Geetha Arts
-
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
తెలుగువారి ప్రేమకు కృతజ్ఞతలు– విక్కీ కౌశల్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్గా రూపొందిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నేడు విడుదల చేస్తోంది. ‘‘ఛావా’ తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో 550కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘‘ఛావా’ పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది... అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ బిగ్ స్క్రీన్పై ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ విక్కీ కౌశల్ ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది.తెలుగు ప్రేక్షకుల డిమాండ్సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఛావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఛావావిక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. The epic tale of India’s courageous son, #Chhaava is now all set to roar in Telugu by popular demand⚔️❤️🔥Witness the biggest spectacle #Chhaava in Telugu from March 7th💥👑#ChhaavaTelugu Grand Release by #GeethaArtsDistributions 🔥@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna… pic.twitter.com/awm4MAq4J6— Geetha Arts (@GeethaArts) February 26, 2025 చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్ -
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
‘ఆకాశంలో ఒక తార’అంటూ రాబోతున్న దుల్కర్ సల్మాన్
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు.లైట్ బాక్స్ మీడియా బ్యానర్పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గీతా ఆర్ట్స్ కు చేరుకున్న అల్లు అర్జున్
-
ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. 'మ్యాడ్' సినిమాతో నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఓ మాదిరి యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఇతడి రెండో సినిమా 'ఆయ్'. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్తో తీశారు. ఆగస్టు 15న భారీ చిత్రాలతో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)'ఆయ్' ట్రైలర్ చూస్తే.. విలేజీలో ముగ్గురు కుర్రాళ్లు. అందులో హీరో ఒకడు. ఒకమ్మాయితో ప్రేమ, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేది స్టోరీ లైన్ అనిపిస్తోంది. అయితే ఫుల్ ఆన్ కామెడీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్లోనూ డబుల్ మీనింగ్ లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే సినిమాలోనూ ఇలాంటివి ఉండొచ్చు. ట్రైలర్ అయితే ఫన్నీగా బాగానే ఉంది. కాకపోతే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్' సినిమాలతో పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుందనేద పెద్ద టాస్క్. నిర్మించింది గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ 'ఆయ్'కి హిట్ టాక్ కూడా ముఖ్యమే. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం 'ఆయ్' పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా 'మ్యాడ్'తో హిట్ కొట్టిన తారక్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్లు రిలీజ్) -
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
తండేల్ జర్నీ ప్రారంభం.. సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్తో మరో సినిమా ప్రారంభమైంది. లవ్ స్టోరీ చిత్రం తర్వాత వారిద్దరూ ‘తండేల్’లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్, సాయి పల్లవి, అల్లు అరవింద్తో పాటు మూవీ టీమ్ హాజరైంది. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సాయి పల్లవి నిలిచింది. 'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు భారీగానే కసరత్తు చేశాడు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. ఈ రియల్ కథకు తనదైన స్టైల్లో తెరకెక్కించేందుకు ఆయన రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెడుతున్నారని పూజా కార్యక్రమంలో నాగ చైతన్య తెలిపాడు. 'లవ్స్టోరి' తర్వాత మళ్లీ సాయిపల్లవితో కలిసి ఇందులో నటించడం. తన వల్ల కథకి మరింత బలం చేకూరినట్టైందని ఆయన అన్నాడు. విస్తృత పరిధి ఉన్న కథ కావడంతో కొంత భాగం ఇండియాలో, కొంత భాగం పాకిస్థాన్లో చిత్రీకరణ జరుగుతుందని చైతూ తెలిపాడు. ఈ చిత్రానికి సంగాతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. KING @iamnagarjuna garu graces the #Thandel Muhurtham Ceremony to extend his wishes and blessings to the team ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas… pic.twitter.com/WWnv5evAFH — Geetha Arts (@GeethaArts) December 9, 2023 The ever gracious @Sai_Pallavi92 is here at the #Thandel Muhurtham Ceremony ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/GfMxTT5fvc — Geetha Arts (@GeethaArts) December 9, 2023 -
'లింగి లింగి లింగిడి' పాట.. 30 మిలియన్ వ్యూస్ సెలబ్రేషన్స్
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పాట బాగా పాపులర్ అయింది. 'లింగి లింగి లింగిడి' అంటూ సాగే ఈ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. తాజాగా 30 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీంతో ఈ పాట ఉన్న 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా టీమ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 30 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసిన మూవీ టీమ్.. తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడితో పాటు నటీనటులు రాహుల్ విజయ్, శివాజీ రాజశేఖర్, దర్శకుడు తేజ మర్ని పాల్గొన్నారు. జీఏ 2 సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మలయాళ సూపర్హిట్ 'నాయట్టు' చిత్రానికి రీమేక్. నవంబరు 24న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
'నాయట్టు' రీమేక్.. తెలుగులో ఇన్నాళ్లకు
2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్గా!) ఈ ప్రాజెక్ట్కు 'కోటబొమ్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్కుమార్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. 'నాయట్టు' కథేంటి? రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్బాస్లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) దీనిని నిజం చేస్తూ తాజాగా గీతా ఆర్ట్స్ , హారికా- హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్- త్రివిక్రమ్లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశారు. నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟 More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts pic.twitter.com/xO7P05IBgY — Naga Vamsi (@vamsi84) July 3, 2023 -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నాగచైతన్య. రీసెంట్గా కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అనే ఆసక్తి మెదలైంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు కన్ఫర్మ్ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏ ఏడాదిలోనే GA2 పిక్చర్స్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో గీతా ఆర్ట్స్లో చై నటించిన '100% లవ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సెంటిమెంట్తో నెక్ట్స్ మూవీ కూడా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. -
చరణ్ బర్త్డే: మెగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అల్లు అరవింద్
మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ అందించనున్నారు. చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. 13 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిరిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా గీతా ఆర్ట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్కు చుక్కెదురు! కాగా మెగా తనయుడిగా చిరుత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చరణ్ తన రెండవ సినిమా మగధీరతోనే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను చరణ్ బర్త్డే సందర్భంగా అల్లు అరవింద్ రిరిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇందులో చరణ్ పోషించిన కాలభైరవ పాత్రకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. చదవండి: విశ్వనాథ్గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎 Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a — Geetha Arts (@GeethaArts) February 23, 2023 -
'అబ్బాయి టచ్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది'.. సాంగ్ ప్రోమో రిలీజ్
కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
కిరణ్ అబ్బవరం చేతిలో భారీ ప్రాజెక్ట్స్.. 2023లో ఫుల్ బీజీ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో ‘రాజా వారు రాణి గారు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టి, కిరణ్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. 2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524”ని ప్రయత్నించాడు. ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత సమ్మతమే మే 24, 2022న విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకర్షించింది మరియు మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదలైన నేను మీకు బాగా కావాల్సినవాడిని’డిజాస్టర్గా నిలిచి అతని కెరీర్లో కుదుపును సృష్టించింది. అయితే చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి పెద్ద బ్యానర్స్లో అతని సినిమాలు ఉన్నాయి. 2023లో వరుస ప్రాజెక్ట్స్తో కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆయన నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’చిత్రం విడుదల కానుంది. ఆ తర్వాత మరో రెండు పెద్ద సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మొత్తానికి కిరణ్ అబ్బవరం తన కెరీన్ని బాగా ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. వీటిలో ఏ ఒక్క చిత్రం హిట్ అయినా చాలు..కిరణ్కి మరో ఏడాది పాటు ఢోకా ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా
-
ధనుష్ ‘నేనే వస్తున్నా’నుంచి ‘ఒకే ఒక ఊరిలోనా..’సాంగ్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’సాగే ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ అలపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ‘పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది..పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది’ లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
‘గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. ‘గీతా ఆర్ట్స్ ’మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’.. టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. 1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
బన్నీవాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ ఎదుట సినీ నటి ఆందోళన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె తనకు న్యాయం కావాలంటూ ఇదే కార్యాలయం ముందు నగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రెండు వారాలు గడవకముందే మళ్లీ ఆమె అదే కార్యాలయం ముందు బైఠాయించి గేటుకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయం ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా గేటు ముందే పడుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులను మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఇదే కార్యాలయం ముందు పాతికసార్లు ఆందోళన చేయగా రెండుసార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అయినా ఆమెలో మార్పురాక పోగా తరచూ న్యూసెన్స్కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. -
జీఏ 2 బ్యానర్లో నూతన చిత్రం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభమైంది. వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థగా ఇమేజ్ అందుకున్న జీఏ 2పిక్చర్స్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 7గా ఈ నూతన చిత్రం రాబోతుంది. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకాధరణ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అంజలి, ప్రముఖ నటలు రావు రమేశ్, ప్రియదర్శీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరక్టర్ మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. -
షాకింగ్ : హీరోకు సమానంగా రావు రమేష్ రెమ్యునరేషన్
Rao Ramesh Remuneration: ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రెమ్యునరేషన్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పవచ్చు. స్టార్లకు సమానంగా రావు రమేష్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది. -
బడా బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన కలర్ ఫోటో దర్శకుడు
తన మొదట చిత్రం ‘కలర్ ఫోటో’ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నదర్శకుడు సందీప్ రాజ్. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే వ్యూస్ ను సంపాదించింది. నూతన దర్శకులకు కూడా ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నారు. కథ నచ్చితే వెంటనే వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ రాజ్కు కూడా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది. నూతన దర్శకుడైన ‘కలర్ ఫోటో’ సినిమాను తెరకెక్కించిన తీరు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖలకు నచ్చింది. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇప్పటికే సందీప్ రాజ్కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు. ఈ సంస్థలో హిట్ అందుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సందీప్ కి ఉండదు. ఇప్పటికే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ స్టార్ హీరో ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా ఈ మధ్య టాలీవుడ్లో నూతన దర్శకుల హవా కొనసాగుతోందనే చెప్పాలి. ( చదవండి: ఒక రాత్రి... నాలుగు కథలు! ) -
అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే అభిమానులంత అతడిని ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. ఇక నటన, డ్యాన్స్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఎర్పరుచుకున్న బన్నీ ప్యాన్ ఇండియా నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్తో పాన్ ఇండియా చిత్రం ‘పుష్మ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ను కలిసి కథ విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక మంగళవారం(ఫిబ్రవరి 9) దర్శకుడు ప్రశాంత్ నీల్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో బన్నీని కలిసి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బన్నీకి ప్రశాంత్ కథ వివరించాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రానుందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు బన్నీ అభిమానులను కలిసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల అర్జున్ తన 10వ వివాహ వార్షికోత్సవ వేడుకను భార్య స్నేహ రెడ్డితో కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజ్మహాల్ వద్ద స్నేహరెడ్డితో కలిసి తీసుకున్న ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లీంగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని తెన్కాశీలో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మీక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) చదవండి: బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్ అప్పుడే పదేళ్లు.. తాజ్మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్ -
డ్రైవర్.. నర్స్... ఓ ప్రేమకథ
