detention
-
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్గంజ్ జిల్లా భైరబ్లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
న్యూజిలాండ్ పైలట్కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
తహసీల్దారును నిర్బంధించిన వీఆర్వో
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాల తహసీల్దారును మంగళవారం వీఆర్వో నాగమల్లేశ్వరి నిర్బంధించారు. తోటి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయారు. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో సహా చనిపోతానంటూ ధర్నాకు దిగారు. ఈ వ్యవహారం సంచలనం కలిగించింది. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం సచివాలయ వీఆర్వోగా బి.నాగమల్లేశ్వరి పనిచేస్తున్నారు. సచివాలయం పరిధిలోని ఘంటసాలపాలెం, కొత్తపల్లి, తాడేపల్లి గ్రామాల వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మూడు గ్రామాలకు సంబంధించిన పాస్బుక్ ఫైల్స్, ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులను అధికారులు తన ప్రమేయం లేకుండానే కొడాలి, ఘంటసాల, లంకపల్లి వీఆర్వోలు తదితరులతో చేయిస్తున్నారని, తన సంతకాలు లేకుండా ఫైల్స్ ఆన్లైన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించారు. కార్యాలయంలో తహసీల్దారు ఎన్.బి.విజయలక్షి్మని నిర్బంధించారు. తనకు న్యాయం చేసేంతవరకు తలుపులు తీయనని భీషి్మంచారు. బయట నుంచి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తలుపులు తీశారు. ఆమె కుమారుడు కార్యాలయం బయట గోడలపై పెట్రోల్ పోశాడు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వచ్చి తనకు న్యాయం చేయాలని, లేదా తన కుమారుడితో కలసి చనిపోతానంటూ కుమారుడితో కలసి తహసీల్దార్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తన పరిధిలో పనులు తన ప్రమేయం లేకుండా జరగడంపై ఆర్డీవో విచారించాలని, తనకు న్యాయం చేయాలని తొమ్మిది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్ఐ చినబాబు అక్కడికి వచ్చి వీఆర్వో నాగమల్లేశ్వరితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూద్దామని సర్దిచెప్పారు. అయినా నాగమల్లేశ్వరి ఆందోళన విరమించకపోవడంతో కలెక్టర్తో మాట్లాడిస్తామని సంబంధిత అధికారులతో చెప్పించి ధర్నా విరమింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల విధుల్లో భాగంగా ఐదునెలలు కిందట ఘంటసాల వచ్చినట్లు చెప్పారు. తాను పనుల్ని ప్రాపర్ చానల్ ద్వారానే చేస్తున్నానని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తన గదిలోకి వచ్చిన వీఆర్వో నాగమల్లేశ్వరి అక్కడే ఉన్న కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిందని, ఏమైందని అడుగుతుండగానే అసభ్య పదజాలంతో తిట్టడమేగాక తలుపులు మూసేసిందని, అనంతరం తన చాంబర్ ముందు బైఠాయించిందని చెప్పారు. గత తహసీల్దార్ హయాంలో వీఆర్వోకు సంబంధం లేకుండా ఫైల్స్ చేశారని వీఆర్వో ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో నుంచి వీఆర్వోపై వచ్చిన రిపోర్టు చూసి ఆగ్రహంతో ఆందోళన చేసి ఉంటుందని భావిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. -
అమృత్పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్పాల్ లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలన్నారు. అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్ను అస్సలు వదిలేయను. అసిమ్ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను. ..పాకిస్తాన్లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్) రాజు(నవాజ్ షరీఫ్) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది. ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్ మండిపడ్డారు. -
Israel-Hamas War: కన్నలూ, నన్ను మిస్సయ్యారా!?
జెరుసలేం/టెల్ అవీవ్: శుక్రవారం రాత్రి వేళ. ఇజ్రాయెల్లోని ష్నెయ్డర్ పిల్లల ఆస్పత్రి. ప్రధాన ద్వారమంతటా భావోద్వేగ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 57 ఏళ్ల అవీ జిచ్రీ చాలాసేపటి నుంచి ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికీ ప్రధాన ద్వారం కేసి చూస్తూ గడుపుతున్నాడు. ఎట్టకేలకు అతని ఎదురుచూపులు ముగిశాయి. తొమ్మిదేళ్ల చిన్నారి ఒహద్ అతని వైపు మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చాడు. వస్తూనే, ‘నాన్నా!’ అంటూ గట్టిగా కరుచుకుపోయాడు. ఆ క్షణాన వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ వెనకే అవీ భార్య, తల్లి కూడా వచ్చి అతన్ని అమాంతం వాటేసుకున్నారు! ఆ పక్కనే ఉన్న 38 ఏళ్ల అషెర్దీ అతని పరిస్థితే! తన భార్య డొరాన్, కూతుళ్లు అవివ్ (4), రజ్ (2) ఆస్పత్రి ప్రాంగణంలో రెడ్ క్రాస్ వాహనం దిగీ దిగగానే వారి దగ్గరికి పరుగులు తీశాడు. ముగ్గురినీ బిగ్గరగా వాటేసుకున్నాడు. తనను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న కూతుళ్లను పదేపదే ఆప్యాయంగా తడిమి చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘కన్నలూ, నన్ను మిస్సయ్యారా? నన్నే తలచుకుంటూ బాధ పడ్డారు కదూ!’’ అంటూ కూతుళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. 49 రోజుల హమాస్ నిర్బంధం నుంచి తొలి విడతలో విడుదలైన 13 మంది ఇజ్రాయెల్ బందీలు తమవారిని కలుసుకున్న సందర్భంలో కనిపించిన భావోద్వేగ సన్నివేశాలివి. వీటికి సంబంధించి ఆస్పత్రి విడుదల చేసిన వీడియోలు వైరల్గా మారాయి. అక్టోబర్ 7 నాటి మెరుపు దాడిలో వీరంతా హమాస్ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు. చిన్నారి ఒహద్ హమాస్ చెరలోనే తొమ్మిదో పుట్టినరోజు చేసుకోవడం విశేషం! ఆ రోజు ఇజ్రాయెల్ అంతా అతని పుట్టినరోజు వేడుకలు జరిపి సంఘీభావం ప్రకటించింది! ఒహద్తో పాటే అతని తల్లి, నాయనమ్మ విడుదలైనా తాతయ్య హమాస్ చెరలోనే ఉన్నాడు. ఎమిలియా అలోనీ అనే ఐదేళ్ల చిన్నారి కూడా తల్లితో పాటు విడుదలైంది. తమకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న నాయనమ్మను కలుసుకుని ఆనందంలో మునిగిపోయింది. -
ఆఫ్రికా దేశం నైగర్లో సైనిక కుట్ర
నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో సైనిక కుట్ర జరిగింది. బుధవారం ఉదయం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ నివాసాన్ని చుట్టుముట్టారు. బజౌమ్ను, ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ టీవీ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుని, తమను తాము నేషనల్ కౌన్సిల్గా గురువారం ప్రకటించుకున్నారు. శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్మీయే దేశ రక్షణ బాధ్యత వహిస్తుందని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ స్పందించారు. ‘సైనిక కుట్ర జరిగింది. కానీ, మేం దానిని అంగీకరించం. అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి. తిరుగుబాటును ప్రజలు తిప్పికొట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఈయన్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బజౌమ్ ప్రయత్నించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తిరుగుబాటుకు సైన్యం కూడా మద్దతు ప్రకటించింది. ఇలా ఉండగా పొరుగుదేశం బెనిన్ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. ఎట్టకేలకు 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
పిల్లలు తండ్రి వద్దే ఉంటామంటే.. అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి : ‘పిల్లలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా తండ్రి వద్ద ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు. పిల్లలకు తండ్రే సహజ సంరక్షకుడు. సహజ సంరక్షకుడిగా పిల్లలను తన సంరక్షణలో పెట్టుకునేందుకు తండ్రి అర్హుడు. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు అక్రమ నిర్బంధమే పరమావధి. అక్రమ నిర్బంధం లేదా అక్రమ కస్టడీ లేనప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. తన పిల్లలను తన భర్త అక్రమంగా నిర్బంధించారంటూ ఓ మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను తోసిపుచ్చింది. పిల్లల అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. తండ్రి వద్దే ఉంటామని పిల్లలు స్పష్టంగా చెప్పినందున, పిల్లల కస్టడీ కావాలనుకుంటే చట్ట ప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని ఆ మహిళకు సూచించింది. ఆమె పిటిషన్ దాఖలు చేసుకుంటే తాము వ్యక్తపరిచిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా విచారించాలని కింది కోర్టును ఆదేశించింది. తన పిల్లలను తన భర్త డాక్టర్ భానుమూర్తి అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన దేవప్రియ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను, అలాగే ఏడేళ్ల కుమారుడిని తన భర్త బలవంతంగా తీసుకెళ్లిపోయారని తెలిపింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ భర్త ఆమెను వదిలేసి మరో మహిళతో ఉంటున్నారని, అలాంటి వ్యక్తి వద్ద పిల్లలను ఉంచడం ప్రమాదకరమని అన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. పిల్లలతో న్యాయమూర్తులు మాట్లాడారు. 17 ఏళ్ల కుమార్తె మానసికంగా చాలా పరిపక్వతతో ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. హాస్టల్ నుంచి తనను తండ్రి బలవంతంగా తీసుకెళ్లలేదని, పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో తండ్రి వద్ద ఉండేందుకు తానే వెళ్లానని కుమార్తె చెప్పినట్లు పేర్కొంది. ఏడేళ్ల కుమారుడు కూడా తండ్రితోనే ఉంటానని చెప్పాడని తెలిపింది. తండ్రితో పాటు ఉంటున్న మహిళతో కలిసి తాము తండ్రి వద్దే సంతోషంగా ఉంటామని వారిద్దరూ ధర్మాసనానికి తెలిపారు. పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తండ్రి వద్ద ఉండటం పిల్లలకు ప్రమాదకరం కాదని స్ప ష్టం చేసింది. వారి ఇష్టానుసారమే తండ్రి వద్ద ఉంటున్నారని తెలిపింది. దీనిని అక్రమ నిర్బంధంగా చెప్పడం సాధ్యం కాదంది. దేవప్రియ శిరీష దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
రష్యా నుంచి తక్షణమే వచ్చేయండి
