Denduluru
-
రెడ్బుక్ దౌర్జన్యకాండ.. అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. -
ఏపీలో దౌర్జన్యకాండ.. రెడ్బుక్ రాజ్యాంగానికి ఖాకీల సెల్యూట్!
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికార మదంతో అక్రమ కేసులు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెండు రోజుల క్రితమే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు చింతమనేని. తాజాగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.చింతమనేని గన్ మ్యాన్ వద్ద గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కట్టుకథలతో చింతమనేని ఫిర్యాదు చేయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చింతమనేని దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేసి తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు ఏంటో చెప్పకుండా హైదరాబాద్ వరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కార్ తమకు చట్టం, న్యాయం, రాజ్యాంగాలతో పనిలేదని రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు సామాన్యుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
కూటమి నేతల ఆక్రమ దందా
-
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
చింతమనేని హుకుం.. దెందులూరు టీడీపీ, జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
దెందులూరులో పరాకాష్టకు చేరిన ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన చింతమనేని అరాచకాలు
-
జనసేన నేతలపై చింతమనేని అనుచరుల ఎటాక్
-
ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..నా మనవరాలిని కాపాడండి..
-
అర్ధరాత్రి రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు
-
దెందులూరులో టీడీపీ ఖాళీ..
-
నేను ఒంటరి కాదు..నా బలం మీరే
-
దెందులూరులో సిద్ధం సభ సూపర్ సక్సెస్
-
సీఎం జగన్ సిద్ధం సభకు జన ప్రవాహం
-
సామాన్యుడిలా కార్యకర్తల మధ్యలో పేర్నినాని
-
దెందూలూరు సిద్ధం సభపై సీఎం జగన్ ట్వీట్
-
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా..?
-
నాకు జీవితాన్ని ఇచ్చిన జగన్ కోసం జీవితాంతం నిలబడతా..!
-
మాటల తూటాలతో కార్యకర్తల రక్తం ఉరకలెత్తించిన జగన్
-
ప్రజలు బటన్ నొక్కితే శాశ్వతంగా చంద్రగ్రహణం మాయం
-
నాకున్న సైన్యం, బలం..దేవుడు, ప్రజలే: సీఎం జగన్
-
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం
సాక్షి, భీమవరం: ‘రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే.. జగన్ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు. కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే. – వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఇక వార్ వన్ సైడే ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్మెంట్ పేరు కూడా జగన్. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్ వన్ సైడే. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ నమ్మకానికి మారుపేరు జగన్మోహన్రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. – కేశినేని నాని, ఎంపీ జనం హృదయాల్లో జగన్ సుస్థిర స్థానం పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచి్చన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే అబద్ధం అంటే చంద్రబాబు... జగన్ అంటే నిజం... ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యూడీíÙయరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్ అనే బొండి ఇసుకతో, పవన్ కళ్యాణ్ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిరి్మంచిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. పేదవాడికి ఇంగ్లిష్ విద్య అందిస్తుంటే ఈ అబద్దపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్ అయితే, వైఎస్సార్సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి జగనన్న పిలుపే ఒక ప్రభంజనం సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచి్చంది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి -
జగన్ ప్రభం‘జనం’
సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు. ‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు. పోటెత్తిన యువత సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు. -
జగన్ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం
ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం జగనన్న మేలు మరువలేం సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం జగనన్నకే మా మద్దతు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు. – ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం రైతులను ఆదుకుంటున్నారు గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. – జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు ప్రతిపక్షాల మాటలు నమ్మం జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం నమ్మకానికి ప్రతీక జగన్ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు. – ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ సీఎం జగన్కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా నూతన ఒరవడి సృష్టించారు వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం ఇంతకన్నా మార్పు ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా నేరుగా నగదు బదిలీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వారధిగా ప్రణాళిక ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం -
ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు. పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంత కంటే లేదని చెప్పారు. ‘మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ♦ రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా ‘రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కు.. అసలు ఈ స్టేట్తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నా¯Œన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ♦ ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్గా, పేద వాడి సంక్షేమం టార్గెట్గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం ♦ కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం. ♦ గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది. ♦ పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం. ♦ ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ♦ వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి. ♦ ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. -
అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ
-
సీఎం జగన్ తో సెల్ఫీ
-
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా..?