‘‘చావు కబురు చల్లగా’ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను ఎంచుకున్నందుకు ‘బన్నీ’ వాసుగారికి ధన్యవాదాలు. అల్లు అరవింద్గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ క్లారిటీతో ఈ సినిమా తీశాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది’’ అని కార్తికేయ అన్నారు. ‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కదిలే కళ్లనడిగా..’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘ఇదొక లవ్ స్టోరీ. సీరియస్ పాయింట్ను ఎంటర్టైనింగ్గా చెప్పాం. ఈ సినిమాలో హీరో డెడ్ బాడీస్ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్గా, హీరోయిన్ నర్స్గా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఫ్రెష్ కంటెంట్తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశా. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసినప్పుడు హ్యాపీ. కార్తికేయ, లావణ్య ఈ కథకు పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. సినిమాలో భావోద్వేగాలు బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. గీతా ఆర్ట్స్లో రెండో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.. థ్యాంక్స్ టు వాసుగారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
ఏంటి అన్నయ్య.. ప్రతిసారి కొత్త లుక్
ఇంట్లో ఉండి బోర్ కొట్టిందో, తన ఆఫీసు ఎలా ఉందో అనుకున్నారో ఏమో కానీ, హీరో అల్లు అర్జున్ గురువారం హైదరాబాద్లోని తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఎప్పుడూ ఉండే సందడి, హంగామా ఇప్పుడు కనిపించలేదని నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. "చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి హరీబరీ లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి" అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీ షర్టు ధరించి, డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఆఫీసు ప్రాంగణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) ఈ లుక్లో బన్నీని చూసిన అబిమానులు ఆశ్చర్యపోతున్నారు. "ఏంటి అన్నయ్య.. కనపడిన ప్రతీ సారి ఏదో ఒక కొత్త లుక్లో దర్శనం ఇస్తూ ఉన్నారు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "మేము అదే అనుకుంటున్నాం అన్నా.. తొందరగా షూటింగ్ స్టార్ట్ అవాలి. నిన్ను మళ్లీ స్క్రీన్ మీద చూడాలి" అని మరో అభిమాని రాసుకొచ్చారు. కాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు దాటేసిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. (మరో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్!) Casually dropped in Geetha Arts after a long time . I miss the hustle . Wishing for these tough times to end soon . #besafe pic.twitter.com/fUu20dABr5 — Allu Arjun (@alluarjun) August 20, 2020 -
మగధీర.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్చరణ్తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్చరణ్.. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.(జూన్ 8 వరకు సుశాంత్తోనే ఉన్నా: రియా) Here's the beautiful video tribute to Dr.Srihari garu by @AlwaysRamCharan fans on the 11th anniversary of #Magadheera #11YearsForIHMagadheera#RamCharan #SSRajamouli pic.twitter.com/j9uaFfdt8t — BARaju (@baraju_SuperHit) July 31, 2020 అలాగే రాజమౌళి- డైరెక్షన్, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్- సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్ డిజైన్స్.. ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్కు గురి చేసింది. ఫిల్మ్ మేకింగ్లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్గా నిలిచింది’ అని పేర్కొంది.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా) తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత నటుడు శ్రీహరికి రామ్చరణ్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి తనపై తీసుకున్న కేర్ గురించి రామ్చరణ్ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. Some wonderful memories from #Magadheera.....@AlwaysRamCharan @MsKajalAggarwal @ssrajamouli @GeethaArts pic.twitter.com/DTDa46DoiO — KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) July 31, 2020 -
డిజిటల్ ఎంట్రీ ఇస్తారా?
ప్రస్తుతం డిజిటల్ షోలు, వెబ్ సిరీస్లో కూడా కనిపిస్తున్నారు స్టార్స్. ఆడియన్స్కి వినోదం అందించడానికి మాధ్యమం ఏదైనా సై అంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ వెబ్ మీడియమ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి కూడా వెబ్ మీడియమ్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నారా? అంటే అదే ప్లాన్లో ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఓ వెబ్ సిరీస్ నిర్మించనుందట. ఈ సిరీస్లో చిరంజీవి ముఖ్య పాత్ర పోషించనున్నారట. భారీ బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ వెబ్ సిరీస్కి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆరంభం కావచ్చని సమాచారం. -
‘పలాస’ డైరెక్టర్కు అరవింద్ ఆఫర్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా విడుదల కాకముందే కరుణ కుమార్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ టాలీవుడ్ కొత్త డైరెక్టర్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయనున్నాడు. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ కరుణ కుమార్కు అడ్వాన్స్గా ఓ చెక్ కూడా ఇచ్చాడు. ‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్లు మూవీ ప్రివ్యూ షో చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ను అల్లు అరవింద్ అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా నేచురల్గా ఉందని, ప్రతిభ గల డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయనతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్గా చెక్ను అందించారు. దీంతో కరుణ కుమార్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు ఖరారైంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల కానుంది. రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతమందించాడు. చదవండి: పలాస నాకు చాలా ప్రత్యేకం పలాస చూశాక ధైర్యం వచ్చింది -
‘చావుకబురు చల్లగా’ మొదలైంది
-
'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ
‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవలే చేసే ప్రయోగాలు ప్రేక్షకులను మెపించలేకపోతున్నాయి. ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వెరైటీ టైటిల్, కొత్త గెటప్లో తెరముందుకు రాబోతున్నాడు కార్తికేయ. ఆ వెరైటీ టైటిలే 'చావుకబురు చల్లగా'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. కౌశిక్ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా గురువారం విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
బన్నీ అప్డేట్ వాయిదా.. ఎందుకంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ ఎదురైంది. తివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు లిరికల్ సాంగ్స్కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్కు సంబంధించిన అప్డేట్ను ఆదివారం ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు టీజర్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో టీజర్ అప్డేట్ను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ భాయ్ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, మెగా హీరోలందరితో నూర్ భాయ్కి మంచి అనుబంధం ఉంది. ‘తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైన నూర్ భాయ్ మరణం కలచివేసింది. ఇటువంటి విషాద సమయంలో అల వైకుంఠపురములో టీజర్కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించడం సరైనది కాదని భావిస్తున్నాం. త్వరలోనే టీజర్కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామ’ని గీతా ఆర్ట్స్ పేర్కొంది. కాగా, అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. -
నన్ను నేను వెతుక్కుంటాను!
