Denduluru
-
మా పొలం కబ్జా చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు
-
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. -
రెడ్బుక్ దౌర్జన్యకాండ.. అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. -
ఏపీలో దౌర్జన్యకాండ.. రెడ్బుక్ రాజ్యాంగానికి ఖాకీల సెల్యూట్!
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికార మదంతో అక్రమ కేసులు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెండు రోజుల క్రితమే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు చింతమనేని. తాజాగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.చింతమనేని గన్ మ్యాన్ వద్ద గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కట్టుకథలతో చింతమనేని ఫిర్యాదు చేయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చింతమనేని దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేసి తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు ఏంటో చెప్పకుండా హైదరాబాద్ వరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కార్ తమకు చట్టం, న్యాయం, రాజ్యాంగాలతో పనిలేదని రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు సామాన్యుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
కూటమి నేతల ఆక్రమ దందా
-
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
చింతమనేని హుకుం.. దెందులూరు టీడీపీ, జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
దెందులూరులో పరాకాష్టకు చేరిన ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన చింతమనేని అరాచకాలు
-
జనసేన నేతలపై చింతమనేని అనుచరుల ఎటాక్
-
ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..నా మనవరాలిని కాపాడండి..
-
అర్ధరాత్రి రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు
-
దెందులూరులో టీడీపీ ఖాళీ..
-
నేను ఒంటరి కాదు..నా బలం మీరే
-
దెందులూరులో సిద్ధం సభ సూపర్ సక్సెస్
-
సీఎం జగన్ సిద్ధం సభకు జన ప్రవాహం
-
సామాన్యుడిలా కార్యకర్తల మధ్యలో పేర్నినాని
-
దెందూలూరు సిద్ధం సభపై సీఎం జగన్ ట్వీట్
-
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా..?
-
నాకు జీవితాన్ని ఇచ్చిన జగన్ కోసం జీవితాంతం నిలబడతా..!
-
మాటల తూటాలతో కార్యకర్తల రక్తం ఉరకలెత్తించిన జగన్
-
ప్రజలు బటన్ నొక్కితే శాశ్వతంగా చంద్రగ్రహణం మాయం
-
నాకున్న సైన్యం, బలం..దేవుడు, ప్రజలే: సీఎం జగన్
-
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం
సాక్షి, భీమవరం: ‘రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే.. జగన్ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు. కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే. – వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఇక వార్ వన్ సైడే ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్మెంట్ పేరు కూడా జగన్. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్ వన్ సైడే. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ నమ్మకానికి మారుపేరు జగన్మోహన్రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. – కేశినేని నాని, ఎంపీ జనం హృదయాల్లో జగన్ సుస్థిర స్థానం పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచి్చన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే అబద్ధం అంటే చంద్రబాబు... జగన్ అంటే నిజం... ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యూడీíÙయరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్ అనే బొండి ఇసుకతో, పవన్ కళ్యాణ్ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిరి్మంచిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. పేదవాడికి ఇంగ్లిష్ విద్య అందిస్తుంటే ఈ అబద్దపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్ అయితే, వైఎస్సార్సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి జగనన్న పిలుపే ఒక ప్రభంజనం సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచి్చంది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి -
జగన్ ప్రభం‘జనం’
సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు. ‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు. పోటెత్తిన యువత సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు. -
జగన్ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం
ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం జగనన్న మేలు మరువలేం సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం జగనన్నకే మా మద్దతు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు. – ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం రైతులను ఆదుకుంటున్నారు గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. – జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు ప్రతిపక్షాల మాటలు నమ్మం జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం నమ్మకానికి ప్రతీక జగన్ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు. – ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ సీఎం జగన్కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా నూతన ఒరవడి సృష్టించారు వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం ఇంతకన్నా మార్పు ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా నేరుగా నగదు బదిలీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వారధిగా ప్రణాళిక ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం -
ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు. పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంత కంటే లేదని చెప్పారు. ‘మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ♦ రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా ‘రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కు.. అసలు ఈ స్టేట్తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నా¯Œన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ♦ ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్గా, పేద వాడి సంక్షేమం టార్గెట్గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం ♦ కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం. ♦ గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది. ♦ పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం. ♦ ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ♦ వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి. ♦ ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. -
అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ
-
సీఎం జగన్ తో సెల్ఫీ
-
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా..?
-
చంద్రబాబు,పవన్ కి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
దిశ యాప్ తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం
-
మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది
-
పేదపిల్లలకు మంచి విద్య ఇస్తే, ప్రతి ఇంటి భవిష్యత్తు మారుతుంది
-
జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు..నా ధైర్యం మీరు
-
దెందులూరు బహిరంగ సభలో కేశినేని నాని
-
సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్
-
సీఎం జగన్ దెందులూరు సిద్దం సభ ఎక్సక్లూజివ్ డ్రోన్ విజువల్స్
-
పేర్ని కిట్టును ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
-
సిద్ధం సభలో బాబు,కొడుకును ఆటాడుకున్న కేశినేని నాని
-
ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా: సీఎం జగన్
-
సిద్ధం సభను దిగ్విజయం చేస్తాం: అబ్బయ్య చౌదరి
-
జగనన్న జనసంద్రం చూస్తే సునామీనైనా ఆపొచ్చు అనిపిస్తుంది
-
వచ్చి రాగానే జగన్ ఏం చేశారో చూడండి
-
పని పాట లేకుండా తిరిగేవాడ్ని... కానీ సీఎం జగన్ వచ్చాక
-
జన సునామీగా మారిన సీఎం జగన్ సిద్ధం సభ
-
ప్రతిపక్షాలు సీఎం జగను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి: ఆళ్ల నాని
-
వైఎస్ జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధే మరోసారి సీఎం చేస్తాయి: మహిళలు
-
భీమిలి సభ సూపర్ సక్సెస్ తో కదం తొక్కుతున్న శ్రేణులు
-
ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తరలివస్తున్న శ్రేణులు
-
దెందులూరు సిద్దం సభలో సీఎం జగన్ కాన్వాయ్ దృశ్యాలు
-
సిద్ధం సభ: బస్సు నడిపిన మాజీ మంత్రి పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సిద్ధం సభకు బస్సుల్లో కదిలారు. కార్యకర్తలతో కలిసి కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు బస్సులో దెందులూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు. ఇదీ చదవండి: YSRCP: సరికొత్త సామాజిక విప్లవం.. -
సిద్ధం సభను దిగ్విజయం చేస్తాం: అబ్బయ్య చౌదరి
-
సీఎం జగన్ సభకు సర్వం సిద్ధం!
-
Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
UPDATES: 05:47 PM, Feb 3, 2024 దెందులూరు వైఎస్సార్సీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్ 05:14 PM, Feb 3, 2024 ముగిసిన సిద్ధం బహిరంగ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు 04:14 PM, Feb 3, 2024 సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్ ►ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా ►దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా ►పేదల భవిష్యత్ను కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా ►రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ►ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు ►కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు ►జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ►కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం ►నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్ ►జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాదు ►నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే ►నాకున్న నమ్మకం మీరే ►వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని ►దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే ►రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది ►రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది ►మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది ►పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు ►గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది. ►అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం ►అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం ►175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం ►నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా ►చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి ►పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి ►చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి ►కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి ►గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ►ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్ అని చెప్పండి ►ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం ►అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం ►డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా ►కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం ►4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం ►అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ►మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా ►దిశ యాప్తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం ►రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం ►కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం ►మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ►అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి ►వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్ను నిర్ణయించేవి ►ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే ►3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి ►ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి ►చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది ►ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు ►జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ►పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి ►రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి ►పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం.. ►రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం ►మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ►ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు ►ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు ►చంద్రబాబు అండ్ కో.. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ►175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు ►చంద్రబాబు అండ్కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ►చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం ►దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి ►ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ 04:10 PM, Feb 3, 2024 దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్ అభివాదం సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి ఎటుచూసిన వైఎస్సార్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్ సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్సైడే పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం 03:56 PM, Feb 3, 2024 సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు నివాళి అర్పించిన సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు భారీ వాక్ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు 03:41 PM, Feb 3, 2024 సిద్ధం వేదికపైకి సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం కాసేపట్లో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:29 PM, Feb 3, 2024 దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:22 PM, Feb 3, 2024 సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్ చేతల్లో చూపించారు సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కుట్రలు చేయడమే చంద్రబాబు పని 03:15 PM, Feb 3, 2024 సీఎం జగన్ పేదల పక్షపాతి: ఆళ్ల నాని ప్రతిపక్షాలు సీఎం జగన్ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది 03:00 PM, Feb 3, 2024 తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఏలూరు సిద్దం సభకు హాజరు జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. సీఎం జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్ జగన్కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లను చూశారా? వైస్సార్సీపీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు పచ్చ బ్యాచ్కు మాత్రం దండిగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి సపోర్ట్గా దత్తపుత్రుడు పవన్, వదిన.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా కానీ, సీఎం జగన్కు నో స్టార్ క్యాంపెయినర్లు వైఎస్సార్సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు అందుకు ప్రత్యక్ష తార్కాణం.. ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం Star Campaigners of YSRCP…🔥 సామాన్య ప్రజలే మన పార్టీ స్టార్ క్యాంపైనర్లు…#YSJaganAgain #Siddham#YSRCPStarCampaigners pic.twitter.com/kg1Nv4I2Tq — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 జనజాతరను తలపిస్తున్న@YSRCParty దెందులూరు సిద్ధం సభ🔥#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/Hg07fTSKQk — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 02:30 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు. అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు. మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు అనడం సిగ్గుచేటు. ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం. మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం. మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు. 01:50 PM, Feb 3, 2024 కృష్ణాజిల్లా : దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు. సిద్ధం సభకు బస్సు డ్రైవర్గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని. 01:30 PM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను. దెందురూరులో,సీఎం జగన్ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు. దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. 12:50 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా: పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు 12:26PM, Feb 03, 2024 సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి 12:20PM, Feb 03, 2024 వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ కోసం మేమంతా సిద్ధం నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్ ఉద్దేశం సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం సేవకి సైన్యం సిద్ధమైంది 12:15PM, Feb 03, 2024 గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. 12:00 PM, Feb 3, 2024 కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు. నేడు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్సీపీ రెండో ఎన్నికల సన్నాహక సభ సిద్ధం బహిరంగ సభకు 50 నియోకవర్గాల నుంచి తరలిరానున్న కేడర్ 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం @ysjagan#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/k9WIu7L5D8 — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 11:30 AM, Feb 3, 2024 వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు 11:23AM, Feb 03, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 11:20AM, Feb 03, 2024 ఏలూరు జిల్లా: కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 11:10 AM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారు ఏలూరు ఆటోనగర్–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్’ గుర్తులో వాకింగ్వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్ భారీ కటౌట్లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధమైంది. సీఎం షెడ్యూల్ ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
