doller
-
డాలర్తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్పై 100 శాతం టారిఫ్లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.ఆర్బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపువిదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు. -
డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!
దేశంలోని బ్యాంకుల్లో నగదు కొరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్కు డాలర్ కొరత ఏర్పడలేదు. మనీలాండరింగ్ను అరికట్టడం, అవినీతిని తగ్గించడం ద్వారా ఇంటర్బ్యాంక్ మార్కెట్లో డాలర్ల సరఫరా గణనీయంగా పెరిగింది.బంగ్లాదేశ్ బ్యాంక్ గత రెండు నెలల్లో 1.5 బిలియన్ డాలర్ల విదేశీ బకాయిలను చెల్లించగలిగింది. అది కూడా తన డాలర్ నిల్వలు ఏ మాత్రం తరిగిపోకుండా. విదేశీ బకాయిల చెల్లింపుల కోసం బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటర్బ్యాంక్ మార్కెట్ నుండి డాలర్లను సమీకరించింది.దేశంలో బ్యాంకులు గతంలో డాలర్ కొరతతో ఇబ్బంది పడ్డాయని, అయితే ఇప్పుడు చాలా వరకు డాలర్లు మిగులుతో ఉన్నాయని బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ అహ్సన్ హెచ్ మన్సూర్ వివరించారు. నగదు కొరత ఉన్నప్పటికీ, డాలర్ల సరఫరా మాత్రం స్థిరంగా ఉందని వివరించారు.డాలర్ల నిల్వ ఇలా..ప్రవాసులు ప్రాథమికంగా బ్యాంకులకు డాలర్లలో చెల్లింపులను పంపుతారు. దీంతో పాటు ఎగుమతి ఆదాయాలు కూడా డాలర్లలో జమవుతాయి. దీంతో బ్యాంకుల్లో డాలర్ నిల్వలు పెరుగుతున్నాయి. వీటిపై బ్యాంకులు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC)ని తెరుస్తాయి. లేదా అవసరమైనప్పుడు డాలర్లను బంగ్లాదేశ్ బ్యాంక్కి విక్రయిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఈ డాలర్లను కొనుగోలు చేసి తన నిల్వలకు జోడిస్తుంది. -
ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే..
కరెన్సీ విలువ దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది. దాని విలువ పెరుగుతున్న కొద్దీ దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విలువతోపాటు వాణిజ్యానికి అనువైన కరెన్సీ చలామణిలో ఉంటే ఆ దేశపురోగతే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 180 కరెన్సీలను అధికారికంగా గుర్తించింది. ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతులు, ఫారెక్స్ రిజర్వ్లు, బంగారు నిల్వలు, రోజువారీ వాణిజ్యం ఆధారంగా నిత్యం కరెన్సీ విలువ మారుతోంది. తాజాగా ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది. విలువైన కరెన్సీలు.. రూపాయిల్లో.. 1. కువైట్ దినార్: రూ.270.23 2. బహ్రెయిన్ దినార్ రూ.220.4 3. ఒమానీ రియాల్ రూ.215.84 4. జోర్డానియన్ దినార్ రూ.117.10 5. జిబ్రాల్టర్ పౌండ్ రూ.105.52 6. బ్రిటిష్ పౌండ్ రూ.105.54 7. కేమ్యాన్ ఐలాండ్ పౌండ్ రూ.99.76 8. స్విస్ ఫ్రాంక్ రూ.97.54 9. యూరో రూ.90.80 10. యూఎస్ డాలర్ రూ.83.10 ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూఎస్ డాలర్లలో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతోంది. -
మన రూ.100కు ఏ దేశంలో ఎంత విలువ?
ప్రపంచంలోని ప్రతీదేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు, ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ చెల్లింపులు అత్యధికంగా డాలర్లలోనే జరుగుతుంటాయి. ఇక భారత కరెన్సీ విషయానికొస్తే దీని విలువ కొన్ని దేశాల్లో తక్కువగానూ, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానూ ఉంటుంది. భారత కరెన్సీ విలువ స్థానిక కరెన్సీ కంటే చాలా రెట్లు అధికంగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీనితో ప్రయోజనం ఏమిటంటే, భారతీయులు ఆయా దేశాలను సందర్శించడానికి వెళితే తక్కువ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు. భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణపరంగా ఇది నాల్గవ స్థానంలో ఉంది. వియత్నాం చాలా అందమైన దేశంగా పేరొందింది. భారతీయులు వియత్నాం సందర్శించాలనుకుంటే, తక్కువ డబ్బుతోనే ఎంజాయ్ చేయవచ్చు. వియత్నాంలో భారతీయ కరెన్సీ రూ.100 విలువ 31,765 వియత్నామీస్ డాంగ్. నేపాల్లోనూ భారత కరెన్సీ విలువ ఎక్కువే. నేపాల్లో భారత రూ. 100.. 159 నేపాల్ రూపాయలకు సమానం. శ్రీలంకలో మన 100 రూపాయల విలువ 277 రూపాయలు. దీని ప్రకారం చూస్తే శ్రీలంక, నేపాల్లను సందర్శించడం భారతీయులకు అత్యంత చౌకైనది. ఇండోనేషియా స్థానిక సాంస్కృతిక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయులు తమ జేబుపై అధిక భారం పడకుండా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. పాకిస్తాన్లో కూడా భారత కరెన్సీ విలువ అధికంగానే ఉంది. పాకిస్తాన్లో భారత రూ.100 విలువ రూ.210గా ఉంది. -
పెరుగుతున్న రూపాయి మారక విలువ.. కారణం ఇదేనా..
ఇటీవల రూపాయి విలువ జీవన కాల కనిష్ఠానికి చేరింది. గతవారం స్టాక్మార్కెట్లు పుంజుకుంటున్న నేపథ్యంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మెరుగవుతుంది. విదేశాల నుంచి మూలధన పెట్టుబడులు దేశీయ మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయంగా అమెరికన్ కరెన్సీ బలాన్ని కోల్పోవడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అన్నిటికంటే మించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సెంటిమెంటును పుంజుకునేలా చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో రూపాయికి బలం చేకూరిందని ఫారెక్స్ ట్రేడర్లు అంటున్నారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం భారీగా కోలుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన రికార్డుస్థాయి లాభాలు, విదేశీ మదుపరుల నుంచి కొనసాగుతున్న పెట్టుబడులు, ఇతరత్రా ఫారిన్ ఫండ్స్తో ఫారెక్స్ మార్కెట్లో రూపీ ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే ఏకంగా 27 పైసలు ఎగిసి 83.03 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. రూపీ సెంటిమెంట్ను బలపర్చాయని ఫారెక్స్ డీలర్లు చెప్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఆరంభంలో 83.30 వద్ద మొదలైన రూపాయి మారకం విలువ.. ఒక దశలో 83.32 స్థాయికి నష్టపోయింది. అలాగే మరొక దశలో 82.94 స్థాయికి పుంజుకుంది. ఈ క్రమంలోనే చివరకు 83.03 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా రూపీ 37 పైసలు పుంజుకుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు స్థిరంగా 101.01 వద్దే ఉంది. వచ్చే ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తామంటూ ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఫెడ్ రిజర్వ్ ఇచ్చిన సంకేతాలు.. గురువారం పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ను 4 శాతం దిగువకు కుంగాయి. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల తర్వాత లాభాల్లో దేశీయ మార్కెట్లు
వరుస నష్టాల తర్వాత దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63782 వద్దకు చేరింది. నిఫ్టీ 190 పాయింట్లు ర్యాలీ అయి 19047 వద్ద స్థిరపడింది. యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మరకపు విలువ రూ.83.234కు చేరింది. సెన్సెక్స్ 30లోని యాక్సిక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, విప్రో, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. ఆల్ట్రాటెక్ సెమెంట్, ఐటీసీలు స్పల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత రూపాయి శుక్రవారం స్వల్పంగా 2 పైసలు పెరిగింది. డాలర్ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి రూపాయిపై స్వల్ప ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. విదేశీ సంస్థగత పెట్టుబడుల తరలింపు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించాయి. సిరియాలో యూఎస్ మిలిటరీ, ఇరాన్లమధ్య అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రానున్నరోజుల్లో రూపాయి కొంత దిగువ స్థాయుల్లోకి వెళ్లనుందనే అంచనాలు ఉన్నాయి. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
బంగారం కొనుగోళ్లకు డాలర్కు సంబంధమేంటి?
‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయింది. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదు. అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ కథ 1944లో మొదలైంది ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పాత మారకపు కరెన్సీ అయిన బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ స్థానంలో అమెరికా డాలర్ ఎలా వచ్చిందీ ఓసారి గుర్తుచేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలో బ్రెటన్ వుడ్స్లో జరిగిన అనేక దేశాల అంతర్జాతీయ సమావేశం నిర్ణయాల ఫలితంగా బ్రిటిష్ పౌండు స్థానంలో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా వేగంగా అవతరించింది. ఈ యుద్ధంలో ఇంగ్లండ్ సహా అనేక ఐరోపా దేశాలు ఆర్థికంగా దివాలా స్థితికి రావడంతో డాలర్ ప్రపంచ వాణిజ్య యవనికపై దర్శనమిచ్చి అప్పటి నుంచి అలా నిలిచిపోయింది. మధ్యలో కొన్నిసార్లు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాలర్ బలహీనపడిన మాట నిజమే గాని ప్రతిసారీ అది పుంజుకుని తన పూర్వ స్థానం నిలబెట్టుకుంటూనే ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే.. బంగారానికి (ఈ లోహానికి ఉన్న అనేక సుగుణాల వల్ల) ప్రపంచవ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచీ విలువ ఉంది. కాలంతో పాటు మనుషులకు ఈ లోహంపై మోజు మరీ పెరిగిపోతోంది. డాలర్ మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు ధర పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగినప్పుడల్లా డాలర్ పని ఇక అయిపోయిందనే మాటలు, పుకార్లు వినిపిస్తాయి. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, మారకద్రవ్యంగా డాలర్కు ఉన్న ప్రాధాన్యానికి ఎదురయ్యే సవాళ్లు కొన్ని మాసాలకు మాత్రమే పరిమితమని గడచిన దాదాపు 75 ఏళ్ల చరిత్ర చెబుతోంది. ప్రసిద్ధ ఆర్థికవేత్తలు సైతం ఇప్పట్లో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా తన హోదాను కోల్పోయే ప్రమాదమేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరగడానికి, దాని ధర కూడా పైకి ఎగబాకడానికి అవకాశాలున్నాయి గాని అమెరికా డాలర్ పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా? చరిత్రను పరిశీలిస్తే... ► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ► చాలా మంది ఎగ్జిక్యూటివ్లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు. ► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు. చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే! త్యాగధనులు అనిపించుకోవడానికి... ► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు. ► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్కు తగ్గించుకున్నారు. వాటాదారులకు సంఘీభావం తెలిపేలా... ►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు. ► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్లు, ఆప్షన్లు, బోనస్లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు. చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే! బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..! ► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది. ► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క. ► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట! ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే... ► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది! చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా? 100 రెట్లకుపైగా... ► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు. అసమానతల దృష్టి మళ్లించేందుకే... ► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది. ►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది. చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు! తిరగబడ్డ తెలివి... ► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. ► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సెన్సెక్స్ 279 పాయింట్లు అప్
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇటీవలి పతనం కారణంగా ధరలు పడిపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడమే దీనికి కారణం. డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా కలసి వచ్చింది. చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 279 పాయింట్లు పెరిగి 37,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 11,257 పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ, ఆర్థిక, లోహ రంగ షేర్లు రాణించాయి. ఫార్మా షేర్లు పడిపోయాయి. ఈ నెలలో స్టాక్ మార్కెట్ లాభపడటం ఇది రెండో రోజు మాత్రమే. 23 వరకూ ఒడిదుడుకులు... చైనా టెలికం దిగ్గజం హువాయ్పై అమెరికా ఆంక్షలు విధించడం... చైనా– అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, లాభాల్లో ముగిశాయి. ఇటీవలి తొమ్మిది రోజుల పతనం కారణంగా బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యాహ్నం 2 గంటల వరకూ స్తబ్దుగా కొనసాగింది. చివరి గంటన్నరలో షార్ట్ కవరింగ్కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 63 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 404 పాయింట్ల వరకూ పెరిగింది. మొత్తం మీద రోజంతా 467 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడే ఈ నెల 23 వరకూ స్టాక్మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ► టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజేస్ల బ్రాండెడ్ ఫుడ్ వ్యాపారాన్ని విలీనం చేస్తుండటంతో ఈ రెండు షేర్లు 8–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► యస్బ్యాంక్ నష్టాలు కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం పతనమై రూ.138 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభపడినా, 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, యస్బ్యాంక్, అరవింద్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, క్యాడిలా హెల్త్కేర్ తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► మూడు రోజుల నష్టాల నుంచి జెట్ ఎయిర్వేస్ కోలుకుంది. 2.5 శాతం లాభంతో రూ.127 వద్ద ముగిసింది. ఎగిసిన రూపాయి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గురువారం దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆఖర్లో కోలుకోవడంతో రూపాయి పుంజుకుంది. డాలర్తో పోలిస్తే 31 పైసలు పెరిగి 70.03 వద్ద క్లోజయ్యింది. రూపాయి బలపడటం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో దేశీ కరెన్సీ 48 పైసల మేర పెరిగింది. పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి లాభాలకు కొంత మేర అడ్డుకట్ట పడిందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్ ఇండెక్స్ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి. నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
బ్యాంక్ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్బ్రెంట్ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి. 198 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లకు నష్టాలు లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్కాంగ్ హాంగ్సెంగ్ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ∙వాటెక్ వాబాగ్ షేర్ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్ బ్యాంక్ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు–హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. -
సమీప భవిష్యత్లో అప్ట్రెండే!
వృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు సమీప కాలంలో పసిడి డిమాండ్కు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు, రాబడులపై మాత్రం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణగని ధోరణి, డాలర్ బలహీన పరిస్థితి, అమెరికా వడ్డీరేట్ల పెంపుదలకు సంబంధించి స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచే వస్తున్న వ్యతిరేకత, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటివి సమీప భవిష్యత్తులో బంగారం ధర పెరుగుదలకు దోహదపడతాయని వారి అభిప్రాయం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతమైన వృద్ధి బాటలోనే పయనిస్తున్నా... ఇంకా ఇబ్బందులు పొంచివున్నాయని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొనడం పసిడి కదలికకు సంబంధించి చర్చనీయాంశం అవుతోంది. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారంతో ముగిసిన వారంలో ఒకశాతం పెరిగి 1,223 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ 96.31 వద్ద ముగిసింది. వచ్చేవారం అమెరికా హౌసింగ్ మార్కెట్ గణాంకాలు రాబోతుండటం పసిడి కదలికలను కొంతమేర నిర్దేశిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లడానికి సంబంధించిన అంశాలు కూడా ప్రపంచ ఆర్థిక పరిస్జితుల అనిశ్చితికి దారితీస్తున్న సంగతి గమనార్హం. 1,200 డాలర్ల వద్ద స్థిరం... సమీప కాలంలో నైమెక్స్లో ధర 1,200 డాలర్ల స్థాయి కిందకు జారే అవకాశం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే ఆ పైకి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 1,200 డాలర్లు పసిడికి ‘‘స్వీట్ స్టాప్’’ వంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపునకు ధర పడితే, ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర లేక ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, అదే జరిగితే మళ్లీ ధర 1,200 డాలర్ల ఎగువకు పెరగడం ఖాయమన్న వాదన వినబడుతోంది. ఇక వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి కూడా పసిడి కొనుగోళ్లు జరుగుతున్న సంగతి గమనార్హం. అయితే 1,250 డాలర్ల స్థాయిలో పసిడికి గట్టి నిరోధం ఉందని, ఈ స్థాయి దాటితే అది సాంకేతికంగా పటిష్ట ధోరణిగానే భావించాలని, అయితే, తిరిగి బుల్లిష్ బాటలోకి ప్రవేశించడానికి 1,300 డాలర్లపైకి పసిడి కదలిక అవసరం అనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని వారి విశ్లేషణ. దేశీయంగా స్థిర ధోరణి... అంతర్జాతీయ మద్దతుకు తోడు దేశీయంగా డిమాండ్ పరిస్థితులు, డాలర్ మారకంలో రూపాయి బలహీన పరిస్థితి భారత్లో పసిడిని 10 గ్రాములకు రూ.30,000 పైనే నిలబెడుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో ముంబై స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు వరుసగా రూ. 32,090, రూ. 30,560 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.40,000గా ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లో 71.78 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో 10 గ్రాముల ధర రూ. 31,011 వద్ద ముగిసింది. -
30 బిలియన్ డాలర్లు కావాలి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీకి ఇండియా రేటింగ్స్ గురువారం కీలక సూచనలు చేసింది. ఇందుకుగాను ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కనీసం 30 బిలియన్ డాలర్లను సమీకరించాలన్నది ఇండియా రేటింగ్స్ విశ్లేషణ. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో రూపాయి విలువను సగటున 69.79కి తీసుకుని రావచ్చని పేర్కొంది. 2013లో ఇలాంటి చర్యలే తీసుకున్న విషయాన్ని కూడా తన తాజా నివేదికలో ప్రస్తావించింది. రూపాయి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 8.3% పతనమైన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, రూపాయి విలువ 15 శాతం పతనమయింది. గడచిన ఆరు నెలల్లో పతనం 8.3 శాతంగా ఉంది. ఆరు నెలల్లో డాలర్ మారకంలో సగటు విలువ 68.57గా ఉంది. ఇతర దేశాల కరెన్సీలూ బలహీనమయినా, రూపాయి అంతకుమించి పతనమవడం గమనార్హం. ♦ దువ్వూరి సుబ్బారావు నుంచి ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రఘురామ్ రాజన్ 2013లో అప్పట్లో రూపాయిని నిలబెట్టడానికి ఎన్ఆర్ఐల నుంచి 25 బిలియన్ డాలర్ల సమీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ♦ 2015–2019 మధ్య రూపాయి పతనం 3 శాతమే. 20 ఏళ్ల సగటు చూసినా (1999–2018) వార్షిక పతనం దాదాపు 3 శాతంగానే ఉంది. ♦ డాలర్ బలోపేతం, కమోడిటీ ధరలు ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, దీనితో దేశం నుంచి తరలుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ద్రవ్యలోటుపై ఆందోళనలు వంటి పలు అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. ♦ ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండటం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడి చమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ♦ ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం. ఇదే సమయంలో దిగుమతులు 10.45 శాతం (41.9 బిలియన్ డాలర్లు) పెరిగాయి. 73.27 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 11 పైసలు బలహీనపడింది. 73.27 వద్ద ముగిసింది. విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ల రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయని డీలర్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత ఒడిదుడుకులతోసాగి బుధవారం 41పైసలు లాభంతో మూడు వారాల గరిష్టం 73.16కు చేరింది. ఆరేళ్ల గరిష్టానికి పసిడి పండుగలు, రూపాయి బలహీనత నేపథ్యం న్యూఢిల్లీ: పసిడి ధర ఇక్కడి స్పాట్ మార్కెట్లో ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. 99.99, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు రూ.125 చొప్పున పెరిగి, వరుసగా రూ. 32,625, రూ.32,475కు చేరాయి. 2012 నవంబర్ 29 తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. అప్పట్లో 99.99 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32.940ని తాకింది. మూడు రోజుల్లో న్యూఢిల్లీలో పసిడి దాదాపు రూ.405 పెరిగింది. ఒకపక్క పండుగల సీజన్, మరోవైపు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడి ధరను పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్కు (31.1గ్రా) 1,250 డాలర్లలోపు ఉన్నా, రూపాయి బలహీనతలు బంగారం దిగుమతులపై మరింత భారాన్ని పెంచుతోంది. ఈక్విటీల బలహీనతలు, డాలర్ ఇండెక్స్ బలోపేతంపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం ప్రారంభించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమాయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్లో పసిడి ఔన్స్ ధర 1,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.31,911 వద్ద ట్రేడవుతోంది. -
ఇప్పటికీ ‘పసిడి’ బలహీనమే!
నైమెక్స్లో వరుసగా ఆరవనెలా సెప్టెంబర్లోనూ పసిడి బలహీనంగానే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ పటిష్ట ధోరణి దీనికి నేపథ్యం. ఆరు నెలల్లో డాలర్ ఇప్పటి వరకూ దాదాపు 12 శాతం తగ్గింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి మరోసారి ఆగస్టు కనిష్ట స్థాయి (1,160 డాలర్లు) తాకే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఎగువ స్థాయిలో 1,216, 1,236 డాలర్లు నిరోధ స్థాయిలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే భారత్ విషయానికి వచ్చే సరికి దేశంలో పెద్దగా ధర తగ్గే అవకాశం లేదన్నది వారి వాదన. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణం. ఇక వారంలో నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర 9 డాలర్లు తగ్గి, 1,196 డాలర్లకు పడింది. డాలర్ ఇండెక్స్ డాలర్ పెరుగుదలతో 94.80కి చేరింది. ఎంసీఎక్స్లో ధర వారంలో కేవలం రూ.74 తగ్గి రూ.30,508కి చేరింది. 99.9, 99.5 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.390 చొప్పున తగ్గి, రూ.30,450, రూ.30,300 వద్ద ముగిశాయి. -
పడిపోతూనే ఉన్న రూపాయి..
ముంబై: ఆరో రోజూ రూపాయి నేల చూపులే చూసింది. డాలర్తో బుధవారం మరో 17 పైసలు ఆవిరై 71.75 వద్ద స్థిరపడింది. కనిష్టంలో ఇది మరో రికార్డు. వరుసగా ఆరు రోజుల్లో రూపాయి 165 పైసల మేర తన విలువను కోల్పోయింది. ఇంట్రాడేలో రూపాయి నూతన రికార్డు కనిష్టాన్ని 71.97 వద్ద నమోదు చేసింది. ఆ తర్వాత కాస్త రికవరీ అయింది. ఆర్బీఐ రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని కొంత వరకు నిలువరించిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధాలే రూపాయిని పడేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కూడా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించాయి. ద్రవ్యలోటు, కరెంటు ఖాతాల లోటుతో దేశ ఆర్థిక రంగానికి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. డాలర్ బలపడిందంతే...: జైట్లీ ‘‘రూపాయి విలువ క్షీణించడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం. దేశీయ ఆర్థిక పరిస్థితి చూడండి. అలాగే, అంతర్జాతీయ పరిస్థితులనూ చూడండి. ఇందుకు దేశీయ కారణాలు ఎంత మాత్రం కాదు. వర్ధమాన దేశాల్లో ప్రతీ కరెన్సీతోనూ డాలర్ బలపడింది. రూపాయి బలహీనపడలేదు. పౌండ్, యూరో తదితర కరెన్సీలతో రూపాయి బలపడింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. -
రేట్లకు రెక్కలు!!