వాషింగ్టన్: రష్యాలో ఉంటున్న, అక్కడికి ప్రయాణం చేస్తున్న తమ పౌరులు తక్షణమే వెనక్కి వచ్చేయాలని అమెరికా కోరింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా అకారణంగా అమెరికా పౌరులను అరెస్ట్ చేసి వేధించే ప్రమాదముందని హెచ్చరించింది. ‘రష్యా భద్రతా సంస్థలు అమెరికా పౌరులపై నిరాధార ఆరోపణలు చేసి, నిర్బంధంలో ఉంచుతున్నాయి. వారికి న్యాయసాయం, అవసరమైన వైద్య చికిత్సలను సైతం అందకుండా చేస్తున్నాయి. రహస్య విచారణలు జరుపుతూ, ఎటువంటి రుజువులు లేకుండా దోషులుగా ప్రకటిస్తున్నాయి. మత ప్రచారకులైన అమెరికా పౌరులపై సైతం గూఢచర్యం కేసులను మోపి, విచారణల పేరుతో వేధిస్తున్నాయి’అని అందులో పేర్కొంది. సైన్యంలోకి రిక్రూట్మెంట్లను ప్రారంభించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వుల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా తమ పౌరులకు ఇదే విధమైన హెచ్చరికలు చేసింది. -
చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర జరిగిందనీ, అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నిర్బంధించారని వచ్చిన వార్తల్లో నిజానిజాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ వదంతులే కావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీవో శిఖరాగ్రం కోసం రెండేళ్ల తర్వాత దేశం దాటిన నేపథ్యంలో జిన్పింగ్ తిరిగి రాగానే క్వారంటైన్లో ఉండి ఉంటారని అంటున్నారు. 2021లోనూ జిన్పింగ్ కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇలాగే పుకార్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కాకపోతే శనివారమంతా ఇంటర్నెట్ ‘కుట్ర’ వార్తలతో హోరెత్తినా ఇలాంటి వాటిపై చురుగ్గా ఉండే చైనా సోషల్ మీడియా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు. బహుశా అక్టోబర్ 16వ తేదీన అధ్యక్ష ఎన్నిక నాటికే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది. ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. కీవ్లో ప్రతిఘటన కీవ్పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్ను కీవ్కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం ఉక్రెయిన్ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్ చెబుతోంది. చర్చల్లో పురోగతి రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి. జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన! ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు. -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
సినిమా ఫైనాన్సియర్ నిర్బంధం.. నగలు, నగదు అపహరణ
చెన్నై: సినిమా ఫైనాన్సియర్ను ఇంట్లో నిర్బంధించి నగలు, నగదు అపహరించిన స్నేహితుడు సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సినిమా ఫైనాన్సర్ అరెస్టయ్యాడు. చెన్నై సమీపంలోని తురైపాక్కం శక్తినగర్కు చెందిన నిర్మల్ జెమినీ కన్నన్ (33). భార్య కృత్తిక (28)తో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇతనికి చెన్నైకి చెందిన హరికృష్ణన్ (48)తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద రూ.13 లక్షలు రుణంగా తీసుకున్నట్లు సమాచారం. ఈ నగదు తిరిగి ఇవ్వకుండా దంపతులు హరికృష్ణన్ను మోసగించినట్లు తెలిసింది. దీంతో హరికృష్ణన్ తన స్నేహితుడు, సినిమా ఫైనాన్సియర్ చెన్నై విరుగంబాక్కంకు చెందిన లయన్ కుమార్ (48)ను మధ్యవర్తిత్వం కోసం సంప్రదించాడు. అతను గత ఫిబ్రవరిలో తురైపాక్కంలోని నిర్మల్ జెమినీ కన్నన్ ఇంటికి పంచాయితీ కోసం వెళ్లాడు. సినిమాకు ఉపయోగించే తుపాకీతో బెదిరించి కారు, మోటారు సైకిల్, నాలుగు గ్రాముల బంగారంను తీసుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే దంపతుల వద్ద నుంచి తీసుకున్న నగదు, నగలు, వస్తువులు హరికృష్ణన్కు ఇవ్వకుండా లయన్కుమార్ ఉంచుకున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన హరికృష్ణన్, నిర్మల్ జెమినీ కన్నన్ దంపతులతో ఒప్పందం కుదుర్చుకుని ఫైనాన్సియర్ వద్ద నుంచి వాటిని తిరిగి రాబట్టుకునేందుకు నిర్ణయించాడు. గత 27వ తేది ఫైనాన్సియర్ లయన్ కుమార్కు పుట్టినరోజు అని తెలియడంతో తురైపాక్కంలోని ఇంటిలో వేడుక జరుపుకుందామని చెప్పి ఆహ్వానించారు. లయన్కుమార్ను నిర్మల్ జెమినీ కన్నన్, అతని భార్య కృత్తిక, హరికృష్ణన్ ఇంట్లో నిర్భంధించి దాడి చేశారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, 18 సవర్ల బంగారు నగలు అపహరించి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. డీఎస్పీ రవి ఇంటికి వచ్చి లయన్కుమార్ను విడిపించారు. తురైపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి హరికృష్ణన్, నిర్మల్ జెమినీ కన్నన్లను అరెస్టు చేశారు. అలాగే ఫైనాన్సియర్ లయన్ కుమార్ అరెస్టయ్యాడు. ఈ కేసులో కృత్తిక, వారికి సహకరించిన స్టీఫెన్ కోసం గాలిస్తున్నారు. -
బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. నిరసన తెలిపితే చేతులకు బేడీలు.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే కటకటాల పాలు.. చంద్రబాబు అధికారంలో ఉండగా అదుపు లేకుండా సాగిన నిర్బంధ కాండ ఇదీ. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేసే హక్కులను గత సర్కారు కాలరాసింది. ఇష్టారాజ్యంగా 144, 151, 30 తదితర సెక్షన్లను ప్రయోగించి ఐదేళ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడుగడుగునా ఇబ్బందులకు గురి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్ జగన్ను విమానాశ్రయం రన్వేపైనే అడ్డుకుంది. 2017 ఫిబ్రవరిలో అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలో దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించి దమన కాండను ప్రదర్శించింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించిన తీరుపై ఇప్పటికీ ఆ సామాజికవర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుమారుడిపై దౌర్జన్యం, మహిళలను దుర్భాషలాడటం లాంటి ఘటనలు ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ శ్రేణులను, నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ముస్లిం యువతపై రాజద్రోహం కేసులు.. ముస్లిం యువతపై ఏకంగా రాజద్రోహం, దేశద్రోహం కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కింది. గుంటూరు, నంద్యాలలో చంద్రబాబు నిర్వహించిన సభల్లో న్యాయం కోసం ప్రశ్నించిన మైనార్టీ యువకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఈ అక్రమ కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ‘హోదా’ గళాలపై ఉక్కుపాదం..; ప్రత్యేక హోదా కోసం నినదించిన వారిపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్షాలపై మూడున్నరేళ్లకుపైగా టీడీపీ సర్కారు నిర్బంధకాండ సాగించింది. పోలీస్ యాక్ట్ 30, ప్రివెంటివ్ సెక్షన్ 151, ఐపీసీ సెక్షన్ 144, 147, 149, 153, 154, 188, 341, 353లతో కేసులు మోపింది. ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిలో రెండు, మూడు సెక్షన్లను ప్రయోగించడం గమనార్హం. రాష్ట్రంలో 1,065 మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయగా పలు జిల్లాల్లో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు, బైండోవర్ చేయడం లాంటి చర్యలతో అణచివేతకు పాల్పడింది. రాజధాని రైతులపై తీవ్ర వేధింపులు.. రాజధాని అమరావతికి భూములివ్వలేమన్నందుకు పేద రైతులకు బెదిరింపులు, అక్రమ కేసులు తప్పలేదు. టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తని వారిపై భౌతిక దాడులకు కూడా వెనుకాడలేదు. తమ మాట వినని రైతులకు చెందిన అరటి తోటలు, తాటాకు పాకలు తగలబెట్టిన కొందరు సంఘ విద్రోహశక్తులు అరాచకం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మేధాపాట్కర్ లాంటి సామాజిక ఉద్యమకారులు గత సర్కారు దమనకాండను తీవ్రంగా తప్పుబట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లాంటి వారిని అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో అణచివేసేందుకు టీడీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. -
‘ఆగస్టు 5 అవమానాన్ని మర్చిపోను’
కశ్మీర్: గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మాలో ఎవరూ మర్చిపోలేము అన్నారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. 14 నెలల నిర్బంధం తర్వాత మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేశారు. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశిస్తూ ముఫ్తీ.. ‘ఢిల్లీ దర్బారు ఆర్టికల్ 370 ని చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్దతిలో రద్దు చేసింది. దాన్ని తిరిగి సాధిస్తాం. ఇదే మాత్రమే కాదు కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీని కోసం అనేక మంది కశ్మీరీలు తమ ప్రాణాలు వదులుకున్నారు. ఇందుకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మార్గం సులభం కాదని మాకు తెలుసు. కానీ మా పొరాటాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు నన్ను విడిచి పెట్టారు.. ఇంకా చాలా మంది చట్ట విరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారు. వారందరిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాను’ అన్నారు ముఫ్తీ. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం.(చదవండి: చైనా పాలనే నయం అనుకునేలా..) -
‘ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని అధికారులు పొడిగించిన క్రమంలో రాజకీయ నేతలను అక్రమంగా నిర్బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత గత ఏడాది ఆగస్ట్ 5 నుంచి మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు. మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్ము కశ్మీర్ అధికారులు మరో మూడు నెలలు పొడిగించారు. గృహ నిర్బంధం నుంచి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని కోరుతూ రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. మరోవైపు మెహబూబా నిర్బంధం పొడిగింపును కాంగ్రెస్ నేత పీ చిదంబరం తప్పుపట్టారు. ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను నిరాకరించడమేనని అన్నారు. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, 61 సంవత్సరాల మహిళ ప్రజా భద్రతకు ఎలా ముప్పుగా పరిణమించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధంపై రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్కు చురకలు వేశారు. కాంగ్రెస్ హయాంలో షేక్ అబ్ధుల్లాను ఎలా నిర్బంధించారో రాహుల్కు ఎవరైనా గుర్తుచేయాలని కోరారు. గతంలో రాహుల్ ముత్తాత, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 2000 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులో షేక్ అబ్దుల్లాను 12 ఏళ్ల పాటు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి కాంగ్రెస్ నేతకు ఎవరైనా చెప్పాలని జితేంద్ర సింగ్ చురకలు వేశారు. చదవండి : ‘అప్పుడు వాజ్పేయిని, అడ్వాణీని విమర్శించలేదు’ -
మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు
శ్రీనగర్: పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్లోని ఫెయిర్వ్యూ బంగళాలో ఉన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ గనీ లోన్ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని లోన్ కూడా ట్విట్టర్ ద్వారా నిర్ధారించారు. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నారు. పలువురు ప్రధాన రాజకీయ నేతలు సహా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేతలు ఫరూఖ్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. -
ఆర్టికల్ 370 రద్దు : ఏడాదికి విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలువురు నేతలపై గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. రానున్న ఆగస్ట్ 5తో ఆర్టికల్ 370ను రద్దు చేసి తొలి ఏడా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలువురు నేతలను విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగానే పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత, మాజీమంత్రి సజ్జద్ లోనేను శుక్రవారం గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో నిర్బంధం (జైలు) అనేది కొత్తేమీ కాదని, ఎన్నో కొత్త విషయాలను తెలుసున్నాని తెలిపారు. (ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం) గత ఏడాది ఆగస్ట్లో సజ్జద్ను పోలీసుల కస్టడీలోకి తీసుకుగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలను ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పీడీపీ అధ్యక్షురాలు సయ్యద్ ముఫ్తీ మహ్మద్ను మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. ఆమెతో పాటు మరికొంతమంది కశ్మీర్ నేతలపై నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కశ్మీర్ విభజనకు తొలి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది కాలంలో చోటుచుకున్న అభివృద్ధిపై నివేదికను వెలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై ఏర్పాట్లును పూర్తి చేసింది. -
‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’
ప్యోంగ్యాంగ్: నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన గురించి ప్రపంచం అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. కఠినమైన ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న అక్కడి ప్రజల గురించి తల్చుకుంటే.. భయం వేస్తోంది. ఇక అక్కడి డిటెన్షన్ సెంటర్ల గురించి.. వాటిలో మగ్గుతున్న ఖైదీలు.. ప్రత్యేకించి మహిళల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ ‘ఐ స్టిల్ ఫీల్ ది పెయిన్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. డిటెన్షన్ కేంద్రాల్లో మహిళలు అనుభవించిన నరకం గురించి ఈ నివేదిక ప్రపంచానికి వెల్లడించింది. 2009 నుంచి 2019 వరకు దాదాపు 100 మంది మహిళలను ఈ డిటెన్షన్ కేంద్రాల్లో బంధించినట్లు నివేదిక తెలిపింది. వీరంతా ఉత్తర కొరియా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ మహిళలు. విడుదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి పరిశోధకులు వీరిని సియోల్లో అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశారు. (నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!) దీనిలో బాధితులు నిర్భంద కేంద్రాల్లో తాము స్వచ్ఛమైన గాలి, నిద్ర, పగటి పూట ఎండ, మంచి ఆహారానికి కూడా నోచుకోలేదని వెల్లడించారు. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం నిద్రాహారాలు మాని పని చేస్తూనే ఉన్నామన్నారు. వీరంతా అధికారుల చేతుల్లో తీవ్ర హింసలకు గురి కావడమే కాక అత్యాచారానికి కూడా గురయ్యారని నివేదిక తెలిపింది. పోలీసు అధికారులు తమను అంగట్లో ఆటబొమ్మల మాదిరి చూసేవారని బాధితులు వెల్లడించారు. హింస, దురాక్రమణ, అత్యాచారం, బలవంతపు గర్భస్రావం వంటి దారుణాలు ఈ కేంద్రాల్లో నిత్యకృత్యమని బాధితులు వెల్లడించారు. ఓ మహిళ యూఎన్ అధికారులతో మాట్లాడుతూ.. ‘డిటెన్షన్ కేంద్రంలో ఓ అధికారి నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను తిరస్కరిస్తే.. నిన్ను హింసిస్తాను.. అవమానాలకు గురి చేస్తాను.. ఒప్పుకుంటే నిన్ను ఇక్కడ నుంచి త్వరగా విడుదల చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు’ అని నివేదిక వెల్లడించింది.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఉత్తర కొరియా ఈ నివేదికపై వెంటనే స్పందిచలేదు.. కానీ గతంలో మాత్రం ఈ మానవహక్కుల నివేదిక తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్ర అని విమర్శించింది. ఈ నివేదికలో పాలు పంచుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి డేనియల్ కొల్లింగే మాట్లాడుతూ.. ‘పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్యోంగ్యాంగ్పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. స్వేచ్ఛ, శ్రేయస్సు సాధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేశం దాటుతున్న వారిని బహిష్కరించవద్దని ఇతర దేశాలను కోరుతున్నాను’ అన్నారు. -
అడుగడుగునా అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాధవ్ను కలుసుకునేందుకు తమ దౌత్యాధికారులకు స్వేచ్ఛాయుత, బేషరతు అనుమతి ఇవ్వలేదని భారత్ గురువారం ఆరోపించింది. జాధవ్ను కలుసుకునేందుకు వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించింది. జాధవ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని తెలిపింది. దాంతో, పాక్ ఇచ్చిన దౌత్య అనుమతి అర్థరహితంగా మారిందని పేర్కొంటూ ఆ అధికారులు తమ నిరసనను అక్కడే వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘జాధవ్ను భారత దౌత్యాధికారులు కలుసుకున్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా పాక్ అధికారులు ఆ ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్నారు. బెదిరించే ధోరణిలో వారు ప్రవర్తించారు. భారతీయ అధికారులు నిరసన తెలిపినా వారు పట్టించుకోలేదు. దాంతో జాధవ్తో స్వేచ్ఛగా సంభాషించే వీలు లభించలేదు. అదీకాకుండా, జాధవ్తో భారత అధికారుల సంభాషణను రికార్డు చేశారు. అందుకు అక్కడే ఉన్న కెమెరానే సాక్ష్యం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వివరించారు. పాకిస్థాన్ సైనిక కోర్టు జాదవ్కు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువున్న తరుణంలో గురువారం సాయంత్రం జాదవ్ను కలుసుకోవడానికి భారత అధికారులకు పాక్ అనుమతించింది. పాకిస్తాన్ మిలటరీ కస్టడీలో ఉన్న జాదవ్ను కలుసుకున్న అధికారులు రెండు గంటల సేపు చర్చించారు. రివ్యూ పిటిషన్కు సంబంధించి ఆయన నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుందామని భావిస్తే అక్కడి అధికారులు అడ్డుపడ్డారని శ్రీవాస్తవ తెలిపారు. -
జేఎన్టీయూలో డిటెన్షన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్–డిలో డిటెన్షన్ను జేఎన్టీయూ రద్దు చేసింది. వివిధ సెమిస్టర్లలో విద్యార్థులు పాస్, ఫెయిల్తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను జేఎన్టీయూ గురువారం జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలివే.. 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్ విధానం ఉండదు. నిర్దేశిత సబ్జెక్టులు పాస్ కాకున్నా విద్యార్థులంతా తర్వాతి సెమిస్టర్కు అనుమతి. ముందుగా ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటలే. గరిష్ట మార్కుల్లో తేడా ఉండదు. పరీక్షల్లో 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. తప్పనిసరి పార్ట్ అనేది లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. లాక్డౌన్ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి. అయితే హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్సైట్లో నమోదు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే నిర్వహణ. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు. బీటెక్ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలు. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఫార్మ్–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్–డి (పీబీ) సెకండియర్ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభం. ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రథమ బీటెక్, బీపార్మసీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, నాలుగో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు 3వ తేదీ నుంచే ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, ఎంటెక్, ఎంఫార్మసీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్–డి ఫస్టియర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలూ అప్పుడే ఉంటాయి. జూలై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్ ఎక్స్పరిమెంట్స్, ల్యాబ్ పరీక్షల నిర్వహణ. బీటెక్, బీఫార్మసీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్), ఫస్ట్ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్) ఈనెల 6లోగా పూర్తి చేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి... ► విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్లో ఉన్నప్పుడు మాస్క్లు కచ్చితంగా ధరించాలి. మాస్క్లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించాలి. ► ప్రతి భవనం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి. ► తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్లలో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. ► థర్మల్ స్కానింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి. ► ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్కు ఒకరే.. అదీ జిగ్జాగ్లో కూర్చోబెట్టాలి. -
ముందుగానే స్పందిస్తే మరణాలు తగ్గించొచ్చు
