goats
-
మేకలకు కటకటాలు!
చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో? -
జీవాలు తగ్గినయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం జీవాలు తగ్గినట్టు సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,81,605 గొర్రెలు, 49,06,465 మేకలు కలిపి మొత్తం 2,39,88,070 జీవాలుండేవి. కానీ ఐదేళ్ల తర్వాత గణన చేపడితే ఆ సంఖ్య 1.62 కోట్లకు తగ్గిపోయిందని (32.40%) సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1,75,115 కుటుంబాల వద్ద ప్రస్తుతం 1,24,14,299 గొర్రెలు, 38,02,609 మేకలు కలిపి 1,62,16,908 జీవాలున్నాయని తెలిపింది.వరంగల్లో 5 లక్షలు గాయబ్జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్ జిల్లాలో అత్యధిక శాతం జీవాలు తగ్గాయని ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు కలిపి 2019లో 1.89 లక్షలు ఉంటే 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 74 వేలకు తగ్గిపోయింది. వరంగల్లో అత్యధికంగా ఐదేళ్లలో ఐదు లక్షల వరకు జీవాలు మాయమయ్యాయి. 2019లో వరంగల్ జిల్లాలో 8.3 లక్షలున్న జీవాలు 2024కు వచ్చేసరికి 3.33 లక్షలకు తగ్గిపోయాయి.అదే విధంగా సంగారెడ్డిలో 3.50 లక్షలు, మెదక్లో 3.9 లక్షలు, నిజామాబాద్లో 4.2 లక్షలు, సిద్దిపేటలో 4.5 లక్షలు.. ఇలా పెద్ద సంఖ్యలో జీవాలు తగ్గిపోయా యని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేవైనా ఇంత పెద్ద సంఖ్యలో జీవాల తగ్గుదల మంచిది కాదని, ఆయా జిల్లాల్లో త్వరలోనే మాంసం సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వనపర్తి, గద్వాల, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో కొంతమేర జీవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.గొర్రెలు కావాలి మహాప్రభోవాస్తవానికి 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించి 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో అటు జీవాల సంఖ్యలోనూ, మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణలో భారీ వృద్ధి కనిపించింది. ఆ గొర్రెలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ గొర్రెల పథకంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఎదురుచూస్తున్నారు. 85 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. వారికి సంబంధించిన రూ.430 కోట్లు ఇంకా కలెక్టర్ల ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మరో 2.20 లక్షలకు పైగా లబ్ధిదారులు డీడీలు తీయాల్సి ఉంది. -
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!
మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. ఇక్కడొక దేశం మేకలకు అలానే శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాకవ్వుతారు. ఇదేం విడ్డూరం రా బాబు..! అనుకోకండి. ఇలాంటివి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఒకటి రెండు రోజులు కాదు ..ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్లో బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్ సిటీ కార్పొరేషన్ మేయర్ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్ అడ్మనిస్ట్రేటివ్ అదికారులు రాజీబ్కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్లో సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్ల్లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు. Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf — UNB - United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023 (చదవండి: ఆ లాటరీ టికెట్ వెయిటర్ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!) (మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానెల్పై క్లిక్ చేయండి) -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. -
నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్..
ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్గా ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा.... वीडियो गौर से देखिए........@Uppolice pic.twitter.com/ytC6m6owgI — Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023 ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు. చదవండి: బైక్ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్ -
'చీజ్' బడీహై మస్త్ మస్త్!
అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ. 30 నుంచి 300కు పైగా.. మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్నగర్లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది. పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ప్రత్యేక షెడ్.. దాణా.. మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్.. ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్కు తరలిస్తే లీటర్కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు. బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా.. మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు. ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!
ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. ఎమ్మే చదువుకొని రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు. నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది. కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత. 5 వేల ఆల్చిప్పల్లో ముత్యాల సాగు ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ షెడ్ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు. షెడ్ కింద మిగతా భాగంలో ఒక డార్క్ రూమ్ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా.. ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్ఫ్రూట్ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు. ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు. పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు. ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్ దంపతులు ధన్యులు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. – వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది. బ్యాగ్లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు. దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్ దంపతులు ప్రత్యేక షెడ్లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు. ఒక ఆల్చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. చిన్న రైతులకు దారి చూపాలని.. భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం. ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – వాసికర్ల శేషుకుమార్ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే! 70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా -
అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా!
