cigarettes
-
సిగరెట్ అమ్మినా సీరియస్ యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) అధికారులు కేవలం మాదకద్రవ్యాల క్రయవిక్రయాల పైనే కాదు...సిగరెట్ల అమ్మకంలో జరుగుతున్న చట్టం ఉల్లంఘనలపైనా దృష్టి పెడుతున్నారు. నగర వ్యాప్తంగా పలువురు వ్యాపారులు మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్నారంటూ వచి్చన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. ఇవి శుక్రవారం పశి్చమ మండలంలోని ఇద్దరు వ్యాపారులను పట్టుకుని, వారిపై స్థానిక ఠాణాల్లో కేసు నమోదు చేయించాయి. మాదక ద్రవ్యాలకు ముందు సిగరెట్... టీజీఏఎన్బీ అధికారులు గడిచిన కొన్నేళ్లుగా నగరంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల దందాను అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలలతో పాటు ఇతర విద్యా సంస్థలపై పటిష్ట నిఘా ఉంచారు. వాటిలో, సమీపంలో, సంబంధించిన టీజీఏఎన్బీకి చిక్కిన వారిలో గంజాయి తాగుతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అతి తక్కువ మంది ఇతర మాదకద్రవ్యాలను బానిసలుగా మారారు. ఆయా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్న టీజీఏఎన్బీ అధికారులు వాళ్లు ఈ వ్యసనానికి బానిసకావడానికి కారణాలను అన్వేíÙస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక విషయం అధికారులకు తెలిసింది. ఇతర మాదకద్రవ్యాలు వినియోగానికి ముందు వారంతా గంజాయి సేవించేవారని బయటపడింది. దీనికి ముందు సిగరెట్ కాల్చడంతో ఈ ఊబిలోకి దిగినట్లు పలువురు బయటపెట్టారు. చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు, కుటుంబీకుల పర్యవేక్షణ లేకపోవడం, మెచ్యూరిటీ తక్కువగా ఉండటంతో పాటు వివిధ కారణాల నేపథ్యంలో మైనర్లు వ్యసనాలకు తేలిగ్గా ఆకర్షితులై, బానిసలుగా మారుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జువైనల్ జస్టిస్ యాక్ట్ (జేజేఏ), సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్టŠస్ యాక్ట్ (కాటా్ప) ప్రకారం మైనర్లకు మద్యం, సిగరెట్లు, మాదకద్రవాలు తదితరాల విక్రయంపై నిషేధం ఉంది. అయితే మద్యం విక్రయాల విషయంలో నిబంధనలు కొంతవరకు అమలు అవుతున్నాయి. సిగరెట్ల విక్రయించకూడదనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. పోలీసులు సైతం అప్పుడప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు తప్ప మైనర్లకు విక్రయం విషయం పట్టించుకోవట్లేదు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. ఈ నేపథ్యంలోనే టీజీఏఎన్బీకి ఇటీవల కాలంలో మైనర్లకు సిగరెట్ల విక్రయంపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని సీరియస్గా తీసుకున్న డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరు తమ సెల్ఫోన్లతో పాటు రహస్య కెమెరాలను వినియోగించి నిఘా ఉంచుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తరహా సిగరెట్ల విక్రయాలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఆ వ్యాపారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఆ అధికారులే స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తూ వీడియోలు అందిచడం ద్వారా వ్యాపారులపై జేజేఏ, కాటా్పల్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేయించారు. ఈ డ్రైవ్ కొనసాగించాలని సందీప్ శాండిల్య నిర్ణయించారు. -
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని గణనీయంగా పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుత పన్నులు ఇలా..ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు విధిస్తున్నారు. దాంతో మొత్తం పన్ను భారం 53 శాతంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 75% పన్ను విధానం కంటే తక్కువగానే ఉంది. ఈ ఉత్పత్తులపై 5 శాతం జోడించే పరిహార సెస్ను నిలిపివేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో మరింత భారీగా పన్నులు విధించాలని చూస్తున్నారు.ప్రతిపాదిత మార్పులుపొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. పరిహార సెస్ నిలిపేసిన తర్వాత ఈ ఉత్పత్తుల నుంచి పన్ను ఆదాయం తగ్గకుండా ఇది తోడ్పడుతుంది. 2026 అనంతరం పరిహార సెస్ పరిస్థితులను సమీక్షించడానికి, ప్రత్యామ్నాయ పన్ను పద్ధతులను అన్వేషించడానికి కౌన్సిల్ ఇప్పటికే మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ బృందం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.ప్రజారోగ్యం, ఆర్థిక ప్రభావంపొగాకు ఉత్పత్తులను ‘హానికారక వస్తువులు’గా పరిగణిస్తున్నారు. వీటిపై అధిక పన్నులు విధిస్తే వినియోగం తగ్గుతుందనేది ప్రభుత్వం భావన. కాగా, పొగాకు, పొగాకు ఉత్పత్తుల ద్వారా 2022-23లో ప్రభుత్వానికి రూ.72,788 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నులు మరింత పెంచితే ఆదాయం కూడా అధికమవుతుంది. ప్రతిపాదిత పన్ను పెంపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’సవాళ్లు ఇవే..ప్రభుత్వం పన్నులను పెంచడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పొగాకు పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికుల స్థితిగతులు, వారి ఉపాధి ప్రభావితం చెందుతుందనే ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త సెస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సంకోచిస్తున్నాయి. జీఎస్టీను పరిగణించి పోగాకు ధరలు పెంచాలంటే సెస్ల విధింపే కీలకం కానుంది. దాంతో ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
డియర్.. నిప్పులేకుండానే కాలుద్ది జాగర్త!
ఖగపతి యమృతము తేగాభుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగ చెట్టై జన్మించెనుపొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్అని గిరీశం దొరవారు ఎన్నడో సెలవిచ్చారు. ఇప్పుడు పొగపురాణాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చేలా ఉన్నది. కమలపతి వడ్డన సేయగపొగచుట్టకు పన్ను పోటు బాగా ముదిరెన్రెక్కలతో ధరలు ఎగరగఅగ్గిపుల్ల లేకున్నా జేబులు కాలున్..అని కొత్తగా తోచిన పజ్జేలు రాసుకుని వాటిని పారాయణం చేసుకుంటూ గడపవలెను. దమ్ము కొట్టాలనిపించినప్పుడెల్లా.. నరాలు పట్టు తప్పి, జిహ్వ లాగి, భయం పుట్టి, వణుకుతో శరీరం కంపించి.. ఇక ఆ ఆలోచననే ధూమపాన ప్రియులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నది మరి! ఢిల్లీ పాలకులు సిగరెట్టుల మీద పన్ను పోటును ఏకంగా 35 శాతానికి పెంచేయాలని తలపోస్తున్న తరుణంలో.. సిగరెట్టును తలచుకుంటే చాలు.. పర్సు కాలి చురుక్కు మంటుందని అనుకోవాల్సిందే.సిగరెట్టు అనగా ఏమిటి? మన లోలోపల గూడుకట్టుకుని ఉండే క్రియేటివిటీ అనే పదార్థాన్ని కరిగించి గంగాప్రవాహంలా వెలుపలికి లాక్కుని వచ్చే ధూమపరికరము కదా.. అని భాష్యం చెప్పగల మహానుభావులు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ‘భలే భలే ఓ సిగరెట్టు.. చేస్తావే బహు కనికట్టు.. చైతన్యానికి తొలిమెట్టు.. బద్ధకముంటే పని పట్టు..’ అంటూ సిగరెట్టు దమ్ము లాగి వదిలితే తప్ప తమలో జీవనోత్సాహం ఇనుమడించదని, దేహశకటం పరుగులెత్తదని నమ్మే ప్రబుద్ధ జీవులు కూడా కొందరుంటారు. పుర్రె బొమ్మ ఉన్నంత మాత్రాన చాపల్యం చావదని, చావు డప్పు మోగుతుందని తెలిసినా ధూమప్రేమ విలోమం కాదని నిరూపించే నిత్య సత్యమే సిగరెట్టు!ఉదయముననే మేల్కాంచి తమ స్నానాలగదిలోకి దూరి తమ చుట్టూ ధూపం వేస్తే తప్ప కాలకృత్యపర్వం కూడా ముగించలేని నిత్య అంకితులు కొందరుంటారు. తమ మునివేళ్ల చివరల్లోమండే అందాల్ని తమకు దూరం చేయాలనే కుట్ర ఏదో అధికారాత్మకంగా జరుగుతున్నదని అనుమానించే సత్యశంకితులు కొందరు ఉంటారు! ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సిగరెట్టు అనే పదార్థము తాజా పరిణామముల నేపథ్యములో.. నిప్పు లేకున్ననూ మండును.. మీ బతుకును పొగించడం మాత్రమే కాదు.. తెగించి ముట్టిస్తే నోటిచివర మండుట మాత్రమే కాదు సుమీ.. జేబులోని సొమ్ములను కూడా దహించి మసిచేయును.. అనే భావన ఇప్పుడు దేశ ప్రజలలో వేళ్లూనుకొనుచున్నది!సిగరెట్టు మీది అపరిమితమైన ప్రేమతో, అది అమూల్యమైన వస్తువని గుర్తించి.. దాని విలువను ఆకసమునందలి నక్షత్రాల సరసన ఉంచినప్పుడే దానికి సద్గతి కలుగునని ఏలికలు గ్రహించడమే ఒక చిత్రమైన సంగతి. అందుకే జీఎస్టీ అను జోడింపులో కాస్త పెంపు జత చేసి 35 శాతం వడ్డించడం తగు విధాయకం అని నిర్ణయించడం తాజా తాజా సంగతి! ఇటువంటి పరిస్థితుల్లో సిగరెట్టు అను పరికరముతో దమ్ము కొట్టాలన్నా.. దాని వెంబడి శీతల పానీయములు అనబడు ద్రావకములు గుటక వేయాలన్నా.. బహు కష్టము అని ప్రజలు తెలుసుకోవడం ఒక్కటే ఇంకా పెండింగులో ఉన్నది.ఇటువంటి వికట పరిస్థితులలో.. ధూమ ప్రేమికులకు గత్యంతరమేది? అను సందేహము జనులలో జనియించుట సహజము! పరిష్కారము బహు సులభము. ఓ తెల్లటి కాగితము మీద.. సిగరెట్టును చిత్రించి.. ఓ చివరన పెదవుల బంధమును, మరో చివరన పొగ కెరటములను చిత్రించి.. జిహ్వ లాగినప్పుడెల్లా దానిని చూచుకొనుచూ యుండవలెను. అటుల జేసిన యెడల.. జూచుచూ గడిపిన యెడల.. ధూమపానాసక్తులకు అనుభవైకవేద్యమైన పురాఅనుభవము.. పునః అనుభవములోకి వచ్చి ఆత్మానందము కలుగును. మరియొక మార్గము దుర్లభము. స్వస్తి. ..ఎం. రాజేశ్వరి -
సిగరెట్ తాగడం మానేస్తున్నా.. కానీ ఇప్పటికీ..: షారూఖ్
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సిగరెట్కు బానిస.. రోజుకు ఒకటీరెండు ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు సిగరెట్లు కాల్చేవాడు. ఇలా అస్తమానూ సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? అని అటు కుటుంబం, ఇటు అభిమానులు ఎంతో కంగారుపడేవాళ్లు. ఈ వ్యసనానికి దూరం కావాలని షారూఖ్ ఎన్నోసార్లు అనుకున్నాడు. చివరాఖరకు ఆ వ్యసనంపై విజయం సాధించానంటున్నాడు. నవంబర్ 2న బర్త్డే జరుపుకున్న ఇతడు అభిమానులను కలుసుకునేందుకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు.గుడ్ న్యూస్ఈ కార్యక్రమంలో షారూఖ్ మాట్లాడుతూ.. 'మీకో మంచి విషయం చెప్పబోతున్నాను. నేను సిగరెట్లు తాగడం ఆపేశాను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాససమస్యలు తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను' అన్నాడు. షారూఖ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు.తిండి కూడా మానేసి..కాగా 2011లో ఓ ఇంటర్వ్యూలో షారూఖ్.. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని బయటపెట్టాడు. తిండి, నీళ్లు అన్నీ మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడినన్నాడు. 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగి సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేశానన్నాడు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి. ఇకపోతే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్గా కనిపించనున్నాడు. “I am not smoking anymore guys.” - SRK at the #SRKDay event ❤️❤️ #HappyBirthdaySRK #SRK59 #King #ShahRukhKhan pic.twitter.com/b388Fbkyc4— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 3, 2024 చదవండి: హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ -
సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్ వేపింగ్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్? సిగరెట్స్ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్కి అడిక్ట్ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్..?వేపింగ్ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్ ఎడిక్షన్కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా?
ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!. ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే.. ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం. అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు. వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది. ఎందుకు హానికరం అంటే.. తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. అలాగే రిలేషన్స్లో క్యాలిటీ ముఖ్యం వందల సంఖ్యలో రిలేషన్స్ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. (చదవండి: కోవిడ్కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్.. క్షీణించిన ఆరోగ్యం
-
బడ్జెట్ 23: పొగరాయుళ్లకు ఝలక్, భారీగా పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. -
రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా తరలిస్తోన్న రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను విజయవాడ కస్టమ్స్ అధికారులు పల్నాడు జిల్లాలో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల పారిస్ బ్రాండ్ సిగరెట్లను మయన్మార్ నుంచి భారత్లోకి అక్రమంగా తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్లోని ముజఫరాబాద్లో ఓ లారీలో వీటిని లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు నరసరావుపేట శివార్లలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లను గోధుమ పిండి బ్యాగుల్లో ప్యాక్ చేసి టార్పాలిన్లు కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించి లేకపోవడంతో అధికారులు లారీని జప్తు చేసి కేసు నమోదు చేశారు. కాగా, గత 6 నెలల్లో విజయవాడ కస్టమ్స్ అధికారులు.. తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు. ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! -
వింత స్టంట్: 50 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్ చేస్తూ మారథాన్
మారథాన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నిబద్ధత అవసరం. ఆరోగ్య స్పృహతో ఉన్న క్రీడాకారులు మాత్రమే ఇలాంటివి చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడొక మనిషి అందుకు విరుద్ధం. పొగ తాగుతూ... మారథాన్ చేసి అందర్నీ ఆకర్షించాడు. వివరాల్లోకెళ్తూ.....చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి మారథాన్ పోటీల్లో స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు. అలా చేయడంతో అతని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాడు. వాస్తవానికి ధూమపానం చేస్తే గుండె, ఊపితిత్తులు, కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందడంతో పరుగు పెట్టడం కష్టమవుతుంది. కానీ ఈ 50 ఏళ్ల చెన్ మాత్రం చైనాలోని జియాండేలో జరిగిన 42 కి.మీ మారథాన్ని ధూమపానం చేస్తూ పూర్తి చేశాడు. పైగా ఈ మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతేగాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్గా నిలిచాడు. చెన్ ఇలాంటి వింత స్టంట్లు చేయడం ఇది తొలిసారి కాదు. 2018 గ్వాంగ్జౌ మారథాన్, 2019 జియామెన్ మారథాన్లో ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు. దీంతో అతని ఫోటోలు చైనా సోషల్ మాధ్యమం విబోలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మేరకు నెటిజన్లు పొగ తాగకపోతే ఇంకా మెరుగైనా ప్రతిభ కనబర్చేవాడని ఒకరు, అక్షరాల అతని ఊపిరిత్తితులు బాగా పనిస్తున్నాయి అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రస్తుతం మారథాన్ పోటీల్లో ధూమపానం చేయకూడదనే నిబంధనలు లేవు. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్! ఎలాగో తెలుసా?..) -
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. బెహరాన్ నుంచి జీఎఫ్274 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా సిగరెట్లు పట్టివేత
-
సీఐ సహా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్
తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో హైదరాబాద్కు చెందిన బిజి.నిశాంత్కు చెందిన వంద అంకణాల రెండు అంతస్తుల భవనం ఉంది. దీన్ని చెన్నైకి చెందిన ముత్తుకుమార్ లీజుకు తీసుకుని అందులో ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్లు, బిస్కెట్లు, ఇతర సామగ్రిని ఉంచి వ్యాపారం చేసుకునేవారు. అయితే ముత్తుకుమార్ ఈ భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో మణికంఠను ఆశ్రయించి ఆ భవనాన్ని విక్రయించాలని నిశాంత్ కోరారు. మణికంఠ ప్రైవేట్ కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. శ్రీనివాసపురంలో అదే భవనానికి ఎదురుగా ఉంటున్న డాక్టర్ రహమాన్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో భవనాన్ని విక్రయించాడు. ఖాళీ చేయించి.. సిగరెట్లు అమ్ముకుని.. రిజిస్ట్రేషన్ అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తుకుమార్ను కోరగా అతను నిరాకరించడమే కాకుండా భవనం తనదేనని పత్రాలు కూడా ఉన్నాయని అడ్డం తిరిగాడు. దీంతో మణికంఠ తిరుపతికి చెందిన ఇర్ఫాన్, శ్రీనివాస్, మరికొంతమందితో కలసి ఏప్రిల్ 9న దౌర్జన్యంగా భవనాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉండడాన్ని గమనించారు. తిరుచానూరులో పనిచేస్తున్న ఎస్ఐ వీరేష్తో కలసి సిగరెట్ ప్యాకెట్లు విక్రయించి మణికంఠ సొమ్ము చేసుకున్నాడు. ఈ నగదును సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్ పంచుకున్నారు. దీనిపై ఐటీసీ కంపెనీ మేనేజర్ అజయ్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేయించారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు కూడా లాలూచీ పడినట్లు విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం అనంతపురం డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కేజీఎఫ్–2 చూసి.. రాఖీభాయ్లా సిగరెట్లు కాల్చి..