న్యూయార్క్: కరోనా వైరస్ వంటి అంటువ్యాధుల సమయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 1918–19 సంవత్సరాల్లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అమెరికాలోని కొన్ని నగరాల్లో ముందుగానే అప్రమత్తమై చేపట్టిన నిర్బంధ, నివారణ చర్యల కారణంగా మరణాలు తగ్గినట్లు లయోలా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ బారినపడి 5 కోట్ల మంది చనిపోగా అమెరికాలో 6.75 లక్షల మంది బలయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్, కన్సాస్ సిటీ, మిల్వాకీ నగరాలు చేపట్టిన.. పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాలపై నిషేధం, కఠినమైన ఐసోలేషన్ విధానాలు, పరిశుభ్రత పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ‘ఈ చర్యలు వ్యాధి తీవ్రతను 30 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి. ఆలస్యంగా స్పందించిన/ ముందు జాగ్రత్తలు తక్కువగా తీసుకున్న నగరాలతో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నగరాల్లో మరణాల రేటు గరిష్ట స్థాయిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. మొత్తం మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిశోధన ఫలితాలు తాజాగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సైటోపాథాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ‘ఇలాంటి కఠినచర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ, అది తప్పు అని మా అధ్యయనంలో తేలింది’అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘1918లో అమెరికాలో పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, జనం ఎక్కువగా గుమికూడటం ఎక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచం నేడు చాలా మారింది. అయినప్పటికీ, వందేళ్ల క్రితం తీసుకున్న నివారణ చర్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకూ అనుసరణీయాలే’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేదు వాషింగ్టన్: కరోనా ముప్పు వృద్ధులకే అధికమన్న వాదనలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడే అవకాశాలు తక్కువని తేల్చిచెప్పింది. సహజంగా వృద్ధుల్లో అరోగ్యవంతులు అంతంతమాత్రమే కాబట్టి అలాంటి వారే బలయ్యే ప్రమాదం ఉందంది. -
ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది. 83 ఏళ్ల ఫరూక్తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
కోవిడ్ను జయించిన కేరళ విద్యార్థిని
తిరువనంతపురం: కేరళకు చెందిన వైద్య విద్యార్థిని భారత్లో కోవిడ్ సోకిన తొలివ్యక్తి. 39 రోజుల పాటు ఆమెను విడిగా నిర్బంధంలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బట్టబయలైన చైనాలోని వూహాన్ యూనివర్సిటీ వైద్య విద్యార్థిని, 20 ఏళ్ల వయసున్న ఆమె ఎన్డీటీవీతో పంచుకున్న మనోగతం ఆమె మాటల్లోనే. ‘నాకు కోవిడ్ సోకిందని జనవరి 30న వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెంటనే నాతో పాటు ప్రయాణించిన నా స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఆరోగ్య శాఖ అధికారుల్ని సంప్రదించాలని చెప్పాను. ఆ తర్వాత వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నా. నేను చైనాలో ఉన్నప్పుడు చూశాను. ఈ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టం కాదు. అందులోనూ నేను శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాను. కానీ అందరికీ దూరంగా, ఎవరితోనూ సంబంధాలు లేకుండా అన్ని రోజులు ఏకాంతంగా ఉండడం అంత సులభం కాదు. అయితే ఈ అంశంలో నాకు వైద్యులు బాగా సహకరించారు. అత్యుత్తమమైన చికిత్స ఇచ్చారు. ఇంటికి వచ్చాక నేను మానసికంగా దెబ్బ తినకుండా కౌన్సెలర్లు తరచూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఎప్పటికప్పుడు నాలో ధైర్యాన్ని నింపారు. ఆమె మా అమ్మతో స్వయంగా మాట్లాడి భరోసా నింపారు. చైనాలో జనవరి 13 నుంచి మా విశ్వవిద్యాలయంకు దాదాపు నాలుగు వారాల పాటు సెలవులు ఇచ్చారు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ మూడు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. వీధుల్లో స్థానికులు అందరూ మాస్క్లు ధరించి కనిపించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది. భారత రాయబార కార్యాలయం మా అందరినీ వెనక్కి తీసుకువచ్చింది. మా క్లాస్లో 65 మంది విద్యార్థులు ఉంటే అందులో 45 మంది భారతీయులమే. ప్రస్తుతం మేమంతా ఆన్లైన్లో క్లాస్లకు అటెండ్ అవుతున్నాం’ అని ఆ విద్యార్థిని తన అనుభవాలను వివరించారు. -
ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు
శ్రీనగర్: ‘మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(49) ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉంది... మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ(60) నిషేధిత ఉగ్రసంస్థకు మద్దతు ప్రకటించారు’ ఈనెల 6వ తేదీన ఒమర్, మెహబూబాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. అందుకు కారణాలను తెలుపుతూ రూపొందించిన నివేదికలోని అంశాలివి. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరినీ పోలీసులు పీఎస్ఏ కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద వీరిని మూడు నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. ఇప్పటికే ఒమర్ తండ్రి, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్కు ప్రజల్లో పలుకుబడి ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్న సమయంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు పిలుపు నిచ్చినప్పటికీ ప్రజలను ఓటింగ్లో పాల్గొనేలా ప్రభావితం చేయగలిగారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నించారు’ అని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒమర్ చేసిన కామెంట్లను మాత్రం అందులో ప్రస్తావించలేదు. ‘పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ‘ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. నిషేధిత జమాతే ఇస్లామియా సంస్థకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు’ అని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్పై తాత్కాలిక నిషేధం కశ్మీర్లో ఆదివారం ఉదయం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన యంత్రాంగం సాయంత్రానికి ఆంక్షలు సడలించింది. పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటనలో దోషి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలై ఏడేళ్లవుతున్న సందర్భంగా వేర్పాటువాద సంస్థ జేకేఎల్ఎఫ్ ఆదివారం బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ను బంద్ చేశారు. -
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా
-
కరోనా విశ్వరూపం
బీజింగ్: కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలో 31 ప్రావిన్షియల్ రీజియన్లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 490 మంది మరణించారని, 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్లో జాతీయ స్టేడియం, జిమ్లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి బెంబేలెత్తిపోయి హాంగ్కాంగ్ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ప్రకటించారు. పుట్టిన పసికందుకి సోకిన వైరస్ చైనాలోని వూహాన్లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. అనుమానితుడు పరారీ: గుజరాత్లో కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది. కాగా, కరోనా వైరస్ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం గుజరాత్లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. -
బీజేపీకి మరో ఝలక్ ఇచ్చిన ఉద్ధవ్ థాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. నెరుల్ ప్రాంతంలో అక్రమ వలసదారుల కోసం నిర్భంద కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న గత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే మంగళవారం రద్దు చేశారు. మహారాష్ట్రలో నిర్భంద కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో జనవరి 22న ఎన్నార్సీపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఎన్నార్సీ అమలుపై తమ వైఖరి వెల్లడిస్తామని ఉద్ధవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నార్సీ అమల్లోకి వస్తే భారతదేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులను గుర్తించేందుకు వీలుంటుంది. అలాంటి వారిని వారి స్వదేశానికి పంపిస్తారు. ఒకవేళ ఏదేశమైనా వాళ్లను తమ పౌరులు కాదని తిరస్కరిస్తే, అలాంటి వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. కాగా, ఇప్పటికే సీఏఏపై దేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 22న ఎన్నార్సీపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి : రాహుల్ గాంధీని కొట్టండి -
అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ఆయన మాట్లాడారు. అయితే, జమ్మూకశ్మీర్లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సభా నిబంధనలు, నియమాల మేరకు అన్ని అంశాలపై చర్చించేందుకు, మాట్లాడేందుకు అన్ని పక్షాలకు అవకాశం కల్పిస్తామని, వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందని ప్రధాని అన్నారని అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ,అమిత్షా, గులాంనబీ ఆజాద్, విజయసాయిరెడ్డి తదితరులు ఫరూక్ అబ్దుల్లాపై హామీ ఇవ్వని ప్రభుత్వం జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం నిర్బంధించిన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఫరూక్ను నిర్బంధించడంపై నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఎంపీ హస్నైన్ మసూదీ ప్రస్తావించారు. ఫరూక్ను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉందని మసూదీ పేర్కొన్నారు. ‘కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సభలో ఈ అంశంపై పట్టుబడతాం’ అని ఆయన తెలిపారు. ‘ఒక పార్లమెంట్ సభ్యుడిని చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారు? ఫరూక్ అబ్దుల్లాతోపాటు జైల్లో ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కూడా పార్లమెంట్ సమావేశాలకు అనుమతించాలి’అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయన్నారు. స్టాండింగ్ కమిటీలకు పంపకుండానే అన్ని బిల్లులను ఆమోదించేలా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అన్ని అంశాలపై చర్చకు అవకాశమిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో మాత్రం మరోవిధంగా వ్యవహరిస్తుందని ఆజాద్ ఆరోపించారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా విడుదలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో కోత, వ్యవసాయ సంక్షోభంపై తప్పనిసరిగా చర్చించాలని సభలో కోరతామని లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని పాశ్వాన్ ప్రస్తావించారు. హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి థావర్చంద్ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధురి, గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నేత ఆనంద్ శర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వి.