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో వినియోగవస్తువుల నుంచి ఫోన్లు మొదలైన ఉత్పత్తుల దాకా అన్నింటి ధరలు పెరగనున్నాయి. దేశీ కరెన్సీ పతనం ఇదే తీరుగా కొనసాగితే ..ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్ మొదలుకుని వంట గ్యాస్ దాకా అన్నింటి రేట్లు ఎగియనున్నాయి. దిగుమతుల భారం పెరిగిపోతుండటంతో.. కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందుగానే రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి మారకం పతన ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు సోనీ, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు తెలిపాయి. ‘డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 స్థాయిని దాటేయడం ముడివస్తువుల వ్యయాలపై మరింతగా ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే.. సమీప భవిష్యత్లో రేట్లు పెంచక తప్పక పోవచ్చు’ అని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది వెల్లడించారు. ఒకవేళ 70 స్థాయి దాటి రూపాయి కొనసాగితే.. పండుగలకు ముందే రేట్లను పెంచవచ్చని, ఆగస్టు ఆఖర్లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అటు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే వినియోగ ఉత్పత్తుల రేట్లపై ఒత్తిడి తప్పదన్నారు. ప్రస్తుతానికి దేశీ కరెన్సీ తీరును పరిశీలిస్తున్నామని, టీవీల రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయాలేమీ తీసుకోలేదని సోనీ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ సతీష్ పద్మనాభన్ చెప్పారు. కొన్ని ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశాలు ఉండొచ్చని, ఇందుకు మరికాస్త సమయం పట్టొచ్చని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ప్రభావం.. రూపాయి పతనం కొనసాగితే ముడివస్తువుల ధరలూ పెరుగుతాయని, ఫలితంగా మొబైల్ ఫోన్లు.. ముఖ్యంగా ఎంట్రీలెవెల్ వేరియంట్స్ రేట్లు పెరగవచ్చని హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వెల్లడించాయి. ‘డాలర్ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొబైల్స్ తయారీ వ్యయాలూ పెరుగుతాయి. ఫలితంగా హ్యాండ్సెట్స్ రేట్లూ పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంటెక్స్ టెక్నాలజీస్ (ఇండియా) డైరెక్టర్ నిధి మార్కండేయ చెప్పారు. కస్టమ్స్ సుంకాలు, ముడివస్తువుల రేట్ల పెరుగుదలతో హ్యాండ్సెట్స్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని.. కోమియో ఇండియా సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. రూపాయి పతనం ప్రభావాలను సమీక్షిస్తున్నామని, రేట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంట్రీ లెవెల్ మొబైల్స్పై నేరుగా ప్రభావం పడొచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అయితే ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో రేట్ల పెంపుపై నిర్ణయం చాలా కష్టమైన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. పెరిగే చమురు బిల్లు .. రూపాయి కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతుండటం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ముడిచమురు దిగుమతుల భారం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 26 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతుల భారం పెరిగితే.. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులే ఉంటున్నాయి. 2017–18లో 220.43 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 87.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం దిగుమతులు 227 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్తో రూపాయి మారకం రేటు 65 స్థాయిలో, ముడిచమురు బ్యారెల్ రేటు 65 డాలర్లుగా ఉంటుందనే అంచనాలతో.. దిగుమతుల బిల్లు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాం. కానీ ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి పతనం వల్ల పూర్తి ప్రభావాలు ఈ నెలాఖరులోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి పతనంతో ఎగుమతి సంస్థలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ మొదలైన వాటికీ ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇవి డాలర్ల మారకంలో బిల్లింగ్ చేయడం వల్ల వాటి నుంచి ఇంధనాలు కొనుగోలు చేసి విక్రయించే రిటైల్ సంస్థలు రేట్లను పెంచాల్సి వస్తుంది. ఒకవేళ చమురు రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉండి, రూపాయి 70 స్థాయిలోనే కొనసాగిన పక్షంలో ఇంధన ధరలు లీటరుకు 50–60 పైసల మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రూపాయి మరింత పతనం తొలిసారిగా 70కి దిగువన క్లోజింగ్ 26 పైసలు డౌన్ ముంబై: రూపాయి విలువ శరవేగంగా కరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ మరింత క్షీణించి కీలకమైన 70 మార్కు దిగువన తొలిసారిగా క్లోజయ్యింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే మరో 26 పైసలు తగ్గి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 70.40ని కూడా తాకడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో రూపాయి పతనానికి కొంతైనా అడ్డుకట్ట పడిందని కరెన్సీ ట్రేడర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 69.89తో పోలిస్తే గురువారం ఫారెక్స్ మార్కెట్లో గ్యాప్ డౌన్తో ఏకంగా 70.19 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 70.40 స్థాయికి కూడా పడిపోయి చివరికి కొంత కోలుకుని 70.15 వద్ద క్లోజయ్యింది. పెరిగిపోతున్న ద్రవ్య లోటు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా–చైనా మధ్య వాణిజ్య భయాలపై ఆందోళనలు, డాలర్కు డిమాండ్ తదితర అంశాల నేపథ్యంలో దేశీ కరెన్సీ విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 10.5 శాతం మేర క్షీణించింది. వర్ధమాన దేశాల కరెన్సీల పతనానికి కారకమైన టర్కీ లీరా విలువ మాత్రం పెరిగింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 15 బిలియన్ డాలర్లు అందిస్తామంటూ కతార్ ముందుకు రావడంతో లీరా ర్యాలీ కొనసాగింది. మరోవైపు, రూపాయి క్షీణతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా 17 శాతం మేర పెరిగిన రూపాయి మారకం ప్రస్తుతం మళ్లీ సహజ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు. -
కోలుకున్న రూపాయి
ముంబై: డాలర్కు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో రూపాయి పుంజుకుంది. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం 30 పైసలు బలపడి 68.08 వద్ద క్లోజయింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలకు మొగ్గుచూపారు. అదే సమయంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తగ్గడంతో రూపాయి కోలుకోవడానికి దోహదపడింది. యూరో, పౌండ్, యెన్లతోనూ రూపాయి బలపడడం గమనార్హం. మంగళవారం నెల రోజుల కనిష్ట స్థాయి 68.38వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆసియా కరెన్సీలు చాలా వరకు రికవరీ అయ్యాయి. -
56 పైసలు బలపడిన రూపాయి
ముంబై: బలహీనపడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత కోలుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో ఒకేరోజు 56 పైసలు బలపడి 67.78 వద్ద ముగిసింది. రూపాయి ఒకేరోజు ఇంత బలపడ్డం ఈ ఏడాది ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు (10 రోజుల క్రితం 4 ఏళ్ల గరిష్ట స్థాయిలో 80.5 డాలర్లకు చేరిన బ్రెంట్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటల సమయానికి 76.19 స్థాయి వద్ద ట్రేడవుతోంది.) కొంత ఉపశమించడం, ఈక్విటీ మార్కెట్ లాభపడటం రూపాయి బలానికి కారణం. మే 31న విడుదలయ్యే జీడీపీ ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, వర్షాలు బాగుండి, ధరలు తగ్గుతాయన్న విశ్లేషణలు రూపాయికి తక్షణ బలాన్ని తెచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ విశ్లేషకుడు ఆనంద్ జేమ్స్ చెప్పారు. -
మళ్లీ రూపాయి 68 దిగువకు...
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మళ్లీ కిందకు జారింది. వివరాల్లోకి వెళితే, ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70కి చేరింది. కాగా శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు కనిష్టానికి పడింది. 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్ విలువ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ వల్ల దేశీయ కరెన్సీ బలహీనబాట ఆగడం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. గత వారం మొత్తంమీద రూపాయి 67 పైసలు నష్టపోయింది. ఇదిలాఉండగా, భారత్ కరెంట్ అకౌంట్ (క్యాడ్)పై క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ విశ్లేషించింది. 2018–19లో 2.4 శాతంగా క్యాడ్ నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
దేశంలో బంగారానికి రూపాయి మెరుపు
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు అక్కడక్కడే ఉన్నా, దేశంలోమాత్రం ఉరుకులు పెట్టింది. డాలర్ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 60 పైసలు పతనం కావడమే దీనికి కారణం. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 11వ తేదీతో ముగిసిన వారంలో 1,316 డాలర్ల నుంచి 1,318 డాలర్లకు పెరిగింది (వారం మధ్యలో ఒక దశలో 1,328 స్థాయిని చూసింది). అయితే ఇదే కాలంలో భారత్ ఫ్యూచర్స్ మార్కెట్స్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.404 పెరిగి రూ. 31,518కి ఎగసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.455 ఎగసి వరుసగా రూ. 31,615, రూ.31,465 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.1,110 పెరిగి రూ. 40,290కి చేరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ వారంలో దాదాపు 60 పైసలు బలహీనపడి 67.40ని చూడ్డం ఆయా అంశాలకు నేపథ్యం. ఫెడ్ రేటు పెంపు ప్రభావం... అంతర్జాతీయంగా బంగారం ధర మరింత పెరిగి, రూపాయి బలహీనత కొనసాగితే దేశంలో యల్లో మెటల్కు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. రూపాయికి 67.50 వద్ద గట్టి నిరోధం ఉండగా, గడచిన ఐదు నెలలుగా అంతర్జాతీయంగా పసిడి 1,365 డాలర్ల వద్ద నిరోధం – 1,300 డాలర్ల వద్ద మద్దతు మధ్య నిర్దిష్ట శ్రేణిలో తిరుగుతోంది. అయితే డాలర్ ర్యాలీ కొనసాగి, బంగారం ధర అంతర్జాతీయంగా పడిపోతే, దేశీయంగా పసిడి ధర సమీప కాలంలో రూ.32,500 దాటకపోవచ్చు. జూన్లో అమెరికా ఫెడ్ వడ్డీరేటు పెంపుపై తీసుకునే నిర్ణయ ప్రభావాలు డాలర్, బంగారం కదలికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
డాలర్ ర్యాలీతో పసిడి పరుగు కష్టమే
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పరుగు కొనసాగితే పసిడి వెనక్కు తగ్గడం ఖాయమని ఆర్జేఓ ఫ్యూచర్స్లో సీనియర్ మార్కెట్ విశ్లేషకులు ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. గతవారం పసిడికి సంబంధించి రెండు ప్రధాన అంశాలు చూస్తే... ♦ ఒకటి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి)లో ఎలాంటి మార్పు చేయలేదు. ♦ 18 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో అమెరికా నిరుద్యోగిత 3.9 శాతంగా నమోదయ్యింది. ఈ రెండు అంశాల నేపథ్యంలో వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్ ఔన్స్ (31.1గ్రా) ధర 9 డాలర్లు తగ్గి 1,316 డాలర్లకు పడింది. కేవలం నెలరోజుల వ్యవధిలో 1,368 డాలర్ల స్థాయి నుంచి పసిడి ప్రస్తుత స్థాయికి పడుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 89.10 కనిష్ట స్థాయిల నుంచి 4వ తేదీతో ముగిసిన శుక్రవారం నాటికి 92.42 స్థాయికి చేరింది. ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయం ప్రకారం– జూన్లో ఫెడ్రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో డాలర్ ఇండెక్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారంపై తీవ్ర ఒత్తిడిని పెంచే అంశం ఇది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతలూ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు తక్కువే. ఉత్తరకొరియా విషయంలో ఇప్పటికే ఈ విషయం స్పష్టమైంది. సంబంధిత అంశాలన్నీ పసిడి ధరను తగ్గించే అవకాశాలే ఉన్నాయి. ‘‘ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ ఒక స్థిర స్థాయిలో తిరుగుతోంది. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు కనిపిస్తున్నాయి. గత గరిష్టస్థాయిలు 95ను తాకవచ్చన్నది మా అంచనా. గత నవంబర్లో డాలర్ ఇండెక్స్ ఇదే స్థాయిలో ఉంది. అప్పుడు పసిడి స్థాయి 1,275 డాలర్లు. ఇప్పుడు డాలర్ ర్యాలీ జరిగితే పసిడి 1,300 డాలర్ల స్థాయి దిగువకు పడిపోవచ్చు’’ అని ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. అయితే 1,300 డాలర్లు పటిష్ట మద్దతు స్థాయని ఆయన అంచనావేస్తున్నారు. ఇక ఎగువ స్థాయిలో 1,370 డాలర్ల వద్ద పసిడికి పటిష్టం నిరోధం కనిపిస్తోంది. ఈ ఏడాది చివరి నుంచీ ఇదే శ్రేణిలో తిరిగిన పసిడి సమీప కాలంలో తన బాటను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. అమెరికా వృద్ధి సంబంధ అంశాలు ఇందుకు ప్రధానంగా దోహదపడతాయని భావిస్తున్నారు. దేశీయంగా స్వల్ప నష్టాలు... డాలర్ మారకంలో రూపాయి బలహీనత (4వ తేదీతో ముగిసిన వారంలో 20 పైసలు నష్టంతో 66.82), అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో గడచిన వారంలో పసిడి స్వల్పంగా నష్టపోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్లో పసిడి 10 గ్రాముల ధర రూ.103 తగ్గి రూ.31,114వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.170 చొప్పున తగ్గి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.90 తగ్గి రూ.39,180 వద్ద ముగిసింది. -
అంతర్జాతీయంగా పడినా... దేశీయంగా పరుగు
అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గినా, భారత్లో మాత్రం పెరిగింది. దీనికి డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే.. పసిడి అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్లో శుక్రవారం (20వ తేదీ)తో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) 10 డాలర్లు తగ్గి, 1,337 డాలర్లకు చేరింది. వారం మధ్యలో ఒక దశలో 1,357 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, మరోదఫా ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఊహాగానాలు, డాలర్ ఒడిదుడుకులు పసిడిపై ప్రభావం చూపాయి. 10 రోజుల క్రితం 1,369 డాలర్లను తాకి, కిందకు జారిన బాటలో 1,332 డాలర్ల వద్ద గట్టి మద్దతు లభించింది. తాజా పరిణామాలు పసిడి బుల్లిష్ ట్రెండ్లోనే కొనసాగుతుందనడానికి సూచికగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొంతకాలం 1,270 –1,370 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అంచనా. ఇక వారంలో డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలపడి 89.51 నుంచి 90.08కి చేరింది. దేశీయంగా మూడు వారాల్లో రూ.1,300 పెరుగుదల ఇక దేశీయంగా చూస్తే.. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 10 గ్రాములకు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.314 ఎగసి, రూ.31,432కు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.1,300 ఎగిసింది. అంతర్జాతీయంగా ధర తగ్గినప్పటికీ, దేశీయంగా పెరుగుదలకు డాలర్ మారకంలో రూపాయి బలహీనపడటం కారణం. అంతర్జాతీయంగా రూపాయి విలువ వారంలో 65.21 నుంచి 66.22కు పనతమైంది. ఒకదశలో 66.30పైకి క్షీణించడం గమనార్హం. ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.495 చొప్పున పెరిగి రూ.31,465, రూ.31,315 వద్ద ముగిశాయి. రెండు వారాల్లో పసిడి పెరుగుదల రూ.1,000. ఇక వెండి కేజీ ధర భారీగా రూ.1,680 ఎగసి రూ.40,160కి చేరింది. -
రూపాయికి చమురు సెగ!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వేగంగా కిందకు జారుతోంది. శుక్రవారం ఏకంగా 32 పైసలు బలహీనపడింది. 66.12 వద్ద ముగిసింది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయికి రూపాయి పతనం ఇదే తొలిసారి. వరుసగా ఐదు రోజుల నుంచీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం రూపాయి ముగింపు 65.80. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్లో ట్రేడింగ్ ప్రారంభంతోనే గ్యాప్డౌన్తో 66.06 వద్ద ప్రారంభమైంది. ఏప్రిల్లో ఇప్పటికి రూపాయి దాదాపు ఒక శాతం పతనమయ్యింది. కదలికలు ఇలా... 2016 నవంబర్లో 68.60 స్థాయికి పతనమైన రూపాయి, అందరి అంచనాలకూ భిన్నంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆశావహ పరిస్థితి, డాలర్ బలహీనత అంశాల నేపథ్యంలో... వేగంగా బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది మొదటి నెల్లో 63.24ను చూసింది. అయితే అటు తర్వాత ఆర్థిక అనిశ్చితులతో దాదాపు మూడు నెలలు ఒడిదుడుకులతో బలహీనపడుతూ, క్రమంగా 65కు చేరింది. అటు తర్వాత కేవలం వారం రోజల్లో (0.88 శాతం పతనం) ప్రస్తుత స్థాయి 66.12కు చేరింది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మరింత బలహీనపడి 66.30 వద్ద ట్రేడవుతోంది. ఇదే తీరున ముగిస్తే, సోమవారం దాదాపు మరో 20పైసలు గ్యాప్డౌన్తో రూపాయి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బలహీనతకు కారణాలు... అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్ట్రెండ్ తాజా పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ బ్రెంట్ ధర బేరల్కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్ డిమాండ్, క్రూడ్ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. క్రూడ్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్ (ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు దేశానికి తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం సవాళ్లూ పొంచి ఉన్నాయి. ఆయా అంశాలు స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులను సృష్టిస్తున్నాయి. దీనితో రూపాయి బలహీనత సమస్య తీవ్రమవుతోంది. జూన్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పెంచుతుందన్న అంచనాలూ రూపాయి బలహీనతకు దారితీస్తోంది. దేశానికి ఎఫ్డీఐల ప్రవాహం, రికార్డు స్థాయిలో (ప్రస్తుతం 424 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు కొనసాగింపు వంటి అంశాలు రూపాయి ఒడిదుడుకులను నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లైఫ్ టైమ్ గరిష్టంలో ఫారెక్స్ నిల్వలు 426 బిలియన్ డాలర్లకు చేరిక ముంబై: భారత విదేశీ మారక నిల్వలు లైఫ్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఏప్రిల్ 13తో ముగిసిన వారాంతానికి 1.217 బిలియన్ డాలర్లు పెరిగి 426.082 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ నిల్వలు గణనీయంగా పెరగడం ఇందుకు తోడ్పడినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.202 బిలియన్ డాలర్లు పెరిగి 400.978 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు యధాతథంగా 21.484 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 503.6 మిలియన్ డాలర్లు పెరిగి 424.864 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్ 8న తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటిన విదేశీ మారక నిల్వలు అప్పట్నుంచీ హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. -
డాలర్ బలంతో రూపాయి డీలా..!
ముంబై: అంతర్జాతీయంగా పటిష్ట డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో సోమవారం రూపాయి నష్టాల బాట పటింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు తగ్గి 65.17 వద్ద ముగిసింది. భారత్ కరెంట్ అకౌంట్ (క్యాడ్– ఎఫ్ఐఐ, డీఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) పెరుగుతుందన్న ఆందోళనలు కూడా రూపాయి బలహీనతకు కారణమని విశ్లేషకుల అంచనా. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీలో క్యాడ్ 2 శాతంగా నమోదయ్యిందని తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. -
పసిడికి డాలరు దెబ్బ
మూడేళ్ల కనిష్టస్థాయి నుంచి డాలరు రికవరీకావడంతో గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర హఠాత్ పతనాన్ని చవిచూసింది. వారంవారంగా 27 డాలర్లు నష్టపోయి 1,330 డాలర్ల వద్ద ముగిసింది. ఒకదశలో ఇది 1,325 డాలర్లకు సైతం పడిపోయింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ ఈ వారంలో అమెరికా కాంగ్రెస్ ముందు చేసే ప్రసంగం ఆధారంగా సమీప భవిష్యత్తులో పసిడి ట్రెండ్ వుండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదల నెమ్మదిగా వుండవచ్చన్న సంకేతాల్ని ఆయన వెల్లడిస్తే పసిడి క్రమేపీ పుంజుకుంటుందని, వడ్డీ రేట్ల పట్ల కఠిన వైఖరిని పొవెల్ ప్రదర్శిస్తే బంగారం ధర మరికాస్త తగ్గవచ్చని విశ్లేషకులు వారి అంచనాల్లో పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం వుందని, ఈ కారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారం ప్రస్తుతస్థాయి నుంచి భారీగా పతనమయ్యే అవకాశం లేదని వారు అంటున్నారు. సాంకేతికంగా 1,305, 1,290 స్థాయిల వద్ద పసిడి ఫ్యూచర్లకు మద్దతు లభిస్తున్నదని, 1,360, 1,375 స్థాయిల వద్ద అవరోధం కలగవచ్చని అనలిస్టులు అంచనావేస్తున్నారు. దేశీయంగా రూ.300కుపైగా పతనం... ఇక దేశీయంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఇక్కడా కనిపించింది. అయితే ప్రపంచ మార్కెట్లో 2 శాతం వరకూ పసిడి తగ్గినప్పటికీ, ఇక్కడ మాత్రం క్షీణత 1 శాతానికే పరిమితమయ్యింది. రూపాయి భారీగా తగ్గిన కారణంగా, దేశీయంగా పసిడి పతనం అల్పంగా వుంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 300 తగ్గి, రూ.30,509కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ధర రూ. 345 నష్టంతో రూ.30,570కు పడింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో తగ్గి రూ. 30,420కు చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ.320 నష్టపోయి, రూ.38,390కి చేరింది. ఇక వారం వారీగా అంతర్జాతీయంగా రూపాయి డాలర్ మారకంలో బలహీనపడి 64.90 వద్ద ముగిసింది. 16వ తేదీతో ముగిసిన వారంలో ఈ విలువ 64.60 వద్ద ఉంది. -
డాలర్ బలహీనతతో రయ్మన్న పసిడి!
అంచనాలకు అనుగుణంగానే డాలర్ ఇండెక్స్ మళ్లీ కింద చూపు చూడ్డం ప్రారంభించింది. ఇదే అదనుగా మళ్లీ పసిడి వారంలో ముందుకు దూసుకుపోయింది. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 16వ తేదీతో ముగిసిన వారంలో పసిడి 32 డాలర్లు లాభపడి 1,350 డాలర్లకు ఎగిసింది. ఈ వారం ఒక దశలో పసిడి ఏకంగా ఐదు నెలల గరిష్టస్థాయి 1,363 డాలర్లను కూడా తాకింది. వారాల వారీగా చూస్తే, రెండు వారాలు వెనక్కు తగ్గిన పసిడి, మళ్లీ ఒకేవారంలో అంతే పైకి లేవడం గమనార్హం. నెలలవారీగా చూస్తే, నాలుగు నెలలుగా దూకుడును ప్రదర్శిస్తోంది. ఇక డాలర్ ఇండెక్స్ నేపథ్యం చూస్తే, దిగువ ముఖ పయన ధోరణి 16వ తేదీతో ముగిసిన వారంలో మరింత స్పష్టమైంది. మూడు వారాల క్రితం మూడేళ్ల కనిష్ట స్థాయి (88.30)కి పడి, అటుపై కొంత తేరుకుని 90 పైకి లేచిన డాలర్ ఇండెక్స్, గడచిన వారంలో ఒక దశలో మళ్లీ ఏకంగా 88.18 స్థాయికి పతనమైంది. తిరిగి కొంత కోలుకుని వారం వారీగా 1.18 నష్టంతో 89.03 స్థాయిలో ముగిసింది. ఈ డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకుల ధోరణి అమెరికా ఆర్థిక ఆనిశ్చితికి అద్దం పడుతోందని, ఇదే ధోరణి కొనసాగితే, వచ్చే రెండు వారాల్లో పసిడి 1,400 డాలర్లవైపు పరుగు ఖాయమని నిపుణుల వాదన. దేశీయంగానూ దూకుడు ఇక దేశీయంగా చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా 18పైసలు బలహీనపడ్డం (10వ తేదీతో ముగిసిన వారంలో 64.40), అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దూకుడు వంటి అంశాలు దేశంలోనూ బంగారం మెరుపునకు కారణమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజి (ఎంసీఎక్స్)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 791 పెరిగి, రూ.30,801కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్ లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ. 785 లాభంతో రూ.30,915కు ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో పెరిగి రూ. 30,765కు చేరింది. వెండి కేజీ ధర భారీగా 790 లాభపడి, రూ. 38,710కి చేరింది. -
డాలర్ నడతను బట్టి... పసిడి భవిత!
బంగారం భవిష్యత్ డాలర్ ఇండెక్స్ భవితపై ఆధారపడి ఉంటుందని ఏంజల్ బ్రోకింగ్ నాన్–అగ్రీ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ విభాగం చీఫ్ అనలిస్ట్ ప్రథమేశ్ మాల్యా అభిప్రాయపడ్డారు. మూడు వారాల క్రితం మూడేళ్ల కనిష్ట స్థాయి 88.30కి పతనమైన డాలర్ ఇండెక్స్ ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిన వారంలో తిరిగి 90.22స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,364 డాలర్ల స్థాయిని చేరిన పసిడి ధర ఫిబ్రవరి 9వ తేదీతో ముగిసిన వారంలో 1,318 డాలర్లకు పడింది. వారంలో 18 డాలర్లు పతనమైంది. డాలర్ ఇండెక్స్ ఇదే రీతిలో ముందుకు కొనసాగితే పసిడి కొంత కాంతిని కోల్పోయి వచ్చే మూడు నెలల్లో 1,250 డాలర్లకు చేరవచ్చని మాల్యా అంచనావేస్తున్నారు. అయితే డాలర్ ఇండెక్స్ బేరిష్ ట్రెండ్ తిరిగి ప్రారంభమయితే, మళ్లీ పసిడి 1,400 డాలర్ల దిశగా పయనించే అవకాశం ఉందని మరికొందరు నిపుణుల అభిప్రాయం. ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీస్సహా మార్కెట్లో అన్ని విభాగాలూ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. కొంత బేరిష్ ట్రెండ్వైపునకు మొగ్గు కనిపిస్తున్నా, దీనికి కారణాలు ఇంకా విశ్లేషణ దశలోనే ఉన్నాయి. ఊహించని రీతిలో అంతర్జాతీయంగా మళ్లీ ఏదైనా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తి, దీనికి భౌగోళిక ఉద్రిక్తతలు కూడా తోడయితే, పసిడి 1,400 డాలర్ల వైపు వేగంగా పురోగమిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దేశీయ స్పాట్ మార్కెట్లో రూ.500కు పైగా డౌన్ ఇక దేశీయంగా చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా 64.23 వద్ద స్థిరంగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 358 తగ్గి, రూ.30,009కి చేరింది. అనలిస్ట్ ప్రథమేశ్ మాల్యా అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పురోగతి కొనసాగితే, దేశీయ ఎంసీఎక్స్లో పసిడి వచ్చే మూడు నెలల్లో 28,800కు పడిపోయే అవకాశం ఉంది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ.505 నష్టంతో రూ.30,130కు దిగింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో పతనమై రూ. 29,980కి దిగింది. వెండి కేజీ ధర భారీగా 1,350 తగ్గి, రూ. 37,920కి పడింది. -
నాలుగు నెలల గరిష్టానికి పసిడి
అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్లో పసిడి తిరిగి నాలుగు నెలల గరిష్టస్థాయిని తాకింది. వారం మధ్యలో ఒక దశలో 1,365 డాలర్ల స్థాయికి చేరిన ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర వారం చివరిలో లాభాల స్వీకరణతో 1,348 స్థాయి వద్ద ముగిసింది. వారం వారీగా 22 డాలర్లు బలపడింది. అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్ట స్థాయికి పతనం (వారం మధ్యలో 88.30 స్థాయిని తాకి వారం చివరిలో 88.87 వద్ద ముగింపు) వంటి అంశాలు పసిడి బలానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కొంత కన్సాలిడేషన్ దశలో ఉన్న పసిడి 1,400 డాలర్ల స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల విశ్లేషణ. 1,310 పసిడికి తక్షణ మద్దతని వారి అభిప్రాయం. అయితే ఈ దశలో కొంత ఒడిదుడుకులు ఉంటాయన్నది వారి వాదన. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం జరగనుంది. జనవరి ఉపాధి అవకాశాల కల్పన గణాంకాలు కూడా వెలువడనున్నాయి. నిజానికి ఆయా అంశాలు పసిడి ధర గతిని నిర్ణయించాల్సి ఉంది. అయితే అమెరికా పాలనాయంత్రాంగం కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులను సృష్టిస్తోందని, దీంతో డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులకు గురవుతుందనీ, ఇదే ధోరణి పసిడిలోనూ కనిపిస్తుందన్నది విశ్లేషణ. దేశీయంగా...: ఇక దేశీయంగా చూస్తే, ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ.592 పెరిగి రూ.30,361కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ.420 పెరిగి రూ.30,595కు చేరింది. -
ఐదు వారాల పరుగుకు విరామం!
