూట్కేసులను విడిచి వెళ్లి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
పల్లెకు పరుగులు...
ఖమ్మం: ‘సొంత ఊరిలో సర్వే చేయించుకుంటే మంచిదటా.. ఎక్కడ ఉన్నా సర్వే రోజు మాత్రం మన ఊరికి వెళ్దాం.. మంచైనా, చెడైనా మన ఊరికే పోదాం...’ అంటూ వివిధ ప్రాంతాల్లో ఉంటున్న జిల్లా ప్రజలు గత మూడు రోజులుగా సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు ఇంటిబాట పట్టారు. సర్వే కోసం స్వగ్రామాలకు... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, దేశ నలుమూలల ఉన్న ప్రజలు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ‘సర్వే రోజు స్వగ్రామంలో ఉండండి.. నేను కూడా ఆ రోజు మా ఊళ్లోనే ఉంటా’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం, సర్వే అవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పక్షాలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. మూడు రోజులు ముందు నుంచే సర్వేలు నిర్వహించి ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వే రోజు వివరాలు నమోదు చేసుకోకుంటే ఎక్కడ ఇబ్బందులు పడతామోనని ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఇళ్లకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బోనాల పండుగ, రాకీ పండుగలకు వచ్చిన వారు సర్వే ముగిసిన తర్వాతే వెళ్లేందుకు ఇక్కడే ఉండిపోయారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల్లో రద్దీ.. స్వగ్రామాలకు ప్రజలు రాక సందర్భంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో దిగి మారుమూల గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. మంగళవారం సర్వం బంద్ చేస్తామని అధికారులు ప్రకటించడం, మధ్యలో ఆదివారం రావడంతో శనివారం నుంచి ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరారు. సర్వే పుణ్యమా అని జిల్లాలోని ఆరు ఆర్టీసీ బస్డిపోల పరిధిలో ఆర్టీసీకి, రైల్వే శాఖకు ఆదాయం పెరిగింది. మామూలుగా ప్రతీ రోజు ఆర్టీసీకి సరాసరి రూ. 70 లక్షల ఆదాయం లభిస్తుండగా గత మూడు రోజులుగా కోటి రూపాయలకు పైగా వస్తోందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైల్వే శాఖకు రోజుకు రూ. 5లక్షల ఆదాయం ఉండగా మూడు రోజులుగా అది రూ. 10లక్షలు దాటింది. పల్లెల్లో పండుగ వాతావరణం.. పండుగలకు, ఇతర కార్యక్రమాలు తప్ప కుటుంబ సభ్యులు ఒకేసారి స్వగ్రామాలకు రారు. కానీ ఈ సర్వే పుణ్యమాని ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబ సభ్యులు అంతా ఒకేసారి సొంత ఇళ్లకు రావడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్ననాటి స్నేహితులు, బంధువులు, వారి పిల్లలతో సందడి నెలకొంది. అదీ కూడా ఆఫీసులు, కార్యాలయాలు, పిల్లల పాఠశాలలకు సెలవులు రావడంతో ఏం చక్కా.. గ్రామాలకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. -
బస్టాండ్లో ఓ తండ్రి చివరి ఘడియలు
ఆళ్లగడ్డటౌన్, న్యూస్లైన్: లాలించేది అమ్మ.. పాలించేది నాన్న. పిల్లలకు ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా తండ్రి గుండె వేగం పెరుగుతుంది. ఆ బాధ తనదిగా భావించి.. అప్పటికప్పుడు చికిత్స కోసం ఉరుకులుపరుగులు పెడతాడు. కుమారుడు.. కుమార్తెల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిషలు శ్రమిస్తాడు. అలాంటి ఓ నాన్న రోడ్డున పడ్డాడు. చెట్టంత కుమారులున్నా ఆయన వారికి కానివాడయ్యాడు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మును ఎవరికీ తక్కువ చేయకుండా పంచిపెట్టాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఊరుపొమ్మంటోంది.. పాడె రమ్మంటోందన్నట్లుగా బస్టాండ్లో రోజులు లెక్కబెడుతున్నాడు 70 ఏళ్ల ముసలితండ్రి. పట్టణంలోని షామిల్ వీధికి చెందిన జంగాలపల్లె జమాల్కు భార్య, ముగ్గురు కుమారులు సంతానం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కుటుంబ పోషణ కోసం చిన్నాచితకా పనులు చేస్తూ నెట్టుకొచ్చాడు. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేశాడు. ‘నీకేం.. అంతా మగపిల్లలే. చేతికొచ్చాక ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారులే’ అని ఇరుగుపొరుగు వారు అంటుంటే మురిసిపోయాడు. కుమారులు ఎదిగి వస్తుండటం.. ఈయన వయస్సు మీద పడుతుండటంతో పెళ్లిళ్లు చేయాలని భావించాడు. ఇద్దరు కుమారులు స్థానికంగానే ఆటోలు నడుపుతుండగా.. మరో కుమారుడు నంద్యాలలో వ్యాపారం చేసుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం అందరికీ వివాహాలు చేశాక.. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆస్తి పంపకాలు చేపట్టాడు. ముగ్గురికి మూడు భాగాలు.. తనకు, భార్యకు మరో భాగం చొప్పున పంచేశాడు. కుమారులకు భారం కాకూడదనే ఉద్దేశంతో భార్యభర్తలిద్దరూ వేరుగానే ఉంటూ.. కూలి పనులతో పొట్ట పోసుకోసాగారు. మూడేళ్ల క్రితం భార్య క్యాన్సర్ బారిన పడటంతో కుమిలిపోయాడు. ఉన్నంతలో ఆమెను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా అరకొర ఆస్తి కూడా హారతి కర్పూరమైంది. ఇంత చేసినా ఆమెను కాపాడుకోలేకపోయాడు. రెండేళ్ల క్రితం ఆ ‘తోడు’ దూరమైంది. అప్పటికీ కుమారుల మనసు కరగలేదు. ఎలాంటి ఆసరా లేని తండ్రిని చేరదీయాలని ఎవరికీ అనిపించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ ముసలి తండ్రి రోడ్డునపడ్డాడు. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్లు హోటళ్లలో పని చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఐదారు నెలల క్రితం నుంచి అనారోగ్యం బారిన పడ్డాడు. అయినప్పటికీ శ్రమించాడు. వారం రోజుల క్రితం నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తెలిసిన వాళ్లు విషయాన్ని కుమారుల దృష్టికి తీసుకెళ్లగా.. పంపకాలతోనే ఆ బంధం తెగిపోయిందన్నట్లు చెప్పడంతో వారూ ఏమీ చేయలేకపోయారు. తిండి లేక పూర్తిగా నీరసించిన జమాల్ బస్టాండ్లో అచేతనంగా పడిపోయాడు. స్థానికులు ఆహారం తినిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతోంది. కేవలం నీళ్లు తాగుతూ.. తన దైన్యాన్ని తల్చుకొని కన్నీటిపర్యంతమవుతున్నాడు. చిన్నప్పుడు నీకేం అందరూ కుమారులే కదా అని.. స్థానికులు అంటుంటే పడ్డ సంతోషమంతా ఇప్పుడు కన్నీళ్ల రూపంలో కరిగిపోతోంది. అసలే చలి కాలం కావడం.. పైగా అనారోగ్యం కారణంగా కొన ఊపిరితో ఉన్న ఆయనను చూసి అటువైపుగా వెళ్లే ప్రజలు.. బాగా తెలిసిన వారు చలించిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ అటువైపుగా రాకపోకలు సాగించే కుమారులు మాత్రం ఆయనను చేరదీయకపోవడం గమనార్హం. -
విజయవాడ బస్టాండ్లో భారీ చోరీ
-
మహబూబ్నగర్ బస్టాండ్లో పసికందు మాయం
పాలమూరు జిల్లా బస్టాండ్లో ఎనిమిది నెలలు బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. పాల్ కొండ తండాకు చెందిన గిరిజన మహిళ శారద, తన ఇద్దరు కొడుకులతో కలిసి మహబూబ్ నగర్ బస్టాండ్కు తెల్లవారుజామున చేరుకుంది. ఆ సమయంలో తండాకు వెళ్లడానికి వీలుకాకపోవడంతో బస్టాండ్లోనే ఉండిపోయింది. ఆమె పక్కనే ముగ్గురు గుర్తు తెలియని మహిళలు, తమకు బాబును ఇచ్చేయమని బలవంతం చేశారు. శారద ఇవ్వననడంతో వాగ్వాదానికి దిగారు. కాసేపయ్యాక వారు వెళ్లిపోవడంతో పిల్లలు సహా శారద అక్కడే నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి, బాబు కనిపించలేదు. దీంతో శారద కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన భర్త ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటారని, తాను తండాలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నానని చెబుతోంది. తన బిడ్డను వెదికి తెచ్చియమని దీనంగా వేడుకుంటోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నారు.