విజయసాయి రెడ్డి, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సహా 27 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, జమ్మూకశ్మీర్లో పరిస్థితులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో ఈసారి ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెరిగిన బలం, అయోధ్య వివాదంపై ఇటీవలి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు బీజేపీలో విశ్వాసం పెంచాయి. ఎన్డీయే కూటమి ‘ఉమ్మడి కుటుంబం’ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. మోదీ సహా హోంమంత్రి అమిత్షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఈ కూటమిని ఉమ్మడి కుటుంబంగా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నట్లే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయన్నారు. ఈ చిన్న సమస్యల వల్ల కుటుంబం దెబ్బతినే పరిస్థితి రాకూడదన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సభ్య పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ప్రత్యేకంగా కన్వీనర్ లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్జేపీ, అప్నాదళ్, జేడీయూ వంటి పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్డీయేలో సరైన సమన్వయం ఉంటే మహారాష్ట్రలో బీజేపీ–శివసేనల మధ్య ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయేదని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఎంపీల గైర్హాజరు ఆందోళనకరం: వెంకయ్య న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు ఎంపీలు గైర్హాజరవుతుండ టంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీల ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవల సమావేశం కాగా 28 మందికి గాను నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అందులో కమిటీ సభ్యుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన ఏకైక ఎంపీ గౌతమ్ గంభీర్ ఆ భేటీకి రాకుండా ఇండోర్లో జరిగిన క్రికెట్ మ్యాచ్కు వ్యాఖ్యానం చేస్తూ కనిపించారు’అని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హిందూ వివాహ, విడాకుల చట్టం–1952 మొదలుకొని ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు–2019 వరకు, 1953లో ధోతీలపై అదనపు ఎౖMð్సజ్ పన్ను నుంచి 2017లో జీఎస్టీ అమల్లోకి తేవడం వరకు రాజ్యసభ పయనం సుదీర్ఘంగా సాగిందని వెంకయ్య అన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని రూ.250 వెండి నాణెం, పోస్టల్స్టాంపును విడుదల చేయనున్నామ న్నారు. కాగా, రాజ్యాంగం ఆమోదం పొంది70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందన్నారు. అరుదైన సందర్భం.. 67 ఏళ్ల రాజ్యసభ చరిత్రలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సందర్భాన్ని ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’ పుస్తకం వివరించింది. ‘మే 8, 1991న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. అధికార, విపక్షాలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో సభ డెప్యూటీ చైర్మన్గా ఉన్న ఎంఏ బేబీ విపక్షాలకు అనుకూలంగా ఓటేశారు’ అని వివరించింది. పౌరసత్వ బిల్లు సహా 35 బిల్లులు నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది. పౌరసత్వ బిల్లులో ఏముంది? 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందు, బౌద్ధ, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ మతాలకు చెందిన వారిని భారత పౌరులుగా గుర్తించేందుకు వీలు కల్పించేందుకు పౌరసత్వ సవరణ బిల్లులో వీలు కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గింపు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్ డేటా ప్రొటెక్షన్) బిల్లు, అన్ని రకాలైన వివక్ష నుంచి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్స్పై నిషేధం బిల్లు, జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టీగా కాంగ్రెస్ చీఫ్కు ఉన్న హోదాను రద్దు చేయడంతోపాటు ఆ ట్రస్ట్ సభ్యులను తొలగించే అధికారాలను ప్రభుత్వానికి కల్పించే బిల్లు ఉన్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో పార్లమెంట్ భవనం -
కశ్మీర్: కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్లో పెద్ద ఎత్తున నిర్బంధం విధించడం, పౌరహక్కులపై ఆంక్షలు విధించడం తదితర ఆరోపణలకు సంబంధించి సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్రం, జమ్మూకశ్మీర్ సర్కారు తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆసిఫా ముబీన్ దాఖలు చేసిన పిటిషన్పై అఫిడవిట్ రూపంలో సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ కేంద్రం, కశ్మీర్ సర్కార్లను నిలదీసింది. ఎన్నారై అయిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆసిఫా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆగ్రహంతో కశ్మీర్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఐదు నిమిషాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొంది. ఎంతోమంది పిటిషన్లు వేశారని, అందువల్లే అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యమైందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. కశ్మీర్లో నిర్బంధంపై అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. తమ ఆదేశాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించరాదంటూ కేంద్రం, కశ్మీర్ సర్కార్లను మందలించింది. -
పాపం ‘మధుబాల’.. అన్యాయంగా
గువాహటి : అస్సాంలో మరో లక్ష మందిని జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ముసాయిదా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యం మూలానా ఓ భారతీయురాలు మీద.. విదేశీయురాలు అనే ముద్ర పడింది. ఫలితంగా గత మూడేళ్ల నుంచి ఆ మహిళ నిర్భందంలో గడపింది. చివరకు బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది. వివరాలు.. అస్సాం బోర్డర్ పోలీసులు రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి వారిని నిర్భందంలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చిరాంగ్ జిల్లా బిష్టుపూర్ గ్రామానికి చెందిన మధుబాల దాస్ అనే విదేశీయురాలిని నిర్భందంలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె అప్పటికే మరణించడంతో అధికారులు మధుబాల మొండల్(59)ను నిర్భందంలోకి తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాల గురించి ఆమెకు ఏ మాత్రం అవగాహన లేదు. నిరక్ష్యరాస్యురాలు కావడంతో మొండల్ అధికారులను ఎదిరించలేకపోయింది. మధుబాల మొండల్కు సాయం చేయడానికి ఆమెకంటూ ఎవరూ లేరు. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఓ మూగ, చెవిటి కూమార్తె ఉంది. పెళ్లైన ఆమెను భర్త వదిలిపెట్టడంతో కుమార్తె బాధ్యతలు కూడా మొండల్పైనే పడ్డాయి. కుటుంబానికి ఆమె జీవనాధారం. ఈ క్రమంలో ఓ రోజు అస్సాం బార్డర్ పోలీసులు ఆమెను విదేశీయిరాలు అంటూ కొక్రాఝర్ నిర్భంద కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు మధుబాల మొండల్కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అస్సాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి కృషి ఫలితంగా మూడేళ్ల నిర్భందం తర్వాత బుధవారం సాయంత్రం మధుబాలను విడిచిపెట్టారు. -
అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా
సాక్షి, నల్గొండ : ప్రైవేటు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం, డ్రైవర్ మద్యం మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విద్యార్థులతో పాటు స్కూలు ఆయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముదిగొండ గ్రామం నుంచి చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లారెడ్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 1వ తరగతి చదువుతున్న జబ్బు సాయి, 3వ తరగతి చదువుతున్న చింతకుంట్ల విఘ్నేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. బస్సులో ఉన్న మరో పది మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ఆయాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణం మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన సంఘటనకు బస్సు డ్రైవర్ మద్యం మత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. తాగిన మైకంలో బస్సు డ్రైవర్ పాఠశాల బస్సును ఇష్టానుసారంగా నడపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతోపాటు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా గ్రామంలో ఆటో నడిపే ఓ యువకుడిని బస్సు డ్రైవర్గా నియమించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాగిన మైకంలో వాహనం నడుపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తప్పిన పెను ప్రమాదం పాఠశాల బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాద సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం
న్యూయార్క్: అమెరికాలోకి దొంగతనంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను సరిహద్దు గస్తీ బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. న్యూయార్క్లోని హోగన్స్బర్గ్లో ఓ క్యాసినో వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని బోర్డర్ పెట్రోల్ స్టేషన్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఆరుగురు భారతీయుల్లో ఇద్దరు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. ఎటువంటి పత్రాలు లేని ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. -
నిర్బంధంలో అజహర్ కొడుకు, సోదరుడు
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్ మసూద్ అజహర్ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్ కొడుకు హమద్ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్ హోం శాఖ వెల్లడించింది. అరెస్ట్ కాదు..: భారత్ ఈఅరెస్టులపై భారత్ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో జమాతే–ఉద్–దవా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్ ఫౌండేషన్ను పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్లిస్ట్లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్ సయీద్ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఇంచార్జ్ ఎండీ నిర్బంధం
-
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసింది!