తాడేపల్లి టు దెందులూరు..సీఎం జగన్ షెడ్యూల్
-
దెందులూరు 'సిద్ధం' సభకు సర్వం సిద్ధం
-
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/దెందులూరు: జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శాంతినగర్ డివిజన్ పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు
-
YSRCP సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు
-
చంద్రబాబు పై జక్కంపూడి రాజా ఫైర్
-
నాలుగు లక్షల మందితో జగన్ సభ
-
100 ఎకరాల్లో సీఎం జగన్ దెందులూరు సిద్ధం సభ
-
ఈనెల 3న దెందులూరులో సిద్ధం బహిరంగ సభ
-
ఏలూరు జిల్లాలో భయాందోళన కలిగిస్తున్న పెద్దపులి సంచారం
-
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
చంద్రబాబు ఆశీస్సులతో రెచ్చిపోయిన చింతమనేని
-
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
సామాజిక సాధికార యాత్రకు భారీగా వస్తున్న జనం
-
వైఎస్ఆర్ ఆసరాతో మహిళా జీవితాల్లో వెలుగు
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్పీఏలు.. ఓవర్ డ్యూస్గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు. ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం వ్యాపార పరంగా అండగా నిలిచాం ► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది. ► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, పీ అండ్ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందూస్తాన్ యూనీ లీవర్ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. ► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. ► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు ► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్మోడల్గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం. ► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు ► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం. ► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. ► వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం. ► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50% ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. ► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేక సెల్ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. బాబు మోసం చేస్తే.. జగన్ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే కలకాలం సీఎం చల్లగా ఉండాలి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేసి, టైలరింగ్ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్తో బాగా చదివి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి. – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు మహిళల జీవితాల్లో వెలుగులు వైఎస్సార్ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్ జగన్కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ ఆసరా మూడవ విడత కింద మహిళలకు ఆర్ధిక సహాయం అందించేందుకు దెందులూరు కు విచ్చేసి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు కలిసి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. దెందులూరు గ్రామానికి చెందిన బర్నాన క్రాంతి ప్రసాద్ (31) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు, ఇప్పటికే రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు జరిగాయని, 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని తండ్రి గణపతి ముఖ్యమంత్రి వద్ద వాపోయారు. ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పెదవేగి మండలం రాట్నాలకుంట కు చెందిన పెనుబోయిన కృపారావు (39) తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, అందుకు ఆర్ధిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా దెందులూరు గ్రామానికి చెందిన వై. మోషేరాజు, ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోసన అర్జున్ కిడ్నీల వ్యాధితో బాదుతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దాతలు సిద్ధంగా ఉంటె, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా బాధితులకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసారని, తక్షణ వైద్య సహాయం కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్థానని, హామీ ఇచ్చారని, ఆ మేరకు కృపారావు, కోసన అర్జున్, వై. మోషే రాజు లకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను వెంటనే పంపిణీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు మండలం గోపరాజుపాడు కు చెందిన కుప్పాల సుధారాణి తన కుమార్తె కె. దేదీప్య (5) కి పుట్టుకతోనే లివర్ సమస్య ఉందని, ఎండోస్కోపీ వైద్యానికి ప్రతీ నెల 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చు అవుతోందని, తమ బాధను ముఖ్యమంత్రికి తెలియజేసారని కలెక్టర్ తెలిపారు. తన భర్త దుర్గా రావు కూలి పనికి వెళతారని, వైద్యానికి ఇప్పటివరకు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని చెబుతూ, ప్రస్తుతం వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళుతున్నామని, తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు వైద్య చికిత్సకు సహాయం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేదీప్య వైద్య చికిత్స నిమిత్తం వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లికి చెందిన పి . రేవతి తమ కుమార్తె పి . వెంకట లక్ష్మి (8) శాశ్వత వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్నాదని, ఇప్పటికే 1.50 లక్షల రూపాయలతో చికిత్స అందించామని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు 22 లక్షలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రికి రోగి తల్లి రేవతి తమ బాధను వ్యక్తం చేశారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు అవసరమైన వైద్య సహాయం కోసం చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కును సదరు కుటుంబానికి అందించినట్లు కలెక్టర్ తెలియజేసారు. దెందులూరు గ్రామానికి చెందిన కొంగర ప్రిస్కిల్లా కుమార్తె కె. సెఫిల్ అనోరెక్టల్ మాల్ ఫార్మేషన్ తో బాధపడుతున్నట్లు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారని, దీనిపై మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిఎమ్ హెచ్ ఓ తో చర్చించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రిస్కిల్లా కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష రూపాయల చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం, దెందులూరు గ్రామానికి చెందిన ఈడుపల్లి ప్రసాద్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నానని, మంచంపై నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారని, వారికి వైద్య చికిత్స నిమిత్తం తక్షణ వైద్య సహాయంగా లక్ష రూపాయలు చెక్కును అందించి, పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జుత్తిగ హేమలత తన కుమార్తె భవ్యశ్రీ మల్లిక (10 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాదని , తిరుపతి లోని పద్మావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించామని, పోస్ట్ ఆపరేషన్ వైద్య చికిత్సకు మందులు అందించాలని ముఖ్యమంత్రికి తెలియజేసిన పిమ్మట వారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లుగా హామీ ఇచ్చారని , ఆ మేరకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, డ్వామా పీడీ డి. రాంబాబు , ప్రభృతులు పాల్గొన్నారు. -
సీఎం జగన్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం (ఫొటోలు)
-
జగనన్న .. నేను చదువు కోలేదు.. నా బిడ్డలు చదువుతున్నారు
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, ప్రతి అక్కచెల్లెమ్మ ఇంత ఆనందంగా ఉందంటే సీఎంగారు తీసుకుంటున్న నిర్ణయాలు, అవి అమలుచేస్తున్న తీరే అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయిందంటే ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషమే కారణం, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు -బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మీరే నాకు అన్నయ్య జగనన్నా మీరు పాదయాత్రలో మా ఇబ్బందులు గమనించి మాట ఇచ్చారు, ఇప్పుడు మాకు మూడో విడత వైఎస్సార్ ఆసరా అందజేస్తున్నారు, ఈ పథకం కింద మా గ్రూప్ సభ్యులకు రూ. 2,95,321 వచ్చాయి, అందులో నాకు రూ. 27,400 వచ్చాయి, నేను టైలరింగ్ చేస్తుంటాను, ఈ డబ్బుతో కొత్తగా జిగ్జాగ్ మిషన్ తెచ్చుకున్నాను, గతంలో రూ. వంద వచ్చే ఆదాయం ఇప్పుడు రోజుకు రూ. 200 వరకు వస్తున్నాయి, ఈ పథకంలో లబ్ధిపొందిన మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా నిలదొక్కుకుంటున్నారు. ఇదంతా మీ దయ, నేను చదువుకోలేదు, నా తండ్రిని కోల్పోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను కానీ నా బిడ్డలు నాలా కాకూడదని వారికి మంచి చదువులు చెప్పిస్తున్నా, నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే మీరే కారణం అన్నా, నా పెద్ద కొడుకు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు, చిన్నకొడుకు గవర్నమెంట్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు, తనకు మంచి భోజనం ఇస్తున్నారు, నా పిల్లల మేనమామలా మీరు అన్నీ చూసుకుంటున్నారు, నవరత్నాల పథకాలన్నీ లబ్ధిపొందుతున్నాం, ఒక చెల్లికి అన్నలా ఇంతకంటే ఏం చేస్తారు, మీరే నాకు అన్నయ్య, అందరికీ సూర్యుడు వెలుగునిస్తే మా మహిళలకు జగనన్న వెలుగునిస్తున్నారు, రంజాన్ మాసం సందర్భంగా నేను మీరు ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని దువా చేస్తాను అన్నా, మీరు చల్లగా ఉంటే రాష్ట్రమంతా చల్లగా ఉంటుంది, ధ్యాంక్యూ అన్నా. -రుబీనా బేగం, లబ్ధిదారు, ఏలూరు మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అన్నా నమస్కారం, అన్నా మీరు ఎంతోమంది పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం, మీ పాదయాత్రలో మా మహిళల కష్టాలు చూసి చలించిపోయి మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నాకు రెండు విడతలుగా ఆసరా సాయం అందింది, నాకు చేయూత సాయం కూడా అందింది, నేను ట్రాక్టర్ కొనుక్కున్నాను, మీరు మాకు స్వేచ్చనిచ్చారు మా కుటుంబ ఆదాయం పెరిగేలా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా వినియోగించుకున్నాం, నేను రూ. 10 వేలు ప్రతి నెలా సంపాదిస్తున్నాను, మీరు మా అందరి హృదయాలలో నిలిచిపోయారు, నా భర్తకు ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడింది, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి చికిత్స పొందడమే కాక తిరిగి సాయం చేశారు, నేను స్త్రీ నిధి లోన్ కూడా తీసుకున్నాను, మా మహిళలు ఇంతలా ఎదగడానికి మీరే కారణం, ధ్యాంక్యూ జగనన్నా. -కలపాల గంగా రత్నకుమారి, దొరమామిడి గ్రామం, పోలవరం నియోజకవర్గం -
ఏలూరు: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడుత నిధుల విడుదల
-
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: సీఎం జగన్
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే....: చెరగని ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం... దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని దెందులూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపు 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... మరో పదిరోజుల పాటు జరగబోయే ఆసరా సంబరాల్లో రూ.6,419 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతిమండలంలోనూ ఒక పండగ వాతావరణం మధ్య ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మా తాను సాధించిన విజయాలు చెబుతుంది. మహిళా సాధికారితకు మీరే నిదర్శనం... మన దెందులూరులో నా స్టేజ్ ఎదురుగా మిమ్నల్ని చూసినప్పుడు మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్కచెల్లెమ్మలు స్టేజ్ మీదే కాకుండా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తున్నారు. కేవలం 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజు వైఎస్సార్ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధుల విడుదల ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇంతకముందు చెప్పినట్టుగా పదిరోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు... డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను... నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం... ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,500 కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి పోయి కొట్టుమిట్టాడుతున్నవారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఆ మాట తప్పకుండా వారికి అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ పదిరోజుల ఆసరా పండగ కార్యక్రమంలో భాగంగా మరో రూ.6419 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అసరా ద్వారా రూ.19,178 కోట్లు జమ... ఎక్కడా ఎవ్వడూ లంచాలు అడగడు. ఎవ్వరూ వివక్ష చూపరు. నేరుగా మీ అన్న బటన్ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ రూ.6419 కోట్లు కలుపుకుంటే రూ. 19,178 కోట్లు నేరుగా ఒక్క ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. వ్యాపార దిగ్గజాలతో అండ.... వైయస్సార్ ఆసరాగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది నేను మీ అభిమతానికి వదిలిపెట్టాను. ఈ డబ్బులు పెట్టుబడిగా వ్యాపారం, లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్నిరకాలుగా అండదండలు ఇస్తూ... మీకు తోడుగా ఉంటుంది. వారికి తోడ్పాటు ఇస్తూ సలహాలిస్తూ.. అండగా నిలబడి ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్ధలైన ఎల్ అంట్ టీ, పీ అండ్ జి, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మకూ వ్యాపార మార్గాలు చూపించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. స్వయం ఉపాధి దిశగా... ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వలన అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసరసరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేవులు ద్వారా పాడి, గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్ ప్రాససింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీరిందరికీ స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించింది. ఆసరా, చేయూత సున్నావడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4355 కోట్లను వారికి అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వంలో... గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి బ్యాంకురుణాలు రూ.14వేలు ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున బ్యాంకు రుణాలు ఏటా రూ.30వేలు అందుతున్నాయి. 99.95 శాతం రుణాల రికవరీ..దేశంలో పొదుపు సంఘాలకు ఏపీ రోల్మోడల్ అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే పొదుపు సంఘాల విషయంలో ఆంధ్రరాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్మోడల్గా నిలబడ్డారు. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. పొదుపు సంఘాలలో జరుగుతున్న విప్లవాన్ని ఎలా జరుగుతుందని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి.. పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా వేసింది. ఇంతకముందు రూ.3 లక్షల రుణానికి సంబంధించి వడ్డీ 13 శాతం ఉండగా దాన్ని 7 శాతానికే తగ్గించడమైంది. రూ.5లక్షల రుణంపై వడీ 13 శాతం ఉంటే దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి 9.5 శాతానికి తగ్గించడమైంది. ఈ వడ్డీ శాతంపై కూడా ఇంకా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఈవడ్డీ శాతం కూడా ఇంకా తగ్గించుకుంటూ పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు ? ఆదాయం ఎంత వస్తుంది ? ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ? వడ్డీ ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి మీ తరపున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. చేయూతతో మారిన పొదుపు సంఘాలు... మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చేయూత వల్ల పొదుపుసంఘాల పనితీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మరలా ఈ రోజు ఊపిరి పోసుకుంది. ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లగా మార్పు చెందాయి. ఈ సంఘాలు ఇంతకముందు ఎన్పీఏలు. గత ప్రభుత్వ హయాంలో ఎన్పీఏలు ఓవర్ డ్యూస్గా 18 శాతం మేరకు సంఘాలు ఉంటే.. ఈ రోజు ఎన్పీఎలు, ఓవర్ డ్యూలు శాతం 0.45 శాతం మాత్రమే. మనందరి ప్రభుత్వం సాధికారిత, అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అక్కచెల్లమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆ రోజులలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం అంటూ ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కచెల్లెమ్మలతో పనిఅయిపోయింది. అక్కచెల్లెమ్మలకిచ్చిన హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబరు నుంచి వారి తరపున కట్టాల్సిన సున్నావడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన సున్నావడ్డీని మరలా తీసుకొచ్చి దీనికింద రూ.3036 కోట్లు ఇవాళ వడ్డీ రూపంలో తిరిగి చెల్లించడం జరిగింది. 2016 అక్టోబరులో నిలిచిపోయిన సున్నావడ్డీ అనే పథకాన్ని మన ప్రభుత్వం తిరిగి తీసుకునిరావడం వల్ల మన ప్రభుత్వం రూ.3615 కోట్లు సున్నావడ్డీ పథకం కింద చిరునవ్వుతో చెల్లించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసిందో కొన్ని ఉదాహరణలు చెబుతాను. వివిధ పథకాల ద్వారా... జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైయస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు సాయం అందించాం. వైయస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.596 కోట్లు అందించాం. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా మరో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యాదీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువులు కోసం అందించిన సహాయం.. రూ.9947 కోట్లు. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు వసతి భోజన సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి రూ.3363 కోట్లు ఇచ్చాం. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్లపట్టాలిచ్చాం. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తైతే ప్రతి అక్కచెల్లెమ్మచేతిలోనూ ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న పరిస్థితులు.. ఇవన్నీ పూర్తైతే ఈ ఒక్క పథకం ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. మహిళా పక్షపాత ప్రభుత్వం.... ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మలకు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతను కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగుపడాతాయని నమ్మిన ప్రభుత్వం మనది. కాబట్టి.. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడి, వారి రక్షణ మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అఢుగులు వేస్తున్నాం. ఆర్ధికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా అక్కచెల్లెమ్మలను పైకి తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం... నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకూ గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకూ ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. అక్క చెల్లెమ్మల రక్షణ కోసం... అక్కచెల్లెమ్మల రక్షణ కల్పించే విషయంలో అడుగులు వేగంగా వేసింది. అక్కచెల్లెమ్మలు ఎక్కడికి పోయినా, ఎప్పుడు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలి. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా పోన్ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పదినిమిషాల్లో అక్కడికి వచ్చి అక్కా నీకేమైంది అని అడిగే గొప్ప వ్యవస్ధనుతీసుకొచ్చాం. 21 వ శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే.. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26వేల మంది అక్కచెల్లెమ్మలకి మంచి జరిగింది. ఇవన్నీ మహిళలు విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగాలని, బాగుపడాలని 21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో ఈ 45 నెలల పాలన జరిగింది. ఈ రోజు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు సొమ్ము ఇచ్చాం. ఇంతలా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించి, మంచి చేసిన పరిస్థితి గతంలో లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా తపిస్తున్నాను. దేవుడి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై, ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ ఆసరా: సీఎం జగన్ దెందులూరు పర్యటన దృశ్యాలు
-
హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా: సీఎం జగన్
Updates Time: 01:05 PM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. Time: 12:47 PM ►రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్ ►ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు : ►ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను ►స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ►అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం ►మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం ►9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ►రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం ►తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు ►చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి ►99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారు ►దేశానికి రోల్మోడల్గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం ►ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం ►చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది ►ఎన్పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే ►గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ►రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు ►వారిని నిలువునా ముంచేశారు ►2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు ►రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్కవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ►తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం ►2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం ►చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వం మనది ►ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది ►అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం: ►మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం ►కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది ►ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది ►గుడి ఛైర్మన్, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం ►అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్ను తీసుకు వచ్చాం ►1.17 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నారు ►21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపన పడుతున్నాను Time: 12:25 PM ►మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది: సీఎం జగన్ ►వ్యాపార దిగ్గజాలతో ఒప్పంద చేసుకొని వ్యాపార మార్గాలు చూపాం ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచాం. ►పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్మోడల్గా నిలిచారు ►పొదుపు సంఘాల పనితీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాం ►78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం ►10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు ►ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్ ఆసరా కార్యక్రమం Time: 12:25 PM ►పొదుపు సంఘల మహిళలకు అండగా నిలిచాం: సీఎం జగన్ ►డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాం ►లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు ►ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం Time: 12:09 PM ►మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సీఎం జగన్ ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా ►డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా ►నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా ►ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నా Time: 12:00 PM ►వైఎస్సార్ ఆసరా నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: లబ్దిదారులు ►వైఎస్సార్ ఆసరా నిధులతో మా కాళ్ల మీద మేము నిలబడ్డాం ►అండగా విద్యాకానుక, విద్యాదీవెన, ఫీజురీయింబర్స్మెంట్ పథకాలు. ►మీ పాలనలో మా పిల్లలకు మంచి చదువులు ►నవరత్నాల పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నింపారు. Time: 11:45AM ► సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుది: ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ►డ్వాక్రా మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. ►పొదుపు సంఘాలు చివరికి సీ,డీ గ్రేడ్లకు పడిపోయాయి. ►సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మల్లో మళ్లీ ఆనందం తెచ్చిన ఘనత సీఎం జగన్ది ►సీఎం జగన్ పాలనలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్లకు చేరాయి. Time: 11:31AM ► వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులను పలకరించిన సీఎం జగన్ ► వైఎస్సర్ ఆసరా లబ్ధిదారులతో సీఎం జగన్ ఫోటో సెషన్ Time: 11:15AM ►దెందులూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్నారు. Time: 10:50AM ► దెందులూరుకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా ప్రాంగణానికి బయల్దేరారు. దారిపోడవునా సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. Time: 10:10AM ► ఏలూరు జిల్లా దెందులూరుకు సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. సాక్షి, ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. పథకం ఉద్దేశ్యం ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ పథకం తీసుకురావడం జరిగింది. మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి సీఎం బాటలు వేశారు. కార్పొరేట్ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ మహిళలకు గుడ్న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు ఉత్సవాలు కాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు. చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! ఇంటింటికీ వెళ్లి.. మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు 2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్ల్లో కొనసాగుతున్నాయి. -
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై దెందులూరు పోలీస్స్టేషన్లో ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఎస్సై ఐ.వీర్రాజు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభాకర్ను ప్రభుత్వాసుపత్రి నుంచి పెదవేగి తరలిస్తుండగా సోమవరప్పాడు బైపాస్ వద్ద జీపు దిగి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి వెళ్లిపోయారన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీపు డ్రైవర్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 2/23తో 341, 24, 506, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్పై ఈ నెల 2న కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. చదవండి: (చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్) -
దెందులూరును అభివృద్ధి చేయాలనే నేను లండన్ నుంచి వచ్చా : అబ్బయ్య చౌదరి
-
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్పై పవర్ఫుల్ పంచ్లు
సాక్షి, ఏలూరు: తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత, శాసన సభా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్ నుంచి వచ్చా. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.కానీ, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రగతి యాత్రలో(మంగళవారం) అదే విషయం మేం చెప్పాం. కానీ, ప్రతిపక్ష పార్టీ మితిమీరి విమర్శలు చేస్తోంది. అయినా మీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ బాబుకు సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది వైఎస్ జగన్మోహన్రెడ్డినే అని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. ‘‘ఈ మూడున్నరేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరవేర్చారు. కానీ, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎంగా వైఎస్ జగన్.. ఎన్నో అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చేశార’’ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అలాగే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. కనీసం నాలుగు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అదే సీఎం జగన్.. ఈ మూడున్నరేళ్లలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఏపీలో రైతులు పండించిన ప్రతీ గింజను కొనేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్. మరి 44 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతులను పట్టించుకున్నావా? అంటూ చంద్రబాబును నిలదీశారు. డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కానీ, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం మా ప్రభుత్వం పై బురద చల్లాలనీ చూస్తున్నాయి. అది చూసి రాష్ట్ర ప్రజలు అంతా ‘బాబూ.. మాకు ఈ కర్మ ఏమిట’ని అనుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. అర్హులకు సంక్షేమం అందుతోంది గనుకే ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నామని అబ్బయ్య చౌదరి తెలిపారు. ఓటమి భయం తో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఇసుక మాఫియాకు పాల్పడింది చింతమనేని కాదా? అని నిలదీసిన అబ్బయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ఫలితంతో చింతమనేనిని కూడా తన వెంట హైదరాబాద్కు చంద్రబాబు తీసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. -
ఏలూరు పెదవేగి మండలంలో దెందులూరు ప్రగతి యాత్ర
-
ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం: అబ్బయ్యచౌదరి
దెందులూరు: పినకడిమి, ప్రత్తికోళ్లలంకలో హత్యలు చేయించింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. 18 నెలలు ప్రత్తికోళ్లలంకలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడానికి సూత్రధారి, పాత్రధారి ఎవరో కూడా అందరికీ తెలుసని చెప్పారు. పినకడిమిలో బలవంతంగా బంగారం లాక్కోవడం, దౌర్జన్యాలు ఇలా చెప్పుకొంటూపోతే తాను ప్రతీదీ చెప్పగలనని ఆయన తెలిపారు. గురువారం వైఎస్సార్సీపీ దెందులూరు మండల కన్వీనర్ కామిరెడ్డి నాని నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే సీఎంగా చంద్రబాబునాయుడు ఉండగానే చింతమనేనిపై రౌడీషీట్ తెరిచారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 84 కేసులు అన్ని పోలీస్స్టేషన్లలో నమోదయ్యాయని, 24 కేసులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు. చింతమనేని హయాం అంతా ప్రజలు, ఉద్యోగులు, పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, దూషణలు లాంటి ఘటనలే అధికమన్నారు. పూర్తి నేర చరిత్ర కలిగిన చింతమనేని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చదవండి: (Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్లో నారా లోకేష్కు ఝలక్) మూడేళ్ల పాటు ప్రశాంత వాతావరణంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రూ.470 కోట్ల మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టినట్టు చెప్పారు. సంక్షేమ పథకాలు కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందించామన్నారు. తాము మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తుంటే 10 రోజుల్లో నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ, గ్రామగ్రామానా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలకే నియోజకవర్గంలో ప్రశాంతతను భగ్నం చేసేందుకు చింతమనేని కుట్రకు తెరలేపారన్నారు. చంద్రబాబు స్క్రీన్ప్లే చేస్తుంటే.. పప్పు లోకేష్ ప్రోత్సహిస్తున్నాడని, చింతమనేని ఈ కుట్రలన్నీ అమలు చేస్తున్నాడని చెప్పారు. ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం... ఏ నియోజకవర్గంలోనూ, ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఆడకూతుళ్లను సైతం సోషల్ మీడియాలో ప్రచారసాధనాల్లో లాగి కించపరిచేలా పోస్టులు పెడితే ఇకపై తమ తడఖా చూపిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చింతమనేని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పక్క నియోజకవర్గం వెతుక్కుంటున్న చింతమనేని నాకు పోటీయా.. గత ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో తన చేతిలో ఓడిపోయి పోలీస్స్టేషన్లో కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపి, ఓటమి భయం పట్టుకుని మూడేళ్లుగా ఇంటికే పరిమితమై పక్క నియోజకవర్గాల్లో ఏదోకచోట కర్ఛీఫ్ వేద్దామని, ప్రతి నియోజకవర్గానికీ తిరుగుతున్న చింతమనేని నాకు పోటీయా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంపై ఏ గ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు తేరా ఆనంద్, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు ఎస్ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్ కలిసి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని తదితరులపై 15 రోజులుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మోర్ల వరకృష్ణను సాయంత్రం 4.30 గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అతనికి మద్దతుగా దాదాపు వందమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు స్టేషన్కు వచ్చారు. ఈ విషయం తెలిసి శ్రీరామవరం నుంచి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కార్యకర్తలు స్టేషన్కు వచ్చారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నట్టుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి.. కళ్లల్లో కారం చల్లారు. ఘటనలో శ్రీరామవరానికి చెందిన కామిరెడ్డి నాగభూషణం, కామిరెడ్డి రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దాడిలో ఎస్ఐ వీర్రాజు సైతం గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్స్టేషన్కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్విప్గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
పెగాసస్తో ఎవరి ఫోన్నైనా టాప్ చేయవచ్చు: అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు: ఏపీలో పెగాసన్ దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు హయంలో పెగాసస్ వాడకంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెగాసస్ అంశంపై వైఎస్ఆర్సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పెగాసస్ ద్వారా ఎవరి ఫోన్నైనా టాప్ చేయవచ్చు. మన ఫోన్లో డేటాను పూర్తిగా పరిశీలించవచ్చు.. ఈ శాతాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ ఇది.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని గతంలోనే గ్రహించాం. పెగాసస్ స్పైవేర్తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు.. అధికార దాహంతోనే ఎలాంటి కుట్రకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు.. ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్ కొన్నారు.. గతంలో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే పెగాసస్ గురించి చెప్పారు’’. అని అన్నారు. -
ఏలూరు : ఉత్సాహంగా ఎడ్ల బండ్ల పోటీలు
-
రాట్నాలమ్మ ఆశీస్సులతోనే..
