Central Water Commission
-
దాగుడుమూతలు వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా ఉన్నప్పుడు 2015 జనవరి 31, మార్చి 4 తేదీల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మీకు రాసిన లేఖలను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారా? అని..కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అవునని ఆయన సమాధానమివ్వగా, నిపుణుల కమిటీతో పాటు కమిషన్కు సైతం మీరా లేఖలు అందించలేదని సాక్ష్యాధారాలు చెబుతున్నాయని పేర్కొంది. తనకు గుర్తు లేదని, రికార్డులు పరిశీలించి చెప్తానని హరిరామ్ అనగా, దాగుడుమూతలు వద్దంటూ అసహనం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న పీసీ ఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) రిటైర్డ్ సీఈ ఎ.నరేందర్ రెడ్డిలను రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. గత క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పలు అంశాలపై వీరు తప్పుదోవ పట్టించారని గుర్తించిన కమిషన్.. మళ్లీ అవే అంశాలపై ప్రశ్నలను సంధించింది. అధికారుల జవాబులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఓ దశలో ప్రభుత్వమంటే తెలియదా? రాజ్యాంగం చదవలేదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బరాజ్ల నిర్వహణలో విఫలమయ్యారు.. బరాజ్ల నిర్మాణ గడువు పొడిగించడానికి ముందు నిర్మాణ సంస్థలపై నిబంధనలకు ప్రకారం జరిమానాలు ఎందుకు విధించలేదు? అని కమిషన్ అడగగా, సైట్ వద్ద పరిస్థితులతో పనుల్లో జాప్యం జరిగిందని నల్లా వెంకటేశ్వర్లు జవాబిచ్చారు. దీంతో సాకులు చెప్పవద్దంటూ వ్యాఖ్యానించింది. ‘బరాజ్ల నిర్వహణ, పర్యవేక్షణలో మీరు సీఈ/ఈఎన్సీలుగా విఫలమయ్యారు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన బరాజ్ల విషయంలో కనీస బాధ్యతతో వ్యవహరించలేకపోయారు. శ్రద్ధ చూపలేకపోయారు?..’అంటూ తప్పుబట్టింది. దీంతో అలా కాదంటూ నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ వివరణ ఇచ్చారు. డీపీఆర్కు రూ.677 కోట్లా? ⇒ బరాజ్ల డీపీఆర్ల తయారీకే వ్యాప్కోస్కి రూ.677 కోట్లు ఎలా ఇచ్చారు? అని కమిషన్ ప్రశ్నించగా, కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఇచ్చామని వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. దీంతో బుకాయించవద్దని బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ వద్ద ఉన్నాయని కమిషన్ తెలిపింది. నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, బరాజ్లు–పంప్హౌస్ల మధ్య గ్రావిటీ కాల్వ పొడువు, విద్యుత్ అవసరాలూ తగ్గించేందుకే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మార్చాలని ప్రతిపాదించినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వమంటే తెలియదా? రాజ్యాంగం చదవలేదా? ⇒ వ్యాప్కోస్కి డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వానిదని మురళీధర్ బదులిచ్చారు. ప్రభుత్వమంటే ఎవరని మళ్లీ ప్రశ్నించగా, శాఖ ముఖ్య కార్యదర్శి అని అన్నారు. ప్రభుత్వమంటే ముఖ్య కార్యదర్శా? దేశ రాజ్యాంగం చదవలేదా? అంటూ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. నాడు సీఎం, శాఖ మంత్రి ఎవరు? అని మళ్లీ ప్రశ్నించగా, కేసీఆర్, హరీశ్ రావు అని మురళీధర్ బదులిచ్చారు. నామినేషన్పై వ్యాప్కోస్కు అప్పగించాలని సీఎం నిర్ణయించినట్టుగా తానే లేఖ రాశానని మురళీధర్ అంగీకరించారు. ఎవరి ఆదేశాలతో బరాజ్లలో నీళ్లు నిల్వ చేశారు? అని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాలతో అని నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. ఏం గుర్తు లేదు: మురళీధర్ ⇒ 2016 జనవరి 17న సీఎం నిర్వహించిన సమావేశంలో వ్యాప్కోస్ డీపీఆర్లను సమరి్పంచింది. ఆ సమావేశంలో మీరు ఉన్నారా? జీవో 28 ద్వారా రిటైర్డ్ ఇంజనీర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫారసులను మీరు అనుసరించారా? కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ విషయంలో టెక్నో కమర్షియల్ ఆఫర్ను సమరి్పంచాలని వ్యాప్కోస్ను ఎప్పుడు అడిగారు? అంటూ కమిషన్ వరుసగా అడిగిన ప్రశ్నలకు.. తనకు గుర్తు లేదంటూ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ బదులివ్వడంతో ఆసక్తికర చర్చ జరిగింది. పుస్తకాలు చదివితే మేలు: కమిషన్ ⇒ తన జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఆయన చెప్పగా, పుస్తకాలు చదవితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని కమిషన్ సూచించింది. వార్తాపత్రికలు చదువుతున్నానని మురళీధర్ చెప్పగా, కొన్ని ప్రత్యేక పుస్తకాలు చదివితే మేలని కమిషన్ సూచించింది. మేడిగడ్డకు లొకేషన్ మార్పును వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగానే మీరు పాటించలేదని కమిషన్ పేర్కొనగా, కాదంటూ మురళీధర్ ఖండించారు. వ్యాప్కోస్ అభిప్రాయం తీసుకోకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ల మార్పుపై నిర్ణయం తీసుకున్నారా? అని అడగగా, అవునన్నారు. తాత్కాలిక నీటి నిల్వ, నీటి మళ్లింపు కోసం బరాజ్లు నిర్మించినట్లు చెప్పారు. స్టీల్ కొనుగోళ్లకు 60 శాతం అడ్వాన్స్ను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు వీలుగా నిబంధనలను సడలించాలని సీఎంతో జరిగిన సమావేశంలో మీరు ప్రతిపాదనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని బదులిచ్చారు. అదనపు పనులకు ఎంత వ్యయం చేసినా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారా? అని ప్రశ్నించగా, మీటింగ్ మినట్స్ చూస్తే గానీ చెప్పలేనన్నారు. మా నివేదిక అంతా వాస్తవమే: కాగ్ అధికారులు ⇒ డీపీఆర్ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే పనులు ప్రారంభించడం, ప్రాజెక్టుకు రూ.81,911 కోట్ల అంచనాలతో ఒకే పరిపాలన అనుమతి ఇవ్వకుండా..నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో పనికి విడివిడిగా అనుమతులివ్వడం, అలా మొత్తం రూ.1,10,248 కోట్లతో వేర్వేరు పనులకు వేర్వేరు అనుమతులివ్వడం, రూ.1,09,768 కోట్లతో ఒప్పందాలు చేసుకోవడం నిజమేనా? అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ జె.నిఖిల్ చక్రవర్తిని కమిషన్ ప్రశ్నించగా, ఆయన అవునని బదులిచ్చారు. కాగ్ రిపోర్టులో ఉన్న అంశాలన్నీ వాస్తవాలేనని చెప్పారు. కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం ఇచి్చన వివరణలను ఒకరోజులోనే సమరి్పస్తామని తెలిపారు. కాగ్ నివేదిక కరెక్టేనా? అని మరో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నాగేశ్వర్ రెడ్డిని అడగగా, ఆయన కూడా అవునని బదులిచ్చారు. -
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
3 ప్రాజెక్టుల డీపీఆర్లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
కడెంకు సీడబ్ల్యూసీ బృందం రాక
కడెం: కడెం ప్రాజెక్టు రక్షణపై సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దృష్టి సారించింది. గతేడాది, ఈఏడాది ఎగువ నుంచి వరదనీరు వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తరచు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, సీడబ్ల్యూసీ బృందం ఈనెల 27, 28, 29 తేదీ ల్లో వస్తున్నట్టు సమాచారం. కడెం ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ, వరద గేట్ల పనితీరు, ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం, ఔట్ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్ట్ నిర్వహణ తదితరాలను బృందం పరిశీలిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ బృందం వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రాజెక్టు వరద గేట్లు, ఇతర మరమ్మతులు చకచకా చేస్తున్నారు. అదనపు గేట్ల ఏర్పాటుపై... కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. అయితే గతేడాది 6 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో రాగా, గేట్ల పైనుంచి వరద వెళ్లింది. దీంతో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో సామర్థ్యం పెంచేలా కడెం ప్రాజెక్టు మొదటి గేటు పక్క నుంచి పాత జనరేటర్ గదివైపు ఐదు అదనపు గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సీడబ్ల్యూసీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. -
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగని నేటి లభ్యత
-
తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇస్తూ కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ నోట్
-
సీఎం జగన్ అలుపెరగని పోరాటం.. కదిలిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం నిధులివ్వడంపై కేంద్రం మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈ ఏడాది జనవరి 24న అధికారుల కమిటీ చర్చించిన అంశాలను ప్రస్తావించి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు తన కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నియమించిన రాష్ట్ర అధికారుల కమిటీతో చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కమిటీని పీఎంవో ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో కేంద్ర అధికారుల కమిటీతో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్దాస్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగింది. నేడు జరిగే సమావేశం సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని, సమస్యల పరిష్కారం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానితో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రధానాంశాలు ఇవీ ► పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలి. ► సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలి. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు డీబీటీ (నేరుగా నగదు బదిలీ) పద్ధతిలో పరిహారాన్ని అందించాలి. ► రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలి. ► 2014–15కి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి ఈ నిధులను రావాల్సి ఉంది. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే రేషన్ వ్యయాన్ని భరిస్తోంది. ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్ కూడా సూచించింది. ► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి. ► హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి. ► ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది. ► రాష్ట్రంలో 26 జిల్లాలకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరో 12 కాలేజీలకు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలి. ► కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ఏపీఎండీసీకి బీచ్శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు కేటాయింపు అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అలుపెరగని పోరాటం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వడంతోపాటు విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పలు దఫాలు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులతో సమావేశమై సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 3న ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర అధికారులతో కమిటీని నియమించాలని పీఎంవోను ప్రధాని ఆదేశించారు. జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో జల్ శక్తి శాఖ, పౌరసరఫరాల శాఖ తదితర శాఖల కార్యదర్శులతో పీఎంవో కమిటీ ఏర్పాటు కాగా అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, జలవనరులు, హోంశాఖ, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు తదితరులతో సీఎంవో కూడా కమిటీని నియమించింది. కమిటీ తొలుత జనవరి 24న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో ఆయా అంశాలను మరోసారి ప్రస్తావించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. -
కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్ విభాగం) సీఈ డీసీ భట్ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ చేసింది. ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్కు ఎగువన 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్మెంట్పైన కోర్ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్ డ్యామ్ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్) డీసీ భట్ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్) రాజేష్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ అభినందించాయి. ఎత్తు పెంపు పనులకు శ్రీకారం.. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ను 43 మీటర్ల ఎత్తుతో 2,454 మీటర్ల పొడవున నిర్మించారు. 40.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో అడుగుభాగాన గరిష్టంగా 237 మీటర్లు (మధ్యలో 16.2 మీటర్లు వెడల్పుతో కోర్).. పైభాగానికి వచ్చేసరికి కనిష్టంగా 9 మీటర్ల (మూడు మీటర్ల వెడల్పుతో కోర్) వెడల్పుతో కాఫర్ డ్యామ్ను నిర్మించారు. నీటి లీకేజీలను అడ్డుకునేందుకు కోర్ వేసిన మట్టం అంటే 40.5 మీటర్ల వరకూ డ్యామ్లో నీటి మట్టం చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైభాగాన 2.5 మీటర్లు రాళ్లు, మట్టితో పనులు చేశారు. 40.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నీటిమట్టం పెరిగితే.. లీకేజీలవల్ల కాఫర్ డ్యామ్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటీవల గరిష్టంగా 26.9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరంలో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 38.76 మీటర్లు నమోదైంది. కానీ, గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్కు నష్టం కలగకుండా ఉండాలంటే 43 మీటర్ల వరకూ 3 మీటర్ల వెడల్పుతో కోర్వేసి.. పాక్షికంగా రెండు మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచిన పనులకు తోడుగా మిగతా ఏడు మీటర్లు వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సీఈ డీసీ భట్ ఆమోదముద్ర వేశారు. కోర్ను పొరలు పొరలుగా వేసి.. రోలింగ్ చేస్తూ.. పటిష్టతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పనులుచేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. -
కదిలే కాసారాలు.. ఎక్కడ, ఎంత ప్రమాదకరం?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నదీ జలాల్లో విషపూరిత లోహ ధాతువులు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో హెచ్చరించింది. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే వదిలేయడం, పంటలకు వాడే క్రిమిసంహారక మందుల అవశేషాలు వర్షపు నీటి ద్వారా చేరడం, విచ్చలవిడిగా గనుల తవ్వకాలు, మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తుండటం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఆర్సినిక్, నికెల్, లెడ్, కాడ్మియం, కాపర్, క్రోమియం, ఐరన్ లాంటి లోహ ధాతువులు నదీ జలాల్లో కలిసిపోవడం మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారుతోంది. ఇవి రక్తప్రసరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయడంతోపాటు హృద్రోగాలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులు చుట్టుముడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని అల్జీమర్స్ లాంటి రుగ్మతలు, చర్మ క్యాన్సర్లకు దారి తీస్తోంది. నదీ జలాలు విషతుల్యం కావడం మనుషులతోపాటు జంతువులు, పక్షులు, జలచరాల మనుగడపై కూడా తీవ్ర ప్రభావంచూపుతోంది. కాలుష్యంలో పోటాపోటీ.. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదుల నీటి నాణ్యతపై 2018 నుంచి సీడబ్ల్యూసీ అధ్యయనం నిర్వహించింది. గంగా నుంచి కుందూ వరకూ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో 688 నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించింది. కాలుష్యంలో నదుల మధ్య పెద్దగా తేడా లేనట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కడ, ఎంత ప్రమాదకరం? ఆర్సినిక్: ఇది అత్యంత విషపూరితమైన లోహం. ఆర్సినిక్ ధాతువులు లీటర్ నీటిలో 10 మైక్రో గ్రాములు (0.01 మిల్లీ గ్రాములు) వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో అన్ని నదుల్లోనూ 2,834 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది ప్రాంతాల్లో ఆర్సినిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ► భద్రాచలం వద్ద గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 10.17 మైక్రో గ్రాముల ఆర్సినిక్ను గుర్తించారు. ► తమిళనాడులో కావేరి ఉప నది అరసలర్ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 13.33 మైక్రో గ్రాముల ఆర్సినిక్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. లెడ్: ఆర్సినిక్ స్థాయిలోనే అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో పది మైక్రో గ్రాముల లెడ్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 3,111 చోట్ల నమూనాలు పరీక్షించగా 34 ప్రాంతాల్లో లెడ్ ధాతువులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని సోన్ నదీ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 67.5 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. కాడ్మియం: ఆర్సినిక్, లెడ్ తర్వాత కాడ్మియం అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో మూడు మైక్రో గ్రాముల వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలోని నదుల్లో 3,113 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 11 చోట్ల అత్యంత ప్రమాదకర స్థాయిలో కాడ్మియం ధాతువులున్నాయి. ► బద్రాచలం వద్ద గోదావరిలో లీటర్ నీటిలో 4.08 మైక్రో గ్రాముల కాడ్మియం ధాతువులున్నాయి. ►ఉత్తరప్రదేశ్లో సుకేత నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 12.57 మైక్రో గ్రాముల కాడ్మియం ఉన్నట్లు తేలింది. నికెల్: ఇది మరో విషపూరిత లోహం. లీటర్ నీటిలో 20 మైక్రో గ్రాముల వరకూ నికెల్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,099 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 199 చోట్ల ప్రమాదకర స్థాయిలో గుర్తించారు. ► కీసర వద్ద మున్నేరు జలాల్లో లీటర్ నీటికి 33.84 మైక్రో గ్రాములు, వైరా జలాల్లో మధిర వద్ద లీటర్ నీటిలో 71.73 మైక్రో గ్రాములు, విజయవాడ వద్ద కృష్ణా జలాల్లో లీటర్కు 56.71 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. సింగవరం వద్ద చిత్రావతి జలాల్లో లీటర్ నీటిలో 56.58 మైక్రో గ్రాములు, తుంగభద్ర జలాల్లో లీటర్ నీటిలో బావపురం వద్ద 24.78, మంత్రాలయం వద్ద 25.53 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 45.79, పోలవరం వద్ద 61.48 మైక్రో గ్రాములు నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► తమిళనాడు ఎల్నుతిమంగలం వద్ద నొయ్యల్ నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 242.90 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. క్రోమియం: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల వరకూ క్రోమియం ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,106 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 50 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► రాష్ట్రంలో అల్లాదుపల్లి వద్ద కుందూ జలాల్లో లీటర్కు 56.04 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులున్నాయి. తుంగభద్ర జలాల్లో హర్లహళ్లి వద్ద లీటర్ నీటిలో 92.72 మైక్రో గ్రాముల క్రోమియం ఉంది. ► గోదావరి జలాల్లో మంచిర్యాల వద్ద లీటర్ నీటిలో 51.63 మైక్రో గ్రాములు, కిన్నెరసాని జలాల్లో లీటర్కు 60.44 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు తేలింది. ► ఛత్తీస్గఢ్ హస్డియో నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 180.47 మైక్రోగ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. కాపర్: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల లోపు మాత్రమే కాపర్ ధాతువులు ఉండాలి. ► దేశంలో 3,107 ప్రాంతాల్లో నీటి నమూనాలు పరీక్షించగా 17 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► మహారాష్ట్రలోని ఉల్హాస్ నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 132.64 మైక్రో గ్రాముల కాపర్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ఐరన్: లీటర్కు 300 మైక్రో గ్రాములు (0.3 మిల్లీ గ్రాములు) వరకూ ఐరన్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 414 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 0.69, పోలవరం వద్ద 4.75 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► లీటర్ నీటికి మున్నేరు జలాల్లో 1.86, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల్లో 0.91 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► నాగావళిలో శ్రీకాకుళం వద్ద లీటర్ నీటిలో 1.30 మిల్లీ గ్రాములు, మెళియపుట్టి వద్ద వంశధార జలాల్లో 1.09 మిల్లీ గ్రాములు, నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి జలాల్లో 0.49 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు గుర్తించారు. ► బెంగాల్లో పరక్కా ఫీడర్ చానల్ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 11.24 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులున్నాయి. -
వంశధార జలాల వివాదానికి చరమగీతం
సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసింది. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏడున్నరేళ్లపాటు విచారణ.. వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు.. – సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది. – శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది. – నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. – కాట్రగడ్డ సైడ్వియర్ హెడ్ రెగ్యులేటర్ను జూన్ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్వియర్ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది. – ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్.. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ వాటిని తోసిపుచ్చింది. వంశధారలో 115 టీఎంసీల లభ్యత లేదన్న వాదనను కొట్టిపారేసింది. ఎంత నీటి లభ్యత ఉంటే.. అంత నీటిని దామాషా పద్ధతిలో చెరి సగం పంచుకోవాలని ఆదేశించింది. కాట్రగడ్డ సైడ్వియర్ నుంచి వాడుకునే జలాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. తీర్పు అమలును పర్యవేక్షించేందుకు అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వంశధార జలాల వివాద క్రమం ఇదీ.. – ఫిబ్రవరి, 2006: ఏపీ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2పై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఒడిశా. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని ప్రతిపాదన – ఏప్రిల్ 24, 2006: వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ, ఒడిశా జలవనరుల అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మొదటి సమావేశం.. చర్చలు విఫలం – డిసెంబర్ 5, 6, 2006: ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారుల రెండో దఫా సమావేశం.. చర్చలు విఫలం – మార్చి 2, 2007: ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం.. చర్చలు విఫలం – ఏప్రిల్ 30, 2007: అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి.. వంశధార వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒడిశా –ఫిబ్రవరి 6, 2009: ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్నెళ్లలోగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి, వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం – ఏప్రిల్ 24, 2010: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన కేంద్రం – డిసెంబర్ 17, 2013: కాట్రగడ్డ సైడ్వియర్ నిర్మాణానికి ఏపీకి అనుమతి ఇస్తూ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ – సెప్టెంబర్ 15, 2014: వంశధార ట్రిబ్యునల్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఒడిశా.. కాట్రగడ్డ సైడ్వియర్ నిర్మాణ పనులను ఏపీ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు – సెప్టెంబర్ 13, 2017: తుది తీర్పు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్ – డిసెంబర్ 12, 2017: తుది తీర్పుపై అభ్యంతరాలను లేవనెత్తిన ఒడిశా సర్కార్ – జూన్ 21, 2021: ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. తుది తీర్పును ఖరారు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ -
తెలుగు రాష్ట్రాల్లో జల సిరులు
సాక్షి, అమరావతి: ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నదుల్లో వరద ప్రవాహం, సహజ సిద్ధ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఖరీఫ్ పూర్తయింది. రబీలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ దశలో సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) దేశంలో తన పర్యవేక్షణలోని 128 జలాశయాల్లో నీటి నిల్వలపై అధ్యయనం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల్లోని నీటి నిల్వలు గత పదేళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► దేశ వ్యాప్తంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని 128 జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9,104.38 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 3,716.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 4,116.42 టీఎంసీలు ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 3,021.99 టీఎంసీలు నిల్వ ఉండేవి. ► దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,864.94 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 1,169.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదేరోజు వీటిలో 1,133.23 టీఎంసీలు నిల్వ ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 787.5 టీఎంసీల నిల్వ ఉండేవి. అంటే.. గత పదేళ్ల సగటు నీటి నిల్వ కంటే ఈ ఏడాది 50 శాతం అధికంగా నిల్వ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ► ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ.. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనూ.. పెన్నా బేసిన్లో సోమశిల, కండలేరు, ఇతర బేసిన్లలో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు గతేడాది కంటే అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. ► ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రబీ పంటల సాగుకు.. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. అన్యాయంపై నోరుమెదపని వైనం పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు. 2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది. 2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు. బేషరతుగా రూ.2,234.28 కోట్లు సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది. ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్వర్క్స్),భూసేకరణ, ఆర్అండ్ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం
-
ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు
సాక్షి, అమరావతి: కేంద్ర జల్శక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్ కౌన్సిల్ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్లు ఇవ్వాల్సిందేనని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్కు తక్షణమే అజెండాను పంపాలని మరోసారి సూచించింది. శుక్రవారం హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, బోర్డు సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతే ప్రాతిపదిక విభజన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. 450.31 టీఎంసీల తరలింపు పనులు... ► తెలంగాణ సర్కార్ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్ఐఎస్–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్కుంద్ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ చేపట్టింది. రామప్ప లేక్ నుంచి పాకాల లేక్కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. డెల్టా, పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం... ► తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ కేటాయింపులే ప్రామాణికం.. ► గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు. కాళేశ్వరంతో సహా అన్ని డీపీఆర్లు ఇవ్వాల్సిందే... ► ఈ దశలో గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ కాళేశ్వరం సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను వెంటనే అందజేయాలని సూచించారు. తాము పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల డీపీఆర్లను ఇప్పటికే ఇచ్చామని, చింతలపూడి సామర్థ్యం పెంపు డీపీఆర్ను అందచేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. తమ ప్రభుత్వంతో చర్చించి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇస్తామని తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ► పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు. టెలిమెట్రీకి అంగీకారం.. ► గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్ఎస్ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయించాలన్న గోదావరి బోర్డు ప్రతిపాదనను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి. -
‘పోలవరం’పై నివేదిక ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిపై ఫొటోలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ముప్పు ఉందని ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కట్పాలియా వాదనలు వినిపించగా.. జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని ‘ప్రాజెక్టు నిర్మాణంపై మీరు స్టే అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ‘పనుల నిలిపివేత’ ఉత్తర్వులు అమల్లో ఉండగా.. ఏటా దీనిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తోందని కట్పాలియా నివేదించారు. బచావత్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాలని, కానీ 50 లక్షల ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం సాగుతోందని, దీనిపైనే తమ అభ్యంతరమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. పోలవరం నిర్మాణంపై మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని నివేదించారు. పదే పదే ఎందుకు అభ్యర్థించాల్సి వస్తోంది? ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వైఖరేమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అనుమతుల మేరకు, బచావత్ అవార్డు ప్రకారమే నిర్మాణం జరుగుతోందని ఖాద్రీ వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు బచావత్ అవార్డుకు లోబడి ఉన్నప్పుడు పదేపదే స్టాప్ వర్క్ ఆర్డర్ను పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అది పర్యావరణ విభాగానికి చెందినదని ఖాద్రీ వివరించబోగా.. ఒక్కో శాఖకు ఒక్కో న్యాయవాది వస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, తెలంగాణ వాదనలపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి’ అని సూచించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఈసారి భారీ వర్షాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘సెంట్రల్ వాటర్ కమిషన్’ ఆగస్టు ఒకటవ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలోని రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయి నీటి మట్టానికి 80 శాతం నీటితో నిండాయి. ఆ తర్వాత రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయిని దాటి 125 శాతానికి చేరుకున్నాయి. అంటే సాధారణ స్థాయికన్నా 25 శాతం ఎక్కువ. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల రిజర్వాయర్లలోకి నీళ్లు ఎక్కువగా వచ్చి చేరాయి. సాధారణంగా మంచి వర్షాలు కురుస్తున్నప్పుడు సెప్టెంబర్ నెలలో ఇలా దేశంలోని రిజర్వాయర్లన్నింటిలో జలకళ కనిపిస్తోంది. అందుకు విరుద్ధంగా ఆగస్టు నెలలోనే ఇప్పుడు ఆ జలకళ ఆవిష్కతమయింది. ఈ నీటిని సద్వినియోగంగా వాడితే వచ్చే ఏడాది వర్షాలు లేకపోయినా నీటి అవసరాలు తీరిపోతాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావడం వల్ల దేశంలోని రిజర్వాయర్లు ఎక్కువగా నిండాయి. గోదావరి నదిపైనున్న జయక్వాడి రిజర్వాయర్ 92 శాతం నిండింది. అంతగా జలకళ కనిపించని తాపీ నదిపైనున్న ఉకాయ్ రిజర్వాయర్ కూడా ఈసారి 78 శాతం నిండాయి. ఎగువ కురిసిన వర్షాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాషం బ్యారేజీలన్నీ నిండాయి. దాంతో కొంత నీటిని సముద్రంలోకి వదలక తప్ప లేదు. కేరళలో అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి ఈసారి కూడా 496 మంది మరణించడం విషాదకరం. 2018లో సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ తేరుకోక ముందే మళ్లీ వర్షాలు, వరదలు ముంచెత్తడం దురదష్టకరం. గతేడాది సంభవించిన వరదల్లో కేరళలో ఒక లక్ష హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, ఆరున్నర లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు రెండువేల మంది మరణించారు. వర్షాలు, వరదలు కారణంగా కేరళకు 5,597 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈసారి కూడా ఆ రాష్ట్రంలో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా అనూహ్యంగా వర్షాలు, వరదలు పెరగడానికి కారణాలు ఏమిటీ ? భూతాపోన్నతి అంటే భూమిని ఆవహించిన వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాలు పెరిగాయి. 1901 నుంచి 1910 మధ్య ఉన్న భూ వాతావరణంతో పోలిస్తే 2011 నుంచి 2018 సంవత్సరాల మధ్య భూ వాతావరణంలో ఉష్ణోగ్రత 0.65 శాతం డిగ్రీలు పెరిగింది. చల్లటి గాలిలోకన్నా వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలి తేమ వల్ల వాతావరణంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు కురుస్తాయి. తేలిగ్గా ఉండే వేడిగాలి పైకి దూసుకుపోవడం వల్ల పై వాతావరణంలో ఒత్తిడి పెరగడమే కాకుండా వేడిగాలి చోట శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోని పరిసర ప్రాంతాల తేమతో కూడిన గాలులు దూసుక రావడం వల్ల అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ అల్పపీడనం ‘సైక్లోన్ సర్కులేషన్’గా మారితే భారీ వర్షాలు కురుస్తాయి. భూమి తిరుగుతున్న వైపే తుపాన్ ప్రయాణించడాన్ని సైక్లోన్ సర్కులేషన్గా వ్యవహరిస్తారు. మొత్తంగా భూ వాతావరణం వేడిక్కడం వల్ల ఈ సారి వర్షాలు ఎక్కువగా కురిశాయని, భూతాపోన్నతి వల్ల కొన్ని సార్లు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
ప్రతిపాదనలు పంపడానికి 30 నెలలా!