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్2 కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రంతో యశ్ గ్రాఫ్ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి యశ్ హీరోయిజమే మెయిన్ అట్రాక్షన్.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు. యష్ నటించిన కేజీఎఫ్–2 సినిమాలోని ‘రాఖీభాయ్’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్ స్టైల్ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్ ప్యాకెట్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్లో అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు. -
పొగరాయుళ్లకు నకిలీ సెగ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సిగరెట్లు హల్చల్ చేస్తున్నాయి. కోల్కతా లైన్ కేంద్రంగా ఢిల్లీ, బిహార్, రాయ్పూర్ నుంచి ఖరీదైన సిగరెట్ స్థానంలో నకిలీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో బండిల్స్ కొద్దీ దొరికిన ఫేక్ సిగరెట్ బండిల్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ) ద్వారా మాత్రమే నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్ని తయారు చేస్తుంటాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో దర్శనమిచ్చేవి. కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ సిగరెట్ తయారీ ఇలా? బ్రాండెడ్ కంపెనీలు వాడే పొగాకులో నాసిరకం పొగాకుని అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. పొగాకుతో పాటు రంపపు పొట్టుని కూడా కలిపేసి చవగ్గా సిగరెట్స్ తయారు చేసేసి.. వాటిని మార్కెట్లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఆ ప్యాకెట్స్పై ఎక్కడ తయారవుతున్నాయి.? వాటి కంపెనీ ఏమిటి.? అనే వివరాలు మాత్రం కనిపించవు. కొందరు తెలివిగా.. బ్రాండెడ్ ప్యాకెట్స్పై ఉన్న టోల్ఫ్రీ నంబర్లనే ముద్రించేస్తున్నారు. ఎలా వచ్చేస్తున్నాయ్..? గతంలో బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ సిగరెట్లు వచ్చేవి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని తయారు చేసేస్తున్నారు. ఢిల్లీ, బిహార్, సూరత్, రాయ్పూర్, చంఢీగఢ్, కోల్కతా వంటి నగరాల్లో అసలు బ్రాండ్లను పోలిన సిగరెట్లు తయారవుతున్నాయి. వీటిని కోల్కతా కేంద్రంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం రైలు మార్గంలోనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విశాఖ డివిజన్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు రూ. లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. వాటిని ఎవరు ఆర్డర్ చేశారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. నకిలీ పొగ.. ప్రాణాంతకం సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. ఈ వ్యాధులు వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గొలుసు తెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఇటీవల రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ సిగరెట్ డంప్ని స్వాధీనం చేసుకున్నాం. వీటిని తీసుకొచ్చిన వ్యాపారి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. నకిలీ సిగరెట్ల వ్యాపారంపై గట్టి నిఘా ఉంచుతున్నాం. ప్రతి రైలు నుంచి వచ్చే పార్సిళ్లను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీనివాసరావు, రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ -
ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్లో పట్టుబడిన నకిలీ సిగరెట్ బండిల్స్ ఎవరివో తేల్చేపనిలో రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు తలమునకలయ్యారు. వీటిని కోల్కతా కేంద్రంగా తయారు చేస్తూ ఛత్తీస్గఢ్, బిహార్ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. ఓ పాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విశాఖకు భారీగా నకిలీ సిగరెట్ బండిల్స్ చేరుకుంటున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్లోని 8వ నంబర్ ప్లాట్ఫాంపై డివిజన్ అధికారులు మాటు వేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సంబంధిత సరుకు యజమానులు అక్కడినుంచి జారుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలవుతున్నా ఎవరూ సరుకు కోసం రాకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్ట్ పేరుతో సాధారణ సామగ్రిగా బుక్ చేసిన 56 భారీ బండిల్స్ను జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. సిగరెట్ బాక్సులపై తయారీ యూనిట్ల చిరునామా లేనట్లు గుర్తించారు. ప్రముఖ ఐటీసీ బ్రాండ్లని పోలినట్లుగానే గోల్డ్ విమల్, పారిస్, గుడ్టైమ్స్, టఫ్.. ఇలా విభిన్న రకాల సిగరెట్లున్నాయనీ.. వాటి ధర ఎంతనేది ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్యాకింగ్లపై టోల్ఫ్రీ నంబర్లు ముద్రించారని, అవి ప్రముఖ బ్రాండ్లపై ఉన్న టోల్ఫ్రీ నంబర్లేనని.. అదేవిధంగా మిగిలిన ప్యాక్లపై ఉన్న ఫోన్ నంబర్లు ఏవీ పనిచెయ్యడం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకింగ్లపై ఉన్న జీఎస్టీ ఐడీ, బార్ కోడ్లు కూడా నకిలీవేనన్నారు. నకిలీ సిగరెట్లను ముఖ్యంగా కోల్కతా ప్రధాన కేంద్రంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఒడిశా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్, బిహార్, ఢిల్లీలోనూ వీటి తయారీ శాఖలున్నట్లు తెలిసిందని వివరించారు. అయితే ఈ సరుకు మొత్తం ఏ వ్యాపారికి సంబంధించినది, ఒక్కరిదేనా? వేర్వేరు వ్యాపారులున్నారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విశాఖ డివిజన్ జీఎస్టీ అధికారులు వెల్లడించారు. -
దారుణం: సిగరెట్లతో కాల్చి. బాత్టబ్లో పడేసి
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బుడ్డోడు ప్యాంటు తడుపుకుంటున్నాడని అతడిని చిత్రహింసలు పెట్టి చంపిందో అత్త. పూర్తి వివరాల్లోకి వెళితే.. జేమీ లైన్ జాక్సన్కు పన్నెండేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మేనల్లుడు మిచెల్ స్టోవర్ వీరితో కలిసి ఆడుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ టాయ్లెట్ పోయడంతో ఆమె కోపం నషాళానికంటింది. బుడ్డోడని చూడకుండా అతన్ని గదిలోకి తీసుకు వెళ్లి చిత్ర హింసలు పెట్టింది. అతడి శరీరాన్ని సిగరెట్లతో కాల్చింది. మెడకు ప్లాస్టర్ను బిగుతుగా చుట్టి కిరాతకంగా ప్రవర్తించింది. తర్వాత అతడిని బట్టలో చుట్టి బాత్టబ్లో పడేసింది. అందులో నుంచి బయటకు రాలేక అతడు గిలగిలా కొట్టుకుంటున్నా ఆమె మనసు చలించలేదు. 24 గంటల నుంచి 48 గంటల వరకు అతడి బాత్టబ్లోనే వదిలేసింది. () సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతడి చావుకు కారణమైన జాక్సన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా హత్యానేరంతో పాటు, మరణాన్ని దాచడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, చిత్రహింసలు పెట్టడం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. స్టోవర్ శవపరీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడి తల, కళ్లు, మెడ, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెదడులో రక్తస్రావం జరిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్పై సిగరెట్తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. (తల్లిని, భార్యను హతమార్చిన మాజీ అథ్లెట్) -
'పొగ'కు చెక్ పెడదాం
సాక్షి, అమరావతి: స్కూళ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు.. సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటి వాసన ఉండకూడదు. పొగ పొడ సూపకూడదు. స్కూలు, దాని పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. చిన్నతనం నుంచే పొగ అంటే చిన్నారులకు తెలియకూడదు. దాని ప్రభావానికి అసలే లోనుకాకూడదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్మోక్ ఫ్రీ జోన్స్గా స్కూళ్లను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం దీనిపై మార్గదర్శకాలు రూపొందించగా.. వాటిని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను స్మోక్ ఫ్రీ జోన్లుగా అమలు చేస్తోంది. ఈ కేటగిరీల్లో పక్కాగా నిబంధనలు ► పొగ తాగే వారే కాదు.. అసలు పొగ ఆనవాళ్లు స్కూలు చుట్టూ కనిపించకూడదు. స్కూలులో పనిచేసే టీచర్లే కాకుండా స్కూలు డ్రైవర్లు పొగ తాగినా నేరమే. ► ప్రతి స్కూలులో ముఖ ద్వారం వద్ద, లోపల గోడలపైన ‘టొబాకో లేని స్కూలు’ అని బోర్డులు తగిలించాలి. స్కూలు కాంపౌండ్కు 100 గజాల పరిధిలో బీడీలు, సిగరెట్లు, గుట్కా దుకాణాలు కనిపించకూడదు. ► పొగతో కలిగే హాని ఎలాంటిదో తెలిపే స్టిక్కర్లు స్కూలు గోడలపై కనిపించాలి. స్కూలు ఆవరణలో ఎవరైనా పొగ తాగితే వారిపై చర్యలు తీసుకునే అధికారి, హోదా, ఫోన్ నంబరు గోడపై రాసి ఉండాలి. ► 6 మాసాలకోసారి టొబాకో నిర్మూలనపై విద్యార్థులతో టీచర్లు చర్చించాలి. ఎవరైనా పొగ తాగితే వారిపై తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకూ తెలియజేయాలి. రోజుకు 3,500 మంది మృతి ► దేశంలో పొగాకు వాడకం కారణంగా రోజూ 3,500 మంది మృతి చెందుతున్నారు. దేశంలో 9.95 కోట్ల మంది ఏదో ఒక రూపేణా పొగాకు ఉపయోగిస్తున్నారు. 19.94 కోట్ల మంది పొగలేని పొగాకు వాడుతున్నారు. ► ఒక్కొక్కరు సగటున సిగరెట్కు నెలకు రూ.1,192, బీడీలపై రూ.284 వ్యయం చేస్తున్నారు. ఏటా 13 లక్షల మంది పొగాకు కారక క్యాన్సర్లతో మృతి చెందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడించింది. -
ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది. సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది. -
‘ఖైదీ’ సినిమా తరహా చోరీ
సాక్షి, గుడ్లూరు: జాతీయ రహదారిపై సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను దుండగులు హైజాక్ చేశారు. కంటైనర్కు వాహనాలు అడ్డు పెట్టి వాటిల్లో ఉన్న దుండగలు కంటైనర్ డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చెడ్లలో పడేసి కంటైనర్తో వెళ్లిపోయారు. సినీ పక్కీలో సంచలనం రేపిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు–శాంతినగర్ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడకు సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ శాంతినగర్–తెట్టు గ్రామాల మధ్యలోకి వచ్చే సరికి కారులో వచ్చిన దొంగలు కంటైనర్కు తమ కారును అడ్డు పెట్టారు. డ్రైవర్ రవి కంటైనర్ను ఆపేశాడు. కంటైనర్లోకి ఎక్కిన దుండగులు డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచి బట్టలు విప్పదీసి కాళ్లు, చేతులు గుడ్డ పేలికలతో కట్టేసి కళ్లకు గంతలు చుట్టారు. అనంతరం అతడిని రహదారి పక్కన ఉన్న చెట్లల్లో పడేసి కంటైనర్ను అపహరించుకెళ్లారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ పెద్దగా కేకలు వేస్తుండటంతో శాంతినగర్ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి చెట్ల కింద పడి ఉన్న డ్రైవర్ రవిని చూసి హైవే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే సిబ్బంది డ్రైవర్కు కట్టిన కట్లు విప్పదీసి 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్వంలో గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ఎస్ఐలు కంటైనర్ చోరీకి గురైన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. చికిత్స పొందిన అనంతరం డ్రైవర్ను తెట్టు తీసుకొచ్చి విచారించారు. తెట్టు జంక్షన్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం కంప్యూటర్లో పరిశీలించారు. కంటైనర్ సింగరాయకొండ వద్ద ఉన్న ఫెరల్ డిస్టిలరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉందని సమాచారం రావడంతో విచారణ కోసం అక్కడికి వెళ్లారు. కంటైనర్ను హైజాక్ చేయడంలో సుమారు 20 మంది దుండగులు పాల్గొని ఉంటారని సమాచారం. బీహార్ గ్యాంగ్ పనేనా? బీహార్ రాష్ట్రానికి చెందిన పారంగి ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన విధానం ఆధారంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వీరు క్రూరులని, చోరీ సమయంలో డ్రైవర్ను కచ్చితంగా చంపుతారని, ఇక్కడ ఉన్న నిందితుల్లో డ్రైవర్ను ఒకరు చంపుదామంటే మరొకరు చంపొద్దని వారించారని, చివరకు డ్రైవర్ను కట్టేసి కళ్లకు గంతలు చుట్టి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసుకు పారంగి ముఠాతో సంబంధం ఉందా..లేదా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహా చోరీ కంటైనర్ చోరీ తీరు ఇటీవల తమిళ నటుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహాలో ఉందని పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చోరీకి గురైన కంటైనర్ను మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. అందులోని సిగరెట్ బాక్స్లను మాత్రం ప్రస్తుతానికి గుర్తించలేకపోయారు. ఐటీసీ కంపెనీకి చెందిన సిగిరెట్ల కంటైనర్ బెంగళూరు నుంచి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటలకు విజయవాడలోని గూడవల్లి గోల్డెన్ రాయల్ వేర్ హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు బయల్దేరింది. కంటైనర్ తెట్టు సమీపంలోని శాంతినగర్ వద్దకు రాగానే సుమారు 10 మంది దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న మూడు లారీల్లో వచ్చి కంటైనర్ వెళ్లేందుకు వీల్లేకుండా ముందు, వెనుక లారీలు ఆపారు. ఆ తర్వాత కంటైనర్ డ్రైవర్ బి.రవిపై దాడి చేసి గాయపరిచి కంటైనర్తో పరారయ్యారు. సింగరాయకొండ ఎస్ఐ మేడా శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద కంటైనర్ను హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే అప్పటికే కంటైనర్లో 531 సిగిరెట్ పెట్టెలు ఉండాల్సి ఉండగా కేవలం 125 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. చోరీ సొత్తు విలువ సుమారు 3.50 కోట్ల రూపాయలుగా పోలీసులు పేర్కొంటున్నారు. మిస్టరీగా కంటైనర్ చోరీ ఘటన.. కంటైనర్ చోరీ ఘటన మిస్టరీగా మారింది. చోరీ జరిగిన తీరు గమనిస్తుంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కంటైనర్కు జీపీఆర్ఎస్ సిస్టం ఉంది. దీని ప్రకారం కంటైనర్ ఎక్కడ ఉందో వెంటనే గుర్తించవచ్చు. కంటైనర్ను దుండగులు సింగరాయకొండ పట్టణం నుంచి పాకల రోడ్డు వరకు తీసుకొచ్చి మళ్లీ కావలి వైపు బయల్దేరి చివరకు పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జీపీఆర్ఎస్ విధానం ద్వారా కంటైనర్ను గుర్తించి వెళ్లేలోపు దుండగులు కంటైనర్ను ఫ్యాక్టరీ వద్ద వదిలి వేరే వాహనంలో కావలి వైపు పరారయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంటైనర్ చోరీకి గురైన సమాచారం రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ స్టెల్లార్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధికి సుమారు రాత్రి 11 గంటలకు అందింది. అంతేగాక కంటైనర్ సింగరాయకొండ వద్దే చోరీకి గురైందని వారికి పక్కా సమాచారం అందింది. -
సిగరెట్తో ఎముకలూ దెబ్బ తింటాయా?
నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – ఆర్. సమీర్, హైదరాబాద్ పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్ స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎ. సిద్ధార్థ, కర్నూలు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్షేక్లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఈ–సిగరెట్లు.. అనారోగ్యం వంద రెట్లు
చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు ఒక్కో ఈ–సిగరెట్ ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు 13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం చూడడానికి స్టైలిష్గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్ ఎలా పని చేస్తుంది? ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి. కేన్సర్కు దారితీస్తుంది... సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు.. ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం. టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. రాష్ట్రంలోనూ నిషేధించాలి ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. – నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
అత్యంత హానికారక సిగరెట్లు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్లోని ఇన్ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు. పన్ను ఎగ్గొట్టడానికే... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
గుట్టుగా మట్కా..మత్తుగా గుట్కా!
గిద్దలూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా యువత దురలవాట్లకు లోనై తమ బంగరు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. సిగిరెట్, మట్కా, గుట్కా, ఖైనీ వంటి వ్యసనాల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యసనాలకు బానిసవుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాజకీయ నేతలతో పాటు అధికారులు, కళాశాలలు నిర్వహించే కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడు వ్యసనాల నుంచి బయట పడేందుకు వీలు పడక అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి, బడి, ఇళ్లు, వైద్యశాల అనే తేడా లేకుండా బహిరంగ ప్రదేశంలో సిగిరెట్లు విచ్చలవిడిగా తాగుతూ ఆరోగ్యం నాశనం చేసుకోవడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నిల్చొని ఉండే వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేందుకు కారకులవుతున్నారు. సిగిరెట్, మద్యానికి బానిసలవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద క్యూకడుతున్నారు. సిగరెట్ కాలుతూ ఆరోగ్యాన్ని కాల్చేస్తూ.. సిగరెట్టే కదా..అని సిగిరెట్ కాల్చడం మొదలు పెట్టిన వ్యక్తితో పాటు సిగిరెట్ కాల్చగా వచ్చిన పొగతో అందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. నెలంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో సగభాగం సిగిరెట్, మద్యం, మట్కా, గుట్కా, ఖైనీ వంటి చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తూ సొమ్ముతో పాటు వారి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు, కంభం ఆరు మండలాలల్లో జనవరి 2018 నుంచి అక్టోబర్ వరకు సుమారు 689 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులే నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది పట్టుబడుతూ జరిమానాలు చెల్లిస్తున్నారు. జరిమానాతో పాటు జైలుశిక్షలకైనా సిద్ధపడుతున్నారు. గిద్దలూరు, సంజీవరాయుడుపేట, కేఎస్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జనవరి 2018 నుంచి సుమారు 60కిపైగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కేసులు నమోదైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మద్యం, సిగిరెట్తో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు ఎక్కువుగా ఉన్నారని తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. చిరుద్యోగి చెడు అలవాట్లకు లోనైతే? ప్రైవేటు రంగంలో పనిచేసే ఓ వ్యక్తి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం తీసుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. రోజుకు ఒక్కో సిగిరెట్ రూ.10 చొప్పున రెండు ప్యాకెట్లు కాలుస్తాడు. ఇందుకు రోజుకు రూ.200 ఖర్చు చేస్తుంటాడు. వారంలో రెండు రోజులు లిక్కర్కు రూ.2 వేలకు పైగా ఖర్చు చేస్తుంటాడు. ఈ లెక్కన సిగరెట్లు, మద్యానికి తన సంపాదనలో సగ భాగంపైనే చెడు వ్యసనాలకే ఖర్చు చేస్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు. ముచ్చటైన కాపురం పతనం: నా భర్త అంజి జీపు డ్రైవర్గా పనిచేస్తూ మద్యం, సిగిరెట్ వంటి చెడు వ్యసనాలకు బానిసై సంవత్సరం ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై చనిపోయాడు. కుటుంబ పోషణ భారం నాపై పడింది. నాలుగు ఇళ్లల్లో పొద్దున్నే పాచి పని చేసుకుంటూ మిగిలిన సమయంలో హోటల్లో పనిచేసుకుంటున్నాను. రెక్కల కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. నాది కొమరోలు మండలం అయ్యావారిపల్లి. 14 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన అద్దంకి అంజితో వివాహమైంది. భర్త వృత్తిరీత్యా కారు, జీపులకు డ్రైవర్గా పనిచేసేవాడు. భర్త బతికి ఉన్నప్పడు చెడు వ్యసనాలకు దూరం కావాలని నెత్తీ నోరు కొట్టుకుని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తీరా టైఫాయిడ్ జ్వరంతో నెల రోజులు మంచాన పడ్డాడు. వైద్యుల సూచనల మేరకు ప్రాణ భయంతో ఏడాది పాటు మద్యం, సిగిరెట్లకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టడంతో కామెర్లు వచ్చి లివర్ చెడిపోయి మృతి చెందాడు. చెడు వ్యసనాలతో చనిపోవడమే కాకుండా ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు ఇళ్లల్లో పాచి పనిచేసుకోవాల్సి వచ్చింది. వచ్చిన డబ్బుతో ఇద్దరు ఆడ పిల్లలను చదివించుకుంటున్నా. – అద్దంకి లక్ష్మీదేవి యువత ఆరోగ్యం నిర్వీర్యం: గిద్దలూరు ప్రాంతంలో యువత సిగిరెట్, మద్యం, ఖైనీ పొగాకు వంటి చెడు వ్యసనాలను బానిసవుతున్నారు. ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలా వరకు యువత చెడు వ్యసనాలకు బానిసలై అనారోగ్యానికి గురవుతున్నారు. మా వద్దకు వైద్యం కోసం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాణభయం కల్పిస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. నోటి క్యాన్సర్, కిడ్నీలు పాడవడం, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. రోగాల బారినపడి చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. – డి.హరినాథరెడ్డి, డాక్టర్ ఇప్పటికే భర్తను కోల్పోయా: చెడు వ్యసనాలకు లోనై గతేడాది భర్తను కోల్పోయా. ఇక నా కన్న కొడుకు వంతు వచ్చింది. ప్రస్తుతం పట్టణంలోని అర్బన్ కాలనీలో ఉంటున్నా. మాస్వగ్రామం మండలంలోని తాళ్లపల్లి. కొన్నేళ్ల నుంచి పట్టణంలో కాపురం ఉంటున్నాం. భర్త గుండమయ్య చెడు వ్యసనాలతో రెండు కిడ్నీలూ చెడిపోవడంతో మృత్యువాతపడ్డాడు. భర్త ఆరోగ్యం కోసం తాళ్లపల్లిలో ఉన్న ఇంటి స్థలం రూ.లక్షకు అమ్మి వచ్చిన డబ్బుతో భర్త ఆరోగ్యానికి ఖర్చు చేశా. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్త చనిపోయినా చేతికి అంది వచ్చిన కుమారుడు ఉన్నాడనే ఆశ కూడా మిగల్లేదు. కుమారుడు రంగస్వామి సైతం మద్యంకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. సిగిరెట్, గుట్కా, ఖైనీ, మందు.. ఇలా అన్ని వ్యసనాలూ ఉన్నాయి. ఎంత బానిసయ్యాడంటే మంచంలో ఉన్నా సరే నాకు మందు తీసుకురా..అంటూ సతాయిస్తున్నాడు. నా బాధ ఏ తల్లికీ రాకుడదు. కన్న కొడుకు రంగస్వామి రెండు కిడ్నీలూ పాడవడంతో పాటు లివర్ దెబ్బతింది. వణుకుడు జబ్బుతో బాధ పడుతున్నాడు. రంగస్వామి బాధ చూడ లేక ఇటీవల ఊరి వద్ద ఉన్న ఎకరా పొలం అమ్మగా మా భాగం కింద వచ్చిన రూ.25 వేల డబ్బులు కాస్తా నంద్యాలలోని శాంతిరామ్ వైద్యశాలలో వైద్యం కోసం ఖర్చు చేశా. మందు తాగితే చనిపోతావని వైద్యులు చెప్పినా బతకాలనే ఆశ కన్నా మందు తాగాలనే ఆశ వాడికి ఎక్కువైంది. నిత్యం మందు, సిగరెట్ తాగడంతో కిడ్నీలు పాడై లివర్ సైతం నాశనమైందని వైద్యులు చెప్పారు. నరాల బలహీనతతో సక్రమంగా నిలబడలేకపోతున్నాడు. మందుకు బానిసై నా భర్త, కన్న కొడుకు జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా నా జీవితాన్ని కూడా నాశనం చేశారు. భర్త చనిపోయి కన్న కొడుకు మంచాన పడి ఇన్ని కష్టాల మధ్య ఉన్న నాకు ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పెన్షన్ రానివ్వకుండా మా వార్డు కౌన్సిలర్ వెంకటస్వామి అడ్డుపడుతున్నాడు. పెన్షన్ రావాలంటే రూ.2 వేలు డిమాండ్ చేస్తున్నాడు. నాకు తెలియకుండా ఎమ్మెల్యే, అ«ధికారులు ఎలా ఇస్తారంటూ చెప్పడం చాలా అన్యాయంగా ఉంది. – గుజ్జా రమణమ్మ -
గాలి పీల్చితే.. 7 సిగరెట్లు తాగినట్లే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో గాలి పీల్చితే రోజుకు 7.7 సిగరెట్లు తాగినట్లే. అదే మన ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఒక రోజు శ్వాస తీసుకుంటే 4 సిగరెట్లు తాగినట్లే. దేశంలోని మిగతా పెద్ద నగరాల్లో కూడా గాలి స్వచ్చత అంతంత మాత్రమే. వీటిలో నివసిస్తున్న సగటు వ్యక్తి రోజుకు రెండు నుంచి ఎనిమిది సిగరెట్లు కాల్చుతున్నట్లే లెక్క. అవును. వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఏప్రిల్లో ‘షూట్ ఐ స్మోక్’ అనే స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను పారిస్లో విడుదల చేశారు. ఈ యాప్ ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లోని గాలి స్వచ్చతను సిగరెట్ పొగతో పోల్చి అంచనాలను చూపుతుంది. ఇలా భారత్లోని కీలక నగరాల గాలి స్వచ్చత తీవ్ర స్థాయిలో దిగజారినట్లు ఈ యాప్ తెలుపుతోంది. కాగా, కేంద్ర కాలుష్య నివారణ సంస్థ(సీపీసీబీ) మాత్రం ఈ యాప్ అంచనాలు సరైనవి కావంటూ కొట్టి పారేసింది. విదేశాల్లో చేసిన పరిశోధనల ఆధారంగా భారత్లో వాయు కాలుష్యాన్ని సిగరెట్ పొగతో పోల్చి చెప్పడం సరికాదని పేర్కొంది. దేశంలో గాలి కాలుష్యానికి సంబంధించిన డేటాను మాత్రమే అధికారికంగా సీపీసీబీ మాత్రమే విడుదల చేస్తుందని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీని పేర్కొన్న విషయం తెలిసిందే. సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన తొలి 20 నగరాల్లో భారత్కు చెందినవి 14 ఉన్నాయి. -
పొగతాగితే కాళ్లకూ కష్టమే
న్యూయార్క్: ధూమపానం ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపుతుందనేది అందరి నమ్మకం. కానీ, అది తప్పని తేలింది. పొగతాగే అలవాటు కాలి కండరాలపైనా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో రుజువయింది. ధూమపానం అలవాటు కాలి కండరాల్లో రక్తనాళాల సంఖ్యను తగ్గిస్తుందనీ తద్వారా కండరాలకు ఆక్సిజన్తోపాటు పోషకాల లభ్యత తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ‘పొగాకుతో కూడిన సిగరెట్లు తాగే వారిలో పెద్ద కండరాలతోపాటు శరీరం అంతటా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హానిని నివారించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాల్సి ఉంది’అని కాలిఫోర్నియా–శాన్డియాగో యూనివర్సిటీకి చెందిన ఎలెన్బ్రీన్ అంటున్నారు. ఈ పరిశోధనకు గాను కాలిఫోర్నియా, బ్రెజిల్, జపాన్లకు చెందిన నిపుణులు..ఒక ఎలుకను ఎనిమిది వారాలపాటు పొగాకు పొగ ప్రభావం పడేలా చేశారు. ఫలితాలను పరిశీలించగా.. ఆ ఎలుకలోని రక్తనాళాల సంఖ్య తగ్గాయి. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు, చురుకుదనం మందగించాయి. వీటివల్ల డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని తేల్చారు. అయితే, సిగరెట్లలో ఉండే దాదాపు నాలుగు వేల రకాలైన రసాయనాలు కండరాల క్షీణతపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశం మాత్రం ఈ అధ్యయనంలో వెల్లడికాలేదు. -
ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం
‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ప్రభుత్వాలు చట్టబద్ధంగా హెచ్చరికలు జారీ చేసే ప్రభుత్వాలు ఇకపై ‘ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలను జారీ చేయాల్సి ఉంటుందేమో! ఇంటిని తుడవడం, గచ్చు మీద మురికిని తడిగుడ్డతో లేదా మాప్తో తుడవటం, గచ్చు మీద మొండి మరకలను తొలగించడానికి యాసిడ్, డిటర్జెంట్లు వంటివి వేసి రుద్దడం వంటి పనులు సైతం ఊపిరితిత్తులపై పొగతాగడంతో సమానమైన హాని కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ ఇరవై సిగరెట్లు తగలేసే పొగరాయుళ్ల ఊపిరితిత్తులు ఏ స్థాయిలో పాడైపోతాయో, రోజూ ఇంటిని శుభ్రం చేసే మహిళల ఊపిరితిత్తులు కూడా అదే స్థాయిలో దెబ్బతింటాయని నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జెన్కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారు తమ పరిశోధనలో భాగంగా 6,235 మంది మహిళలపై అధ్యయనం జరిపారు. వారిలో రోజూ ఇంటిని శుభ్రం చేసే అలవాటు ఉన్న మహిళలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే మహిళలపై వైద్య పరీక్షలు నిర్వహించగా, వారి ఊపిరితిత్తులు దాదాపు పొగతాగే వారి ఊపిరితిత్తుల మాదిరిగానే తయారైనట్లు గుర్తించారు. -
నలుగురు మలేషియన్ల అరెస్ట్
సింగపూర్ : మలేసియా నుంచి సింగపూర్కు నిషేధిత సిగరెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వేకువజామున ఉడ్ల్యాండ్స్ చెక్పోస్టు వద్ద వీరిని అరెస్టు చేసినట్లు సింగపూర్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిషేధిత సిగరెట్లను సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మలేసియా నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఒక ట్రక్కులో సిగరెట్లను ఇమిగ్రేషన్ అధికారి గుర్తించారని చెప్పారు. సింగపూర్ కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తనిఖీలు చేపట్టి మరో రెండు వాహనాల్లో సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. మూడు ట్రక్కులను సీజ్ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల విలువ దాదాపు మూడున్నర లక్షల డాలర్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మలేసియాలో నిషేధిత వస్తువులను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట రీత్యా నేరం. దోషులుగా తేలిన వారికి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. -
