C Rama chandraiah
-
'టీడీపీ' కి మరో కొత్త తలనొప్పి! ద్వారకా రాకతో..
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.' - చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు వైఎస్సార్ దీవెనలతో.. వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. టీడీపీకి కొత్త తలనొప్పి రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్కుమార్రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
విదేశాంగ నీతిలో కొరవడిన మూల సూత్రాలు
యుద్ధంలో పరాజితులే తప్ప విజేతలెవరూ ఉండరని టాల్స్టాయ్ తన ‘వార్ అండ్ పీస్’ నవలలో ఎప్పుడో చెప్పాడు. చరిత్ర దానిని అనేక మార్లు రుజువు పర్చింది కూడా! ఏడాది దాటిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, నెల రోజులుగా పాలస్తీనా (హమాస్) – ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో ‘పరా జిత’... యావత్ ప్రపంచం అంటే అతిశయోక్తి కాబోదు. అయితే, పాలస్తీనా, ఇజ్రాయెల్ల మధ్య రాజుకొన్న యుద్ధ మూలాలు 40వ దశకం చివర్లోనే ఏర్పడ్డాయి. 1948లో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పడి, ఆక్రమిత ప్రాంతాల నుంచి అరబ్బులను తరమికొట్టడంతోనే పశ్చిమాసియాలో శాంతికి విఘాతం ఏర్పడింది. ‘పాలస్తీనా విమోచన సంస్థ’ (పీఎల్ఓ) ఏర్పడి ఆక్రమిత ప్రాంతాలను తమకు అప్పగించాల్సిందిగా ఇజ్రా యెల్ను కోరింది. అందుకు భారత్తో సహా వివిధ దేశాల మద్దతు కోరింది. అయితే, స్వప్రయోజనాలు, రాజకీయ కార ణాలతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఇజ్రాయెల్ను బలపర్చడమే కాకుండా, భద్రతా మండలిలో ఇజ్రాయెల్ను మందలించే తీర్మానాలన్నింటినీ వీటో చేశాయి. ఈ నేపథ్యంలోనే అరబ్బులు ఇస్లావ్ు ఏకత్వ నినాదాన్ని ఎత్తుకొని ఇస్లా మిక్ దేశాలను తమకు అనుకూలంగా చేసుకోవాలని ప్రయ త్నించారు. కానీ, మత దృష్టితో ఏకం కావడం అన్నది తాత్కాలిక ప్రయోజనాలనే తీరుస్తుందన్నది పాలస్తీనా విష యంలో అనేకసార్లు రుజువయ్యింది. యుద్ధం అన్నది ఓ ఆకస్మిక పరిణామం కాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం అయినా, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధమైనా వాటికి చారి త్రక కారణాలు ఉన్నాయి. ఈ పరిణామాలకు గల మూల కారణాలను అర్థం చేసుకొని తగిన చొరవతో పరిష్కారానికి ప్రయత్నిస్తేనే యుద్ధాలు నివారించబడతాయి. కానీ, ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఐక్యరాజ్య సమితా? పేరుకు తటస్థం అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాలకు కొమ్ముకాసే జేబు సంస్థగా మారిపోయిందన్న అపప్రథను ఎప్పుడో మూటగట్టుకొంది. ఐరాస తన అంతర్జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో వెనుకబడింది. గాజాలోని ఆసు పత్రిపై బాంబులు పడి వందలాది మంది మరణిస్తే.. ఆ క్షణాన్నే ఇజ్రాయెల్ భూభాగంపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బాంబులు వేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదనీ, ఉగ్రవాదుల పనేననీ ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారు. జనావాసాలపై, ఆసుపత్రులపై, విద్యా సంస్థలపై దాడులు చేయ కూడదని ‘జెనీవా ఒప్పందం’ ఉన్నా... వాటిని ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుంటే, నోరు విప్పలేని ఐరాస ఆశక్తత అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్పై ‘హమాస్’ చేసిన దాడిని ఎవ్వరూ సమర్థించరు. కానీ, ఉగ్రవాదుల ఏరివేత ముసు గులో గాజాలోని సామాన్య పౌరులను, ముఖ్యంగా పసి పిల్ల లను హతమార్చడాన్ని ఎవరు హర్షించగలరు?! ప్రపంచీకరణ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పర ఆధారితమైపోయిన నేపథ్యంలో... ఆ యా దేశాల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పు చోటుచేసుకొంది. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి వ్యవస్థ పుట్టుకొచ్చి ఆ యా దేశాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను శాసించే స్థాయికి చేరుకొన్న తర్వాత, అంతర్జాతీయ పరిణామాలు కొన్ని దేశాలకు కొత్త సవాళ్లను తెచ్చి పెట్టాయి. ప్రపంచీకర ణతో లాభం పొందిన చైనా... దక్షిణాసియా దేశాల అంత ర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. బలహీనదేశాలకు ఆర్థిక సాయం అందించే నెపంతో కొన్ని దేశాల విదేశాంగ ప్రతిపత్తిని దెబ్బతీసే యత్నాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. కాగా, భారత్కు సంబంధించినంతవరకు పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్నీ, ఏడాదికి పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా నడుమ జరుగుతున్న యుద్ధాన్నీ ఏ దృక్కోణంలోంచి చూడాలన్న అంశంలో దేశంలోని పాలక పార్టీ బీజేపీకీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అంత ర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాంగ వ్యవహా రాలను కూడా ఆయనే నిర్వహించేవారు. సహజీవన సూత్రం ఆధారంగా అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తామనీ; దానికి అనుగుణమైనదే దేశ తటస్థ వైఖరి అంటూ ఆ ప్రాతిపదికననే అలీన విధా నాన్ని (నాన్ అలైన్డ్) రూపొందించారు. అంతేకాదు... వివిధ దేశాల మధ్య సహృద్భావం, అవగాహనతోనే సమస్యలు పరి ష్కారం అవుతాయితప్ప సైనిక ఒప్పందాలు (పాక్ట్స్), సైనిక కూటములలో తీసుకునే సభ్యత్వాలు పరిష్కారం అందించ వని నిర్ద్వందంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం నుంచి ఆ తర్వాత ఏ ఒక్క ప్రధానమంత్రీ... చివరకు వాజ్పేయి కూడా భిన్నంగా వ్యవహరించలేదు. 1999– 2004 మధ్య దాదాపు ఐదేళ్ల పాటు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి పలుమార్లు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. అయితే, తాజాగా ఇజ్రాయెల్పై హమాస్ దాడికి తెగబడి వందలాది మంది అమాయక ప్రజల్ని విచక్షణా రహితంగా చంపివేసిన దారుణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించి ఇజ్రాయెల్కు సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాలస్తీనాకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసింది. సాధారణంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. కేంద్రానికి బాసటగా నిలవాలి. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల మద్దతు పొందడమే లక్ష్యంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం పట్ల అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పాలస్తీనా–ఇజ్రాయెల్ అంశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇజ్రా యెల్పై హమాస్ దాడి ఓ ఉగ్రవాద చర్య. దీనిని ఖండిస్తూ ఇజ్రాయెల్కు బాసటగా నిలుస్తామని దేశ ప్రధానీ, విదేశాంగ మంత్రీ ఇరువురూ స్పష్టంగా వెల్లడించారు. మరోపక్క గాజా ప్రాంతంలోని బాధితులకు అవసరమైన ఆహారం, ఔషధా లను భారత్ తరలించడాన్నీ బాధ్యతాయుతమైన చర్యగా చూడాలి. ఇటీవల ఐరాస సర్వప్రతినిధి సభలో ‘ప్రజల భద్రత, న్యాయమైన మానవీయ బాధ్యత కోసం’ అంటూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దీనిపై వచ్చిన విమర్శలూ గమనార్హమే. నిజానికి, కీలకమైన ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం పాలక బీజేపీ, అన్ని ప్రధాన రాజకీయ పక్షాలను పిలిచి సమావేశం నిర్వహించాలి. గత 8 ఏళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్ని ఆక్ర మించిన చైనాను నిలువరించలేకపోవడం, నేపాల్తో గత దౌత్యపరమైన సంబంధాలను చెడగొట్టుకోవడం, ఇటీవల కెనడాతో సంబంధాలు క్షీణించడం వంటి అంశాలను చూపించి విదేశాంగ విధానంలో ఎన్డీఏ విఫలమైనట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే, ఓట్ల రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తోందని అది దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని బీజేపీ తిప్పికొడుతోంది. కారణాలేవైనా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మును పటిలా దేశంలో రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఓ చేదు వాస్తవం! సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
గురి తప్పిన లక్ష్యాలు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్? జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి? 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది. ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి. 2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది. ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్లో అప్పుడు భారత్ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది? వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది. రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు. మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ
‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్ ఎస్టేట్. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో స్థిరపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే. కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు. ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
ఎన్టీఆర్ జిల్లాను హర్షించకపోవడం దారుణం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆహ్వానించి హర్షించకపోగా.. దానిని తప్పుబడుతూ సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడాన్ని ఖండిస్తున్నట్టు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు నరనరాన ఎనలేని ద్వేషం ఉందన్న విషయం దీని ద్వారా తేటతెల్లమవుతోందని తెలిపారు. ఎన్టీఆర్ను గద్దెదించిన సమయంలోనే పార్టీలో ఎన్టీఆర్ చిహ్నాలు, ఆయన పేరును శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు యత్నించారని తెలిపారు. కానీ ఎన్టీఆర్ పట్ల గౌరవాభిమానాలున్న తమలాంటి వారు ఆ నాడు ఆ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్న విషయాలను ఆయన గుర్తు చేశారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించక పోవడంపై ఆనాడు ఎన్టీఆర్ వీరాభిమాని నెల్లూరు రమేష్రెడ్డి బహిరంగంగా ప్రశ్నించడంతో.. అది మీడియాలో వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫొటోను సభ్యత్వ పుస్తకాలపై చంద్రబాబు ముద్రించినట్టు తెలిపారు. ఆ తర్వాత రమేష్రెడ్డిని కక్షపూరితంగా చంద్రబాబు దూరం పెట్టేశారని, రాజకీయంగా అణగదొక్కేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు మళ్లీ ప్రజల్లో ప్రచారంలోకి వస్తే.. ఆయన వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వస్తుందని, అప్పుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నదే చంద్రబాబు భయమని తెలిపారు. అందుకే 2004–14 మధ్య ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారని, అయితే 2014–18 వరకు నాలుగేళ్ల పాటు అప్పటి కేంద్ర కూటమిలో భాగస్వామిగా ఉన్నా.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని ఏనాడూ బాబు కోరలేదన్నారు. ఎన్టీఆర్ పేరు మీదున్న అన్న క్యాంటీన్లు తొలగించారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నా.. నిజానికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, కిలో రెండు రూపాయల బియ్యం వంటి పథకాలను తుంగలో తొక్కింది చంద్రబాబే అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు చరిత్ర తెలియదని, వారు చరిత్ర మర్చిపోతారని బాబు అనుకొంటారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుమార్తెలు, కుమారులు హర్షించారని, చంద్రబాబుకు మాత్రం అలాంటి పెద్ద మనసు, సంస్కారం లోపించాయని ధ్వజమెత్తారు. -
పవన్తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. పొత్తుల గురించి ఇప్పుడేమీ మాట్లాడనని మీడియాతో చెప్పిన చంద్రబాబు.. కుప్పం పర్యటనలో పవన్తో పొత్తుకు తాను సిద్ధమేనని, స్పందించాల్సింది అతనేనని చెప్పారన్నారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఓ వైపు సీపీఐ నారాయణ, రామకృష్ణలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జనసేన, బీజేపీల ఉమ్మడి పొత్తును చంద్రబాబు ఎలా ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న కమ్యూనిస్టులను కరివేపాకులా పక్కన పడేస్తాడని అర్థం అవుతూనే ఉందన్నారు. పచ్చి అవకాశవాది అయిన చంద్రబాబుతో చేతులు కలిపితే పవన్ను చరిత్ర క్షమించదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఢీ కొనడానికి చంద్రబాబు వద్ద నోటు బ్యాంకు ఉందేమోగానీ ఓటు బ్యాంకు లేదన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు సీఎం జగన్కి పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. -
చంద్రబాబుకు బోయీలుగా...
ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ ప్రజలు తిరస్కరించిన ‘అమరావతియే ఏకైక రాజధాని’ అనే నినాదాన్ని అడ్డుగా పెట్టుకొని మరోసారి సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలు తెలుగుదేశంకు తోకగా మారడానికి తహతహలాడు తున్నాయి. ఆశ్చర్యమేమంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మళ్లీ తెలుగుదేశం వైపు చూడటం. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు, విశ్వాసాలకు పాతర వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేతులు కలపడం కంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదని తెలిసినప్పటికీ... చంద్రబాబు ఆడే రాజకీయ జూదంలో పావులవడానికి ఈ పార్టీల నేతలు సిద్ధపడటమే విశేషం! చంద్రబాబు చెప్పిన మాటలు, చూపించిన గ్రాఫిక్స్ నమ్మి భూములిచ్చి మోసపోయిన అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యం. పైగా, గత రెండేళ్లుగా ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని పంతం పట్టి దీక్షలు చేశారు. అందులో భాగంగా టీడీపీ ‘అన్నీతానై నడిపించిన అమరావతి రైతుల ఐక్యవేదిక’ తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుకు కుడిఎడమలలో ఘనత వహించిన కామ్రేడ్లు, కాషాయధారులు, కాంగీయులు ఆసీనులై భవిష్యత్తులో తాము వేయబోయే రాజకీయపు అడుగులేమిటో చెప్పకనే చెప్పారు. (చదవండి: వితండవాదం ఆపండి... ప్లీజ్!) బీజేపీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో అంతుపట్టదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తించమని కూడా పార్లమెంటులో స్పష్టంగా చెప్పింది. ఇదంతా రికార్డుల్లో పదిలంగా ఉంది. పైగా, ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉండి రాజకీయ కారణాల వల్ల బయటకొచ్చాక ఆనాడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ‘విలన్’గా చిత్రీకరించి లబ్ధి పొందడానికి ఎంతగా దిగజారాడో బీజేపీ నేతలకు తెలియనిది కాదు. వంద మంది నరేంద్ర మోదీలు కలిసి వచ్చినా తాను ఎదుర్కోగలనని సవాల్ విసిరారు. పాపం రాష్ట్ర బీజేపీ నేతలకు మతిమరుపు కాబోలు, ఆ అవమానాలను మరచిపోయి చంద్రబాబు పల్లకీకి బోయీలుగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ పోషిస్తున్న పాత్ర దారితప్పిన బాటసారి వ్యవహారాన్ని తలపిస్తుంది. కమ్యూనిజం పనైపోయింది... టూరిజం ఒక్కటే మిగిలిందన్న చంద్రబాబు వద్దకు కమ్యూనిస్టులు నిజంగానే టూరిస్టుల్లా ‘క్యూ’ కట్టారు. అలాగే కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం గమనించదగింది. ఒకవైపు బీజేపీతో చెలిమికట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు గేలం వేయడం చంద్రబాబు చాణక్య నీతిలో మరో కోణం. (చదవండి: ‘రియల్’ ప్రయోజనాలకే అమరావతి) తెలుగు సినిమాల్లో హీరో పాత్రలు పోషించే పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో మాత్రం గొప్ప కామెడీ పండిస్తున్నారు. ‘‘నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కును అమ్మేయదలుచుకొంటే... 5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి అమ్మాలి జగన్ రెడ్డి గారు?’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనన్న స్పృహ లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమేనని గత ఏడేళ్ల నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం 126 లక్షల కోట్లకు పెరిగిన విషయం ఆయనకు ఎవరు చెప్పాలి? ఒకప్పుడు తను ఆదర్శంగా తీసుకొన్న (ఇప్పుడు కాదనుకొంటా) తరిమెల నాగిరెడ్డి ఏనాడో ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాశారని పవన్కు ఎవరైనా చెబితే బాగుంటుంది. ఆయనతో వచ్చిన సమస్య ఏమిటంటే తను నిద్రలేచినప్పుడే సూర్యుడు ఉదయించాడని అనుకొంటారు. అమరావతి అంశాన్ని సెంటిమెంట్గా మార్చి ప్రయోజనం పొందడానికి చంద్రబాబు గత ఎన్నికలలోనే పాచికలు విసిరారు. కానీ, అమరావతి చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజలు తెలుగుదేశంను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేశ్ను మట్టికరిపించారు. ‘‘ఈ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అమరావతిని రాసిచ్చేసినట్లే’’ అంటూ గుంటూరు, విజయవాడలలో ప్రజలను రెచ్చ గొట్టారు చంద్రబాబు. కానీ, ఆయనకు లభించిన ఫలితం శూన్యం. (చదవండి: ‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!) అమరావతి ఉద్యమం పేరుతో ప్రవాసాంధ్రుల నుంచి టీడీపీకి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధాని అయితే... అక్కడి రియల్ ఎస్టేట్కు రెక్కలొస్తాయన్న ఆశ కలిగినవారు ఎటూ ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని ప్రజల రాజధాని చేయకుండా... ఆ ప్రాంతంలో బడుగుబలహీన వర్గాల వారు కాలు మోపకుండా ఇన్సైడర్ ట్రేడింగ్తో... సంపన్న వర్గాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ గ్రహించినందునే రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తెలుగుదేశంకు బుద్ధి చెప్పారు. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ప్రజా తీర్పుకు అనుగుణంగా, అమరావతి కుంభకోణాన్ని అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు ‘రియల్ ఎస్టేట్ అభివృద్ధి నమూనా’ను పేదలు హర్షించలేదు. మధ్యతరగతి వారు సమ్మతించలేదు. సామాన్యుల కోసం వైఎస్ జగన్... సంపన్నుల వైపు బాబు ఉన్నారని ప్రజలు గ్రహించారు. ఆ మేరకు పదేపదే ఎన్నికలలో విస్పష్టమైన తీర్పునిచ్చారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ... జగన్కు ప్రజలలో లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలవారు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పేరుతో అందరూ జతకట్టి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పల్లకీకి బోయీలుగా మారుతున్నారు. ఇంతకంటే రాజకీయ దివాళాకోరుతనం మరొకటి ఉంటుందా! (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
చంద్రబాబువల్లే రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హ్రస్వ దృష్టి, ద్వంద్వ ప్రమాణాలే రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటికోసం ఢిల్లీలో పోరాడతామంటూ హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు ఏం ఒరగబెట్టారని సోమవారం ఓ ప్రకటనలో రామచంద్రయ్య ప్రశ్నిం చారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో సాహసోపేతంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ప్రాజెక్టు చే పట్టారని.. అలాగే, దానిపై తెలంగాణలో న్యాయపోరాటం చేయడానికీ సిద్ధపడ్డారన్నారు. నీటి హ క్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని జగన్ నిరూపిస్తున్నారని రామచంద్రయ్య కొనియాడారు. బాబు మాత్రం రాష్ట్ర హక్కుల్ని కాలరాసే విధంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో లేఖ రాయించారని ఎద్దేవా చేశారు. -
టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్ విమర్శలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. టీడీపీతో పవన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని సీఎం జగన్పై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రామచంద్రయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు, చేష్టలు, ఆయన అపరిపక్వ, అపసవ్య ఆలోచనా విధానానికి, అవగాహనాలేమికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా అమ్మాలని చాలాకాలంగా సినీ పరిశ్రమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఆన్లైన్ విధానంలో ఉన్న పారదర్శకతను, ప్రేక్షకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు. దీన్ని సినీ పెద్దలందరూ బహిరంగంగా స్వాగతించారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం బ్లాక్ మార్కెటింగ్, అడ్డగోలుగా సినిమాల టిక్కెట్ల ధరల పెంపునకు అడ్డుకట్ట పడుతుందనే దుగ్ధతో సీఎం జగన్పై విషం కక్కుతున్నారని విరుచుకుపడ్డారు. జనాన్ని పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నాడు పవన్ కల్యాణ్ రోజురోజుకు రాష్ట్రంలో న్యూసెన్స్ వాల్యూగా తయారయ్యారని రామచంద్రయ్య మండిపడ్డారు. 2014లో జనసేన ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పైగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, విధానాలు అవలంబించడం పవన్కు సర్వసాధారణంగా మారిందని ధ్వజమెత్తారు. వామపక్షాలతో చెట్టాపట్టాలేసుకొని.. నెలల వ్యవధిలోనే బీజేపీ గూటికి చేరడం దేశ చరిత్రలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని తెలిపే పవన్ కల్యాణ్ తనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నాడని చెప్పారు. ఆన్లైన్ టిక్కెట్ విధానం వల్ల ఉండే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదని పవన్ను నిలదీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని విమర్శించారు. తెర మీద హీరోగా, రాజకీయాల్లో విలన్గా పవన్ నటిస్తున్నాడని మండిపడ్డారు. 2019లో పవన్ కల్యాణ్కు చెల్లింపులు చేసే విషయంలో స్వయంగా చంద్రబాబు, లోకేశ్ మధ్య విభేదాలు తలెత్తాయని టీడీపీ వర్గాలే వెల్లడించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రజలు పవన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు చోట్లా ఓడించారన్నారు. సమయం రాగానే మరోసారి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని చెప్పారు. -
ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం ఆపాలి : సీ.రామచంద్రయ్య
-
‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. -
రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ అన్నారు
-
‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’
సాక్షి, విజయవాడ: కరోనాపై భయాందోళనలు కలిగించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎజెండా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు, మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసన్నారు. ‘‘అలిపిరి సంఘటన జరిగినప్పుడు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీనే రద్దు చేసిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ బాబు’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాలలో 29 మందిని బలి తీసుకున్న బాబు.. ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడపాలో సీఎం వైఎస్ జగన్కి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘‘ప్రధాని మోదీ సీటులో బాబు కూర్చొని.. దేశంలో కరోనా కట్టడి చేయొచ్చు కదా?. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడిగా వెళ్లి ఈ భూగోళంలో కరోనా లేకుండా తరిమి కొట్టొచ్చు. ఇన్ని కబుర్లు చెబుతున్న చంద్రబాబు, లోకేశ్లు తిరుపతి ఉపఎన్నికలో పక్షం రోజులపాటు గల్లీ గల్లీ తిరిగి ఎందుకు ప్రచారం చేశారు’’ అంటూ రామచంద్రయ్య చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లకుండా అత్యంత బాధ్యతగా వ్యవహరించిన ఏకైక నాయకుడు దేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని సి.రామచంద్రయ్య అన్నారు. చదవండి: 600 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్ -
సంప్రదాయ రాజకీయాలకు చెల్లుచీటీ
గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. సీఎం ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇపుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు అనేక అంశాలలో దేశానికే ఓ రోల్ మోడల్గా నిలుస్తారు. అందుకు పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కరోనా రెండోదశ ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు రెండు నెలలు ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ దేశంలో ఎన్నికల క్రతువు, కుంభమేళా జాతరలను వాయిదా వేయలేదు. వాటి నిర్వహణ కనీసం కోవిడ్ నిబంధనలకు లోబడి జరగలేదు. అయితే, అదే సమయంలో రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొనకుండా.. దానిని రద్దు చేసుకొని తనకు ఎన్నికల లాభం కంటే ప్రజారోగ్యమే మిన్న అని వైఎస్ జగన్ చాటి చెప్పారు. ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని భావిం చారు. అందుకే రాష్ట్ర ప్రజలకు ఆయన అత్యంత ఆప్తుడిగా మారారు. కనుకనే, పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ ఎన్నికలలో ఆయన ఎన్నికల ప్రచారం చేయకపోయినా.. ప్రతిపక్షాన్ని చిత్తుచిత్తుగా ఓడించమని పిలుపు ఇవ్వకపోయినా, ప్రజలు ఆయనను ఆదరించారు. సీఎం జగన్ చిరునవ్వు ఒక్కటే అధికార పార్టీకి ప్రచారాస్త్రమైంది. ఫలితంగానే, అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాన్ని మించి అదనంగా మరో 10 శాతం ఓట్లతో.. స్థానిక సంస్థల ఎన్నికలలో కనీవినీ ఎరుగని చారిత్రక విజయం వైఎస్సార్సీపీకి దక్కింది. ఆచరించి చూపేవారే నాయకులు కరోనా వంటి ప్రాణాంతక వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో రాజకీయాలను ఇంకా సంప్రదాయశైలిలో నిర్వహించడం మంచిది కాదనే సందేశాన్ని వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా స్పష్టం చేశారు. కానీ.. ఎన్నికలలో గెలుపే పరమావధిగా భావించినవారు.. ఎప్పటిలాగానే పెద్దఎత్తున బహిరంగ సభలు, ర్యాలీలతో మోత మోగించారు. జనాన్ని సమీకరించి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. తిరుపతి మొదలుకొని ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఇదే విధానం కనిపించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో ఈ సంప్రదాయ రాజకీయ విధానాలకు బలైంది సామాన్యులే. తిరుపతి ఉపఎన్నికలో వివిధ రాజకీయ పార్టీల భారీ ప్రచారం వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అంతకు ముందు కంటే కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శాసనసభకు జరి గిన ఉపఎన్నిక సందర్భంగా ప్రచార ముగింపు దశలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడి అదృష్టవశాత్తూ కోలుకోగలిగారు. ఆ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అన్ని పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బాధితుల జాబి తాలో చేరిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ మొదలుకొని శశిథరూర్, అధీర్రంజన్రాయ్, ఆనంద్ శర్మ తదితరులు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించడం గమనార్హం! అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభలకు, ర్యాలీలకు హాజరయ్యారు. అగ్రనేతలు లేకుంటే ప్రచార సభలు సాధారణంగానే జరిగేవి. కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదు. ఈ వాస్తవం తెలిసీ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడం జీర్ణించుకోలేనిది. కఠోర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు సరైన మార్గాన్ని దిశానిర్దేశం చేసేవారే నిజమైన నాయకులు. కరోనా కట్టడిలో పాటించాల్సిన జాగ్రత్తల్ని అగ్రనేతలే ఉల్లంఘించినప్పుడు సామాన్యులకు సుద్దులు చెప్పడం ఏ రకమైన నీతి అవుతుంది? ప్రజలను ఓటర్లుగా పరిగణించే వికృత సంస్కృతి మన దేశంలో.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కేవలం ఓట ర్లుగా పరిగణించే వికృత సంస్కృతి కొన్ని దశాబ్దాల క్రితం వేళ్ళూనుకొంది. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండే వర్గాల మధ్య కులచిచ్చు రేపే రాజకీయం చేయడం; జిల్లాలవారీగా కులాల సంఖ్యాబలం బట్టి కొందరికి గొడుగు పట్టడం, మరికొందర్ని విస్మరించడం.. ఈ విధంగా మొత్తం తమ ఎజెండాను రాజకీయలబ్ధి కోసం ఎన్నికల చుట్టూ తిప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ప్రజలుగానే పరిగణిం చిన మహానాయకులు ఇద్దరు. అందులో ఒకరు ఎన్టీఆర్, రెండోవారు డాక్టర్ రాజశేఖరరెడ్డి. ఎన్నికల్లో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొ ద్దని చెప్పేవారు ఎన్టీఆర్. కులమత ప్రాంతాలకు అతీతంగా, చివరకు పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించినవారు వైఎస్సార్. సీఎంగా ఉండగా.. వైఎస్సార్ తమ పట్ల కనబర్చిన ఉదారతను, తాము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపై ఆయన స్పందించిన తీరును ఇప్పటికీ వివిధ పార్టీల నేతలు గొప్పగా చెబుతారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో ఆ ఇద్దరు మహానేతల లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో కనుమరుగవుతున్న విలువల్ని పెంచుతున్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య.. ఓడ దిగాక వోటి మల్లయ్య’ అనే తీరులో అధికారంలో ఉన్న వారు వ్యవహరిస్తారని ప్రజల్లో నెలకొన్న నానుడిని సీఎం వైఎస్ జగన్ చెరిపివేశారు. అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉండటం సామాన్యమైన అంశం కాదు. మారిన రాజకీయ స్వరూపం గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. మీడియాలో కన్పించడం కోసం, ప్రతిరోజూ జిల్లాలకు వెళ్లి.. గతంలో వేసిన శిలాఫలకాలను మళ్లీ మళ్లీ వేయడం, పెట్టుబడుల వేట అంటూ మందీమార్బలంతో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం, పెట్టుబడి సదస్సుల పేరుతో హడావుడి చేయడం.. మొదలైన కృత్రిమ ప్రచారాలకు సీఎం జగన్ దూరంగా ఉంటున్నారు. మంత్రులు, అధికారులను వారిపని వారిని చేసుకోనిస్తున్నారు. అవసరమైన దిశానిర్దేశం చేయడం, సమీక్షలు జరిపి పురోగతిని తెలుసుకోవడం.. వంటి వికేంద్రీకరణ విధానాన్ని పరిపాలనలో ప్రవేశపెట్టారు. ఫలితంగానే, గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలకు అందే సేవలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా, వేగంగా, నిశ్శ బ్దంగా సాగిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఎక్కడా హడావుడి ఆర్భాటం లేదు. గత పాలకుడి మాదిరిగా మొత్తం రాష్ట్రాన్ని తన భుజస్కంధాల మీదనే అతికష్టం మీద మోస్తున్న బిల్డప్లు ఇపుడు కనపడవు. ఇపుడు రాష్ట్రంలో ఓ నూతన రాజకీయ సంస్కృతి వెల్లివిరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్సాహం, చురుకుదనం, జవాబుదారీ తనం నేడు కనిపిస్తున్నాయి. ప్రజలకు అందుతున్న సేవల్లో వేగం, నాణ్యత పెరిగాయి. ముఖ్యమంత్రి ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించడం ఇందుకు తాజా ఉదాహరణ. ‘స్వేచ్ఛ’ అన్ని హక్కులకు మూలం అని, అభివృద్ధికి సాధనం అని డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన విధంగానే నేడు.. ఏపీలో అన్ని వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా! సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ -
ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదు
తిరుపతి తుడా: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీతో పాటు ఆయన జంటపక్షులు పవన్, చంద్రబాబు పోటీపడి ప్రకటించి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ముంచారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతిలో బుధవారం కాపు/బలిజ నేతలతో సమావేశమైన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించుకుందామని వారికి సూచించారు. చంద్రబాబు బలిజల్ని ఓటు బ్యాంక్గా చూసి ఇన్నాళ్లు మాయమాటలతో మోసగించారని చెప్పారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బలిజలు చంద్రబాబుకు గుర్తురారన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎవరు ఓటేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా వృధా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా నినాదం బలపడాలన్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన నినాదం నిలవాలన్నా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఉండాలని చెప్పారు. తనది కమ్యూనిస్ట్ సిద్ధాంతమని చెప్పుకొనే పవన్కల్యాణ్ బీజేపీతో కలవడం సిగ్గుచేటన్నారు. ఈ పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని బలపరిచి ఫ్యాన్గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఆయన గత 3 రోజులుగా నియోజకవర్గాల వారీ బలిజ నేతలతో సమావేశమవుతున్నారు. నైనారు శ్రీనివాసులు, మురళి, జయకృష్ణ, రవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలు రామచంద్రయ్యను సత్కరించారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు శకం ముగిసింది : సి. రామచంద్రయ్య
-
లోకేశ్పై సుమోటోగా కేసు నమోదు చేయాలి
కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే న్యాయస్థానాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించిన నారా లోకేశ్పై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. లోకేశ్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేశ్ చేసిన విమర్శ కూడా న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా ఉందన్నారు. -
‘లోకేష్పై సుమోటోగా కేసు నమోదు చేయాలి’
సాక్షి, అమరావతి : నారా లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత సీ రామచంద్రయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. తణుకులో లోకేష్ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరచడమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయస్థానాలు నడుస్తున్నాయని మాట్లాడటం లోకేష్ అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని సీ రామచంద్రయ్య అన్నారు. కాగా తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుచదవండి: ‘వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని మేధావి’ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు న్యాయ స్థానాలు నడుస్తున్నాయనట్లు మాట్లాడటం ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. లోకేష్ వ్యాఖ్యలపై న్యాయస్థానాలే 'సుమోటో' గా కేసు నమోదు చేయాలి. — C RAMACHANDRAIAH (@crama39111) October 27, 2020 -
జశ్వంత్ సింగ్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలుత సైనికుడిగా దేశానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా జశ్వంత్సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.దేశ రాజకీయాలలో జశ్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత సీ. రామచంద్రయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జశ్వంత్ సింగ్ గొప్ప దేశభక్తుడని, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. -
అమరావతి రైతుల్ని మోసం చేసింది బాబే!