-
పోలవరానికి తొలగుతున్న చిక్కులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్, పోలవరం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ (పీఎంయూ) చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్న రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ) సమావేశం కానుంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించనుంది. వీటికి కమిటీ ఆమోద ముద్ర వేస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ తర్వాత వీటిని కేంద్ర కేబినెట్కు పంపుతారు. చివరగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నిని చల్లార్చేందుకు పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని వంద శాతం భరించి.. పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో కేంద్రం సూచించినా స్పందించలేదు కదా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తమకే అప్పగించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి.. 2014 ఏప్రిల్ 1 తర్వాత నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే తిరిగిస్తామని కేంద్రం షరతు విధించింది. అక్రమాలే అడ్డంకి పీపీఏ నియమావళిలో సెక్షన్ 9(1) ప్రకారం అనుమతి తీసుకోకుండా అంచనా వ్యయం పెంచడం.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేయడం.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించడం గానీ చేయకూడదు. కానీ.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న తర్వాత 2016 సెప్టెంబర్ 8న హెడ్వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,535.91 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనులను రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ అదే ఏడాది డిసెంబర్ 6న చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేయించారు. తొలుత సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కమీషన్లు దండుకున్న చంద్రబాబు.. అధికారంతమున పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. రూ.7,984.93 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యుర్మెంట్ కన్స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నామినేషన్ పద్ధతిలో లంప్సమ్ (ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోనూ భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారు. విడుదల చేసిన నిధులకు యూసీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) పంపితే.. అక్రమాలు బట్టబయలవుతాయనే ఉద్దేశంతో వాటిని పంపకుండా మోకాలడ్డారు. దాంతో నిధుల విడుదల విషయంలో కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది. 2018 జూలై 26న తుది సారిగా కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ స్టేట్మెంట్ పంపాలని జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో కేంద్రం ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ప్రతిపాదనలు పంపడానికి 30 నెలలా! పీపీఏ మొదటి సర్వసభ్య సమావేశం 2015 మార్చి 12న హైదరాబాద్లో జరిగింది. అప్పటి సీఈవో దినేష్కుమార్ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం తాజా ధరల మేరకు ఎంతో తేల్చి.. సంబంధిత ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 30 నెలల తర్వాత రూ.57,940.86 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ 2017 ఆగస్టు 16న పీపీఏ ద్వారా కేంద్ర జల వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో కేంద్ర జల వనరుల శాఖ అనేక మార్లు వీటిని సమీక్షించింది. చివరకు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు కుదించారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఫిబ్రవరి 11న కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించి.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. వీటిని కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. వీటిపై చర్చించడానికి మంగళవారం ఆర్ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. పారదర్శకతకు పెద్దపీట వేయడంతో.. సీఎం ప్రమాణ స్వీకారం చేయక ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సత్వరమే నిధులు ఇవ్వాలని కోరారు. విడుదల చేసిన నిధులకు యూసీలను ఎప్పటికప్పుడు పంపుతామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలను సహించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఈనెల 15న నీతి అయోగ్ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈనెల 20న పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సందర్భంలోనూ అక్రమాలను సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోగా పోలవరం పనులపై ఆడిట్ నిర్వహించి.. అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈనెల 22న నిపుణుల కమిటీతో సమా వేశమైన సీఎం వైఎస్ జగన్ తక్షణమే పోలవరం పనులపై విచారణ చేయాలని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటంతో ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల వ్యవహారాన్ని తక్షణమే తేల్చాలని కేంద్ర ఆర్థిక శాఖను ప్రధాని ఆదేశించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు రాజ్యసభలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి కటారియా జవాబు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా వెల్లడించారు. వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మహ్మద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘గతేడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను 2013–14, 2017–18 ధరల సూచీకి అనుగుణంగా వరుసగా రూ.57,941 కోట్లు, రూ.57,297.42 కోట్ల మేర కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించింది. జలవనరుల శాఖలోని సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల విభాగం సలహా కమిటీ.. ఫిబ్రవరి 11న జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. 2017–18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించింది. దీని ప్రకారం.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202.69 కోట్లు, హెడ్వర్క్స్కు రూ.9,734.34 కోట్లు, పవర్హౌస్ పనులకు రూ.4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల మేర ఆమోదం తెలిపింది’ అని మంత్రి వివరించారు. అమరావతి రింగ్ రోడ్డు ఎంవోయూకు సిద్ధం విజయవాడ, అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ‘అమరావతిలో రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్కు మేం ఏనాడో ఆమోదం తెలిపాం. అయితే.. ఈ ప్రాజెక్ట్కు అవసరమైన భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్పై ముందుకు వస్తే ఎంవోయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. అలాగే అమరావతి–అనంతపురం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్రమే భరించాలని కేంద్రం చెబుతోందని, రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అనుగుణంగా లేనందున కేంద్రం భరించాలని విజయసాయిరెడ్డి కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే మార్గం చూడాలన్నారు. అనంతపురం జిల్లా జంతలూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర మంత్రిమండలి గతేడాది మేలో ఆమోదం తెలిపిందని, అయితే దీనికి సెంట్రల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్సభలో చెప్పారు. -
గప్చుప్గా ఆల్మట్టి ‘ఎత్తు’లు
చుక్క నీరు కూడా దిగువకు రాకుండా కృష్ణమ్మను ఒడిసి పట్టుకునేందుకు కర్ణాటక తహతహలాడుతుంటే రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 టీఎంసీలను అదనంగా దండుకునేందుకు ‘ఆల్మట్టి’ ఎత్తు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎత్తిపోతల పథకాలతో ‘కృష్ణ’ను దారి మళ్లిస్తున్నా గుడ్లప్పగించింది. పాలక పెద్దల స్వార్థం రైతాంగానికి శాపంగా మారనుంది. ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే రాష్ట్రంలో సాగు నీటిపై అన్నదాతలు ఆశలొదులుకోవాల్సిందే. సాక్షి, అమరావతి : ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. తద్వారా అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.30,143 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 30,875 హెక్టార్ల భూమిని ఒక వైపు సేకరిస్తూనే, మరో వైపు 22 ముంపు గ్రామాలకు చెందిన 23,561 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులను గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించింది. ఈ పనులు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోని రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేయక ముందే.. కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. కానీ ఈ తీర్పును అమలు పరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. డీపీఆర్ తయారీకి 2014లోనే టెండర్లు కేంద్రం నోటిఫై చేయకపోయినా, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 డిసెంబర్లోనే కర్ణాటక సర్కారు టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన వ్యాప్కోస్కు అప్పగించింది. ఈ విషయమై అధ్యయనం చేసిన వ్యాప్కోస్.. 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే 30,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని తేల్చింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశలో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు చేపట్టి, ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్లకు నీళ్లందించవచ్చని నివేదించింది. ఇందుకు రూ.30,143 కోట్ల వ్యయం అవుతుందని చెప్పింది. ఈ నివేదికను 2016లోనే ఆమోదించిన కర్ణాటక సర్కార్ ఇప్పుడు భూసేకరణ, పునరావాస పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలలు ఆలస్యంగా కృష్ణమ్మ ఆల్మట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్ జలాశయం ఎడమ కాలువకు అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా అదనంగా కనీసం 223 టీఎంసీలను వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కేవలం ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీల నుంచి 210.89 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆగస్టు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల, శ్రీశైలం జలాశయాలకు చేరడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయినా, నారాయణపూర్ జలాశయానికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు పూర్తయినా.. ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి చేరే వరద ప్రవాహంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంది. ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్.. 299 టీఎంసీలు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. ఐదేళ్లుగా వర్షాభావం వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. కేటాయింపుల మేరకు నీటి లభ్యత లేకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. అప్పుడు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సర్కార్ ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదంటున్నారు. కనీసం కర్ణాటక చర్యలపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది. -
మరో రియాల్టీ షోకు సిద్ధమైన చంద్రబాబు
-
పోలవరంలో ‘గేట్ షో’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మరో రియాల్టీ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. 48 గేట్లు అమర్చాల్సిన చోట ఇప్పటికి ఒక గేటు అమర్చుతూ ప్రాజెక్టు పూర్తయినట్లే హడావుడి చేస్తున్నారు. నిజానికి 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని ఇస్తానని గతంలో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. 2018 మరో వారం రోజుల్లో పూర్తి కానున్నా.. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన మట్టి, రాతి కట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు ప్రాథమిక స్థాయిని కూడా దాటలేదు. దీంతో మే, 2019 నాటికి పాక్షికంగానూ.. డిసెంబర్, 2019 నాటికి పూర్తిగానూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు మాట మార్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, అదీ సాధ్యం కాదని భావించిన ఆయన.. వరుస వైఫల్యాలు, పోలవరంలో వేలాది కోట్ల రూపాయల కమీషన్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోమవారం కొత్త షోకు తెరతీశారు. పోలవరం స్పిల్ వేలో 41వ గేటు స్కిన్ ప్లేట్ను అమర్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియాలిటీ షోలలో ఇది ఆదీ కాదు.. అంతమూ కాదు, ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదోక హడావుడి చేస్తూనే ఉంటారని సీనియర్ ఐఏఎస్ అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. మట్టి పనులే పూర్తికాలేదు.. పోలవరం జలాశయాన్ని 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జలాశయం(హెడ్ వర్క్స్) పనులను ఐదు భాగాలుగా చేపట్టారు. వీటిలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్), జలవిద్యుద్పుత్తి కేంద్రం, కుడి వైపు కాలువ అనుసంధానం.. ఎడమ వైపు కాలువ అనుసంధానం ఉన్నాయి. కుడి, ఎడమ వైపు కాలువల అనుసంధానం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనులు దాదాపుగా నిలిచిపోయాయి. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్నాక స్పిల్ వే ద్వారా వరద జలాలను గోదావరి నదిలోకి మళ్లిస్తారు. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా నదిలోకి విడుదల చేసేలా 1128.40 మీటర్ల పొడవుతో, 45.72 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను నిర్మించాలి. స్పిల్ వే నుంచి వరద జలాలను విడుదల చేయడానికి 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో కూడిన 48 గేట్లను అమర్చాలి. పది రివర్ స్లూయిజ్లను ఏర్పాటు చేయాలి. ఈ పనులు పూర్తి కావాలంటే 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలి. మట్టిపనిలో ఇంకా 194.42 లక్షల క్యూబిక్ మీటర్లు మిగిలి ఉంది. గోదావరి వరద జలాలను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి వీలుగా చేపట్టిన అప్రోచ్ ఛానల్లో 101.48 క్యూబిక్ మీటర్లు, వరద దిగువకు విడుదల చేయడానికి చేపట్టిన స్పిల్ ఛానల్ పనులలో ఇంకా 46.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేయాలి. కాంక్రీట్ పనుల్లో ఇంకా 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. రెండు బ్లాక్లే గేట్ల ఎత్తుకు.. స్పిల్ వేను 52 బ్లాక్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో కేవలం రెండు బ్లాక్లు మాత్రమే 25.72 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు పనులు పూర్తయ్యాయి. ఆ రెండు బ్లాక్ల మధ్యనే 41వ గేట్ను అలంకార ప్రాయంగా అమర్చే పనులను సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఒక్కొక్క గేట్ను అమర్చాలంటే ఎనిమిది స్కిన్ ప్లేట్లను హారిజాంటల్ గెర్డర్లు, ఆర్మ్స్ గెర్డర్లు, బ్రాకెట్స్తో వెల్డింగ్ చేయాలి. ఒక్కో గేట్ బరువు 300 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కో గేటును అమర్చడానికి కనీసం 55 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా 250 మెట్రిక్ టన్నులతో కూడిన హైడ్రాలిక్ హాయిస్ట్లను అమర్చుతారు. వీటిని జర్మనీ నుంచి ఇప్పటివరకూ దిగుమతి చేసుకోలేదు. అవెప్పుడు చేరుతాయో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఇకపోతే జలాశయం పనుల్లో అత్యంత కీలకమైన 18 డిజైన్లకు సంబంధించి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా ఆమోదం పొందలేదు. పనులన్నీ పునాదిలోనే.. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్లోనే. గోదావరి నదీ గర్భంలో 2,454 మీటర్ల పొడవున దీనిని నిర్మించాలి. దీని నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్ఎఫ్కు 250 మీటర్ల ఎగువన 2,050 మీటర్ల పొడవున ఒక కాఫర్ డ్యామ్, 200 మీటర్ల దిగువన 1,417 మీటర్ల పొడవున మరో కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్ను 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సీడబ్ల్యూసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ నాటికి స్పిల్ వే పనులను పూర్తి చేసి.. కనీసం 17 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించడానికి వీలుగా నిర్మాణం ఉన్నప్పుడే ఎగువ కాఫర్ డ్యామ్ను నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఈ కాఫర్ డ్యామ్ను మే నాటికి పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనుల్లో ఇప్పటివరకూ కేవలం పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ డ్యామ్ పూర్తి కావాలంటే 77.81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పని చేయాలి. ఇప్పటివరకూ కేవలం 97 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేశారు. ఇంకా 76.84 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలి. లేదంటే జూన్లో వచ్చే వరదకు కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్ పేర్కొన్నారు. ఇక దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేయాలంటే 53.78 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పనులు చేయాలి. ఇందులో ఇప్పటివరకూ పునాది పనులే చేశారు. ఇక ఈసీఆర్ఎఫ్ పనులు పునాదికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రాజెక్టు పనులు పూర్తయినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్లానింగ్ లోపమే శాపం
-
ప్రణాళిక లోపమే పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, ప్రణాళిక రాహిత్యం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారుతోందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కుండబద్ధలు కొట్టింది. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ బుధవారమూ సమీక్ష సమావేశం నిర్వహించింది. పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)లో నిర్మించిన నమూనా పోలవరం జలాశయంలో వివిధ స్థాయిలో వరదను పంపి.. ప్రయోగాలు చేసి డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో నిర్వహించే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంంలో పెండింగ్ డిజైన్లు, స్పిల్వే, కాఫర్ డ్యామ్ల పనులను పూర్తి చేయడంపై సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఆలోగా నమూనా డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. హెడ్ వర్క్స్లో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో 194.92 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉందని.. గేట్ల తయారీ పనులు పూర్తి చేశామని పీపీఏకు సీఈ శ్రీధర్ వివరించారు. మే నెలాఖరుకు నాలుగు భాగాలుగా కాఫర్ డ్యామ్ పనులు పూర్తిచేయడానికి ప్రణాళిక రచించామన్నారు. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పందిస్తూ మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయగలిగితేనే.. జూన్ రెండో వారం నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నదిలోకి మళ్లించవచ్చునన్నారు. ఇదే సమయంలో డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య స్పందిస్తూ హెడ్ వర్క్స్కు సంబంధించిన 45 డిజైన్లలో ఇప్పటివరకూ సీడబ్ల్యూసీ 27 డిజైన్లను ఆమోదించిందని మిగతా 18 డిజైన్లు అత్యంత కీలకమైనవని, వీటిని కూడా వీలైనంత తొందరగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని, అయితే ఇప్పటికీ కాంట్రాక్టర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిజైన్ నమునాలు తమకు అందకపోవడాన్ని ఎత్తిచూపారు. పనుల నాణ్యతపై పెదవివిరుపు..: పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో నాణ్యతపై వైకే శర్మ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టడంపై పీపీఏ ప్రధానంగా చర్చించింది. జలాశయం పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు వేర్వేరు అధికారులను నియమించాలని.. కానీ ఒకే అధికారిని ఆ రెండు పదవుల్లో నియమించడాన్ని తప్పుబట్టింది. సెంట్రింగ్, షట్టరింగ్ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే స్పిల్వేకు పలు బ్లాక్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చడంపై సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సూచలన ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్) పనుల్లో పురోగతి కన్పించకపోవడాన్ని ఎత్తిచూపింది. ఆ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి.. మే నాటికి పూర్తయ్యేలా చూస్తామని జలవనరుల శాఖ అధికారులు పీపీఏకు వివరించారు. ఈ సందర్భంలోనే మే నెలాఖరు నాటికి హెడ్ వర్క్స్, కాలువలు పూర్తి చేస్తామని చెబుతున్నారని, అయితే ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా అందిస్తారని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ ప్రశ్నించారు. ఇది ప్రణాళిక రాహిత్యాన్ని ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. పునరావాసంపై ప్రతి వారం సమీక్ష..: కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రకారం కాఫర్ డ్యామ్ను 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి.. నీటిని నిల్వ చేస్తే 18,118 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారన్నారు. ఇప్పటివరకూ 3,922 కుటుంబాలకే పునరావాసం కల్పించారని.. మిగిలిన కుటుంబాలకు మేలోగా ఎలా పునరావాసం కల్పిస్తారని పీపీఏ ప్రశ్నించింది. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచామని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. టెండర్లలో పునరావాస కాలనీల నిర్మాణానికి కనీస గడువు 12 నెలలు పెట్టారని.. ఇప్పుడేమో మే నెలాఖరకు పూర్తి చేస్తామని చెబుతున్నారని.. ఎలా విశ్వసించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తామని.. వాటి ఆధారంగా> చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు. -
అంచనాల్లో ఇంత అరాచకమా!?