పెదవేగి (దెందులూరు): పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆశీస్సులతోనే తాను ఈ విజయం సాధించినట్టు పీవీ సింధు చెప్పారు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా క్రీడాకారిణిపై సింధు విజయం సాధించిన నేపథ్యంలో ఆమె తండ్రి పీవీ రమణను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ విజయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పీవీ సింధును అదే ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా సింధు తన విజయంపై పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అమ్మవారి కృపతోనే తాను విజయం సాధించినట్టు చెప్పారు. సింధు భారత్కు వచ్చాక రాట్నాలకుంటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని రమణ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 25న సింధు తన తండ్రితో కలిసి రాట్నాలమ్మను దర్శించుకున్నారు. -
మృత్యువు ఒడిలోకి ముగ్గురు స్నేహితులు
సాక్షి, దెందులూరు (పశ్చిమ గోదావరి): జాతీయ రహదారిపై దెందులూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గుండుగొలనులోని రామాలయం వీధికి చెందిన బాలిన నరేంద్ర (25), పరసా రామకృష్ణ (25), వెలివల గాంధీ (25) స్నేహితులు. రామకృష్ణకు బొలెరో వాహనం ఉండగా, నరేంద్ర, గాంధీ ఆప్టింగ్ డ్రైవర్లు. మంగళవారం రాత్రి వీరు బోలెరో వాహనంలో ఏలూరు వెళ్లి అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. దెందులూరు వద్ద పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి వాహనం టైరు పంక్చరైంది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి రోడ్డులో హైదరా బాద్ వెళుతున్న ఇంద్ర బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై డి.రామ్కుమార్, ఆర్టీసీ డీఎం సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికి తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భోజనానికి వస్తారని ఎదురుచూస్తున్నాం.. ‘భోజనానికి వస్తామని ఫోన్ చేశారు. భోజనం సిద్ధం చేశాం. ఇంకా రాలేదని ఎదురుచూస్తుండగా విషాద వార్త విని హతాశులయ్యాం. బిడ్డల మృతి కడుపు కోతను మిగిల్చింది’ అంటూ వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణ ఇంటిలోని వ్యాన్ తాళం తీసుకుని బయటకు వెళ్తూ వెంటనే వచ్చేస్తాను, భోజనం రెడీగా ఉంచమ్మా అంటూ పరసా రామకృష్ణ అనగా, బాలిన నరేంద్ర భోజనం వద్ద కూర్చున్నవాడే లేచి వెళ్లిపోయాడు. గాంధీ కూడా భోజనం సిద్ధంగా ఉంచామని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఈ ముగ్గురు రాత్రి 10.30 గంటల వరకు గ్రామంలో అందరితో కలిసి తిరిగారు. తరువాత వీరు బొలెరో వ్యాన్పై ఏలూరు వెళ్లారు. తిరిగి తమ ఇంటికి మరో కొద్ది నిమిషాల్లో చేరుకునే లోపే మృత్యు ఒడికి చేరారు. లేకలేక పుట్టాడు.. గౌడపేటకు చెందిన బాలిన శ్రీనివాసరావు, ధర్మావతి దంపతులకు వివాహం తర్వాత చాలాన్నాళ్లకు లేకలేక బాలిన నరేంద్ర పుట్టాడు. అతనిని అల్లారుముద్దుగా పెంచారు. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల కితం వివాహం కాగా, భార్య గర్భిణి. నరేంద్ర ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బిడ్డ మృతితో కుటుంబసభ్యులు గుండెలావిసేలా రోధించారు. తల్లిదండ్రులు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. బడ్టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు. చేదోడువాదోడుగా.. పరసా రంగారావు, వెంకటలక్ష్మీలకు రెండో సంతానం పరసా రామకృష్ణ బొలెరో వాహనంపై చేపల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో వాహనం నడుపుతూ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నోడు తెలివైనోడు.. వెలివెల సుబ్బారావు, నాగలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో చిన్నవాడైన వెలివెల గాంధీ అప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తెలివైన వాడు కావడంతో ఆ కుటుంబమంతా అతనిపైనే ఆశలు పెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో కుమా రుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు
సాక్షి, దెందులూరు: రామారావుగూడెం పంచాయతీ మలకచర్లలో 71 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా కోర్టులో వ్యాజ్యం వేసి అడ్డుకున్నది టీడీపీకి చెందిన పర్వతనేని వెంకటరామారావు అని వైఎస్సార్ సీసీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి నాని, వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. శ్రీరామవరంలో వారు విలేకరులకు వివరాలు తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, కోర్టులో కేసు వేసిన వ్యక్తికి, టీడీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు మంగళవారం విలేకరులకు తెలిపారన్నారు. అయితే ఆ వ్యాజ్యం వేసిన వెంకటరామారావు టీడీపీకి చెందిన వ్యక్తి అనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని చూపించారు. మలకచర్లలో హెల్త్ సెంటర్ నిర్మాణం, మేదినరావుపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పెదవేగి మండలంలో ఐదు గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో వ్యాజ్యం వేయటాన్ని వారు తప్పు పట్టారు. వైద్యశాల విషయంలో కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గంలో దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే నియోజకవర్గ ప్రజలందరూ వ్యతిరేకించి చింతమనేనిని ఇంటికి పరిమితం చేశారని నాని పేర్కొన్నారు. అయినా తీరు మార్చుకోకుండా టీడీపీకి వందల ఓట్ల మేరకు తక్కువ పడిన గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా చేసేందుకు ఏదొక సాకుతో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయిస్తున్న తీరును నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్, ఫిల్లింగ్కు వ్యత్యాసం తెలియని వారంతా ఉన్నత విద్యను అభ్యసించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని విమర్శించటం చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరబాబు, పార్టీ సీనియర్ నాయకుడు కామా కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు'
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా కట్టడి అయ్యేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబితే కొందరు అవహేళన చేశారు.. కానీ నేడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే చెబుతుందంటూ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరితో కలిసి సుచరిత శుక్రవారం దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడి నేపధ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటునే రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు. దేశంలోనే కరోనా వైద్య పరీక్షలు అత్యధికంగా ఆంద్రప్రదేశ్లో జరిగాయన్నారు. కరోనా నివారణపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రెండు గంటలకు సమీక్ష లు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు విడతల రేషన్తో పాటు వెయ్యి రుపాయలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంత కఠిన పరిస్థితిలోనూ సీఎం జగన్ సంక్షేమ పధకాలు కొనసాగించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్ద చాలా చక్కగా పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ('సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు') -
రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం
సాక్షి, ద్వారకాతిరుమల: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కులాలు, మతాలు ఒక్కటే అయినా వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఈ మధ్యే పెద్దలు సైతం వారిని చేరదీశారు. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన పెద్దింటి ప్రతాప్ కుమార్(27) అదే గ్రామానికి చెందిన గాయత్రిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాగవెంకట త్రినాథ్, హరీష్ నాయుడు సంతానం. ప్రతాప్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ సందర్భంగా మృతుడు శనివారం ఏలూరుకు వెళ్లి తన ఇద్దరు పిల్లలకు దుస్తులు కొన్నాడు. అనంతరం తన స్నేహితుడు కందాడై లక్ష్మీకాంత్తో కలసి ద్విచక్ర వాహనంపై రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఘటనా స్థలమైన దెందులూరు మండలం సింగవరంలోని తిరుమల డెయిరీ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్, వీరి బైక్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రతాప్ కుమార్ తీవ్ర గాయాలుపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రతాప్ కుమార్ అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలి
సాక్షి, దెందులూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతు దీక్ష దేనికోసం చేశారో అందరికీ తెలిసిందేనని, కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి ఆయన తన అక్కసు వెళ్లగక్కుక్కునే వేదికగా రైతు సౌభాగ్య దీక్ష చేశారని, దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయ పడదామన్న అత్యాసతో ఉన్నట్లు పవన్ కల్యాణ్ తీరు కనబడుతోందన్నారు. రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయటంలో పవన్ కల్యాణ్ లక్ష్యం ఏమిటనేది నేరుగా ప్రకటించాలని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. పరిష్కారమైన సమస్యలపై ప్రశ్నలు వేస్తే ప్రజలకు జనసేన దేనికోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం సమయంలో కాలువలు ఆధురికీకరణ చేయకపోయినా, గత ఐదేళ్లూ పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు పన్నెత్తి మాట అనలేదన్నారు. ప్రజల్లో పరువు తీసుకోవద్దని పవన్ కల్యాణ్కు అబ్బయ్య చౌదరి హితవు పలికారు. -
చంద్రబాబులో అభద్రతాభావం: అబ్బయ్యచౌదరి
సాక్షి, దెందులూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. చంద్రబాబు జిల్లాలోని మూడురోజుల పర్యటనలో మాట్లాడిన ప్రతిచోటా హావభావాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. గురువారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఆవరణలో చంద్రబాబు మూడురోజుల జిల్లా పర్యటన, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వత్తాసు పలకటంపై ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విలేకరులతో మాట్లాడారు. చింతమనేనిని వెనకేసుకురావటానికే చంద్రబాబు సమయం మొత్తం కేటాయించారన్నారు. పార్టీ ఓటమికి కారణాలు, పరిస్థితులపై చర్చించకుండా చింతమనేనిని అమాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నానా తంటాలు పడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా నిశితంగా పరిశీలించారన్నారు. దళితులను కించపరిచేలా చింతమనేని వ్యాఖ్యానించటం నిజం కాదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం, వేగాన్ని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడటం, కోర్టుల్లో సైతం స్టేలు ఎత్తివేయటంతో చంద్ర బాబులో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇసుకను మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ఇదంతా మరిచి స్వచ్ఛ పాలన అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు అతి కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే జిల్లాలో ప్రశాంతత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జిల్లాలో రౌడీయిజాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. అయోధ్య తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా 30 యాక్టు అమలులో ఉంటే జిల్లాలోనే ఈ యాక్టు ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడటం విచారకరమని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. -
చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు
సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా ద్వారా నారా లోకేష్కు ముడుపులు చెల్లించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం జానంపేట వద్ద ఇసుక స్టాక్ యార్డ్ను ఆదివారం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో కలిసి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించామన్నారు. గత పాలనలో ఇసుకను దోచుకొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్న పార్టీ దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇసుక దీక్ష చేసిందని దుయ్యబట్టారు. ప్రజలు మీరు చేసిన దొంగ దీక్షను గమనించి తిప్పికొట్టారని ఎద్దేవా చేశారు. చింతమనేని వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చింతమనేనిపై నమోదయిన కేసులు అన్నీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నమోదైన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వాటి దర్యాప్తు ఆధారంగానే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారే తప్ప కొత్తగా మేము ఏ కేసులు పెట్టలేదని తెలిపారు. చింతమనేని తన కేసులకు సంబంధించి అన్ని విషయాలు చంద్రబాబును అడిగితే బాగుంటుందని వెల్లడించారు. అలాగే మీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న వనజాక్షిపై దాడి జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెటిల్ చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో అడ్డగోలుగా ఇసుక రవాణా జరిగినా నోరు మెదపని పవన్ కల్యాణ్ వైజాగ్లో లాంగ్ మార్చ్ నిర్వహించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చంద్రబాబుతో కలిసి అడ్డుకోవద్దని ఆయన హితవు పలికారు. ఈ మేరకు భవిష్యత్తులో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చింతమనేనిని వదలని కోర్టు కేసులు
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కోర్టు కేసులు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయి .ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై ఏలూరు సబ్ జైలులో ఉన్న చింతమనేనిపై 2011లో కోడి పందాల కేసులో విజయవాడ స్పెషల్ కోర్టు పిటి వారెంట్ జారీ చేసింది. అందులో భాగంగా బుధవారం చింతమనేనిని ఏలూరు సబ్ జైలు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టులో హజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి గతంలో వాయిదాలకు హజరు కాకా పోవడంతో పీటీ వారెంట్ జారీ చేసిన విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ పిటీషన్ను రేపటికి వాయిదా వేసింది. చింతమనేనిపై 2011లో యానిమల్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. -
చింతమనేని అనుచరులు తీవ్ర పదజాలంతో దూషించారు
-
ఎస్ఐ క్రాంతి ప్రియపై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాష్ట్రం దాటి బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. చింతమనేని కేసుల విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లో చింతమనేనికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసుల అధికారులు, సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో పెదవేగి మండలం భోగాపురంలో పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న చింతమనేని, అతని అనుచరులు అక్కడకు వచ్చి విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయటంతోపాటు, అర్థరాత్రి వరకూ నిర్బంధించారు. దీనిపై అప్పటి విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు ఆదేశాల మేరకు అధికారులు పెదవేగి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి పెదవేగి ఎస్సై క్రాంతిప్రియ నిర్లక్ష్యంగా కేసు నమోదు చేయకపోవటంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సై విధులను సక్రమంగా నిర్వర్తించలేదని నిర్థారణ కావటంతో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ఏ ఖాన్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చింతమనేనితో టచ్లో ఉన్న ఒక ఎస్సైపైనా వేటు పడే అవకాశాలున్నాయి. -
చింతమనేని ప్రభాకర్ అమాయకుడా?