సిగరెట్ల డబ్బులడిగాడని.. మహిళ దౌర్జన్యం
థానే: అప్పుగా ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు తీసుకుంది. అమావాస్యకో, పౌర్ణమికో బాకీ చెల్లిస్తుంది. దీంతో విసుగెత్తిన దుకాణదారుడు తన బాకీ చెల్లించమని అడిగాడు. అంతే ఆవిడ గారికి కోపం వచ్చింది. నన్నే డబ్బు అడుగుతావా అంటూ కత్తితో దాడికి పాల్పడింది. అయినా సదరు మహిళ కోపం చల్లారలేదు. పక్కనే దుకాణంలో కాగుతున్న వేడి టీని తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసింది.. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని థానే నగరం, నౌపడా ప్రాంతంలోని విష్ణు నగర్లో ఓ మహిళ(34) నివాసం ఉండేది. సమీపంలో ఓవ్యక్తి(75) సిగరెట్ల దుకాణానికి వచ్చి తరచూ సిగరెట్లు కొనుగోలు చేసేది. అయితే తీసుకున్న సిగరెట్లకు అప్పుడప్పుడు మాత్రమే డబ్బులు ఇచ్చేది. ఈ క్రమంలో ఈనెల18న కూడా ఆమె దుకాణానికి వచ్చి సిగరెట్లు ప్యాకెట్లు తీసుకుంది. అయితే సిగరెట్లకు డబ్బులు ఇవ్వమని దుకాణ నిర్వాహకుడు గట్టిగా అడగాడు. అంతే ఆవిడాగారికి కోపం వచ్చింది. కోపంగా యజమానిని దూషిస్తూ షాపులోని కత్తి తీసుకుని దాడికి పాల్పడింది. అంతేగాక బయటకు లాక్కొచ్చి కొట్టింది. అంతటితో అగకుండా పక్కనే దుకాణంలో కాగుతున్న టీ తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసి పారిపోయింది. స్థానికులు పరుగున వచ్చి దుకాణదారుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ మహిళను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సి.జె.కాదవ్ వెల్లడించారు. మారణాయుధాలతో దాడి చేసిన, తోటి వ్యక్తికి ప్రాణభయం కలిగించడం, మోసం చేయడం నేరాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. -
ఇక పిట్ట కొంచెం బుర్ర ఘనం
మెక్సికో : పిట్ట కుంచెం కూత ఘనం అని అంటాం. కానీ పిట్ట కొంచెం మెదడు ఘనం అని కూడా ఇక అనవచ్చు. సాధారణంగా మనకు తెలిసిన పలు రకాల పిట్టలు చెట్టు కొమ్మలను, ఆకులను ఆసరాగా చేసుకొని గూళ్లు కట్టుకుంటాయని తెలుసు. వాటి కోసం అవి రక రకాల పుల్లలు, కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కేబుల్ వైర్ల ముక్కలు ఏరుకొని వస్తాయి. వాటన్నింటిని కలిపి అవి గూళ్లు అల్లుకుంటాయి. గడ్డి పోచలతో ఆ గూడికి ఓ రూపాన్ని తీసుకొస్తాయి. ఇదంతా పిట్టలు తాము పెట్టే గుడ్లకోసం, పొదిగినప్పుడు ఆ గుడ్లు పిల్లలుగా పుట్టేంత వేడి ఉండడం కోసం. పలు రకాల పిట్టలు తాము గూళ్ల కట్టుకోవడంలో మానవులు తాగి పడేసే సిగరెట్ పీకలను ప్రధానంగా పట్టుకెళతాయి. అన్ని పుల్లల్లాగా సిగరెట్ పీకలను పట్టుకెళుతున్నాయని చూసిన సాధారణ మనుషులు అనుకున్నారు. ఆ పీకల ఫిల్టర్లో ఉన్న దూది గూడు అల్లికకు బాగా పనికొస్తుందన్న ఉద్దేశంతో పీకలను పిట్టలు పట్టుకెళుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిట్టలు పీకలను గూడు కోసం పట్టుకెళ్లడం వెనక ఇంతకన్నా పెద్ద కారణమే ఉందని నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోకు చెందిన డాక్టర్ సౌరెజ్ రోడ్రిగెజ్ కనుగొన్నారు. రక్తాన్ని పీల్చే పరాన్నబుక్కులైన పేళ్ల లాంటి చిన్న చిన్న కీటకాలు గూళ్లలోకి ప్రవేశించకుండా, తమ పిల్లలకు హాని చేయకుండా ఉండేందుకే పిట్టలు ఈ ఫిల్టర్ దూదిని ఉపయోగిస్తున్నాయని డాక్టర్ నిరూపించారు. సిగరెట్టు పీకలు దొరకగనా లేదా అప్పటి అవసరం లేదనుకొనిగా పీకలు ఉపయోగించకుండా కట్టిన గూళ్లను కూడా ఆ తర్వాత పిట్టలు గుడ్లను పొదిగే సమయంలో మార్చుకున్న వైనాన్ని డాక్టర్ గుర్తించారు. గూళ్ల సాధారణ లైనింగ్ను తొలగించి ఫిల్టర్ దూది లైనింగ్ను కొత్తగా ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించారు. సూక్ష్మ క్రిమికీటకాలు ఫిల్టర్ దూది జోలికి రాకపోవడాన్ని కూడా గుర్తించారు. డాక్టర్ తన ప్రయోగం పూర్తి వివరాలను ‘ఏవియన్ బయోలోజి’ తాజా సంచికలో ప్రచురించారు. -
రూ. 4 కోట్ల సిగరెట్లు దోపిడీ
సిగరెట్ల లారీని అటకాయించి బెదిరింపులు డ్రైవర్ను కొట్టి.. సమీపంలోని గుట్టల్లోకి లారీని తీసుకెళ్లి మరో లారీలోకి సరుకంతా మార్చేసుకున్న దుండగులు రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. చౌటుప్పల్, హైదరాబాద్: శనివారం అర్ధరాత్రి.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి.. దారిపక్కన రెండు సుమోలు కాచుకుని ఉన్నాయి.. వాటిల్లో ఉన్న 20 మంది అటుగా వస్తున్న ఓ లారీని అటకాయించారు.. డ్రైవర్ను చితకబాది లారీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. అందులోని రూ.4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్నారు.. అప్పటికే సిద్ధం చేసుకున్న మరో లారీలోకి ఆ సిగరెట్ల పెట్టెలను వేసుకుని ఉడాయించారు.. నిత్యం రద్దీగా ఉండే రంగారెడ్డి జిల్లా పెద్దఅం బర్పేట వద్ద పక్కాగా సినీ ఫక్కీలో ఈ సంచలన దోపిడీ జరగడం గమనార్హం. పక్కా ప్రణాళికతో.. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఉన్న ఐటీసీ కంపెనీ నుంచి శనివారం అర్ధరాత్రి ఒక లారీ సిగరెట్ల కాటన్లను తీసుకుని.. ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటకు బయలుదేరింది. జాతీయ రహదారిపై పెద్ద అం బర్పేట వద్ద నిర్మానుష్య ప్రాంతానికి ఆ లారీ చేరుకోగానే.. అప్పటికే అక్కడ కాపుకాస్తున్న సుమారు 20 మంది దుండగులు దానిని ఆపారు. బిహార్కు చెందిన డ్రైవర్ అఖిలేశ్యాదవ్ (35)ను చితకబాది లారీని లాక్కున్నారు. ఈ లారీతో పాటు తాము అప్పటికే సిద్ధం చేసుకున్న కంటైనర్ లారీని తీసుకుని చౌటుప్పల్ ప్రాంతం వైపు వచ్చారు. ఇంకా ముందుకు వెళ్తే టోల్ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రమాదం ఉంటుందని గ్రహించి... దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతం వైపు తీసుకెళ్లారు. సిగరెట్లన్నింటినీ వేసుకుని.. దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతంలో రెండు లారీలను నిలిపి.. సిగరెట్ల కాటన్లను తమ కంటైనర్ లారీలోకి మార్చుకున్నారు. లారీ డ్రైవర్ కళ్లకు గంతలు కట్టి.. చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ లారీని చౌటుప్పల్ వైపు తీసుకొచ్చి ఖైతాపురం వద్ద వదిలేశారు. తమ కంటైనర్ను తీసుకుని పారిపోయారు. అయితే చివరకు ఎలాగో కట్లు విప్పుకున్న లారీ డ్రైవర్ అఖిలేశ్యాదవ్.. సమీపంలోని దాబా హోటళ్ల వద్దకు చేరుకుని, వారి సాయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రాచకొండ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్జోషి, క్రైం డీసీపీ జానకి, భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి తదిత రులు ఘటనా స్థలాన్ని సందర్శించి.. వివరాలు సేకరించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకొ నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దొంగలు పాతవారేనా? కొత్తగా ఏదైనా ముఠా ఈ ప్రాంతానికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది రెండో ‘సిగరెట్’ దోపిడీ 2012 అక్టోబర్ 18న చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం శివారులో కూడా సిగరెట్ల లారీ చోరీకి గురైంది. అప్పట్లో రూ.19 లక్షల విలువైన సిగరెట్లను దోచుకెళ్లారు. దీనికి పాల్పడిన 11 మంది దొంగలను పోలీసులు అదే ఏడాది నవంబర్లో అరెస్టు చేశారు. వారంతా నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెం, చింతపల్లి మండలాలకు చెందినవారే. -
యువతే టార్గెట్గా అమ్మకాలు..!
► రహస్యంగా గంజాయి సిగరెట్ల అమ్మకాలు ►బానిసలవుతున్న యువకులు, విద్యార్థులు ► నిర్దేశించిన ప్రదేశాల్లో సరుకుతో సిద్ధంగా ఏజెంట్లు ► ఒక్కో సిగరెట్ రూ.50 నుంచి రూ.100దాకా ► మద్యం దుకాణాల మార్పిడితో ఊపందుకున్న అమ్మకాలు మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో ఎక్కువగా యువత ఉంటున్నారు. ఇన్నాళ్లు రహస్య ప్రదేశాల్లో మాత్రమే గంజాయి అమ్మేవారు. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద గంజాయి అమ్మకాలు ఊపందుకున్నాయి. పలమనేరు: గంజాయి మత్తులో భావిభారత పౌరుల జీవితాలు చిత్తవుతున్నాయి. మద్యం కంటే నాలుగింతలు మైకం కలిగించే గంజాయి సిగరెట్ల అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. యువతే టార్గెట్గా అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర పటణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. వైజాగ్ నుంచి కొందరు ఏజెంట్ల ద్వారా జిల్లాకు గంజాయి చేరుతున్నట్టు ఇప్పటి కే పోలీసులు గుర్తించారు. గతంలో పలమనేరు, చిత్తూరులో గంజాయితో పట్టుబడిన నిందితులు సైతం తమకు సరుకు విశాఖ నుంచి అందినట్టు తెలిపిన విషయం విదితమే. అక్కడికి చెందిన ప్రధాన ముఠా సరుకును కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్కు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి నుంచి జిల్లాలోని ఏజెంట్లకు చేరుతోంది. నిర్దేశించిన చోట్లే అమ్మకాలు.. గంజాయి సిగరెట్ ప్యాక్లను పొందిన ప్రధాన ఏజెంట్లు వాటిని నమ్మకమైన వారి ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి రైల్వేస్టేషన్, యూనివర్సిటీ ప్రాంతం, రేణిగుంట, బైపాస్ రోడ్డు, చిత్తూరులోని మెసానికల్ గ్రౌండ్ ప్రాంతం, పీవీకేఎన్ కళాశాల మైదానం, తిరుత్తణి రోడ్డులోని ఆవాస ప్రాంతాలు, సంతపేట, కాజూరు, ముత్తురేవుల, మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండు, సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన, బీటీ కళాశాల మైదానం, అంగళ్లు, కుప్పం పట్టణంలోని పలు అవాస ప్రాంతాలు, పలమనేరులోని లక్ష్మీ థియేటర్, ఎద్దులచెరువు కట్ట సమీపంలోని పట్టుపరిశ్రమ కార్యాలయం, గోరీతోట, మధు కళాశాల వెనుక వైపు, గంటావూరు, గడ్డూరు కాలనీ తదితర చోట్ల రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఏజెంట్లు సైతం అలవాటుపడిన వారికి తప్ప కొత్తవారికి వీటిని విక్రయించడం లేదు. అనువైన ప్రాంతాలను ఎంచుకున్నారిలా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న పలు మద్యం దుకాణాలు పట్టణాలకు దూరంగా మార్చుకున్నారు. కొందరు తోపులు, కోళ్లఫారాలు, తాత్కాలిక షెడ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మందు బాబులకు అనుకూలంగా మారాయి. ఇదే అదునుగా గంజాయి సిగరెట్లు అమ్మేవాళ్లు ఇలాంటి ప్రదేశాల్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రోడ్డున పడుతున్న జీవితాలు ఒక్కసారి ఈ మత్తుకి అలవాటుపడితే మానుకోవడం చాలా కష్టం. పలమనేరుకు చెందిన ఓ యువకుడు విపరీతంగా గంజాయి సిగరెట్లను తాగి తీవ్రమైన అనారోగ్యంతో బెంగళూరులో లక్షలు వెచ్చించి ప్రాణాపాయం నుంచి బయటపట్టాడు. ఇలాంటి వారు మరెందరో జిల్లాలో ఉన్నా విషయాలు వెలుగుచూడడం లేదు. ముఖ్యంగా రోజువారి కూలీలు, డ్రైవర్లు, హమాలీలు వీటికి బానిసలుగా మారినట్టు సమాచారం. కష్టపడి సంపాదించిన డబ్బును ఇందుకోసం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా యువత, బెట్టింగ్ రాయుళ్లు, కళాశాల విద్యార్థులు వీటికి బానిసలు కావడం గమనార్హం. డబ్బులు లేని సందర్భాల్లో తమ వద్దనున్న సెల్ఫోన్లు, ఉంగరాలను సైతం తాకట్టుపెట్టి సిగరెట్లు కొనే యూత్ ఉన్నారట. దీనిపై సంబంధిత శాఖలు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ నిఘా ఉంచి ముఠా ఆట కట్టించాల్సిన అవరసరం ఎంతైనా ఉంది. ఎలా తయారు చేస్తున్నారంటే.. జిల్లాలోని కొన్ని పట్టణాల్లో బీడీ చుట్టే కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి చోట్ల ఎంపిక చేసుకున్న వారితో మామూలు సిగరెట్లను ఇచ్చి వాటిలో పొగాకుతో పాటు 60:40శాతం గంజాయి పొడిని కలిపి ప్యాక్ చేస్తున్నట్టు తెలిసింది. అలా తయారైన సిగరెట్ ప్యాక్లకు ఓ గుర్తును వేసి సాధారణ సిగరెట్లలాగే ఏజెంట్లకు చేరవేస్తున్నారు. కింగ్ సిగరెట్ అయితే వంద.. బర్కిలీ, సిజర్ సిగరెట్లలో నింపిన గంజాయి అయి తే రూ.50, కింగ్ సిగరెట్ అయితే రూ.వందదాకా అమ్ముతున్నట్టు తెలిసింది. మద్యం క్వార్టర్ బాటిల్ కొనాలంటే రూ.120 పెట్టాలి. అది కొద్దిసేపే మత్తు ఉండడంతో కొందరు మద్యంలో మత్తు మాత్రలు కలిపి సేవిస్తున్నారు. గంజాయి సిగరెట్ తాగితే నాలుగు గంటలకు పైగా మత్తులో జోగాల్సిందే. -
సిగరెట్లు, పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం తొలగింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలాపై అదనపు ఎక్సయిజ్ సుంకాన్ని ఆర్థిక శాఖ తొలగించింది. అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తూ 2010 ఫిబ్రవరి 27న జారీ అయిన సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్ను రెవెన్యూ విభాగం కొట్టి వేసింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కింద.. 28 శాతం పన్ను పరిధిని దాటిన డీమెరిట్, లగ్జరీ గూడ్స్పై సెస్సు విధించడం జరుగుతుంది. దీని ప్రకారం పాన్ మసాలాపై సెస్సు 60%, పొగాకుపై 71–204% దాకా ఉంటుంది. ఇక సెంటెడ్ జర్దా, ఫిల్టర్ ఖైనీపై 160%, గుట్కా ఉన్న పాన్మసాలాపై 204 శాతం సెస్సు విధిస్తారు. 65 మి.మీ. పైగా 70 మి.మీ. లోపు పొడవుండే నాన్ ఫిల్టర్ సిగరెట్స్ వెయ్యికి 5 శాతం సెస్సుతో పాటు రూ. 2,876.. ఫిల్టర్ సిగరెట్స్ అయితే 5 శాతంతో పాటు రూ. 2,126 విధిస్తారు. సిగార్లపై అత్యధికంగా ప్రతి వెయ్యిపై 21 శాతం లేదా రూ. 4,170 (ఏది ఎక్కువైతే అది) సెస్సు ఉంటుంది. నందన్ నీలేకని -
రోజుకు ఐదు సిగరెట్ల ఖర్చు కోటి రూపాయలు..