వాషింగ్టన్: బీచ్లో జాగింగ్ చేస్తూ ఓ యువతి అనుకోకుండా దేశ సరిహద్దులనే దాటేసింది.ఫ్రాన్సుకు చెందిన సిండెల్లా రోమన్(19) ఈ ఏడాది మేలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం వైట్రాక్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లిని కలుసుకునేందుకు వచ్చింది. సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ.. కెనడా సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించింది. ఆమె వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో గస్తీ దళాలు అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో అక్రమ వలసదారుల కోసం ఏర్పాటుచేసిన డిటెన్షన్ సెంటర్కు తీసుకెళ్లారు. చివరకు ఆమె తన తల్లి క్రిస్టిన్ ఫెర్న్కు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆమె వెంటనే పాస్పోర్టు, ఇతర పత్రాలను తీసుకొచ్చి అధికారులకు చూపించినా.. వాటిపై కెనడా అధికారుల ధ్రువీకరణ లేదని మెలికపెట్టారు. రెండు వారాల పాటు సిండెల్లాను అక్కడే ఉంచారు. అవసరమైన పత్రాలను అందజేశాక జూన్ 6వ తేదీన ఆమెను వదిలిపెట్టారని కెనడా మీడియా తెలిపింది. -
‘వలస పిల్లల’ను వేరుచేయం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లలను వేరుగా నిర్బంధించటానికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. కుటుంబాలను, వారి పిల్లలను కలిపి ఒకేచోట నిర్బంధంలో ఉంచుతామని చెప్పారు. మెక్సికో సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పిల్లలను, తల్లిదండ్రుల నుంచి వేరు చేయటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావటంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అధ్యక్ష భవనం వెలుపల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సమస్య ఇకపై ఉండదు. కుటుంబాల నుంచి వారి పిల్లలను వేరు చేయబోం. కుటుంబాలతోనే కలిపి ఉంచుతాం. ఇదే సమయంలో మా సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం చేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ఆశ్రయం కోరిన వారిని నిర్బంధిస్తారా? అక్రమ వలసదారుల పిల్లలను, కుటుంబాలతో కలిపి ఉంచుతున్నప్పటికీ వారిని కనీస సౌకర్యాలు లేని డిటెన్షన్ సెంటర్లలో ఉంచడంపై భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు, హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పిల్లలను, వారి కుటుంబాలను నెలల తరబడి నిర్బంధంలో ఉంచడం ‘అమానవీయం, క్రూరం’ అని కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి పిల్లలతో సహా నిర్బంధించడాన్ని కోర్టులో సవాల్ చేస్తామన్నారు. పిల్లలను వేరుగా ఉంచడం ద్వారా ఉత్పన్నమైన సమస్యకు కుటుంబాన్నంతటినీ కలిపి నిర్బంధించడం పరిష్కారం కాదని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థ అధ్యక్షురాలు నీరా టాండెన్ అన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వు ఈ సమస్యకు పరిష్కారం కాదనీ, ఆయన ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. పిల్లలను వేరు చేసి ఉంచే సమస్య పరిష్కారానికి, కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట నిర్బంధిస్తామనటం ద్వారా ఇంకో సమస్యను సృష్టించారని చెప్పారు. ఈ ఏడాది మార్చి–మే మధ్య కాలంలో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన దాదాపు 50వేల మందిని అధికారులు నిర్బంధించారు. -
అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ!
వాషింగ్టన్ : అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. తల్లిదండ్రులనుంచి పిల్లలను వేరు చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వలసదారుల పిల్లలను నిర్బంధ వసతి గృహానికి తరలిస్తుండటంతో.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారులు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రుల చెంతకు తమను పంపించాలని, లేదంటే కనీసం వారితో ఫోన్లో మాట్లాడే అవకాశమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్బంధ గృహంలో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారి తాజాగా ఫోన్లో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తన ఆంటీతో ఆ పాప మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా వైరల్గా మారింది. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ సంభాషణలో ‘నేను ఇంటి వద్ద మంచిగా నడుచుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను’ అంటూ చిన్నారి ఏడుస్తూ అన్న మాటలు.. ప్రతి హృదయాన్ని కదిలించి వేస్తున్నాయి. ‘పాపి (స్పానిష్లో తండ్రి), మామి (తల్లి).. కనీసం బంధువులైన కలవండి. ఇక్కడ మేం ఒంటరిగా ఉన్నామనే బాధ ఎక్కువగా ఉంది. దయచేసి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆ చిన్నారి అర్థిస్తున్న.. ఈ సంభాషణ ఆడియోను ప్రోపబ్లికా అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆ చిన్నారి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని, ట్రంప్ ప్రభుత్వం త్వరగా ఆ పిల్లలను వారి తల్లి దండ్రులకు అప్పగించాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఈ ఆడియో టేప్ను విన్న హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ నీల్సన్.. చాలా నిర్లక్ష్యంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. నిర్బంధ వసతి గృహంలోని పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా అక్రమ వలసదారులకు హాలిడే స్పాట్ కాదని, అక్రమవలస విధానాలపై చట్టాలు మార్చే ప్రసక్తేలేదని, యూరప్ దేశాల్లో చూస్తున్నారుగా అంటూ మరోవైపు ట్రంప్ పరుషంగా ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల కోసం అలమటిస్తున్న పసి పిల్లల కోసమైన ఈ వలస చట్టాలు మారుస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రజాసంఘాల నాయకుల నిర్బంధం దుర్మార్గం
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి ఆరోపించారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న పూణె పోలీసులు సీఆర్పీపీ జాతీయ కార్యదర్శి రోనావిల్సన్ను ఢిల్లీలో ఐఏపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత్నేత సుధీర్ దావ్లే, విస్తాపన వ్యతిరేక ఉద్యమ కారుడు మహేశ్ రావత్లను అరెస్టు చేసి ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబరు 31న టి కోరెగాం సంఘటనల నేపథ్యంలో గత ఏప్రిల్ 17న సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్దావ్లే ఇళ్లపై పూణె పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసి దస్త్రాలు, సీడీలు, కంప్యూటర్లు సీజ్ చేశారని తెలిపారు. వీటిలో ప్రధానమంత్రి మోదీని హత్య చేయడానికి కుట్ర ఉందని, వాటిలో విరసం నేత వరవరరావు పేరు ఉందని పోలీసులు పేర్కొనడాన్ని ఖండించారు. ఇది అవాస్తవమని, ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసే కుట్రలో భాగమేనన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం నేత పీవీ రమణ, జయంత్ రఘురాం, హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి వీఎస్ కృష్ణ, కె.పద్మ, బాలకృష్ణ, ఇఫ్టూ ప్రతినిధి మల్లన్న, ఎస్వి.రమణ, అన్నపూర్ణ, లలిత, పద్మ, కె.ఎస్.చలం పాల్గొన్నారు. -
భార్యను నిర్బంధించి కిరాతకం
బనశంకరి : ప్రేమించి పెళ్లి చేసుకుని బుద్ధిగా నడుచుకోవాల్సిన భర్త, భార్యను తీవ్రంగా గాయపరిచిన సంఘటన నగరంలో శుక్రవారం ఆలస్యంగా వెలుచూసింది. వివరాలు...యాదగిరి తాలూకా వక్కనళ్లి గ్రామానికి చెందిన వివాహిత తిమ్మవ్వ (40) భర్తకు దూరంగా ఉంటోంది. పశువులు మేతకు వెళ్లే సమయంలో అదే జిఆల్ల కోయలూరుకు చెందిన దేవప్ప (35)తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వయసులో పెద్దది కావడంతో దేవప్ప కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినా కూడా పెద్దలను ఎదిరించి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బతకుదెరువు కోసం ఇద్దరు బెంగళూరు కంటోన్మెంట్కు చేరుకుని కూలి పనులకు వెళ్తున్నారు. వీరితో పాటు దేవప్ప తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1 నుంచి తిమ్మవ్వను నిర్భందించి ఆమె సున్నిత భాగాల్లో తీవ్రంగా గాయపరిచారు. చివరకు ఆమెను తగులబెట్టడానికి దేవప్ప యత్నించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను యాదగిరికి తరలించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాక్ స్వాతంత్ర్య హక్కును అణగదొక్కుతున్నారు
-
5, 8వ తరగతులకు డిటెన్షన్
కోల్కతా: పాఠశాలల్లో 5వ, 8వ తరగతుల విద్యార్థులకు త్వరలో రాష్ట్రాల సాయంతో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ‘ప్రతిపాదిత బిల్లు ఏటా మార్చి నెలలో ఈ తరగతుల వారికి పరీక్షలు నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకు అందిస్తుంది. విద్యార్థులు మార్చి పరీక్షల్లో ఫెయిలైతే మే నెలలో వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ యత్నంలోనూ ఉత్తీర్ణులు కాకపోతే వారిని పైతరగతులకు వెళ్లనివ్వకుండా ఆ తరగతుల్లోనే ఉంచుతారు’ అని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల విద్యామంత్రులతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని, 25 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని చెప్పారు. -
భార్య, కుమారుడి నిర్బంధం
గోరంట్ల(సోమందేపల్లి): గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తన భార్య శోభారాణి సహా కుమారుడిని ఇంటిలో మంగళవారం నిర్బంధించాడు. స్థానికుల కథనం ప్రకారం... తరుచూ దంపతులు గొడవపడేవారన్నారు. మంగళవారం కూడా ఇద్దరూ గొడవపడ్డారన్నారు. ఆ తరువాత భార్య, కుమారుడిని బంధించి, ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతలోనే బాధితురాలు శోభారాణి 100 నంబర్కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ వెంకటేశ్వరులు సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిర్భందానికి గురైన తల్లి, కొడుకును విడిపించారు. ఆ తరువాత జయచంద్రారెడ్డిని స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. -
పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల
కోల్కతా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఒక సీఎంను ఆయన సొంత రాష్ట్రంలోనే అరెస్టు చేసిన సందర్భం మునుపెన్నడూ జరగలేదని, ఇలాంటివి ఆహ్వానించదగిన పరిణామాలు కావని మమత పేర్కొన్నారు. (మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా) వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ జవాను రామ్ క్రిషన్ గ్రెవాలే కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఆర్కే పురం స్టేషన్ కు తరలించారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. మాజీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా పోలీసులు ఇదే రీతిగా అరెస్టు చేశారు. (రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు) -
వరంగల్లో హెడ్మాస్టర్ నిర్బంధం
-
అప్పు తిరిగివ్వలేదని.. బాలిక నిర్బంధం
గుంతకల్లు (అనంతపురం) : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి బాలికను నిర్బంధించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న అరుణ వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఓ మహిళ తన కుటుంబ అవసరాల కోసం అరుణ నుంచి రూ.17 వేలు అప్పుగా తీసుకుంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవడంతో.. కోపోద్రిక్తురాలైన వడ్డీ వ్యాపారి బాధితురాలి ఎనిమిదేళ్ల కూతురిని తన ఇంట్లో నిర్బంధించుకొని డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని చెప్పింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. -
రేషన్ కోసం..