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు అక్రమ మార్గాలలో అడ్డుపడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు.. తాజాగా అమరావతి అంశంపై పెద్దఎత్తున తన మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. అమరావతి రైతులను వ్యవసాయానికి దూరం చేసి వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించాలనుకోవడంతోనే సమస్యలు వచ్చిపడ్డాయి. నిజానికి, అమరావతి రైతులు దీక్ష చేయాల్సింది చంద్రబాబు ఇంటి ఎదుట. శాపనార్థాలు పెట్టాల్సివస్తే.. తమను మభ్యపెట్టి మోసం చేసిన చంద్రబాబునే వారు టార్గెట్ చేయాలి. ఎందుకంటే, అమరావతి రైతాంగానికి నమ్మకద్రోహం చేసింది ముమ్మాటికి చంద్రబాబునాయుడే. ఆయన స్వార్థం, ధనదాహం కారణంగానే అమరావతి రైతులు తమ విలువైన వ్యవసాయ భూముల్ని కోల్పోయారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియనివారికి రియల్ ఎస్టేట్ రుచి మప్పాలని చూశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి చంద్రబాబు రాజధాని కట్టకుండా కాలయాపన చేసినందునే అక్కడ తాత్కాలిక నిర్మాణాలు మినహా చెప్పుకోదగ్గ శాశ్వత కట్టడం ఒక్కటీ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు అమరావతి రైతాంగాన్నేకాదు.. రాష్ట్ర ప్రజలందర్నీ రాజధాని పేరుతో మభ్యపెట్టారు. మోసం చేశారు. అందుకు తగిన ఫలితం ఎన్నికలలో అనుభవించారు. అమరావతి రైతులు తన మీద తిరుగుబాటు చేస్తారనే! తనను నిలదీసి ప్రశ్నించే రోజు వస్తుందనే భయంతోనే హైదరాబాద్లో కూర్చొని.. రాజకీయ స్టీరింగ్ తిప్పుతూ మీడియాలో మాత్రమే చంద్రబాబు కనిపిస్తున్నారు. డొల్ల వాదన చంద్రబాబుకు తెలిసిన అనేకానేక వక్ర విద్యల్లో.. మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం ఒకటి. ఈ మధ్య సోషల్ మీడియా, అదేవిధంగా అనుకూల మీడియా ద్వారా గతంలోని వార్తల్ని, ప్రత్యేకించి ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలను పదేపదే చూపుతూ ఆయనేదో మాట మార్చారన్నట్లుగా వక్రీకరిస్తున్నారు. 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధానిని విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఒక ‘గుడ్ ఫెయిత్’తో వైఎస్ జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ అటవీ భూములు పుష్కలంగా ఉన్న దొనకొండ ప్రాంతం లేదా నూజివీడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. ప్రజలను, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టిస్తూ.. చంద్రబాబు గన్నవరం, నూజివీడు, దొనకొండ.. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒకచోట రాజధాని రాబోతున్నదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో.. 3 పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. కానీ, శివరామకృష్ణన్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే సొంత మనుషులతో ఓ కమిటీ వేసుకొన్నారు. పైగా, ఎటువంటి వెరపులేకుండా శివరామకృష్ణన్ కమిటీ.. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయమని సూచించిందని, ఆన్లైన్ ద్వారా 4 వేలమంది అభిప్రాయాలు కోరితే, అందులో మెజారిటీ ప్రజలు అమరావతికి అనుకూలంగా ఓటు వేశారంటూ పచ్చిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత శివరామకృష్ణన్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం ఆత్మహత్యాసదృశం అంటూ ‘హిందూ’లో ఓ వ్యాసం రాశారు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నది బూటకం ఇక, ‘అమరావతి నిర్మాణం’కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇదొక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, సొంతంగా సమకూరే ఆదాయంతోనే.. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో అమరావతిని కట్టవచ్చునని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు. సొంత నిధుల నుంచి రూపాయి కూడా రాజధానికి అవసరం లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇచ్చిన రూ. 2,500 కోట్లు సరిపోవని, ఇంకా నిధులు ఇవ్వాలని పదేపదే కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం, ప్రధాని నరేంద్ర మోదీని దూషించాల్సిన అగత్యం ఆనాడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుపై ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అది చాలదన్నట్లు రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరణకోసం హడ్కో, ఆసియన్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మొదలైన ఆర్థిక సంస్థలను అప్పులిమ్మని ఎందుకు అర్థించినట్లు?! అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందని అబద్ధం చంద్రబాబు, తెలుగుదేశం నేతలు తాజాగా చేస్తున్న శుష్క ప్రచారానికి పరాకాష్ఠ.. తమ ఐదేళ్లపాలనలో అభివృద్ధి వికేం ద్రీకరణ చేశామనడం. పునర్వ్యవస్థీకరణ బిల్లుననుసరించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు కేటాయించిన రూ. 350 కోట్లు కూడా ఆ జిల్లాల అభివృద్ధికై ఖర్చుపెట్టలేదు. పైగా, చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకు కేంద్రం ఇచ్చిన రూ. 50 కోట్లల్లో కేవలం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి.. మిగతా మొత్తాన్ని దారి మళ్లించారు. రాష్ట్రంలో కరువే భయపడి పారిపోయేటట్లు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని మెజారిటీ మండలాలు కరువుకోరల్లో చిక్కి సతమతం అయ్యాయి. ఈ తప్పిదాలు, వైఫల్యాలు, పాపాలు గమనించడం వల్లనే ప్రజలు చంద్రబాబును ఎన్నికలలో శిక్షించారు. అమరావతి ప్రాంతం ఉన్న రెండు నియోజకవర్గాలు మంగళగిరి, తాడికొండ రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగినవిధంగా గుణపాఠం చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ తరహాలో తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున తమ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని ఆ రెండు నియోజకవర్గాలలో ఎవరిని కదిపినా కథలుకథలుగా చెబుతారు. అవసరం లేకపోయినా హైదరాబాద్ను వీడి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు నేడు ప్రధాన ప్రతిపక్షనేతగా సొంత రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. హైదరాబాద్ నుండి కదలడం లేదు. అమరావతికి వస్తే ఏదో ఒక రోజు రైతులు తన మీద తిరగబడతారన్న భయం ఆయనను వెంటాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు 100 మంది నరేంద్ర మోదీలొచ్చినా, 1,000 మంది కేసీఆర్లొచ్చినా భయపడనని బీరాలు పలికిన చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఏవిధంగా సాగిలపడుతున్నారో అందరూ చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబునాయుడు అనేక విధాలా తాపత్రయ పడుతున్నారు. కొన్ని వ్యవస్థలలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల సహాయసహకారాలను స్వీకరించి.. రాజకీయంగా మళ్లీ ఉచ్ఛదశలోకి రావాలన్న తాపత్రయంతో చంద్రబాబు అనేక రాజకీయ విన్యాసాలు సాగిస్తున్నారు. అభివృద్ధి వికేం ద్రీకరణకు అడ్డుపడుతున్నారు. అయితే, ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబును అమరావతి రైతులే ప్రజాకోర్టులో నిలబెట్టే సమయం ఎంతో దూరంలో లేదు. వ్యాసకర్త మాజీ మంత్రి, సీ రామచందయ్య ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు
కడప కార్పొరేషన్/ సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఒక ముగిసిన అధ్యాయం కాబోతుందన్న ఆందోళనతో తన అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తంటాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శిం చారు. మంగళవారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► బాబుకు భ్రమల్లో బతకడం ఎక్కువైంది. 2014–19 మధ్య కాగితాల్లో చూపిన అభివృద్ధిని ఇప్పుడు మళ్లీ ప్రజలకు చూపిస్తూ సొంత మీడియాలో బాకా కొట్టుకోవడం సిగ్గు చేటు. అమరావతిలో కొన్ని భవనాలు మాత్రమే కట్టి మొత్తం రాజధాని పూర్తయినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ► చంద్రబాబు ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టి నమ్మించారు. ప్రత్యేక విమా నాల్లో ఐదేళ్లపాటు విదేశాలకు పెట్టుబ డుల కోసమని పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. ► భాగస్వామ్య సదస్సులు పెట్టి రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పినా అందులో 2 శాతం కూడా సాధించలేకపోయారు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. ► బాబు అవినీతి ముద్రలు అన్ని జిల్లాల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియనట్లు అమాయకత్వం నటించడం విచిత్రంగా ఉంది. -
స్వీయ తప్పిదాలతోనే ఈ దుస్థితి
రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు తన వ్యక్తిగత సహాయకుడిపై, తదితరులపై తాజా ఐటీ దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? 2050 వరకు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అధికారంలో ఉండగా చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి. వాటి లోతు తెలుసు కాబట్టే బాబు తన అనుయాయులపై ఐటీదాడుల పట్ల వ్యాఖ్యానించకుండా కుక్కిన పేనులా పడిఉంటున్నారు. చంద్రబాబు స్వయంకృత పాపాల పంట పండుతున్నట్లుంది. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు’ ఓ పాపులర్ తెలుగు సినిమాలో విలన్ను ఉద్దేశించి హీరో పలికిన డైలాగ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు, అధికారంలో ఉండగా ఆయనకు తాబేదార్లుగా పనిచేసిన కొంత మంది అధికారులకు సరిగ్గా అన్వయిస్తుంది. 2050 వరకు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. పాపాలు చేస్తే అవి వెంటాడటం, మెడకు చుట్టుకోవడం ఎవరికైనా సహజమే. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబుకు బినామీలుగా, తాబేదారులుగా వ్యవహరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కొందరు వ్యక్తులపై చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కొన్ని వ్యవస్థలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోగలిగిన ‘రాజకీయ కళ’ చంద్రబాబుకు ఉన్న మాట నిజం. కానీ, చంద్రబాబు విద్యల కంటే ‘చట్టం’ గొప్పది. కొంత ఆలస్యం కావచ్చునేమోగానీ.. అక్రమాలను కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు. 15 ఏళ్లపాటు తన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఓ సాధారణ ప్రభుత్వోద్యోగి ఇంటి మీద ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం 5 రోజులపాటు నిర్విరామంగా సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్న ఉదంతంలో రోజులు గడుస్తున్నా పల్లెత్తు వ్యాఖ్య చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం వరకూ.. టీడీపీకి చెందిన వ్యక్తులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో, ఆదాయపు పన్ను ఎగవేసిన ఉదంతాల్లో చట్టం తన పని తాను చేసుకుపోయినా.. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అవన్నీ పనిగట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్నాడంటూ నిందించారు. ప్రస్తుతం.. తన పార్టీకి చెందిన కీలక వ్యక్తులు, వారి బంధుగణం పాల్పడిన అక్రమాలపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తులో భాగంగా దాడులు చేసినప్పటికీ.. చంద్రబాబు మూగనోము పట్టారు. రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు ఐదేళ్ల అవినీతి పాలనలో అడుగడుగునా అవినీతి పుట్టలు పుట్టుకొచ్చాయి. సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉన్నతాధికారులను దగ్గర పెట్టుకొని.. చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు చంద్రబాబు పాల్పడ్డారు. ఒకరిద్దరు అధికారులు ‘సర్వంతామే’ అన్నట్లు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి చంద్రబాబు చెప్పినదల్లా చేశారు. చెప్పనివి కూడా చేసిపెట్టారు. ప్రభుత్వంలోని అనేక పనులను అస్మదీయులకు దఖలు పరిచారు. ఇవన్నీ చేసిపెట్టిన అధికారులు చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా.. వారికి మితిమీరిన స్వేచ్ఛ కల్పించారు. చంద్రబాబు ‘నరేంద్రమోదీ’ని ఏపీ ప్రజల దృష్టిలో విలన్గా చిత్రీకరించడానికి తెర వెనుక అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని నరేంద్రమోదీ, అమిత్షాలపై దారుణమైన పోస్టింగ్లు పెట్టారు. తనకు అనుకూలమైన ఓ దినపత్రికలో నరేంద్రమోదీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఓ మానసిక విశ్లేషకుడితో జుగుప్సాకరమైన రాతలు రాయించారు. విజయవాడలో ప్రజాధనంతో ‘ధర్మదీక్ష’ పేరుతో నిర్వహించిన సభలో సినీనటుడు బాలకృష్ణ.. ప్రధాన మంత్రిని పచ్చిబూతులు తిడుతుంటే.. సీఎంగా ఉన్న బాబు ఆ మాటల్ని ఆమోదిస్తున్నట్టుగా నిర్వికారంగా ఉండటం ‘యూట్యూబ్’లో ఇప్పటికీ కనిపిస్తుంది. సినీ నటుడు శివాజీ అనే వ్యక్తితో ‘గరుడపురాణం’ పేరుతో.. కొన్నాళ్లు రోజువారీ సీరియల్ నడిపించారు. మోదీ.. టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని, అందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఊదరగొట్టారు. దేశ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలన్న ఆశతో చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను, దాంతోపాటు పార్టీ సిద్ధాంతాలను కాలరాసి కాంగ్రెస్ పార్టీతో అంటకాగటం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే గుజరాత్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు రహస్యంగా నిధులు సమకూర్చారన్న వార్త గుప్పుమంది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల సమయానికి.. చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్, జేడి(ఎస్)లకు ఇతోధికంగా సహాయం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. ఆ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ గెలవడంలో నా పాత్ర కూడా ఉంది’’ అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సహకారం అంతటితో ఆగలేదు. చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఊది నరేంద్ర మోదీని గద్దె దించడానికి చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేశారు. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలను దగ్గర చేసి యూపీఏ–3 గొడుగు కిందికి తేవడానికి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో ప్రధానమైనది నిధులలేమితో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి పెద్దఎత్తున ఆర్థిక సాయం చేయడం. ఆ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలలో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారన్న సమాచారాన్ని బీజేపీ పసిగట్టింది. చంద్రబాబు ఏ విధంగా నిధులు సమీకరించారు.. వాటిని ఏ విధంగా ఏయే వ్యక్తుల ద్వారా.. ఏయే మార్గాలలో చేరవేశారన్న పక్కా సమాచారం కేంద్రం వద్ద ఉందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆనాడు చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి. చంద్రబాబు చేసిన అనేక తప్పులు, మోసాలు, పాపాలకు బదులుగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలతో కనాకష్టంగా ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు. ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు చంద్రబాబు ఓటమిలో ఒక పార్శ్వం మాత్రమే. చంద్రబాబు ఓటమిలో రెండో పార్శ్వం ప్రజల తీర్పును వమ్ము చేసి స్వార్థంతో తను, తన అనుచర వర్గం ఆర్థికంగా బలోపేతం కావడానికి అక్రమాలకు పాల్ప డటం. దీనికి చట్ట ప్రకారం శిక్షపడాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రజల దృష్టిని మరల్చడానికి, తానేమీ అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు గత 7 నెలలుగా అధికార వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని 23 గ్రామాలకు చెందిన రైతులతో దీక్షలు, ఉద్యమాల పేరుతో చేయిస్తున్న క్రతువును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాజధాని రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాజధాని రైతులు దీక్షలు విరమించకుండా చంద్రబాబు, ఆయన సృష్టించిన కొంత మంది రెడీమేడ్ నాయకులు వారిని రెచ్చగొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టిన అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు రైతులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి, రైతులు ఉద్యమించాల్సింది చంద్రబాబుకి వ్యతిరేకంగా! ఐదేళ్లలో చంద్రబాబు తమకు ఎందుకు న్యాయం చేయలేదో రైతులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ భూములను కొన్ని సంస్థలకు ఎందుకు కారుచౌకగా కట్టబెట్టాడో, తమకు ఇస్తామన్న భూములను ఎందుకు అభివృద్ధి చేసి ఇవ్వలేదో రైతులు చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అమరావతి వద్దనే లక్ష కోట్లు పెట్టుబడి పెడితేనే 29 గ్రామాల రైతులకు న్యాయం జరుగుతుందా? రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక మంది రైతులు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు చంద్రబాబుకు వంతపాడుతూ రైతులను రెచ్చగొట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలకు గొడుగుపట్టే కొంతమంది ఇతర పార్టీల్లోని అగ్రనేతలు.. అమరావతిపై చంద్రబాబు అనుకూల ధోరణి, వాణిని వినిపించడం సిగ్గుచేటు. చంద్రబాబు విష కౌగిలి కారణంగానే.. ఎంతో చరిత్ర కలిగిన కొన్ని పార్టీలు నామమాత్రంగా మిగిలాయి. చంద్రబాబు విష పరిష్వంగం నుంచి బయటపడకపోతే ఆ పార్టీలను, నాయకులను చరిత్ర క్షమించదు. చంద్రబాబు దళం ఆంధ్రప్రదేశ్ బీజేపీని హస్తగతం చేసుకొని, బాబు ఎజెండాను అమలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ కేంద్ర నాయకత్వంపై ఉంది. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును రాజకీయంగా ఆదరిస్తే అంతే సంగతులు! వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య -
చంద్రబాబు ఖచ్చితంగా జైలుకు వెళతారు
-
రహస్య అజెండాతోనే అమరావతి ఏర్పాటు
కడప కార్పొరేషన్: తన సంపదను పెంచుకోవడానికి చంద్రబాబు రహస్య అజెండాతోనే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తన రూ.రెండు లక్షల కోట్ల ఆస్తులు పోతాయనే బెంగతోనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సీఎం వైఎస్ జగన్పై ఉన్న వ్యక్తిగత ద్వేషాలతోనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి, సొంత సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి చేసే ఇలాంటి ఉద్యమాలు ఎక్కువ కాలం కొనసాగవని చంద్రబాబును హెచ్చరించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు, వర్గాలు ప్రయోజనం పొందుతాయన్నారు. ఒకేచోట అభివృద్ధినంతా కేంద్రీకరించడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. ఫలితంగా విభజనతో హైదరాబాద్ను కోల్పోయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ఇదే ఫార్ములాను చంద్రబాబు అమరావతిలో కూడా అమలు చేయాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులన్నీ తీసుకుపోయి అమరావతిని అభివృద్ధి చేసి, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తన అనుచరులు కొన్న భూములకు విలువ పెంచాలని ప్రయత్నించారన్నారు. తన సంపదను పెంచుకోవడం, సృష్టించుకోవడమే ఆయనకు తెలుసని ఎద్దేవా చేశారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య పెట్టాలని చెప్పినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆ కమిటీ నివేదిక రాక ముందే నాటి మంత్రి నారాయణతో కమిటీ వేసి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. మార్టూరు–వినుకొండల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని.. గుంటూరు, విజయవాడ మధ్య వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. అమరావతిపై చంద్రబాబు చేయిస్తున్న ఆందోళన భోగి మంట మాత్రమేనని కొట్టిపారేశారు. టీడీపీకి, బీజేపీకి తడికెలాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తయారయ్యారని విమర్శించారు. -
అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు
-
భ్రమల్లో బాబు, పవన్ ద్వయం!