అంతర్జాతీయ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజి– నైమెక్స్లో పసిడి ఐదు వారాల పరుగుకు 19వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కాస్త బ్రేక్ పడింది. ఔన్స్ (31.1గ్రా) ధర వారంలో దాదాపు నాలుగు డాలర్లు తగ్గి 1,331 డాలర్ల వద్ద ముగిసింది. అయితే వారంలో పసిడి 1,346 డాలర్ల గరిష్ట స్థాయిని తాకి అటు తర్వాత 1,326 డాలర్లకు కూడా పడింది. ఇకపై పసిడి దారి ఎటువైపు అన్న ప్రశ్నకు పలువురు విశ్లేషకుల నుంచి ‘బులిష్’ అనే మాటే వినిపిస్తోంది. డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణిని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. డాలర్... మూడేళ్ల కనిష్టం గత వారం ఒక దశలో 89.96 స్థాయిని (మూడేళ్ల కనిష్ట స్థాయి) కూడా చూసిన డాలర్ ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 90.49 వద్దకు చేరింది. 52 వారాల గరిష్టం చూస్తే... 102 డాలర్లపైన ఉన్న డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులతో ఏడాదిగా క్రమంగా పతనం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధోరణి కొనసాగితే, పసిడి బులిష్ ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల వాదన. అమెరికాలో రాజకీయ, బడ్జెట్ సంబంధ అనిశ్చితి కొనసాగితే, డాలర్ మరింత పతనం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి పసిడి ధర మున్ముందు పైకి కదిలే అవకాశాలే ఉన్నాయని శాక్కో బ్యాంక్లో కమోడిటీ వ్యూహ విభాగం చీఫ్గా వ్యవహరిస్తున్న ఓలీ హ్యాన్సన్ పేర్కొన్నారు. అయితే సోమవారం నుంచి ప్రారంభమయ్యే మార్కెట్లో కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ధరలు ఇలా... ఇక దేశీయంగా ఎంసీఎక్స్లో పసిడి ఫ్యూచర్స్ ధర శుక్రవారంతో ముగిసిన వారంలో 10 గ్రాములకు స్వల్ప నష్టంతో రూ. 29,773 వద్ద ముగిసింది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు వరుసగా రూ.30,175, రూ.30,025 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. 38,885కు చేరింది. కాగా వారంలో రూపాయి విలువ 64.84 వద్ద ముగిసింది. -
పసిడి రన్... నాల్గవవారం!
డాలర్ ఇండెక్స్ పతనం... అమెరికా– ఉత్తరకొరియా పరస్పర ‘అణు బటన్’ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి వరుసగా నాల్గవ వారమూ దూసుకుపోయింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర వారంలో 15 డాలర్లు బలపడి 1,320 డాలర్లకు చేరింది. నాలుగు వారాల్లో కనిష్ట స్థాయి నుంచి దాదాపు 80 డాలర్లు పైకి ఎగసింది. దీనికి తక్షణ మద్దతు 1,305 డాలర్లయితే, దాన్ని కోల్పోతే 1,270, 1,240 డాలర్లు. అంతకు మించి తగ్గకపోవచ్చన్నది నిపుణుల మాట. ఇక పెరిగితే 1350 డాలర్ల వద్ద తక్షణ నిరోధం ఉందని, అదీ దాటితే 1375 డాలర్ల వద్ద నిరోధం ఎదురు కావచ్చనేది వారి విశ్లేషణ. ఇక డాలర్ ఇండెక్స్ వారంలో మరో 0.25 సెంట్లు పడిపోయి 91.75కు క్షీణించింది. గడచిన నాలుగువారాల్లో పతనం 2.25 డాలర్లు. దేశీయంగా స్వల్ప పెరుగుదల అంతర్జాతీయంగా పసిడి 15 డాలర్లు పెరిగినప్పటికీ, దేశీయంగా రూపాయి బాగా బలపడి డాలర్తో మారిస్తే రూ.63.27కు చేరటంతో ఆ ప్రభావం ఇక్కడి ఫ్యూచర్స్ మార్కెట్లో కనపడలేదు. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్లో వారంలో కేవలం రూ.51 పెరిగి రూ.29,216 కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.185 పెరిగి రూ.29,575 వద్ద ముగియగా, వెండి ధర కేజీకి రూ.300 లాభపడి రూ.38,725 వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా సానుకూల ఆర్థిక పరిణామాలు, మెరుగుపడుతున్న వృద్ధి తదితర అంశాలు కొత్త సంవత్సరంలో పసిడికి తోడ్పాటునిచ్చే అవకాశాలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. -
బంగారం కొనొచ్చా?
అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పటిష్ట స్థాయికి చేరాయి. బంగారంలో ర్యాలీ మొదలైందా...? మున్ముందు మరింత పెరుగుదల ఉంటుందా? ఈ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చా...? ఇలాంటి సందేహాలు ఎన్నో సామాన్య ఇన్వెస్టర్లలో ఉండటం సహజం. ఈ నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నదీ చూద్దాం.. అమెరికా– ఉత్తర కొరియా ఉద్రిక్త పరిస్థితులతోపాటు, అమెరికా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో డాలర్ బలహీనత అంచనాలు ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2017లో దాదాపు 150 డాలర్లు ఎగసింది. ఒకదశలో 200 డాలర్ల పెరుగుదలనూ నమోదుచేసుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలూ, అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత వంటి అంశాలు ఈ ఏడాది పసిడిని ఏడాది గరిష్టస్థాయి 1,365 డాలర్లకు తీసుకువెళ్లాయి. అయితే 2 వారాల క్రితం 1,235 డాలర్లకు పడినప్పటికీ, మళ్లీ 1,300 డాలర్ల పైకి ఎగసింది. ఈ ర్యాలీ కొనసాగుతుందా? అన్న సందేహం రావడం సహజం. విశ్లేషకులు మాత్రం పెద్దగా ర్యాలీ ఉండకపోవచ్చంటున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు.. డాలర్ ప్రభావం ఉత్తరకొరియా అణు క్షిపణి ప్రయోగాలతో భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఉత్తరకొరియా తీరుపై మండిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి. ఇక డాలర్ బలహీన ధోరణి కొనసాగుతోంది. ఈ రెండు అంశాలూ ఇలానే కొనసాగితే మాత్రం అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్కు మళ్లీ 1360 డాలర్ల మార్కు వరకు వెళ్లే అవకాశాలున్నాయని ఏంజెల్ కమోడిటీస్కు చెందిన ముఖ్య విశ్లేషకుడు ప్రథమేష్ మాల్యా అభిప్రాయపడ్డారు. డాలర్ బలహీనపడితే మాత్రం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ, (ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు 1.25–1.50 శాతం శ్రేణి) ట్రంప్ విధానాలపై ఆందోళనలు డాలర్ను బలహీనపరిచే అంశాలు. ఇవి బంగారానికి బలాన్నిస్తాయన్నది మరో విశ్లేషణ. రానున్న నెలల్లో బంగారం ధరలు పైదిశగా ఒక శ్రేణిలో చలిస్తాయని భావిస్తున్నట్టు జియోఫిన్ కామ్ట్రేడ్ రీసెర్చ్ హెడ్ హరీష్ చెప్పారు. అంతర్జాతీయంగా బంగారం ట్రేడింగ్ డాలర్లలో జరుగుతుంటుంది. ప్రధాన కరెన్సీలతో డాలర్ కొంత బలహీనం అయిందని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితేనే ఇది తిరిగి బలోపేతం కాగలదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ, ట్రంప్ వివాదాస్పద ఆర్థిక విధానాలు డాలర్ను బలహీనపరిచే అవకాశం ఉంది. బంగారం డిమాండ్ తక్కువే!! బంగారం ధరలు ర్యాలీ చేయాలంటే దీనికి డిమాండ్ పెరగాలి. కానీ, ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గణాంకాలను పరిశీలిస్తే బంగారానికి డిమాండ్ 2017 తొలి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గి ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి 2,003.8 టన్నులకు చేరింది. దేశీయంగా జీఎస్టీ తర్వాత బంగారానికి డిమాండ్ తగ్గిపోయినట్టు మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీస్కు చెందిన సహాయ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని తెలిపారు. జీఎస్టీ అన్నది భారీ పారదర్శకతను తీసుకొచ్చే సంస్కరణ అని, బంగారు ఆభరణాల వ్యాపారం ఎక్కువ శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉన్నందున పరిస్థితులు సర్దుకోవడానికి 12–18 నెలలు పడుతుందని ప్రపంచ స్వర్ణ మండలి భారత విభాగం ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ బంగారానికి డిమాండ్ తక్కువగానే ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు చాలా రాష్ట్రాల్లో పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోతుందని, ఆ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్పై ఉంటుందని నివేష్ కమోడిటీస్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. కొనుగోలుకు ఇది సరైన సమయమా? బంగారం ఈ స్థాయి నుంచి గణనీయంగా పెరిగే అవకాశాలు లేవని ఎక్కువ మంది అనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కరెక్షన్ వరకు ఆగి తగ్గిన తర్వాత పరిశీలించొచ్చన్నది వారి సూచన. అయితే, అసాధారణ పరిణామాల నుంచి తమ పెట్టుబడుల విలువను రక్షించుకునే చర్యల్లో భాగంగా పోర్ట్ఫోలియోలో బంగారాన్ని కొనసాగించే వారు కొందరుంటారు. వారు కొనుగోళ్లకు వెళ్లొచ్చని అవుట్లుక్ ఆసియా క్యాపిటల్ సీఈవో మనోజ్ నాగ్పాల్ సూచించారు. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట విలువల్లో ఉండటం, భౌగోళిక ఉద్రిక్తతల పరిస్థితులను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. దిగుమతి సుంకంతో ధరలది ఎగువబాటే? గత తొమ్మిది నెలల కాలంలో డాలర్తో రూపాయి మారకం విలువ 69 నుంచి 64కు దిగొచ్చింది. నిపుణులు మాత్రం ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని భావించడం లేదు. నిధుల ప్రవాహం వల్ల స్వల్ప కాలంలో బంగారం ధర కొంత మేర పెరగొచ్చని, రూపాయి వచ్చే ఏడాది పాటు 64–65 స్థాయిలోనే కొనసాగొచ్చని వారు అంచనా వేస్తున్నారు. మన దగ్గర బంగారం ధరలు అధికంగా ఉండటానికి కారణం ప్రభుత్వం దిగుమతులపై 10 శాతం పన్ను వేయడమే. దిగుమతులు తగ్గించటానికి ఈ పన్నులు విధించిన ప్రభుత్వం... భౌతిక బంగారంలో పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా గోల్డ్ బాండ్లను ప్రమోట్ చేస్తోంది. కనుక దిగుమతి సుంకం తగ్గించే అవకాశాల్లేవని మనోజ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. బంగారంపై పెట్టుబడి ఏ రూపంలో? ఆభరణాల రూపంలో కొంటే ఎన్నో రకాల అదనపు చార్జీలు పడతాయి. భౌతిక రూపంలోనే బంగారాన్ని కొనాలనుకుంటే ఆభరణాలకు బదులు కడ్డీలు, కాయిన్ల రూపంలో కొనుగోలు చేయటం నయం. తరుగు, అదనపు చార్జీల రూపేణా నష్టం ఉండదు. పసిడి ఏ రూపంలో కొన్నా జీఎస్టీ భారం ఉండనే ఉంది. బంగారం బార్లను కొన్నప్పుడు 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అసాధారణ ఆర్థిక పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న బంగారం కంటే భౌతిక రూపంలో ఉన్న బంగారానికే డిమాండ్ ఉంటుందని మరో విశ్లేషణ. ఆర్బీఐ జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లు మరో ఆప్షన్. పెట్టుబడి కోణంలో ఇది ఉత్తమ సాధనం. ఎందుకంటే వార్షికంగా వడ్డీ పొందడానికి అవకాశం ఉంది. ఐదేళ్లకు పైన పెట్టుబడులు