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి. వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx — ViralHog (@ViralHog) October 19, 2022 (చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ) -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్నగర్ ఎయిర్పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
మేకల కాపరిగా కామాగిరి సర్పంచ్
ఇచ్చోడ: అభివృద్ధి పనులకు నిధులు సరిపోలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు.. దీంతో సొంత డబ్బు వెచ్చించి.. అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక.. కుటుంబాన్ని పోషించేందుకు మేకలు కాస్తున్నాడు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్ తొడసం భీంరావు దుస్థితి ఇది. కూలి పనులు చేసుకునే ఆదివాసీ దివ్యాంగుడు భీంరావు కామాగిరి జనరల్ స్థానం నుంచి సర్పంచ్గా ఎన్నికయ్యారు. పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటం, కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రూ.200 కూలి కోసం మేకల కాపరిగా మారారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా మారానని భీంరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
హాట్సాఫ్ హరిత.. ‘మూగ’ ప్రేమ
కర్నూలు (ఓల్డ్సిటీ): ‘బుజ్జీ.. ఏం డల్గా ఉన్నావ్.. ఎగిరెగిరి గంతులు వేసే దానివి కదా.. ఏం.. మీ అమ్మ పాలు తాపించలేదా..’ అంటూ మేకపిల్లను ఎత్తుకుని తల్లి మేక వద్ద వదిలింది చిన్నారి హరిత. అంతేకాదు.. దానికి అది పాలు తాపించేదాకా వదలలేదు.. మరో మేకపిల్ల వద్దకు వెళ్లి ‘నువ్వేమి అలిగినట్లు కూర్చున్నావమ్మా.. నీకేమైందిరా.. దా.. నేను ఎత్తుకుంటా’ అంటూ ఒళ్లో కూచోబెట్టుకుని దాని తల నిమిరుతుంటే సమీపంలోనే ఉండే మరో మూడు మేకపిల్లలు కూడా వచ్చి చేరాయి.. ఇది సీన్ కాదు.. కట్టు కథ అసలే కాదు.. నగరంలోని గీతాంజలి వెంచర్కు పునాది పడక ముందు నుంచి వెంచర్ యజమాని గోపాల్ను వాచ్మేన్గా నియమించాడు. అక్కడే ఉండి నిర్మాణ పనులపై నిఘా పెట్టేందుకు వీలుగా యజమాని గోపాల్ దంపతులకు ఓ షెడ్డు నిర్మించి ఇచ్చారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం ఓ పద్నాలుగేళ్ల బాలుడు, ఓ పన్నెండేళ్ల బాలిక మాత్రమే వారి వద్ద ఉంటున్నారు. గోపాల్ వాచ్మేన్ ఉద్యోగంతో పాటు మేకల పెంపకం కూడా చేస్తున్నాడు. బాలుడు మేకల్ని మేపుకుని వస్తే.. భార్య, బాలిక ఇంట్లో మేత వేస్తుంటారు. ఈ రకంగా బాలిక హరితకు మేకలతో, మేకపిల్లలతో బాగా దోస్తీ అయింది. వాటిని వదిలిపెట్టి ఉండలేదు. హరిత ఎన్టీఆర్ నగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. వీధిలో ఇటీవలే ఓ ఆడకుక్క ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుక్క పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినలేదని బాధ పడుతుంటుంది. హరిత స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తన సొంత డబ్బుతో ఓ పాలపాకెట్ కొనుక్కుని వచ్చి, పాలను ఓ పెద్ద బాలెలో పోసి కుక్కపిల్లలకు తాపిస్తుంటుంది. ఏ కుక్కపిల్ల మిస్ కాకుండా అన్నింటిని మొదట బాలెవద్దకు తీసుకొస్తుంది.. ఆమె పాలపాకెట్ తేగానే ఆ దృశ్యం చూసేందుకు చుట్టుపక్కల చిన్నారులు కూడా అక్కడికి చేరుకుంటారు. మూగ జీవుల ఆకలి ఆక్రందనలు ఏమిటో తెలుసుకుని వాటికి ఆహారం అందించే దయా గుణం కలిగిన ఆ చిన్నారిని చూసిన ప్రతిఒక్కరు హాట్సాఫ్ చెబుతున్నారు. -
పులిని చంపేసి మేకలను కాపాడిన కాపరి