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఇప్పటి వరకూ నమోదైన కేసులు 49. అందులో ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయి. అధికార బలంతో అప్పట్లో పలు కేసులను తప్పుడువని రిఫర్ చేయించుకుని ఆయన ఎత్తివేయించుకున్నాడు. ఆఖరికి పోలీసులపై దాడి చేసిన కేసులు కూడా తప్పుడు కేసులుగా అప్పటి పోలీసు అధికారులు ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా దాడులకు పాల్పడుతున్న చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయగానే అతనిపై అక్రమ కేసులు పెట్టారంటూ తెలుగుదేశం నేతలు కలెక్టర్ను కలిసి గగ్గోలు పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. 1995లో గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్పై దౌర్జన్యం చేయడం ద్వారా చింతమనేని నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. రౌడీ షీటు కూడా ఉంది 1995 నుంచి ఇప్పటి వరకూ 49 కేసులు చింతమనేనిపై నమోదు అయ్యాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఆయనపై రౌడీషీటు కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటివరకూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు బాధితులు భయపడటంతో ఒక్క కేసు మినహాయిస్తే మిగిలిన వాటిలో శిక్షలు పడలేదు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై దాడి చేయడంతోపాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్కుమార్ గన్మేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 5 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేయగా విచారణ చేసిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా నమోదైన కేసులో కూడా పోలీసులే ఆయనకు ముందస్తుగా లీక్ ఇచ్చారని, పారిపోవాలని ఆయనకు సన్నిహితులైన పోలీసులు సంకేతాలు ఇచ్చారని నిర్ధారణైంది. ఒక ఎస్ఐ నిరంతరం ఆయనతో టచ్లో ఉన్నట్లు కాల్లిస్ట్ డేటాలో తేలింది. ఇతనిపైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితుల క్యూ చింతమనేని పరారు కావడంతో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తాము పెట్టిన కేసులను పోలీసులు చింతమనేనికి భయపడి ఫాల్స్ కేసులుగా రిఫర్ చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో వీటిపై పునర్విచారణ చేయనున్నట్లు ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డేలేకుండా..! తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం చింతమనేని ఆగడాలకు అడ్డం లేకుండా పోయింది. దళితులను ఉద్దేశించి మీకెందుకురా రాజకీయాలు అంటూ హేళనగా చింతమనేని మాట్లాడారు. అయితే దీనిపై పలువురు ఫిర్యాదు చేసినా అప్పట్లో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి కేసు నమోదు కాకుండా చూశారు. విజిలెన్స్ అధికారులను నిర్బంధించిన కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ఎస్సై కాంతిప్రియపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. గత ఏడాది హమాలీ కార్మికుడు రాచేటి జాన్పై చింతమనేని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించారు. దానిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి తీవ్ర జాప్యం చేశారు. కార్మికుల ఆందోళనతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినా అరెస్టు చేయలేదు. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. చింతమనేని ఇన్ని అకృత్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ వారికి అమాయకుడిలానే ఆయన కనపడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడేమో అడ్డగోలుగా వ్యవహరించిన చింతమనేనిని అధిష్టానం ఏనాడు నియంత్రించలేదు. చింతమనేనిని లక్ష్యంగా చేసుకుని ఆయనపై ఆక్రమ కేసులు బనాయించారంటూ ఇప్పుడు జిల్లా తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చింతమనేని అరాచకాల చిట్టా కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయారు. అంగన్వాడీ కార్యకర్తలను దుర్భాషలాడారు పోలీస్ కానిస్టేబుల్ మధును చితక్కొట్టారు. అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపారు. కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే అంశంలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరుపారేసుకున్నారు. 2017 మేలో గుండుగొలను జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడి చేశారు. దీంతో వారు దెందులూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ప్రభాకర్పై 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హనుమాన్జంక్షన్లో బస్ డ్రైవర్పై దాడి ఏలూరులో రాచేటి జాన్ అనే దళిత కార్మికునిపై దాడి పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు మేడికొండ కృష్ణారావుపై దాడి న్యాయం చేయాలని వెళ్లిన వికలాంగుడి కుటుంబంపై దాడి ఎన్నికల్లో ఓటమి తర్వాత జానంపేట వద్ద వేసిన పైపులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. తాజాగా గత నెల 29న దళితులను దూషించి దౌర్జన్యానికి దిగారు. ఆ కేసులోనే ఇప్పుడు పరారీలో ఉన్నారు. -
పరారీలో చింతమనేని ప్రభాకర్!
-
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్!
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత ఆరు రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కేసు పెట్టిన యువకులకు బెదిరింపు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు పెట్టిన యువకుడికి బెదిరింపులు వస్తున్నాయి. చింతమనేనిపై కేసును విత్డ్రా చేసుకోవాలని, లేకుంటే నీ అంతుచూస్తామని జోసఫ్ను చింతమనేని ప్రభాకర్ అనుచరుల బెదిరించారు. చింతమనేనిపై జోసెఫ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జోసెఫ్ ఏలూరు డిఎస్పీకి తనకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. -
‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవు’
సాక్షి, పశ్చిమగోదావరి : తమ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. దళితులపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలోని ఇసుకను, పోలవరం మట్టితో పాటు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ చింతమనేని చేసిన అరచకాలపై కేసులు పెడితే 200 పైనే నమోదు అవుతాయన్నారు. ఇప్పటికే ఆయనపై 35 కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని విమర్శించారు. దళితుల యువకులపై దాడి చేసినందుకు కేసు పెడిపెడితే అవి అక్రమ కేసులు అనడం సిగ్గు చేటన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్న దళితులపై చింతమనేని దారుణంగా దాడి చేశారన్నారు. చంద్రబాబు పాలనతో చింతమనేని అరాచకాలకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయన్నారు. కానీ సీఎం జగన్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవని హెచ్చరించారు. సెప్టెంబర్ 5నుంచి కొత్త ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక అందజేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ మైనింగ్ ఉండకూడదనే సీఎం జగన్ కొత్త విధానం తెచ్చారన్నారు. -
సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని
పెదవేగి రూరల్, పెదపాడు: మొన్నటి వరకు అధికారదర్పంతో దౌర్జన్యాలకు తెగబడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా ఎన్నికల్లో తనను ఓడించిన ఓటర్లపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వపై రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులను చింతమనేని ప్రభాకర్ మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు పెదపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పైపులను తన సొంత ఖర్చులతో వేయించానని కొద్దిరోజుల క్రితమే చింతమనేని పట్టుకుపోయే ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. సోమవారం రాత్రి తన అనుచరులతో వచ్చి వాటిని తీసుకుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం రైతుల పొలాలకు నీరందించేందుకు పెదవేగి మండలం జానంపేట అక్విడెట్కు సమీపంలో పోలవరం కుడికాలువ ఎడమ గట్టు వద్ద పైపులను ఏర్పాటు చేశారు. సుమారు 260 పైపులు ఏర్పాటు చేసి వాటి నుంచి నీటిని దిగువన ఉన్న పొలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. దీని కోసం స్థానిక రైతులు ఎకరానికి వెయ్యి నుంచి రూ.1500ల వరకూ చందాలు వేసుకుని ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో తనను ఓడించారన్న కక్షతో ఈ పైపులను అనుచరులతో తొలగించి తన తోటల్లో వేయించుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరిస్థితిని సమీక్షించారు. చింతమనేనిని అరెస్టు చేసి పైపులు రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. -
చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని
సాక్షి, ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టిన నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనికి తగిన బుద్ధి చెప్పారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన చింతమనేని ప్రభాకర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి బరిలోకి చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు కౌంటింగ్కు ముందే స్పష్టమైంది. -
తొడ కొట్టిన చింతమనేనికి షాక్ తప్పదా?