న్యూఢిల్లీ : పొగతాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రతిఒక్కరికీ తెలుసు. స్మోకర్లకూ ఈ విషయంపై ఇంకా బాగా అవగాహన ఉంటుంది. అయినా కూడా పొగరాయుళ్లు మాత్రం సిగరెట్ ను వదిలిపెట్టరు. గుప్పుగుప్పుమని పొగవదులుతూనే ఉంటారు. కానీ మీకు తెలియని మరో విషయమేమిటంటే.. స్మోకింగ్ మీరు ఊహించదానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. వరల్డ్ నో-టుబాకో డేగా సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ ఆరోగ్యానికి స్మోకింగ్ కలుగజేసే ముప్పుతో పాటు ఆర్థికంగా ఏమేర దెబ్బతీస్తుందో గణాంకాలతో సహా వివరించింది. ఒకవేళ మీకు 30 ఏళ్ల వయసు ఉండి రోజుకు ఐదు సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతున్నారనుకుంటే... రిటైర్మెంట్ వయసు 60ఏళ్లకు వచ్చేసరికి మీరు కోటికి పైగా రూపాయలకు పైగా కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఆ కోటి రూపాయలతో పాటు, పరోక్షంగా మరింత మొత్తాన్ని కోల్పోతారని ఎకనామిక్ టైమ్స్ అంచనావేసింది. సిగరెట్లపై చేసే వ్యయం... సిగరెట్లపై చేసే పొగరాయుళ్లు చేసే వ్యయం ఆర్థికంగా భారీగా దెబ్బకొడుతోంది. ఒక్కో సిగరెట్ ధర రూ.10-15 మధ్యలో ఉంటే, రోజుకు ఐదు సిగరెట్లను కాల్చితే వాటితో 60రూపాయల మేర ఖర్చవుతుంది. అంటే నెలకు 1800 రూపాయల పైననే సిగరెట్ల కోసం వెచ్చిస్తారు. నెలకు ఖర్చు ఏడాదికి వీటిపై పెంపు 30 ఏళ్లలో సిగరెట్లపై చేసే వ్యయం రూ.1800 8 శాతం రూ.24.47 లక్షలు ఒకవేళ ఆ మొత్తాన్ని సిగరెట్లపై కాకుండా.. పెట్టుబడులుగా పెట్టి ఉంటే, 9 శాతం వడ్డీతో రూ.69.23 లక్షలు పొదుపు చేస్తారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. పొగాకు ఉత్పత్తులపై పన్నులు విపరీతంగా పెరుగుతుంటాయి. దీంతో సిగరెట్ ధరలు ప్రతేడాది గణనీయంగా పైకి ఎగుస్తూ ఉంటాయి. గత నాలుగేళ్లలో ప్రతేడాది సగటున 20 శాతం మేర సిగరెట్ ధరలు పెరిగాయి. గత నాలుగేళ్లలో సిగరెట్ ధరలు రెండింతలు కంటే ఎక్కువగా పైకి ఎగిశాయి. గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ప్యాకెట్ ధరలు సిగరెట్ తాగడం వల్ల అయ్యే వైద్య ఖర్చులు... నెలకు అయ్యే ఖర్చు వార్షిక పెంపు 30 ఏళ్లలో ఖర్చు 400 రూపాయలు 12 శాతం రూ.11.59 లక్షలు ఒకవేళ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే 9 శాతం వడ్డీతో రూ.26.7 లక్షలవుతాయి. అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణంతో పోలిస్తే వైద్య ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంటుంది. డ్రగ్స్ ధరలు, డాక్టర్ల కన్సల్టేషన్ ఛార్జీలు, డయాగ్నోస్టిక్ ఛార్జీలు సగటున 15 శాతం మేర పెరిగాయి. ఏడాదికి 12 శాతం పెంపుతోనే వీటిని గణించింది ఎకనామిక్ టైమ్స్. ఇన్సూరెన్స్ వ్యయాలు... లైఫ్ ఇన్సూరర్స్ స్మోకర్ల నుంచి ఎక్కువ ప్రీమియంలు వసూలు చేస్తాయి. కోటి రూపాయల బీమా కవర్ చేయాలంటే 30ఏళ్ల వ్యక్తి ప్రతినెలా రూ.460 ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన... నెలవారీ ఖర్చు వార్షిక పెంపు 30ఏళ్లలో ఖర్చు రూ.460 నిల్ రూ.1.65 లక్షలు ఈ మొత్తాన్ని కూడా 9శాతంతో ఇన్వెస్ట్ చేస్తే అది రూ.7.52 లక్షలవుతుంది. సిగరెట్ల ఖర్చు మెడికల్ వ్యయాలు ఇన్సూరెన్స్ ఖర్చు రూ.69.23 లక్షలు + రూ.26.70 లక్షలు + రూ.7.52 లక్షలు ఈ మొత్తం కలిపితే రూ.1.03 కోట్లవుతుంది. -
రెండేళ్లకే చైన్ స్మోకర్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ?
జకర్తా : రెండేళ్ల చిరు ప్రాయంలోనే సిగరేట్ కాలుస్తూ ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు అల్ది రిజాల్. ఇండోనేషియాలోని సుమత్రాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అల్ది రిజాల్(2) స్మోకింగ్ చేస్తున్న ఫోటోలు 2010లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఓ చేతిలో సైకిల్ హ్యాండిల్, మరో చేత్తో సిగరెట్ పట్టుకుని పొగ ఊదుతూ ఉన్న అల్ది దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో రెండేళ్ల చిన్నారికి చైన్ స్మోకింగ్ అలవాటు ఏంటి అంటూ తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు. అతనికి సిగరెట్లు ఎందుకు కొనిస్తున్నారంటూ చిన్నారి తల్లిదండ్రులను ఎడపెడా నెటిజన్లు వాయించేశారు. అంతేకాకుండా ఇండోనేషియా ప్రభుత్వాన్ని సైతం కడిగిపారేశారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అల్ది చైన్ స్మోకింగ్ ఘటనపై ఇండోనేషియా ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. మారుమూల పల్లెల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి సిగరెట్ తాగటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నారికి ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక పునరావాసం కల్పించింది. రోజుకు కనీసం 40 సిగరెట్లను తాగే తన అలవాటును 2013లో అల్ది వదిలి పెట్టాడు. అయితే సిగరెట్లు పూర్తిగా మానేసే ప్రక్రియ మాత్రం అంత సులభంగా జరగలేదు. సిగరెట్లను మానేసిన తర్వాత అల్ది ఆలోచన మొత్తం ఆహారం పై పడింది. దీంతో ఒక్క సారిగా బరువు పెరిగాడు. డాక్టర్ సలహాతో తల్లిదండ్రులు ఆహారాన్ని అందించడంతో అల్ది మామూలు స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయసున్న అల్ది స్థానిక స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. అంతేనా చదువుల్లో దూసుకుపోతూ ఏకంగా టాప్ ర్యాంకర్గా పేరు తెచ్చుకున్నాడు. అల్ది చిన్నతనంలో సిగరెట్ ఇవ్వకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడని, అస్సలు వినకపోయేవాడని అల్ది తల్లి డియానే రిజాల్ తెలిపారు. కానీ ఇప్పుడు సిగరెట్ తాగే ఆలోచనే అతనిలో లేదని చెప్పారు. -
సిగరెట్టు.. మంటపెట్టు
♦ రాష్ట్రంలో అత్యధిక అగ్నిప్రమాదాలు సిగరెట్ వల్లే ♦ ఏప్రిల్, మే నెలల్లోనే అధిక ప్రమాదాలు ♦ నిర్లక్ష్యం వద్దంటూ అగ్నిమాపక శాఖ సూచనలు సాక్షి, హైదరాబాద్: పొగరాయుళ్ల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా జరిగే అగ్నిప్రమాదాల్లో 50 శాతానికిపైగా వాటా పొగరాయుళ్లదేనని అగ్నిమాపక శాఖ తెలిపింది. సిగరెట్ అంటించి అగ్గిపుల్లను ఆర్పకుండా పడేయటం, తాగిన సిగరెట్ను పూర్తిగా ఆర్పకుండా పడేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఏటా జరుగుతున్న ప్రమాదాలు, వాటికి గల కారణాలు, కారకులు తదితర అంశాలపై అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించింది. రాష్ట్రంలో 2010 నుంచి జరుగుతున్న అగ్నిప్రమాదాలను పరిశీలిస్తే ఏటా వెయ్యికి పైగా ప్రమాదాలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది. పెరుగుతున్న మృతుల సంఖ్య.. అగ్నిప్రమాదాలతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా ఏప్రిల్, మే మాసాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతు న్నారు. 2010 నుంచి 2016 వరకు 755 మంది అగ్నిప్రమాదాలకు ఆహుతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ప్రమా దాల్లో 928 మందిని సురక్షితంగా రక్షించగలి గామన్నారు. సిగరెట్ తాగిన తర్వాత పడేసేముందు ఒక్క క్షణం ఆలోచించాలని, నిప్పు ఆర్పివేసి పడేస్తే ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని చెప్పారు. సిగరెట్ వల్లే 4,821 ప్రమాదాలు పొగరాయుళ్ల వల్లే సగానికి అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలో స్పష్టంగా బయటపడింది. 2015–16లో 9,530 అగ్నిప్రమాదాలు జరగ్గా, వాటిలో 4,821 ప్రమాదాలు సిగరెట్ వల్లే జరిగాయని వెల్లడైంది. మిగతా ప్రమాదాలు విద్యుత్ పరికరాలు, పేలుడు పదార్థాల నిల్వ, ఓవెన్ స్టౌవ్స్, కెమికల్ కంపెనీలు, గోడౌన్లు, కోల్గ్యాస్ తదితర కారణాల వల్ల జరిగినట్లు తేలింది. -
ఒత్తిడి తగ్గదు సరికదా... ఎక్స్ట్రా డేంజర్స్
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను. ఆ ఒత్తిడి తగ్గించుకోడానికి రోజూ సిగరెట్లు కాలుస్తుంటాను. రోజూ దాదాపు మూడు నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శామ్యూల్, కరీంనగర్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు కాల్చడం అంటే చాలా పెద్ద విషయం. అది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే ధూమపానం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. డాక్టర్ పి. నవనీత్ సాగర్రెడ్డి,సీనియర్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ ఐబీఎస్... భయపడాల్సిందేమీలేదు! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. భోజనం తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మలంలో జిగురు కనిపిస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. ఆత్మన్యూనతతో బాధపడుతున్నాను. – మహేశ్కుమార్, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. రోగ లక్షణాలను బట్టి, కడుపులో పరాన్నజీవులు ఉన్నాయా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ పరీక్షలు నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే... జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ చికిత్స ద్వారా చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
మొబైల్స్, సిగరెట్లు ప్రియం
-
మొబైల్స్, సిగరెట్లు ప్రియం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడేవారికి ఇది చేదువార్తే. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ బడ్జెట్లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచారు. మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ బల్బుల ధరలకూ రెక్కులు రానున్నాయి. మొబైల్స్లో వాడే పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లు, ఎల్ఈడీ బల్బుల విడి భాగాల దిగుమతిపై సుంకం భారీగా పెంచడం వల్ల ఇవి ప్రియం కానున్నాయి. మరోవైపు జైట్లీ... సహజసిద్ధ ఇంధన వనరుల వినియోగంపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్పై సర్వీస్ చార్జీలను ఎత్తివేశారు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్స్లో ఉపయోగించే ఫిల్టర్లపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అలాగే దేశీయ ఆర్ఓ ఫిల్టర్లను ప్రోత్సహించేందుకు దిగుమతులపై పన్నును 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. తోళ్ల పరిశ్రమకు ఊతమిచ్చేలా వీటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలపై 7.5 శాతం ఉన్న పన్నును 2.5 శాతానికి తగ్గించారు. రక్షణ రంగంలోని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలపైనున్న 14 శాతం సేవా పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం... ముడి పొగాకుపై 4.2 శాతం నుంచి ఏకంగా 8.3 శాతానికి... పాన్ మసాలాలపై 6 శాతం నుంచి 9 శాతానికి ఎక్సైజ్ సుంకాలు పెంచారు. ఇక ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించారు. చేతితో తయారుచేసే కాగితం చుట్టిన బీడీలపై ఎక్సైజ్ పన్నును వెయ్యికి రూ.21 నుంచి రూ.28 చేశారు. అలాగే దిగుమతి చేసుకున్న రోస్టెడ్, సాల్టెడ్ జీడిపప్పుపై సుంకాన్ని 30 శాతం నుంచి 45 శాతానికి పెంచారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో దిగుమతి చేసుకునే వెండి నాణేలు, పతకాలు, వస్తువులపై కొత్తగా 12.5 శాతం సీవీడీ విధించారు. ఇవి ఖరీదు... ► మొబైల్ ఫోన్లు ► సిగరెట్, సిగార్, బీడీలు, ఖైనీ, పాన్ మసాలాలు ► దిగుమతి చేసుకున్న జీడిపప్పు (రోస్టెడ్, సాల్టెడ్) ► ఎల్ఈడీ బల్బులు, దిగుమతి చేసుకున్న వెండి నాణేలు, పతకాలు, వస్తువులు ► ముడి అల్యూమినియం ► ఆప్టికల్ ఫైబర్స్ తయారీలో ఉపయోగించే పాలిమర్ పూత కలిగిన ఎంఎస్ టేపులు ఇవి చౌక ► ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్, గృహావసరాలకు వినియోగించే ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లు ► సోలార్ ప్యానెల్లో ఉపయోగించే గాజు ► ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ► గాలిమర ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్లు ► తోలు ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలు, స్వైపింగ్ మెషీన్లు, వేలిముద్రను చదివే పరికరాలు రక్షణ రంగంలోని వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ -
హెర్బల్, నేచురల్ సిగరెట్లతోనూ ప్రమాదమే..!