డెహ్రాడూన్: తనకు జీవనోపాధి కల్పిస్తున్న వాటిని కాపాడుకునేందుకు ఓ యువకుడు ఏకంగా పులితో పోరాడాడు. దాడి చేసేందుకు వస్తున్న వ్యాఘ్రాన్ని ఏమాత్రం బెరుకు లేకుండా పోరాడి చివరకు అంతమొందించాడు. అతడి సాహసం.. తెగువను గ్రామస్తులు మెచ్చుకున్నారు. అయితే పులిని హతమార్చడంతో కేసుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పితోర్గడ్ జిల్లా నైని గ్రామానికి చెందిన మేకల కాపరి నరేశ్ సింగ్. మేకలను మేపుతూ జీవిస్తున్నాడు. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి రోజు మాదిరిగా బుధవారం మేకలను మేత కోసం అడవి బాట పట్టాడు. మేత మేస్తున్న మేకల మందలో అలజడి మొదలైంది. ప్రాణభయంతో మేకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏమైందా అని వెళ్లి చూడగా చిరుత పులి ప్రత్యక్షమైంది. తన మేకలను కాపాడుకునేందుకు నరేశ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. బెదిరించాడు.. వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నరేశ్పైకి పులి దూసుకొచ్చింది. తన మీదకు దాడి చేసేందుకు వచ్చిన పులిపై కొడవలితో ఒక్క వేటు వేశాడు. అతడి దెబ్బకు పులి నేలకొరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరాన్ని పరిశీలించారు. అయితే పులిని హతమార్చడం వాస్తవంగా నేరం. కాకపోతే ఆత్మరక్షణ కోసం చంపడంతో నరేశ్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే నరేశ్ తెగువను గ్రామస్తులు అభినందించారు. తమకు పొంచి ఉన్న పులి ముప్పును తప్పించాడని ప్రశంసించారు. చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు.. జీతం అడిగితే పోలీస్ కేసు! -
కశ్మీర్ మేక.. ధర కేక!
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం జరిగిన గొర్రెల సంతలో కశ్మీర్ మేకపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో వారంలో బక్రీద్ పండుగ రానుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేలు జాతి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనేందుకు పోటీపడ్డారు. అయితే కశ్మీర్ మేకపోతులు ఒక్కోటి రూ.50 వేలపైన పలకడం విశేషం. -
కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి
నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
కారు డోర్ తెరిస్తే మ్మే..మ్మే..!
పోలీసులు ఒక కారును ఆపి డోర్ తెరిచారు అంతే..! మ్మే..మ్మే..అని రక్షించండో అన్నట్లు అరుస్తున్న మేకలను చూసి విస్తుపోయారు. కాళ్లు కట్టేసి, కొన్నిటికి మూతికి అడ్డంగా గుడ్డ కట్టేసి ఉన్న వాటిని బంధ విముక్తం చేశారు. ఇదేదో మేకల కిడ్నాప్లా ఉన్నట్లుందే అనుకుంటున్నారా?!..అయితే ఎస్ఐ రాజశేఖర్ సోమవారం చెప్పిన ఆ మ్మే..మ్మే..మేటరేమిటంటే.. ఆదివారం చిత్తూరు–అరగొండ రోడ్డులోని హైవే బ్రిడ్జి దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఒక స్విఫ్ట్ జైర్ కారులో 12 మేకలు పైవిధంగా ఉండటం చూసి అనుమానించారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వీళ్లు తిరుపతి శెట్టిపల్లెకు చెందిన టి.గిరి(34), పుల్లిచెర్ల మండలం ముతుకువారిపల్లెకు చెందిన భూపతి అలియాస్ కట్టప్ప(35), బంగారుపాళెం మండలం డీకే వూరుకు చెందిన కె.జ్యోతినాథ్(26), ఇందిరమ్మకాలనీకి చెందిన కె.భరత్(23) అని, వీరంతా మేకల దొంగలని, దొంగలించిన మూగజీవాలను విక్రయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. ఈ నెల 16న మండలంలోని మడవనేరిలో శివాజి, అజయ్కు చెందిన ఐదు మేకలు, ఈచనేరిలో కృష్ణయ్య చెందిన ఒక పొట్టేలు, ఒక గొర్రెను చోరీ చేసింది వీళ్లేనని వెల్లడైంది. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో నిందితుల ఇళ్ల నుంచి మరో 4 మేకలు, 4 పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్లు తవ – తవణంపల్లె చదవండి: వింత: కోడి ఆకారంలో మేక.. నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి -
అగ్ని ప్రమాదం: కాలిబూడిదైన 90 మేకలు
భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గం పరిధిలో గల లావుగుడ గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 ఇళ్లు, రెండు మేకల శాలలు దగ్ధమైన సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదంలో 90 మేకలు సజీవ దహనం కాగా లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. గ్రామంలో అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న హింజిలికాట్, అస్కా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తక్షణమే ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎండ తీవ్రతతో పాటు గాలులు వీయడంతో అప్పటికే ఇళ్లు, మేకల శాలులు మంటల్లో పూర్తిగా బూడిదయ్యాయి. బూడిౖదైన మేకల శాల ప్రభుత్వం ఆదుకోవాలి ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధి శరత్ కుమార్ మహపాత్రో, బంజనగర్ సబ్కలెక్టర్ రాజేంద్ర మిజ్ఞ, బీడీఓ సురంజిత్ సాహు, అదనపు తహసీల్దార్ శరత్ కుమార్ మల్లిక్ చేరుకుని బాధితులకు తక్షణ సహాయంగా ప్లాస్టిక్ కవర్లు, ఆహారం, బియ్యం, కట్టుకునేందుకు వస్త్రాలు అందించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు బిజు పక్కా గృహ పథకం కింద ఇళ్లు ఇవ్వాలని, ప్రమాదంలో సజీవ దహనమైన మేకలకు నష్ట పరిహారం, సహాయం అందించి ఆదుకోవాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధిత గ్రామస్తులు -
సినిమా కోసం హీరోల మేకల దొంగతనం
చెన్నై : దొంగలందు ఈ దొంగలు వేరయా.. నిజమే ఇది చదివితే మీకే అర్థమవుతుంది. తండ్రి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాతో హీరోలుగా మారాల్సిన ఆ ఇద్దరు అన్నదమ్ములు దొంగల అవతారమెత్తి జైలు పాలయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, న్యూ వాషర్మెన్ పేటకు చెందిన విజయ్ శంకర్ అనే వ్యక్తి సొంతంగా ‘ నీ దాన్ రాజా’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి కుమారులు వి.నిరంజన్ కుమార్(30), లెనిన్ కుమార్(32)లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సినిమా పూర్తి చేయాలని భావించారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం దొంగతనాలకు సిద్ధపడ్డారు. జన సంచారం తక్కువ ఉండే గ్రామాలైన చెంగల్పేట్, మాదవరం, మింజూర్, పొన్నెరి గ్రామాల్లో మేతకు వెళ్లిన మేకల గుంపులను లక్ష్యంగా చేసుకునేవారు. ( అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు) పట్టుబడకుండా ఉండేందుకు అందులో నుంచి ఒకటి, రెండు మేకలను దొంగలించేవారు. ఈ క్రమంలో అక్టోబర్ 9న మాదవరం పలనిలో మేక దొంగతనం జరిగింది. మందలో 6 మేకలు ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవి వీడియోల ఆధారంగా సోదరులిద్దరూ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. వారిద్దరూ ఒక కారులో వచ్చినట్టు కనిపించగా, కారు నెంబరు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులే వేషాలు మార్చి, సాధారణ జనాల్లో కలిసిపోయి గమనించసాగారు. శనివారం రోజున ఆ సోదరులు నిద్రిస్తున్న మేకను దొంగలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు ఐసోలేషన్కి!
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గొల్లరహట్టి తాలూకాలోని గోడెకెరె గ్రామంలో చోటుచేసుకుంది. కాపరికి చెందిన మేకలు, గొర్రెలు శ్వాసకోశ సమస్య కలిగి ఉన్నాయని గమనించిన గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు) అదే విధంగా గోడెకెరె గ్రామ ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న కరోనా భయాందోళనలపై సమగ్రంగా విచారణ జరపాలని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి, తుముకూరు జిల్లా కమిషనర్ కె. రాకేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవాలని పశుసంవర్ధక విభాగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించి.. మేకలు ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అని పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్(పీపీఆర్)తో బాధపడుతున్నాయని తెలిపారు. ఇక జంతువుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఇక మేకలు, గొర్రెలు కరోనాకు గురి కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ ఇతర జంతువులకు కూడా వ్యాప్తిస్తుందని గొర్రెలు, మేకలను నిర్భంధించినట్లు అధికారులు తెలిపారు.(తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్) -
దొంగతనం చేసిన మరుసటి రోజే..