‘‘ఇండస్ట్రీలో పదహారేళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ ఎక్కువగా తెలుగు సినిమాలు చేశాను. ఇకపై ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా బాలీవుడ్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అల్లు అర్జున్. హీరోగా ‘గంగోత్రి’ నుంచి ‘డీజే’ వరకూ ఎప్పటికప్పుడు నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు మూడు సినిమాలను (త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వాల్లో) లైన్లో పెట్టి మంచి ఫామ్లో ఉన్నారు. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ∙‘మా’ టీవీలో మా నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్), నేను బోర్డ్ మెంబర్స్, షేర్ హోల్డర్స్గా ఉన్నప్పుడు అంటే స్టార్ ‘మా’ టెలివిజన్కు ‘మా’ చానెల్ను విక్రయించక ముందు ఓ సందర్భంలో బిగ్ బాస్ 1, 2కి హోస్ట్గా చేయమని నన్ను అడిగారు. కానీ అది సరైన సమయం కాదనిపించింది. పైగా మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఆ తర్వాత ఎవరినైతే వారు హోస్ట్గా ఎంపిక చేశారో వారు ఆ షోను అద్భుతంగా చేశారు. ∙నేను ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో.. నా వ్యవహారంలో నెపోటిజమ్ (బంధుప్రీతి) లేదని చెప్పుకోలేను. కానీ ఒక్క విషయం.. నెపోటిజమ్ ఉన్నా, లేకున్నా ఇండస్ట్రీలో మనల్ని నిలబెట్టేది మనలో ఉన్న ప్రతిభ మాత్రమే అన్నది నా అభిప్రాయం. ∙నన్ను నేను గూగుల్లో వెతుక్కుంటుంటాను. నా గత సినిమాల్లో నా లుక్స్ ఎలా ఉన్నాయి? చేయబోయే సినిమాల్లో నా గెటప్ ఎలా ఉండాలనే విషయాలను విశ్లేషించుకోవడానికి సోషల్ మీడియాలో ఉన్న నా ఫొటోలను చూస్తుంటాను. ప్రతి సినిమాకు సమ్థింగ్ స్పెషల్ ట్రై చేయాలన్నదే నా అభిమతం. -
మెగా బ్యానర్లో అక్కినేని హీరో
అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్, తన మీద ఉన్న అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. తొలి సినిమాతో ఇప్పటికి మూడు సినిమాలు చేసిన అఖిల్ వరుసగా తడబడుతున్నాడు. మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన ఈ యంగ్ హీరో తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. అయితే అఖిల్ నాలుగో సినిమా మెగా బ్యానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోకు సక్సెస్ ఇచ్చే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా తెలుస్తొంది. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం, బొమ్మరిల్లు భాస్కర్లు అఖిల్ కోసం కథలు రెడీ చేస్తున్నారట. వీరిలో ఎవరి కథకు అఖిల్ ఓకె చెప్తే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. -
త్రివిక్రమ్ అడిగాడు.. బన్నీ చేస్తున్నాడు!
‘నా పేరు సూర్య’ సినిమాతో చేతులు కాల్చుకున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ విడుదలైన చాలారోజులకు ఈ హీరో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ను చేస్తున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్పై గురి పెట్టిన ఈ కాంబినేషన్పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం గురూజీ బన్నీ లుక్పై శ్రద్దపెట్టాడట. ఈ మూవీ కోసం బరువు తగ్గి స్లిమ్గా మారాలని బన్నీకి సూచించాడట.. అందుకు తగ్గట్టు బన్నీ కూడా శ్రమిస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
నిర్మాతగా మారనున్న అల్లు అర్జున్..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుందని ఇటీవల ప్రకటించారు. అయితే ఈ గ్యాప్ లో ఆయన ఇతర రంగాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హీరోగా ఫుల్ ఫాంలో ఉన్న బన్నీ త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుంచి గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే బన్నీ అందుకు భిన్నంగా సినిమాలు కాకుంగా బుల్లితెర మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుల్లితెరపై కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే షోస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే బన్నీ నిర్మాణంలో సీరియల్స్ను నిర్మిస్తారా..? లేక రియాలిటీ షోస్ నిర్మిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డ బన్నీ, త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. -
త్రివిక్రమ్-బన్నీ కాంబోలో మూవీ ఫిక్స్
‘నా పేరు సూర్య’ పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆచితూచి కథలను ఎంపిక చేస్తున్నాడు. అందుకే ఆ మూవీ తరువాతే మరే ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించలేదు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడని, తమిళ హిట్ మూవీ 96రీమేక్లో నటించనున్నాడని, త్రివిక్రమ్ కాంబినేషన్లో తదుపరి ప్రాజెక్ట్ ఉండనుందని వార్తలు వినిపించాయి. అయితే ఫైనల్గా మాటల మాంత్రికుడు చెప్పిన కథకే ఓకే చెప్పాడు. వీరిద్దరు కాంబినేషన్లో తమ చిత్రం ఉండబోతోందని అధికారికంగా ప్రకటించేశారు. వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. మళ్లీ వీరిద్దరు కలిసి హ్యాట్రిక్పై కన్నేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో తెరకెక్కించనున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. -
ముచ్చటగా మూడోసారి
గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేసే చాన్స్ ఒక దర్శకుడికి దక్కడం అంటే చిన్న విషయం కాదు. దర్శక–నిర్మాతల మధ్య వేవ్లెంగ్త్ కుదిరితేనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా దర్శకుడు పరశురామ్కి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్తో మంచి అనుబంధం కుదిరింది. అందుకే ‘శ్రీరస్తు–శుభమస్తు’ తర్వాత మళ్లీ ఇదే సంస్థలో ‘గీత గోవిందం’ సినిమాకు దర్శకత్వం వహించారు పరశురామ్. ‘గీత గోవిందం’తో దర్శకుడిగా 100 కోట్ల క్లబ్లోకి చేరారాయన. నెక్ట్స్ గీతా ఆర్ట్స్లోనే పరశురామ్ ఓ సినిమా చేయనున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఓ లీడింగ్ స్టార్తో ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పరశురామ్ పేర్కొన్నారు. కాగా, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా చేశారు పరశురామ్. దర్శకుడిగా యువత, సోలో వంటి హిట్ చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. -