పొగరాయుళ్ళకు మరో షాక్... ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా... అందుకు బానిసలైనవారు మాత్రం మానలేకపోతుంటారు. కొందరు మానేందుకు ప్రయత్నించే మార్గంలో ఇతర అలవాట్లను చేసుకుంటే, కొందరు హెర్బల్ సిగరెట్లు, బీడీల వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే సిగరెట్ ఎలాంటిదైనా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ధూమపానం... స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమౌతుందని, క్లోవ్ (లవంగం) సిగరెట్లను కూడ టుబాకోతో కలిపే తయారు చేస్తారని చెప్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ వాడే బీడీల అలవాటుకూడ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ మనుషులను బానిసలుగా మారుస్తుంది. అంతేకాక గుండె జబ్బులు, కొరోనరీ ఆర్టెరీ వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమౌతుంది. ఈ నేపథ్యంలో ధూమపానాన్ని మానుకోలేని వారు సాధారణ సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా హెర్బల్, నేచురల్ సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. కొంతలో కొంత ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని కలిగించవని నమ్ముతారు. అయితే ఈ హెర్బల్, నేచురల్ సిగరెట్లవల్ల కూడ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించక, మంచివే అన్న భ్రమలో రోగాలను కొనితెచ్చుకుంటారు. హెర్బల్ పదార్థాలు కూడ కాలుతున్నపుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికారక టాక్సిన్స్ ను విడుదల చేస్తాయి. అటువంటి హెర్బల్ సిగరెట్ల పొగను పీల్చుకున్నపుడు శ్వాస ద్వారా టాక్సిన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అందుకే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లెక్కల ప్రకారం హెర్బల్ సిగరెట్లపై కూడ ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరిక ఇవ్వాల్సి ఉంది. హెర్బల్ సిగెరెట్లు కూడ సాధారణ సిగరెట్లలాగే ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయన్న విషయం పొగరాయుళ్ళకు షాక్ కలిగించవచ్చు. అయితే వీటిలో అభిరుచి పుష్పం, మొక్కజొన్న పట్టు, గులాబీ రేకులు, తామర ఆకు , లికోరైస్ వేరు , మల్లెపూవు, గిన్సెంగ్, ఎర్ర లవంగ పూలను వాడుతుంటారు. కాగా లవంగాల వంటివి వాడే హెర్బల్ సిగరెట్ల లాగానే బీడీలు కూడ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లవంగం సిగరెట్లలో 60 నుంచి 70 శాతం టుబాకోతో పాటు.. 30 నుంచి 40 శాతం మాత్రమే లవంగాలను వాడతారు. దీంతో ఈ ప్రత్యామ్నాయ సిగరెట్టలో పొగాకు ఉత్పత్తులకంటే ఎక్కువగా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని, ఇది కూడ ధూమపానంకంటే ఆరోగ్యానికి అధిక హాని కలిగిస్తుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ పొందిన బీడీల్లో కూడ శుద్ధి చేయని, వడకట్టని టుబాకో వాడతారని, సిగరెట్లకన్నా తక్కువ ధర ఉండటంతో వీటిని గ్రామాల్లో ఎక్కువగా వాడుతుంటారని, వీటిలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని చెప్తున్నారు. -
సిగరెట్ల రేట్లు ఇక డబుల్!
ప్రపంచంలోకెల్లా ఆస్ట్రేలియాలో సిగరెట్ల ధరలు మండిపోనున్నాయి. ఇప్పటికే అధికధరలున్న ఆస్ట్రేలియాలో మరో నాలుగేళ్లలో 25 సిగరెట్ల ప్యాకెట్ ధర 2,300 రూపాయలకు చేరుకోనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని ఈ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లపాటు, అంటే 2020 వరకు ఏడాదికి 12.5 శాతం పెంచాలని ప్రభుత్వం బడ్జెట్లో నిర్ణయించడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం ఇప్పటికే మెల్బోర్న్లో మార్ల్బోరో సిగరెట్ ప్యాకెట్ను దాదాపు 1270 రూపాయలకు విక్రయిస్తుండగా, సిడ్నీలో 1165 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ సిగరెట్ ప్యాకెట్లను పారిస్లో 524 రూపాయలకు, అట్టావాలో 599 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే, ఆ నగరాలకన్నా రెట్టింపు ధరలకు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇవే సిగరెట్ ప్యాకెట్లను లండన్లో 920, న్యూయార్క్లో 895 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొగాకుపై ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఎక్సైజ్ పన్నును విధించిన దేశం ఆస్ట్రేలియానేనని ఇంపీరియల్ అమెరికా టొబాకో కార్పొరేట్, లీగల్ వ్యవహారాల అధిపతి ఆండ్రీవ్ గ్రెగ్సన్ తెలిపారు. -
గుట్కాసురులు
►గుప్పుమంటున్ననిషేధిత గుట్కా ►కొత్తచెరువు కేంద్రంగావిస్తరిస్తున్న వ్యాపారం ►కర్ణాటక నుంచి పెద్ద ఎత్తునదిగుమతి ►కొరవడిన అధికారుల నిఘా ►ఇదే అదనుగా రెచ్చిపోతున్న మాఫియా మొన్న హిందూపురం.. నిన్న గుంతకల్లు.. నేడు కొత్తచెరువు... రేపు ఎక్కడో..? నిషేధం ముసుగులో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. సరిహద్దులు దాటి అన్ని ప్రాంతాలకు చేరవేస్తోంది. అడ్డొచ్చే అధికారుల నోళ్లను నోట్ల కట్టలతో మూయిస్తోంది. ఇదే అదనుగా కోట్లకు పడగలెత్తుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. జిల్లా వ్యాప్తంగా పట్టుబడుతున్న గుట్కా నిల్వలే అందుకు నిదర్శనం. - కొత్తచెరువు కొత్తచెరువు కేంద్రంగా గుట్కా మాఫియా విస్తరిస్తోంది. కొందరు వ్యాపారులు సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో గుట్కా వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అందులో గుట్కా కింగ్ అవతారమెత్తి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కొత్తచెరువు, తలమర్లకు చెందిన పలువురు వ్యాపారులు పొరుగున ఉన్న కర్ణాటకలోని బాగేపల్లి నుంచి నిత్యం గుట్కా ప్యాకెట్ల నిల్వలను దిగుమతి చేసుకుంటున్నారు. కొత్తచెరువుకు చెందిన ఓ వ్యాపారి సమీప బంధువు బాగేపల్లిలో గుట్కా డీలర్ కావడంతో వారానికి మూడుసార్లు చొప్పున కొత్తచెరువుకు సరుకును దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ఐదేళ్ల కిందటి వరకు అతనొక సాధారణ వ్యాపారి. నాలుగేళ్లలోనే కోట్లకు పడగలెత్తడం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగక విలువైన స్థలాలు కొనుగోలు చేయడాన్ని చూస్తే అతని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతోంది. విజిలెన్స్ అధికారుల దాడితో... కొత్తచెరువులోని ఓ ఇంటిపై విజిలెన్స్ అధికారుల బృందం శుక్రవారం దాడులు నిర్వహించి రూ.1.63 లక్షల విలువ చేసే తొమ్మిది రకాల గుట్కా ప్యాకెట్లతో పాటు రూ.1.50 లక్షల విలువ చేసే సిగరెట్లు, బీడి బండిళ్లు స్వాధీనం చేసుకోవ డం తెలిసిందే. ఈ ఘటనతో కొత్తచెరువులో గుట్కా వ్యా పారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పట్టుబడిన వ్యాపారి ఇంటిపై గతంలోనూ ఒకసారి అధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పట్లో అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై అప్పట్లో చర్చ సాగింది. దాడులు మొక్కుబడే... నిషేధిక గుట్కా నిరంతరం దిగుమతి అవుతున్నా పోలీసులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే దిగుమతిపై దృష్టి సారించడం లేదు. ఎక్కడెక్కడ, ఎవరెవరు గుట్కా వ్యాపారం సాగిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియనిది కాదు. ఇందుకు నిదర్శనం హిందూపురంలోను వన్టౌన్ సీఐ ఈదుర్బాషా ఆధ్వర్యంలో రూ.10 లక్షల విలువ చేసే మట్కా ప్యాకెట్లను పట్టుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. గుంతకల్లులోనూ అధికారులు గతంలో దాడులు నిర్వహించి భారీ ఎత్తున గుట్కా నిల్వలు పట్టుకున్న ఉదంతం అందరికీ గుర్తే. -
కంటైనర్ల కొద్దీ విదేశీ సిగరెట్లు
♦ కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లను తెరిచిన అధికారులు ♦ రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభ్యం ♦ ఇద్దరు స్మగ్లర్లను కోర్టులో హాజరుపర్చిన డీఆర్ఐ విభాగం సాక్షి, ముత్తుకూరు/విజయవాడ బ్యూరో: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మెటిక్స్ బయటపడినట్లు తెలిసింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఓ కంటైనర్లో రహస్యంగా తరలిస్తున్న వివిధ బ్రాండ్ల సిగరెట్లను డైరె క్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 12 రోజుల క్రితం పట్టుకున్న విషయం తెలిసిందే. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి గత నెల 29న కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన నౌకలో ఈ కంటైనర్ను గుర్తించారు. అందులో తనిఖీ చేయగా రూ.9 కోట్ల విలువైన 71.40 లక్షల ఫిల్టర్ సిగరెట్లు బయటపడ్డాయి. సిగరెట్లు, కాస్మెటిక్స్ స్మిగ్లింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను డైరె క్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకొన్నారు. ఆది, సోమవారాల్లో పోర్టులో మళ్లీ విచారించారు. యూఏఈ నుంచి వచ్చిన వాటిలో మరో రెండు కంటైనర్లను 1వ నంబర్ బెర్తు వద్ద తెరచి, తనిఖీలు చేశారు. ఈ రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభించినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరు స్మగ్లర్లను డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) విభాగం అధికారులు హైదరాబాద్లోని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది. యథేచ్ఛగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా *కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా సిగరెట్ల దిగుమతి పెరిగిపోతోంది. *యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, చైనా దేశాల నుంచి 20 కంపెనీలకు చెందిన విదేశీ సిగరెట్లు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి. * దూది పరుపులు, బెడ్షీట్లు, కాటన్ ఉత్పత్తుల పేరిట విదేశాల్లో షిప్పింగ్ బిల్ తయారుచేసి సిగరెట్లను ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు సంబంధించిన పత్రాల్లో పూర్తిగా అవాస్తవాలను పొందుపరిచే స్మగ్లర్లు పరుపులు, బెడ్షీట్ల కింద సిగరెట్ కార్టన్లు(అట్టపెట్టెలు) పెడుతున్నారు. *ఇప్పటివరకూ రాష్ట్రానికి దిగుమతి అయిన విదేశీ సిగరెట్లలో బ్లాక్, రోతమ్స్, డన్హిల్స్ వంటి పదిపైగా బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై తయారీ తేదీలు, చట్టబద్ధ హెచ్చరికలు ఉండవు. * విదేశీ సిగరెట్ బాక్సుపై సిగరెట్ తయారీలో వాడిన ముడిసరుకు వివరాలేవీ ఉండవు. * చెన్నైలో కస్టమ్స్ తనిఖీలు ముమ్మరమైన నేపథ్యంలో సమీపంలోని కృష్ణపట్నం పోర్టును వ్యాపారులు ఎంపిక చేసుకున్నారు. * విదేశీ సిగరెట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించే వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘాపెట్టారు. * 2015 సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలంలో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. * డిసెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి రూ.25 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. * సుంకం చెల్లించకుండా దిగుమతి అవుతున్న విదేశీ సిగరెట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ తెలిపారు. -
సిగరెట్లు తాగినా... ఆ విషయం దాచొద్దు
మల్టీ నేషనల్ కంపనీలో పనిచేసే రమేష్... వారాంతాల్లో పార్టీలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తుంటాడు. తాను రెగ్యులర్గా సిగరెట్లు తాగడు కనక అదేమీ పెద్ద విషయం కాదనుకుని, ఆ వివరాల్ని బీమా పాలసీ తీసుకున్నప్పుడు పేర్కొనలేదు. ఇలా అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చే చాలామంది ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది. కానీ బీమా పాలసీ తీసుకునేటప్పుడు మాత్రం సిగరెట్ కాల్చే అలవాటు గురించి మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు బీమా కంపెనీలు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీన్ని బట్టే మీరు చెల్లించే ప్రీమియాన్ని కూడా నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో టర్మ్ పాలసీలను పోటీ పడి మరీ తక్కువ ప్రీమియంకే అందిస్తుండటంతో కంపెనీలు ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. సిగరెట్ కాల్చేవారు ఆ అలవాటు లేని వారితో పోలిస్తే 1.5 నుంచి 2 రెట్లు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. మూడు రకాలు.. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిని స్మోకర్, నాన్ స్మోకర్, ప్రిఫర్డ్ నాన్ స్మోకర్ అనే మూడు రకాలుగా విభజించి దాని ప్రకారం ప్రీమియంను లెక్కిస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేని వారికి ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. గత మూడేళ్లుగా నికోటిన్ను వినియోగించని వాళ్ళను నాన్ స్మోకర్లుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనలు ఒక్కో కంపెనీకీ ఒకొక్క విధంగా ఉంటాయి. మీరు సిగరెట్లు అప్పుడప్పుడు కాలుస్తున్నా లేక, అలవాటు ఉన్నా.. వీరందరినీ స్మోకర్లుగానే కంపెనీలు భావించి ప్రీమియం నిర్ణయిస్తాయి. అప్పుడప్పుడు అలవాటు ఉన్న వారు కూడా పాలసీ తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని పేర్కొనండి. లేకపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆన్లైన్ టర్మ్ ప్లాన్ తీసుకుంటున్న వారు నాన్ స్మోకర్ అని పేర్కొంటున్న వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. ఇలా అనుమానం వచ్చిన వారి మూత్ర, రక్త పరీక్షలను బీమా కంపెనీలు తీసుకుంటున్నాయి. తర్వాత కూడా చెప్పాలి.. ఈ అలవాట్లు అనేవి ఎప్పుడు మొదలవుతాయో ఎప్పుడు ఆగిపోతాయో చెప్పడం కష్టం. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మొదలైతే ఆ విషయాన్ని బీమా కంపెనీకి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అలా కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మానేస్తే ఆ విషయాన్ని కూడా చెప్పండి. సిగరెట్ మానేసి ఏడాది దాటితే అప్పుడు మిమల్ని నాన్ స్మోకర్గా గుర్తిస్తారు. అప్పుడు మీకు తక్కువ ప్రీమియం రేట్లే వర్తిస్తాయి. ఇలా అలవాట్లు, ఆరోగ్య విషయాలను దాచకుండా వివరిస్తే క్లెయిమ్ల సమయంలో మీపై ఆధారపడిన వారికి ఇబ్బందులు ఉండవు. - మునీష్ షర్దా, ఎండీ,సీఈవో, ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ -
సిగరెట్లూ ఎగిరొస్తున్నాయి
ఇండోనేషియాలో తయారవుతున్న బ్రాండ్లు దుబాయ్ మీదుగా హైదరాబాద్కు రవాణా గత ఏడాది కంటైనర్ల, ఈసారి ఎయిర్కార్గో సిటీకి చెందిన ఘరానా ముఠా వ్యవహారం ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం లోతుగా ఆరా తీస్తున్న డీఆర్ఐ అధికారులు బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన ఓ ముఠా మాత్రం కొన్నాళ్లుగా సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తోంది. సిగరెట్లలో ఏముందిలే... అనుకుంటున్నారా? ఈ గ్యాంగ్ ఏటా రూ.వందల కోట్ల విలువైన వాటిని ‘దిగుమతి’ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతోంది. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గత వారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ కార్గో కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన కేసులో ఈ నిందితుల్ని అరెస్టు చేశారు. ఇదే గ్యాంగ్ గత ఏడాది మూసాపేటలోని ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోలో బయటపడిన కేసులో డీఆర్ఐకే చిక్కింది. ఈ సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా ఆర్థిక నష్టంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటని భావిస్తున్న డీఆర్ఐ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఇండోనేషియా టు సిటీ వయా దుబాయ్... సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో నగరానికి వస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియాలో అయినప్పటికీ అక్కడ నుంచి దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు ఏడాదిన్నర కాలంలో వెలుగులోకి వచ్చిన ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమని, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవు ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోని వెదజల్లుతోంది. ఓసారి ఓడలు, మరోసారి విమానాలు... సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ గత ఏడాది సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకున్నారు. ఈ ఏడాది పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్లోని ఎయిర్కార్గోలో ఉండగా గత నెల 13న దాడి చేసిన డీఆర్ఐ రూ.51 లక్షల వలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు... విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో, ఎయిర్కార్గో కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్లు అవసరం. ఈ నేపథ్యంలో సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్ కస్టమ్స్ హోమ్ ఏజెంట్లు (సీహెచ్ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కట్టింది. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్ కంపెనీల పేర్లతో లెటర్ హెడ్స్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాల వరకు అన్నీ బోగస్వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న డీఆర్ఐ ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది. భారీగా మార్కెట్లోకి వెళ్లాకే... సిగరెట్ల స్మగ్లింగ్లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి డీఆర్ఐ అధికారులకు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తరవాతే గుర్తించగలుగుతోంది. గత ఏడాది ఇన్లాండ్ కంటైనర్ డిపో కేంద్రంగా జరిగిన వ్యవహారాన్ని తీసుకుంటే ఒక్కో కంటైనర్లో 500 సీఎఫ్సీల చొప్పున సిగరెట్లు తీసుకువచ్చిందీ ముఠా. ఒక్కో సీఎఫ్సీలో పది వేల సిగరెట్లు ఉంటాయి. ఈ రకంగా మార్కెట్లోని 50 లక్షల సిగరెట్లు (14 కంటైనర్లు) వెళ్ళిపోయిన తరవాత డీఆర్ఐ గుర్తించి దాడులు చేసింది. డిపోలో ఉన్న రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్ల సిగరెట్లను పట్టుకోగలిగింది. ఎయిర్కార్గోలోనూ డీఆర్ఐకి రూ.51 లక్షల విలువైన సిగరెట్లు దొరకగా... అప్పటికి నెలన్నరలో రూ.90 లక్షల విలువైన కన్సైన్మెంట్లు మార్కెట్లోకి వచ్చేశాయని తేలింది. ఈ రెండు స్మగ్లింగ్స్కూ పాల్పడింది ఒకే ముఠాగా తేలింది. ఆరోగ్యానికీ చేటనే అనుమానం... విదేశీ సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి అధికారులు ఆయా సిగరెట్లు కాలుస్తున్న పొగరాయుళ్ళతోనూ మాట్లాడారు. ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలుతాయని, ఎంజాయ్మెంట్ ఎక్కువని చెప్పారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. -
సిగరెట్టుకు గొలుసుకట్టు
పీఛేముడ్ పొగాకుతో ‘చుట్ట’రికం మనుషులకు శతాబ్దాల కిందటే మొదలైనా, ఇరవయ్యో శతాబ్దంలో ఇది కొత్తపుంతలు తొక్కింది. పొగచుట్టలు నాజూకుదేరి సిగరెట్లుగా రూపాంతరం చెందాయి. ఇవి నవనాగరికతకు నిదర్శనాలుగా మారాయి. మన దేశంలో ఇంకా పొడవాటి లంక పొగాకు చుట్టలు రాజ్యమేలుతున్న కాలంలో పడమటి దేశాల్లో సిగరెట్ల ఫ్యాషన్ మొదలైంది. ఆడా మగా తేడా లేకుండా వాటిని ఊది పారేసేవారు. మరీ విచిత్రంగా అప్పటి వైద్యులు కూడా పొగతాగడం వల్ల చాలా జబ్బులు నయమవుతాయని చెప్పేవారు. సిగరెట్ తయారీ కంపెనీలు డాక్టర్ల సిఫారసులతో కూడిన ప్రకటనలు గుప్పించేవి. ఫలితంగా ఆ కాలంలో పడమటి ప్రపంచంలో మెజారిటీ జనాభాకు పొగ పీల్చనిదే ఊపిరాడని పరిస్థితి దాపురించింది. కొందరు పొగరాయుళ్లు ఒక సిగరెట్టుతో తృప్తి పడేవారు కాదు. ఒకటి వెంట మరొకటి... వెనువెంటనే ముట్టించేవారు. వాళ్ల శ్వేతకాష్టదహన క్రతువుకు నిద్రపోయే సమయంలో మాత్రమే విరామం దొరికేది. అలాంటి పరిస్థితుల్లో గొలుసుకట్టు పొగరాయుళ్ల కోసం ఒక సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక ప్యాకెట్ సిగరెట్లను ఏకకాలంలో అందులో ఒకటొకటిగా దట్టించి, ముట్టించి ధూమమేఘాలను సృష్టించే పరికరం అరచేతుల్లోకి చేరింది. ఆ పరికరమే ఈ ఫొటోలో కనిపిస్తున్న సిగరెట్ హోల్డర్. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రచారం మొదలవడంతో ఈ పరికరం ప్రాచుర్యం పొందక ముందే అంతరించింది. -
డెయిరీ మార్కెట్లోకి ఐటీసీ!