-
చంద్రబాబు,పవన్ కి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
దిశ యాప్ తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం
-
మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది
-
పేదపిల్లలకు మంచి విద్య ఇస్తే, ప్రతి ఇంటి భవిష్యత్తు మారుతుంది
-
జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు..నా ధైర్యం మీరు
-
దెందులూరు బహిరంగ సభలో కేశినేని నాని
-
సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్
-
సీఎం జగన్ దెందులూరు సిద్దం సభ ఎక్సక్లూజివ్ డ్రోన్ విజువల్స్
-
పేర్ని కిట్టును ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
-
సిద్ధం సభలో బాబు,కొడుకును ఆటాడుకున్న కేశినేని నాని
-
ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా: సీఎం జగన్
-
సిద్ధం సభను దిగ్విజయం చేస్తాం: అబ్బయ్య చౌదరి
-
జగనన్న జనసంద్రం చూస్తే సునామీనైనా ఆపొచ్చు అనిపిస్తుంది
-
వచ్చి రాగానే జగన్ ఏం చేశారో చూడండి
-
పని పాట లేకుండా తిరిగేవాడ్ని... కానీ సీఎం జగన్ వచ్చాక
-
జన సునామీగా మారిన సీఎం జగన్ సిద్ధం సభ
-
ప్రతిపక్షాలు సీఎం జగను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి: ఆళ్ల నాని
-
వైఎస్ జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధే మరోసారి సీఎం చేస్తాయి: మహిళలు
-
భీమిలి సభ సూపర్ సక్సెస్ తో కదం తొక్కుతున్న శ్రేణులు
-
ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తరలివస్తున్న శ్రేణులు
-
దెందులూరు సిద్దం సభలో సీఎం జగన్ కాన్వాయ్ దృశ్యాలు
-
సిద్ధం సభ: బస్సు నడిపిన మాజీ మంత్రి పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సిద్ధం సభకు బస్సుల్లో కదిలారు. కార్యకర్తలతో కలిసి కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు బస్సులో దెందులూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు. ఇదీ చదవండి: YSRCP: సరికొత్త సామాజిక విప్లవం.. -
సిద్ధం సభను దిగ్విజయం చేస్తాం: అబ్బయ్య చౌదరి
-
సీఎం జగన్ సభకు సర్వం సిద్ధం!
-
Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
UPDATES: 05:47 PM, Feb 3, 2024 దెందులూరు వైఎస్సార్సీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్ 05:14 PM, Feb 3, 2024 ముగిసిన సిద్ధం బహిరంగ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు 04:14 PM, Feb 3, 2024 సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్ ►ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా ►దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా ►పేదల భవిష్యత్ను కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా ►రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ►ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు ►కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు ►జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ►కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం ►నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్ ►జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాదు ►నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే ►నాకున్న నమ్మకం మీరే ►వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని ►దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే ►రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది ►రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది ►మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది ►పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు ►గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది. ►అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం ►అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం ►175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం ►నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా ►చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి ►పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి ►చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి ►కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి ►గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ►ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్ అని చెప్పండి ►ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం ►అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం ►డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా ►కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం ►4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం ►అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ►మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా ►దిశ యాప్తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం ►రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం ►కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం ►మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ►అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి ►వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్ను నిర్ణయించేవి ►ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే ►3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి ►ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి ►చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది ►ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు ►జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ►పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి ►రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి ►పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం.. ►రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం ►మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ►ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు ►ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు ►చంద్రబాబు అండ్ కో.. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ►175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు ►చంద్రబాబు అండ్కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ►చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం ►దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి ►ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ 04:10 PM, Feb 3, 2024 దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్ అభివాదం సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి ఎటుచూసిన వైఎస్సార్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్ సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్సైడే పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం 03:56 PM, Feb 3, 2024 సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు నివాళి అర్పించిన సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు భారీ వాక్ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు 03:41 PM, Feb 3, 2024 సిద్ధం వేదికపైకి సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం కాసేపట్లో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:29 PM, Feb 3, 2024 దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:22 PM, Feb 3, 2024 సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్ చేతల్లో చూపించారు సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కుట్రలు చేయడమే చంద్రబాబు పని 03:15 PM, Feb 3, 2024 సీఎం జగన్ పేదల పక్షపాతి: ఆళ్ల నాని ప్రతిపక్షాలు సీఎం జగన్ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది 03:00 PM, Feb 3, 2024 తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఏలూరు సిద్దం సభకు హాజరు జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. సీఎం జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్ జగన్కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లను చూశారా? వైస్సార్సీపీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు పచ్చ బ్యాచ్కు మాత్రం దండిగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి సపోర్ట్గా దత్తపుత్రుడు పవన్, వదిన.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా కానీ, సీఎం జగన్కు నో స్టార్ క్యాంపెయినర్లు వైఎస్సార్సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు అందుకు ప్రత్యక్ష తార్కాణం.. ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం Star Campaigners of YSRCP…🔥 సామాన్య ప్రజలే మన పార్టీ స్టార్ క్యాంపైనర్లు…#YSJaganAgain #Siddham#YSRCPStarCampaigners pic.twitter.com/kg1Nv4I2Tq — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 జనజాతరను తలపిస్తున్న@YSRCParty దెందులూరు సిద్ధం సభ🔥#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/Hg07fTSKQk — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 02:30 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు. అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు. మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు అనడం సిగ్గుచేటు. ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం. మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం. మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు. 01:50 PM, Feb 3, 2024 కృష్ణాజిల్లా : దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు. సిద్ధం సభకు బస్సు డ్రైవర్గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని. 01:30 PM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను. దెందురూరులో,సీఎం జగన్ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు. దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. 12:50 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా: పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు 12:26PM, Feb 03, 2024 సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి 12:20PM, Feb 03, 2024 వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ కోసం మేమంతా సిద్ధం నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్ ఉద్దేశం సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం సేవకి సైన్యం సిద్ధమైంది 12:15PM, Feb 03, 2024 గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. 12:00 PM, Feb 3, 2024 కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు. నేడు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్సీపీ రెండో ఎన్నికల సన్నాహక సభ సిద్ధం బహిరంగ సభకు 50 నియోకవర్గాల నుంచి తరలిరానున్న కేడర్ 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం @ysjagan#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/k9WIu7L5D8 — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 11:30 AM, Feb 3, 2024 వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు 11:23AM, Feb 03, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 11:20AM, Feb 03, 2024 ఏలూరు జిల్లా: కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 11:10 AM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారు ఏలూరు ఆటోనగర్–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్’ గుర్తులో వాకింగ్వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్ భారీ కటౌట్లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధమైంది. సీఎం షెడ్యూల్ ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