సాక్షి, దెందులూరు: తన గెలుపు నల్లేరుపై నడక అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికిన చింతమనేనికి ఓటమి భయం పట్టుకుందా? దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగలబోతుందా? హాట్రిక్ సాధించాలని కలలు కన్న ఆయన ఓటమిని ఎదుర్కోబోతున్నారా? వైఎస్సార్సీపీ నుంచి గట్టి పోటీ ఉండటంతో చింతమనేనికి ఇంక చింతే మిగలనుందా? పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనం.. రాష్ట్రంలోని దెందులూరు నియోజకవర్గ ఎన్నికలపై అందరి చూపు ఉంది. ఇక్కడ నుంచి బరిలోకి దిగిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. దీంతో ఇపుడు దెందులూరు ఎన్నికలలో చింతమనేని గెలుస్తారా లేదా ...హాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎంపిపిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు తెలుస్తోంది. తనకి చాలా గట్టిపోటీ ఎదురైందని...గెలుపుపై చింతమనేనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చింతమనేని సామాజిక వర్గానికే చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉండటం.. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండటం ఈ ఎన్నికల్లో ప్లస్ పాయింట్గా మారింది. కొఠారు అబ్బయ్య చౌదరి ఈ ప్రాంత వాసులకు కొత్త కాకపోయినా రాజకీయాలకు కొత్త. 2017 వరకు లండన్లో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్న కొఠారు అబ్బయ్య చౌదరికి రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. నేరుగా తండ్రి రాజకీయ వారసత్వంతోపాటు స్వదేశంలో సొంతగడ్డపై ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షకు తోడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్గా నియమితులైన కొఠారు అబ్బయ్య చౌదరి చింతమనేని అక్రమాలపై గట్టిగానే పోరాటం చేశారు. రెండేళ్లుగా గడప గడపకు వైఎస్సార్, రావాలి జగన్ కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో అబ్బయ్య చౌదరి ప్రజలలో మమేకమయ్యారు. ఇదే సమయంలో సొంత సామాజిక వర్గం నుంచి కూడా చింతమనేని కంటే కొఠారుకే ఎక్కువ మద్దతు లభించిందని తెలుస్తోంది. చింతమనేని తీరుతో విసిగెత్తిపోయిన దెందులూరు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మార్పు కోరుతూ చింతమనేనికి చెక్ పెట్టారనే ప్రచారం సాగుతోంది. -
మీ అంతు చూస్తా.. జైల్లో పెట్టిస్తా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులపై చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నా కొడకల్లారా మీ అంతు చూస్తా..తేడా వచ్చిందో కేసుల్లో ఇరికించి జైలులో పెట్టిస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు జనాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఓ మహిళ చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన అధికారులను బండ బూతులు తిట్టారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చింతమనేనిపై ఏకంగా 26 కేసులు ఇప్పటికీ నడుస్తుండగా, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్పై దౌర్జన్యం చేసిన కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష కూడా విధించింది. ఆయనపై ఏలూరు పట్టణ 3వ టౌన్ పీఎస్లో నేటికీ రౌడీషీటు ఉంది. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రజాప్రతినిధిగా కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలున్నాయి. కృష్జాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలను దుర్బాషలాడటం, పోలీస్ కానిస్టేబుల్ మధును చితక్కొట్టడం, అటవీశాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్లే అంశంలో జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం, గుండుగొలను జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీవోలపై దాడి, ఇళ్ల స్థలాలు, పొలాలు గొడవల పేరుతో దాడులు చేయడం పరిపాటిగా మారింది. సీఎం అండతోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అండతోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, తదితరులపై సెక్షన్ 341, 323, 506 కింద అక్రమ కేసులు బనాయించారు. అలాగే ఇసుక అక్రమంగా తరలింపును అడ్డుకున్న కృష్జాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి పక్కకిలాగి పడేశాడు. ఉద్యోగ సంఘాలు సైతం వనజాక్షికి మద్దతు తెలపడంతో ఏకంగా చంద్రబాబు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. హమాలీ కూలీల ముఠా నాయకుడు రాచీటి జాన్పైనా దాడి చేశాడు. పెదవేగి మాజీ సర్పంచిని ఎంఎల్ఎ నివాసంలో గన్మెన్లు చేతులు వెనక్కి విరగదీసి పట్టుకోగా ఎమ్మెల్యే ప్రభాకర్ బూటుకాలుతో పొట్టలో, తలపై తన్నడంతో కృష్ణారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల అక్రమ మైనింగ్ను అడ్డుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులను బెదిరించడం చర్చనీయాంశమయ్యింది. -
పోస్టల్ బ్యాలెట్ వద్ద చింతమనేని మాజీ గన్మెన్ హల్చల్
-
చింతమనేని గన్మెన్ హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్మెన్లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్మాన్ లక్ష్మణ్ హల్చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్ష్మణ్పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. లక్ష్మణ్ దెందులూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికి.. చింతమనేని సేవలోనే తరిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కార్యక్రమల్లో పార్టీ కార్యకర్తగా సేవలు కూడా అందిస్తున్నారు. చింతమనేని అండదండలుండటంతో ఉద్యోగానికి హాజరు కానప్పటికి చర్యలు శూన్యం. ఈ క్రమంలో కానిస్టేబుల్గా ఉంటూ అధికారులను సైతం పేరు పెట్టి పిలుస్తూ.. వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే లక్ష్మణ్ ఎన్ని వేషాలేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
దెందులూరు ఎన్నికల ప్రచార సభలో వైఎస్ షర్మిల
-
చింతమనేని బెదిరింపులకి భయపడొద్దు : షర్మిల
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : ‘ఇసుక తనిఖీలకు వెళ్లిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన టీడీపీ ఎమ్మెలే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అసలు మనిషేనా? ఆయన ఒక తల్లికి పుట్టలేదా? ఆమె మహిళ కాదా? ఆయన భార్య మహిళ కాదా? మహిళలపై గౌరవం లేని ఇలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించండి. చింతమనేని బెదిరింపులకి భయపడవద్దు. ఈ ఎన్నికలే మీకు ఆయుధం. మీ ఓటుతో చింతమనేనికి గట్టిగా బుద్ది చెప్పండి’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు దెందులూరు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. ఇది ఎన్నికల జిమ్మిక్కు. ఈ సారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండి. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం దారుణం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ ఇయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వరు. చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదు ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో కుమ్మకై ప్యాకేజీకి ఒప్పకున్నారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు.. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది. చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చడానికి చేయని ప్రయత్నం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. దమ్ముంటే ఆ బాకీలు చెల్లించి ఓట్లు అడగమనండి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఓట్లు కొనడానికి టీడీపీ డబ్బులతో వస్తారు. అమ్ముడు పోకండి. గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? రైతులు, మహిళలకు, చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ డబ్బు మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. దమ్ముంటే ఆ బాకీలను కట్టి ఓట్లు అడమని చెప్పండి. సేవ చేయడానికి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. రాబోయే రాజన్న రాజ్యలో రైతే రాజు అవుతారు. జగన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఇస్తాం. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు కొటారు అబ్బయ్య చౌదరిని, ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబుగారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు
-
దెందులూరులో చింతమనేని అధ్వర్యంలో మైనింగ్ మాఫియా
-
వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే : పండుల రవీంద్రబాబు
-
‘మట్టి అమ్ముకోడానికి రాజకీయాల్లోకి రాలేదు’
సాక్షి, దెందులూరు: మట్టి అమ్ముకోవడానికో, ఇసుకు అమ్ముకోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను విమర్శిస్తూ దెందులూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరీ అన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుతో కలిసి దెందులూరు మండలం పాలగూడెం, కొవ్వలి తదితర గ్రామాలలో కొఠారు అబ్బయ్య చౌదరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడానికే లక్షల రూపాయలు వచ్చే మంచి ఉద్యోగాన్ని వదులుకున్నానని అన్నారు. గత ఐదేళ్లలో చింతమనేని దెందులూరును దోచుకున్నారని ఆరోపించారు. మూడున్నర ఎకరాల ఉన్న చింతమనేని నేడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని దుయ్యబట్టారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు బినామీ పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. చింతలపూడి వద్ద 120 ఎకరాలను బినామీ పేర్లతో కొనిపించాడని ఆరోపించారు. దెందులూరు ప్రజలకి రాక్షస పాలన చూపిన చింతమనేనికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దెందులూరులో గెలిచి మంచి పాలన అంటే ఏంటో చూపిస్తామన్నారు. అమరావతి.. భ్రమరావతి : పండుల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి ఓటేస్తే ఏపీ రాష్ట్రం అధోగతి పాలవుతుందని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. బిహార్, ఈశాన్య రాష్ట్రాల కంటే వెనకబడిపోయే అవకాశముందన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏపీని దోచుకున్నారని ఆరోపించారు. అమరావతి భూముల సేకరణ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు. అమరావతిని భ్రమరావతిగా మార్చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు దారిలోనే ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. మంచి ఆశయంతో సైకిల్ ఎక్కి తొక్కాను.. ఐదేళ్లూ తొక్కుతూనే ఉన్నా..దిగి చూస్తే సైకిల్ అక్కడే ఉంది.. సైకిల్కు చైన్ లేదు.. చక్రాలు లేవన్నారు. మంచి గాలి కావాలంటే ఫ్యాన్ ఉండాలని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసులా వైఎస్ జగన్ 25 ఏళ్లపాటు ఏపీకి మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీకి 150 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. చింతమనేని అరాచకాలు పెరిగిపోయాయని, దళితులను విమర్శిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. చింతమనేనిని దెందులూరులో ఓడించి అబ్బయ్య చౌదరీని గెలిపిస్తామన్నారు. లోకేష్ 25 సీట్లు వస్తాయని నిజమే చెప్పాడు.. నిజంగానే వాళ్లకి 25 ఎమ్మెల్యే సీట్లే వస్తాయని వ్యాఖ్యానించారు. -
దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా అబ్బయ్య చౌదరి నామినేషన్
-
‘అక్రమ పాలన, పోలీసు రాజ్యం నడుస్తోంది’
సాక్షి, పశ్చిమగోదావరి : రాష్ట్రంలో అక్రమ పాలన, పోలీసు రాజ్యం నడుస్తోందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్ధితులు లేకుండా భయభ్రాంతులకి గురిచేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని అబ్బయ్య చౌదరి ఈసీకి విఙ్ఞప్తి చేశారు. కొందరు పోలీసు అధికారులు పచ్చనేతలకు కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానీ నివాసంలో విషాదం నెలకొంది. నానీకి వరసకు సోదరుడైన ఆదిత్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారంటూ కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం అతడు బెయిల్పై విడుదల అయ్యాడు. అయితే సోదరుడి అరెస్ట్ను నిరసిస్తూ ఆదిత్య నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేపట్టాడు. (కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు) (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్) మరోవైపు కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు కావడంతో ఆదిత్య తన బంధువులను ఇంటి వద్ద దించేందుకు కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారు వద్ద ఆదిత్య ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే మరణించగా, మరో వృద్ధురాలు గాయపడగా...ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆదిత్య మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కామిరెడ్డి పరామర్శించిన నేతలు వారికి మనోధైర్యం చెప్పారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
-
కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు
-
కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు
సాక్షి, ఏలూరు : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన వీడియో షేర్ చేశారంటూ అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కామిరెడ్డి నానికి బెయిల్ లభించింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ... బెదిరింపులు, కేసులకు తాను భయపడేది లేదని, ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్) కాగా కామిరెడ్డి నానికి శుక్రవారం వివాహం జరగగా, శనివారం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్ జరిగింది. ఆ తర్వత అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు త్రీ టౌన్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన నానీని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ నేతలు, గ్రామస్తులు, మహిళలు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దళితులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన చింతమనేనిపై కేసులు పెట్టకుండా, అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. -
కత్తుల రవి విషయంలో పోలీసుల ఓవరాక్షన్
-
కత్తుల రవికి బెయిల్ మంజూరు
పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ నేత కత్తుల రవికుమార్కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైఎస్సార్సీపీ నేత రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అరెస్ట్ అనంతరం పొద్దున్నుంచి ఏలూరు వీధుల్లో, సందుల్లో తిప్పుతూ బెదిరింపులకు పాల్పడుతూ చివరికి ఏలూరు రెండవ అదనపు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్పై బయటికి వచ్చిన రవిని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మరడాని రంగా రావు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషెన్ రాజు, దళిత సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు’ వినాశకాలే ‘విప్’రీత బుద్ధి -