మకాం మార్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇంత వరుకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందున్న టాక్ వినిపిస్తోంది. తాజాగా బన్నీ కొత్త ఆఫీస్లోకి వెళ్లారట. ఇన్నాళ్లు గీతా ఆర్ట్స్ ఆఫీస్నే తన ఆఫీస్గా వినియోగించుకున్న బన్నీ తాజాగా జూబ్లీ హిల్స్లో కొత్త ఆఫీస్ను ప్రారంభించారు. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్, ఇతర పనులు ఈ ఆఫీస్నుంచే చేయనున్నాడట బన్నీ. బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన పనులు కూడా కొత్త ఆఫీస్ నుంచే జరగనున్నాయి. -
ఫుల్ పాజిటివ్
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ను గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్గారు రిలీజ్ రైట్స్ను ఫ్యాన్సీ రేట్కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ వైబ్ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్. -
మెగా ప్రొడ్యూసర్ చేతికి ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్గా సక్సెస్ సాధించిన సంపత్ నంది చిన్న సినిమాలకు కథను అందిస్తూ, నిర్మిస్తూ సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ అందించిన కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా ‘పేపర్ బాయ్’. ఈ సినిమా ట్రైలర్తో బాగానే పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చిన్న సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించడం మంచి పరిణామం. పైగా చిత్రయూనిట్ కూడా సినిమాకు వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గీత ఆర్ట్స్ చేతిలోకి వెళ్లింది. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చేతిలో సినిమా పడితే.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్క్రీన్ ప్లే 10th July 2018
-
ఐ యామ్ స్టిల్ వర్జిన్: విజయ్ దేవరకొండ
సెన్సేషన్ స్టార్ విజయ్దేవరకొండ చేతి నిండా ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉన్నాడు. కన్నడ క్యూటీ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్లో మనోడు పాల్గొంటున్నాడు. వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్నే వదిలారు. ‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్ స్టేటస్ మాత్రం ఇదే మేడమ్’ అంటూ పోస్టర్ను ఉంచాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో ‘ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్.. అంటూ గోవిందం(విజయ్).. గీత(రష్మిక)ను ఓరగా చూస్తున్నాడు. పరుశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. వీటితోపాటే విజయ్ నటించిన టాక్సీవాలా, నోటా చిత్రాలు శరవేగంగా షూటింగ్ను జరుపుకుని రిలీజ్కు రెడీ అవుతున్నాయి. Meeru em aina anukondi, My official status matram idhe madam.#GeethaGovindam This Independence Day. pic.twitter.com/02ofgVXHC8 — Vijay Deverakonda (@TheDeverakonda) July 3, 2018 -
‘మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్’
‘నా కాళ్లు తిమ్మిరెక్కినా.. నడుము నొప్పి లేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్..’ అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ మాటలు విజయ్ ఎందుకు అన్నాడో..? ఈరోజు విడుదలైన గీత గోవిందం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ గోడకు కాళ్లు పెట్టుకుని కూర్చుంటే, కాళ్ల పై రష్మిక ఎంచక్కా కూర్చొని నవ్వుతూ ఉంది. దీని గురించే విజయ్ మాట్లాడుతూ పై విధంగా కామెంట్ చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో గీత పాత్రలో ఛలో ఫేం రష్మిక మందన నటించగా, గోవిందం పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. సోలో ఫేం పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్లో విజయ్ ‘టాక్సీవాలా’ సినిమాను చేస్తున్నాడు. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే ‘టాక్సీవాలా’గా విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. Naa kaallu thimmiri ekkina, Nadumu noppi lechina, Mee baruvu badhyata eppudu naade madam :) #GeethaGovindam pic.twitter.com/mMnlEB9ver — Vijay Deverakonda (@TheDeverakonda) 23 June 2018 -
శర్వాకు తమ్ముడిగా యంగ్హీరో
బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకు మరో సినిమాను ప్రకంటించారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ఇద్దరు యువహీరోలను తీసుకోవాలనుకున్న శ్రీకాంత్, మెయిన్ హీరోగా శర్వానంద్ను తీసుకోగా, మరో హీరో కోసం శ్రీవిష్ణును ఎంపిక చేశారు. శ్రీవిష్ణు వరుస సక్సెస్లతో దూకుడుమీదున్నారు. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సోలో హీరోగా సక్సెస్ సాధిస్తూనే.. ఉన్నది ఒకటే జిందగీ, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి మల్టీ స్టారర్ సినిమాతోనూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఫుల్ ఫామ్లో ఉన్న ఈ ఇద్దరు యువ హీరోలతో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో వేచి చూడాలి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. -
అల్లు అరవింద్పై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి సంచలన ఆరోపణలు చేశారు. గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచే తనపై వికృత ప్రచారం సాగుతున్నదని, పవన్ అభిమానులకు తన ఫోన్ నంబర్ షేర్ అయింది కూడా అక్కడి నుంచేనని తెలిపారు. శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో వరుస పోస్టులు చేసిన మహేశ్.. మరోమారు పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న కొందరు పీకే ఫ్యాన్స్ ఫొటోలను, దూషణల పర్వం స్క్రీన్షాట్లను సైతం పొందుపర్చారు. గీతా ఆర్ట్స్ ఆఫీసు కేంద్రంగా.. : ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్బుక్ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే క్రియేట్ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్ అభిమానులకు నా ఫోన్ నంబర్ షేర్ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే! నిజానికి అల్లు అరవింద్తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని కత్తి మహేశ్ రాసుకొచ్చారు. వాళ్లను చూస్తే జాలేస్తుంది : సోషల్ మీడియాలో పవన్ అభిమానుల నుంచి దారుణమైన తిట్లు ఎదుర్కొంటున్నానన్న మహేశ్.. వాటి తాలూకా ఒకటి రెండు