♦ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్బంధం ♦ రంగంపేటలో లబ్ధిదారుల రాస్తారోకో కొల్చారం: రేషన్ బియ్యం ఇవ్వడంలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను బంధించి నిరసన తెలిపిన ఘటన జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. రెక్కాడితేకాని డొక్కాడని శ్రమ జీవుల రేషన్.. నాలుగు నెలల నుంచి‘కీ రిజిష్టర్’లో తొలగిస్తూ వస్తున్నారు. రూపాయికి కిలో బియ్యంతో పొట్టనింపుకుందామన్న వారి పరిస్థితి గట్టెక్కించేవారే కరువయ్యారు. దీంతో రేషన్ లబ్ధిదారుల్లో ఆవేశం కట్టలుతెగింది. శనివారం సాదా బైనామాల విషయంపై గ్రామసభకు వచ్చిన అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను గ్రామ పంచాయతీలో బంధించిన లబ్ధిదారులు రాస్తారోకోకు దిగారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన 1వ నెంబర్ రేషన్ దుకాణానికి నాలుగు నెలల నుంచి 240 మంది పేర్లు కీ రిజిష్టర్లో తొలగిస్తు వస్తున్నాయి. దీంతో దాదాపు 20 క్వింటాళ్ళ బియ్యం తక్కువ రావడంతో పేర్లు తొలగించిన వారికి రేషన్బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయమై లబ్ధిదారులు నాలుగు నెలలుగా వీఆర్ఓకు, రేషన్ డీలర్లకు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకె ళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో సాదాబైనామాలపై అవగాహన సదస్సుకు స్థానిక వీఆర్ఓ చంద్రయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చారు. దీంతో లబ్ధిదారులు గ్రామ పంచాయతీ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు. తమకు బియ్యం ఇస్తారా.. లేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఓ మహిళ తాడుతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు. కోపోద్రికులైన ప్రజలు వీఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్లతోపాటు అక్కడే ఉన్న రాష్ట్ర టెస్కో డెరైక్టర్ అరిగె రమేష్కుమార్ను గ్రామ పంచాయతీలో బంధించి తాళం వేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రహదారిపై రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఏఎస్ఐ రాజు తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని బంధించిన వారిని విడిపించారు.రాస్తారోకోకు దిగిన వారి వద్దకు చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ ఫోన్ ద్వారా ఆర్డీవోతో మాట్లాడించారు. బుధవారంలోగా అందరి పేర్లు రేషన్ కీ రిజిష్టర్లో వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. -
రేషన్ కార్డుల కోసం అధికారుల నిర్బంధం
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బమ్మిడి గ్రామంలో రేషన్ కార్డులను ఇవ్వడం లేదని గ్రామస్థులు రెవెన్యూ అధికారులను శనివారం పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. జన్మభూమి కమిటీలో పేర్లు నమోదుచేసుకున్నప్పటికీ తమకు రేషన్ కార్డులు పంపిణీ చేయట్లేదని గ్రామస్థులు గ్రామ ఆర్ఐ,వీఆర్వోలను నిర్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసుల పహారాలో అధికారులు రేషన్కార్డులను పంపిణీ చేశారు. -
అనుమానమే పెనుభూతమై..
రెండు నెలల పాటు కూతుర్నినిర్బంధించిన తల్లి మతిస్థిమితం కోల్పోయిన వైనం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆస్పత్రికి ఒక్కగానొక్కకూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఆ తల్లి చిత్ర హింసలకు గురిచేసింది. అనుమానం పెనుభూతమై తిండీ తిప్పలు లేకుండా చేసింది. ఏకంగా రెండు నెలల పాటు నిర్బంధించింది. ఏవేవో పూజలు చేసింది. చివరకు మతిస్థిమితం కోల్పోయేలా మార్చేసింది. మహిళాసంఘాల సహకారంతో ఆ బాలిక ఆస్పత్రికి చేరింది. ఈ ఘటన రేణిగుంట మండలంలో సోమవారం కలకలం సృష్టించింది. తిరుపతి కార్పొరేషన్: కన్నబిడ్డను కంటికి రె ప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి మూఢనమ్మకాలు, పిచ్చి చేష్టలతో రెండు నెలలుగా గృహ నిర్బంధంలోకి నెట్టింది. సోమవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలు.. రేణిగుంటకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు(17) ఉన్నారు. తల్లి మొదటి నుంచి క్షుద్ర పూజలు, చేతబడులు వంటి వాటిపై నమ్మకం పెంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో అలాంటి వాతావరణాన్ని సృష్టించుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న తన ఒక్కగానొక్క కూతురి ప్రవర్తన సరిలేదని గుర్తించింది. క్షుద్రపూజలు చేస్తే మనసు మార్చుకుని దారిలోకి వస్తుందని భావించింది. అంతే పూజల పేరుతో రెండు నెలలు ఇంట్లోనే నిర్బంధించింది. రకరకాల క్షుద్ర పూజలు చేసింది. పైగా కూతురి జడ వెంట్రుకలను కత్తిరించడం, కనీసం అన్నం కూడా పెట్టకుండా నిర్బంధంలో ఉంచడంతో ఆ చిట్టితల్లి మానసికంగా కుంగిపోయింది. పిచ్చిపిచ్చిగా అరవడం, మాట్లాడడం వంటి చేష్టలు చేసేది. దీంతో స్థానికులు గమనించి మహిళా సంఘాలు, సీపీఎం నాయకుల సహకారంతో గృహ నిర్బంధంలో ఉన్న ఆ బాలికను ఆదివారం కాపాడారు. మతి స్థిమితంలేని విధంగా మారిన సదరు బాలికను తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రుయాలో చికిత్స పొందుతోంది. బాలిక మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిసింది. -
వారి హక్కులను హరించడమే..