తాడేపల్లి టు దెందులూరు..సీఎం జగన్ షెడ్యూల్
-
దెందులూరు 'సిద్ధం' సభకు సర్వం సిద్ధం
-
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/దెందులూరు: జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శాంతినగర్ డివిజన్ పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు
-
YSRCP సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు
-
చంద్రబాబు పై జక్కంపూడి రాజా ఫైర్
-
నాలుగు లక్షల మందితో జగన్ సభ
-
100 ఎకరాల్లో సీఎం జగన్ దెందులూరు సిద్ధం సభ
-
ఈనెల 3న దెందులూరులో సిద్ధం బహిరంగ సభ
-
ఏలూరు జిల్లాలో భయాందోళన కలిగిస్తున్న పెద్దపులి సంచారం
-
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
చంద్రబాబు ఆశీస్సులతో రెచ్చిపోయిన చింతమనేని
-
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
సామాజిక సాధికార యాత్రకు భారీగా వస్తున్న జనం
-
వైఎస్ఆర్ ఆసరాతో మహిళా జీవితాల్లో వెలుగు
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్పీఏలు.. ఓవర్ డ్యూస్గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు. ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం వ్యాపార పరంగా అండగా నిలిచాం ► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది. ► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, పీ అండ్ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందూస్తాన్ యూనీ లీవర్ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. ► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. ► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు ► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్మోడల్గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం. ► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు ► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం. ► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. ► వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం. ► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50% ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. ► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేక సెల్ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. బాబు మోసం చేస్తే.. జగన్ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే కలకాలం సీఎం చల్లగా ఉండాలి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేసి, టైలరింగ్ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్తో బాగా చదివి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి. – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు మహిళల జీవితాల్లో వెలుగులు వైఎస్సార్ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్ జగన్కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ ఆసరా మూడవ విడత కింద మహిళలకు ఆర్ధిక సహాయం అందించేందుకు దెందులూరు కు విచ్చేసి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు కలిసి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. దెందులూరు గ్రామానికి చెందిన బర్నాన క్రాంతి ప్రసాద్ (31) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు, ఇప్పటికే రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు జరిగాయని, 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని తండ్రి గణపతి ముఖ్యమంత్రి వద్ద వాపోయారు. ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పెదవేగి మండలం రాట్నాలకుంట కు చెందిన పెనుబోయిన కృపారావు (39) తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, అందుకు ఆర్ధిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా దెందులూరు గ్రామానికి చెందిన వై. మోషేరాజు, ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోసన అర్జున్ కిడ్నీల వ్యాధితో బాదుతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దాతలు సిద్ధంగా ఉంటె, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా బాధితులకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసారని, తక్షణ వైద్య సహాయం కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్థానని, హామీ ఇచ్చారని, ఆ మేరకు కృపారావు, కోసన అర్జున్, వై. మోషే రాజు లకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను వెంటనే పంపిణీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు మండలం గోపరాజుపాడు కు చెందిన కుప్పాల సుధారాణి తన కుమార్తె కె. దేదీప్య (5) కి పుట్టుకతోనే లివర్ సమస్య ఉందని, ఎండోస్కోపీ వైద్యానికి ప్రతీ నెల 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చు అవుతోందని, తమ బాధను ముఖ్యమంత్రికి తెలియజేసారని కలెక్టర్ తెలిపారు. తన భర్త దుర్గా రావు కూలి పనికి వెళతారని, వైద్యానికి