సీఎం జగన్ చేస్తున్న మంచి పనుల వల్ల ప్రజలకు తాము శాశ్వతంగా దూరమైపోతామన్న భయం చంద్రబాబు, పవన్కల్యాణ్లలో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న వ్యూహంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కేంద్రం మధ్య అంతరం పెంచే వ్యూహంలో భాగంగానే బీజేపీ ముసుగులు ధరించిన చంద్రబాబు ఏజెంట్లు వైఎస్సార్సీపీని బెదిరించాలని ప్రయాస పడుతున్నారు. కేంద్రం కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు.. ప్రతి ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎవరి పరిధిలో వారు రాజ్యాంగబద్ధంగా పని చేస్తారు. చంద్రబాబు తన ఏజెంట్ల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద కుట్రలకు పాల్పడాలనుకుంటే.. అది వికటించి వారికే బెడిసి కొడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అమెరికా ఒకప్పుడు సీఐఏ (సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) ఏజెంట్లను కొన్ని వ్యవస్థల్లోకి నేర్పుగా చొప్పించి ఎవరికీ అనుమానం కలుగని రీతిలో కుట్రలకు పాల్పడి తన ప్రత్యర్థులను దెబ్బతీసేది. రష్యా గూఢచారి వ్యవస్థ కేజీబీలోకి కూడా చొచ్చుకుపోయేంత నేర్పుగా చాపకింద నీరులాగా అది పనిచేసేది! లక్ష్య సాధనకు ఎంతకైనా తెగించడం సీఐఏ వ్యవహార శైలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కొందరు కొన్ని వ్యవస్థల్లోకి చొరబడ్డారు. వీరి లక్ష్యం బాబు చేసిన అక్రమాలకు తాను జైలుకు పోకుండా రక్షించడం, వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం. ఈ లక్ష్యంలో భాగంగా బీజేపీలోకి చేరిన సదరు బాబు ఏజెంట్లు బీజేపీ భుజాలపై తుపాకులు పెట్టి వైఎస్సార్సీపీపై కాల్పులు జరిపే దుస్సాహసం చేస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న మరో ముసుగు వీరుడు జనసేన పవన్ కల్యాణ్దీ అదేదారి. చేగువేరా, జార్జిరెడ్డి వంటి వామపక్ష భావజాలాలు కలిగిన నాయకులు తనకు స్ఫూర్తి అని చెప్పిన పవన్ కల్యాణ్ తాజాగా అమిత్షా పట్ల వ్యామోహం పెంచుకున్నారు. పైగా ప్రజా తీర్పును అపహాస్యం చేసే రీతిలో 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు విస్మయంగా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిద్ర కరువు గత 6 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనాపరంగా తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు ప్రతిపక్షాలను నిద్రకు దూరం చేస్తున్నాయి. ఎన్నికల వాగ్దానాలను అధికారంలోకి రాగానే ఒక్కటొక్కటిగా నెరవేర్చడం గతంలో ఎవరికీ సాధ్యం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ఎందులోనూ రాజీపడకుండా అమ్మఒడి, రైతుభరోసా, గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మొదలైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మద్య నియంత్రణలో భాగంగా దాదాపు 45,000 బెల్ట్ షాపులను, పర్మిట్ రూమ్లను ఎత్తివేసి మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. సీఎం జగన్ చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ప్రజలకు తాము శాశ్వతంగా దూరమైపోతామన్న భయం చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లలో స్పష్టంగా కన్పిస్తోంది. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న వ్యూహంతో పనిచేస్తున్నారు. ఈ ఆరు నెలల్లోనే అనేక అసత్యాలను, అభూతకల్పనలను వ్యాప్తి చేయడానికి నానాతంటాలు పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ, ఆ నైజం, సంస్కారం చంద్రబాబులో లేదు. తనకెదురైన దారుణ ఓటమికి తన తప్పేమీ లేదన్నట్లు చంద్రబాబు నటిస్తున్నారు. నిజానికి, బాబు ఓటమిని అందరూ ముందుగానే గ్రహించారు. ఐదేళ్లపాటు చంద్రబాబు చేసిన తప్పులు అనంతం. రైతాంగానికి, మహిళలకు, యువతకు చేసిన దగా, అలాగే స్వయంగా పాల్పడిన అవి నీతి, పార్టీ నేతల దోపిడీ, రాజ్యంగేతర శక్తిగా మారిన లోకేశ్ చేసిన అధికార దుర్వినియోగం, సామాజిక న్యాయానికి పాతర వేసి ఆశ్రిత పక్షపాతానికి తెర తీయడం, ఇంకా.. ఓటుకు నోటు కేసు కారణంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం, ప్రతిపక్షపార్టీని దెబ్బతీయడానికి ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొని, కొందర్ని రాజ్యాంగ విరుద్ధంగా మంత్రుల్ని చేయడం.. ఇదంతా ఒక ఎత్తయితే.. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై చేసిన అనైతిక దాడి మరోఎత్తు. తన వైఫల్యాలను, పాపాలను అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుల మీద నెట్టివేసి మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు అతినీచమైన దుష్ప్రచారానికి ఒడిగట్టడం దేశం యావత్తూ వీక్షించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చెలిమి కుదుర్చుకొని.. మోదీ వ్యక్తిత్వ హననానికి చంద్రబాబు తెగబడ్డారు. మోదీ, అమిత్షాల చెర నుండి విముక్తం చేయకపోతే దేశానికి భవిష్యత్తు లేదంటూ చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో వెళ్లిన ప్రతిచోటా వారిని విమర్శించడం తెలి సిందే. కాంగ్రెస్ అధిష్టానానికి వనరులు సమకూర్చడం సహా ఆ పార్టీకి చేయగల ప్రతి సహాయం అందించారు. కానీ, ప్రజల విజ్ఞత కారణంగా ఎన్నికల్లో చంద్రబాబు పాచికలేవీ పారలేదు. ఊసరవెల్లిని మించి రంగు మారుస్తున్న బాబు తాజాగా, తాను చేసిన ద్రోహాన్ని, దిగజారుడు ప్రచారాన్ని మర్చిపోయి ఉంటారనే ఆశతో చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే వేగంగా తన రంగును మార్చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ హస్తాన్ని’ వదిలేశారు. మోదీ, షాలను ప్రసన్నం చేసుకోవడానికి తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారు. చంద్రబాబు ఆశిస్తున్నది.. బీజేపీకి దగ్గర కావడంతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కేంద్రం మధ్య అంతరం పెంచడం. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ ముసుగులు ధరించిన చంద్రబాబు ఏజెంట్లు బీజేపీ భుజాలపై తుపాకీ పెట్టి వైఎస్సార్సీపీని బెదిరించాలని ప్రయాస పడుతున్నారు. చంద్రబాబు గూడుపుఠానీకి ఓ పత్రికాధిపతి సహకారం ఉంది. వైఎస్ జగన్, కేసీఆర్, మోదీల ఓటమికి కృషి చేసిన సదరు పత్రికాధిపతి బీజేపీకి అత్యధికంగా సీట్లు రావడంతో వెంటనే గేరు మార్చారు. బీజేపీని భుజానకెత్తుకున్నారు. తాను ఏమి రాసినా తనకు బీజేపీ అండ ఉందన్న సంకేతాలు పంపిస్తూ జగన్, కేసీఆర్ల మీద విషం చిమ్ముతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రధానిని, బీజేపీ నేతల్ని కలిసినా.. ఏదో జరిగిపోతోందన్న ప్రచారం సాగించడం వెనుక ఇరు పార్టీలమధ్య అంతరాన్ని పెంచే కుట్ర ఉంది. బీజేపీ ‘బూచి’కి భయపడేదెవరు? రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే బాధ్యతగల ప్రతిపక్షపార్టీగా సూచనలు, విమర్శలు చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ, అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా బీజేపీ ముసుగులు ధరిం చిన తెలుగుదేశం ఏజెంట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు అందర్నీ విస్తుగొలుపుతోంది. సీఎం జగన్కి ఉన్నది ప్రజాబలం, నైతికబలం, సిద్ధాంతబలం. తెలుగుదేశం, జనసేన మాదిరిగా పార్టీ, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ ఎన్నడూ పార్టీ విధానాలను మార్చలేదు. ఊసరవెల్లిలా రంగులు మార్చలేదు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఉండగా.. ప్రత్యేక హోదా కోసం ప్రజాస్వామ్యయు తంగా దీక్షలు చేశారేతప్ప.. చంద్రబాబులా దొంగ దీక్షలు నిర్వహించి ప్రధాని మోదీని నీచంగా తిట్టించలేదు. మీడియాలో ఆయనను కించపరుస్తూ కథనాలు రాయించలేదు. ప్రారంభం నుంచీ.. ఎక్కడా విధానాల్లో రాజీపడలేదు, మడమ తిప్పలేదు. ఎన్నికలముందు బీజేపీతో ఎలాంటి విధానం ఉందో.. ఫలితాల తర్వాత కూడా వైఎస్సార్సీపీ వైఖరిలో మార్పులేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో సీఎం జగన్ ఎలాంటి మొహమాటాలకు పోవడంలేదు. ‘నీతిఆయోగ్’తో జరిగిన తొలి సమావేశంలోనే, ప్రధాని సమక్షంలోనే సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు, విభజన బిల్లు ప్రకారం నెరవేర్చాల్సిన హామీలు ఏమిటో తేటతెల్లం చేశారు. నీతిఆయోగ్కు సమర్పించిన 98 పేజీల నివేదికలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంతో వైఎస్సార్సీపీ సఖ్యతను కోరుతున్నది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలని నమ్ముతున్నది. పరస్పర సహాయ సహకారాలతో అభివృద్ధిపథంలోకి వడివడిగా అడుగులు వేయడం వైఎస్సార్సీపీ లక్ష్యం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేయబోతున్నట్లు ప్రజల్లో అనుమానాల్ని, అపోహల్ని సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వానికి.. అది కేంద్రం కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు.. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎవరి పరిధిలో వారు రాజ్యాం గబద్ధంగా పని చేస్తారు. చంద్రబాబుకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. కనుకనే ఐదేళ్లలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. బీజేపీ కూడా తను చూపిన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందనే ఆశతో చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా బీజేపీ ముసుగు వేసుకున్న చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఏజెంట్లు తెరచాటు వ్యవహా రాలు నడుపుతున్నారు. చంద్రబాబు తన ఏజెంట్ల ద్వారా ప్రజాబలం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద కుట్రలకు పాల్పడాలనుకుంటే.. అది వికటించి వారికే బెడిసి కొడుతుంది. తస్మాత్ జాగ్రత్త! సి. రామచంద్రయ్య మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి.. నిద్రపోయావా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కొన్ని రోజులుగా కనుమరుగైన పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు సూచనల మేరకే రోజుకొక ముసుగు ధరించి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గురువారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు. చంద్రబాబు బినామీ కల్యాణ్, రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి, టీడీపీ హయాంలో అవినీతి జరుగుతుంటే నిద్రపోయావా? అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా వామపక్షాలతో కలిసి ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన సూచనలతోనే బీజేపీ చంకనెక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అభిమానం లేక పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందిన నీవు, నీ స్థానం ఏంటో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తూ, జగన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడతావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది ఎవరని తిరిగి ప్రశ్నించారు. గతంలో ఇంగ్లీష్లో ట్వీట్లు పెట్టినప్పుడు తెలుగు చచ్చిపోయిందా? అంటూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంపై పవన్ చేసిన అనవసర రాద్ధాంతాన్ని కొట్టిపారేశారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలని అనడం సిగ్గుచేటని, వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అవగాహన లోపంతో చేస్తున్నారనేది బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. -
సాగిలపడిన ‘బాబు’ రాజకీయం
మెర్జర్లు, ఎక్విజిషన్లు అన్నవి ఒకప్పుడు ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు విలీనాలు, ఎక్విజిషన్లు, టేకోవర్లు అన్నవి రాజ కీయ రంగంలో ఎక్కువయ్యాయి. సిద్ధాంతాల ప్రాతిపదికన, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇవి జరిగితే ఎవరూ తప్పు పట్టరు. అయితే, ఒక కంపెనీ మెజార్టీ వాటాలను మరో కంపెనీ దక్కించుకొని అంతి మంగా సదరు కంపెనీని తమలో కలిపేసుకునేవిధంగా.. పార్టీ కీలక నేతల్ని లాక్కొని చిట్టచివరకు గంపగుత్తగా ఆ పార్టీ మొత్తాన్ని తనలో విలీనం చేసుకొనే ప్రక్రియకు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) శ్రీకారం చుట్టి చాలాకాలం అయింది. బీజేపీ దూకుడుకు నేడు అనేక రాజకీయ పార్టీలు కకావికలం అవుతున్న దృశ్యం దేశవ్యాప్తంగా గోచరిస్తున్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బలహీనతలను ఆధారం చేసుకొని దానిని తమలో విలీనం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు తెలుగుదేశం అధినేత సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పడానికి నిర్ధిష్టమైన ఆధారాలు, ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 2009 తర్వాత తెలుగుదేశం పార్టీకి సర్వం తామే అన్నట్లు వ్యవహరించిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు మరో తెలుగుదేశం ఎంపీ అయిన టి.జి. వెంకటేష్లు బలమైన కారణాలతోనే బీజేపీలోకి చేరారు. తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించిన అంశంపై తెలుగుదేశం స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీనిలో ఏదో గూడుపుఠాణీ ఉన్నదని అప్పుడే అనుమానం కలిగింది. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో మరికొంతమంది బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలొస్తున్నా.. చంద్రబాబు తనకేమీ పట్టనట్లు నిర్వికారంగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణలో అయితే ఒకరిద్దరు నాయకులు మినహా టీడీపీ దాదాపుగా బీజేపీలో విలీనం అయినట్లుగానే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు చేసిన హడావుడిని గుర్తుచేసుకోవాల్సి ఉంది. తమిళనాడు వెళ్లి ఏప్రిల్ 16, 2019న చెన్నైలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘‘నా పోరాటం ఏపీలో గెలుపు కోసం కాదు.. దేశం కోసం. అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆయన పాలనకు ముగింపు పలికే వరకు విశ్రమించను. ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈసీ తీరు, ఈవీఎం అవకతవకలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని ప్రకటించారు. వెళ్లిన ప్రతిచోటా దాదాపుగా ఈ విధంగానే మాట్లాడారు. నరేంద్రమోదీ దేశానికి పట్టిన అరి ష్టంగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మోదీ లున్నారంటూ.. వైఎస్ జగన్, కేసీఆర్, నరేంద్ర మోదీలను నీచంగా తిట్టారు. అయితే, ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ గెలుపును, ఏపీలో వైఎస్సార్సీపీ ఘన విజయాన్ని చూసిన చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ విమర్శలు ఎంతదూరం వెళ్లాయంటే.. ఓటర్లకు పంచేందుకు నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోనే డబ్బు తీసుకువెళుతున్నారని ఆరోపించారు. ‘నమో టీవీ’ పేరుతో సొంత చానెల్ పెట్టుకొన్నారని, ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలతో నరేంద్ర మోదీ ప్రత్యర్థుల్ని అణచివేస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. తెలుగునాట చంద్రబాబుకు అనుకూలమైన ఓ దినపత్రిక ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపర్చేవిధంగా ‘‘నరేంద్ర మోదీకి సెంటిమెంట్లు లేవు, కుటుంబం లేదు, సొంత భార్యను వదిలి వేసినవాడికి ప్రజలంటే ఏమి అభిమానం ఉంటుంది?’’ అంటూ వికృత రాతలకు పాల్పడింది. రఫేల్ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేసిందని, పాక్లో ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ దాడుల్లో 300 మంది చనిపోవడం.. హాలీవుడ్ సినిమా కథలో మాదిరిగా ఉందంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ఈ 5 నెలల్లో ఏ ఒక్క జాతీయ అంశంపైన కూడా నోరు విప్పలేదు. అస్సాంలో అమలు చేసిన ‘జాతీయ పౌర పట్టిక’ అంశం మొదలుకొని ఆర్థిక మాంద్యం వరకూ అనేక వివాదాస్పద అంశాలలో బీజేపీని తప్పుపట్టే అవకాశం ఉన్నా.. చంద్రబాబుకు మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. జమ్మూకశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు విషయంలో బీజేపీ కోరకపోయినా.. తెలుగుదేశం మద్దతు పలకడం గమనార్హం. చివరకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగితే జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబునాయుడు స్పందించలేదు. ఎన్ని కల సమయంలో చంద్రబాబునాయుడు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో ఏపీలో ఎన్నికల ప్రచారం చేయించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచింది. ఆయనను పరామర్శించడానికి రాహుల్గాంధీ, సీతారాం ఏచూరి, డి.రాజా వంటి కాంగ్రెస్, వామపక్ష నేతలు చొరవచూపించారు. ఆయన హౌస్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. కానీ.. చంద్రబాబు చిన్న ప్రకటన చేయలేదు. బీజేపీకి, ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ వేరొకటి ఉంటుందా? 100 మంది మోదీలు వచ్చినా తననేమీ చేయలేరని హూంకరించిన చంద్రబాబుకు నేడు నరేంద్రమోదీ పేరు ఎత్తితే నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ అస్థిత్వం కంటే ప్రస్తుత పరిస్థితుల్లో తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఐదేళ్ల తన పరిపాలనలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణాలు బయటపడితే.. తను జైలుకు వెళ్లడం త«థ్యం అని ఆయనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. చంద్రబాబునాయుడు మనుషులతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రస్తుతం ఓ ‘‘ట్రోజన్ హార్స్’’గా తయారైంది. బీజేపీని మొదట్నుంచీ నమ్ముకున్న నాయకుల్ని బయటకు పంపి బీజేపీపై పట్టు సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలి గించాలన్నది చంద్రబాబునాయుడి దురాలోచనగా కనిపిస్తున్నది. నాలుగు దశాబ్దాల రాజకీయం తన సొంతం అని చెప్పుకొనే చంద్రబాబునాయుడు రాజకీయంగా అత్యంత హీన స్థితికి చేరారు. అయితే, చంద్రబాబును బీజేపీ చేరదీస్తుందా? చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో చేరి తెలం గాణ కాంగ్రెస్ కోలుకోలేనంత తీవ్రంగా నష్టపోయింది. ఏపీ బీజేపీ చంద్రబాబు ఎత్తుగడలు, టక్కుటమార విద్యలకు బలికాకుండా జాగ్రత్త పడుతుందా? సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
చివరికి ప్రజాస్వామ్యమే గెలిచింది
-