చింతమనేనిని తీవ్రంగా హెచ్చరించిన ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎంపీ పండుల రవీంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు. దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావ్. అంబేద్కర్ భిక్ష వల్లే నువ్ ఎమ్మెల్యేగా తిరుగుతున్నావ్. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధికాక తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం’ అని రవీంద్రబాబు చెప్పారు. (చింతమనేని వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ..) -
వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్భందం
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వారి కార్యకలాపాలకు అడ్డుపడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సరైన కారణం లేకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని అరెస్ట్ చేయకుండా.. తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చింతమనేని వ్యాఖ్యలపై తాము ఎటువంటి నిరసనలకు పిలువునివ్వకపోయినప్పటికీ.. ఏదో ఊహించుకుని ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకుల నిర్భందం
-
దళితులను తీవ్రంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమగోదావరి : దళితుల పట్ల టీడీపీ వివక్షాపూరిత ధోరణి మరోసారి బయటపడింది. మొదటి నుంచీ వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రంగా అవమానించారు. దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...‘రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా’ అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. (మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని) దీంతో చింతమనేనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ప్రజాప్రతినిధి కాదని.. ప్రజా గూండా అని, ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలకింద కేసులు పెడుతామని ప్రకటించాయి. గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేత మోషేన్రాజు తెలిపారు. చింతమనేని అనుచిత వ్యాఖ్యలు దళితులను మాత్రమే అవమాన పరచలేదని, రాజ్యాంగాన్ని కూడా కించపరిచేవిగా ఉన్నాయని ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యుడు బత్తుల భీమారావు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే మాట్లాడిన ప్రభాకర్కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జాతి ఆదరాభిమానాలతో అధికారం చెలాయిస్తున్న నాయకులకు గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న దళిత నాయకులు చింతమనేని వ్యాఖ్యలను ఖండించకపోవడం విచారకరమన్నారు. -
ప్రజల హృదయాలకు హత్తుకునేలా ‘యాత్ర’
సాక్షి, ఏలూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సార్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైఎస్సార్సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’ బెనిఫిట్ షోను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు. పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం
సాక్షి, దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు. -
వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై చింతమనేని అనుచరుల దాడి
-
రాయన్నపాలెంలో ఉద్రిక్తత
పెదవేగి: హైటన్షన్ వైర్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ కుటుంబంపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఖాళీ స్థలం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ నేత కొఠారు రామచంద్రరావు ఇంటిపై నుంచి హైటెన్షన్ వైర్లు వేయాలంటూ విద్యుత్ అధికారులపై చింతమనేని ఒత్తిడి తేవడమే ఉద్రిక్తతకు కారణమైంది. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కొఠారు విజ్ఞప్తి చేసినా విద్యుత్ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ నేత కొఠారు రామచంద్రరావు, అధికారులను అడ్డుకుని అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం సంఘటనాస్థలానికి భారీగా పోలీసులను మోహరించింది. కొఠారు రామచంద్రరావుకు మద్ధతుగా రాయన్నపాలెంలోని ఆయన ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. -
చింతమనేని ఇక నీ ఆటలు సాగవ్
పెదపాడు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటలు ఇక సాగవని, ఆయన పదవి ఊడటానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులో దెందులూరు కార్యకర్తల సమావేశంలో అబ్బయ్య చౌదరీ మాట్లాడారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటిలోనూ చింతమనేని దోపిడీ పాల్పడ్డారని ఆరోపించారు. అప్పన ప్రసాద్పై అక్రమ కేసులు , రౌడీషీట్తో వేధించినా ఆయన భయపడలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని అన్నారు. చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి దెందులూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చింతమనేని రౌడీయిజంతో దెందులూరు ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని వివరించారు. చింతమనేని, వల్లభనేని ఇద్దరూ దోపిడీదారులే: దుట్టా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా దోపిడీదారులేనని వైఎస్సార్సీపీ నేత దుట్టా రామచంద్ర రావు విమర్శించారు. నియోజకవర్గాల్లో సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి అక్రమాలే కనిపిస్తాయని చెప్పారు. గాంధీజీకి జాతిపిత బిరుదును నేనే ఇచ్చానని కూడా చంద్రబాబు చెప్పుకోగల ఘనుడని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్కు ఎక్కడ పేరొస్తోందనే భయంతోనే పోలవరం కాలువకు ఆనాడు దేవినేని ఉమ లాంటి వారు అడ్డుపడ్డారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత ఒక్క కంపెనీ రాలేదు: యార్లగడ్డ లోకేష్ లాంటి దిక్కుమాలిన ఐటీ మంత్రి వచ్చిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదని గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. లోకేష్ కాకుండా మరెవరైనా ఐటీ మంత్రి అయ్యింటే కనీసం ఒకటో, రెండో ఐటీ కంపెనీలు వచ్చేవని చెప్పారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుతోనే అధికారంలోకి వచ్చారని, కానీ వైఎస్ జగన్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు ఎంపీలు రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం చాలా దుర్మార్గమన్నారు. -
దెందులూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం
-
అవినీతిలో తారాస్థాయికి టీడీపీ పాలన
ఏలూరు: టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని తీవ్రంగా విమర్శించారు. ఏలూరు అశోక్ నగర్ లో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆళ్లనాని విలేకరులతో మాట్లాడుతూ.. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీయిజంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళిత కార్మికుడిని కొట్టిన చింతమనేనిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని సూటిగా అడిగారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి ప్రజలు 15 సీట్లు అప్పగిస్తే జిల్లా ప్రజలకి ఏం చేశారని ప్రశ్న లేవనెత్తారు. టీడీపీ పాలనలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులంతా దోపిడీలో ఆరితేరిపోయారు..మట్టి నుంచి ఇసుక వరకు దేన్నీ వదలడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతిపై ఎన్నిఆరోపణలు వచ్చినా చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉన్నారని దుయ్యబట్టారు. 2018 నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీరిస్తానన్న మాట ఏమైందని అడిగారు. వచ్చే ఎన్నికలలో 15 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు పశ్చిమ ప్రజలు అంతం పలకబోతున్నారని వ్యాఖ్యానించారు. అబ్బయ్య చౌదరీ మాట్లాడుతూ.. చింతమనేని ప్రభాకర్ పాలనకు చరమగీతం పాడదామని పిలుపునిచ్చారు. నారా అంటే నరరూప రాక్షసుడని, రాష్ట్రంలో నరరూప రాక్షసుడి దుర్మార్గపు పాలనను అంతమొందించాలని ప్రజలను కోరారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు, తమ ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతుకుతున్నారని, దెందులూరులో రౌడీపాలనను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో దెందులూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరబోతోందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకే ఏలూరు అశోక్ నగర్లో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. దెందులూరు ప్రజలకి ఏకష్టమొచ్చినా తాము అండగా ఉంటామని, సమస్య ఉన్న వారు ఒక్క ఫోన్ కాల్ చేయాలని అన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. మీడియాపైనా చిందులు!
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద సాగుతున్న అక్రమ మైనింగ్పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి.. నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు దాడులు చేసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న చింతమనేని విజిలెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?’ అంటూ ఆయన దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదలాలంటూ అధికారులను బెదిరించారు. అయినా వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని వెనుదిరగగా.. ఆయన ప్రోద్బలంతో కొద్దిసేపటికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్ ఆధ్వర్యంలో వందమంది టీడీపీ కార్యకర్తలు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు విజిలెన్స్ డీజీ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. మీడియాపైనా రౌడీయిజం! ఈ ఘటన నేపథ్యంలో విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ అచ్యుతరావుని కలిసిన చింతమనేని ప్రభాకర్ .. అనంతరం మీడియాతోను దురుసుగా ప్రవర్తించారు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళుతూ.. చింతమనేని బూతుపురాణం విపారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా కోడక్కల్లారా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కెమారామెన్లు, మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు. కాగా, అక్రమ మైనింగ్ చేస్తున్న నాలుగు టిప్పర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. వాటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని, ఈ ఘటనపై పెదవేగి పోలీసులకి ఫిర్యాదు చేశామని విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు మీడియాతో తెలిపారు. -
‘పవన్ కల్యాణ్.. నా దగ్గర ట్యూషన్కి రా’
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఓ గల్లీ నాయకుడి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను రాజ్యాంగయేతర శక్తిగా ఎదుగుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. తానను రౌడీ షీటర్ అని పవన్ చెప్పాల్సిన అవసరం లేదని, తానేంటో దెందులూరు ప్రజలకు తెలుసన్నారు. నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు చూస్తే పవన్ తట్టుకోలేరని హెచ్చరించారు. నియోజక వర్గం అభివృద్ధిపై ఒక్క కామెంట్ చేయలేకనే వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పవన్ కల్యాణ్ మూడు రోజుల అన్నం తినడం మానేస్తాడని ఎద్దేవా చేశారు. పవన్కు దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలి సవాల్ చేశారు. తనపై పవన్ గెలిస్తే ఆయనకు సన్మానం చేసి ఆయనతో నడుస్తానన్నారు. ఓడిపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఉంటారంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 18 ఏళ్ల వాడిని పోటీకి నిలబెడతాను అంటున్నారు. ఆ వయసులో అసెంబ్లీలో పోటీ చేసేఅవకాశం లేదని కూడా పవన్కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజకీయ జ్ఞానం కోసం పవన్ తనతో ట్యూషన్ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు. బుధవారం దెందులూరులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎమ్మెల్యే చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా .. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. విదేశాల్లో అయితే పర్యవసనాలు తీవ్రంగా ఉండేవని వ్యాఖ్యానించారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ : పవన్ -
చంద్రబాబుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వల్లే అరకు ఎమ్మెల్యే హత్య జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరకు పాంత్రంలో అక్రమ మైనింగ్పై ప్రజలు చేసిన ఫిర్యాదులను సీఎం పట్టించుకోకపోవడం వల్లే మావోయిస్టులు ఎమ్మెల్యేను హత్య చేశారన్నారు. బుధవారం ఆయన దెందులూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ అని ఎల్యే చింతమనేని ప్రభాకర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ పదవిలో ఉండి దౌర్జన్యం చేస్తుంటే సీఎం ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 27 కేసులున్న దెందులూరు ఎమ్మెల్యేను చట్టసభల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. కొల్లేరు భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వుకుంటూ అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం మానుకోవాలని పవన్ హెచ్చరించారు. చింతమనేని ఇన్ని దారుణాలు చేస్తుంటే జిల్లా కలెక్టర్, డీజీపీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లోకి వెళ్లకుండా జైల్లో కూర్చోవాల్సిన వారిని పెంచి పోషిస్తున్న టీడీపీకి తాను ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి, లోకేశ్కి చింతమనేని అంటే భయం అందుకే అతనిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చింతమనేని నీ అరాచకాలు మానుకోకపోతే నేనే దెందులూరు వస్తాను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరిలో ప్రశాంతత లేకుండా చేశారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తిరగబడతామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని చింతమనేనికి పవన్ వార్నింగ్ ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక.. -
చింతమనేనిపై పోరుబాట: దీక్షను విరమించిన అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. చింతమనేని ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండుతో కొఠారు అబ్బయ్య చౌదరి శనివారం నుంచి దీక్షకు దిగారు. దీక్ష విరమణ అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు రాయన్నపాలెం నుంచి గోపన్నపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతమనేని అక్రమాలపై విచారణ జరిపి.. ఆయనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చింతమనేని అక్రమ మైనింగ్పై అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. ఇక నీ ఆగడాలను సాగనివ్వమంటూ నిరశన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యానికి తెరదించడంతోపాటు, చింతమనేని అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం ఈ దీక్ష చేపట్టారు. -