విద్యార్థులను ఫెయిల్ చేయడంపై విద్యావేత్తల స్పష్టీకరణ ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలతో విద్యాశాఖ సమావేశం నాన్ డిటెన్షన్ కొనసాగించాల్సిందేనని ఏకాభిప్రాయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఆధారిత దేశంలో డిటెన్షన్ విధానం సరైంది కాదని, నాన్ డిటెన్షన్ను కొనసాగించాల్సిందేన ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, సంఘాల నేతలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఉపాధ్యాయులతో మంగళవారం విద్యాశాఖ ‘డిటెన్షన్-నాన్ డిటెన్షన్ విధానం’పై సమావేశం నిర్వహించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు నాన్ డిటెన్షన్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. డిటెన్షన్ విధానం తెస్తే ఫెయిల్ అయిన విద్యార్థులంతా బాల కార్మికులుగా మారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిటెన్షన్ చర్చే అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో డిటెన్షన్ విధానం తెచ్చి వారిని మళ్లీ బడికి దూరం చేయడం సరైంది కాదని స్పష్టం చేశాయి. పీఆర్టీయూ-టీఎస్తోపాటు మరోరెండు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం 5, 7 తరగతుల్లో డిటెన్షన్ విధానం అ మల్లోకి తేవాలని పేర్కొన్నాయి. తరగతి వారీగా సామర్థ్యాలను నిర్దేశించుకోవాలి: చుక్కా రామయ్య విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కర ణలు తేవడం లేదని, తరగతి వారీగా సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించుకోకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థులను బడులకు దూరం చేయడం తగదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. ఏయే తరగతి విద్యార్థికి నేర్పించాల్సిన లక్ష్యాలపై స్పష్టమైన విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఫెయిల్ చేసే విధానం వల్ల విద్యార్థులు తాము నేర్చుకునే కొద్దిపాటి విద్యకు, బడులకు పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్య అదనపు డెరైక్టర్లు గోపాల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, శేషుకుమారి, ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి, విద్యా సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్రెడ్డి, ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర ప్రతినిధి బుర్రా సునీత, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, ర వి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్దన్రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్రెడ్డి తదితరులు ప్రసంగించారు. -
‘డిటెన్షన్’ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ (వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే విద్యార్థిని తిరిగి అదే తరగతిలో కొనసాగించడం) విధానం అమల్లో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతకరమని పార్లమెంటు స్థాయీ సంఘం స్పష్టం చేసింది. తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేకపోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యం, వికాసం, అభివృద్ధి తగ్గిపోతుందని హెచ్చరించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం కూడా 8వ తరగతి వరకు ‘డిటెన్షన్’ విధానం లేకపోవడం సరికాదని పేర్కొంటూ పార్లమెంటుకు గురువారం తమ నివేదికను సమర్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేదు. ఏదైనా తరగతి పూర్తికాగానే విద్యార్థులు పైతరగతికి వెళ్తున్నారు. -
లఖ్వీని విడుదల చేయండి: పాక్ కోర్టు
లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రహమాన్ లఖ్వీపై నిర్బంధాన్ని రద్దుచేసి, తక్షణమే అతణ్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు గురువారం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్ అన్వర్ ఉల్ హక్ తీర్పును వెలువరిస్తూ,, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద లఖ్వీని నిర్బంధించిన పంజాబ్ ప్రభుత్వం అతనిని దోషిగా నిరూపించే సాక్ష్యాధారాల్ని సమర్పించలేకపోయినందున నిర్బంధాన్ని ఎత్తివేస్తూ విడుదలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకొక్కటి రూ.10 లక్షల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను పూచికత్తుగా సమర్పించాలని లఖ్వీ తరఫు న్యాయవాదికి సూచించారు. కావాలసిన ఆధారాలన్నింటిని సమర్పించినప్పటికీ కోర్టు తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా లఖ్వీ విడుదలకు మొగ్గుచూపిందని హైకోర్టు ఉన్నతాధికారులు చెప్పారు. -
లఖ్వీ నిర్బంధం పొడగింపు
కరాచీ: ముంబై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి లక్వీ నిర్బంధాన్ని పాకిస్థాన్ మరో 30 రోజుల పాటు పొడగించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒబామా భారత్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అదుపులో ఉన్న లక్వీ 2008లో ముంబై దాడికి కుట్ర పన్నాడు. అతణ్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన ఏలూరు
ఏలూరు : అధికారంలో ఉన్న అహంకారంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆపార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సెటిల్మెంట్లకు ఏలూరు అడ్డగా మారింది. ఉద్యోగాలిప్పిస్తామని రామకోటి అనే వ్యక్తి.....పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. అయితే ఉద్యోగాలు ఇప్పించకపోవటంతో సెటిల్మెంట్ పేరుతో రామకోటిని... డిప్యూటీ మేయర్ చోడే వెంటకరత్నం, అనుచరులు వారం రోజలపాటు నిర్బంధించి, చితకబాదారు. అయితే ఈ విషయాన్ని అందుకున్న పోలీసులు బాధితుడిని వారి వద్ద నుంచి విడిపించారు. డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతో పాటు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఉపాధ్యాయిని క్రూరత్వం
స్నానాల గదిలో విద్యార్థినుల నిర్బంధం ఎ.కొండూరు కేజీవీబీలో ఘటన విచారణ జరిపిన తహశీల్దారు ఎ.కొండూరు (తిరువూరు) : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయిని క్రూరంగా ప్రవర్తించారు. తరగతులకు హాజరుకాలేదని ఆగ్రహించిన ఆమె పదో తరగతి విద్యార్థినులను స్నానాలగదిలో నిర్బంధించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మండల కేంద్రమైన ఎ.కొండూరులోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలో జరి గింది. పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినులు దుర్గాభవాని, రాణి, ఝాన్సి, శ్వేత అనారోగ్యం కారణంగా ఆదివారం తరగతులకు హాజరుకాలేదు. ఆగ్రహించిన తెలుగు ఉపాధ్యాయిని, ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ అంజలీదేవి వారిని స్నానాల గదిలో నిర్బంధించి తాళంవేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ తాళం తీయలేదు. తమను వదిలిపెట్టాలని విద్యార్థినులు వేడుకున్నా ఉపాధ్యాయిని కనికరించలేదు. దాహం వేస్తోందని, గాలి ఆడట్లేదని, దుర్వాసన భరించలేకున్నామని ఏడుస్తూ కేకలు వేసినా పట్టించుకోకపోగా, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది సైతం అటు వెళ్లకుండా అడ్డుకున్నారు. పాఠశాల వంటమనిషి శ్రీదేవి ఆ విద్యార్థినులకు సీసాతో మంచినీరందించారు. ఆ తరువాత తాళాలు తీయడంతో విద్యార్థినులు బయటకు వచ్చారు. తమను గదిలో నిర్బంధించిన విషయాన్ని విద్యార్థినులు చుట్టుపక్కల వారికి తెలి పారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయిని అంజలీదేవిని నిలదీయడంతో పిల్లలు సరిగా చదవనందునే తాను క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానని బదులిచ్చారు. తహశీల్దారు విచారణ సోమవారం పాఠశాలకు వచ్చిన ప్రత్యేకాధికారి వెంకటలక్ష్మి ఈ విషయాన్ని ఎ.కొండూరు తహశీల్దారు ప్రశాంతి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహశీల్దార్ కస్తూరిబాగాంధీ విద్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. బాధిత విద్యార్థినులు, వంటమనిషి, ఉపాధ్యాయినిని వేర్వేరుగా విచారించి జిల్లా ప్రాజెక్టు అధికారి, జీసీడీవోకు నివేదిక పంపారు. ఎంఈవో రాజశేఖర్ సీఆర్పీలతో కలిసి కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులను జరిగిన ఘటనపై విచారణ జరిపారు. విద్యార్థినుల్లో భయాందోళనలు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుకోడానికి వచ్చిన విద్యార్థినులపై ఉపాధ్యాయిని వేధింపుల వ్యవహారంతో మిగిలిన విద్యార్థినుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణంతో తరగతులకు హాజరు కాకపోతే దుర్వాసన వెదజల్లే గదిలో అక్రమంగా నిర్బంధించి శిక్షించడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాష్టీకంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
నన్ను జైలుపాలు చేయడం తగదు
న్యూఢిల్లీ: తనను జైలుపాలు చేయడం తగదంటూ బుధవారం సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టు ఎదుట హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. తద్వారా విచారణలో కొత్త అంకానికి తెరలేపారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విషయంలో హెబియస్ కార్పస్ రిట్ పరిధి అంశాలు ఇమి డి ఉన్నాయని విన్నవించారు. మార్చి 4న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ, రాయ్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణం ఈ కేసును విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తిని నిర్బంధించడం లేదా జైలులో ఉంచడం చట్టబద్ధ్దమైనదా కాదా అన్న అంశా న్ని నిర్ధారించడానికి సంబంధిత వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడానికి ఈ రిట్ను దాఖలు చేయడం జరుగుతుంది. రాయ్ ని నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశా ల్లో లోటుపాట్లు చోటుచేసుకున్నాయని, వీటిని తక్ష ణం సవరించాల్సి ఉందని జెఠ్మలానీ వివరించారు. రాయ్ దాఖలు చేసిన పిటిష న్ రిజిస్ట్రీ వద్ద నంబరయితే మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై విచారణ జరుగుతుందని బెంచ్ పేర్కొంది. అయితే చీఫ్ జస్టిస్ రిఫరెన్స్ మేరకు ఈ పిటిషన్ మధ్యాహ్నం, కేసును మామూలుగా విచారిస్తున్న జస్టిస్ రాధాకృష్ణన్, జేఎస్ కేల్కర్ ముందుకే వచ్చింది. ఈ సందర్భంగా జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ‘మీ ఆర్డర్ తప్పం టూ మీ బెంచ్ ముందే వాదనలు వినిపించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది’ అని అన్నారు. అయినా బెంచ్ ఇందుకు సిద్ధమయితే తన వాదనలు వినిపించడానికి సిద్ధమని పేర్కొన్నారు. అయితే గురువారం పిటిషన్ ను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. -
సమస్యల పరిష్కారం కోరుతూ డీఈవో నిర్బంధం
ఖమ్మం, న్యూస్లైన్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్రెడ్డిని కార్యాలయం గదిలో నిర్బంధించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చే వరకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని గదిబయట ఉపాధ్యాయులు బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కేడర్ వారీగా సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ పదోన్నతులు నిర్వహించడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ రిటైర్మెంట్ కేలండర్ను విడుదల చేయకుండా విద్యాశాఖాధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని, డబ్బులు ఇస్తే కాని ఫైల్ కదిలే పరిస్థితి లేదని ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ కాలనీలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్ మంజూరులో జాప్యం చేస్తున్నారని, జీహెచ్ఎస్ రాజేంద్రనగర్లో పనిచేస్తున్న సునీతకు ఓడీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గార్లమండలం ఎస్జీటీ బి.విజయ్కుమార్ గ్యాప్ పిరియడ్ సెటిల్మెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో డీఈవోను కార్యాలయంనుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని ఉపాధ్యాయులు పట్టుపట్టారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన డీఈవోను అడ్డుకున్నారు. అనంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహరరాజు డీఈవోతో చర్చలు జరిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. చివరకు ఈనెల 7వ తేదీన సంఘాల నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జనార్దన్రాజు, రవికుమార్, ఆదినారాయణ, శేషగిరిరావు, ఎ.వెంకటేశ్వర్లు, శేఖర్రావు, వీరబాబు, మహేష్, రామనాధం, జగదీష్, గోపాలరావు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.