‘టీడీపీకి పెయిడ్ ఆర్టిస్ట్గా పవన్’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్గా మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య విమర్శించారు. సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం పవన్కు తెలియదని, చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్ను పవన్ చదివడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలు అప్రతిష్ట పాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ల విజన్ తమకు అవసరం లేదన్నారు. నవరత్నాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని, వాటిని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు దోచుకున్న అవినీతి సొమ్ము ప్రతి పైసా కక్కిస్తాం. ప్రజలకు ఏది మంచి చేయాలో అదే చేస్తాం. పవన్ మాటలో అర్థం లేదు. అమ్మఒడి పథకం మంచిదా కాదా అన్నది పవన్ స్పష్టం చేయాలి. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మఒడి వర్తించేలా చూడలాన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించే దమ్ము పవన్ కళ్యాణ్కు లేదు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలేదు. అంతలోనే విమర్శలు చేయడం సిగ్గుచేటు. పోలవరం ప్రస్తుతం వరదల్లో ఉంది. వరదనీటిలో పనులు ఎలా చేస్తారో కూడా కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు అని సాక్ష్యత్తు ప్రధానినే విమర్శించారు. కులం లేదు మతం లేదు అన్న పవన్ పక్క పార్టీల్లో కులాల గురించి లెక్కలు వేస్తున్నారు. జనసేన టీడీపీకి బీ టీమ్ అయింది. పంది కొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్న టీడీపీ నేతలను పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని ప్రశ్నించారు. -
‘అయ్యన్న పాత్రుడితో అలా మాట్లాడించింది బాబే’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి అయ్యన్న పాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మరో 30 ఏళ్లు వైఎస్సార్సీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యింది.. అలానే ఏపీలో కూడా త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని హత్య చేస్తే.. ఎందుకు మీడియాలో రాలేదు.. ఎందుకు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండి పడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో చంద్రబాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాడి చేస్తే బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోడెల అరాచకాలపై సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని.. జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. జగన్ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడదాం. అందుకు బాబు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ట్రాప్లో బీజేపీ
కడప కార్పొరేషన్: రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం చంద్రబాబు సృష్టించిన ట్రాప్లో పడినట్లుగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. చంద్రబాబు ఏది మాట్లాడితే వారూ అదే మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే అయిందని, ఈ దశలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. బాబు పాలన తమకు వారసత్వంగా వచ్చిందని, దివాళా తీసిన ప్రభుత్వాన్ని తాము చేపట్టామని చెప్పారు. టీడీపీ మొదలు పెట్టిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నామని, ఇందుకు బీజేపీ సహకరించాలని కోరారు. ఇసుక పాలసీ చాలా క్లిష్టతరమైనదని, దీనిపై అధ్యయనం చేసి అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు ప్రతినిధి అయితే.. జగన్ ప్రజలకు మాత్రమే ప్రతినిధి అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోలేదని, బాబు దోపిడీ మాత్రమే ఆగిపోయిందన్నారు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిందే చంద్రబాబని, తద్వారా జైళ్లకు పోకుండా ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ నేతలకు బీజేపీ షెల్టర్ జోన్లా తయారైందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రామచంద్రయ్య వివరించారు. -
ఆవు కాదు.. దున్నపోతని తెలిసి ఓడించారు
సాక్షి, అమరావతి: పాలిచ్చే ఆవు అని భావించి.. 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు.. కానీ బాబు తన్నే దున్నపోతని తెలియడంతో ఓడించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ.. చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు గురువారం రామచంద్రయ్య ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజల్నే బాధ్యుల్ని చేసిన ఏకైక నేత చంద్రబాబే అన్నారు రామచంద్రయ్య. పదేపదే ప్రజల విజ్ఞతను ప్రశ్నించడం.. ‘ఎన్నో చేస్తే.. 23 సీట్లే ఇచ్చారు’ వంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బాబు ప్రజా తీర్పును కించపరుస్తున్నారని ఆయన మండి పడ్డారు. టీడీపీకి భవిష్యత్తు లేదనే నిర్థారణకు వచ్చి అనేక మంది నేతలు ఆ పార్టీని విడిచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు గత ఐదేళ్ల పాలన ఎన్నో అనుభవాలు నేర్పిందన్నారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భారీ నిధులు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రిని, హోం మంత్రిని కలిసి వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారని రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీలో పర్యటిస్తుంటే.. చంద్రబాబు మతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లి, తనపై మోదీకి ఫిర్యాదు చేశారని బాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారు.. ఆయన మానసిక స్థితి సరిగా ఉందా అని రామచంద్రయ్య అనుమానం వ్యక్తం చేశారు. అంటే తాను తప్పులు చేసినట్లు చంద్రబాబు ఒప్పుకొన్నట్లేనా అని ఆయన ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు.. మానసిక స్థితిని పరీక్ష చేయించుకోవడం మర్చిపోయారంటూ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు -
రాష్ట్రాల ప్రయోజనాలు పట్టని బడ్జెట్
కడప కార్పొరేషన్: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపయోగంగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. శనివారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాలను మోదీ దృష్టిలో పెట్టుకోలేదన్నారు. ఆదాయ పెంపే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు వేయడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు. విభజన చట్టంలోని గిరిజన, సెంట్రల్, పెట్రోలియం యూనివర్సిటీలకు నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. పోలవరానికి రూ.52వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రాజధానికి నిదుల కేటాయింపు జరగలేదన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విధాన పరమైన చర్యలు చేపట్టకపోగా, పెట్రోల్, డీజిల్పై సుంకం విధించి సామాన్యుని జీవితం దుర్భరం చేశారని మండిపడ్డారు. రైతాంగానికి అదనంగా చేసిందేమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారో చెప్పలేదన్నారు. సామాన్య మానవుని జీవన ప్రమాణాలు పెంచే వ్యవస్థను తీసుకురాకుండా ఆదాయం ఎలా పెంచుతారని ప్రశ్నించారు. బాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదు తాను ఎందుకు ఓటమిపాలయ్యాడో తెలుసుకోలేని చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదని సీఆర్సీ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు అప్పుడే విమర్శలు చేస్తూ తన నైజాన్ని చాటుకున్నారన్నారు. మీడియాను ఎదుర్కొనే సత్తా లేక లోకేష్ ట్వీట్లపైన బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్ పాల్గొన్నారు. -
కేసుల భయంతో బాబు అండ్కో డ్రామా
వైవీయూ (వైఎస్ఆర్ జిల్లా) : కేసుల భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. గురువారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు తన పదవీ కాలంలో చేసిన వికృత చర్యల వల్ల ప్రజాభిమానం కోల్పోయి ఘోర పరాజయం పొందాడన్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, అక్రమాలపై విచారణ చేపడితే తనకు శిక్ష ఖాయమని భావించి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి తనపై కేసులు లేకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరగాళ్లు, బ్యాంకులను లూటీ చేసినవారు, స్మగ్లర్లు తన అనుయాయులైన టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి తనపై చర్యలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడని చెప్పారు. ఇందుకు నిదర్శనం గతంలో ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు తన సన్నిహితులైన నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటివారిని టీఆర్ఎస్లోకి పంపిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. -
బాబు సూచన మేరకే బీజేపీలో చేరుతున్నారు
సాక్షి, కడప : చంద్రబాబు సూచన మేరకే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు బాబు ఎన్నో కుట్రలు కుయుక్తులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు తన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందుకే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరాలని చంద్రబాబు వారికి పరోక్షంగా సూచించారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ముందు మోదీ పునరాలోచించాలన్నరు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. అతినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వకూడదని రామచంద్రయ్య కోరారు. తన అనుచర వర్గాలను కాపాడుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలను బీజేపీలో చేర్చేందుకే బాబు విదేశి పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరేవారిని ముందు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని మోదీ సూచించాలన్నారు. బాబు లాంటి వారిని ప్రోత్సాహిస్తే ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. -
‘మీరు తిన్న ప్రతి రూపాయి జగన్ కక్కిస్తారు’
సాక్షి, వైఎస్సార్ : గత 5 ఏళ్ల చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు గాడి తప్పించారని ధ్వజమెత్తారు. రామచంద్రయ్య మాట్లాడుతూ.. 'అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు తన కళ్ల ముందు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడంతో అవమానం భరించలేకపోతున్నారు. వైఎస్ జగన్ స్పష్టమైన పరిపాలన అందిస్తారు. రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలకు తావివ్వకుండా చూడాలని హోంమంత్రి సుచరితను ముఖ్యమంత్రి ఆదేశించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నేరవేరుస్తారు. చంద్రబాబు తన కేబినెట్లో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను మరిచారు. వైఎస్ జగన్ అలా కాకుండా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం పాటించారు. జగన్కు అనుభవం లేదని అవహేళన చేశారు. ఈరోజు జగన్ పాలన చూసి టీడీపీ నాయకులకు వణుకు మొదలైంది. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, హోంగార్డులకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో సంతోషాలు తెచ్చారు. జగన్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు ప్రశంసించాల్సింది పోయి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. మీరు తిన్న ప్రతి రూపాయి విచారణలో జగన్ కక్కిస్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, ప్రజల ఓట్లు తొలగించావు. డేటాను చోరీ చేశావు. ఆంధ్ర ప్రజలు మంచి వారు కాబట్టి చంద్రబాబు చేసిన అరాచకాలకు ఇంకా ఘోరంగా అవమాన పరచలేదు. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పకుండా విచారణ చేయిస్తారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కూడా రైతులకు ఎటువంటి మేలు చేయలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన జిమ్మికులను ప్రజలు గుర్తించారు' అని రామచంద్రయ్య అన్నారు. -
చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నారు
-
పాకిస్తాన్లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలోనా..?
గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు. వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు. -
‘సొంత ఆస్తులు పెంచుకునేందుకే ఆయన పనిచేశారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు రూ. 2లక్షల కోట్లకు పెరిగిపోయాయని అన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులకు, సొంత నిధులకు తేడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం చెల్లింపులు జరిపిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా అతిక్రమించి చంద్రబాబు అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పులు ఎందుకు చేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ అప్పుల భారం రాబోయే ప్రభుత్వం పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకునేందుకే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. సీఎస్ ప్రభుత్వ అవినీతిని బయటకు తీసుకోస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులపై సీఎస్ సమీక్ష జరిపితే చంద్రబాబు, టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో ఒక క్రమ పద్ధతి లేకుండా పోయిందని అన్నారు. నిబంధనలు అతిక్రమించి చంద్రబాబు అప్పులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్పై చంద్రబాబుకు ఎందుకంత కోపం అని నిలదీశారు. చంద్రబాబుకు మినహాయింపు ఉండదు స్టేలు అన్ని ఎత్తి వేయాలని సుప్రీం కోర్టు చెప్పింది కనుక చంద్రబాబు అక్రమాలకు శిక్ష తప్పదని రామచంద్రయ్య హెచ్చరించారు. కుటుంబరావు ఎవరని ప్రశ్నించారు. ఒక స్టాక్ బ్రోక్ ప్రభుత్వం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల కోడ్ దేశమంతా ఒకేలా ఉంటుందని.. చంద్రబాబు మినహాయింపు ఉండదని ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబు ఎందుకిలా గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే విచారణలు జరుతాయి.. అందుకే చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలిపారు. -
‘ఇది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా?’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని, విభజనకు ముందు సోనియా దెయ్యమని, రాహుల్ గాంధీ అని పనికిరాని వ్యక్తి అని ఇప్పుడేమో సోనియా గొప్ప నాయకురాలు, రాహుల్ విజన్ ఉన్న నేత అని చెప్పడం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్తో సిగ్గు లేకుండా చేతులు కలిపారంటూ విమర్శించారు. విభజన తరువాత కాంగ్రెస్ అధినేతలు రాష్ట్రానికి వస్తే.. నిరసనలు తెలిపి.. ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాటకాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పారదర్శకత అనేది లేకుండా రహస్యంగా జీవో జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇంతటి ఘోరమైన పాలన దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత కూడా అప్పులు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి విరుద్దంగా నడుచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఓట్లు అడగలేని చంద్రబాబు.. పక్క రాష్ట్రాలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్నికల్లో గొడవలు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఏపీ ఎన్నికల్లో గొడవలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల నియమావళి ఉల్లఘించారని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టకపోతే చంద్రబాబు అరాచకాలు, అక్రమాలు ఎక్కువ అవుతాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతూ.. ఇతరులను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు చంద్రబాబు అప్పుడేందుకు అప్పీలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి బయటపడతుందని భయపడుతున్నారని రామచంద్రయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నిజాలు బయటపెట్టిస్తామని అన్నారు. చంద్రబాబు బీజేపీతో కలవడానికి మళ్లీ ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై చంద్రబాబు వేలు చూపెట్టి బెదిరింపులకు దిగడం సరికాదని సూచించారు. చంద్రబాబుకు ఓటమి కళ్ల ముందు కనిపించడంతో.. అది భరించలేక ఢిల్లీకి తిరుగుతున్నారని చెప్పారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని స్వయంగా విధ్వంసం చేసిన సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఢిల్లీకి వెళ్లడం ఏమిటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు చంద్రబాబు ఒక ఆషాఢభూతి అని.. ఆయనపై ఏపీ ప్రజల ఆగ్రహం ఓట్ల రూపంలో కట్టలు తెంచుకుందన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు ఉన్న వారంతా పోలింగ్ రోజున ఏపీకి వచ్చి ఓటింగ్లో పెద్దఎత్తున పాల్గొన్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా వారిలోని విపరీతమైన కసి ఆ రోజు పెల్లుబుకిందన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఓడిద్దామని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు వస్తే.. తనను గెలిపించడానికే వారొచ్చారని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించారన్నారు. కాగా, తనకు ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు ఇతరులను నిందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, వీవీప్యాట్లలో లోపాలున్నాయని, హింస ప్రజ్వరిల్లిందని బాబు విమర్శలు చేశారని, ఈ కారణాలు చూపుతూ ఆయన రీపోలింగ్కు కూడా డిమాండ్ చేశారని రామచంద్రయ్య గుర్తుచేశారు. కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని.. ఆయనను నిరాశా నిస్పృహలు ఆవహించాయన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు కూడా ఫలించలేదని రామచంద్రయ్య అన్నారు. ఏపీలో చంద్రబాబు ఏం చేసినా ఎల్లో మీడియా ఆయనకు వత్తాసు పలుకుతోందని.. చంద్రబాబుకు దమ్ముంటే జాతీయ మీడియాను ఎదుర్కోవాలని రామచంద్రయ్య సవాలు విసిరారు. చంద్రబాబు ఓడిపోతున్నారు ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున నిధులు పారించినా చంద్రబాబు ఓడిపోతున్నారని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో అన్నా హజారేను కలవడానికి వెళ్తే.. వారు ఆయన్ను రానివ్వలేదన్నారు. వీవీప్యాట్లో ఆయన ఓటు కనపడకపోతే అధికారులకు ఫిర్యాదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తే తప్పేముందన్నారు. ఏపీకి పట్టిన చంద్రగ్రహణం ఈ ఎన్నికల్లో వీడిందని.. ఆయన ఓటమిని హుందాగా అంగీకరించాలని సూచించారు. -
ఈసీపై చంద్రబాబుకు గౌరవం ఉందా?