స్క్రీన్ షాట్లను పొందుపర్చారు. ‘‘ఇంత నీచంగా తిడుతుంటే పీకే ఫ్యాన్స్పై కేసు ఎందుకు పెట్టవు? అని నా స్నేహితులు అడుగుతుంటారు. వాస్తవం ఏంటంటే.. ఆ కామెంట్లు చేసేవాళ్లలో అత్యధికులు మైనర్లే! పిల్లల మీద కేసులు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్లను చూస్తే జాలేస్తుంద’’ని తెలిపారు. పీకే ఎయిడ్స్ కంటే ప్రమాదకారి : ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి మహేశ్ ఘాటువ్యాఖ్యలు చేశారు. ‘‘పీకే ఒక వైరస్. హెచ్ఐవీ కంటే ప్రమాదకారిలా యువతరాలను బలితీసుకుంటున్నాడు. ఆయనను అనుసరిస్తూ హేతుబద్ధమైన ప్రవర్తన, సామాజిక బాధ్యతలను మర్చిపోతున్నారు. ఈ రుగ్మతకు చట్టబద్ధమైన పరిష్కారం కంటే సామాజిక చికిత్స అవసరం’’ అని కత్తి మహేశ్ అన్నారు. కాగా, కత్తి వ్యాఖ్యలపై అల్లు కుటుంబంకానీ, గీతా ఆర్ట్స్ సంస్థగానీ ఇంకా ప్రతిస్పందించలేదు. ఇవి మహేశ్ పోస్ట్ చేసిన సంభాషణలు(అసభ్యకరమైన పదజాలాన్ని బ్లర్ చేశాం) -
మరో కొత్త కాన్సెప్ట్తో విజయ్..!
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ ఈ ఏడాదే మరో సినిమాతో పలకరించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో, గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ పూర్తి విజయ్, తన గత చిత్రాలక పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ లను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా వినూత్నంగా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు. -
సింగిల్ సిట్టింగ్లో ఓకే!
2016లో వరుసగా ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ’ లాంటి హ్యట్రిక్ సూపర్హిట్స్తో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్కి అనుభంద సంస్థ జీఏ 2 బ్యానర్లో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్ని వాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతా ఆర్ట్స్లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయాన్ని సాధించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ట్రెండింగ్ సక్సెస్ సొంతం చేసుకున్న ‘పెళ్ళి చూపులు’తో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ ఇందులో హీరో. నాగచైతన్యతో ‘100% లవ్’, సాయిధరమ్తేజ్తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నానితో ‘భలే భలే మగాడివోయ్’ వంటి విజయాల తర్వాత ఇప్పడు విజయ దేవరకొండతో బన్ని వాసు ఈ చిత్రం నిర్మించనున్నారు. 2016లో సౌత్లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్కి విజయాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ నిర్మాత అల్లు అరవింద్ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా చూసుకుంటారు. అంతే కాదు ఎంతోమంది నిర్మాతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అత్యంత భారీగా ఆయన నిర్మించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’. ఈ చిత్రం సమ్మర్లో విడుదలై, భారీ కలెక్షన్లతో బన్ని కెరీర్లోనే బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్గా నిలిచింది. అలాగే అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇది కూడా అల్లు శిరీష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. 2016 చివరిలో విడుదలైన స్టైలిష్ ఎంటర్టైనర్గా అందిరి హృదయాలు దోచుకుని మెగా పవర్స్టార్ రామ్చరణ్ 2016 బెస్ట్ రెవిన్యూ ఫిల్మ్గా ‘ధృవ’తో తెలుగులో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే తెలుగులో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని కన్నడ భాషలో నిర్మించారు. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పడు పరుశురాం దర్శకత్వంలో విజయ్దేవరకొండ హీరోగా బన్ని వాసు నిర్మాతగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకుడి ఆనందమే ముఖ్యం చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రతి ప్రేక్షకుడు ఆనందం పొందాలనే సంకల్పంతోనే చిత్రాలు రూపొందిస్తున్నాం. 2016లో మాస్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, స్టైలిష్ ఎంటర్టైనర్... ఇలా మూడు వైవిధ్యమైన జానర్లో చిత్రాలు చేశాం. అవి సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా ఆదరణ పొందాయి. ఇక నుండి వచ్చేవి కూడా ఇలానే మంచి చిత్రాలుగా ఆదరణ పొందే విధంగా చేస్తాం. పరుశురాం చెప్పిన కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్లో ఓకే నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ – ‘‘అల్లు అరవింద్గారు నిర్మాతగా 2016లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్హిట్స్ కావడం హ్యపీగా వుంది. పరుశురాంగారు చెప్పిన కథ అరవింద్గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్లోనే నాకు నచ్చింది. పరుశురాంగారి విజన్ సూపర్గా వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్ అయ్యాయి కూడా. ‘భలే భలే మగాడివోయ్’లాంటి సూపర్ డూపర్ హిట్ తరువాత జీఏ2 బ్యానర్లో గ్యాప్ తీసుకున్నాం. చేస్తే ఆ రేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయాలనే సంకల్పంతో గ్యాప్ తీసుకున్నాం. ఇప్పడీ కథ ఆ రేంజిలో వుందనే నమ్మకంతో ఓకే చేశాం. అల్లు అరవింద్ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్ టెక్నిషియన్స్తో భారీ తారాగణంతో సెట్స్ మీదకి వెళ్ళనుంది’’ అన్నారు. డబుల్ లక్! దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ – ‘‘గీతా ఆర్ట్స్లో ఒక్క చిత్రం చేయటం లక్ అంటారు. నేను వరుసగా రెండవ చిత్రం కూడా చేసే డబుల్ లక్ని అరవింద్గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది’’ అన్నారు. -
బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు భాస్కర్. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకొని బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తొలి మ్యాజిక్ ను తరువాత కంటిన్యూ చేయలేకపోయిన భాస్కర్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. బొమ్మరిల్లు తరువాత పరుగు లాంటి సక్సెస్ ఇచ్చినా ఆరెంజ్, ఒంగోళు గిత్త సినిమాలు భాస్కర్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా బెంగళూర్ డేస్ ను తమిళ్ లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి గ్యాప్ తీసుకొని టాలీవుడ్ లో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ తో మంచి రిలేషన్ ఉండటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముందుగా ఈ సినిమాను అల్లు అర్జున్ హీరోగా ప్లాన్ చేసినా.. ఇప్పుడు వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