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లోని లోపాలను కేంద్రం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)తో పోల్చితే.. 2013–14 ఎస్ఎస్ఆర్ ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం అధికంగా ఉండటంపై నివ్వెరపోయింది. హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాల్లో భారీగా అంతరాలు ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. భూసేకరణ.. సహాయ, పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణ నివేదికలపై ఈనెల 12 నుంచి ఢిల్లీలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని.. వాటికి సంబంధిత అధికారులు హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహేతుకమైన వివరణలు ఇస్తే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించి.. సాంకేతిక సలహా మండలి (టీఏసీ)కి పంపుతామని తెలిపింది. సవరణల్లో లోపాలను అధ్యయనం చేయండి పోలవరం పనుల పురోగతి, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు మసూద్ హుస్సేన్, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల (2010–11 ధరల ప్రకారం) నుంచి 2013–14 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లకు సవరిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిలో కేంద్ర జలవనరుల శాఖ ఎత్తిచూపిన లోపాలపై గత నెల 13న రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఆ నివేదికపై ఈ నెల 12లోగా సమగ్రంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్ ఆదేశించారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీపైనా అనుమానాలు ఇదిలా ఉంటే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్ల నుంచి రూ.33,225.74 కోట్లకు పెరగడంపై కూడా కేంద్రం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగకపోయినా ముంపునకు గురయ్యే భూమి రెండింతలకు చేరడం, ముంపు గ్రామాలు పెరగడం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య భారీగా పెరగడంపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. అంతలోనే ఇంత తేడానా.. పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.6,600.56 కోట్లనీ.. ఇందులో కేవలం స్పిల్ వే, ఈసీఆర్ ఆఫ్ పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ఆధారంగా రూ.4,054 కోట్ల నుంచి రూ.5535.41 కోట్లకు పెంచారని.. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.8,081.41 కోట్ల అవుతుందని కేంద్ర జలవరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పేర్కొన్నారు. కానీ.. 2013–14 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.11,338.37 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలు తక్కువగా ఉంటాయని.. ఆ లెక్కన అంచనా వ్యయం తగ్గాల్సి ఉండగా ఎందుకు పెరిగిందని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నిలదీశారు. 2015–16 ధరల ప్రకారం ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు పెంచారని, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు పెంచారనీ.. కానీ 2013–14 ధరల ప్రకారం పంపిన ప్రతిపాదనల్లో ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 4,476.96 కోట్లకు, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,644.13 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఇది ప్రకృతి హెచ్చరిక
కేరళలో ఈ ఏడాది వానలు, నదులు మనుషులతో మాట్లాడుతున్నాయి. చిన్ననాటి నుంచీఈ వానలే నా కలంలో సిరా. అవే నన్ను రచయిత్రిని చేశాయి. మీనాచిల్ నది నా కథను నడిపించింది. ప్రస్తుతం నదుల మహోగ్రరూపం ఊహకు అందనిది. త్రివిధ దళాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు, మత్స్యకారులు ముఖ్యంగా సామాన్యులు ఎనలేని ధైర్యసాహసాలు చూపారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమే అని చెప్పడానికి వీల్లేదు. మానవ తప్పిదం ఎంతో ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలే మొదట బలైపోతాయి. ఒకవైపు కార్చిచ్చులతో కాలిఫోర్నియా తగలబడిపోతూంటే, ఇటు వర్షబీభత్సంతో కేరళ మునిగింది. మనిషి అంతులేని స్వార్థంతో చేస్తున్న పనులతో కొండల మీదుగా వాన నీటి ప్రవాహం దిశ మారింది. అటవీ భూముల్లో గనుల తవ్వకం, చట్టవిరుద్ధంగా రిసార్టులు, సంపన్నుల ఇళ్లు, డ్యామ్ల అడ్డగోలు నిర్వహణ వంటివన్నీ నేటి ప్రళయానికి కారణం. ఈ వరదల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఊహించకుండా ఎలా ఉంది? వరదనీటిని ఒడిసిపట్టాల్సిన డ్యామ్లు కీలక సమయంలో విపత్తు తీవ్రతను ఎన్నో రెట్లు పెంచేలా నీళ్లు ఎలా విడుదల చేశాయి? ఇప్పుడు సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వాటిలో సామాన్యులు ఇస్తున్నవే ఎక్కువ. చిత్రమేమిటంటే ఎవరికైతే మనం నిధులిస్తున్నామో ఆ ప్రభుత్వ యంత్రాంగమే హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎప్పుడో ఊహించింది. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోకపోతే వినాశనమేనని హెచ్చరించింది. కేరళ వరదల్ని అడ్డుపెట్టుకొని భారత్లో కొందరు విషాన్ని చిమ్ముతున్నారు. ప్రేమ, ఆప్యాయత పంచాల్సిన సమయంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన దళితులు, ఆదివాసీలకు రాష్ట్రసర్కారు అండగా ఉంటుందని ఆశిద్దాం. మనం చేతులారా నాశనం చేసిన పర్యావరణాన్ని మనమే చక్కదిద్దాలి. అలా చేయకుంటే దేవభూమిలో మనిషి మసలడం సాధ్యం కాదు. 2018 వరదలు మనకి ఒక సున్నితమైన హెచ్చరిక. -
కొనసాగుతున్నవరద పోటు..
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/ధవళేశ్వరం(రాజమహేంద్రవరం రూరల్)/సాక్షి ప్రతినిధి, ఏలూరు/శ్రీశైలంప్రాజెక్ట్ : గోదావరి, కృష్ణా నదులు వరదతో పోటెత్తుతున్నాయి. శనివారం కృష్ణా నదిలో వరద ప్రవాహాం భారీగా పెరగడంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను పది అడుగుల మేరకు తెరిచి నాగార్జునసాగర్కు 2,13,584 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ల్లో కురిసిన వర్షాలకు పెన్గంగ, ప్రాణహిత, ఇంద్రావతిల నుంచి వస్తున్న ప్రవాహాలకు శబరి, సీలేరు, తాలిపేరు వరద తోడవడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తడంతో 30కి పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణాలో పెరిగిన వరద.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర జలాశయం నుంచి వదిలిన ప్రవాహం తోడవడంతో రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శ్రీశైలం డ్యాంకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో శనివారం ఉదయం 8.40 గంటలకు రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారానూ నీటి విడుదల ప్రారంభించారు. డ్యాంనీటి మట్టం 881 అడుగులకు చేరుకోగా.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్ ఆన్చేసి గేట్లను తెరిచారు. శ్రీశైలం దేవస్థానం వేదపండితులు కృష్ణమ్మకు హారతి ఇవ్వగా మంత్రి దేవినేని వాయనం సమర్పించారు. ముందుగా నాలుగు రేడియల్ క్రస్ట్గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. సా.4 గంటల సమయానికి వరద ప్రవాహం పెరగడంతో మరో రెండు గేట్లను తెరిచారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంకొక గేటు ఎత్తారు. రాత్రి 11గంటల సమయంలో మొత్తం ఎనిమిది గేట్ల ద్వారా 2,13,584 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. అలాగే రెండు పవర్హౌస్ల్లో విద్యుత్ ఉత్పాదన అనంతరం మరో 72,872 క్యూసెక్కుల నీరు సాగర్కు విడుదలవుతున్నాయి. బ్యాక్వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 30,425 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 881.90 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ 198.36 టీఎంసీలు ఉంది. ఎగువ ప్రాంతాల (జూరాల, సుంకేసుల) నుంచి జలాశయానికి 2,67,137 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి మొత్తం 2,89,861 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. మరో 3 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందని కేంద్ర జలసంఘం తెలపడంతో ఔట్ఫ్లో పెంచారు. మున్నేరు, వైరా, కట్టలేరు వాగుల నుంచి వరద వస్తోండటంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉ.6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 10,281 క్యూసెక్కులు రాగా సాయంత్రం 6 గంటలకు వరద 14,098 క్యూసెక్కులకు పెరిగింది. కాలువలకు 10 వేల క్యూసెక్కులు విడుదల చేసి మిగతా నీటిని మూడు గేట్లు తెరిచి సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 14,15,000 క్యూసెక్కుల నీరు రాగా కాలువలకు 6,700 క్యూసెక్కులు విడుదల చేసి మిగతా 14,08,300 క్యూసెక్కులను 175గేట్లు ఎత్తేవేసి కడలిలోకి వదిలారు. సా.6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరదప్రవాహం 12,88,442 క్యూసెక్కులకు తగ్గింది. శుక్రవారం ఉ.6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు 121.677 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. శనివారం సా.6 గంటలకు 13.70 అడుగులకు తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా తగ్గుతుండటంతో ఆదివారం నాటికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికనూ ఉపసంహరించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం పరిశీలించారు. శనివారం రాత్రి 7 గంటలకు బ్యారేజ్ నుంచి 12,75,162 క్యూసెక్కుల వరదను దిగువకి విడుదలచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఆలయాలన్నీ శుక్రవారం రాత్రి నుంచి వరద ముంపులోనే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి ఈ క్ష్రేత్రం వరద ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. వేలేరుపాడు మండలంలో టేకూరు నుంచి కటుకూరు మధ్య రెస్క్యూబోటు సాయంతో జనాలను తరలిస్తున్నారు. వశిష్టగోదావరి ఉధృతరూపం దాల్చడంతో పాలకొల్లు మండలం భీమలాపురం నుంచి ఆచంట మండలం అయోధ్యలంక వరకూ ఉన్న పలు లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లోని వేల ఎకరాల్లో ఉన్న పంటలు నీట మునిగాయి. పోలవరంలో కొత్తూరు కాజ్వే, కడెమ్మ బ్రిడ్జి నీట మునగడంతో ఇంకా 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ చానల్లోకి నీరు ప్రవేశించడంతో అక్కడి పనులు నిలిచిపోయాయి. స్పిల్వే పనులు కూడా వర్షాల కారణంగా నెమ్మదిగా సాగుతున్నాయి. కాగా, ఒడిశాలో వర్షాలు కొనసాగుతుండటంతో వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం నిలకడగా ఉంది. జలదిగ్బంధంలో లంక గ్రామాలు కాగా, వరద పోటుతో ఉగ్రరూపం చూపించిన గోదావరి శనివారం సాయంత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏజెన్సీని వణికించిన శబరి నది శాంతించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు భారీ వరద ముప్పు తగ్గింది. నదుల్లో నీటిమట్టాలు తగ్గుముఖం పట్టినా వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల కాజ్వేలు, రహదారులు నీట మునిగాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అక్కడి ప్రజలు ముంపు నీటిలోనే గడుపుతున్నారు.గోదావరి వరదకు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. జిల్లాలోని 25 లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. కాజ్వేలు, రహదారులపై భారీగా వరద నీరు పొంగి ప్రవహించడంతో 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వీటిలో అత్యధిక గ్రామాలు ఏజెన్సీలోని విలీన మండలాల పరిధిలోనివే. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి వద్ద చొల్లంగి సోమశేఖర్ (32) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలోపడి గల్లంతయ్యాడు. -
మళ్లీ మళ్లీ పొడిగింపు..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఏఐబీపీ పరిధిలో ఉన్న 11 రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను గత ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా ప్రాజెక్టుల కింద భూసేకరణ, నిధుల విడుదలలో జాప్యం వల్ల ప్రాజెక్టులను ఈ సీజన్లో పూర్తి చేయలేమని వచ్చే జూన్ వరకు గడువు పొడగించాలని నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి స్పష్టం చేసింది. పొడిగింపు జాబితాలో భారీ ఆయకట్టు లక్ష్యాలున్న దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా వంటి ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. మూడు పూర్తి.. ఎనిమిది అసంపూర్తి.. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగ న్నాధ్పూర్, భీమా వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇప్పటికే 18,838 కోట్లు ఖర్చు చేశా రు. మరో రూ.5,881 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మొత్తం అవసరాల్లో కేంద్రం తన సాయం కింద రూ.4,513 కోట్లు అందించాల్సి ఉండగా ఇంతవరకు రూ.3,949 కోట్లు అం దించింది. మరో రూ.564 కోట్ల మేర అందించాలి. ఈ ప్రాజెక్టులను 2014 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వాటి గడువును 4 సార్లు పొడిగించారు. 2017 మార్చిలో దీనిపై ప్రధాని మోదీ సమీక్షించినపుడు ఆ ఏడాది జూన్ నాటికే దేవాదుల, భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగులు పూర్తి చేస్తామని తెలిపింది. గొల్లవాగు, జగన్నాధ్పూర్ పెద్దవాగు, పాలెంవాగు, కొమురం భీం, ర్యాలివాగు, నీల్వాయిలను 2018 జూన్ నాటికి పూర్తి చేస్తామంది. గొల్లవాగు, ర్యాలివాగు, మత్త డి వాగే పూర్తయ్యాయి. మరో 8 ప్రాజెక్టుల పరిధిలో 15 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఆలస్యమయ్యాయి. భూ సేకరణలో జాప్యం: దేవాదుల ప్రాజెక్టుకు మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవరకు 11వేల హెక్టార్లు సేకరించగా, మిగతా 3,900 హెక్టార్లను సేకరించాలి. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీంలో మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు పూర్తి చేయాల్సి ఉండగా అది పూర్తవలేదు. దీంతో పనులు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో మంగళవా రం దీనిపై కాడా అధికారులతో కేంద్ర జల సంఘం సీఈ రంగారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రాజెక్టు పూర్తికి కొత్త లక్ష్యాలను నిర్ణయించారు. పాలెంవాగును ఈ ఏడాది డిసెంబర్కు, దేవాదుల, ఎస్సారెస్పీ–2, భీమా, నీల్వాయి, కుమురం భీం, జగన్నాధ్పూర్లను వచ్చే ఏడాది జూన్ నాటికి, ఇందిరమ్మ వరద కాల్వ పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ హామీ ఇచ్చిం ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సత్వ రం విడుదల చేస్తే నిర్ణీత సమయానికి పూర్తి చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పింది. -
‘గోదావరి’లో టెలిమెట్రీ అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు చేస్తున్న నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న టెలిమెట్రీ వ్యవస్థను గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో అమలు చేయాలన్న బోర్డు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గోదావరి బేసిన్ పరిధిలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజెక్టులు, నీటి లభ్యత విషయంలో వివాదాలు లేనప్పుడు టెలిమె ట్రీ వ్యవస్థ ఎందుకని, అక్కర్లేదని తెలంగాణ చెప్పింది. దీనిపై ఇటీవల గోదావరి బోర్డుకు లేఖ రాసింది. అప్పటి వరకు పక్కన పెట్టండి.. గోదావరి బేసిన్లోని నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, దేవాదుల, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టుల పరిధిలోని 120 ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనిపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపింది. గోదా వరి బేసిన్లో సరిపడా లభ్యత జలాలు ఉన్నాయని, ఇవికాక ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తా యని తెలిపింది. గోదావరి, దాని ఉపనదులు, ప్రధా న డ్యామ్ ప్రాంతాల్లో 27 గేజ్ డేటా స్టేషన్లు ఉన్నాయని, ఇవన్నీ కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహిస్తున్నారని వివరించింది. ఈ గేజ్ స్టేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాలు, వరద అంచనా, గణింపు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకమారు కృష్ణా బేసిన్లో టెలి మెట్రీ వ్యవస్థను అమలు పరిస్తే, తర్వాత భవిష్యత్తులో గోదావరి బేసిన్లో ఈ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అప్పటి వరకు టెలిమెట్రీ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని తెలి పింది. దీనిపై గోదావరి బోర్డు ఎలా స్పందిస్తుందన్న ది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ పరి« దిలో తొలి విడతలో 18, రెండో విడతలో 29 ప్రాం తాల్లో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రెండేళ్ల కింద నిర్ణయించినా అమలు కాలేదు. దీంతో గోదావరి బేసిన్ పరిధిలో టెలిమెట్రీ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కాళేశ్వరానికి మరో రెండు కీలక అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కేంద్ర అనుమతులు లభించాయి. ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తన ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 237 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు అంచనావ్యయం రూ.80,190.46 కోట్లకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. హెడ్ వర్క్స్ పనుల కోసం రూ.33,145.44 కోట్లు , నీటి సరఫరా వ్యవస్థ (కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు) కోసం రూ.47,045.02 కోట్లు వ్యయం అవుతాయని ప్రభుత్వం ప్రతిపాదించగా, దీనికి కేంద్ర జలసంఘం పచ్చజెండా ఊపింది. ఈ అంచనా వ్యయాన్ని మూడేళ్ల వరకు సవరించకూడదని పేర్కొంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,190.46 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. అందులో పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్, అంతర్రాష్ట్ర, ఇరిగేషన్ ప్లానింగ్, భూగర్భజల విభాగం అనుమతులు కీలకమైనవి. వీటిలో అటవీ, పర్యావరణ అనుమతులు, హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతి, భూగర్భజల విభాగం, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ అనుమతులు లభించగా ప్రస్తుతం మరో రెండు కీలక అనుమతులు లభించాయి. 240 టీఎంసీల లభ్యత.. 237 టీఎంసీల వినియోగానికి ఓకే... నిజానికి కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటిని తీసుకుంటామని ప్రభుత్వం గతంలో తెలపగా, అనంతరం దాన్ని సవరించి మేడిగడ్డ వద్ద 195 టీఎంసీలు తీసుకుంటామని తాజాగా కేంద్రానికి సమర్పించిన నివేదికలో నీటి పారుదల శాఖ పేర్కొంది. ఈ 195 టీఎంసీలకు తోడు ఎల్లంపల్లిలో లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భజలాల ద్వారా లభించే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తంగా 240 టీఎంసీలను ప్రాజెక్టు కింద నిర్ణయించిన కొత్త, స్థిరీకరించే ఆయకట్టుకు, ఇతర అవసరాలకు నీరందిస్తామని కేంద్రానికి రాష్ట్రం తెలిపింది. ఈ 240 టీఎంసీల 237 టీఎంసీల వినియోగం ఉంటుందని, అందులో నీటిలో 169 టీఎంసీలు కొత్త, పాత ఆయకట్టుకు, 30 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పరీవాహక గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు వినియోగించనుండగా, మరో 12 టీఎంసీలను ఆవిరి నష్టాలుగా చూపించారు. ఈ లెక్కలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ప్రాజెక్టుకు 78శాతం సక్సెస్ రేటు ఉంటుందని అంచనా వేసి, దీనికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ డైరెక్టర్ విశ్వకర్మ మంగళవారం ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. మూడేళ్లపాటు వ్యయం సవరించొద్దు ఇక ప్రాజెక్టు వ్యయ అంచనాను గతంలో రూ.80,499.71కోట్లుగా చూపగా, ప్రస్తుతం దాన్ని సవరించి రూ.80,190.46కోట్లుగా చూపారు. ఈ వ్యయ అంచనా వాస్తవాలకు దగ్గరగా ఉందని, మరో లేఖలో ఆ డైరెక్టరేట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ప్రభుత్వానికి రాసిన మరో లేఖలో పేర్కొన్నారు. కనీసంగా మూడేళ్ల పాటు ఈ వ్యయాన్ని సవరించకుండా చూసుకోవాలని సైతం ఈ లేఖలో రాజీవ్కుమార్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్కు అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