-
‘చంద్రబాబు డ్రామాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు’
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీ కార్యాలయం వద్ద చేసిన హైడ్రామాను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని అన్నారు. చంద్రబాబు వద్ద ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ప్రతి చోట దాడులు చేసే హక్కు ఆదాయపు పన్ను శాఖ వాళ్లకు ఉందని తెలిపారు. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటకలలో కూడా దాడులు జరిగాయని గుర్తుచేశారు. చంద్రబాబు పక్కన అందరు అవినీతిపరులు ఉన్నారు కాబట్టే ఐటీ శాఖ దాడులు చేసిందన్నారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. చట్టం తన పని చేసుకోకుండా చంద్రబాబు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పబ్లిక్గా బెదిరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు దిగడం దేశంలో ఇదే తొలి సారి అని పేర్కొన్నారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోడ్ అమలులోకి వచ్చాక అధికారుల బదిలీ ఈసీ పరిధిలో ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఓడిపోతామని మందే తెలిసిపోయిందన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న అధికారులను చంద్రబాబు అగౌరవ పరచడం హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గురించి చంద్రబాబు దారుణంగా సరైన మాట్లాడటం పద్దతి కాదని హితవు పలికారు. -
అవినీతి అక్రమాలకు కారణం చంద్రబాబు
-
‘ఓ పత్రికా యజమానితో కలిసి చంద్రబాబు కుట్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు కారణం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి తనను చూసి ఓట్లు వెయ్యమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని.. దానిని చంద్రబాబు నాయుడు తప్పుపట్టడం దారుణమన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో అబద్ధాల పుట్టని.. అమలుకు వీలుకాని హామీలను ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని అన్నారు. చంద్రబాబుకు విశ్వనీయత లేదని, ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. తన అనుకూల మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని రామచంద్రయ్య విమర్శించారు. ఓ పత్రికా యజమానితో కలిసి చంద్రబాబు ఏవిధంగా కుట్ర పన్నుతున్నారో సమాజానికి తెలిసిపోయిందని వివరించారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తొలగించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. డ్వాక్రా పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నరు. -
ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా?
సాక్షి, విజయవాడ : పవన్ కళ్యాణ్ అధికారపార్టీని వదిలి.. ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని.. ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్ల అవినీతిపై మాట్లాడిన పవన్.. ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయటం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని, చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.. ఫ్యాక్షన్ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని, 2004లో కూడా వైఎస్సార్పై ఇలానే దుష్ప్రచారం చేశారని, కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని గుర్తుచేశారు. వైఎస్ వచ్చాకే రైతుల కష్టాలు తొలగిపోయాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తనకు ఉపయోగపడే పథకాలు మాత్రమే అమలు చేశారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వస్తే.. ఫ్యాక్షన్ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని..చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్లీ సీఎం అయితే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిపోతుందన్నారు. కేసీఆర్పై విమర్శలు చేసే చంద్రబాబు ఎందుకు తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయం బోపిపోయిందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయి వచ్చి.. అక్కడ టీడీపీని చాపచుట్టేలా చేశారని విమర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని అక్కడ కాంగ్రెస్ కూడా అస్థిత్వం కోల్పోయిందని, డిలిమినేషన్ కోసం కేంద్రంతో తగాదా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదంటూ ఆరోపించారు. పొరుగు రాష్ట్రం, కేంద్రంతో తగాదా పెట్టుకుంటే.. ఏపీ ఎలా అభివృద్ది చెందుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగుతోందని, రాష్ట్రానికి మేలు జరగాలంటే.. చంద్రబాబు ఓటమి తప్పదని అన్నారు. యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ది, అవినీతి తగ్గాలన్నా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలన్నా చంద్రబాబును ఓడించి తీరాలన్నారు. -
ప్యాకేజీలు పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయి
-
‘ఫరూక్కు సొంత రాష్ట్రంలోనే విలువ లేదు’
సాక్షి, వైఎస్సార్: ఏపీలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు లాంటి అవినీతి పరుడికి పలువురు నేతలు మద్దతు పలకడంపై మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్ జిల్లాలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు సొంత రాష్ట్రంలో, సొంత పార్టీలోనే విలువ లేదని అన్నారు. అవినీతిపై పోరాడి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద కేజ్రీవాల్.. ఏపీలో అవినీతిపరుడికి ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనివల్ల కేజ్రీవాల్ లాంటి వాళ్లకున్న విలువలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంత నీచమైనా రాజకీయాలైన చేస్తారని విమర్శించారు. చంద్రబాబు బండరాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బట్టబయలు చేశారని గుర్తుచేశారు. గోయల్ చర్చకు రమ్మని సవాల్ చేసినా చంద్రబాబు స్పందించలేదన్నారు. కమిషన్ కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పోరాటం ప్రత్యేక హోదాపై కాదని.. సీబీఐ, ఐటీలను రాష్ట్రంలోకి రాకుండా చూసేందుకేనని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పూర్తి అవాస్తవాలను చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తన ప్రచారంలో చూపిస్తున్న ఇళ్లు.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని కియా పరిశ్రమ గురించి చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలు బయట పెట్టలేదని తెలిపారు. రాజధాని అమరావతి గ్రాఫిక్స్ మాదిరే టీడీపీ ప్రచార చిత్రాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. -
‘ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి ఎవరూ లేరు’
కృష్ణా జిల్లా: భారతదేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి లాంటి అవినీతి ముఖ్యమంత్రి మరెవ్వరూ లేరని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. పామర్రు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు ఇసుక, మట్టి దోచుకుని రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బుతో చంద్రబాబు జల్సా చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తన ఎల్లో మీడియాతో దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. -
‘చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిలా మారారు’
సాక్షి, విజయవాడ : అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఐపీఎస్లపై ఈసీ వేటువేయడంపై చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తూ, రాజ్యాంగేతర శక్తిలా మారారని మండిపడ్డారు. గతంలో ఎస్పీ యాదవ్ బదిలీ విషయంలో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలా ఎందుకు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారిని బదిలీ చేస్తే సీఎంకు ఎందుకు ఇబ్బంది అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి మాత్రమేనని జ్యుడిషీయరి తన పరిధి కాదన్నారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీకి ప్రవేశం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు వల్లే ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని అంటారేమోనని విమర్శించారు. చంద్రబాబు మాటలను ప్రజలెవ్వరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయని సూచించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే మతిభ్రమించిన వ్యక్తి మాటల్లా ఉన్నాయని, కేసీఆర్ పేరు ఇక్కడ ఎందుకు? ఆయనకు ఏపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హరికృష్ణ శవం పక్కన బెట్టుకుని టీఆరెస్తో పొత్తుకు ప్రయత్నించలేదా అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారని తాను అనుకోలేదన్నారు. -
పవన్కు రామచంద్రయ్య సవాల్..!
సాక్షి, వైఎస్సార్ కడప : చెగువేరా గురించి స్పీచ్లు దంచికొట్టే పవన్ కల్యాణ్ చంద్రబాబులో ‘చెగువేరా’ను చూశాడేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. అందుకే టీడీపీ స్క్రిప్ట్ చక్కగా ఫాలో అవుతున్నారని విమర్శలు గుప్పించారు.‘ప్రజలు నవ్వుకుంటారని గాని, అభిమానులు బాధ పడతారనే ఫీలింగే లేదు. చంద్రబాబే నిన్నటి వరకు వెన్నుపోటు దారుడు అనుకుంటే... అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచి బాబును మించిపోతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పాలిటిక్స్ చేయడానికి పార్టీ ,జెండా ఎందుకని చురకలంటించారు. జనసేనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండదని చెప్పి నాగబాబును రంగంలోకి దించారని.. పవన్ మాట నిలకడ లేని వ్యక్తి అని అన్నారు. ‘నీకు చేతనైతే అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టి.. లాలూచీ రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకో’ అని సవాల్ విసిరారు. వాళ్లేనా స్టార్ క్యాంపెయినర్లు.. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన వారిని చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టి జగన్పై లేనిపోని విమర్శలు చేయిస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు డిప్రెషన్లోకి వెళ్తున్నారని అన్నారు. అందుకనే ఏమాత్రం సంబంధం లేని కేసీఆర్ను ఆంధ్ర రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తూ.. ఆంధ్ర, తెలంగాణా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్లో నువ్ చేసిన అభివృద్ధి ఏమిటి. నీ అస్మదీయులకు లీకులిచ్చి భూములు కొనుగోలు చేయించావ్. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డావ్. విదేశాల్లో అయితే నువ్ చేసిన పనికి ఊచలు లెక్కించేవాడివే. నీ హైటెక్సీటీ బాగోతమంతా ఒక విదేశీ విద్యార్థిని తన థీసిస్లో వివరించింది. ఇదే ఫార్ములాను అమరావతిలోనూ ఫాలో అయ్యావ్. అమరావతి చుట్టూ నీ అస్మదీయులు భూములు కొనేలా చేశావ్. ప్రజల డబ్బుతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నీ అనుయాయులకు మేలు చేశావ్. నువ్వు చరిత్ర చెత్త బుట్టలో పడిపోతున్నావ్. ఓటమి భయంతో నీ మాటలు తడబడుతున్నాయ్. ఆ భయం నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని రామచంద్రయ్య బాబు చర్యలను ఎండగట్టారు. -
పవన్ ఓ మిస్టర్ కన్ఫ్యూజన్..!
సాక్షి, వైఎస్సార్ కడప : ‘తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి చంద్రబాబును మరోసారి సీఎం చేసేందుకు పవన్ ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. పవన్ ఓ మిస్టర్ కన్ఫ్యూజన్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన విశాఖ భూ కుంభకోణాలపై మాట్లాడని పవన్.. జగన్ వస్తే భూములు ఖాళీ అని విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబుకు గొడుగుపట్టి ఆయనను మరోసారి సీఎం చెయ్యడమే నీ టార్గెటా..? జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందంటూ చంద్రబాబు వెర్రికూతలు కూస్తారు. నీ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది కాబట్టే.. రాత్రికిరాత్రే అమరావతికి పారిపోయి వచ్చావ్ కదా. చేగువేరా.. అంటూ పవన్ ఏవేవో చెప్తుంటే.. ఏదో చేస్తాడని అనుకున్నాం. కానీ, నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు. ప్యాకేజీ పవన్ అని ప్రజలనుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబును అర్ధరాత్రి కలిసాడు. అనంతరం జనసేన నుంచి పోటీకి దిగుతున్నట్టు పవన్ ప్రకటించాడు. మళ్లీ పవన్ ప్రవచనాలు చెప్పుకొస్తాడు’ అని రామచంద్రయ్య చురకలంటించారు. గతంలో లోకేష్పై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. ఆయనపై ఎందుకు అభ్యర్థిని పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంతకైనా దిగజారుతుంది..! ‘రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు ఎక్కువవుతున్నాయని రామచంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తెరలేపేందుకు టీడీపీ వెనకాడదని విమర్శిచారు.తుని రైలు ఘటన, అమరావతిలో పంట దహనం వంటి అరాచకాలకు పాల్పడిన టీడీపీ అవన్నీ వైఎస్సార్సీపీపైన నెట్టేందుకు యత్నించింది. విశాఖ ఎయిర్పోర్టులో జగన్ జరిగిన హత్యాయత్నం ఘటనను కూడా తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ యత్నించింది. రాఫ్ట్రంలో గాడి తప్పుతున్న శాంతి భద్రతలపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలి. ఈసీ ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేయాలి’ అని కోరారు. -
పవన్ కళ్యాణ్కు దేనిపైనా క్లారిటీ లేదు
-
చంద్రబాబు అవినీతి జేడీకి కనిపించట్లేదా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్ జగన్ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణమని, ఇందుకు ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమే నిదర్శమని అభిప్రాయపడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు సహకరించారని, దానికోసమే ఆయన మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అవినీతి జేడీకి కనిపించట్లేదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే తెలిసిందని అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అవుతారన్న విషయం ఆయన చేపట్టిన పాదయాత్రలోనే స్పష్టమైందని మరోసారి గుర్తుచేశారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసుకున్నాడని, ఇక ఏమీ చేయలేక ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుక ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో సోనియా గాంధీ, జగన్ ఒక్కటన్న చంద్రబాబు ఇప్పుడేమో మోదీ, జగన్ ఒక్కటని అంటు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మీడియాను నమ్ముకున్నారని, వైఎస్ జగన్ ప్రజలను నమ్ముకున్నారని స్పష్టంచేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన జోస్యం చేప్పారు. -
అవినీతి పై మీ పోరాటం ఏమయ్యింది?