మా అమ్మ పేరు గీత కాదు నిర్మల
ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్న అల్లు శిరీష్ అభిమానులకు చేరువయ్యేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిరీష్, ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన శిరీష్, ప్రపంచానికి భగవద్గీతను అందించిన కృష్ణ భగవానుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ పేరు వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. కానీ చాలా మంది మా అమ్మ పేరు గీత అనుకుంటారు.. కానీ ఆమె పేరు నిర్మల అని ట్వీట్ చేశాడు. Happy Krishnashtami everyone, happy birthday Lord Krishna. Thank you for sharing the world your wisdom thru the Bhagavad Gita. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 My Dad was so inspired by the holy book that he named our co Geetha Arts. Many ppl think its my mum's name, her name is Nirmala. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 -
శిరీష్ డైరెక్టర్తో శర్వానంద్
గౌరవం, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అల్లు వారబ్బాయి శిరీష్, తొలిసారిగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్కు సక్సెస్ అందించిన దర్శకుడు పరశురాంతో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తమ బ్యానర్కు మంచి హిట్ అందించిన పరశురాంతో మరో సినిమా నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను శర్వానంద్ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే శర్వానంద్కు కథ వినిపించిన పరశురాం.. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు . అయితే శర్వా మాత్రం ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాలు పూర్తయిన తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో శర్వా, పరశురాంల సినిమా క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్
బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్ కెరీర్ తిరగబడింది. ఆ తరువాత ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఒంగోళుగిత్తకు కూడా ఫ్లాప్ టాక్ రావటంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, ఇటీవల బెంగళూర్ డేస్ తమిళ రీమేక్తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. మరోసారి తెలుగులో దర్శకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయాత్నాలు ప్రారంభించిన భాస్కర్కు మెగా ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోస్తో పరుగు, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కించిన భాస్కర్, ఈ సారి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే లైన్ ఓకె చేసిన అరవింద్, పూర్తి కథతో రమ్మన్నాడట. కథ రెడీ అయ్యాక నటీనటుల ఎంపిక జరుగనుంది. అయితే మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తాడా..? లేక.. లో బడ్జెట్లో చిన్న హీరోతో సినిమాను చేస్తారా..? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. -
‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..!
- నిర్మాత అల్లు అరవింద్ ‘‘గీతా ఆర్ట్స్ సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యముంటుంది. సినిమా విడుదలకు ముందే పాటలను శ్రోతల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. అల్లు శిరీష్ హీరోగా నటించారు. లావణ్యా త్రిపాఠి నాయిక. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ‘శ్రీరస్తు శుభమస్తూ...’ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘పాటలు బాగుంటే సినిమాకు బలం పెరుగుతుంది. ‘సరైనోడు’ సినిమా పాటలను బాగా ప్రమోట్ చేశాం. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఆడియోను అలాగే ప్రచారం చేయాలను కుంటున్నాం. సినిమా అందరినీ అలరిస్తుందని చెప్పగలను’’ అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ గొప్పదనం చెప్పేలా సినిమా ఉంటుంది. పాత్రల మధ్య కుటుంబంలోని భావోద్వేగాలు ఉంటాయి. టైటిల్ ఉన్నంత బ్లెస్సింగ్గా సినిమా వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ- ‘‘ కొత్త జంట తర్వాత సినిమా ఇచ్చిన నాన్నగారికి థ్యాంక్స్. మంచి కథ, వినోదం ఉన్న సినిమా ఇది. లావ ణ్య సహజంగా నటించింది. తమన్ మ్యూజిక్ హిట్టవుతుంది’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ- ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. దర్శకుడు సినిమాను చాలా సహజంగా, కొత్తగా చిత్రీకరించారు’’ అన్నారు. -
త్వరలోనే 'శ్రీరస్తు శుభమస్తు'
గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్ , ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత వరకు వచ్చింది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో కూడా ఇన్నాళ్లు క్లారిటీ ఇవ్వలేదు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు. మార్చిలో సినిమాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత సైలెంట్ షూటింగ్ కార్యక్రమాలు కానిచ్చేశారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా ప్రకటించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు?
గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్, ఆ తరువాత సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అన్న విషయాలపై కూడా క్లారిటీ లేదు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మార్చ్లోనే రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టేశారు. ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి వార్త బయటికి రాలేదు. అసలు షూటింగ్ పూర్తయ్యిందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అన్న విషయాలపై గీతా ఆర్ట్స్ కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో రాకపోవటంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇలా రీషూట్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ అవుతుందో చూడాలి. -
రెడీ... స్టార్ట్...యాక్షన్!