కొనసాగించే వారికి ఇవి అనువైనవి. బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మూడో ఆప్షన్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే నగదు పొందాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్లు అనువుగా ఉంటాయి. ఎందుకంటే వీటికి లిక్విడిటీ ఎక్కువ. అయితే ఈటీఎఫ్ పెట్టుబడుల విలువపై ఫండ్ హౌస్ వార్షికంగా ఒక శాతం వ్యయాల పేరుతో మినహాయించుకోవడం ప్రతికూలం. దూసుకుపోయిన పసిడి.... ♦ వారంలో 26 డాలర్ల పెరుగుదల ♦ అప్ట్రెండ్ వరుసగా ఇది మూడవవారం ♦ డాలర్ ఇండెక్స్ పతనం నేపథ్యం... అంతర్జాతీయంగా పసిడి వరుసగా మూడవ వారమూ పరుగుపెట్టింది. వారంలో 26 డాలర్లు ఎగసి ఏకంగా కీలక నిరోధస్థాయి 1,300 డాలర్లను దాటి 1,305 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్ నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర మూడు వారాల్లో దాదాపు 50 డాలర్ల పెరిగినట్లయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 200 రోజుల కదలికల సగటు 1,277.70 డాలర్లు. డాలర్ ఇండెక్స్ భారీ పతనం దీనికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. గడచిన వారంలో 0.89 సెంట్లు పతనమై, 91.99 వద్ద ముగిసిన డాలర్ ఇండెక్స్, అంతక్రితం వారంలో 1.08 డాలర్లు పతనమైన సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్టస్థాయి 90.99 వైపు పయనిస్తే, అది పసిడి అప్ట్రెండ్కు మరింత ఊతం ఇస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. దేశీయంగా పరుగు... అంతర్జాతీయంగా పసిడి పెరుగుదల, దేశీయంగా రూపాయి పటిష్టత వల్ల (అంతర్జాతీయ మార్కెట్లో వారంలో 25 పైసలు బలపడి 63.87) దేశంలోనూ బంగారం మెరిసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్లో వారంలో ధర రూ.500 పెరిగి పెరిగి రూ.29,165 కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారంవారీగా 99.9 స్వచ్ఛత ధర రూ.545 పెరిగి రూ. 29,390 వద్ద ముగిసింది. వెండి ధర కేజీకి రూ.1,245 లాభపడి రూ. 38,425 వద్ద ముగిసింది. 2017లో దేశీయంగా బంగారం రూ.28,050 నుంచి రూ.29,390కి చేరింది. ఒకదశలో గరిష్టస్థాయి రూ.31,300 స్థాయినీ దాటింది. -
రెండవ వారమూ పసిడి పరుగే!!
1,250 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందన్న అంచనాలకు అనుగుణంగా 22వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి పరుగుపెట్టింది. అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గడిన వారంలో 21 డాలర్లు లాభపడి 1,279 వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఇక్కడ పసిడి దాదాపు 30 డాలర్లు లాభపడింది. 200 రోజుల కదలికల సగటు సైతం 1,277.70 డాలర్లు కావడం, ఈ కీలక స్థాయిపైనే పసిడి ముగియడం, వారంలో డాలర్ ఇండెక్స్ 1.08 డాలర్ల మేర పతనమై 92.88కి పడిపోవడం వంటి అంశాలు సమీపకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్న అంచనాలకు ఊతం ఇస్తున్నాయి. అయితే 1,310 డాలర్ల స్థాయికి దాటగలిగి, స్థిరత్వం పొందితే తిరిగి ఈ మెటల్ విలువ 1,360 డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికా పన్ను వ్యవస్థలో మార్పులకు సంబంధించి అస్పష్టత, క్రిస్మస్, నూతన సంవత్సర ఉత్సవాలు, ఈక్విటీల్లో లాభాల స్వీకరణకు అవకాశాలు వంటి అంశాలు సమీప వారాల్లో పసిడిని పటిష్టస్థాయిలో ఉంచుతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్టస్థాయి 90.99 వైపు పయనిస్తే, అది పసిడి అప్ట్రెండ్కు మరింత ఊతం ఇస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. మూడు వారాల వరుస పతనం అనంతరం పసిడి తిరిగి గడచిన రెండు వారాల్లో పురోగమన దిశలోకి మారింది. అప్పట్లో ఒక దశలో 1,239 డాలర్లకు పడిపోయిన పసిడి మళ్లీ వారం చివరకల్లా 9 డాలర్ల లాభాల బాటకు చేరి, 1,258 డాలర్ల (డిసెంబర్ 15తో ముగిసిన వారం) పురోగతితో ముగిసింది. దాదాపు 20,000 డాలర్ల స్థాయికి చేరిన బిట్ కాయిన్ గడచిన వారంలో భారీ పతనాన్ని నమోదుచేసుకున్న సంగతి ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం. ఉత్తరకొరియాతో ‘అణు’ ఉద్రిక్తతల పరిస్థితులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో పసిడి ఇప్పటికిప్పుడు బేరిష్ «ధోరణిలోకి జారకపోవచ్చన్నది పలువురి విశ్లేషణ. దేశీయంగా స్పీడుకు రూపాయి అడ్డు! అంతర్జాతీయంగా పసిడి లాభపడినా.. దేశీయంగా రూపాయి పటిష్టత వల్ల (అంతర్జాతీయ మార్కెట్లో 64.12) ఆ ప్రభావం దేశంలో పెద్దగా కనపడలేదు. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్లో వారంలో ధర రూ.211 మాత్రమే పెరిగి రూ.28,665కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారంవారీగా 99.9 స్వచ్ఛత ధర రూ.145 పెరిగి రూ. 28,845 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో లాభపడి రూ.28,695కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.385 లాభపడి రూ. 37,180 వద్ద ముగిసింది. -
పసిడికి మళ్లీ బలం
ముంబై /న్యూయార్క్: డాలర్ బలహీనత, అణ్వాయుధాలపై చర్చలకు ఉత్తరకొరియా ససేమిరా అనటం వంటి అంశాలు 17వ తేదీతో ముగిసిన వారంలో పసిడికి బలాన్నిచ్చాయి. అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్లో ఔన్స్ (31.1గ్రా) ధర 20 డాలర్లు పెరిగి 1,294 డాలర్లకు ఎగసింది. పసిడి పురోగతి బాట ఇది వరుసగా రెండవవారం. ఈ రెండు వారాల్లో డాలర్ ఇండెక్స్ సైతం దాదాపు డాలర్ పడిపోయి 93.61కి చేరింది. అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఉత్తరకొరియా సహా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం పసిడిది బులిష్ ధోరణే అన్న అంచనాలకు బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పన్నులకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు పసిడి కదలికలను నిర్దేశించే అంశాల్లో ముఖ్యమైనవి. 1,310 డాలర్లు, 1,325 డాలర్లు పసిడికి కీలకమనీ, ఈ నిరోధాన్ని దాటితే తిరిగి యల్లో మెటల్ పూర్తి బులిష్ జోన్లోకి వచ్చినట్లేనని వారు పేర్కొంటున్నారు. ఇక దిగువస్థాయిలో 1,250 డాలర్లు పసిడి బలమైన మద్దతని కూడా వారి అభిప్రాయం. వచ్చే కొద్ది గంటల్లో శాన్ఫ్రాన్సిస్కోలో జరగనున్న గోల్డ్ అండ్ సిల్వర్ సదస్సు ఈ మెటల్కు సంబంధించిన కీలక అంశాల్లో ఒకటి. దేశీయంగా రూపాయి అడ్డు... అంతర్జాతీయంగా పసిడి ధర పెరిగినప్పటికీ, దేశంలో ఆ ప్రభావం పెద్దగా లేదు. డాలర్ మారకం విలువలో రూపాయి బలోపేతం కావటం దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే వారంలో 20 పైసలు బలపడి రూపాయి 65.01 వద్ద ముగిసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లో వారం మొత్తంమీద పసిడి ధర కేవలం రూ.100 పెరిగి రూ.29,690 వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా ధర స్వల్పంగా రూ.60 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.60 తగ్గి రూ. 29,610 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.29,460కి పడింది. ఇక వెండి ధర కేజీకి స్వల్పంగా రూ. 45 ఎగసి రూ. 39,590 వద్ద ముగిసింది. -
స్వల్పంగా తగ్గినా... కీలక మద్దతుపైనే!
ముంబై/న్యూఢిల్లీ: న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజిలో పసిడి వరుసగా మూడవ వారమూ తగ్గింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా) ధర 3వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో స్వల్పంగా ఐదు డాలర్లు తగ్గి 1,271 డాలర్లకు చేరింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం– 1,250 డాలర్ల దిగువకు పడితేనే, ఈ మెటల్ బేరిష్ ధోరణిని ప్రతిబింబిస్తుంది. అమెరికా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితేనే ప్రస్తుత దశలో పసిడిలో పెట్టుబడులకు ఊతం లభిస్తుందనేది కమోడిటీ విశ్లేషకుల అంచనా. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ సానుకూల అంచనాలతో ఒకవేళ డాలర్ బలపడితే మాత్రం పసిడిపై అది ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని కూడా వారు చెబుతున్నారు. గడచిన వారంలో పసిడి స్వల్పంగా బలహీనపడగా, మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.11 సెంట్ల లాభంతో 94.83కు ఎగసింది. రెండు నెలల్లో పసిడి దాదాపు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ కనిష్ట స్థాయి నుంచి ఐదు డాలర్లు పైకి లేచింది. భిన్న వాదనలు... బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల తీవ్రత కొంత ఉపశమించడం– పసిడి ప్రస్తుతం నెమ్మదించడానికి కారణమని చెప్పారు. అయితే ధర భారీగా పడిపోతే కొనుగోలుకు అది ఒక అవకాశమని కూడా ఆయన సూచించారు. ఆర్జేఓ ఫ్యూచర్స్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు ఫిలిప్ మాట్లాడుతూ, ‘పెట్టుబడులు ప్రస్తుతం పసిడిలో ఎందుకు పెట్టాలి? ఈక్విటీల్లో అవకాశాలు బాగున్నాయి కదా? యాపిల్ వంటి షేర్లపై ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.’’ అని వివరించారు. పారిశ్రామిక వృద్ధి మెరుగుపడుతున్నందున పసిడికన్నా సిల్వర్, ప్లాటినం, పల్లాడియం వంటి మెటల్స్ వైపు చూడటం మంచిదని కూడా ఆయన సూచించారు. ఈక్విటీలు, బిట్కాయిన్లకన్నా, పసిడి ఫండమెంటల్గా బలహీనంగా కనిపిస్తోందని డీటీఎన్ సీనియర్ విశ్లేషకులు డారిన్ న్యూసమ్ అన్నారు. మొత్తమ్మీద అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్ ధోరణి పసిడి భవితను సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది పలువురి విశ్లేషణ. దేశంలోనూ అంతర్జాతీయ ధోరణే... 3వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి తగ్గింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో పసిడి వారం వారీగా రూ.220 తగ్గి రూ. 29,088కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.85 తగ్గి రూ. 29,290కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ.29,140కు చేరింది. ఇక వెండి కేజీ ధర మాత్రం రూ.525 బలపడి రూ.39,385కి చేరింది. కాగా డాలర్ అంతర్జాతీయంగా పరుగెత్తినా, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు, ఈక్విటీ మార్కెట్ల పరుగు నేపథ్యంలో రూపాయి పటిష్ట ధోరణిని ప్రదర్శించడం గమనార్హం. వరుసగా రెండవ వారమూ 14 పైసలు బలపడి (రెండువారాల్లో 50 పైసలు) 64.70 వద్ద ముగిసింది. -
1,250 లోపునకు పడితే ‘బేర్ర్...’