ముంబై: సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రాడక్ట్ను మార్కెట్లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు, వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డెయిరీ ప్రొడక్షన్ విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. రానున్న కాలంలో ఐటీసీ ఫుడ్ ప్రాడక్ట్స్పై రూ.25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుందని తెలిపారు. -
మూడు లక్షల ఫారిన్ సిగరెట్లు బ్యాన్
చెన్నై: మూడు లక్షలకు పైగా విదేశీ సిగరెట్లను దొంగరవాణా చేసేందుకు ప్రయత్నిస్తుండగా తమిళనాడులో అధికారులు బ్యాన్ చేశారు. వీటి విలువ దాదాపు రూ32.70 లక్షలు. ఆదివారం ఆరుగురు ప్రయాణీకులు షార్జా నుంచి కోయంబత్తూరుకు విమానం ద్వారా చేరుకున్నారు. వీరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద దాదాపు లక్ష ఫారిన్ బ్రాండెడ్ సిగరెట్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు విస్తు పోయారు. అరేబియా ప్లైట్ ద్వారా వచ్చిన వీరు ఆరుగురు కూడా మాములుగా వెళ్లే తనిఖీ మార్గం ద్వారా కాకుండా గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించడమే కాకుండా తమ వద్ద ఏమీ లేవంటూ అబద్ధం చెప్పబోయారు. వీరిపై కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటానికి కారణాలేమిటీ, దీని వెనుక ఎవరెవరున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు. -
సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య
నాసిక్: సిగరెట్లు తీసుకొనిరావడానికి నిరాకరించాడనే కోపంతో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలుడిని కిరాతంగా చంపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఘటన జరిగింది. ప్లంబర్ శాలిగ్రామ్ ఫిర్యాదు మేరకు ఆయన కొడుకు గోలు అలియాస్ విశాల్ భలేరావు సిగరెట్లు తీసుకురానందుకు ఇటీవల ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఈ చిన్న కారణంతోనే నిందితులు కక్షకట్టి బాలుడ్ని హత్య చేశారు. అర్ధనగ్నంగా ఉన్న గోలు మృతదేహాన్ని ఆదివారం గుర్తించి పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టమ్ నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు. -
ముట్టిస్తే... మూతి కాలుతుంది!
సిగరెట్ ప్రియులపై వ్యాట్ పోటు సాక్షి, హైదరాబాద్: భోజనం చేశాం... సరదాగా ఒక దమ్ము కొడదామని అనుకుంటున్నారా? అయితే మీ జేబులను ఒక సారి సరి చూసుకోండి. లేకపోతే గుల్ల కాక తప్పదు. ఎందుకంటే రాష్ర్ట్ర ప్రభుత్వం సిగరెట్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను 10 శాతం పెంచేసింది. ఇప్పటికే ఉన్న 20 శాతానికి ఇది అదనం. అంటే ఇప్పటి నుంచి 30 శాతం అన్నమాట గురూ.. సిగరెట్ల తయారీకి అవసరమైన పొగాకు పండించే రైతుకు సరైన ధర ఇవ్వరు గానీ, దానితో తయారు చేసే సిగరెట్లపై పన్నులు పెంచేస్తారు.. అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం. ప్రభుత్వానికి తన రోజు వారీ ఖర్చులకూ డబ్బులు లేవంట. బాబు గారు సింగపూర్, జపాన్, చైనా వెళ్లడానికి విమాన ఖర్చులకూ అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందంట. -
రోజూ ఓ ఫుల్లేస్కో.. 60 సిగరెట్లు తాగు.. ఏంకాదు
న్యూఢిల్లీ: ఓ పక్క ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకు స్వచ్ఛ భారత్ అంటూ తమ అధినేత, ప్రధాని నరేంద్రమోదీ వరుసగా స్పీచ్లు ఇస్తుండగా వాటన్నింటిని ఖాతరు చేయకుండా బీజేపీ నేతలు మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. పొగ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని, క్యాన్సర్ సోకదంటూ చెప్తోన్న బీజేపీ నేతల పక్కన తాజాగా మరో నేత చేరాడు. 'రోజూ ఫుల్ బాటిల్ ఆల్కహాల్, 60 సిగరెట్లు తాగే వ్యక్తులు నాకు తెలుసు. వాళ్లలో ఓ వ్యక్తి 86 ఏళ్లకు చనిపోయాడు. మరొకరు ఇప్పటికీ బతికి ఉన్నాడు. పొగతాగడం వల్ల క్యాన్సర్ వస్తుందనే వాళ్లంతా ఈ విషయాన్ని గమనించాలి' అంటూ అసోంకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొగ తాగడంవల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం అసలు చర్చించదగిన అంశమే కాదంటూ కొత్తగా సూచించారు. దీంతో పొగాకు ఉత్పత్తుకు మద్దతు తెలిపేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల్లో శర్మ మూడో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు, ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వీరు ముగ్గురు కూడా పొగ తాగడాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులే కావడం గమనార్హం. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక చిహ్నాలను ముద్రిస్తూ ప్రచారం నిర్వహించే కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా వీరి సమీక్ష ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికే, సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మరుసటి రోజే డయాబెటిస్ వస్తుందని చక్కెరను నిషేధిస్తామా అంటూ బీజేపీకే చెందిన శ్యాం చరణ్ గుప్తా కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. -
సిగరెట్లతో కేన్సర్ రాదంట!
న్యూఢిల్లీ: సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా హెచ్చరిక చిహ్నాలు 85శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బీజేపీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెట్టింది. సదరు ఎంపీ,పొగాకు ఉత్పత్తుల చట్టం-2003పై వేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు కూడా. ‘పొగాకుతో కేన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధనా తేల్చలేదు. పరిశోధనలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్లమంది పనిచేస్తున్నారు’ అని దిలీప్ మంగళవారం అన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై నిషేధం
త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్న సీఎం ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినిమయంపై త్వరలోనే నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ల వాడకం వల్ల ఆ ఒక్క వ్యక్తి మాత్రమే రోగాల బారిన పడబోరని, అతని కుటుంబమంతా నష్టపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకంపై త్వరలోనే నిషేధం విధిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్యాన్సర్ సంభావ్యత 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అందువల్ల క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో పొగాకు, పాన్ మసాలాల అమ్మకాలు బాగా పెరిగినట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల హోం శా, విద్యా విభాగం సహకారంతో వాటి అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. పొగాకు ఉత్పత్తులపై పంజాబ్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందని అన్నారు. అయితే ఆ పన్నుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో మాత్రం స్పష్టం కాలేదన్నారు. ఏదైనా మంచి ఫలితం ఉంటే ఆ విధానాన్ని తాము కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఫడ్నవీస్ చెప్పారు. -
పెరుగుతున్న నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం
సిగరెట్ల మీద పన్నులపై ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ న్యూఢిల్లీ: సిగరెట్లపై ఎంత ఎక్కువగా పన్నులు విధిస్తే.. నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం అంత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ హెచ్చరించారు. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు భారతీయ బ్రాండ్కి అపార నష్టం కూడా వాటిల్లుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాబోయే బడ్జెట్లో సిగరెట్లపై పన్నులు ఒక మోస్తరు స్థాయిలోనే ఉంచగలరని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మకాలు ఒక మోస్తరుగా మాత్రమే పెరగడానికి.. ఇటు ఎక్సైజ్ సుంకాలు, అటు విలువ ఆధారిత పన్నులు పెరగడం కారణం అవుతున్నాయని దేవేశ్వర్ పేర్కొన్నారు. ఈ చర్య.. చట్టబద్ధమైన సిగరెట్ల వ్యాపార పరిశ్రమ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మొత్తం పొగాకు పరిశ్రమ ఆదాయ అవకాశాలను కూడా దెబ్బతీస్తోందని ఆయన వివరించారు. -
విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం
ప్రతిపాదించిన ప్రభుత్వం ఇక ప్యాకెట్లే అమ్ముతారు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానానికి జరిమానా ఐదింతలు న్యూఢిల్లీ: ధూమపానాన్ని నిరుత్సాహపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించనుంది. పొగతాగే అలవాటున్న వారు ఇకపై దమ్ము కొట్టాలంటే ప్యాకెట్ కొనాల్సిందే. సింగిల్ టీ తాగి ఒక సిగరెట్టు అంటించి వద్దామంటే కుదరదు. 18 ఏళ్లకు పైబడిన వారికే పొగాకు ఉత్పత్తులు అమ్మాలనే నిబంధన ఉంది. ఈ పరిమితి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని భవిష్యత్తులో 23 ఏళ్లకు, తర్వాతి దశలో 25 ఏళ్లకు పెంచుతారు. పొగాకు ఉత్పత్తుల మూలంగా వాటిల్లే ముప్పు నుంచి భావి తరాలను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (సవరణ) బిల్లు - 2015 ముసాయిదాను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. చట్ట సవరణ కోసం వేసిన కమిటీ సిఫారసులపై గతంలో పొగాకు రైతు సంఘాలు, సిగరెట్ పరిశ్రమ లాబీల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. దాంతో చట్ట సవరణకు కేంద్రం వెనుకాడుతోందనే వార్తలు వచ్చాయి. అయితే మోదీ సర్కారు మాత్రం ప్రజారోగ్యానికే పెద్దపీట వేసింది. బిల్లులో కీలక సవరణలు ప్రతిపాదించింది. పొగాకు ఉత్పత్తి సంస్థలు దొడ్డిదారిన తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.ఈ రంగంలోని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత పేరుతో కార్యక్రమాలు చేపట్టి దొడ్డిదారిన ప్రచారం పొందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లులోని కీలక సిఫారసులు... # సిగరెట్లను ప్యాకెట్గానే అమ్మాలి. విడి అమ్మకాలపై నిషేధం # సిగరెట్లను 18 ఏళ్ల పైబడిన వారికే అమ్మాలనేది నిబంధన. ఇప్పుడీ వయోపరిమితి 21 ఏళ్లకు పెంపు. # బహిరంగ ప్రదేశాల్లో ధూమపానానికి జరిమానా రూ.200 నుంచి రూ. 1,000కి పెంపు # హోటళ్లు, రెస్టారెంట్లలో స్మోకింగ్ జోన్ల ఎత్తివేత. # పొగాకు సాగులో, శుద్ధి ప్రక్రియలో, పొగాకు ఉత్పత్తుల అమ్మకాల్లో 18 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకోకూడదు. # ఉల్లంఘనలకు గరిష్ఠ జరిమానా పది వేల నుంచి లక్ష రూపాయలకు పెంపు # ఉల్లంఘనల కేసులను విచారించడానికి ప్రత్యేక సెషన్స్ కోర్టులు ఏర్పాటు. # చట్టం అమలును పర్యవేక్షించడానికి స్వయంప్రతిపత్తి కలిగిన ’జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ’ ఏర్పాటు. # పొగాకు ఉత్పత్తులపై, ప్రకటనలపై పలు మాధ్యమాల్లో నిషేధం ఉంది. ఈ నిషేధం పరిధిలోకి తాజాగా మొబైల్, ఇంటర్నెట్లను కూడా చేర్చారు. -
మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మాజీ కస్టమ్స్ కమిషనర్ కుమార్ లేఖ రాశారు. విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఆయన గురువారం మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు 2008లో క్యాన్సర్ సోకినట్లు గుర్తించారని, తన స్వరపేటికతో పాటు నాలుకను కూడా సగం తొలగించారని కుమార్ తన లేఖలో కోరారు. క్యాన్సర్ వల్ల ఆహారం తీసుకోవడం, మాట్లాడం తనకు ఇప్పుడు అతి పెద్ద సవాల్గా మారిందని, మరో వ్యక్తికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే విడిగా సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కుమార్ లేఖలో పేర్కొన్నారు. -
సిగరెట్ కావాలంటే.. ప్యాకెట్ కొనాల్సిందే!