ఇక నాలుగు రోజులు మాత్రమే రామ్చరణ్ ఖాళీగా ఉంటారు. ఆ తర్వాత ఫుల్ బిజీ. సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం తాజా షెడ్యూల్ ఈ 22న హైదరాబాద్లో మొదలు కానుంది. తమిళ చిత్రం ‘తని ఒరువన్’కి రీమేక్గా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్చరణ్ కొత్త లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో అరవింద్ స్వామి కనిపించే కొన్ని దృశ్యాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రవిశేషాలను అల్లు అరవింద్ చెబుతూ- ‘‘క్యారెక్టర్ పరంగా స్టన్నింగ్ లుక్తో రామ్చరణ్ అభిమానులను అలరించనున్నాడు. సురేందర్రెడ్డి స్టైలిష్ మేకింగ్ని మరోసారి చూస్తారు. అరవింద్స్వామి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రకుల్ ప్రీత్సింగ్ నటన, అందచందాలు అదనపు ఆకర్షణ. రామ్చరణ్, రకుల్ ఆల్రెడీ మంచి పెయిర్ అనిపించుకున్నారు. ఈ చిత్రంతో మరోసారి ఆకట్టుకుంటారు. చరణ్, సురేందర్రెడ్డి, నా కాంబినే షన్లో వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్ షెడ్యూల్లో యాక్షన్, టాకీ తీస్తాం. జూన్ 20 నుంచి కాశ్మీర్లోని అందమైన లొకేషన్లలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అని తెలిపారు. నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: ‘హిప్ హాప్’ ఆది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వీవై ప్రవీణ్ కుమార్, సహ నిర్మాత: ఎన్వి ప్రసాద్. -
బన్నీ పుట్టినరోజు వేడుకలు
-
స్క్రిప్టుకు దర్శకుడు బోయపాటి పూజలు
సఖినేటిపల్లి : అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన కొత్త చిత్రం స్క్రిప్టుకు పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాల చెంత స్క్రిప్టు ఉంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు, వేదపండితులు బోయపాటికి ఆశీర్వచనం చేశారు. తొలుత ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బోయపాటి వెంట ప్రముఖ వ్యాపారవేత్త లింగోలు సత్య నారాయణ తదితరులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై.. తాజాగా పూజలు నిర్వహించిన ఈ స్క్రిప్టుతో తీసే చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తారని, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీనిని నిర్మిస్తారని బోయపాటి విలేకరులకు తెలిపారు. అర్జున్ స్టైల్కి తగ్గట్టుగా, అభిమానులు అర్జున్ను ఎలా చూడాలనుకుంటారో, అలాంటి ఎనర్జీ ఉన్న కథతో ఈ స్క్రిప్టు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇది ఎనర్జిటిక్ ప్రేమకథాచిత్రమని, ఇందులో సరికొత్తగా కనిపిస్తారని పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. అయితే స్వరాలను తమన్ సమకూరుస్తారని, సంభాషణలను ఎం.రత్నం అందిస్తారని తెలిపారు. మార్చి నెలాఖరు నుంచి చిత్రం షూటింగ్ జరుగుతుందన్నారు. కాగా బోయపాటితో పలువురు స్థానికులు, భక్తులు ఫొటోలు దిగారు. -
నాకు జరిగినట్లే తేజ్కీ జరగడం యాదృచ్ఛికం : చిరంజీవి
‘‘తేజ్ మా ఇంట్లోనే ఉండేవాడు. క్రమశిక్షణ గల కుర్రాడు. మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కష్టపడుతూ, తమను తాము నిరూపించుకుంటూ నిలదొక్కుకుంటున్నారు. తేజ్ కూడా ఆ జాబితాలో చేరతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలపై బన్నీ వాసు, హర్షిత్ నిర్మించిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి సీడీని ఆవిష్కరించి హీరోలు రామ్చరణ్, అల్లు అర్జున్కి ఇచ్చారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘తేజ్ నా లాగానే ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. నా తొలి చిత్రం ‘పునాదిరాళ్ళు’ అయినా, ముందుగా రిలీజైంది మాత్రం రెండో చిత్రమైన ‘ప్రాణం ఖరీదు’. అచ్చంగా అప్పుడు నాకు జరిగినట్లే ఇప్పుడు తేజ్కి కూడా జరుగుతుండడం యాదృచ్ఛికం. రామ్చరణ్ రెండో చిత్రం ‘మగధీర’ను నిర్మించిన గీతా ఆర్ట్స్ తేజ్ రెండో చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం విజయం సాధించి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుం టున్నా’’ అని చెప్పారు. ‘‘సాయిధరమ్ తేజ్ను పరిచయం చేయడం వెనుక మొత్తం మా మెగా కుటుంబమంతా ఉన్నా, తొలి షో వరకే అది ఉపయోగపడుతుంది. నటుడిగా నిరూపించుకుంటేనే అతనికి మనుగడ ఉంటుంది. తేజ్ ఆ విషయంలో మా కుటుంబానికి చెందిన నలుగురు హీరోల్లో ఒకడవుతాడు’’ అని అల్లు అరవింద్ అన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీహరి చనిపోయారు. అప్పుడు చాలా డీలా పడ్డాను. ఆ తర్వాత ఈ పాత్ర కోసం జగపతిబాబుగారిని తీసుకు న్నాం’’ అని చెప్పారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా పెద్ద మావయ్య నా హార్ట్ బీట్ అయితే పవన్ మావయ్య నా మనస్సాక్షి. నాలోని సహనం నాగబాబు మావయ్య. ఈ ముగ్గురూ నాకు కొండంత అండ’’ అన్నారు. ఇంకా వీవీ వినాయక్, ‘దిల్’ రాజు, హీరోలు రామ్చరణ్, అల్లు అర్జున్ తదితర అతిథులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనూప్ రూబెన్స్, రెజీనా తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు నిర్మాతలు డా. వెంకటేశ్వరరావు, పోకూరి బాబురావు, శరత్ మరార్, దర్శకులు శ్రీవాస్, వీరు పోట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.