న్యూయార్క్/ముంబై: న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో పసిడి 27వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) వరుసగా రెండవ వారం తగ్గింది. ఆరు డాలర్లు నష్టపోయి 1,276 డాలర్ల వద్దకు చేరింది. శుక్రవారం ఒకదశలో 1,265 స్థాయికి సైతం పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ఆరు కరెన్సీలపై ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ భారీగా బలపడటం దీనికి నేపథ్యం. భారీ తుపానులు సంభవించినప్పటికీ, అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడవ త్రైమాసికంలో 2.5 శాతం అంచనాలకు మించి 3 శాతంగా నమోదవడం డాలర్ ఇండెక్స్కు ఉత్సాహాన్ని అందించింది. శుక్రవారం ఒక దశలో 95.06 స్థాయికి సైతం చేరిన డాలర్ ఇండెక్స్ చివరకు వారం వారీగా 1.05 డాలర్లు బలపడి, 94.72 వద్ద ముగిసింది. నెలా పదిహేను రోజుల్లో పసిడి గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ కనిష్ట స్థాయి నుంచి ఐదు డాలర్లు పైకి లేచింది. ఇంకా ఆశావహ ధోరణి... పసిడి పతనం అంచున ఉన్నప్పటికీ, ఇంకా ఈ మెటల్ బులిష్ ధోరణి పట్ల ఆశావహులు ఉండడం గమనార్హం. 1,260 డాలర్లు గట్టి మద్దతుగా వీరు పేర్కొంటున్నారు. 1,250 డాలర్ల లోపునకు పడిపోతేనే బేరిష్గా భావించాల్సి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ– బుల్ లైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ విశ్లేషించారు. ఆర్థికాభివృద్ధి, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలను బులియన్ ఇప్పటికే ఫ్యాక్టర్ చేసుకున్నట్లు పేర్కొన్న ఆయన, ఈ స్థాయిలో పుత్తడి కన్సాలిడేట్ అయితే, అది బుల్ట్రెండ్ను కొనసాగిస్తుందని చెప్పారు. నాలుగువారాల గరిష్ట స్థాయికి చేరిన డాలర్ ఇండెక్స్కు 96 గట్టి నిరోధమని కూడా ఆయన వాదన. కాగా పసిడికి 1,250 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందని, అంతకులోపు పడిపోతే తాను బేరిష్ ధోరణిగా పరిగణిస్తానని శాక్కో బ్యాంక్ కమోడిటీ వ్యూహకర్త ఓలీ హాన్సేన్ పేర్కొన్నారు. పసిడి 1,200 డాలర్లకు పడిపోతే అది కొనుగోళ్లకు అవకాశమని పేర్కొన్న లండన్ క్యాపిటల్ గ్రూప్ రిసెర్చ్ హెడ్ యాస్పర్ లారెల్, 1,300 డాలర్ల స్థాయిని దాటలేకపోతున్నందున బేరిష్ ధోరణిగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. 1,250 డాలర్ల స్థాయిని పసిడి కోల్పోతే 1,200 డాలర్లకు దిగివస్తుందన్నది కూడా ఆయన విశ్లేషణ. మొత్తంమీద అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్ ధోరణి పసిడి భవితను సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది పలువురి నిపుణుల విశ్లేషణ. దేశీయంగా రూ.300కుపైగా డౌన్.. 27వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి కదిలింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీలో పసిడి వారం వారీగా రూ.236 తగ్గి రూ. 29,318కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.346 తగ్గి రూ. 29,375కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ. 29,225కు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 951 తగ్గి రూ.38,860కి పడింది. కాగా డాలర్పెరిగినా, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు, ఈక్విటీల పరుగు నేపథ్యంలో రూపాయి పటిష్ట ధోరణిని ప్రదర్శించింది. వారం వారీగా 0.37 పైసలు బలపడి, 64.88 వద్ద ముగిసింది. లేదంటే దేశంలో పసిడి ధర మరింత పడేది. -
ఓడలు బళ్లు... బళ్లు ఓడలు!
నాలుగు వారాలుగా నష్టాల్లో పయనిస్తున్న పసిడి మళ్లీ దూకుడు ధోరణి మొదలైనట్లు కనబడుతోంది. ఇదే నాలుగు వారాల్లో ముందుకు ఉరికిన డాలర్ ఇండెక్స్ బలహీనత ఇందుకు ప్రధాన కారణం. శుక్రవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,305 డాలర్ల వద్ద ముగిసింది. సాంకేతికంగా చూస్తే పసిడికి 1,300 డాలర్లు కీలక మద్దతు కావడం గమనార్హం. ఈ స్థాయిని దాటిన తరువాత నాలుగు వారాల క్రితం బంగారం 1,364 డాలర్లను చూసింది. అయితే అటు తర్వాత లాభాల స్వీకరణ, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సానుకూల వార్తలు, ఆయా భయాల నేపథ్యంలో దాదాపు 100 డాలర్లు కిందకు జారింది. దేశీయంగా 400కు పైగా పెరుగుదల అంతర్జాతీయంగా ప్రభావం దేశీ యంగానూ కనిపించింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో పసిడి ధర రూ.278 పెరిగి రూ. 29,851 వద్ద ముగిసింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారంవారీగా రూ. 435 ఎగిసి రూ. 29,945కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పెరిగి రూ. 29,795కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.1,090 పెరిగి రూ.39,940కి ఎగిసింది. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి విలువ వారం వారీగా 0.77 పైసలు బలపడి 65.44 నుంచి 64.77కు చేరింది. గత వారం చివరి నుంచే... నిజానికి అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం నుంచీ పసిడి బలోపేతం కావడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచీ వారం తిరిగేసరికి 42 డాలర్లు పైకి లేచింది. 6వ తేదీన ఒక దశలో డాలర్ ఇండెక్స్ 94.09ని చూసిన పరిస్థితుల్లో పసిడి 1,264 డాలర్లకు పడిపోయింది. సెప్టెం బర్లో పారిశ్రామికేతర ఉపాధి అవకాశాలు అంచనాలను మించి రాలేదన్న 6వ తేదీ వార్త డాలర్ ఇండెక్స్ను 93.62 వద్దకు పడతోయగా, అదే సమయంలో పసిడి తిరిగి 1,279 డాలర్లకు దూసుకుపోయింది. ఆరోజు నుంచీ (6వ తేదీ) డాలర్ ఇండెక్స్ పతనం, పసిడి పరుగు కొనసాగుతోంది. 13వ తేదీ ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ నాలుగు వారాల పరుగుకు ముగింపు పలుకుతూ వారం వారీగా 0.70 పతనమై 92.92 వద్ద ముగిసింది. కారణాలు ఇవీ... అమెరికా సెప్టెంబర్ ద్రవ్యోల్బణం ఉహించినదానికన్నా తక్కువగా ఉండడం, దీనితో వ్యవస్థలో డిమాండ్ ఇంకా తక్కువగానే ఉందన్న సంకేతాలు, ఇలాంటి పరిస్థితి ఉంటే ఫెడ్ ఫండ్ రేటు పెంపు కష్టమన్న అంచనా తాజా వారంలో పసిడి ఊపునకు, డాలర్ బలహీనతకు కారణమయ్యాయి. ద్రవ్యోల్బణం బలహీనత ఇది వరుసగా ఐదవనెల. ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియా, ఇరాన్తో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. -
బంగారమయిన డాలర్..!
అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ తన ఫండ్స్ రేటును పెంచడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో పసిడి పతనం కొనసాగుతోంది. న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర అక్టోబర్ 6వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 7 డాలర్లు నష్టపోయింది. 1,279 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి తగ్గుతూ రావడం వరుసగా ఇది నాల్గవ వారం. ఈ నాలుగు వారాల్లో దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చూసింది. శుక్రవారం ఒక దశలో డాలర్ ఇండెక్స్ 94.09ని చూసిన పరిస్థితుల్లో పసిడి 1,264 డాలర్లకు పడిపోయింది. అయితే సెప్టెంబర్లో పారిశ్రామికేతర ఉపాధి అవకాశాలు అంచనాలను మించి రాలేదన్న వార్త డాలర్ ఇండెక్స్ను 93.62 వద్దకు (వారం వారీగా 0.62 అప్) వద్దకు పడతోయగా, అదే సమయంలో పసిడి తిరిగి 1,279 డాలర్లకు దూసుకుపోయింది. అమెరికా ఆర్థిక పరిస్థితులు డాలర్ను మున్ముందు నిర్దేశిస్తాయని, ఆయా అంశాలే పసిడికి భవిష్యత్తును చూపిస్తాయని నిపుణుల అంచనా. పసిడికి తక్షణ మద్దతు 1,250 డాలర్లను కిందకు పడితే 1,212 డాలర్లను చూస్తుందని టెక్నికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. 1,210 స్థాయిలో పసిడి కొనుగోలు అవకాశమని వారు విశ్లేషిస్తున్నారు. రేట్ల పెంపు అంచనా మొత్తంమీద సమీప కాలంలో ఎల్లో మెటల్కు ప్రతికూలంగా, డాలర్ ఇండెక్స్కు అనుకూలంగా మారే వీలుందని భావిస్తున్నారు. ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్ను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయంగా పసిడి స్పీడ్కు బ్రేకులు పడిన వైనం భారత్లోనూ తన ప్రభావాన్ని కొనసాగించింది. డాలర్ మారకంలో రూపాయి బలహీనత (వారం వారీగా పదిపైసలు తగ్గి రూ. 65.44) ఈ ధోరణి యథాతథానికి కారణమయ్యింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే ్చంజ్లో పసిడి ధర దాదాపు రూ.300 తగ్గి రూ. 29,573 వద్ద ముగిసింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారంవారీగా రూ. 335 తగ్గి రూ. 29,510కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో తగ్గి రూ. 29,360కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.560 తగ్గి రూ.38,850కి పడింది. -
రూపాయికి మరో 35 పైసలు నష్టం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం మరో 35 పైసలు బలహీనపడింది. దేశీయంగా సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంట్రాబ్యాంక్ ఫారెన్ ఎక్సే్చంజ్లో రూపాయి విలువ 65.45 వద్ద ముగిసింది. మార్చి 23 తరువాత రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. సోమవారం రూపాయి 31పైసలు బలహీనపడి 65.10 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, దేశీయంగా కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు రూపాయి బలహీనతకు దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాత్రి 9 గంటల సమయానికి రూపాయి బలహీనంగానే 65.45 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇదే సమయానికి డాలర్ ఇండెక్స్ 93 వద్ద ట్రేడవుతోంది. భారత్ వృద్ధి రేటుకు ఏడీబీ కోత 7.4 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7 శాతానికి తగ్గించింది. జూలైలో ఈ రేటును 7.4 శాతంగా ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, తయారీ రంగం, వాణిజ్య పెట్టుబడుల పేలవ పనితీరు తన తాజా అంచనా కోతకు కారణంగా తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2017లో పేర్కొంది. సేవల రంగమూ ప్రతికూలంగానే ఉన్నట్లు పేర్కొంది. 2016–17 వృద్ధి రేటు (7.1 శాతం) కన్నా తాజా అంచనా తక్కువ కావడం గమనార్హం. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.6 శాతం నుంచి 7.4 శాతానికి ఏడీబీ తగ్గించింది. -
రూపాయికి డాలర్ షాక్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐదు గంటలతో ట్రేడింగ్ ముగిసే దేశీయ ఇంట్రా బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 65.10 వద్ద ముగిసింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఇది 31పైసలు తక్కువ. అంటే శుక్రవారం ఈ ధర 64.79 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, దేశీయంగా కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు రూపాయి బలహీనతకు దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాత్రి 10 గంటల సమయానికి రూపాయి మరింత బలహీనపడి 65.30 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటివరకూ రూపాయి ఇంట్రాడేలో ఇదే కనిష్టస్థాయికాగా, గరిష్టం 64.74. ఇక ఇదే సమయానికి డాలర్ ఇండెక్స్ 92.46 వద్ద ట్రేడవుతోంది. పసిడిపై ‘యుద్ధ భయం’ ఎఫెక్ట్... ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడు సార్లు వడ్డీరేట్ల పెంపు ఖాయమని ఫెడ్ సంకేతాలు ఇచ్చిన పది నిముషాలలోపే (గత బుధవారం) డాలర్ ఇండెక్స్ ఎగసిన స్థాయి ఇది (91.42 నుంచి). దీనితో అప్పట్లో పసిడి కూడా భారీగా 1,300 స్థాయి దిగువకు పడిపోయింది. అయితే ఇప్పుడు డాలర్ మళ్లీ పైకి దూకుతోంది. కారణం... ఉత్తరకొరియా ఉద్రిక్తత పసిడికి కొంత బలంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక యుద్ధంగానే పరిగణిస్తామని, తమ గగనతలంలోకి ప్రవేశిస్తే, అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తామని ఉత్తరకొరియా చేసిన ప్రకటన సోమవారం పసిడి రేటును అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ఔన్స్కు 1,314 డాలర్లకు పెంచేసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 10.15 గంటల సమయంలో 1,313 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం కనిష్ట స్థాయి నుంచి ఇది 15 డాలర్లు అధికం. ఇక అంతర్జాతీయంగా పలు ఈక్విటీ మార్కెట్లు కూడా సోమవారం నష్టాలను చవిచూశాయి. యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు విలువైన మెటల్స్ను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
చెదురుతున్న డాలర్ కల!