-
‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’
-
‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం జిల్లాలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని టీడీపీ ఐటీ కంపెనీలకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందని.. దీనిని ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. ఐటీగ్రిడ్స్ స్కాంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ హస్తం ఉందన్నారు. ఇది ప్రజస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడి అని అన్నారు. కొత్త పంథాలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయా కంపెనీల ఉద్యోగులకు జీతాలు ఎవరిస్తున్నారో, వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేపట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టే సంస్కృతి ఏపీలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుది ఎంత క్రిమినల్ మైండ్ అనేది ఈ ఘటన ద్వారా అర్థమవుతుందని తెలిపారు. కాగ్ తప్పుపట్టినా, ప్రతిపక్షం ప్రశ్నించినా, జనాలు ఛీకొడుతున్నా.. చంద్రబాబు అక్రమాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
సీఎం సీటే బాబుకు స్పెషల్ స్టేటస్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సీఎం పదవినే ప్రత్యేక హోదా అనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఎద్దేశా చేశారు. చంద్రబాబు తన కుమా రుడు లోకేశ్కు మంత్రి పదవి కట్టబెట్టడమే స్పెషల్ స్టేటస్ అని భావిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పోలీసులు అరెస్టు చేయకపోవడమే బాబుకు ఓ ప్రత్యేక హోదా అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం, చంద్రబాబు ఆస్తులు, అవినీతిపై విచారణ జరపకపోవడమే ఆయనకు ఇచ్చిన ప్రత్యేక హోదా అని చెప్పారు. వైఎస్సార్ సీపీకి మాత్రం పెట్టుబడులతో వచ్చే ఉద్యోగాల విప్లవమే ప్రత్యేక హోదా అని, దాన్నే కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు. సి.రామచంద్రయ్య మంగళవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా డారు. ధర్మపోరాటాల పేరుతో ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారిన టీడీపీ ఉనికి కోసం రూ.10 కోట్ల ప్రజాధనం వాడుకోవడం దారు ణమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం తథ్యమని స్పష్టం చేశారు. సి.రామచంద్రయ్య ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష పాత సినిమాల్లో కొయ్యగుర్రంపై స్వారీని గుర్తుచేస్తోంది. పార్టీ కోసం చేపట్టే కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్టు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేయడం దారుణం. బాబు డ్రామా దీక్షలకు వాడిన సొమ్ముతో కరువు సీమను కాస్తో కూస్తో ఆదుకోవచ్చు. గతంలోనూ ఇలాంటి హైడ్రామాలను నడి పినా, ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన రోజులున్నాయి. బాబులో పూర్తిగా కాంగ్రెస్ రక్తం చంద్రబాబు ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గా పనిచేస్తున్నారు. తనలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందని గతంలో చెప్పాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ రక్తాన్ని ఎక్కించుకున్నాడు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీలో టీడీపీ విలీనమైనా ఆశ్చర్యం లేదు. తన కుటుంబాన్ని తిట్టిన చంద్రబాబుతో దోస్తీ కట్టడానికి రాహూల్గాంధీకి అసలు పౌరుషం ఉందా? చంద్రబాబు అవినీతి, అక్రమాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ పుస్తకాల రూపంలో ఛార్జిషీటు వేసింది. ఇలాంటి అవినీతిపరుడితో రాహుల్గాంధీ రాజీపడటానికి కారణమేంటి? దోచుకోవడానికే ప్యాకేజీకి ఒప్పుకున్నాడు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని కోరుకుంది చంద్రబాబే. ప్యాకేజీ తీసుకుంటే దోచుకునే వెసులుబాటు ఉంటుందనే దానికి ఒప్పుకున్నాడు. కమీషన్ల రూపంలో దోచుకోవడానికి ప్యాకేజీ అడిగాడు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లు గడువు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి పారిపోయాడు. బాబుకు పచ్చమీడియా వంతపాడుతోంది అధర్మమైన వ్యక్తి ఇప్పుడు ధర్మపోరాటం చేయడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు అరాచకాల గురించి ‘కాగ్’, మీడియా ఎప్పుడో చెప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ప్రజలు చంద్రబాబును తరిమేయాలనే నిర్ణయించుకున్నారు. ఇవన్నీ తెలిసి మోదీపై యుద్ధమంటూ డ్రామాలాడుతున్నాడు. దానికి పచ్చమీడియా ఆహా ఓహో అంటూ వంతపాడుతోంది. అవసరమైతే కోర్టులో సవాల్ చేస్తాం.. ముంపు మండలాలను కలిపేందుకు పట్టుబట్టానని చెప్పుకునే చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఎందుకు పట్టుబట్టలేదు? 2016 సెప్టెంబర్ 8న ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతూ దొంగచాటుగా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పందం చేసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీకి మాత్రమే తెలిసేలా రహస్య ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు. ఒకటి రెండు ఎంపీ సీట్లు కూడా దక్కవు. ధర్మపోరాట దీక్షల కోసం చంద్రబాబు వెచ్చిస్తున్న ప్రజాధనం లెక్కలపై అవసరమైతే న్యాయస్థానంలో సవాల్ చేస్తాం’’ అని సి.రామచంద్రయ్య ఉద్ఘాటించారు. -
ప్రజల డబ్బుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
-
రాక్షస పాలన అంతమెందించే రోజులు దగ్గర్లోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమి లేదని, అవినీతే తప్ప అభివృద్ది చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. స్వార్థం కోసం అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గురువారం కడపలో జరిగిన వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభలో పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ధనబలంలో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను మించిన పోరాట యోధుడు లేరని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ నేతలను గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితి లేదు : సి. రామచంద్రయ్య ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆస్తులను కొల్లగొట్టేందుకే అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రాక్షస పాలనను అంతమెందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కోరుముట్ల తన స్వార్థం కోసం నక్కజిత్తుల చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్న వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎవరు భయపడోద్దు : మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ భయపడొద్దని అందరి బాగోగులు వైఎస్ జగన్ చూసుకుంటారని వైఎస్సార్సీపీ నేత మిథున్రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఎవరూ అధైర్యపడొదన్నారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నేతలు.. అన్నీ చేశామంటూ విధుల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. బాబు ప్రలోభాలకు గుణపాఠం చెప్పాలి : రాచమల్లు చంద్రబాబు నాయుడు ధనబలంతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు.. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. -
చంద్రబాబు అన్ని వర్గల ప్రజలను మోసం చేశారు
-
ఏపీని ‘అప్పుల ప్రదేశ్’గా మార్చారు
సాక్షి, అనంతపురం : సీఎం చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. జైలుకు వెళ్తానన్న భయం ఆయనలో కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అవినీతి, అక్రమాలపై విచారణ జరిగి తీరుతుందన్నారు. మూడు లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్స్ వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. సీఎం మానసిక స్థితి సరిగాలేదని అందుకే ఏపీని అప్పుల ప్రదేశ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో ఏపీ అవినీతిలో నంబర్ వన్గా మారిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ సమస్యను నిమిషంలో పరిష్కరించవచ్చని కానీ వాటి ఆస్తులపై కన్నేసినందునే చంద్రబాబు పరిష్కరించటం లేదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శారదా కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఈ క్రమంలో ఆమె చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతివ్వడం సరికాదన్నారు. ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించడం సరికాదన్నారు. నలుగురు మంత్రులను కూడా వైఎస్సార్ సీపీ జాబితాలో పేర్కొనటం పట్ల రామచంద్రయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. -
‘డ్వాక్రా మహిళలతోనే కేసులు పెట్టిస్తాం’
సాక్షి, వైఎస్సార్: ఎన్నికల వేళ ప్రజలు మభ్యపెట్టే విధంగా ఏపీ బడ్జెట్ను రూపొందించారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశాయని మండిపడ్డారు. ప్రజలు తరతరాలు అప్పులు కట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడని, ప్రతిఏడాది అప్పులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమనీ, రాబోయే ఎన్నికల్లో గెలిచే సీన్ చంద్రబాబుకు లేదని ఆయన జోస్యం చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు ఎలా వస్తాయో స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఓడిస్తారని చంద్రబబాకు ముందే తెలుసని అందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని రామచంద్రయ్య పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నించిన వారిని స్పీకర్ సాక్షిగా చంద్రబాబు బెదిరిస్తున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయితే వారిచేతని కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ 150 సీట్లు సాధిస్తుంది.. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను మరిచి చంద్రబాబు నాయుడు కొత్త నాటకాలకు తెర తీశారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమను ఆర్భాటంగా శంకుస్థాపన చేసి బడ్జెట్లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. చంద్రబాబు మోసాని ప్రజలు గమనించాలని, సర్వేల ప్రకారం ఆయనకు ఓటమి తప్పదని చెప్పారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 150 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ తనను ఓడించాలని శతవిధాల ప్రయత్న చేశారని, కానీ ప్రజలు వారి ఎత్తుగడలను తిప్పికొట్టారని గుర్తుచేశారు. -
ఓట్ల కోసమే సంక్షేమం ఎర
ఎన్నికల వేళ ఓట్ల రాజకీయంలో భాగంగా ఎడాపెడా సంక్షేమ పథకాల ప్రకటనలు చేస్తూ.. పార్టీ కార్యకర్తల నేతృత్వంలో తన ఫొటోలకు క్షీరాభిషేకాలు చేయించుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు సంక్షేమ ముఖ చిత్రం ఏపాటిదో తెలిసే ఒక నివేదిక ఇటీవల బహిర్గతమైంది. ‘అంబేడ్కర్ ఫౌండేషన్’ అనే సామాజిక సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై చేసిన అధ్యయనంలో పలు దిగ్భ్రాంతికరమైన చేదు నిజాలు వెల్లడయ్యాయి. పేదలు, బడుగుబలహీన వర్గాల విద్యార్థులు నివాసం ఉంటున్న ప్రభుత్వ వసతి గృహాల్లో 44% వాటికి కనీస మౌలిక వసతులు లేవు. రక్షితనీరు అందుబాటులో లేదు. మరుగుదొడ్లు, స్నానాల గదులు తగినన్ని లేవు. ప్రతి 52 మందికి ఒక్కటే టాయిలెట్, ఒక్కటే స్నానపు గది. చలికాలంలో కప్పుకోవడానికి విద్యార్థులకు కంబళ్లు కాదుకదా దుప్పట్లు కూడా లేవు. వసతి గృహాలు మురికి కూపాలుగా మారాయి. దోమలు, ఈగల బెడదతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుంటే, వారికి మందులిచ్చే వారు లేరు. వైద్య పరీక్షలు చేయించే వారు లేరు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వసతి గృహాలకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో 38% కోత విధించారు. రాష్ట్రంలో ఎస్సీలకు అందాల్సిన సంక్షేమ పథకాలను బినామీలు ఎగరేసుకునిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాలోని ఎస్టీలకు విద్య, వైద్య సౌకర్యాలు అందడం లేదు. గిరిజన గూడేలకు మంచినీటి వసతి కల్పించలేకపోయారు. మైనార్టీలకు ఏటా బడ్జెట్ నిధులలో రూ. 500 కోట్లు మించి ఖర్చు చేయడం లేదు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన మాట నీటిమూటగా మారింది. పేదలకు ఐదేళ్లల్లో 13 లక్షల ఇండ్లను కడతామన్న లక్ష్యంలో 30% కూడా నెరవేరలేదు. డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉండగా ప్రవేశపెట్టిన విశిష్ట పథకం ‘ఫీజు రీయింబర్స్మెంట్’ను నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ, 104 వంటి పథకాలని కూడా వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. వ్యవసాయ రుణాలన్నీ.. బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి తీసుకొన్నవి సైతం బేషరతుగా మాఫీ చేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకురైతు పెట్టిన ఖర్చుకు 50% అదనంగా కనీస మద్దతు ధర అందిస్తామని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా మని, మద్యం అమ్మకాలు తగ్గిస్తా, బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తాం, పన్నుల భారం తగ్గిస్తాం, గ్యాస్ సిలిండర్పై రూ. 100 సబ్సిడీ ఇస్తామని... ఇలా దాదాపు ఓ 100 ప్రధాన హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక.. చెప్పిన వాటికి పూర్తి విరుద్ధంగా.. పెట్రో ధరలపై వ్యాట్కు అదనంగా సెస్ విధించడం, మద్యం అమ్మకాల్ని, మద్యం ధరల్ని పెంచారు. అమలు చేస్తున్న ఒకటీ అరా సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందకుండా.. రాజ్యాంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలను తమ కార్యకర్తలతో నింపి.. సర్పంచ్ అధ్యక్షత జరిగే గ్రామ సభల్లో కాకుండా జన్మభూమి(పార్టీ) కమిటీల ఎంపిక చేసిన వారికే అందిస్తున్న విషయం ప్రజలకు తెలుసు. ఇసుక మాఫియాలను, కాల్మనీ రాకెట్లను పరోక్షంగా ప్రోత్సహించారు. బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ‘కోటయ్య కమిటీ’ అంటూ డ్రామాలు ఆడి మాఫీ జరగాల్సిన రూ. 89,000 కోట్లకుపైగా రుణాలను రూ. 24,000 కోట్లకు కుదించారు. ఇంకా ఇప్పటికీ అందులో రూ. 11,000 కోట్లు రైతులకు చెల్లించలేదు. ఎన్టీఆర్ మానస పుత్రిక అయిన కిలో రూ. 2ల బియ్యంను రూ. 5.50 చేసింది బాబే. మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు పొమ్మన్నారు. మహిళల సంక్షేమంపట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్యకు కారణం అయిన వారిని శిక్షించే బదులు, రక్షించడాన్ని మహిళలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? విజయవాడ కాల్మనీ నింది తుల్ని ఎందుకు వదిలేశారు? సీఎం బాబు ప్రజాధనాన్ని మంచినీళ్లలా సొంత పబ్లిసిటీకి, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిన్నమొన్నటి వరకు.. ప్రైవేటు విమా నాలు, విదేశీ పర్యటనలు, స్టార్ హోటళ్లల్లో కుటుంబ సమేతంగా మకాంలు, సొంత ఇంటికి మెరుగులు, చాంబర్ల సోకులు.. మొదలైనవి చేశారు. కానీ, గతయేడాదిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మీద యుద్ధం పేరుతో వందలకోట్లు ఖర్చు పెట్టి ధర్మదీక్షలు, నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రకులాల పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్ల కోటాలో 5% కాపులకు ఇస్తామని చెప్పడం బాబు నయవంచనకు పరాకాష్ఠ. ఏపీ ప్రజలు చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన తరుణం ఇది. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఎరవేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
‘రాధ.. చంద్రబాబు ఇప్పుడు గాంధీ ఎలా అయ్యాడు?’