చింతమనేని అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలు
పెదవేగి రూరల్ : ఒకపక్క ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర 200 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా బుధవారం పెదవేగి మండలంలో పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరికి ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అబ్బయ్య చౌదరి కార్యకర్తలతో కలిసి వెళ్లి తమ్మిలేరులో అక్రమంగా ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్కు అడ్డంగా బైఠాయించారు. జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. మీరు వస్తే కాని ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పి అక్కడే భైఠాయించారు. దీంతో పెదవేగి తహసీల్దార్ ఎండి నజిముల్లాషా, ఎస్సై కాంతిప్రియ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ పొక్లయిన్తో తవ్వకాలు చేసి, యంత్రంతో ఇసుకను జల్లించి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తమ్మిలేరు పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి ఇసుక గోతులను పరిశీలిస్తే ఎంత మేర దోచుకున్నారో అర్థం అవుతుందన్నారు. ఈ తవ్వకాలపై నడిపల్లి, ఎల్లాపురం సమీప ప్రాంత రైతులు హైకోర్టుకు వెళ్లి తమ్మిలేరులో ఇసుక తీయకుండా ఆర్డర్ తీసుకువస్తే తాత్కాలికంగా పది రోజులు నిలిపి మళ్లీ ఎమ్మెల్యే అండదండలతో తవ్వుతున్నారన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అధికారులు పొక్లయిన్ను సీజ్ చేశారు. -
సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక అధికార టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు వెళ్లకుండా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సభకు హజరుకావొద్దని ఏలూరు మండలం చొదిమళ్ల గ్రామస్తులను టీడీపీ నాయకులు బెదిరించారు. వైఎస్ జగన్ సభకు హాజరైతే ప్రభుత్వ పథకాలు అన్నీ కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదేవిధంగా ఎస్సీ, బీస్సి, కాపులను సభకు రాకుండా అడ్డుకుంటామంటూ టీడీపీ నేతలు బెదిరింపులు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. టీడీపీ నాయకుల బెదిరింపులపై వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్ అభిమానులు మండిపడుతున్నారు. బెదిరింపులతో ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరని అన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మురళీ రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గంటా మురళీ రామకృష్ణ, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొఠారు అబ్బయ్య చౌదరి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలను ఈ పదవుల్లో నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
టీడీపీ నేత కుట్ర బట్టబయలు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పొట్టనపెట్టుకున్నా అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. తాజాగా పశ్చిమగోదారి జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు టీడీపీ నాయకుడు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కొత్తపల్లి రమేశ్ను హత్య చేయించేందుకు టీడీపీ ఎంపీటీసీ శోభన్బాబు కుట్ర పన్నారు. ఇందుకోసం బహ్మానందం అనే రౌడీషీటర్తో ఒప్పందం కుదుర్చుకుని, అతడికి 25 వేల రూపాయలు చెల్లించారు. అయితే బహ్మానందం మనసు మార్చుకోవడంతో ఈ కుట్ర బహిర్గతమైంది. విషయం తెలుసుకున్న రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రాక్షస పాలనకు చరమగీతం
రాట్నాలకుంట (దెందులూరు) : టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అభివృద్ధి, సంక్షేమం విస్మరించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడితే దీటుగా గుణపాఠం చెబుతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని హెచ్చరించారు. మంగళవారం పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మతల్లి కల్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీ నియోజకవర్గ కన్వీనర్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో దెందులూరుతో కలిపి 14 నియోజకవర్గాల ప్లీనరీలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. ప్రతి నియోజకవర్గ ప్లీనరీలోనూ ప్రజా సమస్యలు, పరిష్కారం, ప్రణాళికలు, తీర్మానాలు చేయటం జరిగిందన్నారు. టీడీపీ విశాఖపట్నం, కొవ్వూరుల్లో నిర్వహించిన మహానాడుల్లో ఒక్క ప్రజా సమస్యపై అయినా చర్చించారా అని ప్రశ్నించారు. మూడు సంవత్సరాల పాలనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని అయినా చేశారా? పేదవాడికి ఒక్క ఇల్లు అయినా కట్టారా? అని ఎద్దేవా చేశారు. వనరులను దోచుకోవడం, ఆస్తులు కూలగొట్టడం, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం విచారకరమన్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన పోలవరం కాలువను పేరు మార్చి పట్టిసీమ నామకరణం చేసి పైప్లైన్ల ద్వారా కొంతమంది రైతులకు సాగునీరు అందించి రైతులకు నీరిచ్చామని సంబరాలు చేసుకోవటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పైపులతో కాకుండా అదే ప్రాంతంలో రూ.2 కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పెడితే నియోజకవర్గంలో ఎంతోమంది రైతులకు మేలు జరిగేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మట్టి, ఇసుక మేటలను ఎవరు కొల్లగొట్టారో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ప్రతి పని ప్రచార ఆర్భాటం కోసమే చేస్తున్నారు తప్ప పేదల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా చేయటం లేదని విమర్శించారు. టీడీపీ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా జిల్లాలో కొల్లేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని నాని ప్రశ్నించారు. దెందులూరులో ప్లీనరీ నిర్వహణ కోసం వైఎస్సార్ సీపీ జెండాలు కడుతుంటే బెంబేలెత్తి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తీసేయాలని టీడీపీ నేత ఒత్తిడి చేయడంతోనే వైఎస్సార్ సీపీ అంటే ఎంత భయపడుతున్నారో తెలుస్తుందన్నారు. ఐదేళ్లుగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన కొఠారు రామచంద్రరావును ఈ సందర్భంగా అభినందిస్తున్నానని నాని చెప్పారు. కొల్లేరులో డ్యామ్, రెగ్యులేటర్ కడతాం కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ జిల్లాలో ఎమ్మెల్యేలుగా రౌడీలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించారని, ఉద్యోగులు, అధికారులు ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు, బూతుల పంచాంగం టీడీపీ నేతలకే చెల్లిందన్నారు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలవటం ఖాయమన్నారు. వ్యవసాయం దండగంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, జపాన్, ఇతర దేశాల్లో పర్యటించినా ఆంధ్రాకు పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొల్లేరులో డ్యామ్, రెగ్యులేటర్ కట్టి తీరుతామని, రైతులకు దివంగత కోటగిరి విద్యాధరరావు స్ఫూర్తితో సేవలందిస్తానని శ్రీధర్ అన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి విషయానికి హద్దు ఉంటుందని దెందులూరు నియోజకవర్గంలో హద్దుదాటిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అదే రీతిలో గుణపాఠం చెబుతానన్నారు. మహిళా అధికారిని జుట్టు పట్టుకుని ఈడ్చి, పెదవేగి మండలంలో ఇద్దరు ఎస్సైలను కొట్టి, అధికారులను బండ బూతులు తిడుతున్న ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్ దురాగతాలను నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తొలుత సమావేశంలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, గోపాలపురం, చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకటరావు, డి.నవీన్బాబు, పుప్పాల వాసుబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్. సాయిబాల పద్మ పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్లీనరీకి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. -
బుడిబుడి అడుగులు ఆగిపోయాయ్
దెందులూరు : ‘ఒరేయ్ డింపూ.. ఆడుకుంటానికెల్తన్నా..’ ‘అన్నియ్యా.. నేనూ వత్తా..’ ‘తొందరగా రారా..’ ‘ఎక్కడికెల్దాం..’ ‘అయిగో.. ఇసక దగ్గర్కి’ అనుకుంటూ ఆ చిట్టిపొట్టి అడుగులు ఇంటి సమీపంలోని ఇసుక గుట్టల వైపు నడిచాయి. కాసేపటి తరువాత అక్కడే ఉన్న చెరువు వైపు పరుగులు తీశాయి. రేవులోని మెట్లపై జారాయి. ఒకరినొకరు పట్టుకోబోతూ ఆ చిన్నారులిద్దరూ నీటిలో మునిగిపోయారు. కూతవేటు దూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఆ దృశ్యాల్ని చూశారు. పరుగు పరుగున వచ్చి నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీశారు. అప్పటికే ఓ బుడతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కొన ఊపిరితో ఉన్న మరో చిన్నారిని గ్రామంలోని వైద్యశాలకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యుడు నిర్థారించారు. దెందులూరులో సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అక్కా చెల్లెళ్లకు గర్భశోకం మిగల్చగా.. గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. దెందులూరులోని గౌడ వీధిలో ఆడుకునేందుకు వెళ్లిన మోర్ల గౌతమ్ (6), కొండేటి డింపు దుర్గాప్రసాద్ (4) సమీపంలోని మొటపర్తివారి కోనేరు చెరువులోకి జారి మృత్యువాత çపడిన ఘటన కలచివేసింది. ఇంటి నిర్మాణంలో నిమగ్నం కాగా.. గౌడ వీధిలో నివశిస్తున్న ఐనాల శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి రెండో కుమార్తె మోర్ల సుజాత, అల్లుడు రాజు దెందులూరులోనే ఉంటున్నారు. వారికి గౌతమ్ (6), మరో పాప ఉన్నారు. మూడో కుమార్తె అరుణను ఏలూరుకు చెందిన కొండేటి కాసులుకు ఇచ్చి వివాహం చేయగా, వారికి డింపు దుర్గాప్రసాద్ (4), నాలుగు నెలల పాప ఉన్నారు. అరుణ ఐదు నెలల క్రితం కాన్పు కోసం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఇదిలావుంటే.. శివరామకృష్ణ తన ఇంటికి సమీపంలోనే రెండో కుమార్తె సుజాత కోసం పెంకుటిల్లు నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారులిద్దరూ సమీపంలోని ఇసుక గుట్టలపై ఆటలాడుతూ పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. రేవులో మెట్లు దిగుతూ నీటిలో జారిపడ్డారు. అక్కడకు కొంతదూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఈ ఘటనను చూసి పరుగెత్తుకు వచ్చారు. నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీయగా అప్పటికే గౌతమ్ మృతిచెందాడు. డింపు దుర్గాప్రసాద్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో గ్రామంలోని వైద్యశాలకు తరలించారు. అప్పటికే డింపు కూడా మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. ‘ఎంత పనిచేశావ్ దేవుడా..’ అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గౌతమ్, దుర్గాప్రసాద్ మృతి వారిద్దరికీ గర్భశోకాన్ని మిగిలి్చంది. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. ఆడుకోవటానికి వెళ్లి విగత జీవులుగా మారిన చిన్నారులను చూసి గౌతమ్ తల్లి సుజాత, డింపు దుర్గాప్రసాద్ తల్లి అరుణ సొమ్మసిల్లి పడిపోయారు. తాత, అమ్మమ్మ శివరామకృష్ణ, వెంకట మహా లక్ష్మి, కుటుంబ సభ్యులు ‘ఎంత పనిచేశావ్’ దేవుడా అంటూ గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. నాలుగు రోజుల్లో అత్తింటికెళ్దామనుకుంటుండగా.. పురుటి కోసం బిడ్డ దుర్గాప్రసాద్తో కలిసి పుట్టింటికి వచ్చిన అరుణను బాలింత పత్యం పూర్తి కావడంతో మరో నాలుగు రోజుల్లో ఏలూరులోని అత్తింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రులు శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చీర, సారెలతో బిడ్డ అరుణను, మనుమడు దుర్గాప్రసాద్, నాలుగు నెలల పసికందును ఘనంగా సాగనంపాలనుకున్నారు. ఈలోగానే మృత్యువు గౌతమ్, దుర్గాప్రసాద్ లను తీసుకెళ్లిపోయింది. కాన్పు సుఖంగా అయితే ద్వారకాతిరుమల వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అరుణ, ఆమె భర్త కొండేటి కాసులు అనుకున్నారు. వారం రోజుల క్రితం తమ బిడ్డలిద్దరినీ తీసుకుని ఆ దంపతులు ద్వారకా తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. త్వరలోనే ఏలూరులోని తమ ఇంటికి వెళదామనుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నాయకులు కట్టా వెంకట సుబ్బారావు, యేసుబాబు, గౌడ సంఘం పెద్దలు పరామర్శించారు. తహసీల్దార్ ఎస్.సత్యనారాయణ, సర్పంచ్ ఎన్.అజయ్, సొసైటీ అ«ధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ టి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. -
ప్రకృతి వ్యవసాయంపై రైతుల ఆసక్తి
దెందులూరు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనబరచడం అభినందనీయమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వై.ఆనందమయి అన్నారు. శుక్రవారం దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో దెందులూరు ఏఎంసీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రైతులకు అవగాహన సమావేశం ఏలూరు ఏడీఏ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల బలోపేతం, సంక్షేమం, అధిక దిగుబడులు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరి సాగు చేస్తున్న ఒక్కొక్క ఎకరానికి రూ.2వేలు చొప్పున ఆరుగురికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీడీ విజిఎస్ఈ హరి, ఏఈవో వై.నాయుడు, ఆత్మ ఏపీఎం టి.స్వర్ణలత, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు. -
దెందులూరులో వ్యక్తి హత్య
దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. రామకృష్ణ(50) అనే వ్యక్తిని సొంత వదిన, అన్న కొడుకు రవికుమార్లు కలిసి రోకలిబండతో అతడి తలపై మోదారు. దీంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితులు దెందులూరు పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్యకు ఆస్తివివాదాలే కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మా పుట్టిల్లు దెందులూరు
కామవరపుకోట : తాను ఇప్పటివరకు 100 సినిమాల్లో నటించానని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ అన్నారు. కామవరపుకోటలో శ్రీ పీఠాన్ని శుక్రవారం ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా తన పుట్టిల్లు దెందులూరు వచ్చానని చెప్పారు. ఏటా సంక్రాంతికి వస్తుంటానన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తీస్తున్న సినిమాలో బ్రహ్మానందం భార్య పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. ఎక్కువుగా బ్రహ్మానందం, కృష్ణభగవాన్ పక్కన నటించానన్నారు. తన అభిమాన హీరో మహేష్బాబు అని, అభిమాన హీరోయిన్ అనుష్క అని చెప్పారు.