హెచ్1బీ వీసాపై ఆంక్షలు పెడుతున్న అమెరికా చదువులకు సై.. కొలువులకు నై అంటూ నిబంధనలు ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులకు శరాఘాతం హెచ్1బీ వీసా పొందేందుకు గతంలో మూడేళ్లలో 3 సార్లు అవకాశం ఇప్పుడు రెండేళ్లలో రెండుసార్లే చాన్స్.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి నిబంధన ఈ అవకాశాన్ని కూడా ఏడాదికే కుదించేస్తూ మరో కొత్త చ ట్టానికి యోచన అమెరికా ఉద్యోగం ఇక గగన కుసుమం కానుందా? మన విద్యార్థుల ‘డాలర్ డ్రీమ్’పై నీలినీడలు కమ్ముకుంటున్నాయా? చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు గేట్లెత్తేస్తున్న అమెరికా.. ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం తలుపులు మూసేస్తోందా? తాజా పరిస్థితులు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నాయి. హెచ్1బీ(వర్క్ పర్మిట్) వీసాలపై అమెరికా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు... ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చనున్నాయి. - సాక్షి ప్రత్యేక ప్రతినిధి మూడొంతుల విద్యార్థులు వెనక్కే! విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో భారీగా ఆదాయం ఆర్జిస్తున్న అమెరికా.. కొలువుల దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తోంది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఈ ఏడాది మన దేశం నుంచి 1.34 లక్షల మంది వెళ్లారు. వీరు ఒక్కో సెమిస్టర్కు సగటున ఆరు వేల డాలర్ల ఫీజు కట్టినా మూడు సెమిస్టర్లకు కలిపి దాదాపు 15.9 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇంతపెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నా అమెరికా ప్రభుత్వం మాత్రం.. వారు అక్కడ ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్1బీ వీసాను కఠినతరం చేసింది. గతంలో లాటరీ ద్వారా ఈ వీసా పొందేందుకు మూడేళ్లలో మూడు అవకాశాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని రెండేళ్లకు కుదించి రెండు అవకాశాలే కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. అంతటితో ఆగకుండా అమెరికా ప్రభుత్వం.. మరో కఠిన బిల్లుకు రూపకల్పన చేసింది. దాన్ని ఒబామా ప్రభుత్వం ఇప్పటికే సెనెట్కు కూడా పంపింది. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే.. విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంవత్సరం లోపే హెచ్1బీ వీసా పొందాలి. లేదంటే హెచ్1బీ వీసా వచ్చేదాకా గరిష్టంగా ఐదేళ్లపాటు ఏదో ఒక కోర్సు చదువుతూ ఉండాలి. నాలుగైదేళ్లు అక్కడే ఉండి చదివే స్తోమత లేనివారికి ఇది శరాఘాతంగా మారనుంది. చట్టం అమలైతే అమెరికాలో చదవడానికి వెళ్లిన వారిలో మూడొంతుల మంది చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకీ నిబంధనలు? మూడేళ్ల క్రితం వరకు అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 80 శాతం మంది నిర్దేశించిన సమయంలోనే హెచ్1బీ వీసా పొందారు. గడచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం, తమ పౌరులకు ఉద్యోగాలు దొరకకపోవడం వంటి కారణాలతో హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయాలని అమెరికా ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా వీసా అవకాశాలను తగ్గించేస్తోంది. దానికి తోడు అమెరికాలోని ఐటీ సహా అన్ని కంపెనీల్లో స్థానికులు కచ్చితంగా 50 శాతం ఉండాలన్న నిబంధన తీసుకురాబోతోంది. అక్కడ మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఎక్కువ మంది ఉంటే వారి విద్యార్హతలను బట్టి లాటరీకి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తోంది. అంటే.. అమెరికన్ వర్సిటీలో చదివిన విద్యార్థులు ఏ ప్లస్, ఏ గ్రేడ్ వస్తేనే హెచ్1బీకి అనుమతిస్తారు. ఈ నిబంధన వల్ల చదువుకుంటూ చిన్నాచితక పనులతో డాలర్లు సంపాదించాలనుకునే వారు ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. మంచి స్కోర్ ఉంటేనే వెళ్లడం మంచిది పిల్లల చదువు ఎలా ఉంది.. డిగ్రీలో వారు ఎంత శాతం మార్కులు సాధించారు.. జీఆర్ఈలో మెరుగైన స్కోర్ సాధించారా లేదా అన్నది పట్టించుకోకుండానే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని అమెరికా పంపుతున్నారు. విద్యార్థులు కూడా తమ సామర్థ్యాలను సరిగా అంచనా వేసుకోకుండానే ‘చలో అమెరికా’ అంటున్నారు. ఇదే అక్కడ వారి ఇబ్బందులకు కారణమవుతుందంటున్నారు కన్సల్టెన్సీ నిపుణులు. ‘‘అమెరికా డాలర్లు సంపాదించాలంటే అక్కడ యావరేజ్, ఫుల్టైమ్ ఉద్యోగం దొరకాలి. అలాగే నిర్దేశిత సమయంలో హెచ్1బీ వీసా రావాలి. ఇది జరగాలంటే ఇక్కడ్నుంచి వెళ్లే విద్యార్థి బీటెక్ లేదా సంబంధిత డిగ్రీలో ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండొద్దు. డిస్టింక్షన్లో పాసవ్వాలి. జీఆర్ఈలో 300, టోఫెల్లో 85 పైన స్కోర్ వచ్చి ఉండాలి’’ అని పాతిక సంవత్సరాలుగా హైదరాబాద్లో కన్సల్టెన్సీ నడుపుతున్న రామ్మోహన్రావు చెప్పారు. ఏ స్కోర్ లేకుండానే అమెరికా వెళ్లి ఏదో ఒక వర్సిటీలో చదువుకుంటున్న వారు కాలక్రమంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. తల్లిదండ్రులపై పెనుభారం.. పొలం లేదా ఆస్తులు కుదువపెట్టి పిల్లలను అమెరికా పంపించిన తల్లిదండ్రులు సకాలంలో రుణం చెల్లించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అమెరికా విద్య కోసం అప్పు చేసిన వారిలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 46.53 శాతం మంది డిఫాల్టర్ల జాబితాలో చేరారు. ఇక్కడ్నుంచి వెళ్లిన విద్యార్థులు అత్యధికులు తాత్కాలిక ఉద్యోగాలకే ప్రాధాన్యమిచ్చి చదువులు పక్కనపడేస్తున్నారు. ఫలితంగా బొటాబొటి మార్కులతో పాసవుతున్నారు. ఇలాంటివారి దరఖాస్తులను కంపెనీలు ఇంటర్వ్యూ కంటే ముందే తిరస్కరిస్తాయి. దీంతో అలాంటి వారు తాత్కాలిక ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా అకడమిక్గా మంచి ప్రతిభ కనబరిచిన వారికి, ఓ మోస్తరు పేరున్న విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి ఏ గ్రేడ్ సాధించిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిభతో పనిలేకున్నా.. అమెరికాలో సీటు ఇప్పిస్తామంటూ వేలంవెర్రిగా కన్సల్టెన్సీలు వెలిశాయి. జీఆర్ఈ స్కోర్ లేకపోయినా సీటిప్పిస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయంటే అమెరికాలో ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదువుకోవడానికి కనీస అర్హత జీఆర్ఈ. ఈ పరీక్ష 340 మార్కులకు ఉంటుంది. ఇందులో 320 దాటితేనే అమెరికాలోని టాప్ 25 వర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. జీఆర్ఈ స్కోర్ 300పైన, టోఫెల్ స్కోర్ 85, ఐఈఎల్టీఎస్ స్కోర్ 7.5 ఉంటే తప్ప టాప్ 100 వర్సిటీల్లో సీటు దొరకదు. కానీ భారతీయ విద్యార్థుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఒక్లహోమా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాల్లో వర్సిటీలు ఒక్కొక్కటీ ఎనిమిది నుంచి 10 బ్రాంచీలు ఏర్పాటు చేసి ఎంఎస్ డిగ్రీ ఆఫర్ చేస్తుండడం గమనార్హం. జీఆర్ఈలో 265, టోఫెల్లో 55, ఐఈఎల్టీఎస్లో 5.5 వస్తే చాలు సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. -
డాలర్లు కుమ్మరిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
ముంబయి : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రూపాయి దాదాపు 60కి చేరుకుంది. రూపాయి బలపడటంతో బంగారం, పెట్రోల్ ధరలు దిగివస్తున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే అంచనా వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోకి డాలర్లను కుమ్మరిస్తున్నారు. ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లకు మార్కెట్లపై నమ్మకం పోయింది. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాల వల్ల జీడీపీ వృద్ధిరేటు 5 శాతం లోపునకు రావడం, ధరల పెరుగుదల 10 శాతానికి చేరువలో ఉండటంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పడిపోయింది. వస్తువులకు, సర్వీసులకు డిమాండ్ తగ్గడంతో కంపెనీల ఆదాయాలు, లాభాలు పడిపోయాయి. మరో పక్క రుణ వాయిదాలు, వాటి మీద వడ్డీలు చెల్లించడం కంపెనీలకు తలకు మించిన భారమైంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. కొత్త ఉద్యోగాలు రాడడం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు యూపీఏ ప్రభుత్వం మీద ముఖ్యంగా కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్రహం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి దేశంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆయన నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సాధారణ మెజార్టీకి చేరువ అవుతుందని అంచనాలు వస్తున్నాయి. చాలా కాలంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెరగకపోవడం, ఇప్పుడు ఎన్డీఏ కూటమి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు దేశంలోకి డాలర్లను పెద్దయెత్తున తీసుకు వస్తున్నారు. ఈ కారణంగా స్టాక్ మార్కెట్లు రోజుకొక కొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకుతూ ముందుకు ఉరుకుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 22 వేల పైన ట్రేడవుతోంది. సుస్థిర ప్రభుత్వం వస్తే డిసెంబరు నాటికి సెన్సెక్స్ సులభంగా 24 వేలను అధిగమిస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు మోడీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే సెన్సెక్స్ 40 వేలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. సుస్థిర ప్రభుత్వం కాకుండా కిచిడీ ప్రభుత్వం ఏర్పడితే సెన్సెక్స్ 10 శాతం నష్టపోయి 20 వేల లోపునకు పడిపోతుందని అనలిస్టుల అంచనా వేస్తున్నారు. -
రూపాయి మరింత పతనం
-
డాలర్తో నిలదొక్కుకోలేకపోతున్న రూపాయి