కాళేశ్వరంను సందర్శించిన సీడబ్ల్యూసీ చైర్మన్
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సోమవారం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీల పనులను వద్దకు చేరుకున్న ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. నిర్మాణ పనులు, ప్రాజెక్టు గురించి హరీష్ మసూద్ హుస్సెన్కు వివరించారు. -
కాళేశ్వరం ఓ అద్భుతం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహా వేగవంతమైన పనులను ఇంతకుముందు ఎక్కడా చూడలేదని, ఇదో అద్భుతమని కితాబిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని, ఈ ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయని పేర్కొంది. అనుకున్న సమయానికి, నిర్ణయించిన వ్యయంతో ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని, ఈ సవాలును ప్రభుత్వం అధిగమిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరును రెండ్రోజులపాటు ప్రత్యక్షంగా పరిశీలించిన సీడబ్ల్యూసీకి చెందిన ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్(పీఏఓ) సీఈ సీకేఎల్ దాస్, హైడ్రాలజీ డైరెక్టర్ ఎన్.ఎన్.రాయ్, కాస్ట్ అప్రైజల్ డైరెక్టర్ రాజీవ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ ముఖర్జీ బుధవారం జలసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం అన్నీ విధాలా ప్రత్యేకమైనదని బృందం సభ్యులు వ్యాఖ్యానించారు. ‘‘కాళేశ్వరం సమీకృత, బహుళార్థ సాధక ప్రాజెక్టు. మిడ్ మానేరు, ఎస్సారెస్పీ సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబోతోంది. ఇలా ఒక భారీ ప్రాజెక్టును మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తున్న ప్రక్రియ ఇక్కడే కనిపిస్తోంది. నిర్మాణాలు, ప్రణాళిక, పనులు జరుగుతున్న తీరు మమ్ముల్ని ఆకట్టుకున్నాయి. రేయింబవళ్లు మూడు షిఫ్టులలో జరుగుతున్న పనుల వేగాన్ని చూస్తుంటే వచ్చే వానాకాలం కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలురాయి దాటుతుందని భావిస్తున్నాం. మేం దేశంలో, దేశం బయట అనేక ప్రాజెక్టుల పరిధిలో పర్యటించినా.. ఈ తరహా వేగవంతమైన పనులు ఎక్కడా చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే అవకాశం ఉంది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతోపాటు బహుళ ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం’’అని సీడబ్ల్యూసీ పీఏఓ సీఈ సీకేఎల్ దాస్ పేర్కొన్నారు. జూన్నాటికి ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, పనులు ఇలాగే జరిగితే అనుకున్న గడువులోపే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం చేయరాదని, వ్యయాలు పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో వేగం మరింత పెంచాలని సూచించారు. ఇప్పటికే ప్రాజెక్టుకు వివిధ డైరెక్టరేట్ల నుంచి అనుమతులు వచ్చాయని, మిగతా అనుమతులు పరిశీలనలో ఉన్నాయన్నారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టే అవకాశం ఉందా అని మీడియా అడగ్గా.. దీనిపై తాము ఎలాంటి ప్రకటన కానీ, వ్యాఖ్యలు కానీ చేయబోమన్నారు. నీటి లభ్యత పుష్కలం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందని హైడ్రాలజీ డైరెక్టర్ నిత్యానంద రాయ్ అన్నారు. 284.3 టీఎంసీల మేర లభ్యత నీరుందని, కాళేశ్వరం అవసరాలకు ఇది సరిపోతుందన్నారు. కాళేశ్వరం నిర్మాణ పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి అన్నారు. నిర్ణీత గడువు లోపే ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు నల్లా వెంకటేశ్వర్లు, హరి రామ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండేలు పాల్గొన్నారు. అనంతరం సీడబ్ల్యూసీ బృందం జలసౌధలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ల ద్వారా కాళేశ్వరం పనుల తీరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించింది. -
భారీ వర్షాలున్నాయ్.. వరదలతో జాగ్రత్త!
► రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం ► రాష్ట్రంలోని 10 ప్రాజెక్టుల పరిస్థితిపై సీడబ్ల్యూసీ సీఈ నవీన్కుమార్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావ ప్రాంతాలపై ఆయా రాష్ట్రాలను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. గతేడాదితో పోలిస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల సంఘం గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ప్రమాద ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ నవీన్కుమార్ ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రాజెక్టుల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణలు కోరారు. అవసరాలను ముందుగానే గుర్తించి వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్రలకు వచ్చే వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరివాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు. నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు వచ్చే 4 రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషాలను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది దక్షిణ దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. కొంకణ్, మధ్య కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వెల్లడించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గత 24 గంటల్లో పేరూరు, తల్లాడల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, ఆసిఫాబాద్లల్లో 4 సెంటీమీటర్లు, టేకులపల్లి, మధిర, ఏన్కూరు, గుండాల, ఇల్లెందు, జూలూరుపాడు, పాల్వంచల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
భారీ వర్షాలొస్తున్నాయ్..వరదలతో జాగ్రత్త
- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం - రాష్ట్రంలోని 10 ప్రాజెక్టుల పరిస్థితిపై సీడబ్ల్యూసీ సీఈ నవీన్కుమార్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావ ప్రాంతాలపై ఆయా రాష్ట్రాలను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. గతేడాదితో పోలిస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల సంఘం గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ప్రమాద ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ నవీన్కుమార్ ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రాజెక్టుల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణలు కోరారు. అవసరాలను ముందుగానే గుర్తించి వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణా, తుంగభద్రలకు వచ్చే వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరివాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాచార మార్చిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు. -
కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మన్లు
- కృష్ణాకు ఎస్కే శ్రీవాత్సవ, గోదావరికి హెచ్కే సాహు - పూర్తి స్థాయి చైర్మన్లను నియమించిన కేంద్ర జల సంఘం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదాలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఆ రెండు నదీ బోర్డులకు కొత్తగా పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్కే సాహును చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు గురువారం కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్కే శ్రీవాత్సవ ప్రస్తుతం పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండగా.. తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో హెచ్కే సాహు చీఫ్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. వీరిద్దరు వచ్చే సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. -
‘తుమ్మిళ్ల’కు ఏపీ అడ్డుపుల్ల!
- అనుమతుల్లేకుండా తెలంగాణ చేపడుతోందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు - నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని వినతి - డీపీఆర్ వివరాలు సమర్పించాలని రాష్ట్రానికి బోర్డు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్ప డుతున్న లోటును పూడ్చేందుకు రాష్ట్రం చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఎత్తిపోతలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాల నా అనుమతులు మంజూరు చేసి వారమైనా కాకముందే దీనికి ఆంధ్రప్రదేశ్ అడ్డుపుల్ల వేస్తోంది. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ సహా కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం బోర్డుకు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కోసం పంపాలని డిమాండ్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కృష్ణా బోర్డు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు వీలైనంత త్వరగా సమర్పించాలని సూచించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ తెలంగాణకు లేఖ రాశారు. ఆర్డీఎస్ నీటి వాటా ప్రకారమే చేపడుతున్నా... బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే కాల్వల్లో పూడిక కారణంగా తెలంగాణకు దక్కుతున్న వాటా గరిష్టంగా 4 టీఎంసీలు దాటడం లేదు. దీంతో ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఈ దృష్ట్యా నీరందని 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్వాటర్ ఫోర్షోర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని తెలంగాణ నిర్ణయించి రూ. 783 కోట్లతో అనుమతులిచ్చింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదలశాఖ సిద్ధమవుతున్న తరుణంలో దీనికి ఏపీ అడ్డుతగులుతోంది. తెలంగాణ ఇప్పటికే పాలమూరు, డిండి, భక్త రామదాస, మిషన్ భగీరథ వంటి అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందని, వీటిపై అపెక్స్ కౌన్సిల్, సుప్రీంకోర్టు ముందు విచారణ జరుగుతున్న సమయంలోనే కొత్తగా తుమ్మిళ్ల చేపట్టిందని బోర్డుకు రాసిన లేఖలో ఏపీ పేర్కొంది. -
పోలవరం కాఫర్ డ్యామ్ డిజైన్ తిరస్కరణ
-
పోలవరం కాఫర్ డ్యామ్ డిజైన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ రూపొందించిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ డిజైన్ను జలవనరుల శాఖ తిరస్కరించింది. డిజైన్లో లోపాల్ని ఎత్తిచూపి.. వాటిని సరిదిద్దుతూ సరికొత్త డిజైన్ను రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, గేట్ల తయారీ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కాఫర్ డ్యామ్ డిజైన్ను ప్రధాన కాంట్రాక్టు సంస్థ సీఎంకు అందించింది. ఈ డిజైన్ను పరిశీలించిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు భారీ లోపాలున్నట్లు గుర్తించారు. గతంలో 31 మీటర్ల ఎత్తు వరకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇటీవల 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. కాఫర్ డ్యాం నిర్మాణంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్ను వినియోగిస్తామని డిజైన్లో కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. కానీ 41 మీటర్ల ఎత్తుతో నిర్మించే కాఫర్ డ్యామ్కు షీట్ ఫైల్స్తో ఊటను నియంత్రించడం అసాధ్యమని జలవనరులశాఖ అధికారులు తేల్చారు. కొత్త డిజైన్ను రూపొందించాలని ఆదేశించారు. -
డీపీఆర్ ఉంటేనే.. ప్రాజెక్టులకు అనుమతి!
కొత్త మార్గదర్శకాలు రూపొందించిన కేంద్ర జల సంఘం సాక్షి, హైదరాబాద్: ఇకపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఉంటే అనుమతులు లభించనున్నాయి. డీపీఆర్లు సమర్పిస్తేనే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన హైడ్రాలజీ, నీటి పారుదల ప్రణాళిక, డిజైన్లు, అంచనాలకు ఆమోదం తెలుపుతామని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల వ్యవధిని గణనీయంగా తగ్గించేందుకు.. ఏళ్లకేళ్లు జాప్యం జరిగి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఎన్నో అనుమతులు కావాలి.. సాధారణంగా ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జల సంఘం అనుమతి తోపాటు సైట్ క్లియరెన్స్, అంతర్రాష్ట్ర వ్యవహారా లు, పర్యావరణ, అటవీ, ప్రణాళికా సంఘం.. అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అధ్యయన నివేదికలూ ఇవ్వాల్సిందే.. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టు అనుమతులు వేగంగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి తయారు చేసిన డీపీఆర్ కచ్చితంగా ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్లో నీటి లభ్యత (హైడ్రాలజీ), నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజె క్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు వంటి అంశాలపై చేసిన అధ్యయన నివేదికలు పొందుపరచాలి. ఆ డీపీఆర్ను సీడ బ్ల్యూసీ పరిశీలించి..అవసరమైన మార్పులు, చే ర్పులు సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్పులు చేసి తుది డీపీఆర్ రూపొందించాలి. దానిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ అంగీకారం తెలుపుతుంది. తర్వాత 3 వారాల్లోగా హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక, 2 వారాల్లోగా అంతర్రాష్ట్ర అనుమతులు ఇస్తారు. డిజైన్లకు 2 నెలల గడువు పట్టనుండగా.. అంచనా లు, ఆర్థిక మదింపు, సాంకేతిక సలహా మండలి నివేదిక అనుమతుల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేస్తారు. ఇక ఆయకట్టు అభివృద్ధి ప్రణాళిక, వ్యయ ప్రయోజనాల నిష్పత్తి (కాస్ట్ బెనిఫిట్ రేషియో) లను స్పష్టం చేస్తూ వ్యవసాయ శాఖ నుంచి నీటి పారుదల ప్రణాళిక డైరెక్టరేట్కు సర్టిఫికెట్ కూడా సమర్పించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. నిర్మాణాలు చేపట్టి ఆపై అనుమతుల అంశాన్ని సాకుగా చూపుతూ, ప్రాజెక్టుల వ్యయాలను పెంచే స్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పాటిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
నదీ జలాల లభ్యతపై అధ్యయనం
సీడబ్ల్యూసీ అధికారులకు ఎన్ఆర్ఎస్సీలో ముగిసిన శిక్షణ వచ్చే ఏడాది జూలైలోగా 19 బేసిన్లలో నీటి లభ్యతపై నివేదిక సాక్షి, హైదరాబాద్: దేశంలోని 19 నదీ బేసిన్లలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది. బ్రహ్మపుత్ర, కావేరి, మహానది, నర్మద, యమున వంటి ప్రముఖ నదులతో పాటు కృష్ణా; గోదావరి బేసిన్ల్లో నీటి లభ్యతను తెలుసుకునేందుకు కేంద్ర జలసంఘం కసరత్తు వేగిరం చేసింది. నీటి లభ్యతపై కచ్చితమైన అంచనా కోసం నేషన ల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) సహకారం తీసుకుంటున్న సీడబ్ల్యూసీ ఇప్పటికే ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ సైతం ఇచ్చింది. హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీలో ఈ నెల 5 నుంచి మొదలైన శిక్షణ కార్యక్రమాలు 9తో ముగిశాయి. శిక్షణ పొందిన అధికారులు సోమవారం నుంచి వారికి నిర్దేశించిన బేసిన్ల పరిధిలో అధ్యయనం మొదలు పెట్టనున్నారు. నిజానికి నదుల్లో నీటి లభ్యతపై 1993లో ఒకమారు, ఆ తర్వాత 1998లో మారోమారు అధ్యయనం జరిగింది. అప్పటి లెక్కలనే ఇప్పటికీ పరిగణనకు తీసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. నదుల్లో నీటి లభ్యతపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధ్యయనం జరగాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. దీంతో నీటి వినియోగం విషయంలో అంతర్రాష్ట్ర వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి లభ్యత లెక్కలను కొత్తగా తేల్చాలని సీడబ్ల్యూసీ నిర్ణరుుంచింది. దీంతో పాటే నదుల పరీవాహక పరిధిలో గడచిన 30 ఏళ్లుగా నమోదైన వర్షపాతం, పరీవాహక పరిధిలో వాతావరణంలో మార్పులు, భూగర్భజలాల పరిస్థితి, సాగు విస్తీర్ణంపై లెక్కలన్నింటినీ ఎన్ఆర్ఎస్సీ సహకారంతో శాటిలైట్ చిత్రాలను తీసి, వచ్చే ఏడాది జూలై నాటికి కచ్చితమైన అంచనాలు తయారు చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఈ లెక్కల ఆధారంగా భవిష్యత్తులో నదుల అనుసంధానం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి, అంతర్రాష్ట్ర నదీ బేసిన్ల మధ్య వివాదాలను పరిష్కాలను పరిష్కరించాలని భావిస్తోంది. -
మరో భేటీలో తేలుద్దాం!
-
మరో భేటీలో తేలుద్దాం!
- గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, పరిధిపై ఇరు రాష్ట్రాల నిర్ణయం - బోర్డు వర్కింగ్ మాన్యువల్ పై చర్చ.. ‘కృష్ణా’ తరహాలో రూపకల్పన సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, పరిధిపై వచ్చే నెలలో తుది భేటీ నిర్వహించి వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని గోదావరి బోర్డు సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణరుుంచారుు. డిసెం బర్ 15లోగా గోదావరితో పాటే కృష్ణా బోర్డును కలిపి సంయుక్తంగా సమావేశం నిర్వహించి బోర్డుల విధివిధానాలను కొలిక్కి తెచ్చుకోవాలని అంగీకారానికి వచ్చారుు. బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి బోర్డు పరిధి, ప్రాజెక్టుల నియం త్రణ, నిర్వహణ, అధికారుల కేటారుుంపు, బడ్జెట్ అవసరాలు, బోర్డు మార్గదర్శకాలు, విధివిధానాలపై 4 గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు చైర్మన్ రామ్శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. వర్కింగ్ మాన్యువల్పై చర్చ జరుగుతున్న దృష్టా కృష్ణా బోర్డు అధికారులూ సమావేశానికి హజరయ్యారు. బోర్డు పరిధిలోకి అక్కర్లేదు... తెలంగాణలోని ఎస్సారెస్పీ, నిజాం సాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, లోయర్ మానేరు ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపడుతున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సదర్మఠ్, సీతారామ, భక్తరామదాస ప్రాజెక్టులను తమ పరి ధిలోకి తేవాలని బోర్డు సూచించగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, ప్రస్తుత అవసరాలకు తగినట్లు పాత ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని స్పష్టం చేసింది. అరుుతే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ కోరినట్లు తెలిసింది. తెలంగాణ స్పందిస్తూ.. ఏపీ చేపట్టిన తాడిపుడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపాలపాలెం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని సూచించినట్లుగా సమాచారం. బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ ఖరారైతేనే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున దానిపై దృష్టి సారిద్దా మని బోర్డు సభ్యులు సూచించారు. కృష్ణా వర్కింగ్ మాన్యువల్ను అనుసరించి గోదావరి పై డ్రాఫ్ట్ మాన్యువల్ను ఇరు రాష్ట్రాలకు త్వరలో పంపిస్తామని, రాష్ట్రాల అభిప్రాయా లు స్వీకరించి డిసెంబర్ 15లోగా నిర్వహించే సమావేశంలో ఖరారు చేద్దామని సూచించిం చగా ఏపీ, తెలంగాణ సమ్మతించారుు. మరోవైపు రెండేళ్ల కాల పరిమితితో పనిచేసేం దుకు డిప్యుటేషన్పై అధికారులు కేటారుుం చాలన్న బోర్డు వినతికి అంగీకారం తెలిపారుు. రూ.4 కోట్ల టెలీమెట్రీకి ఏపీ ఓకే కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చ డానికి రూ.4 కోట్లు ఇచ్చేందుకు ఏపీ అంగీ కరించింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి, నీటి వినియోగాన్ని కచ్చింతగా లెక్కి స్తామని బోర్డు హామీ ఇచ్చింది. -
సెంట్రల్ వాటర్ కమిషన్లో 111 పోస్టులు
నోయిడాలోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 111 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్డబ్ల్యూఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్డబ్ల్యూఏ) మొత్తం పోస్టులు: 111 (ఎస్సీ-13, ఎస్టీ-8, ఓబీసీ-34, జనరల్-56) ప్రతి విభాగంలో దివ్యాంగులకు 3 శాతం కేటాయిస్తారు. విద్యార్హత: మెట్రిక్యులేషన్/ఐటీఐ/తత్సమాన కోర్సు చదివి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తుకు తుది గడువు నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్సర్వీస్మెన్, దివ్యాంగులకు నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: దరఖాస్తులను పరిశీలించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్లకు ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు 25 పౌండ్ల బరువున్న చేపలను ఎత్తిపట్టుకుని ఆగకుండా 500 మీటర్లు తీసుకెళ్లాలి. అలాగే 8 అడుగులకంటే లోతైన నీళ్లలో ఆగకుండా 100 మీటర్లు ఈదగలగాలి. అభ్యర్థుల శారీరక సౌష్టవాన్ని పరిశీలించేందుకే వీటిని నిర్వహిస్తారు. వీటికి ఎలాంటి మార్కులు కేటాయించరు. ఫిజికల్ టెస్ట్లో విజయం సాధించినవారికి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఏ4 పేపర్లో పూర్తి వివరాలతో దరఖాస్తును పూర్తిచేసి.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అప్పర్ యమునా డివిజన్, సెంట్రల్ వాటర్ కమిషన్, బీ-5, కాళింది భవన్, తారా క్రిసెంట్ రోడ్, కుతుబ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ - 110016 అడ్రస్కు పంపాలి. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 26 వెబ్సైట్:http://www.cwc.nic.in/ -
‘మిగులు’ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 శాతం జనాభాకు ఆసరాగా ఉన్న కృష్ణా నది మిగులు జలాలు తగ్గుతున్నాయి. సరైన వర్షాలు లేక, ఎగువ నుంచి ప్రవాహాలు కరువై కృష్ణ బేసిన్లో ఆశించిన మేర నికర జలాలు కరువవ్వగా, మిగులు జలాల మాటే లేనంతగా పడిపోతున్నాయి. 2003-04 ఏడాది తర్వాత 2015-16లోనే అత్యంత తక్కువగా మిగులు రూపంలో జలాలు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలసినట్లు కేంద్ర జల సంఘం తేల్చింది. ప్రస్తుత జూన్తో 2015-16 వాటర్ ఇయర్ ముగియడంతో కృష్ణా, గోదావరి మిగులు జలాలపై దృష్టి పెట్టిన కేంద్ర జల సంఘం.. గతంతో పోలిస్తే మిగులు ఎలా తగ్గిందన్న దానిపై నివేదిక తయారు చేసింది. దాని ప్రకారం గడిచిన 25 ఏళ్లలో 1990-91 నుంచి ఇప్పటి వరకు.. 1994-95 ఏడాదిలో అత్యంత గరిష్టంగా 1,329.30 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి చేరగా, అత్యంత కనిష్టంగా 2002-03 ఏడాదిలో 2.28 టీఎంసీలు మాత్రమే మిగులుగా తేలింది. తర్వాతి ఏడాది 2003-04లోనూ కేవలం 6.29 టీఎంసీలే మిగులుగా తేలగా, మళ్లీ ఇప్పుడే అత్యంత తక్కువగా కేవలం 9.25 టీఎంసీలు మాత్రమే వచ్చినట్లుగా గుర్తించారు. ఇక గోదావరిలోనూ గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ధవళేశ్వరం వద్ద సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలు పూర్తిగా తగ్గాయి. 2015-16లో కేవలం 1,611 టీఎంసీలు మాత్రమే సముద్రంలో కలిశాయని కేంద్ర జల సంఘం లెక్కలు తేల్చింది. -
‘పాలమూరు’ ఎత్తిపోతల్లో ఉల్లంఘన లేదు
రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్లాల్జాట్ ఈమేరకు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8)డీ, పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటంటూ రమేశ్ ప్రశ్నించారు. దీనికి సన్వర్లాల్ సమాధానమిస్తూ, ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2015 ఆగస్టు 22న మాకు ఒక లేఖ రాసింది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టూ చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు. -
ప్రాజెక్టులన్నీ ఖాళీ
రాష్ట్రంలో పూర్తిగా ఎండిపోయిన ప్రధాన నీటి ప్రాజెక్టులు ♦ గతంలో ఎన్నడూ లేనంతగా 561 టీఎంసీల నీటి కొరత ♦ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలు ♦ కనీస మట్టాలు సహా ఉన్న నీరు 167.68 టీఎంసీలే ♦ ఇందులోనూ వినియోగార్హమైన నీరు 10 టీఎంసీల లోపే ♦ కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. వేసవి ముగిసేందుకు మరో నెలన్నర సమయమున్నా ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. చివరికి తాగేందుకూ నీరందించలేని పరిస్థితికి దిగజారాయి. గోదావరి, కృష్ణా పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులదీ అదే దుస్థితి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 561 టీఎంసీల మేర నీటి కొరత నెలకొంది. ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలే. ఇందులోనూ కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకన్నా తక్కువేనని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది తాగునీటి కోసం ఆధారపడిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కన్నా దిగువన వెళ్లి తోడుకున్నా... ఐదారు టీఎంసీలకు మించి లభించే పరిస్థితి లేకపోవడం కలవరపెడుతోంది. రాష్ట్రంలోని ఈ దుర్భర, దుర్భిక్ష పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కేంద్ర జల సంఘానికి నివేదించింది. లభ్యతగా ఉన్న నీటినంతా తాగునీటికే మళ్లిస్తున్నామని వివరించింది. తాగునీటికీ సరిపోని దుస్థితి గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన నీరు చేరలేదు. గోదావరి బేసిన్లోని సింగూరు, నిజాంసాగర్ , శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు రాలేదు. ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిపి నిల్వ సామర్థ్యం 147 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం లభ్యతగా ఉన్నది 5 టీఎంసీలే. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో సుమారు 20 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. ఇక కడెం, ఎల్లంపల్లి, దిగువ మానేరు ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి నీరు చేరడంతో ప్రస్తుతం వీటిల్లో 8 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. అది కూడా గతేడాదితో పోల్చితే సుమారు 3 టీఎంసీలు తక్కువే కావడం గమనార్హం. ఇక కృష్ణా బేసిన్లోని జూరాలను మినహాయిస్తే... శ్రీశైలం, నాగార్జునసాగర్లకు మొత్తంగా 100 టీఎంసీలకు మించి నీరు రాకపోవడం ఆందోళనకరం. ఖరీఫ్, రబీ సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టి ఈ రెండు ప్రాజెక్టుల నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకే కేటాయించినా కూడా సరిపోని దుస్థితి. ఈ రెండు ప్రాజెక్టుల వాస్తవ నిల్వ సామర్థ్యం 527 టీఎంసీలు కాగా... ప్రస్తుతమున్నది 150 టీఎంసీలే. ఇవి కూడా ప్రాజెక్టుల్లో వినియోగించుకోవడానికి వీల్లేని కనీస మట్టంలోని నీళ్లే. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా... ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ వినియోగార్హమైన నీరు 6 నుంచి 7 టీఎంసీలకు మించదు. వచ్చే రెండు నెలలు కష్టమే.. ప్రాజెక్టులన్నీ ఖాళీ కావడంతో వచ్చే రెండు నెలలు రాష్ట్రం దుర్భర స్థితిని ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. జూన్లో వర్షాలు మొదలైనా అవి ప్రాజెక్టుల పరీవాహకంలోని చిన్నపాటి కుంటలు, చెరువులు నిండేందుకే సరిపోతాయి. వర్షపు నీరు ప్రవాహాలుగా మారి ప్రాజెక్టుల్లోకి రావాలంటే భారీ వర్షాలు కురవాల్సిందే. గోదావరి బేసిన్లో జూన్లోనే వర్షాలు పడే అవకాశమున్నా, కృష్ణాలో మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి. ఈ దృష్ట్యా ప్రస్తుత నీటితో జూలై తొలివారం వరకు నెట్టుకురావడం కష్టం. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం ఏకంగా కనీస నీటిమట్టమైన 510 అడుగుల కన్నా దిగువన 507 అడుగులకు పడిపోయింది. ఈ ఎత్తులో 127.80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ అత్యవసర పంపులు వాడి 505 అడుగుల వరకు తోడినా ఒక టీఎంసీకి మించి నీటిని వాడటానికి లేదు. ఇక శ్రీశైలంలో 784.8 అడుగుల వద్ద 22.20 టీఎంసీల నీళ్లున్నా... అందులో 780 అడుగుల వరకు వినియోగార్హమైన నీరు ఒక టీఎంసీయే. దాంతో 770 అడుగుల వరకు వెళ్లి నీటిని తోడుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. అంతగా నీటిని తోడినా గరిష్టంగా 4 టీఎంసీలకు మించి నీరు లభించదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 2 ప్రాజెక్టుల్లో కలిపి లభించే 5 టీఎంసీల నీటినే ఇరు రాష్ట్రాలు వాడుకోవాలి. ఇక ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నుంచి 3 నుంచి 4 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశ ముంది. మొత్తంగా 6 నుంచి 7 టీఎంసీలకు మించి వాడటానికి రాష్ట్రానికి అవకాశం లేదు. ఈ నీటితోనే వచ్చే 2 నెలలు సర్దుకుపోవాలి. రాష్ట్రంలో కరువుపై కేంద్రం రాష్ట్రాల నుంచి వివరణ కోరగా... నీటి పారుదల శాఖ సోమవారం ప్రాజెక్టుల నీటి లభ్యతను వివరిస్తూ కేంద్ర జల సంఘానికి నివేదిక సమర్పించింది. -
పీఎంకేఎస్వైలో 9 రాష్ట్ర ప్రాజెక్టులు
కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం: హరీశ్రావు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్సీ, ఇందిరా వరదనీటి కా లువ, కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్ద వాగు, మత్తడి వాగు, పాలెం వాగు, గొల్ల వాగు, గాలి వాగు ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్వై) తొలి దశలో చేర్చడానికి ఈ పథకంపై నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిందని నీటిపారుదల మంత్రి హరీశ్రావు చెప్పారు. ఆది వారం ఢిల్లీలో ఈ పథకం అమలు తీరుపై మం త్రివర్గ ఉప సంఘంనిర్వహించిన సమావేశం లో హరీశ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసే విషయంపై కమిటీలో చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. గిరిజన, కొండ ప్రాం తాలు, వామపక్ష తీవ్రవాదుల ప్రభావం ఉన్నప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం 60% నిధులను గ్రాంటుగా అందించాలని కమిటీ ఏకాభిప్రాయంతో సిఫార్సు చేసిందన్నా రు. ఈ పథకం కింద రెండు దశల్లో చేపట్టే ప్రాజెక్టుల అంచనాలను, వివరాలను ఈ నెల 28 కల్లా రాష్ట్రాలు పంపించాలని ఈ సమావేశం కోరిందన్నారు. కమిటీ తదుపరి సమావేశాన్ని రాజస్తాన్లోని జోధ్పూర్లో వచ్చేనెల 9-10 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని సుచార్ ప్రాజెక్టుపై కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి కేంద్రం కొంత మేర గ్రాంటుగా, కొంత రు ణంగా నిధులను అందించే విషయం పరిశీలించాలని కోరామన్నారు. కేంద్ర జల సంఘంలో ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి ఈ ప్రక్రియ వేగంగా జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. -
954.2 టీఎంసీలకూ లెక్క
గోదావరిలో నీటి వాటా వినియోగంపై రాష్ట్ర ప్రణాళిక కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డుకు వివరాలు సమర్పణ ఇప్పటికే ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీల వినియోగం కొత్త ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు వినియోగంలోకి 45.38 టీఎంసీల వినియోగానికి కొత్త ప్రాజెక్టులు దుర్గంగుట్ట (కంతనపల్లి) అందులో భాగమేనని వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరిలో హక్కుగా కలిగిన వాటా మేరకు నీటి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపు ఇచ్చింది. హక్కుగా ఉన్న 954.2 టీఎంసీల వాటాలో ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టేందుకు చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న 433.04 టీఎంసీల వాటాపోనూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. ఈ వివరాలను రాష్ట్ర నీటిపారుదలశాఖ... కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు పంపింది. గోదావరిపై ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్తోపాటు వివిధ దశల్లో ఉన్న కొత్త ప్రాజెక్టులన్నీ తమ వాటాలోంచి నీటిని తీసుకునేందుకు ఉద్దేశించినవేనని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్రం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరిలో మొత్తంగా 1,480 టీఎంసీల నీటి వాటా హక్కుగా ఉండగా విభజన అనంతరం తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా దక్కింది. నీటిని సమర్థంగా వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రీ ఇంజీనీరింగ్ పేరిట కంతనపల్లి వంటి ప్రాజెక్టుల వాటాను పెంచింది. ఇందిరా, రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను సమీకృతం చేసి మరింత నీటిని వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. దీంతోపాటే అదనంగా గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మాణం చేసి ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కంతనపల్లి ప్రాజెక్టుతో గిరిజన ప్రాంతాల ముంపును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా దుర్గంగుట్ట వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్వే చేయిస్తోంది. అయితే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. దుర్గంగుట్ట బ్యారేజీకి అనుమతులు లేవంటూ రెండు నెలల కిందట కేంద్రానికి లేఖలు రాసింది. దీనిపై కదిలిన సీడబ్ల్యూసీ, బోర్డు... నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించింది. దీనికితోడు గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా 628.64 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోనున్నారని, మిగతావన్నీ మిగులు జలాలేనని జాతీయ జలాభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) తేల్చిచెబుతోంది. ఈ లెక్కలు తప్పని రాష్ట్రంలో మొత్తంగా 773 టీఎంసీల మేర నీటి వినియోగం ఉంటుందని రాష్ట్రం రెండు నెలల కిందటి వరకు చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ఫిర్యాదు, కేంద్రం ఆదేశాల నేపథ్యంలో గోదావరిపై ఇప్పటికే ఉన్న, భవిష్యత్తులో వినియోగంలోకి తేనున్న నీటి వాటాలు హక్కుగా సంక్రమించిన వాటాకు సరిసమానమని స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించింది. కొత్తగా 521.17 టీఎంసీల కోసం ప్రణాళిక... రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులతో మొత్తంగా 433.04 టీఎంసీల వినియోగం జరుగుతున్నట్లు అధికారుల నివేదిక చెబుతోంది. ఇందులో గోదావరి జీ-4 బేసిన్లో నిజాంసాగర్, సింగూర్, పోచారం, ఘనఫూర్ తదితర ప్రాజెక్టుల కింద 104.63 టీఎంసీలు వినియోగంలో ఉండగా జీ-5లో ఎస్సారెస్పీ-1, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, గుత్ప ప్రాజెక్టుల కింద 135.44 టీఎంసీలు, ఇదే బేసిన్లో ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల కింద 39.33 టీఎంసీలు, జీ-6లో దిగువ, ఎగువ మానేరు, శనిగరం ప్రాజెక్టుల కింద 60.88 టీఎంసీలు, జీ-7లో దిగువ పెన్గంగ, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద 32.33 టీఎంసీలు, జీ-9లో పెద్దవాగు, నీల్వాయి వంటి ప్రాజెక్టుల కింద 11.54 టీఎంసీలు, జీ-10లో దేవాదుల సహా ఇతర ప్రాజెక్టుల కింద 51.77 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ఇక నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో మొత్తంగా 475.79 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేనున్నట్లు వివరించారు. ఇందులో ప్రధానంగా ఎస్సారెస్పీ-2 22.99 టీఎంసీలు, వరద కాల్వ-19.27, ఎల్లంపల్లి -60, ప్రాణహిత-160, కంతనపల్లి-100, దేవాదుల -60 టీఎంసీలతో చేపట్టినట్లు తెలిపారు. ఇక మరో 45.38 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో మోదికుంట వాగు-3.2 టీఎంసీలు, సంగంపల్లి-1.8, మందమర్రి 1.7, దిగువ పెన్గంగ-5.12 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టేవిగా చూపారు. నిర్మాణం పూర్తయిన వాటిని మినహాయిస్తే కొత్తగా 521.17 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళికలు వేసినట్లుగా నివేదిక ద్వారా తేల్చి చెప్పారు. -
శ్రీశైలం నుంచి సాగర్కు 13 టీఎంసీల నీరు విడుదల
కృష్ణా బోర్డు అంగీకారం తెలంగాణకు 4.2, ఏపీకి 4 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 13 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఇందులో 4.2 టీఎంసీల నీటిని తెలంగాణ, మరో 4 టీఎంసీలను ఏపీ తమ తాగునీటి అవసరాలకు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మరో 4.8 టీఎంసీలు సాగర్లో కనీస నీటిమట్టాలను నింపేందుకు అవసరమని తేల్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం రాత్రి మౌఖికంగా ఇరు రాష్ట్రాల అధికారులకు తెలియజేసింది. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10.54 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ గత నెల 29న కృష్ణా బోర్డుకు విన్నవించింది. నల్లగొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలకు 1.13 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 4.543 టీఎంసీలు అవసరముందని తెలిపింది. అయితే నాగార్జునసాగర్లో ప్రస్తుతం 507 అడుగుల నీటిమట్టం ఉందని, జంట నగరాలకు నిరంతరంగా తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాలంటే సాగర్లో 510 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉండేలా చూడాలన్న హైకోర్టు ఉత్తర్వులను గుర్తుచేస్తూ, సాగర్లో నీటిమట్టాన్ని 510 అడుగులకు పెంచడానికి 4.87 టీఎంసీలు అవసరమని వివరించింది. ఇదే సమయంలో ఏపీ సైతం తమ అవసరాలకు 4 నుంచి 6 టీఎంసీలు అవసరమని తన ప్రతిపాదనను తెలంగాణ ముందు పెట్టింది. సోమవారం ఉదయం ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు దీనిపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావును కలిశారు. అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మాసబ్ట్యాంక్లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాతో భేటీ అయ్యారు. తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన ఆయన బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్శరాణ్ ఆదేశాల మేరకు శ్రీశైలం నుంచి 13 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు మార్చి వరకు వినియోగించుకోవాలని సూచించారు. -
ఇక ‘సీడబ్ల్యూసీ’ భూ పంచాయితీ!
♦ కేంద్ర జల సంఘానికి కేటాయించిన 10 ఎకరాల భూమి కోసం ఇరు రాష్ట్రాల పట్టు ♦ తమకే ఇవ్వాలంటూ ఏపీ పరిధిలోని పోలవరం అథారిటీ, రాష్ట్ర పరిధిలోని గోదావరి బోర్డుల విజ్ఞప్తి ♦ పోలవరం అథారిటీకి ఇవ్వబోమంటున్న తెలంగాణ ♦ గోదావరి బోర్డుకు మూడెకరాలు ఇచ్చే దిశగా యోచన ♦ కేంద్ర జల సంఘం వద్దకు చేరిన వ్యవహారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల మధ్య ఓ భూ పంచాయితీ మొదలైంది. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం కేంద్ర జల సంఘాని (సీడ బ్ల్యూసీ)కి కేటాయించిన పది ఎకరాల భూమిని తమకు ఇవ్వాలంటే.. తమకు ఇవ్వాలంటూ ఏపీకి చెందిన పోలవరం అథారిటీ, తెలంగాణ నిర్వహణ కింద ఉన్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అధికారులు పట్టుబడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమిని పోలవరం అథారిటీకి కేటాయించరాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తుండగా... ఆ భూమి అయితే తమ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని ఏపీ పేర్కొంటుడడంతో వివాదం ముదురు తోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్క రించాలిన బాధ్యత కేంద్ర జల సంఘంపై పడింది. సీడబ్ల్యూసీకి తలనొప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం... ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం పోలవరం అథారిటీని ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సహా ఇతర అధికారుల నియామకం, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఈ అథారిటీ కేంద్ర జల సంఘం సూచనల మేరకు బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే ఈ అథారిటీ నిర్వహణను చూడాల్సిన ఏపీ ప్రభుత్వం... దానికి ప్రత్యేక కార్యాలయమేదీ కేటాయించలేదు. దీంతో అథారిటీ కార్యకలాపాలన్నీ ప్రస్తుతం హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్ వద్ద ఉన్న సీడబ్ల్యూసీ కార్యాలయం నుంచే సాగుతున్నాయి. అది తమకు అనువుగా లేదంటూ అథారిటీ అధికారులు ఇటీవల ఏపీ ప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 1982-83 మధ్య బీహెచ్ఈఎల్ సమీపంలోని నలగండ్ల వద్ద కేటాయించిన 10 ఎకరాల భూమిని తమకు ఇవ్వాల్సిందిగా సీడబ్ల్యూసీకి విన్నవించాలని పోలవరం అథారిటీకి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు అథారిటీ అధికారులు సీడబ్ల్యూసీకి విన్నవించుకున్నారు. అయితే దీనిని పరిశీలించాలంటూ సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి పంపగా... తమ రాష్ట్ర పరిధిలోని భూమిని ఏపీ పరిధిలోని అథారిటీకి రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టం చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఈ భూమి వివరాలు తెలుసుకున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆ పదెకరాల భూమిని తమకు కేటాయించాలంటూ సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వాలకు విన్నవించింది. దానిని సర్కారు పరిశీలిస్తోంది. అందులో కనీసం మూడు ఎకరాలైనా కేటాయించాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా కేంద్రానికి తన వివరణను పంపినట్లు సమాచారం. ఇలా ఒకే భూమి కోసం ఇరు సంస్థలు పట్టుబడుతుం డడం, ఇరు రాష్ట్రాలు భిన్న రీతిలో స్పంది స్తుండటం సీడబ్ల్యూసీకి తలనొప్పిగా మారిం ది. ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలన్న దానిపై సీడబ్ల్యూసీ కసరత్తు చేస్తోంది. -
జలంపై జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది వర్షాకాల సీజన్ పూర్తిగా ముగింపు దశకు వచ్చినా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేర లేకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని వచ్చే జూన్ వరకు కాపాడుకుంటూ ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేనా అన్న సంశయాన్ని వ్యక్తంచేసింది. ఇరు రాష్ట్రాలు మరింత పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు తాగునీటి అవసరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, లేనిపక్షంలో కరువు తప్పదని హెచ్చరించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగం, భవిష్యత్ అవసరాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా బుధవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిని ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వాడుకున్నాయి, మున్ముందు అవసరాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై చర్చించారు. సాగుకు నీటిని మళ్లించొద్దు.. మొదటగా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యతపై సమావేశం చర్చించింది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకుగాను ప్రస్తుతం 846.6 అడుగుల మట్టానికి 73.08 టీఎంసీల నీరు ఉందని అధికారులు వివరించారు. ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగుల వరకు 20 టీఎంసీలు, ఆ తరువాత మరో 50 టీఎంసీలకు వరకు నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. ఇక సాగర్లో నీటి లభ్యత కనీస మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయిందని వివరించారు. ఈ సందర్భంగా నీటి లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన బోర్డు, వచ్చే జూన్ వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు కనీసం 30 నుంచి 40 టీఎంసీల మేరకు ఉంటాయని, ప్రస్తుత లభ్యత నీటిని అప్పటివరకు కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుత తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి మరింత నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల దృష్ట్యా 2.5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ కోరగా, కృష్ణా డెల్టా అవసరాలకు 5 టీఎంసీలు, గుంటూరు, ప్రకాశం తాగునీటి అవసరాలకు మరో 2 టీఎంసీల మేర నీటి విడుదల చేయాలని ఏపీ కోరింది. అయితే దీనిపై బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం చెబుతామని స్పష్టం చేసింది. త్వరలో మైనర్ ఇరిగేషన్ సీఈలతో బోర్డు భేటీ.. కాగా కృష్ణా బేసిన్ చిన్నతరహా ప్రాజెక్టుల కింద ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలపై తేల్చేందుకు త్వరలోనే ఇరు రాష్ట్రాల మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు పేర్కొన్నట్టు తెలిసింది. చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 89.5 టీఎంసీలు, ఏపీకి సుమారు 20 టీఎంసీల వరకు కేటాయింపులున్నా ఇందులో ఎంత నీరు లభిస్తోంది. వినియోగం ఎంతన్నదానిపై సరైన వివరాల్లేవు. దీంతో కృష్ణాలో ఇరు రాష్ట్రాల పూర్తి నీటి వినియోగాన్ని లెక్కించడం ఇబ్బందిగా మారడంతో ఈ సమావేశాన్ని నిర్వహించే ఆలోచనలు చేస్తోంది. -
పైసలకు పోస్టులు!
* ‘సీడబ్ల్యూసీ’ నియామకాల్లో అక్రమాలు * ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ అధికారులపై ఆరోపణలు * చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు.. అంతర్గత కమిటీతో విచారణ * కమిటీ సమగ్ర విచారణ జరపలేదని తాజా ఆరోపణలు * సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగ నియామకాల అంశం వివాదంగా మారింది. మల్టీ టాస్క్ సర్వీస్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో హైదరాబాద్ సీడబ్ల్యూసీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలల కిందట 101 పోస్టుల భర్తీకి నియామకాలు జరగ్గా... సగానికిపైగా పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు వెళ్లడం, విచారణ కమిటీని నియమించడం, ఆ కమిటీ నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. అయితే విచారణ కమిటీ ఎవరినీ సంప్రదించకుండా, సమగ్ర వివరాలు సేకరించకుండానే తూతూమంత్రంగా విచారణ ముగించిందంటూ మళ్లీ సీడబ్ల్యూసీ చైర్మన్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళుతుండటంతో ఈ అంశం బయటకు పొక్కింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కేంద్ర జల సంఘంలో దేశవ్యాప్తంగా 2,200 వరకు మల్టీ టాస్క్ సర్వీస్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో గత ఏడాది జూలై-ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 101 పోస్టులను భ ర్తీ చేయాలని నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించారు. శరీర దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లకు 80 మార్కులు, ఇంటర్వ్యూలకు మరో 20 మార్కులు కేటాయించారు. సుమారు 8,000 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా అందరికీ ఏపీలోని రాజమండ్రిలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి నుంచే కేంద్ర జల సంఘంలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరతీసినట్లుగా చెబుతున్నారు. ఫిజికల్ టెస్టులో పాల్గొనని వారిని, పాల్గొని అర్హత సాధించని వారిని అడ్డదారుల్లో అర్హులుగా ఎంపిక చేసి, వారిని ఇంటర్వ్యూలకు పిలిచారని ఆరోపణలు ఉన్నా యి. అక్రమదారిలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20 మార్కులు ఉన్న ఇంటర్వ్యూలో అనుకూలంగా వ్యవహరించారని, ఇష్టారీతిగా వారికి మార్కులు వేసి అర్హత కల్పించారన్నది ఆరోపణ. ఇలా మొత్తం పోస్టుల్లో 50 శాతం వరకు అక్రమంగానే నియామకాలు చేపట్టారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని.. ఇలా రూ.2కోట్ల మేర చేతులు మారాయని సీడబ్ల్యూసీ చైర్మన్ పాండ్యాకు ఫిర్యాదులు వెళ్లాయి. సీడబ్ల్యూసీలోని కొందరు ఉద్యోగులు సహా కొంతమంది బాధిత అభ్యర్థులు ఈ విషయమై అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను పేర్కొంటూ ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ నియామకాలపై అంతర్గత కమిటీని నియమించి విచారణ జరిపారు. అయితే కొందరు అధికారుల అభిప్రాయాలనే తీసుకున్న కమిటీ ఈ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విచారణ కమిటీ తీరును సైతం ప్రశ్నిస్తూ మరలా కొందరు చైర్మన్ పాం డ్యాకు మరోమారు ఫిర్యాదు చేశారు. కమిటీ సమగ్రంగా విచారణ జరపలేదని, కేవలం కొద్ది మంది అభిప్రాయాలు సేకరించి విచారణ ముగించిందని.. అందుకే పునఃవిచారణ జరపాలని వారు కోరినట్లు సమాచారం. పారదర్శకంగానే నియామకాలు: రమేష్ కుమార్ ఈ వ్యవహారంపై సీడబ్ల్యూసీలోని సూపరిం టెండెంట్ ఇంజనీర్ రమేష్ కుమార్ను వివరణ కోరగా, నియామకాల విషయంలో చైర్మన్కు ఫిర్యాదులు వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పా రు. దీనిపై చైర్మన్ అంతర్గత విచారణ జరిపిం చారని, అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్నదేమీ జరగలేదని విచారణలో తేలిందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయని అన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ఒకరిద్దరు ఉద్యోగులపై ఆరోపణలు రా గా, వారిని పూర్తిగా ఈ ప్రక్రియకు దూరంగా ఉంచి నియామకాలు చేపట్టామని తెలిపారు. -
ప్రాజెక్టుల పర్యవేక్షణపై ఏమంటారు?
గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సినవేవి? రెండు వారాల్లో తెలపాలని ఇరు రాష్ట్రాలను కోరిన కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను సూచిస్తూ వేర్వేరుగా లేఖలు పర్యవేక్షణ అవసరం లేదంటున్న తెలంగాణ కుదరదంటున్న ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల వివరాలను అందించాలని ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కోరింది. బోర్డు పరిధిలోకి తెచ్చే ప్రాజెక్టుల ఎంపిక విషయంలో నాలుగు మార్గదర్శకాలను కూడా సూచించింది. వీటిపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను తెలపాలని, రెండు వారాల్లో ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. అక్టోబర్ 15లోగా కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాన్ని నిర్వహించి, వాటి పరిధిలోని ప్రాజెక్టుల అంశంతో పాటు, కార్యాలయాల కూర్పుపై ఓ అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ సూచించినట్లు తెలిసింది. ప్రత్యేకంగా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ప్రాతిపదిక తీసుకోవాలన్న దానిపై ఇటీవలే లేఖలు కూడా రాసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటిని అందించే ప్రాజెక్టులు, ఉమ్మడిగా నీరందించే కాలువలు ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి జరిగేవి, రెండు రాష్ట్రాల పర్యవేక్షణ అవసరమున్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆ లేఖల్లో అభిప్రాయపడింది. దీనిపై ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరింది. వివాదం లేనప్పుడు బోర్డు పర్యవేక్షణ అనవసరం: తెలంగాణ సర్కారు సీడబ్ల్యూసీ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గోదావరిలో నీరు సమృద్ధిగా ఉండటం, ఎక్కడా వివాదం లేని కారణంగా బోర్డు పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన ప్రాజెక్టులేవీ ఉండవని రాష్ర్ట ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కాస్త వివాదం ఉన్నా, ముంపు ప్రాంతాలను పూర్తిగా ఆంధ్రాలో కలిపినందున ఇక సమస్య ఉండబోదని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా బేసిన్లోకి వచ్చే 80 టీఎంసీల నీటిలో ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపకాలు జరిగాయి. ఇందులో ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా విషయాన్ని ట్రిబ్యునల్ మాత్రమే తేల్చుతుందని రాష్ర్ట వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశాన్ని బోర్డుకు నివేదిక ద్వారా తెలియజేస్తామని, అయితే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పట్టుబడితే అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని నీటి పారుదల శాఖ ముఖ్యుడొకరు తెలిపారు. రెండు బోర్డులకు ఒకే విధానం: ఏపీ ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం గోదావరిపై ఎప్పుడో నిర్మితమైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, లోయర్ మానేరు, కడెం, ఘనపూర్ మొదలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాణహిత, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని వాదిస్తోంది. వివాదాలు నెలకొన్న రెండు బేసిన్ల పరిధిలోని బోర్డులకు ఒకే మార్గదర్శకాలను పాటించాలని, వేర్వేరు మార్గదర్శకాలు సరికాదని అభిప్రాయపడుతోంది. సుంకేశుల, రాజోలిబండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ సర్కారు కోరుతున్నందున... గోదావరి ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ అంటోంది. -
నిధులెలా?
కార్యాలయాలు, సిబ్బంది, నిధులపైనే చర్చ కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపంపై మంతనాలు హాజరైన ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు దేశంలోని మిగతా బోర్డుల స్వరూపం పరిశీలన హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలో పనిచేస్తున్న నదీ యాజమాన్య బోర్డుల తరహాలోనే కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది. రెండు బోర్డుల కార్యాలయాల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాలు భరించాలని, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని, నిధుల సమస్య రాని విధంగా తగిన ఏర్పాట్లు ఉండాలని పలువురు ఇంజనీర్లు సూచించారు. బోర్డుల స్వరూపం, పాలనకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే కసరత్తులో భాగంగా సీడబ్ల్యూసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో వివిధ నదీ యాజమాన్య బోర్డుల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యాంశాలు ఇవీ.. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్త రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేవరకు.. రెండు బోర్డులు హైదరాబాద్లోనే ఏర్పాటు చేయవచ్చు. రెండు బోర్డులు ఒకే ప్రాంగణంలో ఉండటం మంచిది. రెండు బోర్డుల్లోనూ సభ్యులుగా ఉన్న అధికారులు ఉన్నారు. ప్రారంభంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి రెండు బోర్డులకు ఉమ్మడిగా సిబ్బందిని నియమించుకోవచ్చు. రెండు బోర్డులను బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జలసౌధలో ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని తెలంగాణ చెప్పింది. రెండు బోర్డుల్లోనూ సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడం మంచిది. అయితే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ధారించి నోటిఫై చేయకుండా.. బోర్డులో పనిభారం ఎంత ఉంటుందనే అంశాన్ని నిర్ధారించలేమని, ఫలితంగా ఎంతమంది సిబ్బంది కావాలనే విషయంలో నిర్ణయానికి రాలేమని ఇరు రాష్ట్రాలు చెప్పాయి. సిబ్బంది సంఖ్యను నిర్ధారించిన తర్వాతే బోర్డు నిర్వహణ ఖర్చుపై తుది అంచనాకు రావచ్చని తెలిపాయి . బోర్డుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకొనే విధానం మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చిన తర్వాత కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలా? కేంద్రం, రాష్ట్రాల వాటా తేలిన తర్వాత ఎవరి వాటా మేరకు నిధులను సమకూర్చాలా? అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముందుగా నిర్ధారించిన మేరకు నిధులు విడుదల చేయడంలో సిబ్బందికి జీతాల చెల్లింపు సమస్య రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు అవసరమనే అభిప్రాయాన్ని సమావేశంలో పాల్గొన్న నిపుణుల్లో దాదాపు అందరూ వ్యక్తం చేశారు. సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతమందిని తీసుకోవాలి? రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏ క్యాడర్ వారిని తీసుకోవాలి? బోర్డుల్లో పనిచేయడానికి అవసరమైన మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడానికి ఆసక్తి చూపించకపోతే ఏం చేయాలి? ఏ స్థాయిలో డిప్యుటేషన్లను అనుమతించాలి? డిప్యుటేషన్లకు అనుమతి ఉంటే.. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సీనియారిటీ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర బోర్డుల్లో తలెల్తిన సమ్యలేమిటి?.. ఈ అంశాలపై చర్చ జరిగింది. బోర్డు నివేదికలు కాలపరిమితి (పీరియాడిసిటీ) ఎలా ఉండాలనే అంశం మీదా చర్చ జరిగింది. త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక నివేదికలు.. ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. బోర్డు సభ్యులతోపాటు బోర్డు చైర్మన్కి సైతం ఓటింగ్ హక్కు ఉండాలని సూచించారు. పాలనా నిబంధనలు కేంద్ర ప్రభుత్వ తరహాలోనే ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. డిప్యుటేషన్ మీద తీసుకొనే వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లినట్లుగా భావించాలని సూచించారు. అదే సమయంలో సీనియారిటీ, పదోన్నతుల్లో ప్రతికూల ప్రభావం లేకుండా నిబంధనలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమయింది.గ -
చివరి దశకు జల జగడం!
భామిని: అంతర్ రాష్ట్ర జల వివాదం త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు పనుల అనుమతుల సాధనపై కదలిక వచ్చింది. ఒడిశా లేవనెత్తిన ఆభ్యంతరాల చిక్కుముడులు విప్పేందుకు చేపట్టిన చర్యలు ముగింపు దశకు వచ్చాయి. ఈ దశలో వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన నివేదికను ఇంజి నీరింగ్ అధికారుల బృందం శుక్రవారం (ఈ నెల 8 తేదీ) సంబంధిత ట్రిబ్యునల్కు అందజేయనుంది. ఇందుకోసం అధికారుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ద్వారా సంపాదించిన 18 రకాల అభ్యంతరాలకు కావాల్సిన వివరాలను ట్రిబ్యునల్కు సమర్పించనున్నా రు. ఇప్పటికే రాష్ట్ర సమన్వయాధికారి సతీష్చంద్ర ఆధ్వర్యంలో వంశధార ఈఈ బి.రాంబాబు ఢిల్లీలో మకాం వేసి సీడబ్ల్యూసీ అధికారుల ద్వారా ట్రిబ్యునల్కు సమర్పించడానికి కావాల్సిన చర్యలు పూర్తి చేశారు. ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ భామిని మండలంలోని వంశధార ప్రా జెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో నివేదికలు సేకరించి ట్రిబ్యునల్కు సమర్పించాలని ఆదేశించారు. గతం ఇలా.. వంశధార ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం అనేక అభ్యంతరాలను లేవనెత్తింది. దీం తో విషయం కోర్టుకు వెళ్లింది. ఈ పరిస్థితిలో గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఆధ్వర్యంలోని బృందం ఇరు రాష్ట్రాల్లోని వంశధార ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం డిసెంబర్ 17న ట్రిబ్యునల్ తీర్పునిచ్చి వంశధార నదిపై సైడ్వియ్యర్ నిర్మించి ఓపెన్హెడ్ చానల్ ద్వారా సాగునీరు తరలించుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అనంతరం రెండు రాష్ట్రాల్లోను ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేశాయి. దీంతో ఈ ఏడాది మార్చి 22న మరోసారి ట్రిబ్యునల్ బృందం వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పునః పరిశీలించింది. ట్రిబ్యునల్ ముం దు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయి నివేదికలను కూడా ఇప్పుడు వంశధార అధికారులు సిద్ధం చేసి ట్రిబ్యునల్కు అందజేయనున్నారు. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూనే లో జరిపిన మోడల్ సర్వేలోనూ గుర్తించిన నివేదికలను సైతం అందించనున్నారు. దీంతో వంశధారకు ట్రిబ్యునల్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావచ్చునని జిల్లా వాసులు భావిస్తున్నారు. -
'పోలవరం త్వరితగతిన పూర్తి చేయండి'
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ మేరకే నిర్మాణం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్పై ఎవరికైనా అనుమానాలుంటే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 5200 కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. -
నీటి విడుదలకు గ్రీన్సిగ్నల్
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 20 టీఎంసీలు డెల్టాకు 3 టీఎంసీలు, నల్లగొండకు 3 టీఎంసీల నీరు కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం హైదరాబాద్: రెండు రాష్ట్రాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 26 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతానికి తాగునీటికే పరిమితం చేసిన బోర్డు.. భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టుల్లోకి కొత్తనీరు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, అందుకోసం త్వరలోనే మరోమారు సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తొలి సమావేశం గురువారం నగరంలోని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో జరిగిన ఈ సమా వేశంలో మెంబర్ సెక్రటరీ గుప్తాతో పాటు తెలంగాణ రాష్ర్టం నుంచి ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే బోర్డు ఆవశ్యకత, తీసుకునే నిర్ణయాలపై చైర్మన్ సభ్యులకు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీటి విడుదలకు సంబంధించే చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. డెల్టాకు రెండో వారం నీటి విడుదల విషయంలో తమతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు నుంచి పాల్గొన్న అధికారులు చెప్పారు. తాము వద్దన్నా డెల్టాకు నీటిని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు జోక్యం చేసుకుని డెల్టా తాగునీటి అవసరాలకు గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకే బోర్డు నీటిని విడుదల చేసిందని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరం తాగునీటి అసవరాలకు రోజు 900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారని.. అయితే ఇందుకు బోర్డు అనుమతి లేదని ప్రకటించారు. పైగా హైదరాబాద్ అవసరానికి కేటాయించిన నీటి కోటా కూడా ఇప్పటికే మించిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్లో ఉన్న నీటి నిల్వలను అంచనా వేసిన బోర్డు..సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, డెల్టాకు మూడు టీఎంసీలు, నల్లగొండకు మూడు టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే ఈ నీటిని కేవలం ఆయా ప్రాంతాల్లోని తాగునీటికే ఉపయోగించుకోవాలని సూచించింది. బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం నియమ నిబంధనల రూపకల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలను తుది నిర్ణయానికి రావడానికి వీలుగా ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు, కేంద్రానికి చెందిన బోర్డు మెంబర్ సెక్రటరీలు ఉంటారు. -
12 రాష్ట్రాల్లో రిజర్వాయర్లు వెలవెల: సీడబ్ల్యూసీ
ఆంధ్రప్రదేశ్లోనూ అంతంతమాత్రంగానే ఉన్న రిజర్వాయర్లు న్యూఢిల్లీ: వర్షాలు ముఖం చాటేయడంతో దేశవ్యాప్తంగా నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పడిపోయినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో జూలై 3 నాటికి నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లోని రిజర్వాయర్లలో నీటిమట్టాలు గతేడాది మాదిరిగానే ప్రస్తుతమూ ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఒడిశా, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రిజర్వాయర్లలో మెరుగైన నీటిమట్టాలు ఉన్నట్లు తెలిపింది. -
మేం వద్దన్నా నీళ్లెలా ఇస్తారు?
కృష్ణా డెల్టాకు నీటి విడుదల పొడిగింపుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కేంద్ర జల సంఘానికి లేఖ హైదరాబాద్: ‘మా అవసరాలకూ నీటిని విడుదల చేయండి. నల్లగొండ ప్రజల తాగునీటి కోసం 3 టీఎంసీల నీరు కావాలి. మేం వద్దన్నా.. మాతో సంప్రదించకుండా డెల్టాకు నీటిని ఎలా విడుదల చేస్తారు ? దీనిపై మేం నిరసన వ్యక్తం చేస్తున్నాం’ అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. బోర్డు నిర్ణయం మేరకు కృష్ణాడెల్టా తాగునీటి అవసరాల కోసం గత నెల 25 నుంచి రోజూ 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గడువు మంగళవారంతో ముగియడంతో ఏపీ వినతి మేరకు ఈ నీటి విడుదలను మరో వారం పాటు కొనసాగించారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ నీటి విడుదలను పొడిగించాలంటే బోర్డు సమావేశమై తమతో కూడా చర్చించాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వాదనను బోర్డు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కేంద్రానికి నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి కేంద్ర జలసంఘం ఇన్చార్జి చైర్మన్ ఏబీ పాండ్యాకు బుధవారం లేఖను రాశారు. మాతో చర్చించకుండానే డెల్టాకు నీటి విడుదలను పొడిగించడం అన్యాయమని నిరసనను వ్యక్తం చేశా రు. నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. డెల్టా నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పు డు సమాచారం ఇస్తోందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నుంచి డెల్టాకు నీరు వెళ్లడానికి కొంత సమ యం పడుతుందన్న విషయాన్ని గుర్తుచేశారు. మధ్య లో ఉన్న పులిచింత ప్రాజెక్టు వద్ద కూడా కొంత నిలిచి నెమ్మదిగా దిగువకు వెళుతుందని పేర్కొన్నారు. -
కమీషన్ల కోసమే దుమ్ముగూడెం : వివేక్
ప్రాజెక్టు రద్దుకు వివేక్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదం, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా, ప్రాజెక్టు వివరణాత్మక నివేదిక (డీపీఆర్) అందచేయకుండానే కాంట్రాక్టు కమీషన్ల కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రకటించారని, దానిని వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ కమిషన్ల కోసమే సీఎం కిరణ్కుమార్రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తుందని తెలిసి కూడా సీఎం కిరణ్ కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును తన సోదరుడికి కట్టబెట్టి, అడ్వాన్సు ఇచ్చి వాపసు తీసుకోవడానికి కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం గమనించాలన్నారు. సీమాంధ్ర ప్రజలను సీఎం కిరణ్, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడం మాని సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలో? కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు ఎక్కడ ఉండాలో, ఇంకా ఏమేం కావాలో అఖిలపక్ష భేటీలో ప్రతిపాదనలు చేయాలని వారికి సూచించారు. మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక చిన్నరాష్ట్రాలు ఇచ్చిన ప్రధాని ఇందిరాగాంధీయే అన్న విషయం సీఎం కిరణ్ తెలుసుకోవాలన్నారు. నాడు పంజాబ్ విభజనను వ్యతిరేకించిన ఆ రాష్ట్ర సీఎంను ఇందిర బర్తరఫ్ చేశారని, నేడు సీఎం కిరణ్ను కూడా బర్తరఫ్ చేయించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విభజన పూర్తి చేయాలన్నారు.