ఇప్పటివరకు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని చెబుతూ, ప్రస్తుతం వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళుతున్నామని, తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు వైద్య చికిత్సకు సహాయం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేదీప్య వైద్య చికిత్స నిమిత్తం వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లికి చెందిన పి . రేవతి తమ కుమార్తె పి . వెంకట లక్ష్మి (8) శాశ్వత వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్నాదని, ఇప్పటికే 1.50 లక్షల రూపాయలతో చికిత్స అందించామని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు 22 లక్షలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రికి రోగి తల్లి రేవతి తమ బాధను వ్యక్తం చేశారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు అవసరమైన వైద్య సహాయం కోసం చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కును సదరు కుటుంబానికి అందించినట్లు కలెక్టర్ తెలియజేసారు. దెందులూరు గ్రామానికి చెందిన కొంగర ప్రిస్కిల్లా కుమార్తె కె. సెఫిల్ అనోరెక్టల్ మాల్ ఫార్మేషన్ తో బాధపడుతున్నట్లు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారని, దీనిపై మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిఎమ్ హెచ్ ఓ తో చర్చించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రిస్కిల్లా కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష రూపాయల చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం, దెందులూరు గ్రామానికి చెందిన ఈడుపల్లి ప్రసాద్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నానని, మంచంపై నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారని, వారికి వైద్య చికిత్స నిమిత్తం తక్షణ వైద్య సహాయంగా లక్ష రూపాయలు చెక్కును అందించి, పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జుత్తిగ హేమలత తన కుమార్తె భవ్యశ్రీ మల్లిక (10 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాదని , తిరుపతి లోని పద్మావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించామని, పోస్ట్ ఆపరేషన్ వైద్య చికిత్సకు మందులు అందించాలని ముఖ్యమంత్రికి తెలియజేసిన పిమ్మట వారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లుగా హామీ ఇచ్చారని , ఆ మేరకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, డ్వామా పీడీ డి. రాంబాబు , ప్రభృతులు పాల్గొన్నారు. -
సీఎం జగన్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం (ఫొటోలు)
-
జగనన్న .. నేను చదువు కోలేదు.. నా బిడ్డలు చదువుతున్నారు
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, ప్రతి అక్కచెల్లెమ్మ ఇంత ఆనందంగా ఉందంటే సీఎంగారు తీసుకుంటున్న నిర్ణయాలు, అవి అమలుచేస్తున్న తీరే అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయిందంటే ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషమే కారణం, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు -బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మీరే నాకు అన్నయ్య జగనన్నా మీరు పాదయాత్రలో మా ఇబ్బందులు గమనించి మాట ఇచ్చారు, ఇప్పుడు మాకు మూడో విడత వైఎస్సార్ ఆసరా అందజేస్తున్నారు, ఈ పథకం కింద మా గ్రూప్ సభ్యులకు రూ. 2,95,321 వచ్చాయి, అందులో నాకు రూ. 27,400 వచ్చాయి, నేను టైలరింగ్ చేస్తుంటాను, ఈ డబ్బుతో కొత్తగా జిగ్జాగ్ మిషన్ తెచ్చుకున్నాను, గతంలో రూ. వంద వచ్చే ఆదాయం ఇప్పుడు రోజుకు రూ. 200 వరకు వస్తున్నాయి, ఈ పథకంలో లబ్ధిపొందిన మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా నిలదొక్కుకుంటున్నారు. ఇదంతా మీ దయ, నేను చదువుకోలేదు, నా తండ్రిని కోల్పోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను కానీ నా బిడ్డలు నాలా కాకూడదని వారికి మంచి చదువులు చెప్పిస్తున్నా, నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే మీరే కారణం అన్నా, నా పెద్ద కొడుకు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు, చిన్నకొడుకు గవర్నమెంట్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు, తనకు మంచి భోజనం ఇస్తున్నారు, నా పిల్లల మేనమామలా మీరు అన్నీ చూసుకుంటున్నారు, నవరత్నాల పథకాలన్నీ లబ్ధిపొందుతున్నాం, ఒక చెల్లికి అన్నలా ఇంతకంటే ఏం చేస్తారు, మీరే నాకు అన్నయ్య, అందరికీ సూర్యుడు వెలుగునిస్తే మా మహిళలకు జగనన్న వెలుగునిస్తున్నారు, రంజాన్ మాసం సందర్భంగా నేను మీరు ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని దువా చేస్తాను అన్నా, మీరు చల్లగా ఉంటే రాష్ట్రమంతా చల్లగా ఉంటుంది, ధ్యాంక్యూ అన్నా. -రుబీనా బేగం, లబ్ధిదారు, ఏలూరు మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అన్నా నమస్కారం, అన్నా మీరు ఎంతోమంది పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం, మీ పాదయాత్రలో మా మహిళల కష్టాలు చూసి చలించిపోయి మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నాకు రెండు విడతలుగా ఆసరా సాయం అందింది, నాకు చేయూత సాయం కూడా అందింది, నేను ట్రాక్టర్ కొనుక్కున్నాను, మీరు మాకు స్వేచ్చనిచ్చారు మా కుటుంబ ఆదాయం పెరిగేలా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా వినియోగించుకున్నాం, నేను రూ. 10 వేలు ప్రతి నెలా సంపాదిస్తున్నాను, మీరు మా అందరి హృదయాలలో నిలిచిపోయారు, నా భర్తకు ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడింది, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి చికిత్స పొందడమే కాక తిరిగి సాయం చేశారు, నేను స్త్రీ నిధి లోన్ కూడా తీసుకున్నాను, మా మహిళలు ఇంతలా ఎదగడానికి మీరే కారణం, ధ్యాంక్యూ జగనన్నా. -కలపాల గంగా రత్నకుమారి, దొరమామిడి గ్రామం, పోలవరం నియోజకవర్గం -