పొగాకు కంపెనీల షేర్లన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి కారణం.. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. సిగరెట్లను లూజుగా ఒకటి, రెండు చొప్పున అమ్మకూడదని, ఎవరైనా కావాలంటే మొత్తం ప్యాకెట్ కొనాల్సిందేనని కేంద్రం చెప్పింది. ఈ మేరకు ఓ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను కొనడానికి ఇన్నాళ్లూ ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పెంచాలని కూడా నిపుణుల కమిటీ సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం కింద కఠినమైన శిక్షలు వేయాలని తెలిపింది. నిపుణుల కమిటీ సూచనలు, ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వీటికి పార్లమెంటు ఆమోదం తెలిపితే ఇక వెంటనే అమలవుతాయి. ప్రస్తుతం దాదాపు 70 శాతం సిగరెట్ అమ్మకాలన్నీ లూజు సేల్స్లోనే జరుగుతున్నాయి. ప్యాకెట్ కొనాలంటే దాదాపు రూ. 190 వరకు ఉండటంతో అంత భరించలేక.. తమకు కావల్సిన రెండు మూడు సిగరెట్లు కొంటారు. ఇప్పుడు కేంద్రం తన ఆలోచనను అమలుచేస్తే.. ఎంత లేదన్నా 10-20 శాతం వరకు సిగరెట్ల అమ్మకాలు పడిపోతాయని అంచనా. సిగరెట్ పరిశ్రమ నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి ఏటా రూ. 25వేల కోట్లు వస్తుంది. కానీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వదులుకోడానికీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. 2012 సంవత్సరంలో భారతీయులు 10 వేల కోట్ల సిగరెట్లు తగలబెట్టారు. -
మందు, సిగరెట్లపై ప్రత్యేక పన్ను
ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త పన్నులు విధిస్తోంది. ప్రతి ప్యాకెట్ సిగరెట్ల మీద, ప్రతి బాటిల్ మందు మీద ఒక్కో రూపాయి చొప్పున పట్టణ రవాణా నిధి కోసం పన్ను విధించాలని భావిస్తున్నారు. వాయుకాలుష్యంపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ మేరకు ప్రతిపాదించింది. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. ఈ పన్ను త్వరలోనే మొదలవుతుంది. ప్రతి ఒక్క వాహనానికీ తప్పనిసరిగా పీయూసీ స్టిక్కర్ ఉండి తీరాలని ట్రాఫిక్ పోలీసులు నిబంధన విధించారు. ఇలాంటి స్టిక్కర్లు లేనందుకు జనవరి 1 ఉంచి సెప్టెంబర్ 5 వరకు 24వేల మందికి చలాన్లు రాశారు. అలాగే, అనుమతి లేని చోట్ల పార్కింగ్ చేసినా కూడా ఇకమీదట కఠిన చర్యలు తప్పవు. రద్దీ రోడ్ల మీద ఎక్కువ పార్కింగ్ రుసుము, మామూలు రోడ్ల మీద కాస్త తక్కువ రుసుము వసూలు చేయాలని కూడా ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. -
పొగరాయుళ్లపై సర్కారు కొరడా!!
పొగరాయుళ్లకు చెక్ పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. ఇటీవలి బడ్జెట్లోనే సిగరెట్ల ధరలను ఒక మాదిరిగా పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు బహిరంగంగా పొగ తాగడంపైన, లూజుగా సిగరెట్లు కొనడం, అమ్మడంపైన కూడా నిషేధం విధించాలని... వీటిని ఉల్లంఘిస్తే భారీ స్థాయిలో జరిమానాలు వేయాలని కూడా తలపెడుతోంది. ఇది ఐటీసీ లాంటి సిగరెట్ కంపెనీల మీద భారీగానే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే.. మన దేశంలో చాలా వరకు సిగరెట్ల అమ్మకాలు ఇలా లూజ్గానే జరుగుతాయి. ప్యాకెట్లు కొనుక్కుని కాల్చేవాళ్లు తక్కువ. విడిగా రెండు లేదా మూడేసి చొప్పున సిగరెట్లు తీసుకుని ఏపూటకాపూట కాల్చేసేవాళ్ల సంఖ్యే ఎక్కువట. మొత్తం సిగరెట్ల అమ్మకాల్లో 70 శాతం వరకు ఇలాగే జరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచనల మేరకే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్లు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే కనిష్ఠంగా రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 20 వేల వరకు కూడా జరిమానా విధించే విషయాన్ని కేంద్రం పరిగణిస్తోంది. అలాగే, సిగరెట్ తాగడానికి కనీస వయసును కూడా పెంచాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం వచ్చిందంటే మాత్రం.. ఇక పొగరాయుళ్ల పరిస్థితి అంతేనంటున్నారు. అంతేకాదు.. సిగరెట్ ప్యాకెట్ల మీద బొమ్మతో సహా చట్టబద్ధమైన హెచ్చరికలను ముద్రించకపోతే ఇన్నాళ్లూ కేవలం రూ. 5 వేల జరిమానా మాత్రమే విధిస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ. 50 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. అలాగే సిగరెట్లు కాల్చడానికి, కొనడానికి ఇప్పటివరకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు ఉండగా దాన్ని 25 ఏళ్లు చేయాలనుకుంటోంది. -
పొగరాయుళ్ల జేబుకు చిల్లు
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ల మీద ప్రస్తుతమున్న 11 శాతం పన్నును ఒకేసారి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాలు.. వీటన్నింటి ధరలు అత్యంత భారీగా పెరగబోతున్నాయి. సిగరెట్ల మీద ధరలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఆర్థిక మంత్రిని కోరింది. అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఈ చర్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు కూల్ డ్రింకులు, సోడాల మీద కూడా పన్నును పెంచారు. దేశంలో కేన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు.. ప్రధానంగా పొగతాగేవాళ్లకే కేన్సర్, గుండెజబ్బుల లాంటివి వస్తున్నాయని వైద్యవర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయినా పట్టణ, గ్రామీణ భారతాల్లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా యువత వీటిపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్నారు. ఆర్థికమంత్రి మోగించిన మోతతో.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా వీటి వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. -
అమెరికా యువతకూ హుక్కా జబ్బు!
అమెరికాలో సిగరెట్ల వాడకం ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. అయితే.. అందుకు సంతోషించాలో, హుక్కా వాడకం పెరుగుతున్నందుకు ఏడవాలో అర్థం కావట్లేదు. ఆ దేశంలో ఇప్పుడు చాలామంది హైస్కూలు పిల్లలు హుక్కా, చుట్టలు, పొగరాని పొగాకు ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెంచేశారట. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల దీనిపై ఓ నివేదిక వెల్లడించింది. హైస్కూళ్లలో ఉన్న సీనియర్ పిల్లల్లో ప్రతి ఐదుగురిలో కనీసం ఒకరు హుక్కా పీలుస్తున్నారని అందులో తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా కాస్త ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా వీటిబారిన పడుతున్నారని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జోసెఫ్ జె. పలమార్ తెలిపారు. అలాగే, బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నవాళ్లు కూడా హుక్కాలు తెగ పీలుస్తున్నారట. నగరాలు.. అందునా పెద్ద నగరాల్లో హుక్కా కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం అమెరికాలోని 48 రాష్ట్రాల్లో గల 130 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హుక్కా అలవాటుపై సర్వే చేశారు. గతంతో పోలిస్తే, దీని వాడకం అమెరికాలో 123 శాతం పెరిగిందట!! -
ఆ పొగాకు ప్రకటనల వల్ల ఉపయోగం లేదు!
న్యూఢిల్లీ:క్యాన్సర్ కారకమైన పొగాకు నియంత్రణపై ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటివల్ల పెద్ద ఉపయోగం చేకూరలేదని దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియదర్శన్ అభిప్రాయపడ్డారు. గత రెండు సంవత్సరాల నుంచి సినిమా థియేటర్లలో 30 సెకన్ల టొబాకో నియంత్రణ ప్రకటనలు ఇస్తున్నా.. ఇప్పటివరకూ దానివల్ల ప్రయోజనం మాత్రం శూన్యంగా మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రకటనలతో రాబోవు తరానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నా.. పొగాకు బారినుంచి ప్రజలను రక్షించాలంటే సిగరెట్ల అమ్మకాన్ని మొత్తంగా నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. పొగాకు నియంత్రణపై సినిమా ప్రకటనల ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆలోచించిన..దానికి అనుగుణంగా థియేటర్లలో ప్రకటనలను ప్రవేశపెట్టారు. అనంతర అనేక ప్రకటనలను థియేటరల్లో ప్రవేశపెడుతున్నా వాటి వల్ల ప్రయోజనం మాత్రం నామమాత్రంగానే మిగిలిపోతోంది. -
ఆ సిగరెట్లే యువకులను ఆకర్షిస్తున్నాయ్!
సిగరెట్లు తాగడమంటే యువకుల్లో అదో రకమైన జోష్ ఉంటుంది. సిగరెట్టు తాగడంలో స్టైల్ ను అనుకరించడానికి మెంథాల్ సిగరెట్లతో ఆరంభించి రెగ్యులర్ సిగరెట్లకు షిఫ్ట్ కావడం సహజంగా అలవాటుగా మారడం చూస్తునే ఉంటాం. రెగ్యులర్ సిగరెట్ల కంటే తక్కువ హానికరమనే అభిప్రాయం యువకుల్లో ఉంటుందని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటి నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఓ రకమైన ఘాటు ఉండే మెంథాల్ సిగరెట్లు.. రెగ్యులర్ సిగరెట్ల కంటే ప్రమాదకరమని పరిశోధనలో తెలిసింది. మెంథాల్ సిగరెట్లు తాగే యువకులు ఎక్కువ కాలం తాగేందుకే మొగ్గు చూపుతున్నారని.. ఆ సిగరెట్లు అతిగా పొగతాగేందుకు దారి తీస్తోందని పరిశోధకులు తెలిపారు. అదనపు రుచి చేర్చే బ్రాండెడ్ సిగరెట్లు నిషేధానికి కొత్త చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. Follow @sakshinews -
సిగరెట్ ప్యాకెట్.. మరింత ఖరీదు!!
దేశంలో పెరిగిపోతున్న సిగరెట్ల వాడకాన్ని తగ్గించేందుకు.. ఈసారి బడ్జెట్లో సిగరెట్ల మీద పన్నులు భారీగా వడ్డించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సిగరెట్ల పొడవుతో సంబంధం లేకుండా.. ఒక్కో సిగరెట్ మీద కనీసం రూ. 3.50 చొప్పున పెంచాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరుతోంది. అలాగే, బీడీల మీద ఇన్నాళ్ల నుంచి ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేయాలని కూడా ఆరోగ్యశాఖ కోరింది. రోజుకు 20 లక్షల కంటే తక్కువ బీడీలు ఉత్పత్తి చేసేవారికి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవాలని, వాటి మీద కూడా పన్ను విధానాన్ని సవరించాలని, ఎవరూ పన్ను ఎగవేయకుండా పటిష్ఠంగా చూడాలని ఆరోగ్యశాఖ కోరింది. జూలై 11వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి అన్ని అంశాలపై ఆర్థిక శాఖకు వివిధ ప్రతిపాదనలు వస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జరుగుతాయి. -
పండ్ల మీద పన్ను..
కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా పన్నుల మోతకు ఎవరూ అతీతం కాదు. ఆదాయపు పన్ను కావొచ్చు లేదా అమ్మకం పన్ను కావొచ్చు.. ప్రాపర్టీ ట్యాక్సు కావొచ్చు ఏదో ఒక రూపంలో వడ్డన ఉంటూనే ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని చిత్ర విచిత్ర పన్నులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని.. వెండింగ్ మెషీన్ ఫ్రూట్ ట్యాక్స్.. తాజా పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో వెండింగ్ మెషీన్ల నుంచి కొంటే మాత్రం పర్సుకు చేటు చేస్తాయి. ఎందుకంటే.. మెషీన్ల నుంచి తాజా ఫలాలపై కాలిఫోర్నియాలో 33% పన్ను వడ్డిస్తారట. అమెరికాలో టాప్ 10 అసాధారణ పన్నుల్లో ఇది చోటు దక్కించుకుంది. సిగరెట్ల మోత.. సిగరెట్ల మీద భారీ ట్యాక్స్లతో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, చైనాలోని హుబై ప్రావిన్స్ మరో అడుగు ముందుకెళ్లింది. ప్రజలు మరింత ఎక్కువగా సిగరెట్లు తాగేలా ప్రోత్సహించి.. తద్వారా మరింత పన్నులను రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. సంక్షోభాల నుంచి ఎకానమీ సురక్షితంగా ఉండాలంటే అధికారులు ఏటా 400 కార్టన్ల సిగరెట్లు ఊదిపారేయాలంటూ 2009లో హుబై ప్రావిన్స్లోని ఒక గ్రామం ఆదేశించింది. టీచర్లకు కూడా స్మోకింగ్ కోటా విధించింది. టార్గెట్లు అందుకోకపోయినా.. పక్క రాష్ట్రాల కంపెనీల సిగరెట్లు తాగుతూ పట్టుబడినా జరిమానాలతో వాతలు పెట్టింది. టాటూలపై ట్యాక్స్ అమెరికాలోని ఆర్కాన్సాస్ ప్రభుత్వం 2005లో టాటూలపైనా ట్యాక్స్ విధించి ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రోలసిస్ ట్రీట్మెంట్ను కూడా ఇందులోకి చేర్చింది. -
ఐటీసీ
బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.325 టార్గెట్ ధర: రూ.382 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం రూ.2,385 కోట్లకు పెరిగింది. ఇక నికర అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ.8,623 కోట్లకు పెరిగాయి. సిగరెట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల పెంపు కారణంగా సిగరెట్ల వ్యాపారం 13 శాతం వృద్ధి చెంది రూ.4,116 కోట్లకు పెరిగింది. ఆశీర్వాద్, సన్ఫీస్ట్ తదితర బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఎఫ్ఎంసీజీ వ్యాపారం 17% వృద్ధితో రూ.2,078 కోట్లకు పెరిగింది. అగ్రి బిజినెస్ 10 శాతం, పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ విభాగం 19 శాతం వృద్ధి చెందగా హోటళ్ల వ్యాపారం ఫ్లాట్గా ఉంది. ఏడాది కాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం, నికర లాభం 17 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్కు 25 రెట్ల ధరలో ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సిగరెట్ల వ్యాపారంలో మార్కెట్ లీడర్ అయినప్పటికీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్ తదితర సెగ్మంట్లలో అమ్మకాలు జోరుగా ఉన్నాయి. -
21 ఏళ్లలోపు వారికి సిగరెట్ల అమ్మకంపై నిషేధం
ధూమపానాన్ని నియంత్రించేందుకు న్యూయార్క్ నగర కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. 21 ఏళ్ల లోపు వయసు వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా నిషేధం విధించింది. న్యూయార్క్ నగర కౌన్సిల్ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. యువత ప్రాణాంతక కేన్సర్ వ్యాధిబారిన పడకుండా ఉండేందుకుగాను అమెరికాలో పొగాకు ఉత్పత్తుల అమ్మకంపై కఠిన చట్టాలున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మరాదు. కొన్ని రాష్ట్రాలు ఈ వయో పరిమితిని పెంచాయి. కొన్ని రాష్ట్రాల్లో 19 ఏళ్ల వయసు లోపు వారికి అమ్మరాదనే నిబంధన ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో 21 ఏళ్ల వరకు వయోపరిమితి నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీని వల్ల పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గంచవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా 18-20 ఏళ్ల వయసు వారే సిగరెట్ కాల్చే అలవాటు నేర్చుకుంటారని తెలిపారు. ఈ వయసులో వారిని కట్టడి చేస్తే ఆ తర్వాత ధూమపానం వ్యాపకంగా మారే అవకాశాలు తక్కువని వెల్లడించారు.