సాక్షి, తిరుపతి : ఒకప్పుడు వంగవీటి రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు గాంధీగా కనిపించడానికి గల కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇదే వంగవీటి రాధ తన తండ్రిని హత్య చేయించింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడేనంటూ ప్రచారం చేసిన సంగతిని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అప్పుడు రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గాంధీగా ఎలా కనిపిస్తున్నాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఇప్పటివరకూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని.. రానున్న ఎన్నకల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అప్పులు చేసి కుప్పలు పేరిస్తే వాటిని ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులాంటి రాక్షసుడి పాలన నుంచి ప్రజలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి వైఎస్ జగన మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. -
‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’
-
‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : అగ్రవర్ణాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఏ కులానికి ఎంత అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.రామచంద్రయ్య అన్నారు. అసలు కేంద్రం ఇచ్చిన రిజర్వేన్ల అంశం ఎంత వరకు నిలబడుతుందో తెలియని పరిస్థితుల్లో.. అందులోనుంచే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లు ఇంకా చేరనేలేదని వెల్లడించారు. ‘2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏమేరకు అమలు చేశాడో ప్రజలు గమనించాలి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్ జగన్ చెప్పిన ‘నవరత్నాలు’లోంచి ఒక్కొక్కటి వదులుతున్నాడు. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం గురించి తెగ ఆలోచిస్తున్నారు. మీకు సంక్షేమం అంటే ఏంటో తెలుసా బాబూ’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పంచె కట్టిన వాళ్లంటేనే బాబుకు పడదని.. అలాంటిది రైతులను ఆదుకుంటానని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు చెప్పినదానికల్లా తలలూపుతూ మంత్రులు తమ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోద్దని హితవు పలికారు. అత్యధిక ఆదాయం వచ్చే గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదని.. కానీ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక విమనాల్లో పర్యటిస్తూ ప్రజాధనం వృధా చేయడంలో బాబుకెవరూ సాటిరారని చురకలంటించారు. -
ముఖ్యమంత్రే నిబంధనలు అతిక్రమిస్తే
-
‘ఆయన్ను బ్రోకర్లా బాబు వాడుకుంటున్నారు’
ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్ను ఒక బ్రోకర్లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఓటుకు నోటు కేసు వల్లే రాజధాని వదులుకున్నారు
-
ఫ్రంట్ పేరుతో చంద్రబాబు స్టంట్
‘‘గతం గతః గతంలో మేము చేసుకున్న పరస్పర ఆరోపణలు, తిట్లు అన్నీ మర్చిపోయి.. దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి పని చేయాలనుకొంటున్నాం’’ అంటూ నవంబర్ 2న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద చంద్రబాబు తమ నూతన బంధంపై మీడియాకు వివరణ ఇచ్చుకొన్నారు. ఈ పొత్తుకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటి? అని కొందరు మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను విననట్టు నటిస్తూ ఇరువురు నేతలు చిరునవ్వులు చిందిస్తూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం ఏకైక లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాహుల్, చంద్రబాబు కలిసి పని చేసుకొనే క్రమంలో పరస్పరం గతాన్ని మర్చిపోవచ్చుగాక, కానీ, ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యనున్న వైరుధ్యాన్ని మర్చిపోగలరా? తనను, తన మాతృమూర్తి సోనియా గాంధీని చంద్రబాబు అవమానకరరీతిలో దూషించినప్పటికీ, రాహుల్గాంధీ ఆ మాటలను మరచిపోవడానికి కారణం చంద్రబాబు ఆయనకు తమను ఆర్థికంగా ఆదుకొనే ఆపద్బాంధవుడిగా కనబడటమే. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతున్న ఏపీ కాంగ్రెస్కు తమ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మింగుడు పడటం లేదు. ఆ క్రమంలోనే కొత్త అపవిత్ర పొత్తును జీర్ణించుకోలేక పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్పార్టీకి రాజీనామాలు చేసి బయటపడుతున్నారు. సిద్ధాంతాలు అవసరం లేదా? ఎన్డీఏ నుంచి బయటకొచ్చే ముందే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చేరువ కావడానికి మార్గం సుగమం చేసుకొన్నారు. ప్రçస్తుత పరిస్థితులలో సిద్ధాంతాలకు కాలం చెల్లిందని, ఎత్తుగడలే పార్టీలకు మనుగడ అంటూ చంద్రబాబు చాలా కాలం నుంచే తమ పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 23 మంది వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యేలను ఫిరాయించుకొని, అందులో నలుగుర్ని మంత్రులుగా చేసిన సందర్భంలో కూడా తన అప్రజాస్వామిక చర్యను సమర్ధించుకోవడానికి చంద్రబాబు ఇదే వాదనను తెరమీదకు తెచ్చారు. కార్పొరేట్ శక్తులకే పెద్దపీట చంద్రబాబు ఎన్నికలను–అవి సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా–మద్యాన్ని, కరెన్సీని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికలను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. పార్టీలో క్యాష్కే తప్ప క్యారెక్టర్కు ప్రాధాన్యత ఇవ్వరన్న మాట చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఫలితంగానే లోక్సభలో, రాజ్యసభలో అత్యంత ధనవంతులైన వారు టీడీపీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. సంకీర్ణ రాజకీయాల్లో ఊసరవెల్లి రంగులు దేశంలో సంకీర్ణ రాజకీయాల శకం మొదలయ్యాక వివిధ రాజకీయ పార్టీలు ఆయా సమయాల్లో భిన్నమైన కూటమిలలో ఉంటూ వచ్చాయి. మమతా బెనర్జీ, రాంవిలాస్ పాశ్వాన్, జయలలిత మొదలైన వారు ఒకసారి ఎన్డీఏ ఫ్రంట్లో, మరోసారి యుపిఏ ఫ్రంట్లో ఉన్నారు. కానీ చంద్రబాబు మాదిరిగా ఒక ఫ్రంట్ నుంచి మరో ఫ్రంట్లోకి దుమికినపుడు అత్మవంచన చేసుకోలేదు. 1996లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు వామపక్షాలతో పొత్తు పెట్టుకొన్నారు. 1999 ఎన్నికలలో బీజేపీతో ఎన్నికల పొత్తుకు సిద్ధమై కలిసి పోటీ చేశారు. 2004లో కూడా బీజేపీతో కలిసే నడిచారు. ఫలితాలు తారుమారు కావడంతో ‘జన్మలో బీజేపీతో పొత్తు ఉండదు’ అంటూ తనను నమ్మాలని ముస్లిం మైనార్టీలను వేడుకొన్నారు. 2009లో టీడీపీని తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించిన టీఆర్ఎస్తో సహా వామ పక్షాలను చేర్చుకొని కూటమి కట్టి ఎన్నికల్లో మట్టికరిచారు. 2014 వచ్చేసరికి నరేంద్రమోదీకి లభిస్తున్న ఆదరణ చూసి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. తనకు కావాల్సిన వారిని కేంద్రమంత్రులుగా చేయడం కోసం మరోమాట లేకుండా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఇద్దరికి స్థానం కల్పించారు. సంకీర్ణ రాజకీయాల్లో చంద్రబాబు మాదిరిగా ఊసరవెల్లి రంగులు ప్రదర్శించిన నేత దేశంలో మరొకరు కనపడరు. ఏపీలో ప్రజాస్వామ్యం సవ్యంగానే ఉందా? దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్టు చంద్రబాబు చెబుతున్నారు. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయన్నది రెండో కారణం. బీజేపీ సీబీఐ, ఈడీలతో టీడీపీ నేతలపై దాడులు చేయిం చడం మూడో కారణంగా చూపుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు దృష్టిలో ఏమిటి? ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య మనుగడ సవ్యంగానే ఉన్నదా? రాజ్యాంగ వ్యవస్థలు అపహాస్యం కావడం లేదా? ప్రధాన ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని అందులో నలుగుర్ని మంత్రులుగా చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారితో రాజ్యాంగం మీద ప్రమాణం చేయించి మంత్రులుగా చేర్చుకోవడాన్ని మించిన ప్రజాస్వామ్య హననం మరొకటి ఉంటుందా? స్థానిక సంస్థల అధికారాలను కాలరాస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంగా పరిగణించగలమా? పార్లమెంట్ ఆమోదించిన ‘భూసేకరణ చట్టం2013’ను మార్పుచేసి భూసేకరణ చేయడం ప్రజాస్వామ్యమా? ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ నిధులను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా, ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ నేతలకు కట్టబెడుతూ జీవోలు జారీ చేయడం ప్రజాస్వామ్యమా? ఇక, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో సీఎం చంద్రబాబు, ఆయన అనుచర గణం ఎగతాళి చేసి మాట్లాడ్డం, కేసుల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్న తీరు తెన్నులు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఏవిధంగా కునారిల్లుతోందో అర్థం అవుతుంది. ప్రజా సమస్యలు గాలికి ! కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం అంటూ నిర్వహిస్తున్న ధర్మదీక్షలకు పెడుతున్న ఖర్చు ప్రజాధనమే. తను నాలుగున్నరేళ్ల అధికారంలో పాల్పడిన అవినీతి, అక్రమాల పుట్టలు పగిలి వివిధ రూపాల్లో బయట పడుతుంటే సీఎం చంద్రబాబు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికి పోతున్నారు. అందుకే సీబీఐ, ఈడీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయంటూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై చట్టం తన పని తాను చేసుకుపోతే దానికి రాజకీయం పులమడానికి, అండగా దేశంలోని ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు నిలబడటానికి మాత్రమే చంద్రబాబు యూపీఏ పక్షాల చుట్టూ తిరుగుతున్నారు. పేరుకు మోదీకి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయడం.. కానీ, అసలు విషయం చట్టం నుంచి తను తప్పించుకోవడం. ఇదీ చంద్రబాబునాయుడి అసలైన వ్యూహం. - సి. రామచంద్రయ్య వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మొబైల్ : 81069 15555 -
ఆర్థిక ఉగ్రవాదిని మించినోడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదిని మించినోడని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా మేసేస్తున్న చంద్రబాబు ముఠాను సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థను డబ్బుమయం చేసిన ఆయన క్షమార్హుడు కాదని, సుజనాచౌదరి లాంటి ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు అండ అని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆర్థిక నేరస్తుల అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఆర్థిక నేరగాళ్లను వెంటబెట్టుకుని చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే.. వాటిని సుజానా చౌదరి వంటి ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. పెదబాబు, చినబాబులు రాష్ట్రాన్ని సొంత జాగీరుగా పాలిస్తూ రాజకీయ వ్యవస్థను అవినీతిమయం చేశారన్నారు. 2017లోనే రూ.7,346 కోట్లు ఎగవేత.. 2017 మార్చి నాటికే సుజనాచౌదరి బ్యాంకులకు రూ.7,346 కోట్ల మేర ఎగవేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక ప్రకటనలో తెలిపిందని, అది వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.8,500 కోట్లకు చేరిందన్నారు. 120 షెల్ కంపెనీలతో సుజానా ఈ అవినీతికి పాల్పడ్డారని రామచంద్రయ్య వివరించారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన వేల కోట్లను చంద్రబాబు ఆస్తులు పెంచడానికి, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగించి ఉండొచ్చన్నారు. సుజనాచౌదరి ఒక పనిముట్టు మాత్రమేనని, అసలుసిసలు లబ్ధిదారుడు చంద్రబాబేనన్నారు. బాబు అండతో సుజనాచౌదరి డీఆర్ఐ సహా అనేక సంస్థలను, వ్యవస్థలను మోసగించారన్నారు. మంత్రి కాకమునుపే సుజనాపై కేసులున్నాయని, క్విడ్ప్రోకోగా సుజనాకు బాబు కేబినెట్ పదవి ఇప్పించారన్నారు. అగ్రిగోల్డ్పై సాక్ష్యాలిచ్చినా చర్యల్లేవు అగ్రిగోల్డ్ భూముల్ని ఓ మంత్రి భార్య కొనుగోలు చేసినా చర్యలు శూన్యమని, స్వయంగా డాక్యుమెంట్లు ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ భూ కుంభకోణంలో మరో మంత్రి ఉంటే.. తూతూమంత్రంగా సిట్ వేసి క్లీన్చిట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అమరావతి భూములను కారుచౌకగా టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను సీఎం రమేష్కు ఇవ్వడం అనైతికమన్నారు. ఏ మాత్రం నెట్వర్త్ లేని కంపెనీలకు బ్యాంకులు రుణాలెలా ఇచ్చాయని ప్రశ్నించారు. ఈడీలో తన మనుషులను పెట్టుకుని జగన్పై కుట్రకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఈడీ భ్రష్టు పట్టిందని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకులను మేనేజ్ చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. ఆయన నేరాలు బయటపడకూడదనే రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటున్నారని.. అందుకు జీవోలు ఇవ్వడం పిచ్చిపనిగా ఆయన అభివర్ణించారు. కాగా, తనపై విమర్శలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు పవన్కల్యాణ్ను వాడుతున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే పవన్ మాట్లాడుతున్నారని.. బాబుకు ఆయన ఓ పనిముట్టుగా ఉపయోగపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యసభ నుంచి తొలగించాలి.. వ్యవస్థీకృత నేరానికి పాల్పడినందుకు సుజనాచౌదరిని రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అంతకుముందే.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలక ముందే, డిపాజిటర్లకు అన్యాయం జరక్కముందే చంద్రబాబు మనుషుల నుంచి ప్రతి రూపాయిని కక్కించాలన్నారు. పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవాళ్లు అవసరమని ఆర్థిక వనరులు సమకూరుస్తున్న సుజనాచౌదరికి కేబినెట్ పదవి ఇవ్వడం న్యాయమే అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఈ సందర్భంగా రామచంద్రయ్య గుర్తుచేశారు. -
బాబు పాలనలో ‘బాధితులే నిందితులు’
‘ఒక సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇంకో పెద్ద సంఘటన సృష్టించే అతి తెలివిని చంద్రబాబు నాయుడు ఎప్పట్నుంచో అమలుపరుస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాప్రయత్నం దరిమిలా ప్రజల్లో రేగిన అలజడి నుంచి అందరి దృష్టిని వేరే అంశంవైపు మరల్చడానికే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమ యం సందర్భం లేకుండా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా తన పాత మిత్రులం దర్నీ కలిసి వచ్చారన్నది తిరుగులేని వాస్తవం. ఆ హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించిన తీరును మెజారిటీ ప్రజలు ఈసడించుకోవడంతో తొలుత సినీనటుడు శివాజీ భవిష్యత్తును ఊహిస్తూ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. సదరు ప్రచారమూ ఎదురు తిరగడంతో ప్రజల దృష్టిని ఆ కేసు నుంచి మరల్చడానికి.. బాబు అప్పటికప్పుడు రాహుల్ అపాయింట్మెంట్ తీసుకొని పొత్తుల మిషతో ఢిల్లీకి వెళ్లారు. వెంటనే వై.ఎస్.జగన్పై హత్యాయత్నానికి సంబంధించిన వార్తలను పక్కన పెట్టిన ఒక వర్గం మీడియా బాబు ఢిల్లీ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించింది. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్లు కలిసి పనిచేయడానికి నిర్ణయించుకొని చాలా కాలమే అయింది. కూటమి ఏర్పాటై నెలన్నర దాటింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతకుముందే బాబు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి తదితరులను కలిసి వచ్చారు. తర్వాత తాను రాహుల్ ఇంటికి వెళ్లి పొత్తు కుదిరిందని ప్రకటించారు. రాహుల్తో అంతకుముందే అవగాహన కుదుర్చుకోకుండానే తెలంగాణలో పొత్తు ఎలా సాధ్యమైందని ఏ ఒక్క మీడియా ప్రతినిధీ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం. ప్రజాస్వామ్యం దాని అనివార్యత గురించి మాట్లాడే బాబు వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని అవహేళన చేయడాన్ని యావత్ మీడియా తప్పుపట్టి ఉండవలసింది. కానీ ‘కోడికత్తి కేసు’ అంటూ బాబు, ఆయన అంతేవాసులు చేసిన దుష్ప్రచారానికి టీడీపీ అనుకూల మీడియా వంతపాడింది. ఆ దన్నుతోనే బాధితుడైన వై.ఎస్. జగనే ఈ కేసులో నిందితుడు అనే భావం ప్రజల్లో నాటుకుపోయేందుకు అధికార తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. తమ పార్టీ నేతలు పాల్పడే దాష్టీకాలకు, దాడులకు బలైపోతున్న బాధితుల్నే నిందితులుగా చిత్రీకరించడం బాబుకు అలవాటు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా పాల్పడుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకొనే క్రమంలో టీడీపీ నేతలు చేసిన పాశవిక దాడికి గురై తీవ్ర అవమానం పొందిన కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షి ఉదంతం దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఆమె పట్ల సానుభూతి వెల్లువెత్తడంతో సాక్షాత్తూ బాబు రంగంలోకి దిగి 24 గంటల వ్యవధిలో ఆమెను విధులను అతిక్రమించిన అధికారిణిగా చిత్రీకరించేశారు. ఆమెను హైదరాబాద్లోని తన ఇంటికి పిలిచి చీవాట్లు పెట్టి పంపించారు. బాధితురాలైన వనజాక్షిపైనే నిందితురాలిగా ముద్రవేశారు. అలాగే గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది దారుణ మరణాన్నికూడా బాబు మీడియా ద్వారా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పక్షాల డిమాండ్ వల్ల సీఎం ఈ ఘటనపై నియమించిన కమిషన్ కూడా సీఎంకి తోడునీడై నిలిచింది. పుష్కరాల తొక్కిసలాట సంఘటనలో సైతం బాధితులే నిందితులని తేల్చేసింది! భక్తులు ప్రదర్శించిన ఆత్రుతే వారి ప్రాణాలు తీశాయి. ఇందులో సీఎం ప్రమేయమేమీలేదు, ప్రభుత్వ వైఫల్యం లేనే లేదట. సంక్షోభాల నుంచి అవకాశాలు పొందడం తన నైజం అని బాబు పదేపదే చెబుతుంటారు. తాజాగా, వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం సంఘటనను, బద్ధ శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బాబు తాపత్రయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించి లబ్ధి పొందిన బాబు, 2019 ఎన్నికల్లో బీజేపీని; బీజేపీతోపాటు వైఎస్సార్సీపీ, జనసేనలను విలన్లుగా చిత్రీకరించి లబ్ధి పొందడానికి వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం సంఘటనలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రాణాలకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రజల్లో చర్చ మొదలైంది. కేవలం గెలుపే పరమావధిగా అన్ని విలువలకు మంగళం పాడుతూ దానిని ప్రజాస్వామ్య అనివార్యతగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు వేసుకున్న ముసుగును ప్రజలే తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555 -
బాబు పాపాలను మేం మోయలేం
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద రాజకీయ అవకాశవాది అని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఘోర తప్పిదమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఐదు మాసాల క్రితం దీని గురించి ప్రస్తావన వస్తే చంద్రబాబును తమపై రుద్దవద్దని, ఆయన పాపాలను తాము మోయలేమని అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ప్రశ్నించే హక్కు ప్రతి కార్యకర్తకు ఉందని, ఈ మేరకే తాను తన నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినా, చంద్రబాబు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అయినదానికి, కానిదానికి కాంగ్రెస్ను విమర్శిస్తూ భూస్థాపితం చేయాలని, బంగళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారన్నారు. రాహుల్గాంధీ గుంటూరుకు వస్తే నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయించారన్నారు. సోనియా, రాహుల్ను కించపరుస్తూ ఆయన మాట్లాడిన మాటల క్లిప్సింగ్స్ కుప్పవేస్తే ఓ లారీకి లోడ్ అవుతాయన్నారు. బాబుకు సిద్దాంతాలుగానీ, విధానాలుగానీ లేవని, అధికారం కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తాడని, ఎవరితోనైనా విడిపోతాడని ఎద్దేవా చేశారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చిన ఈ పెద్దమనిషికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. -
చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదు