Chinmayi Sripaada
-
చైసామ్ విడిపోయి నేటికి మూడేళ్లు.. ఇంతలా వాడుకుంటారా?
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని సరిగ్గా నేటికి మూడేళ్లవుతోంది. 2021 అక్టోబర్ 2న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటినుంచి వీరి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే నాగచైతన్యకు.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అటు సమంత.. తన వర్క్ లైఫ్లో మునిగిపోయింది.దారుణ వ్యాఖ్యలుఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ.. సామ్-చైలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని ఆరోపించారు. అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత కామెంట్లు చేశారు. దీంతో నాగ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. మీ రాజకీయాల కోసం సినీప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించాడు. ఇంతకు దిగజారుతారా?తాజాగా సామ్ స్నేహితురాలు, సింగర్ చిన్మయి ఎక్స్ వేదికగా స్పందించింది. 'మీ ఎజెండా కోసం, మైలేజ్ కోసం, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్త్రంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది. కానీ మీ అందరికంటే తనెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి' అని ట్వీట్ చేసింది. pic.twitter.com/o2nFKDIE26— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021 I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.End of the day all it proves is that…— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024 చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్ -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్షాట్స్ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
సింగర్ చిన్మయిపై పోలీస్ కేసు.. కారణం అదేనంట..!
-
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆడాళ్లకు ఏం పని? పైగా ఎక్స్పోజింగ్..
పదమూడేళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అన్నపూర్ణమ్మగా పేరు గడించింది. అయితే ఆమె ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎక్స్పోజింగ్ ఎక్కువైంది 'అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. సదరు వీడియో క్లిప్పింగ్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తన వ్యాఖ్యలను ఖండించింది చిన్మయి. ఆమె అలా మాట్లాడుతుంటే.. 'నేను ఆమెకు పెద్ద అభిమానిని. ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోంది. ఫేవరెట్ అనుకున్నవాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలి. ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు. అర్ధరాత్రి పిల్లలు పుట్టకూడదు మనందరికీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆస్పత్రికి వెళ్లినా ఆమె చెప్పినట్లు రాత్రిపూట మహిళా డాక్టర్లే ఉండొద్దు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ డాక్టర్లే ఉంటారు. కాబట్టి ఒంట్లో బాగోలేకపోయినా రాత్రి ఆస్పత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి! జోక్స్ పక్కనపెడితే ఇంట్లో వాష్రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా ఉన్నారు. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
వెక్కిరింతలతో ఆత్మహత్య.. అనుపమ, చిన్మయి భావోద్వేగం!
పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్ ఆర్టిస్ట్ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతేడాది నుంచి వింతగా గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్ పేరెంట్గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్ నుంచి మేకప్ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్ చార్లెస్ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు. అదే చివరి ఫోన్ కాల్.. ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్ ఉండటంతో ట్యూషన్ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. ఇంత పగ, ద్వేషమా? తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది. చీర కట్టుకుని వీడియో కాగా ప్రన్షు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu) నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ.. -
చిన్మయి షేర్ చేసిన వీడియో చూశారా?
చిన్మయి శ్రీపాద.. ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. కొంతమంది హీరోయిన్లకు గొంతు కూడా అరువిచ్చింది. సోషల్ మీడియాలోనూ తన గొంతు బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఎటువంటి వివాదాస్పద గొడవపైనా స్పందించేందుకు వెనుకాడదు, తన సమాధానం బలంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది. తాజాగా చిన్మయి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. రోబో సినిమాలో తను పాడిన కిలిమాంజారో పాటను మళ్లీ పాడింది. అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? మాసై తెగల గుంపుతో కలిసి ఈ పాట పాడుతూ వారితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పాట మాకు ఇప్పటికీ ఫేవరెట్.. మీరు వారితో కలిసిపోయే విధానం చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Kilimanjaro with Maasai ! pic.twitter.com/uwI5EVTjwi — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2023 చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా.. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్
నటి రష్మిక్ డీప్ ఫేక్ వీడియో ఉదంతం, ఫేక్ న్యూస్, తప్పుడు వీడియోలు, ఫోటోలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. అభ్యంతరకరంగా మార్ప్ చేసిన రష్మిక వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వయంగా బిగ్బీ దీనిపై ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణ మిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా ప్రముఖ గాయని, మీటూ ఉద్యమానికి భారీ మద్దతిచ్చిన చిన్మయి శ్రీపాద కూడా ఎక్స్ (ట్విటర్)లో స్పందించారు. డీప్ ఫేక్ వీడియో రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశాను. ఈ వీడియోతో నిజంగా ఆమె కలవరపడుతునట్టు కనిపిస్తోందన్నారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో, అమ్మాయిలను వేధించేందుకు ఒక సాధనంగా మారుతోంది... వారిని భయపెట్టేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా తీవ్రమైన ఆయుధంగా డీప్ ఫేక్స్ మారబోతోందన్నారు. అలాగే అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్ ఫేక్ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న గ్రామం లేదా పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంటూ చిన్మయి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జైలర్ సినిమాలోని సెన్సేషనల్ ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల తరువాత వచ్చిన ఒకప్పటి హీరోయిన్ సిమ్రన్ ఫేక్ వీడియోను ప్రస్తావించారు. ఏఐ మాయ అంటూ సిమ్రన్ ఇన్స్టాలో షేర్ చేసేదాకా దాదాపు ఎవ్వరికీ దీని గురించి తెలియదు.. అంటూ ఈ ఫేర్ వీడియో గురించి చిన్నయి గుర్తు చేశారు. అంతేకాదు డీప్ఫేక్ల ప్రమాదం, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలకు , బాలికలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మార్పింగ్ ఫోటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్ యాప్ల అరాచకాలను ఆమె ప్రస్తావించారు. ఎంతో కొంత పరిజ్ఞానం, శిక్షణ ఉంటే తప్ప డీప్ ఫేక్ను సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం అంటూ తప్పుడు కథనాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు. Several months ago, a video of one of our most favourite actors in an AI avatar performed to Kaavaalaa from Jailer released - only it wasn’t her. It was a Deep Fake. Nobody knows for sure whether Ms Simran had consented in advance to her likeness to be used in the Deep Fake AI… — Chinmayi Sripaada (@Chinmayi) November 6, 2023 View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
ప్రభుత్వ జూనియర్ కళాశాల.. యదార్థ సంఘటనతో సినిమా టీజర్
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ట్యాగ్లైన్ పుంగనూరు. ఈ పేరుతోనే సినిమాను యూత్ ఆడియన్స్కు కనెక్ట్ చేశారు మేకర్స్. ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. నిర్మాతగా భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోని నటీనటులు కొత్తవారు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నట్లు టీజర్ను చూస్తుంటే అర్థం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన మ్యూజిక్ను అందించారు. ఇందులో ఒకపాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. దీంతోనే చెప్పవచ్చు సినిమాకు మంచి స్కోప్ ఉందని. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. -
మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్
కోలీవుడ్లో తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్కు హాజరయిన ఆయన స్టేజీపైన మాట్లాడుతూనే పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీన్ని ఊహించని యాంకర్ ఐశ్వర్య.. వేదికపై ఉన్న దండను విసిరేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కూల్ సురేశ్ను ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) దీని తర్వాత, కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పనిచేశానని చెత్త రీజన్ చెబుతూనే తాను ఒకరిని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను. నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పేనని కూల్ సురేశ్ ఒప్పుకున్నాడు. అందుకు గాను బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య కూడా స్పందించింది. 'ఆ సంఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ షాక్కి గురవుతున్నాను. ఎవరూ ఊహించని తరుణంలో తను కూడా నా భుజాన్ని బలవంతంగా నొక్కేసి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరు ఏమి చేయగలరు? చెంప పగుల కొడతారు కదా..? అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.. అది వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయకూడదు. ఇంతకు ముందు కూల్ సురేష్ ఓ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతని చర్యలు నాకు నచ్చని మాట నిజమే. అందుకే అతన్ని స్టేజీపైకి పిలిచేముందు నేను నటుడు కూల్ సురేశ్ అని సింపుల్గా పిలుస్తాను. కానీ అది అతనికి ఇష్టం ఉండదు.. అతనిని అలా పిలవకూడదని కూడా కండీషన్ పెడతాడు. తనకు యూట్యూబ్ సూపర్స్టార్ అనే బిరుదు ఉంది. ఆ విధంగానే తనను ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పలువనని చెప్పడం జరిగింది.' అని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్కు గోల్డెన్ ఛాన్స్) అందుకే ఈసారి తన మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేశ్ ప్లాన్ వేసినట్లు తెలిపింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా కొట్టేస్తానని తెలిపింది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య వ్యక్తం తెలిపింది. For the kind attention of Tamil Film Producers, Directors, Artistes & PRO's: The activity of junior artiste #CoolSuresh is becoming worse day-by-day. Yesterday during the audio launch of #MansoorAliKhan #Saraku movie,@chennaipolice_ @tnpoliceoffl @MuraliRamasamy4 @Udhaystalin pic.twitter.com/b5kcaX1MUL — Ottran Dorai (@ottrandorai) September 20, 2023 -
యాంకర్తో నటుడి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్
కొందరు చేసే తిక్క పనుల వల్ల అవతలివారు ఇబ్బందిపడుతుంటారు. తాము చేసేది తప్పా? ఒప్పా? అని క్షణం కూడా ఆలోచించకుండా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర చిత్రాల ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు సురేశ్. ఈ క్రమంలో తాజాగా సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. చేసింది తప్పని గద్దించిన నటుడు దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్ చిరాకుగా ఆ మాలను తీసి పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆమె అనుమతి లేకుండా అలా దండ వేసేయడం సంస్కారమేనా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కూల్ సురేశ్ ప్రవర్తనకుగానూ అదే స్టేజీపై ఉన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా సురేశ్ను సైతం క్షమాపణలు చెప్పాలని కోరాడు. దీంతో సురేశ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదటి నుంచి మేము సరదాగానే మాట్లాడుకుంటున్నాం.. అని తన తప్పిదాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చప్పట్లేంటి? చిన్మయి ఆగ్రహం మధ్యలో మన్సూర్ అలీ కలగజేసుకుంటూ ఏదైతేనేం.. నువ్వు చేసిన పని తవ్వు అని నొక్కి చెప్పడంతో సురేశ్ క్షమాపణలు చెప్పాడు. కానీ నెట్టింట మాత్రం నటుడి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయి సైతం దీన్ని తప్పుపట్టింది. 'ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలైతే అతడు పూలమాల వేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. Uncouth and horrible behaviour. Anyway based on how Tamilnadu deals with such behaviour, Nobody is going to take action on him and perhaps they’ll ask the girl not to make a fuss. And honestly - you should know how some men are - listen to male voices in the audience hooting… https://t.co/HO5pmWxb3b — Chinmayi Sripaada (@Chinmayi) September 20, 2023 Worst Behaviour #CoolSuresh 🥴 Evan Da Adhu Clap Panni Sirikurathu !! 🙄😠pic.twitter.com/n60oBovPy7 — 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐞𝐲𝐚𝐧ツ🦁 (@Vijay_Karthik27) September 20, 2023 చదవండి: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు -
బెల్ట్తో కొట్టుకుంటూ కొడుకును బెదిరించిన శ్రీహాన్, చిన్మయి ఫైర్
ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంటుంది సింగర్ చిన్మయి శ్రీపాద. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అది తప్పని సోషల్ మీడియాలో నొక్కి చెప్తుంది. అలా ఎలా చేస్తారని చెడుగుడు ఆడేస్తుంది. తాజాగా బిగ్బాస్ రన్నరప్ శ్రీహాన్ అప్లోడ్ చేసిన వీడియోపై మండిపడింది చిన్మయి. ఇంతకీ అందులో ఏముందంటే.. మాట వినని చైతూను దారిలో పెట్టాలనుకున్న శ్రీహాన్ తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ వీడియో తీస్తున్న సిరి మాత్రం పకపకా నవ్వేసింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. 'మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చెప్పినట్లు నడుచుకోకపోతే కొట్టుకోవడమో లేదంటే చచ్చిపోతామనో బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా చూసిన సంబంధాన్ని ఓకే చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి ఈ జనరేషన్లోనైనా ఫుల్స్టాప్ పెట్టాలి' అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన శ్రీహాన్ ఫ్యాన్స్ వాళ్లేదో సరదాగా చేశారు, దానికింత సీరియస్గా తీసుకుంటున్నారేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పిల్లల ముందు స్వీయహాని చేసుకోవడం ముమ్మాటికీ తప్పే.. పిల్లల్ని అలాగేనా పెంచేది? అని ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆ హీరో తుపాకి కాల్చడం నేర్పించాడు బాలయ్య, చిరుల సంక్రాంతి ఫైట్.. ఇది మొదటిసారి కాదు, 11వసారి -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్ ఫోటోలు
చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్తో ఒక సెల్ఫీని ఇన్స్టాలో షేర్ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను కూడా చిన్మయి షేర్ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్పెయిన్, షోల్టర్స్ పెయిన్ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు రియల్ శివగామి అంటున్నారు ఫ్యాన్స్. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్) ‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. “సరోగసీ అంటూ కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్లో ద్రిప్తా, శర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్గా మారుతున్నారనేది ఒక వాదన. ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్ ఆఫర్) అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సినీ నటులు నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్ చేసుకున్నామని నయన్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) > View this post on Instagram View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఎలా కన్నావు? అంటున్నారు.. నా ఆన్సరేంటంటే: చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మా ఇంట్లోకి ద్రిపత్, శ్రావస్ అడుగుపెట్టారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. ఇందులో ఆమె ఏం రాసుకొచ్చిందంటే.. చాలామంది నేను సరోగసి ద్వారా కవలలను కన్నానా? అని అడుగుతున్నారు. విషయమేంటంటే.. నేను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి నా ఫొటోలను ఏ ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. చాలాకొద్ది మందికే ఈ విషయం తెలుసు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇలా చేశాను. నా వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. పిల్లల ఫొటోలు కూడా కొంతకాలం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. ఇంకో విషయం చెప్పనా.. నాకు సిజేరియన్ చేసేటప్పుడు నేను భజన పాట పాడాను అని చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అటు రాహుల్ వెండితెరపై నటుడిగా అలరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు, రజనీకాంత్ ట్వీట్ -
ఆమె నా స్పోక్స్ పర్సన్ కాదు.. ఆమెను ఇబ్బంది పెట్టకండి
Singer Chinmayi About Her Mother Said Dont Disturb Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇలా వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో పలువురు చిన్మయి వాళ్లమ్మకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై చిన్మయి స్పందించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత అంశాలపై ఎవరైనా ఆమెతో మాట్లాడాలనుకుంటే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టద్దని తెలిపింది. ఆమె తనకు స్పోక్స్ పర్సన్ కాదని. తాను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిన వాళ్ల అమ్మకు సంబంధంలేదని తేల్చి చెప్పింది. తనతో మాట్లాడలనుకుంటే తన మేనేజర్కు కాల్ చేయవల్సిందిగా చిన్మయి పేర్కొంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి, ఇది మూర్ఖత్వమంటూ తీవ్ర వ్యాఖ్యలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అంతేగాక సిద్ధార్థ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ తీవ్ర రచ్చకు దారి తీసింది. తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్ వ్యాఖ్యలను తప్పబట్టింది. చదవండి: సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, నటుడిపై మహిళా కమిషన్ ఫైర్ ‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామంటూ చిన్మయి పిలుపునిచ్చింది. -
చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్
Singer Chinmayi Shares Nri Messages Of Who Supporting Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటారని తెలిసిన విషయమే. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్తూ, సలహాలు తీసుకుంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వడం, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్పై ఎంతోమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇద్దరు ఎన్ఆర్ఐలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి బయటపెట్టింది. వారు చేసిన మెసేజ్లను స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని మీరు పట్టించుకోకండి. మీరు సరైనా దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు.' అంటూ చిన్మయికి మద్దతుగా నిలిచారు. 'నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఒక అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వారి ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. ఇలా నాకు మద్దతుగా నిలిచిన వారు జెంటిల్మెన్స్. మీరు గోల్డ్.' అంటూ చిన్మయి షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఇదీ చదవండి: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు -
అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు
Singer Chinmayi Sensational Comments About Marriages: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద పరిచయం అక్కర్లేని పేరు. క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా పోరాడింది చిన్మయి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. అమ్మాయిలకు పెళ్లిళ్ల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తుంటుంది. అయితే ఇలా చేయడంతో అప్పుడప్పుడు నెటిజన్స్ ఇష్టానుసారంగా చిన్మయిని ట్రోలింగ్ చేస్తుంటారు. ఆ ట్రోలింగ్ కుడా చిన్మయి ధీటుగా సమాధానం ఇస్తుంది. తాజాగా మరోసారి తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో అమ్మాయిల పెళ్లి గురించి స్పందించింది. 'డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి. అవి చేయొద్దు. అని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి బండి నడుపుతున్నారని కాదు. అది ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్లు లెక్క. నేను పెడుతున్న స్టోరీస్ చూసి ఎన్ఆర్ఐస్ అందరూ అలా కాదు, జనరలైజ్ చేయకే.. అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతున్నాను. దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని. నాకేమో ఈ ఫారెన్ సంబంధం ఎప్పటికీ అర్థం కాదు. తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు.' అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది చిన్మయి. ఇంకా.. 'ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే కాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భయం. ఫోర్స్ చేసి వెధవైనా పర్లేదు సొంత కాస్ట్లోనే వారినే పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే హిస్టారికల్గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సదీ సహగమనం లాంటి చెత్త సాంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు. అందరు అబ్బాయిలు తమ సోదరీమణులకు ఇలానే చేస్తారా ? చేయనంటే వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే కోప్పడండి. మీ ఈగోలను సాటిస్ఫై చేసి మిమ్మల్ని శాంతింపచేసేందుకు నేను రాలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. ఇదీ చదవండి: ‘బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా’ -
వెండితెరపై సందడి చేయబోతున్న రియల్ కపుల్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ గాయనీ చిన్మయి సందడి చేయబోతున్నారు. ఈ రోజు(సెప్టెంబర్ 10) ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ తన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిన్మయికి విషెస్ కూడా తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించనున్నారట. అయితే జంటగానా, వీడిగానా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ రీయల్ కపుల్ మాత్రం రీల్పై తొలిసారిగా సందడి చేయడం విశేషం. దీంతో వారి ఫ్యాన్స్ వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇంతకాలం తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీతో తెరపై అలరించబోతున్నారు. కాగా చిన్మయి స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ Wishing star singer @Chinmayi a very happy birthday - Team #MEB Also, Makes her Big-Screen Debut with #MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official #MEBOnOct8th pic.twitter.com/FiluWbzbTj — BA Raju's Team (@baraju_SuperHit) September 10, 2021 -
చిన్మయి ప్రెగ్నెన్సీ రూమర్స్.. సింగర్ రియాక్షన్
సింగర్ చిన్మయి పేరు వినని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. దక్షిణాదిలో ఆమె గాత్రాన్ని ఆస్వాదిచని సంగీత ప్రేమికులు కూడా ఉండరు. అయితే ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా నిలబడ్డ మనిషి చిన్మయి. తాజాగా ఈ గాయని తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్లో పుకార్లు రేగాయి. రూమర్స్పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సుధీర్ఘ పోస్టు పెట్టారు. Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18 — Rahul Ravindran (@23_rahulr) July 1, 2021 ‘ఇది మా పెళ్లి ఫోటో. ఇందులో నేను మడిసార్ ధరించారు. దాన్ని క్యారీ చేయడంలో నాకు సమస్యలు ఉన్నాయి. మడిసార్ కారణంగా నా ఉదరం పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నేను గర్భవతిని కాదు. చిన్మయి బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయిన నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు మీతో పంచుకోవచ్చు లేదా చెప్పకపోవచ్చు. అనా నా నిర్ణయం. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పంచుకోము. వారు సోషల్ మీడియాలో ఉండరు. ఈ వార్తలతో అలసిపోయాను. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ రూమర్స్ను ఆపండి’ అంటూ పుకా రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. -
బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్
చిన్మయి శ్రీపాద.. గాయనీగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పరిశ్రమలో దూసుకుపోతున్న ఆమె ఒక్కప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. తన గాత్రంతో ఎందరినో ఆకట్టుకున్న ఆమె.. చిన్మయి పేరుతో మాత్రమే సుపరిచితురాలు. తెరవెనుకే ప్రేక్షకులను అలరించిన ఆమె ఒక్కసారిగా మీటూ ఉద్యమంతో తెరపైకి వచ్చి పాపులర్ అయ్యింది. అంతకుముందు వరకు పాడటం కోసమే సవరించిన ఆమె గొంతు.. ఒక్కసారిగా గళాన్ని విప్పింది. బయట సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న వివక్షను మీ టూ ఉద్యమం ద్వారా ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. అలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న చిన్మయి ఎంతోమంది మహిళలకు, బాలికలకు, యువతులకు ఆదర్శంగా నిలిచింది. తమ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదిపేందుకు భయపడుతున్న వారు సైతం ఆమె స్ఫూర్తితో బయటకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, అంతేగాక తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామంధుడికి తగిన శిక్ష పడేలా చేశానంటూ ఆమె చిన్మయికి లేఖ రాసింది. అంతేగాక ఇది మీ వల్లే ఇంత ధైర్యం చేశానని కూడా చెప్పింది. ఈ లేఖ సదరు యువతి.. ‘మీరు నిజంగా మాకు స్ఫూర్తి మేడం. నేను నా బాల్యం నుంచి లైంగిక వేధింపులకు గురయ్యాను. మా కజిన్నే నాపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం మా అమ్మనాన్నలకు చెప్పేందుకు భయపడేదాన్ని. కానీ ఓ రోజు ధైర్యం చేసి నిజం చెప్పాను. అయితే వారు ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడొద్దని నన్ను హెచ్చరించారు. వారి నుంచి ఆ మాటలు విని నిరాశ పడ్డాను. కానీ మీలాంటి వ్యక్తులు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో నాలాంటి వారిలో ధైర్యం వచ్చింది. మగవారు తప్పు చేసినా కూడా మనం ఎందుకు సైలెంట్గా ఉండాలనే ఆలోచన మొదలైంది. అందుకే ఇంట్లో ఎదురించలేకపోయిన బయట ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పబ్లిక్ స్థలంలోనే అతడు నన్ను తాకడంతో తిరిగి ఎదిరించాను. అతడిపై ఫిర్యాదు కూడా చేశాను. వాడికి సరైన శిక్ష పడేలా చేశాను. మా లాంటి వారి గొంతుకలా నిలుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చిన లేఖను చిన్మయి తన ఇన్స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఈ ఒక్క మెసేజ్తో జీవితం ధన్యమైంది: చిన్మయి
ఆమె గాత్రం మాధుర్యంగా ఉండటమే కాదు గళంలో ఆవేశమూ ఉంటుంది. పాడటానికి మాత్రమే సవరించే గొంతు.. ఏదైనా నిగ్గదీసి అడగడానికి సైతం వెనుకాడదు. ముఖ్యంగా ఆడవారి పట్ల జరుగుతున్న వివక్షను నిలదీసేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఆవిడే ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద. అయితే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఎంతోమంది తమకు ఎదురైన చేదు అనుభవాలను, జరుగుతున్న అఘాయిత్యాలను చిన్మయికి చెప్పుకుని బాధపడుతుంటారు. అలా అనేక మంది బాధలను, వారి నిస్సహాయ స్థితిని చిన్మయి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేవారు. ఆదివారం నాడు మదర్స్డే సందర్భంగా ఆమెకు ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. "ప్రియమైన చిన్మయి.. చాలామంది పిల్లలు వారికేదైనా సమస్య రాగానే తల్లికి చెప్పుకుందామని చూస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా అమ్మతోనే పంచుకుంటారు. కానీ లైంగిక వేధింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం వాటిని కన్నతల్లితో కూడా చెప్పుకోలేక బాధపడుతుంటారు. కానీ అలాంటి చేదు విషయాలను కూడా మేం నీతో చెప్పుకోగలిగాం. ఆ ధైర్యాన్ని నువ్వే మాకు అందించావు. అందుకే నీతో అన్నీ షేర్ చేసుకున్నాం. హ్యాపీ మదర్స్డే" అని వచ్చిన మెసేజ్ చూసి చిన్మయి ఎమోషనల్ అయింది. ఈ ఒక్క మెసేజ్తో తన జీవితానికి సార్థకత లభించినట్లు అయిందని భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం చెప్పినట్టు ఆడరు -
వ్యాక్సినేషన్ తర్వాత బ్లడ్ డోనేషన్పై చిన్మయి ఏమన్నారంటే..
చిన్మయి శ్రీపాద పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ కంటే కూడా ఆమె మీ టూ ఉద్యమంతో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఉద్యమంలో తన ముక్కుసూటి తీరుతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో సైతం పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేగాక తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే ఆమె పలు విషయాలపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా మహిళల భద్రతపై చర్చిస్తుంటారు. అలా ఎప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకునే చిన్మయి తాజాగా ఓ సందేశాన్ని ఇచ్చారు. వ్యాక్సినేషన్ తర్వాత రక్తదానం ఇవ్వచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. చిన్న-పెద్ద, పేద-ధనిక అనే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. ఈ క్రమంలో కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ తీసుకున్న రక్తాదానం చేయడంపై ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 56 నుంచి 60 రోజుల వరకు బ్లడ్ డొనేట్ చేయరాదు. దాని వల్ల మున్ముందు బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి.. వ్యాక్సినేషన్కు ముందే బ్లడ్ డొనేట్ చేయండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్గా యూని యన్లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్తో సంబంధం లేకుండా వారి ఫేస్లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఇకలేరంటే నమ్మశక్యం కావడంలేదు. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార ఆగిపోయిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ నమ్మక తప్పని కఠోర వాస్తవం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలే మనకిక శరణ్యం. వి మిస్ యూ బాలూ సార్...ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సోషల్ మీడియా ఇదే సందేశాలతో మారు మోగుతోంది. పలువురు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఒక శకం ముగిసింది అంటూ ప్రఖ్యాత గాయని చిన్మయ శ్రీపాద ట్వీట్ చేశారు. సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. బాలు గాయకుడు మాత్రమే కాదు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా,సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఇంద్రుడు, చంద్రుడు సినిమాలోనూ, అలాగే 2010లో వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. జన్మకే లాలీ...అంటూ తరలిపోయారు 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలోఆయన హీరోగా తెరకెక్కిన మిథునం ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. అంతేనా కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వారికి అమరిన ఆయన గొంతును మర్చిపోగలమా. ఆయా హీరోల, నటులు హావభావాలకు, గొంతుకు అనుగుణంగా తన గాత్రాన్ని మలుచుకోవడం ఆయన శైలి. అదే ఆయనకు ఎంతో వన్నె. అల్లు రామలింగయ్య, రాజబాబు లాంటి ఎందరో హాస్యనటులకు ఆయన పాడిన పాటలు ఆదరణకు నోచుకున్నాయి. అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ జూనియర్, ప్రభాస్ లాంటి ఇనాటి యంగ్ హీరోల దాకా ఆయన పాడని హీరో లేరు. 40 ఏళ్ళ సినీ ప్రస్తానంలో 11 భాషలలో, 40వేల పాటలు, 40 సినిమాలకి సంగీత దర్శకత్వంతో ఉర్రూత లూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అందుకే అవార్డులు, జాతీయ పురస్కారాలు వచ్చి వరించాయి. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) Oru Sahabdham samaptam. Thank you for the memories. Thank you for showing that a singer can be a fantastic singer, act, voice act, produce, compose & more. You lived and how! Your art will live for aeons and I’ll always celebrate you. #SPB — Chinmayi Sripaada (@Chinmayi) September 25, 2020 బాలు తల్లిదండ్రులు : శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి) , శకుంతలమ్మ (తల్లి) జీవిత భాగస్వామి : సావిత్రి సంతానం: చరణ్ , పల్లవి సోదరీమణులు : శైలజ, వసంత (కుమారుడు చరణ్, శైలజ, వసంత సినీ నేపథ్య గాయకులుగా ఉన్నారు) -
విషెస్ చెప్తూ విరాళాలు సేకరించిన చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కోవిడ్ విపత్తువేళ తన గొప్ప మనసు చాటుకున్నారు. తన గానమాధుర్యాన్ని ఓ మంచి పనికి ఉపయోగించారు. అభిమానుల కోసం పాటలు పాడుతూ, శుభాకాంక్షలు చెప్తూ 82 లక్షల రూపాయలను విరాళంగా సేకరించారు. ఈ మొత్తాన్ని లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అందించనున్నారు. కాగా కరోనా వల్ల చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చూసి చలించిపోయిన చిన్మయి ఏప్రిల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బర్త్డే విషెస్ గానీ, ఎవరి కోసమైనా పాట డెడికేట్ చేయాలన్నా, ఇంకేదైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా వారు ముందుగా చారిటీకి ఎంతో కొంత డబ్బులు డొనేట్ చేసి ఆ మొత్తాన్ని స్క్రీన్షాట్ తీసి పంపాలి. అప్పుడు వారి కోసం ఆమె పాట పాడి ఆ వీడియోను సెండ్ చేస్తారు. అలా ఇప్పటివరకు మూడు వేలకు పైగా వీడియోలను సెండ్ చేసి 85 లక్షల డబ్బు జమ చేశారు. (చదవండి: పోలీసుల ట్వీట్.. చిన్మయి హర్షం!) కష్టాల సుడిలో 800 కుటుంబాలు ఈ విషయం గురించి చిన్మయి మాట్లాడుతూ.. "కరోనా వల్ల ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఓ రోజు తమిళనాడులోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్కడి విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా నన్ను కోరాడు. 800 కుటుంబాల దీన పరిస్థితి గురించి వివరాలతో సహా మాకు పూర్తి సమాచారం పంపారు. అది ఎంతవరకు నిజమని కనుక్కునే క్రమంలో ఎన్నో విషయాలు తెలిశాయి. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరికొందరు శారీరక, మానసిక పరిస్థితి బాగోలేనివారు. హఠాత్తుగా వచ్చిపడ్డ కరోనా వైపరీత్యం వల్ల వారికి పూట గడవడమే కష్టంగా మారింది. అప్పుడే నిర్ణయించుకున్నా, వారికి నా వంతు సాయం చేయాల్సిందేనని! అందుకే ఎవరైనా సరే, ఏదైనా పాట కావాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా విరాళమిస్తే చాలు వీడియోలు చేసి పంపించేందుకు డిసైడ్ అయ్యా"నన్నారు. ఎక్కువగా బర్త్డే విషెస్ చెప్పమని అడిగేవారని, ఒక్కోరోజు 75 వీడియోలు కూడా చేశానని ఆమె పేర్కొన్నారు. (చదవండి: వీటి పేర్లు చెప్పుకోండి చూద్దాం!) -
‘నిన్నే పెళ్లాడతా’ సాంగ్: మంచు లక్ష్మి ట్వీట్
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అమన్ సరసన సిద్దికా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్ వీడియో సాంగ్ను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సఖుడా’ అంటూ సాగే ఈ పాటను నవనీత్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. (అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్) ‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ అంటూ సాగే ఈ ప్రేమ పాట యూత్ను ముఖ్యంగా లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. నటి మంచు లక్ష్మి కూడా ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్ సూపర్బ్ అని ట్విటర్లో పేర్కొంటూ పాటకు సంబంధించిన లింక్ను షేర్ చేశారు. దీంతో ఈ పాట మరింత వైరల్ అయింది. ఇక ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను కింగ్ నాగార్జున విడుదల చేయడంతో అందరి దృష్టి ‘నిన్నే పెళ్లాడతా’ పై పడింది. ఈశ్వరి, అంబిక ఆర్ట్స్ పతాకంపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయికుమార్, అన్నపూర్ణ, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కలాదర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నాన్న అర్థమవడానికి ఏళ్లు పట్టింది) What beautiful lyrics and how nice you look my darling @AmanPreetOffl https://t.co/S5IwuB1c9t.. Can't wait for the movie now — Lakshmi Manchu (@LakshmiManchu) June 18, 2020 -
ఆఖరికి అతడిని జైళ్లో పెట్టారు: చిన్మయి
చెన్నై: అనేక ఫిర్యాదుల అనంతరం కాశి అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద హర్షం వ్యక్తం చేశారు. మహిళలను వేధించినందుకు ఆఖరికి అతడు జైలు పాలయ్యాడని పేర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన కాసి అలియాస్ సుజి అనే వ్యక్తి ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్లలో యాక్టివ్గా ఉండే అతడు ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను అప్లోడ్ చేసేవాడు. ఈ క్రమంలో సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్స్ గుర్తించి వారికి రిక్వెస్ట్ పంపేవాడు. అనంతరం వారితో చాటింగ్ చేస్తూ పరిచయాన్ని స్నేహంగా మార్చుకునేవాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి సన్నిహితంగా మెలిగేవాడు. ఈ క్రమంలో వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయించేవాడు. వారితో చేసిన చాటింగ్, వీడియో కాల్స్ తాలూకు స్క్రీన్షాట్స్ కూడా సేవ్ చేసుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఇలా స్నేహం కొనసాగించిన తర్వాత తన ఆరోగ్యం బాగా లేదంటూ డబ్బు కావాలని కోరేవాడు. కొంతమంది అతడి మాటలు నమ్మి పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. అయితే మరికొంత మంది మాత్రం డబ్బులేదని చెప్పడంతో వారి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిలింగ్కు దిగేవాడు. అతడి ఆగడాలు ఎక్కువవడంతో కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో అతడి గురించి సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కాశిని అరెస్టు చేసిన కన్యాకుమారి పోలీసులు.. అతడి మోడస్ ఆపరాండి గురించి వివరిస్తూ ట్విటర్లో పత్రికా ప్రకటనను షేర్ చేసి చిన్మయిని ట్యాగ్ చేశారు. ఫేక్ ఐడీలతో కాశి ఇదంతా చేశాడని.. ఇంకెవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దని హెచ్చరించారు. Press release by @kumari_police regarding the Guy Kasi ! @Chinmayi pic.twitter.com/bp26TqSZ7T — Kanyakumari Memes (@kanyakumarimeme) April 24, 2020 -
హార్వీ భారత్లో పుట్టి ఉంటేనా: చిన్మయి
చెన్నై: అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్స్టీన్ జైలుపాలు కావడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. అనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హార్వీకి 23 ఏళ్ల శిక్ష పడిందన్న చిన్మయి.. భారత రాజకీయ పార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం తాను భారత్లో జన్మించి ఉంటే బాగుండేదని హార్వీ కోరుకుని ఉంటాడు. ముఖ్యంగా తమిళనాడులో పుట్టాలని బలంగా అనుకుని ఉంటాడు. ఇక్కడైతే తను స్టార్లు, రాజకీయ నాయకులతో సంతోషంగా పార్టీలు చేసుకునేవాడు. పద్యాలు, కవితలు రాసుకునేవాడు. నువ్వు గనుక ఇక్కడ ఉండి ఉంటే 100 శాతం రాజకీయపార్టీలు నీకే మద్దతుగా నిలిచేవి’’ అని ట్విటర్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.(లైంగిక వేధింపుల కేసు.. బడా నిర్మాతకు భారీ షాక్!) కాగా లైంగిక వేధింపుల కేసులో హార్వీ వెయిన్స్టీన్కు 23ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా హార్వీ మాట్లాడుతూ.. ‘‘నాకు అంతా అయోమయంగా ఉంది. నేను దేశం గురించి బాధపడుతున్నా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో చిన్మయి పైవిధంగా ట్వీట్ చేశారు. అదే విధంగా హార్వీ వర్సెస్ వైరముత్తు అంటూ హార్వీ వెయిన్స్టీన్, ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు సంబంధించిన వార్తా కథనాల ఫొటోలను షేర్ చేశారు.('ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి') కాగా హార్వీ ఉదంతంతో హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమాన్ని భారత్లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించగా... దక్షిణాదిన చిన్మయి ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తను ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపపెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక చిన్మయిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Harvey Weinstein sentenced to 23 years in Prison. This is the time he’d wish he were born in India. Especially in Tamilnadu. He’d have been partying with stars, politicians and have odes written. You’d actually be supported by political parties 100% pic.twitter.com/TKfQKZxhtj — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 Harvey Weinstein vs Vairamuthu That’s how we roll, baby! pic.twitter.com/A2viTUUcEJ — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 -
రాధారవిపై చిన్మయి ఫైర్..
చెన్నై, పెరంబూరు: నటుడు రాధారవి కుట్ర పన్ని ఎన్నికల్లో గెలిచారని గాయని, డబ్బింగ్ కళాకారిని చిన్మయి విమర్శించారు. డబ్బింగ్ యూనియన్ భవన ని ర్మాణంలో అవక తవకలు జరిగాయని, లక్షల్లో డబ్బును తినేశారని, నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈమె కోలీవుడ్లో ఫైర్బ్రాండ్గా ముద్రవేసుకున్నారనే చెప్పాలి. ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి వంటి వారిపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించారు. వారిని క్షమించేది లేదంటూ అవకాశం కలిగినప్పుడల్లా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ మధ్య వైరముత్తుకు గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించగా దాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా నటుడు రాధారవికి చిన్మయికి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. సౌత్ ఇండియన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధారవి ఆ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించారు. ఆమె వార్శిక చందాను చెల్లించని కారణంగానే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే తనపై కక్షతోనే రాధారవి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించిన చిన్మయి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది. అయినప్పుటికీ ఆమె సభ్యత్వాన్ని ఆమోదించేది లేదంటూ యూనియన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్నయి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్ను తిరష్కరించిన ఎన్నికల అధికారి నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దీనిపై చిన్మయి ఫైర్ అయ్యారు. ఈమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలన్నారు. అలాంటిది తన నామినేషన్ను ఎందుకు తిరష్కరించార న్నది వెల్లడించకుండా రాధారవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇక్కడ ఓడింది తాను మాత్ర మే అయితే మాట్లాడేదాన్ని కాదని అన్నారు. పలు ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో సభ్యులు గా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్ను నిర్వహిస్తున్నారని, ఆ డబ్బుతోనే యూనియన్కు భ వనాన్ని కట్టబడిందని చెప్పారు. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్ కళాకారుల డబ్బును స్వాహా చేశారని ఆరోపించారు. ఆ అవినీతిని బయటకు తీయడానికే తాము పోరాడుతున్నామని అన్నారు. అయితే ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ యూనియన్లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇప్పుడు తానూ వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయం కావడంతో దొడ్డి దారిలో రాధారవి గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చిన్మయి తెలిపారు. -
చిన్మయి నామినేషన్ తిరస్కరణ
పెరంబూరు: దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి. కాగా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి పోటీ చేశారు. వీరిద్దరి మద్య చాలా కాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. కాగా బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అయితే చిన్మయి నామినేషన్ తిరష్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీని గురించి ఆమె గురువారం మీడియా ముందుకు రానున్నారు. -
'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'
చెన్నై: తొమ్మిది మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్న తమిళ సినీ కవి వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మీకు ఓ విషయాన్ని గుర్తుచేయాలని అనుకుంటున్నాను. 'ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా' అని సింగర్ చిన్మయి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. చదవండి: ఫ్రీగా పాన్ ఇవ్వలేదని.. ముక్కు, పెదవులు కొరికేశాడు..! నేను చేసిన ఆరోపణలపై ఎవరూ విచారణ జరపకపోగా ప్రముఖుల చిత్రాల్లో అవకాశాలు ఇస్తూ అతడి ఆగడాలను సమర్ధిస్తున్నారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది. ఇక నాపై కామెంట్స్ చేస్తున్న వారికి ఒక్క విషయం చెప్తున్నా.. మీ జీవితంలోనూ వైరముత్తు లాంటి వ్యక్తి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలిసొస్తుంది. అనుభవాన్ని మించిన గురువు మరొకటి ఉండదు. నేను కేవలం న్యాయం కావాలని అడుగుతున్నాను. నా ఆరోపణలు విని ఓ కామాంధుడి అభిమానులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడంలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి. చదవండి: మహేంద్రన్పై చిన్మయి ఫైర్ చదవండి: చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష -
నకిలీ ఫోటో వైరల్, చిన్మయి వివరణ
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద వైరల్ అవుతున్న తన ఫోటోపై వివరణ ఇచ్చారు. అది మార్ఫింగ్ ఫోటో అని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ఇటీవల, లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన వివాదాస్పద గురువు నిత్యానందతో చిన్మయి, ఆమె తల్లి కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోను వివరీతంగా షేర్ చేసిన నెటిజనులు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో స్పందించక తప్పని పరిస్థితుల్లో ఈ ఫోటోపై వివరణ ఇచ్చారు. అయినా షేరింగ్స్ ఆగలేదు. ఈ ఫోటో నకిలీదని నిర్ధారించిన తర్వాత ఈ అభిమానులు మరలా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే ఇలా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫోటోను షేర్ చేశారు. అయితే చిన్మయి ట్వీట్ తరువాత, మార్ఫింగ్ ఫోటో షేర్ చేసిన ట్విటర్ యూజర్ తన ట్వీట్ను తొలగించడం గమనార్హం. తన నలుగురు కుమార్తెలను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్ధంగా నిర్బంధించి, వేధింపులకు గురిచేశారంటూ ఒక కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో ‘సేవ్ గరల్స్ ఫ్రమ్ నిత్యానంద’ అనే హ్యాష్ట్యాగ్ ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అయింది. సాధారణంగా ఇలాంటి సమస్యలపై తరచుగా స్పందించే చిన్మయి ఈ సమస్యపై కూడా స్పందించారు. మతపరమైన స్వాములు, భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమాలుఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నా..ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనేదానిపై పదేపదే ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రజలు అర్థం చేసుకోలేక వారి మాయలో పడిపోతున్నారని చిన్మయి ట్వీట్ చేశారు. దీనిక ప్రతిగా స్పందించిన ఒక వినియోగదారుడు నిత్యానంద నుంచి చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫేక్ ఫోటో షేర్ చేయడంతో దుమారం రేగింది. తమిళం, తెలుగుతోపాటు అనేక ఇతర భాషలలో పలు సూపర్ హిట్ పాటలతో చిన్మయి ప్రాచుర్యం పొందారు. అంతేకాదు త్రిష, సమంతా వంటి టాప్ హీరోయిన్లకు తన గొంతు అరువిచ్చి ఆయా పాత్రలకు ప్రాణం పోసారు. దీనితోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో మీ టూ ఉద్యమంలో చిన్మయి పాత్ర చాలా చురుకైనది. చదవండి : ‘నా కుమార్తెను చంపేశారు’: నిత్యానంద మరో అకృత్యం I dont why these fans are doing this all over again after I have established that this photo is fake. Are they doing this for free or is this paid? https://t.co/pHirTu6500 pic.twitter.com/j4GhpRCHGr — Chinmayi Sripaada (@Chinmayi) November 25, 2019 -
‘బిగ్ బాస్ షోలో ఆయన చేసింది బాగోలేదు!’
సాక్షి, చెన్నై : తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. పైగా ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ప్రోత్సహించినట్లుగా ఉండటం మరింత అగ్గి రాజేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించింది. తాజాగా బీజేపీ ప్రతినిధి నారాయణ తిరుపతి కూడా కమల్ తీరుపై మండిపడ్డారు. ‘ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్ హాసన్.. బిగ్ బాస్లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పమని అడగాల్సింది పోగా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉందని’ అన్నారు. బిగ్ బాస్ షోలో ఆయన చేసింది అమోదయోగ్యంగా లేదని, శరవణన్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. శనివారం నాటి బిగ్ బాస్ కార్యక్రమంలో కమల్ హాసన్.. సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో తాను కాలేజీకి వెళ్లే రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలను తాకుతూ ఆనందపడే వాడినని శరవణన్ తెలిపాడు. ఆ తర్వాత కమల్ దానిని ఒక సరదా సన్నివేశంగా మార్చి ఇప్పడు శరవణన్ అలాంటివాడు కాదు, పూర్తిగా మారిపోయి ఉంటాడంటూ ఆ సన్నివేశాన్ని దాటేశాడు. చదవండి: బస్లో మహిళలను వేధించిన బిగ్బాస్ కంటెస్టెంట్ -
బస్లో మహిళలను వేధించిన బిగ్బాస్ కంటెస్టెంట్
చెన్నై: బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని అని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. 'సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు' అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు. నెటిజన్ల ఆగ్రహం శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్లా బిగ్ బాస్ షోలో చూపించడం దానికి ఆడియన్స్ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై వీడియో క్లిప్ని షేర్ చేసిన ఓ అభిమాని.. దీనిపై స్పందించమని సింగర్ చిన్మయిని కోరారు. ఆమె దీనికి సమాధానంగా.. ‘మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడినంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని కూడా ఛానల్స్ ప్రసారం చేయడం, ఇలాంటి సీరియస్ విషయాన్ని జోక్లా చూపెట్టడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడం బాధాకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. బిగ్బాస్ షోలో ఇప్పటి దాకా ఇంటి సభ్యుల మధ్య వివాదాల్లో మాత్రమే గొడవలు జరిగేవి. ప్రస్తుతం ఇలాంటి విషయాన్ని తేలికగా చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నువ్వు నీతులు చెప్పకు..!
సాక్షి, హైదరాబాద్: అవంతిక పాత్రలో సిగరెట్ తాగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే విమర్శలపాలవుతోంది మాత్రం గాయని చిన్మయి శ్రీపాద. కొన్ని రోజులుగా వేధింపులపై పోరాడుతున్న చిన్మయి.. మన్మథుడు 2 సినిమాలోని రకుల్ పాత్రకు సంబంధించిన టీజర్ను షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిగరెట్ సీన్కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. మొన్నటివరకు కబీర్ సింగ్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తన సినిమాలో హీరోయిన్తో సిగరెట్ తాగించాడు. అంతేకాక బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు. చి.ల.సౌ. చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. జూలై 9న విడుదలైన టీజర్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ గోడకు ఏటవాలుగా నిలబడి గుప్పుగుప్పుమంటూ సిగరెట్ పొగను గాల్లోకి వదలడం, హీరో నాగార్జునతో ఆమె డైలాగులు చర్చకు దారితీశాయి. కొందరేమో టీజర్ అద్భుతంగా వచ్చిందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరేమో రకుల్ సిగరెట్ తాగే సీన్ను తప్పు పడుతున్నారు. ఎటొచ్చీ రాహుల్, చిన్మయిలకు మాత్రం ట్రోల్స్ తప్పట్లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. -
ఈ ఇడియట్ను చూడండి : సమంత
దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సింగర్ చిన్మయి శ్రీపాదకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుగా నిలిచినందుకు.. ఇండస్ట్రీ ‘పెద్ద మనుషుల’ కారణంగా ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. డబ్బింగ్ చెప్పేందుకు అవకాశం లేకుండా ఆమె గొంతుక వినిపించకుండా కొంతమంద్రి కుట్ర పన్నారు. అయితే తాజాగా సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఓ బేబీ సినిమా ద్వారా తమిళ డబ్బింగ్ చెప్పే అవకాశం చిన్మయికి లభించింది. ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకున్న చిన్మయి..‘ సమంతకు తమిళ్లో డబ్బింగ్ చెప్పాను. నిజానికి నందినిరెడ్డి, సమంత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ఓ బేబి టీజర్ను జతచేశారు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్మయికి మద్దతునిస్తుండగా.. మరికొంత మాత్రం.. ‘ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. ఈ సినిమా ప్లాపవడం ఖాయం’ అంటూ నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్రకు గొంతుతో జీవం పోసే చిన్మయికి సమంత అండగా నిలబడ్డారు. ‘ థ్యాంక్యూ... ప్రపంచం ఓ మూర్ఖున్ని కలిసింది. ఓ మూర్ఖుడు ప్రపంచంలోకి వచ్చాడు’ అంటూ సమంత ట్వీట్ చేశారు. దీంతో.. ‘కౌంటర్ అదిరింది సామ్. ఆడవాళ్లకు మరింత శక్తి రావాలి. ఓ బేబీ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి సినిమాతో ‘ఏ మాయ చేశావే’తోనే సమంత స్టార్గా మారడానికి ప్రధాన కారణం.. నటనతో పాటు ఆ సినిమాలో వినిపించిన గొంతేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గమ్మత్తైన ఆ గొంతు చిన్మయిది. తొలి సినిమా నుంచి సమంతకు చిన్మయి తన గొంతు అరువు ఇస్తూనే ఉన్నారు. ఇక వారిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. Aaaaaaand. I DUBBED IN TAMIL for Samantha. Frankly it is only because of @nandureddy4u and @Samanthaprabhu2 that this was possible. Here’s to women who make life better for other women. https://t.co/KO3dcpHobv https://t.co/0OtisVB1de — Chinmayi Sripaada (@Chinmayi) June 17, 2019 -
అసభ్య మెసేజ్; చిన్మయి అల్టిమేట్ రిప్లై!
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి గాయని చిన్మయి శ్రీపాద విపరీతంగా ట్రోలింగ్కు గురువుతూనే ఉన్నారు. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా.. ఓ ప్రబుద్ధుడు.. ‘దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేస్తూ మగ అహంకారం ప్రదర్శించాడు. ఇక తాజాగా మరో మగానుభావుడు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి తన పశు ప్రవృత్తిని బయటపెట్టుకున్నాడు. ‘మీ నగ్నచిత్రాలు పంపండి’ అంటూ వెకిలి కామెంట్లతో నీచంగా ప్రవర్తించాడు. అయితే మీటూ ఉద్యమంలో భాగంగా ‘పెద్ద మనుషులు’, ఇండస్ట్రీ ‘ప్రముఖులనే’ సునాయాసంగా ఎదుర్కొంటున్న చిన్మయి.. ఓ సగటు యువకుడు చేసిన ఈ అసభ్యకర కామెంట్ను చాలా తేలికగా తీసుకున్నారు. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్ న్యూడ్స్’ అంటూ లిప్స్టిక్ ఫొటోలను అతడికి పంపించి చెంప చెళ్లుమనిపించేలా.. చాలా తెలివిగా, హుందాగా సమాధానమిచ్చారు. అయితే అంతటితో అతడిని వదిలేయక.. స్త్రీ పట్ల నీచ భావం కలిగి ఉన్న సదరు యువకుడిని..‘ఎంటర్టైన్మెంట్ కోసం’ అంటూ నెటిజన్లకు పరిచయం చేశారు. దీంతో.. ‘చాలా తెలివైన సమాధానం మేడమ్.. అటువంటి పశువులకు కనీసం మీ ఉద్దేశం అర్థం అయి ఉండదేమో.. బ్యూటీ విత్ బ్రెయిన్.. హ్యాట్సాఫ్’ అంటూ చిన్మయిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. కాగా హ్యూమన్ స్కిన్ టోన్స్కు మ్యాచ్ అయ్యే కలర్లో ఉండే లిప్స్టిక్లను న్యూడ్ లిప్స్టిక్స్గా వ్యవహరిస్తారు. దాదాపు ఇందులో 20 నుంచి 30 వరకు షేడ్లు ఉంటాయి. కాగా ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే.18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. In the meanwhile.. for some entertainment pic.twitter.com/JwarkEaKDz — Chinmayi Sripaada (@Chinmayi) May 20, 2019 -
చిన్మయి ఆందోళనకు అనుమతి నిరాకరణ
పెరంబూరు: గాయని చిన్మయి ఆందోళన కార్యక్రమానికి చెన్నై పోలీస్ కార్యాలయం అనుమతి ఇవ్వలేదు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగొయిపై ఆయన కార్యాలయ పనిమనిషి లైంగిక ఆరోపణలు చేసిన విషయం, దీనిపై పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో కొందరు మహిళామండలి నిర్వాహకులు న్యాయమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలో లైంగిక వేధింపులపై(మీటూ) గళం విప్పిన తొలి మహిళగా పేరు తెచ్చుకున్న గాయని చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణను ఎదుర్కొన్న న్యాయమూర్తి రంజన్ గొగొయి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇతర మహిళామండలి కార్యకర్తలతో కలిసి ఆదివారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. అందుకు పోలీస్కమీషనర్ కార్యాలయంలో అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించింది. దీనిపై పోలీస్కమిషనర్ కార్యాలయం ఆమెకు అనుమతిని నిరాకరించారు. సుప్రీంకోర్టే కొట్టివేసిన కేసు విషయంలో ఆందోళన చేయడం న్యాయస్థానాన్ని అవమానించడం అవుతుందని, చిన్మయికి అనుమతిని ఇవ్యలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఆడెవడు!
‘నర్సిమన్నా.. ఆడెవడు!’ అంటాడు ‘అంతఃపురం’ సినిమాలో జగపతిబాబు. ఇప్పుడు అదే ధిక్కారం పా.రంజిత్ మాటల్లో చిన్మయి అభిమానులకు వినిపిస్తోంది. మీటూ బాధితుల తరఫున రంజిత్ మామూలు మనిషితో డీకొనలేదు. కె.రాజన్తో పెట్టుకున్నాడు. రాజన్ తమిళ్ ఇండస్ట్రీలో నర్సిమన్న! ఆ నర్సిమన్నకు తనలోని ట్వంటీ ఫిఫ్త్ ఫ్రేమ్ను చూపించాడు రంజిత్. మాధవ్ శింగరాజు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లతో ఎవరూ పెట్టుకోరు. పెద్ద నిర్మాత, పెద్ద దర్శకుడు, పెద్ద హీరో.. ఇంకా ఏవో ఉంటాయి ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ అని.. ఆ ఫ్రేముల్లోని పెద్దవాళ్లు ఒక మాట చెబితే చాలు.. ఎంత టాలెంట్ ఉన్నవాళ్లకైనా రూకలు చెల్లాల్సిందే. లాగి అవతల పడేయిస్తారు. మరెలా ఇండస్ట్రీ నడవడం! పెద్దవాళ్లు తలచుకుంటే టాలెంట్కి కొదవేముంటుంది.. ఎవరో ఒకర్ని తెచ్చేసుకుని టాలెంట్కి అప్పటికప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అందుకే ఆర్టిస్టులెవరూ ఈ పెద్దవాళ్లను ప్రజ్వలన వరకు పోనివ్వరు. సినిమా ఇండస్త్రీ అనే కాదు.. ఎక్కడైనా డబ్బు ఖర్చు చేసేవాళ్లదే పై మాట. ఆ మాట వినకపోతే మనకొచ్చే రెమ్యూనరేషన్ ప్లేట్ ఇడ్లీ సాంబార్ అయినా, పదకొండు వేల నూట పదహార్లయినా, కొన్ని లక్షల కాంట్రాక్ట్ అయినా ఆ రోజుతో ఆఖరు. ఆ నష్టం కొంచెమే. ఆ తర్వాత ఇక ఎవరూ పిలిచి కెరీర్ని ఇవ్వరు. అది పెద్ద నష్టం. అంతా ఏకమై పగపడతారు. ఆర్టిస్టులకైతే ఫిల్మ్గతులు ఉండవు. కె.రాజన్ ఇప్పుడు తమిళ్లో పెద్ద ప్రొడ్యూజర్. పలుకుబడి ఉన్న సీనియర్ నిర్మాత. ప్రస్తుతం ‘పర’ అని తమిళంలో ఒక సినిమా తీస్తున్నారు. గతవారం ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో అకస్మాత్తుగా ఆయన చిన్మయి ప్రస్తావన తెచ్చారు. ‘పర’లో చిన్మయి పాడింది లేదు. డబ్బింగ్ చెప్పిందీ లేదు. కనీసం ఆమె ఆ ఫంక్షన్లో కూడా లేరు. ‘పర’ ఒకటే కాదు.. కమింగ్ అప్ సినిమాల్లో కూడా ఆమె పాటలు, మాటలు లేవు. నిరుడు వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసినప్పటి నుంచీ ఆమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. అందుకు చిన్మయేం చింతించలేదు. ఇండస్ట్రీ మొత్తం కక్ష కట్టినా భర్త సపోర్ట్ ఆమెను నిలిపింది. కె.రాజన్ సీనియర్ నిర్మాత అయినట్లే, వైరముత్తు సీనియర్ గీత రచయిత. ‘‘కన్నదాసన్, వలీల తర్వాత.. అంతటి విద్వత్తు గల వైరముత్తు మీదే ఆరోపణలు చేస్తావా. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆయన నిన్ను ఏదో చేశారని, ఇప్పుడు నువ్వు చీప్ పబ్లిసిటీ కోసం ఆయన్నేదో చేయబోతావా? నిన్ను సర్వనాశనం చేస్తా చూడు. నాకు తెలిసిన వాళ్లు యాభై మంది ఉన్నారు. వాళ్లకు ఒక్కమాట చెప్పానంటే నీ అంతు చూస్తారు. నువ్వు వైరముత్తు మనశ్శాంతిని ధ్వంసం చేస్తే నా మనుషులు నిన్ను అధోగతి పట్టిస్తారు’’ అని చిన్మయి పేరెత్తకుండా చిన్మయిపై విరుచుకుపడ్డారు రాజన్. రాజన్ మాట్లాడుతున్నప్పుడు వేదికపై ఆయన వెనకే ఎల్లో శారీ, గ్రీన్ కలర్ జాకెట్లో ఉన్న యాంకర్.. రాజన్ అంటే ఉన్న భయభక్తుల వల్ల కావచ్చు.. చేతులు కట్టుకుని, తలదించుకుని గౌరవ మనస్కురాలై నిలబడి ఉన్నారు. చెప్పలేం. నిరసనకు అదొక జెశ్చర్ అయినా కావచ్చు. పెద్దాయన కదా మరి! రాజన్ మాటలపై ఇంకో మాట ఉండదు. శాసనం. తర్వాతి వక్త పా.రంజిత్. ఫంక్షన్కి అతడు చీఫ్గెస్ట్ కూడా. యువ దర్శకుడు. రజనీతో ‘కబాలి’, ‘కాలా’ తీసింది అతడే. వేదిక మీదకి వచ్చి మైక్ అందుకున్నాడు. చిన్మయికి రాజన్ ఇచ్చిన వార్నింగ్ ఎక్కడైతే ఆగిందో.. సరిగ్గా అక్కడి నుంచి రంజిత్ ప్రసంగం మొదలైంది! ఇది ఎవరూ ఊహించనిది. వణికిపోయారు. కూర్చున్న కొమ్మపై గొడ్డలి లేపాడేమిటీ కుర్రాడు అనుకున్నారు. రాజన్ పేరెత్తకుండా, చిన్మయి మాటెత్తకుండా మాట్లాడాడు రంజిత్. ‘‘ఏళ్లుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇండస్ట్రీ ఇది. ఈ వాస్తవాన్ని తిరస్కరించలేం. అంతే కాదు.. వాస్తవమని అంగీకరించాలి కూడా. మహిళా ఆర్టిస్టులు ఫిర్యాదు చేసినప్పుడు ఆరోపణగా తీసుకోకూడదు. విచారణ జరిపించాలి. ఫిర్యాదు చేసిన మహిళనే నేరస్థురాలిగా చూడ్డాన్ని నేను ఖండిస్తున్నాను’’ అన్నాడు! సభలో సౌండ్ లేదు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఆ పసుపురంగు చీరలో ఉన్న అమ్మాయి ముఖంలో మాత్రం కృతజ్ఞతలాంటి చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది. మీటూ ఉద్యమం మన దగ్గర ఏడాదిగా నడుస్తోంది. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా, తమిళంలో చిన్మయి.. ఈ ఇద్దరూ ధైర్యంగా బయటికి వచ్చారు. నిందలు, అవమానాలు పడ్డారు. చిన్మయి అయితే అవకాశాలు కోల్పోయారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్మయి ఒంటరి ఆర్టిస్ట్. అయినా గట్టిగా నిలబడ్డారు. రాజన్ బెదిరింపులకూ భయపడలేదు. ‘సిదైక ఆల్ ఎల్లమ్ వెచ్చుర్కారమే. బయప్పోదుమా?’ అని ట్విట్ చేశారు. మనుషుల్ని పెట్టించుకున్నారట! భయపడాలా?! అని. ఆ తర్వాత చిన్మయి భర్త పా.రంజిత్కి సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.. ప్రతిచోటా ఇలాంటి గౌరవనీయులు ఒక్కరైనా ఉండాలి అని. ఇప్పుడిక రంజిత్కి ఉంటుంది. తన మాటకే మాట వేసినందుకు రాజన్.. రంజిత్కి సినిమాలు ఇవ్వకుండా, సినిమాలు రాకుండా చెయ్యవచ్చు. అయితే రంజిత్ ఇవేమీ ఆలోచించలేదు. తన మనసులో ఉన్నది మాట్లాడాడు. అసలీ మాటను ఈసరికే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దపెద్ద వాళ్లు మాట్లాడి ఉండవలసింది. కానీ మౌనం తప్ప మాట లేదు! ఇప్పుడు పా.రంజిత్ మాట్లాడాడు. హీరోలను డైరెక్ట్ చేసినవాడు రంజిత్. ఇప్పుడు అతడే హీరోగా నిలబడ్డాడు. రియల్ హీరోగా! చిన్మయిని సపోర్ట్ చెయ్యడం అతడి హీరోయిజం కాదు. చిన్మయిని, చిన్మయిలాంటి వాళ్లను కించపరుస్తున్న పెద్దవాళ్లందర్నీ ఒక్కమాటతో ఖండించాడు. ‘వేధింపులు నిజమే అని అంగీకరించాలి’ అనే ఒక్కమాటతో ఇండస్ట్రీ పెద్దలకు ఎదురు నిలిచాడు. ఇలాంటి ఒక హీరో.. ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి పక్కనా సపోర్ట్గా ఉండాలి. నాన్న, అన్న, భర్త, స్నేహితుడు, సన్నిహితుడు.. ఎవరైనా ఒక హీరో! స్టంట్స్, ఫైట్స్ చెయ్యక్కర్లేదు.. ఆమె మీదకు వచ్చేపడే మాటల ఈటెల్ని తిప్పికొట్టే హీరో! బూమరాంగ్ అయిన ఆ ఈటెలు ఒక్కో మసుగునూ తొలగిస్తుంటే అమ్మాయిలకెంత ధైర్యం, ధీమా. - మాధవ్ శింగరాజు -
‘వైరముత్తును పెళ్లి చేసుకో; ఐడియా బాగుంది’
పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... ‘ దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన చిన్మయి... ‘ మీ ఐడియా చాలా బాగుంది. కానీ నాకు నచ్చలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తనకు అండగా నిలుస్తూ భర్త రాహుల్ రవీంద్రన్ గతంలో రాసిన లేఖను ట్వీట్ చేశారు. ‘ పనికిలేని వాళ్లంతా నా టైమ్లైన్లో చెత్త రాస్తున్నారు. నా భార్య కారణంగా మీకేదో ఇబ్బంది కలుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే తనో ప్రత్యేకమైన వ్యక్తి. మాట్లాడే ధైర్యం కలది. మగ అహంకారం చూపి తనను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రపంచం మారుతోందన్న విషయాన్ని మీరు అంగీకరించరు. సమానత్వం వచ్చేదాకా తనలాంటి గొంతులు మరింతగా హోరు పెంచుతాయి. ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, నిస్వార్థంగా ఇతరుల కోసం జీవించే మహిళను నేను భార్యగా పొందాను. మీరు కూడా మీ వ్యక్తిత్వానికి తగిన భార్యను వెతుక్కోండి. ఆమె లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లు మీలాంటి సంకుచిత వ్యక్తులను ఎంచుకుంటారా అనేదే కాస్త సందేహంగా ఉంది’ అంటూ రాహుల్ రవీంద్రన్ తన భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘నా భర్త స్ట్రాంగెస్ట్’ అని చిన్మయి ఈ లేఖను మరోసారి ట్విటర్లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయిపై విషం చిమ్మిన నెటిజన్ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. ‘బాధితులకు ఎంత మంచి సలహా ఇచ్చావురా నాయనా. అలాంటి వాళ్లు మనింట్లో ఉన్నా కూడా ఇలాగే చెప్పాలి. ఎంతైనా నువ్వు గ్రేట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. What an idea. Sorry not interested. https://t.co/DsURMwT9b6 — Chinmayi Sripaada (@Chinmayi) April 15, 2019 ❤️❤️❤️❤️❤️💪🏻💪🏻💪🏻💪🏻 My husband strongest. https://t.co/EEAJzSHopn — Chinmayi Sripaada (@Chinmayi) October 17, 2018 -
డబ్బింగ్ చెప్పనిస్తారా?
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్ను తన ట్వీటర్లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు. ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి. -
చిన్మయి నిషేధంపై స్టే
మీటూ ట్వీట్లతో కోలీవుడ్లో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది మీటూ ఆరోపణల నేపథ్యంలో తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు. రాధరవి చాలా సందర్భాల్లో మహిళపై దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో కొద్ది రోజుల్లోనే చిన్మయిపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నిషేధం విధించింది. ఈ ఘటనపై చిన్మయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిషేధంపై స్టే విధించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్మయి ‘కోర్టు నా మీద విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది’ అంటూ ట్వీట్ చేశారు. I have been awarded an interim stay order by the Honble Court regarding my ban from the Tamilnadu Dubbing Union. It is a long legal battle ahead. Hope justice will prevail. Thank you. — Chinmayi Sripaada (@Chinmayi) 15 March 2019 -
ప్రియతమా..ఇష్టమైన సఖుడా
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట లిరికల్ వెర్షన్ను చిత్రం యూనిట్ సోమవారం విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను గాయని చిన్మయి శ్రీపాద చాలా హృద్యంగా ఆలపించారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్న ఈ మూవీలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ స్వరాలను సమకూర్చారు. -
చిన్మయి ఫిర్యాదు.. స్పందించిన మేనకా గాంధీ
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి. ‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు) I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6 — Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019 -
∙మీటూ; ద వే ఫార్వార్డ్ చనిపోతే తప్ప నమ్మరా?
హైదరాబాద్, బేగంపేటలో ఉంది ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు వేదిక ఆ స్కూలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇది తొమ్మిదో ఎడిషన్. నిన్న మొదలైన ఈ మూడు రోజుల పండుగ రేపటితో ముగుస్తుంది. ఈ ఏడాది ఫెస్టివల్కి అతిథి చైనా దేశం. గాంధీజీ 150వ జయంతి ఏడాది కావడంతో గుజరాత్ సాహిత్యం సాహిత్యం, గాంధీజీ ప్రధానాంశాలుగా రూపొందిందీ ప్రోగ్రామ్. సాహిత్య సభలో సిరాచుక్క సాక్షిగా ‘మీటూ’ సామాజికాంశం ప్రధానమైన చర్చనీయాంశమైంది. అనేక ఆవేదనలకు సంగ్రహరూపంగా ‘మీటూ; ద వే ఫార్వార్డ్’ ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో చిన్మయి శ్రీపాద, సంధ్య మెనన్, సుతప పాల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలి ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ’ అంటూ ప్రశంసపూర్వకంగా ఆహ్వానించారు వసుధ. ‘‘సమాజం అధికార సమీకరణల మీద నడుస్తోందని, అది విద్యార్థిని– టీచర్ నుంచి అధికారి – ఉద్యోగిని వరకు అన్ని చోట్లా విస్తృతంగా రాజ్యమేలుతోందని నిరసించారామె. ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ‘నా దేహాన్ని పణంగా పెట్టడం ఎందుకు’ అంటూ శ్రీరెడ్డి గళం విప్పినప్పుడు తెలిసింది సినిమా ఇండస్ట్రీకి విశాఖ గైడ్లైన్స్ గురించి తెలియదని. ధైర్యంగా బయటకు వచ్చిన తనుశ్రీదత్తా నుంచి ఎవరు కూడా కంప్లయింట్ ఫైల్ చేసే అవకాశమే లేని విధంగా నడుస్తోంది మన వ్యవస్థ. పని ప్రదేశంలో సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్ ఉండాలనే నిబంధన అమలు చేయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి’’ అన్నారు వసుధ. ‘‘మగవారికి ప్రతికూలమైన అంశాల మీద కనీస చర్చ లేకుండా వీలయినంత త్వరగా తుడిచేయడానికే చూస్తుంది సమాజం. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం మంచి ఫలితాలనివ్వాలంటే మహిళలకు ఉద్యోగం చేసే చోట సురక్షితమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం కల్పించే వరకు ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని రచయిత సంధ్యా మెనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలు అంటూ గొంతుచించుకోవడం మీద తన అధ్యయనాన్ని వివరిస్తూ ‘‘నేపాల్ నుంచి కేరళ వరకు రకరకాల మహిళలను కలిశాను. వారి అనుభవాలను తెలుసుకున్నాను. నా ఫోన్కు 250 మెసేజ్లు వచ్చాయి. వాటిలో మూడు మాత్రమే పెద్దగా ప్రాధాన్యం లేనివి. మిగిలినవన్నీ ఏ మాత్రం సందేహం లేకుండా వేధింపు అని అంగీకరించాల్సినవే. ఆ మూడింటిని కూడా అసత్యపు ఆరోపణలు అనడానికి వీల్లేదు. చిన్నపాటి అపార్థాల కారణంగా లేవనెత్తిన ఆరోపణలవి.మీటూ ఉద్యమంలో స్పందించే గొంతుకలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి’’ అన్నారు సుతప పాల్. గళం విప్పినందుకు.. సమంత, భూమిక, కాజల్, త్రిష, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, నయనతార, లావణ్య త్రిపాఠి... వంటి అనేక మంది హీరోయిన్ల ద్వారా మనకు స్వర పరిచితురాలు చిన్మయి శ్రీపాద. సింగర్గా సింగిల్ కార్డుతో పాటలు పాడిన అమ్మాయి. నంది, ఫిలింఫేర్, స్టేట్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులందుకున్న అమ్మాయి. బ్లూ ఎలిఫెంట్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా నడుస్తున్న కెరీర్ ఆమెది. తమిళనాడు నుంచి ఫార్చ్యూన్ గ్లోబల్ ఉమెన్స్ మెంటరింగ్ పార్ట్నర్ షిప్ ప్రోగ్రామ్కు ఎంపికైన తొలి మహిళ. ఒకప్పుడు గడియారంతో పాటు పరుగులు తీస్తూ... రోజుకు ఐదారు పాటలు పాడిన అమ్మాయి. ఇప్పుడు రోజుకు ఒక పాటకు మించడం లేదు. దీనంతటికీ కారణం తమిళ కవి, పాటల రచయిత వైరముత్తు అకృత్యాలను బయటపెట్టడమే. ‘మీటూ’ అంటూ బయటకొచ్చిన బాధితులకు ఆలంబనగా నిలిచినందుకు ఆమె చెల్లిస్తున్న మూల్యం ఇది. ‘‘సక్సెస్లో ఉన్నావు కెరీర్ని కోల్పోవద్దు... అని చెప్పింది మా అమ్మ. కెరీర్ కంటే స్త్రీగా ఆత్మగౌరవం ముఖ్యం కదా అమ్మా అన్నాను. వైరముత్తు మీద నోరు తెరిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైరముత్తు వేసుకున్న జెంటిల్మన్ ముసుగును తొలగిస్తూ వందల మంది బయటకు వచ్చారు. అప్పటివరకు నా కులం ప్రస్తావన రాలేదు, వాళ్ల అఘాయిత్యాలను బయటపెట్టినప్పటి నుంచి కుల సమీకరణలు మొదలయ్యాయి. అవి రాజకీయ సమీకరణలకు దారితీశాయి. వాటంతటగా అవి దారి తీయలేదు. అలా తీయించారు. ‘పబ్లిసిటీ కోసం సమాజంలో పేరున్న వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే’ అన్నాడా పెద్దమనిషి. పదిహేడేళ్లపాటు నిర్మించుకున్న కెరీర్ నాది. నేనందుకున్న అవార్డులకు లెక్కేలేదు. అలాంటి నేను పబ్లిసిటీ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేయడం నాకవసరమా? పద్మశ్రీలు, పద్మభూషణ్లు అందుకున్న వ్యక్తి (వైరముత్తు) అనాల్సిన మాటలు కావవి. సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ప్రాణ హాని ఉంటుందని, ఒక్కదానినే ప్రయాణం చేయవద్దని స్నేహితులు, బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏరోజు ఏదైనా జరగవచ్చనేటంతగా భయానక వాతావరణం ఏర్పడి ఉంది. ఇది కూడా పవర్ ఉన్న వాళ్లు వ్యూహాత్మకంగా సృష్టించినదే.ఇలాంటి విషయాల్లో భారతీయ సమాజం మారాలి. పితృస్వామ్య భావజాలంతోపాటు స్త్రీ అంటే తేలిక భావం, ఏదైనా అనవచ్చు అనే ఆధిక్య భావన కరడు గట్టుకుని ఉంది. మహిళను నమ్మరు, ఆమె మాటను విశ్వసించరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటంటే... వివాదాన్ని ఎదుర్కొంటున్న మహిళ తాను చెప్పదలచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. ఈ పోకడ మారనంత వరకు ఈ పోరాటాలు తప్పవు’’ అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. – వాకా మంజులారెడ్డిఫొటోలు: అనిల్ కుమార్ మహిళ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. మంచి పరిణామం కోసమే ‘‘నా మీద ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చు. దాడి జరుగుతుందని వెనక్కి పోవడం ఉండదు. ఇప్పటి వరకు జరిగిన దాని పట్ల నాకు ఎటువంటి విచారమూ లేదు. జరగాల్సినదే జరిగింది. జరగాల్సిన మంచి పరిణామానికి వేసిన అడుగు ఇది. ఒక మంచి జరగాలంటే కొంత ఘర్షణ తప్పదు. అలాంటి ఘర్షణే ఇది. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయాణం కొనసాగుతుంది. – చిన్మయి శ్రీపాద, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ -
వైరల్ : ప్రియానిక్ ఫోటో.. చిన్మయి ఫైర్..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. పదేళ్ల క్రితం ఎలా ఉన్నారు.. ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలిపే ఫోటోలను షేర్ చేస్తూ ఈ చాలెంజ్ను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ 10yearschallenge ట్రెండింగ్లో ఉంది. అయితే దీనివల్ల కొందరు చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆకతాయిల చేష్టలకు కొదవే లేని సోషల్ మీడియాలో ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ల ఫోటోలపై మీమ్స్ క్రియేట్ చేశారు. 2009లో ప్రియాంక ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటోను, 2019లో ప్రియాంక నిక్తో ఉన్న ఫోటోను జత చేసి సోషల్మీడియాలో షేర్ చేశారు. దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. ‘ఈ ఫోటోను చూస్తే వారి ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. తనకంటే 25ఏళ్లు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే ఈ దేశంలో.. అరవై ఏళ్ల వృద్దుడు చిన్న పిల్లలను చేసుకునే ఈ ప్రపంచంలో అటువంటి వారిని ఎవరూ ఏమనరు. కానీ ఒక అమ్మాయి తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలాంటివి చేస్తూ ఉంటారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మధ్యే.. తాను వేసుకున్న దుస్తులపై కామెంట్ చేసిన వ్యక్తిని దూషించిన రకుల్ను నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించగా.. చిన్మయి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
వైరముత్తుపై యువ రచయిత సంచలన ఆరోపణలు!
కోలీవుడ్లో హిట్ మూవీగా నిలిచిన విజయ్ సేతుపతి- త్రిషల ‘96’ సినిమాలో ‘అంతాతీ నీ సాంగ్తో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చాడు యువ రచయిత కార్తిక్ నేత. గతేడాది విడుదలైన చిత్రాల్లోని ఉత్తమ పాటల్లో ఒకటిగా నిలిచిన పాటతో కార్తిక్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో పలు ఎంటర్టేన్మెంట్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జాతీయ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ రచయిత వైరముత్తుపై కార్తిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ‘వాగై సోడా వా’ అనే సినిమాలో ‘సారా సారా సరకాత్తు’ అనే పాటను రాసింది తానైతే.. టైటిల్ కార్డ్స్లో మాత్రం వైరముత్తు తన పేరు వేయించుకున్నారని కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన పాటలకు ఆయన క్రెడిట్ కొట్టేశారంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తిక్ వెనక్కి తగ్గాడు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇటీవల నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అప్పుడు నేనేం మాట్లాడానో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నా మాటలను అంగీకరించలేను అలాగే తిరస్కరించలేను కూడా. ప్రస్తుతం నేను సిటీలో లేను. ఈ విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను’ అని పేర్కొన్నాడు. కాగా మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద కార్తిక్కు మద్దతుగా నిలిచారు. ‘ కార్తిక్ నేత తనకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పడం హర్షించదగ్గ విషయం’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
వదల చిన్మయీ వదలా!
పెరంబూరు: వదల బొమ్మాళి వదలా అది నిన్నటి సినిమా డైలాగ్. నేటి నిజ డైలాగ్ చిన్మయీ నిన్నొదలా. ఏంటీ అర్థంకా? గాయని ఏ ముహూర్తంలో సీనియర్ నటుడు రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో గానీ, అది ఆరని మంటగా రగులుతూనే ఉంది. గాయని చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కూడా లైంగికవేధింపుల ఆరోపణలు గుప్పించింది. అయితే అది ఆరోపణలు, ఖండించడాలతో సరిపెట్టుకుంది. రాధారవి, చిన్మయిల మధ్య కోల్డ్ వార్ కాదు, డైరెక్ట్ వార్నే జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఎవరివి తప్పొప్పులన్న విషయం పక్కన పెడితే ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై ప్రతీకారంగా రాధారవి తను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దక్షిణభారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సభ్యత్వ రుసుము కట్టడం లేదన్న సాకును చూపించారు. అలా రాధారవి గాయని చిన్మయి వృత్తిపై పెద్ద దెబ్బ తీశారు. అయితే తనను సంఘం నుంచి తొలగించడం ఎవరి తరం కాదని, తాను శాశ్విత సభ్యురాలినని తెలిపిన చిన్మయి ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అంటోంది. అంతటితో ఆగకుండా రాధారవి పరువు మీద దెబ్బకొట్టేలాంటి చర్యలకు పాల్పడింది. నటుడు రాధారవి తన పేరుకు ముందు దత్తో అనే మలేషియా ప్రభుత్వం అందించిన బిరుదును తగిలించుకుంటారు. అయితే ఆ బిరుదు నకిలీదన్న విషయాన్ని గాయనీ చిన్మయి బట్టబయలు చేసింది. తాను మలేషియా ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాశానని, అందుకు స్పందించిన ఆ ప్రభుత్వం రాధారవికి అలాంటి బిరుదు ఇవ్వలేదని చెప్పినట్లు చిన్మయి తన ట్విట్టర్లో పేర్కొని కలకలం సృష్టించింది. దీంతో రాధారవి ఆమెపై మండిపడుతున్నారు. ఆయన సోమవారం ఒక మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి అబద్దాల మీద అబద్దాలు వల్లివేస్తోందన్నారు. ఆమె గీతరచయిత వైరముత్తును బ్లాక్ మెయిల్ చేసేలా ఆయనపై అసత్యలైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందన్నారు. తరువాత తనపైకి వచ్చిందని,తన వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు నిజాలు తప్ప అని అన్నారు. తనకు దత్తో అవార్డును ప్రదానం చేసిన వారితోనే నిజాలు చెప్పిస్తానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా చిన్మయిని తాను వదిలేది లేదని అన్నారు. మరి వీరిద్దరి మధ్య వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి. -
చిన్మయి మరోసారి సంచలన ఆరోపణలు
మీటూ అంటూ ఉద్యమించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్ చానల్లో 19నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ట్విటర్లో వరుస ట్విట్లతో అనేక ప్రశ్నల్ని, విమర్శల్ని లేవనెత్తారు. ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ అక్రమాలు, డబ్బింగ్ ఫీజులో 10శాతం వసూలు తదితర విషయాలపై ఆమె స్పందించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఫీజు చెల్లించినా తప్పుడు ఆరోపణలతో తనను అక్రమంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ డబ్బింగ్ యూనియన్కు సంబంధించిన లైఫ్ మెంబర్షిప్ (జీవితకాల సభ్యత్వం) చెల్లించినట్టు వెల్లడించారు. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో యూనియన్వాళ్లు తనకు రసీదును ఇవ్వలేదని చెప్పారు. రిసీట్ చూపించని కారణంగా డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని నిరాకరించారని తెలిపారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించకోలేదన్నారు. తాను లైఫ్మెంబర్షిప్ చెల్లించినా, తనను యూనియన్ సభ్యురాలిగా తొలగించడంపైనా, అసలు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో బ్యాంకు స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కేవలం రాధా రవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగానే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అలాగే తమిళ డబ్బింగ్ యూనియన్కు సంబంధించి తనతో కలిసి మొత్తం 97మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని యూనియన్ చెబుతోందన్నారు. యూనియన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి సభ్యత్వాన్ని తొలగించారని, అయితే వారు కోర్టుద్వారా కొంతమంది సభ్యత్వాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు డబ్బింగ్ యూనియన్పై భూమా సుబ్బారావు అనే ఆర్టిస్టు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దాదాపు 16 ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు. దీంతోపాటు గత నెలలో నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీటు వివరాలను కూడా చిన్మయి ట్వీట్ చేశారు. తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిలపై పలు ఆరోపణలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదంటూ యూనియన్ నుంచి తొలగించినట్టు అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Here is the video. The statement that I didn’t pay the dubbing union subscription fee is false. 👇🏼https://t.co/1TVsdgeasM — Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2018 These are the list of writ petitions/ cases filed against the Dubbing Union. Plus there is an FIR and a chargesheet filed as well a few months ago. pic.twitter.com/HurRFhd4zo — Chinmayi Sripaada (@Chinmayi) November 24, 2018 -
తమిళంలో ఇక డబ్ చేయలేనేమో..!
-
సింగర్ చిన్మయిపై వేటు : మీటూ ఎఫెక్ట్?
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఇండియాలో విస్తృతమైన ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా పేర్కొనదగిన వ్యక్తి. ముఖ్యంగా తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. తాజాగా తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనను డబ్బింగ్ యూనియన్నుంచి తొలగించారని ప్రకటించారు. అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్ త్రిషకు చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ఆమె ట్వీట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే డబ్బింగ్ యూనియన్ ద్వారానే తనపై తొలి వేటు తాను ముందే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు. తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన డబ్బింగ్ కరియర్ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్ 9న ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్ యూనియన్కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు. మరి ఇన్నిరోజులుగా పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.. కేవలం పేరున్న ఆర్టిస్ట్ అన్నగౌరవంతోనే ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు. కాగా సినీ నేపథ్యగాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సమంత, తమిళంలో త్రిషలాంటి హీరోయిన్లకు చిన్మయి తన గొంతును అరువిచ్చారు. వారి నటనకు చిన్మయి డబ్బింగ్ ప్రాణం పోసిందంటే అతిశయోక్తి కాదు. Sooo given to understand that I have been terminated from the dubbing union. Which means I can longer dub in Tamil films henceforth. The reason stated is that I haven’t paid ‘subscription fees’ for 2 years though this hasn’t stopped them from taking 10% off my dubbing income — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 I can see my Dubbing career go up in smoke now. He heads the dubbing union. — Chinmayi Sripaada (@Chinmayi) October 9, 2018 Anyway I always knew my career would be done with. Society is run by the powerful. The predators will NEVER be questioned. Neither will disciplinary action be taken against them. Fact that Mr Radha Ravi is still President of the Dubbing Union despite all the allegations https://t.co/gFrQJJuXIa — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 Wth!!! They cant do that to you!! This is ridiculous!! https://t.co/4IW4yLAwUC — Lakshmi Manchu (@LakshmiManchu) November 17, 2018 -
మీటూ ఉద్యమంపై కమల్ ఏమన్నారంటే..
చెన్నై : గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా, సినిమా ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు తమల్ని ఎలా లైంగికంగా వేధించారో చెబుతూ మహిళలు మందుకు వస్తున్నారు. దక్షిణాది సింగర్గా ఎక్కువగా ఫేమస్ అయినన చిన్మయి శ్రీపాద, ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. స్విట్జర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనని హోటల్ గదికి వచ్చి కోపరేట్ చేయమన్నాడని, ఆయన తన స్నేహితురాలిని సైతం వేదించాడని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్మయి వెలుగులోకి తీసుకొచ్చిన వైరాముత్తు చీకటి కోణంపై చాలా మంది కోల్వుడ్ స్టార్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తాజాగా మీడియా సమావేశంలో, కమల్ హాసన్ కూడా చిన్మయి-వైరాముత్తు వివాదం, మీటూ ఉద్యమంపై స్పందించారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిజాయితీగా, న్యాయంగా చెప్పాలని కమల్ అన్నారు. మహిళలు నిజాయితీగా జరిగిన ఇబ్బందులు చెబితే, అర్థవంతమైన న్యాయం దొరుకుతుందని చెప్పారు. మీటూపై దానికి సంబందించిన బాధితులు మాత్రమే అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉందని, ఇందులో సంబంధం లేని వ్యక్తులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేయటం వల్ల ఇది వివాదానికి దారి తీస్తుందని అన్నారు. మీటూ ఉద్యమాన్ని తాను స్వాగతిస్తున్నానని, దీనిని స్వాగతించే మార్పుగా చూస్తున్నానని పేర్కొన్నారు. కాగా, నటుడు నానా పటేకర్పై నటి తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేయడంతో భారత్లో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత మహిళా జర్నలిస్ట్లు పని ప్రదేశాల్లో, తమ ఉన్నతస్థాయి అధికారులతో ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలను ట్విటర్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. గాయని చిన్మయి సైతం తనపై వేధింపులకు పాల్పడ్డ వారి పేర్లను ట్విటర్ ద్వారా బహిర్గతం చేస్తూ బాంబు పేల్చారు. -
#మీటూ: చివరికి ఆపరేషన్ థియేటర్లో కూడా
బాధితుల ఆక్రోశంతో పెల్లుబుకిన మీటూ ఉద్యమంపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంప పెట్టులాంటి సంఘటన ఇది. వైద్యుడు దేవుడితో సమానమని నమ్ముతాం. అలాంటిది నిస్సహాయ స్థితిలో ఉన్నమహిళను ఒక లైంగిక వస్తువుగా పరిగణించిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరికమైన, ఘోరమైన ఘటనలను అసలు ఊహించలేం. కానీ బాధితురాలి ఆత్మక్షోభ సాక్షిగా, ఆసుపత్రి థియేటర్ సాక్షిగా చెప్పిన సంగతులు గుండెల్ని మండిస్తాయి. దీంతో మహిళలకు ఇక ఎక్కడ రక్షణ? వెలుగు చూడని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో? అనే ప్రశ్నలు ఉదయింకచమానవు మీటూ ఉద్యమానికి ప్రధాన సారధిగా నిలిచిన గాయని చిన్మయి శ్రీపాదకు ట్వీటర్ ద్వారా బాధితురాలి గోడు సారాంశం ఇది.. ఆపరేషన్ అనంతరం థియేటర్లోని బెడ్పై ఎనస్తీషియా ప్రభావంతో అపస్మారకంగా పడి వున్న ఆమెపై థియేటర్లోని జూనియర్ డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు. చుట్టూ చేరి వెకిలిగా నవ్వుకుంటుండగా .. ఆమెకు కొద్దిగా మెలకువ వచ్చింది...అయితే బలహీనత కారణంగా ఏమీ చేయలేకపోయినా.. ఆ భయంకరమైన అనుభవం తనను వెన్నాడుతోందని ఆమె ట్వీట్ చేశారు. అయితే హెల్యూషనేషన్( భ్రాంతి) అంటూ ఈ ఆరోపణలను కొట్టిపారేసిన డాక్టర్ను స్పందించాల్సిందిగా (ఇది భ్రాంతి ఏమాత్రం కాదు.. 2012 డిసెంబర్లో తనకెదురైన ఈ చేదు అనుభవంతోపాటు అసిస్టెంట్ డాక్టర్ ముఖం ఇప్పటికీ గుర్తు ఉందన్న బాధితురాలి ట్వీట్ ఆధారంగా) చిన్నయి ట్విటర్లో కోరారు. Sigh. Full patient account that a lot of doctors questioned. I requested the doctor who called this ‘hallucination’ to respond to this in public domain as well. pic.twitter.com/dRraEYvueA — Chinmayi Sripaada (@Chinmayi) October 12, 2018 -
ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను
నాపై కక్ష సాధింపులు జరగవచ్చు అంటోంది గాయనీ చిన్మయి. ఆమె ఇటీవల ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలను గుప్పించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో వైరముత్తు అసలు రూపం ఇదా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆయన సానుభూతిపరులు అవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్రాజన్ కూడా చిన్మయి ఆరోపణలను కొట్టి పారేయలేమని, ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇక చిన్మయి ధైర్యాన్ని పలువురు సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఆమె లైంగిక వేధింపుల రాకెట్ను బట్టబయలు చేయడానికి కారణం ఏమిటీ అన్న విషయాన్ని బుధవారం ఒక ఆంగ్ల టీవీ ఛానల్కు ఇచ్చిన భేటీలో వెల్లడించారు. ఆ వివరాలు.. గీతరచయిత వైరముత్తు నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారు. స్విట్జర్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆ సంఘటనను ఎదుర్కొన్నాను. అదే కార్యక్రమంలో పాల్గొన్న వైరముత్తు అనంతరం నన్ను ఆయన హోటల్ గదికి రమ్మని పిలిచారు. అందుకు నేను నిరాకరించాను. ఆ సమయంలో చాలా భయపడ్డాను కూడా. ఆ సమయంలో వైరముత్తు మరో ఇద్దరు అమ్మాయిలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాలా వేధింపులకు గురైన వారు ఇప్పటికైనా బహిరంగంగా బయట పెడతారనుకుంటున్నాను. వైరముత్తు అధికార బలంతో వారంతా బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. అయితే ఇది సరైన సమయం. బా«ధితులు తమ వేదనను వ్యక్తం చేయాలని కోరారు. వైరముత్తుకు సహకరించాలన్నారు.. చిన్మయి ఆరోపణలకు స్పందించిన వైరముత్తు పేరున్న వారిపై అలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయిందని, నిజాల్ని కాలమే బట్టబయలు చేస్తుందని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి చిన్మయి కౌంటర్ ఇస్తూ వైరముత్తు అబద్ధం చెబుతున్నారన్నారు. చిన్మయితో పాటు టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తల్లి పద్మాసిని కూడా తన కూతురును వైరముత్తు లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఆమె ఏమన్నారో చూద్దాం. ‘వైరముత్తు చిన్మయిని లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం ముందుగా తెలిసింది నాకే. 2004లో ఒక సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం కోసం స్విట్జర్లాడ్కు వెళ్లాం. కార్యక్రమం పూర్తి కాగానే నిర్వాహకులు అందరిని తిరిగి పంపించేస్తున్నారు. మమల్ని మాత్రం అక్కడే ఉండమన్నారు. అక్కడ వైరముత్తు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అమ్మా మీరు ఇక్కడే వేచి ఉండండి. చిన్మయి కోసం వైరముత్తు హోటల్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు ఆమెను రమ్మన్నారు అని చెప్పాడు. హోటల్కు చిన్మయి ఎందుకు ఒంటరిగా వెళ్లాలి. ఏదైనా వృత్తి పరమైన విషయాలు మాట్లాడాలంటే ఊరికు వెళ్లిన తరువాత చూసుకోవచ్చు. ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను. అందుకు అతను వైరముత్తుకు కాస్త సహకరించండి అని బహిరంగంగానే అన్నాడు. అందుకు వేరేవారిని చూసుకోండి అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేశాం. మీటూ సంఘానికి చిన్మయి మద్దతుగా నిలిచారు. ఇది మహా సంఘంగా మారాలి. ఇప్పుడిప్పుడే అందరూ దీని గురించి మాట్లడటం మొదలెట్టారు. పాడైపోతున్న ఈ సమాజానికి అవగాహన కలగాలి’ అని అన్నారు. ప్రచారం కోసం కాదు: చిన్మయి ప్రచారం కోసం నేను ఇదంతా చెప్పడం లేదు. నాకు ఇకపై పాటలు పాడే అవకాశాలు వస్తాయా? అన్నది తెలియదు. రాజకీయ పరమైన ఒత్తిళ్లు రావచ్చు. అయితే ఇలాంటి వాటి గురించి ఎవరో ఒకరు బయట పెట్టాల్సిందే అని చిన్మయి అన్నారు. మహిళలు మారాలి: లక్ష్మీ రామకృష్ణన్ పెరంబూరు: ముందుగా మహళలు మారాలి అని అన్నారు సినీ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్. సినీరంగంలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం విశ్వరూపం దాల్చిన విషయం తెలిసిందే. మీటూ పేరుతో ఒక సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుని అత్యాచార బాధితులందరూ తమకు జరిగిన వేధింపుల గురించి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గీత రచయిత వైరయుత్తుపై గాయనీ చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి ట్విట్టర్లో స్పందించిన నటి లక్ష్మీరామకృష్ణన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో చిత్రపరిశ్రమనే తప్పు పట్టడం సరికాదన్నారు. మార్పు కావాలంటే ఏ విషయంలోనైనా అందుకు మనం కట్టుబడి ఉండాలన్నారు. అడ్జెస్ట్ అయ్యే వారు అందుకు కారణం అయ్యే మహిళలు ముందు మారాలన్నారు. మన ఆత్మగౌరవం, మర్యాద కంటే ఉన్నతమైనద ఏదీ లేదని ఆమె పేర్కొన్నారు. -
‘ఆ విషయం ఇంకా మా ఆయనకు తెలియదు’
వైరముత్తు.. తమిళంలో పేరున్న రచయిత. గొప్ప కవి. అనర్గళంగా మాట్లాడతారు. ఇప్పటివరకూ ఆయన గురించి ఇలాంటి విషయాలే అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు గాయని చిన్మయి ఆయన గురించి బయటపెట్టిన కొన్ని ఆరోపణలను తెలుసుకుని ‘స్వచ్ఛమైన వైరం (తమిళంలో వజ్రాన్ని వైరం అంటారు) అనుకున్నాం.. కాదా?’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ చిన్మయి దగ్గర వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించారా అంటే? కాదు. సంగీతానికి సంబంధించిన విభాగంలో వేరే స్త్రీల పట్ల ఆయన అమానుషంగా ప్రవర్తించారట. ఆ స్త్రీలు వైరముత్తు వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పారు కానీ, తమ పేరు బయటకు చెప్పకుండా చిన్మయి ట్వీటర్కి వ్యక్తిగత మెసేజ్లు పంపారు. ఆ సంఘటనలను చిన్మయి బయటపెట్టారు. ‘వైరముత్తు మా పట్ల ఈ విధంగా నడుచుకున్నాడు’ అంటూ ఆ అమ్మాయిలు పేర్కొన్న విషయాలను చిన్మయి తన ట్వీటర్లో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ‘నేను పాడినా పాడకపోయినా మీ టైమ్ అయిపోయింది’ అని వైరముత్తుని ఉద్దేశించి చిన్మయి ఓ ట్వీట్ పెట్టారు. ఇక చిన్మయికి ఆ అమ్మాయిలు పంపించిన వ్యక్తిగత మెసేజ్లు గురించి తెలుసుకుందాం. # నాకు 18 ఏళ్లు. ఓ ప్రాజెక్ట్ పని మీద వైరముత్తు గారితో కలసి పని చేయాల్సి వచ్చింది. ఆయన గొప్ప కవి, లెజెండ్ అని నాకు విపరీతమైన అభిమానం ఉండేది. ఓసారి పాటలోని లైన్ని వివరిస్తూ సడన్గా వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉండటానికి భయపడేదాన్ని. ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకూ నలుగురితో పాటే ఉండేదాన్ని. # నా వర్క్ని అభినందించడానికి తన ఆఫీస్కి పిలిచారు. ఆయన్ను నా తాతగారిలా భావించాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం అలాంటిది. అయితే ఆయన నా పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు. నేను గదిలోకి వెళ్లగానే తలుపు వేసి నన్ను తాకబోయాడు. నేను అక్కణ్ణుంచి పరిగెత్తుకు వెళ్లిపోయాను. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి, తన భార్యకు చెప్పొద్దు అన్నాడు. # నాకోసం బటర్ మిల్క్ ఆర్డర్ చేశాడు. అది తాగుతున్నప్పుడు నీ పెదాలకేదో అంటుకుంది అంటూ, మెల్లిగా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దుపెట్టుకోబోయాడు. వెంటనే నా ఫోన్ పట్టుకుని పరిగెత్తాను. నా ఫ్రెండ్స్కు, కొందరు సింగర్స్కు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ విషయం ఇంకా మా ఆయనకు తెలియదు. ఒకవేళ ఆయనకు తెలిస్తే నా కెరీర్ను సాగనివ్వరేమో. # నాకు తెలిసిన ఓ సింగర్కి ఎదురైన అనుభవం ఇది. తనని వైరముత్తుకు పరిచయం చేసినప్పుడు మాట్లాడటానికి నిర్మాతను, తనను ఓ హోటల్లో కలవమన్నారు. ఆ తర్వాత నీకు పాడే అవకాశం కావాలంటే ఒక రాత్రి గడపాలన్నారు. వెంటనే తను ఏడుపందుకుంది. తను గోల్డ్ మెడలిస్ట్. ఆ సంఘటనతో సినిమాలో పాడనని ఒట్టు పెట్టుకుంది. # బాధితులు పేర్కొన్న ఈ విషయాలను ట్వీటర్ ద్వారా షేర్ చేసిన చిన్మయి ‘నా ట్వీటర్ ఖాతా హ్యాక్ అవ్వలేదు. నేను ఇక్కడ షేర్ చేసిన ఈ ఆరోపణలన్నింటినీ నమ్ముతాను. వాటి కోసం నిలబడతాను కూడా. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాను’ అని పేర్కొన్నారు. నిజంగానే వైరముత్తు అలా ప్రవర్తించి ఉంటారని కొందరు అంటుంటే, హుందాగా ఉండే వ్యక్తులపై బురద జల్లే ప్రయత్నం అని మరికొందరు అంటున్నారు. నిజమేంటో పెరుమాళ్లకే ఎరుక. -
వెన్నెల కిషోర్ పాటకు.. నవదీప్ రియాక్షన్!
టాలీవుడ్ కమెడియన్స్లో బిజీగా ఉండే వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో మాదిరిగానే సోషల్ మీడియాలో కూడా హాస్యాన్ని పండిస్తాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పాడిన పాట, మొదలు పెట్టిన సీజన్ 1 ట్విట్టర్లో వైరల్ అవుతోంది. తిన్నది అరక్క.. అనే కాన్సెప్ట్తో చచ్చారు పో అంటూ మొదలు పెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ను సింగర్ చిన్నయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీనికి నవదీప్ వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పాడిన పాటపై బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. కాకా.. పాట పాడొచ్చు కదా.. లిరిక్స్ చదివావ్ అని అంటే.. నీ దృష్టిని నావైపు మళ్లించడానికే అంటూ రిప్లై ఇచ్చాడు.. వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. నేను సరే అన్నా.. పాపం చిన్నయి ఎలా ఉందో ఒక సారి కనుక్కో అనగానే.. అవునన్నో.. అటునుంచి (చిన్మయి) రెస్పాన్సే లేదంటూ జవాబిచ్చాడు. మళ్లీ వెంటనే చిన్మయి స్పందిస్తూ.. ఇప్పుడే స్పృహ వచ్చిందంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఈ వీడియో కామెంట్లతో వైరల్గా మారుతోంది. pic.twitter.com/SrZk7DuoMp — Navdeep (@pnavdeep26) 27 September 2018 -
ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు పంచ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సైట్ ప్రకటించిన ఓ సేల్ కు సంబంధించి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై రాహుల్ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఐశ్వర్యారాయ్ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి స్నాప్ డీల్, ఆ వీడియోకు 'మీరు ఎంత షాపింగ్ చేశారో మీ భర్తకు తెలిసే లోపే డోర్ దగ్గరకు పరిగెత్తండి' అనే కామెంట్ ను జోడించింది. ఈ ట్వీట్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్ 'గత ఏడాది నా సంపాదన కన్నా.. నా భార్య సంపాదనే ఎక్కువ.. తన ఆన్ లైన్ షాపింగ్ తన సంపాదన తోనే చేస్తోంది. కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన ఆయన భార్య ఇలాంటి భర్తనే ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కామెంట్ చేసిన తరువాత స్నాప్ డీల్ తన ట్వీట్ ను తొలగించింది. 👇🏼👇🏼 This is the kinda man one should be with, ladies. I hope you (and your parents) choose well. Happy Independence Day. — Chinmayi Sripaada (@Chinmayi) 15 August 2017 -
ఆన్ లైన్ పిటిషన్ వైరల్, 15 వేల మంది సంతకాలు!
మహిళలపై అత్యాచారాలకు పాల్పడతామని, యాసిడ్ దాడులు చేస్తామని సోషల్ మీడియాలో బెదిరించిన వారి ట్విటర్ ఖాతాలు తొలగించాలని ప్రముఖ గాయని శ్రీపాద చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ ఫైల్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న వారి ట్విటర్ ఖాతాలు మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. 'ఇలాంటి బెదిరింపులు నన్ను భయాందోళనకు గురిచేశాయి. నా జీవితం గురించి ఎంతో భయం కలుగుతోంద'ని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. వీరిని 10 రోజుల పాటు జైలులో ఉంచారు. తనలా బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్న సామాన్య మహిళలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్న చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పెట్టారు. మహిళలను బెదిరిస్తున్న వారి ఖాతాలు మూసివేయాలని ట్విటర్ ను కోరారు. 'మహిళలపై దాడులను ప్రోత్సహించేవిధంగా ట్విటర్ ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న ఖాతాలను తొలగిస్తున్నట్టుగానే మహిళలను వేధిస్తున్న వారి అకౌంట్లను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. వైరల్ గా మారిన చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పై 15,364 మంది సంతకాలు చేశారు. ఇంకా 9,636 మంది సంతకాలు చేస్తే ఆమె లక్ష్యం నెరవేరుతుంది.