ఏలూరు: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడుత నిధుల విడుదల
-
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: సీఎం జగన్
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే....: చెరగని ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం... దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని దెందులూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపు 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... మరో పదిరోజుల పాటు జరగబోయే ఆసరా సంబరాల్లో రూ.6,419 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతిమండలంలోనూ ఒక పండగ వాతావరణం మధ్య ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మా తాను సాధించిన విజయాలు చెబుతుంది. మహిళా సాధికారితకు మీరే నిదర్శనం... మన దెందులూరులో నా స్టేజ్ ఎదురుగా మిమ్నల్ని చూసినప్పుడు మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్కచెల్లెమ్మలు స్టేజ్ మీదే కాకుండా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తున్నారు. కేవలం 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజు వైఎస్సార్ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధుల విడుదల ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇంతకముందు చెప్పినట్టుగా పదిరోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు... డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను... నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం... ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,500 కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి పోయి కొట్టుమిట్టాడుతున్నవారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఆ మాట తప్పకుండా వారికి అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ పదిరోజుల ఆసరా పండగ కార్యక్రమంలో భాగంగా మరో రూ.6419 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అసరా ద్వారా రూ.19,178 కోట్లు జమ... ఎక్కడా ఎవ్వడూ లంచాలు అడగడు. ఎవ్వరూ వివక్ష చూపరు. నేరుగా మీ అన్న బటన్ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ రూ.6419 కోట్లు కలుపుకుంటే రూ. 19,178 కోట్లు నేరుగా ఒక్క ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. వ్యాపార దిగ్గజాలతో అండ.... వైయస్సార్ ఆసరాగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది నేను మీ అభిమతానికి వదిలిపెట్టాను. ఈ డబ్బులు పెట్టుబడిగా వ్యాపారం, లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్నిరకాలుగా అండదండలు ఇస్తూ... మీకు తోడుగా ఉంటుంది. వారికి తోడ్పాటు ఇస్తూ సలహాలిస్తూ.. అండగా నిలబడి ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్ధలైన ఎల్ అంట్ టీ, పీ అండ్ జి, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మకూ వ్యాపార మార్గాలు చూపించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. స్వయం ఉపాధి దిశగా... ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వలన అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసరసరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేవులు ద్వారా పాడి, గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్ ప్రాససింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీరిందరికీ స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించింది. ఆసరా, చేయూత సున్నావడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4355 కోట్లను వారికి అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వంలో... గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి బ్యాంకురుణాలు రూ.14వేలు ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున బ్యాంకు రుణాలు ఏటా రూ.30వేలు అందుతున్నాయి. 99.95 శాతం రుణాల రికవరీ..దేశంలో పొదుపు సంఘాలకు ఏపీ రోల్మోడల్ అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే పొదుపు సంఘాల విషయంలో ఆంధ్రరాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్మోడల్గా నిలబడ్డారు. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. పొదుపు సంఘాలలో జరుగుతున్న విప్లవాన్ని ఎలా జరుగుతుందని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి.. పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా వేసింది. ఇంతకముందు రూ.3 లక్షల రుణానికి సంబంధించి వడ్డీ 13 శాతం ఉండగా దాన్ని 7 శాతానికే తగ్గించడమైంది. రూ.5లక్షల రుణంపై వడీ 13 శాతం ఉంటే దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి 9.5 శాతానికి తగ్గించడమైంది. ఈ వడ్డీ శాతంపై కూడా ఇంకా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఈవడ్డీ శాతం కూడా ఇంకా తగ్గించుకుంటూ పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు ? ఆదాయం ఎంత వస్తుంది ? ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ? వడ్డీ ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి మీ తరపున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. చేయూతతో మారిన పొదుపు సంఘాలు... మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చేయూత వల్ల పొదుపుసంఘాల పనితీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మరలా ఈ రోజు ఊపిరి పోసుకుంది. ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లగా మార్పు చెందాయి. ఈ సంఘాలు ఇంతకముందు ఎన్పీఏలు. గత ప్రభుత్వ హయాంలో ఎన్పీఏలు ఓవర్ డ్యూస్గా 18 శాతం మేరకు సంఘాలు ఉంటే.. ఈ రోజు ఎన్పీఎలు, ఓవర్ డ్యూలు శాతం 0.45 శాతం మాత్రమే. మనందరి ప్రభుత్వం సాధికారిత, అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అక్కచెల్లమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆ రోజులలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం అంటూ ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కచెల్లెమ్మలతో పనిఅయిపోయింది. అక్కచెల్లెమ్మలకిచ్చిన హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబరు నుంచి వారి తరపున కట్టాల్సిన సున్నావడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన సున్నావడ్డీని మరలా తీసుకొచ్చి దీనికింద రూ.3036 కోట్లు ఇవాళ వడ్డీ రూపంలో తిరిగి చెల్లించడం జరిగింది. 2016 అక్టోబరులో నిలిచిపోయిన సున్నావడ్డీ అనే పథకాన్ని మన ప్రభుత్వం తిరిగి తీసుకునిరావడం వల్ల మన ప్రభుత్వం రూ.3615 కోట్లు సున్నావడ్డీ పథకం కింద చిరునవ్వుతో చెల్లించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసిందో కొన్ని ఉదాహరణలు చెబుతాను. వివిధ పథకాల ద్వారా... జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైయస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు సాయం అందించాం. వైయస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.596 కోట్లు అందించాం. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా మరో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యాదీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువులు కోసం అందించిన సహాయం.. రూ.9947 కోట్లు. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు వసతి భోజన సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి రూ.3363 కోట్లు ఇచ్చాం. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్లపట్టాలిచ్చాం. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తైతే ప్రతి అక్కచెల్లెమ్మచేతిలోనూ ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న పరిస్థితులు.. ఇవన్నీ పూర్తైతే ఈ ఒక్క పథకం ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. మహిళా పక్షపాత ప్రభుత్వం.... ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మలకు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతను కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగుపడాతాయని నమ్మిన ప్రభుత్వం మనది. కాబట్టి.. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడి, వారి రక్షణ మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అఢుగులు వేస్తున్నాం. ఆర్ధికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా అక్కచెల్లెమ్మలను పైకి తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం... నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకూ గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకూ ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. అక్క చెల్లెమ్మల రక్షణ కోసం... అక్కచెల్లెమ్మల రక్షణ కల్పించే విషయంలో అడుగులు వేగంగా వేసింది. అక్కచెల్లెమ్మలు ఎక్కడికి పోయినా, ఎప్పుడు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలి. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా పోన్ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పదినిమిషాల్లో అక్కడికి వచ్చి అక్కా నీకేమైంది అని అడిగే గొప్ప వ్యవస్ధనుతీసుకొచ్చాం. 21 వ శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే.. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26వేల మంది అక్కచెల్లెమ్మలకి మంచి జరిగింది. ఇవన్నీ మహిళలు విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగాలని, బాగుపడాలని 21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో ఈ 45 నెలల పాలన జరిగింది. ఈ రోజు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు సొమ్ము ఇచ్చాం. ఇంతలా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించి, మంచి చేసిన పరిస్థితి గతంలో లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా తపిస్తున్నాను. దేవుడి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై, ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ ఆసరా: సీఎం జగన్ దెందులూరు పర్యటన దృశ్యాలు
-
హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా: సీఎం జగన్
Updates Time: 01:05 PM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. Time: 12:47 PM ►రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్ ►ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు : ►ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను ►స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ►అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం ►మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం ►9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ►రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం ►తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు ►చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి ►99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారు ►దేశానికి రోల్మోడల్గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం ►ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం ►చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది ►ఎన్పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే ►గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ►రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు ►వారిని నిలువునా ముంచేశారు ►2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు ►రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్కవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ►తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం ►2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం ►చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వం మనది ►ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది ►అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం: ►మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం ►కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది ►ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది ►గుడి ఛైర్మన్, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం ►అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్ను తీసుకు వచ్చాం ►1.17 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నారు ►21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపన పడుతున్నాను Time: 12:25 PM ►మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది: సీఎం జగన్ ►వ్యాపార దిగ్గజాలతో ఒప్పంద చేసుకొని వ్యాపార మార్గాలు చూపాం ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచాం. ►పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్మోడల్గా నిలిచారు ►పొదుపు సంఘాల పనితీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాం ►78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం ►10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు ►ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్ ఆసరా కార్యక్రమం Time: 12:25 PM ►పొదుపు సంఘల మహిళలకు అండగా నిలిచాం: సీఎం జగన్ ►డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాం ►లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు ►ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం Time: 12:09 PM ►మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సీఎం జగన్ ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా ►డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా ►నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా ►ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నా Time: 12:00 PM ►వైఎస్సార్ ఆసరా నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: లబ్దిదారులు ►వైఎస్సార్ ఆసరా నిధులతో మా కాళ్ల మీద మేము నిలబడ్డాం ►అండగా విద్యాకానుక, విద్యాదీవెన, ఫీజురీయింబర్స్మెంట్ పథకాలు. ►మీ పాలనలో మా పిల్లలకు మంచి చదువులు ►నవరత్నాల పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నింపారు. Time: 11:45AM ► సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుది: ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ►డ్వాక్రా మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. ►పొదుపు సంఘాలు చివరికి సీ,డీ గ్రేడ్లకు పడిపోయాయి. ►సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మల్లో మళ్లీ ఆనందం తెచ్చిన ఘనత సీఎం జగన్ది ►సీఎం జగన్ పాలనలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్లకు చేరాయి. Time: 11:31AM ► వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులను పలకరించిన సీఎం జగన్ ► వైఎస్సర్ ఆసరా లబ్ధిదారులతో సీఎం జగన్ ఫోటో సెషన్ Time: 11:15AM ►దెందులూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్నారు. Time: 10:50AM ► దెందులూరుకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా ప్రాంగణానికి బయల్దేరారు. దారిపోడవునా సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. Time: 10:10AM ► ఏలూరు జిల్లా దెందులూరుకు సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. సాక్షి, ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. పథకం ఉద్దేశ్యం ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ పథకం తీసుకురావడం జరిగింది. మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి సీఎం బాటలు వేశారు. కార్పొరేట్ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ మహిళలకు గుడ్న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు ఉత్సవాలు కాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు. చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! ఇంటింటికీ వెళ్లి.. మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు 2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్ల్లో కొనసాగుతున్నాయి. -
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై దెందులూరు పోలీస్స్టేషన్లో ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఎస్సై ఐ.వీర్రాజు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభాకర్ను ప్రభుత్వాసుపత్రి నుంచి పెదవేగి తరలిస్తుండగా సోమవరప్పాడు బైపాస్ వద్ద జీపు దిగి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి వెళ్లిపోయారన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీపు డ్రైవర్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 2/23తో 341, 24, 506, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్పై ఈ నెల 2న కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. చదవండి: (చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్)