వాషింగ్టన్: అమెరికాలోని ఓ డైరీ ఫామ్లో దొంగలు పడ్డారు. అయితే రోజు తిరిగేసరికి ఆ దొంగలు ఎత్తుకెళ్లిన మేకపిల్లలను పాకలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. దొంగల మనసు మారడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నారా.! ఎలాగో చదివేయండి.. జూన్ 22న అమెరికాలోని డైరీఫామ్ నుంచి చిన్నచిన్న మేకపిల్లలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వాటిని పెంచుచుతోన్న డైరీ ఫామ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. "గత రాత్రి కొందరు ఆరు మేక పిల్లలను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి నేను, నా కొడుకు పిచ్చివాళ్లమైపోయాం. వాటిని మా పిల్లల్లా చూస్తాం. దయచేసి వాటిని తిరిగిచ్చేయండి. వాటికి రెండు నెలల వయసు కూడా లేదు. (మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!) అసలే అవి ఆకలిగా ఉన్నాయి, ఇప్పుడింకా ఎంత భయపడుతున్నాయో! మేము వాటిని మిస్సవుతున్నాం. నా పిల్లలు తన స్నేహితులను(పెంపుడు మేకలు) కోరుకుంటున్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి ఇచ్చేస్తే మేము ఎక్కడా ఫిర్యాదు చేయమని రాసుకొచ్చింది. అయితే ఇది ఆ దొంగల కంట పడినట్టుంది. ఇది చదివి వారి హృదయం ద్రవించినట్లుంది. వెంటనే మరుసటి రోజు వాటిని ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేశారు. ఈ విషయాన్ని డైరీ ఫామ్ నిర్వాహకులు "మేకపిల్లలు తిరిగి ఇంటికి వచ్చేశాయ్" అంటూ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు వాటిని హత్తుకుని ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. (మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!) -
మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!
ముంబై : తమ సొంత ఊరికి వెళ్లేందుకు మేకలు అమ్ముకున్న వలస కార్మికునితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఉచితంగా సొంతింటికి చేర్చేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ అంగీకరించింది. వివరాలు.. లాక్డౌన్ కారణంగా అనేక మంది వలస జీవులు వేరే రాష్ట్రాలలో ఇరుక్కుపోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం దేశీయ విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో చిక్కుకున్న కొంతమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అయితే వీరికి మార్చి నెల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో విమాన టికెట్ల కోసం నానా తంటాలు పడి రూ.30,600లు సేకరించారు. వీరిలో ఒకరికి డబ్బులు కుదరకపోవడంతో తాను పెంచుకుంటున్న మూడు మేకలను అమ్ముకుని విమానం టికెట్టు కొనుగోలు చేశాడు. కాగా కొన్ని కారణాల వల్ల ఆ విమానం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 28 వరకు విమానయాన సేవలపై ఆంక్షలు విధించడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ పోస్టులో తెలిపారు. తాజాగా మేకలు అమ్ముకున్న వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పంపించేందుకు ఇండిగో అంగీకరించింది. కోల్కతాకు తిరిగి ప్రయాణించలేని ముగ్గురు ప్రయాణీకులకు తాము వసతి కల్పించామని ఇండిగో ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జూన్ 1నుంచి వలస కార్మికుల కోసం టికెట్ల బుకింగ్ తెరిచినట్లు ఇండిగో తెలిపింది. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో) -
గొల్లలపాలెంలో వింత పెళ్లి..
గొర్రెలు, మేకల జంటల వివాహాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సామూహిక వివాహతంతుకి గొల్లలపాలెం వేదికయింది. ఆత్మీయులందరూ తరలివచ్చారు. కొత్త జంటల్ని ఆశీర్వదించారు. మీరు చదువుతున్నది నిజమే. ఇదొక సంప్రదాయం. రావికమతం(చోడవరం): మందల్లో ఉండే జంతువులు రోగాలపాలవకుండా.. సంతానాభివృద్ధి కోసం ఇలా పెళ్లిళ్లు జరిపిస్తామని చెబుతున్నారు యాదవులు. తమ పూరీ్వకులు పాటించిన ఆచారాన్నే తాము కొనసాగిస్తున్నామని వివరించారు. పెళ్లి ఇలా.. మందలో ఉండే గొర్రెపోతుతో గొర్రెలకు.. మేకపోతుతో మేకలకు పెళ్లి జరిపిస్తారు. ప్రతీ ఏటా కనుమ పండగ రోజున దీనికి ముహూర్తంగా నిర్ణయిస్తారు. పెళ్లిరోజు ఉదయాన్నే గ్రామంలోని వారు సమీపంలోని పుట్టవద్దకు చేరుకుంటారు. తమ మందల్లోని గొర్రెలు, మేకలకు పసుపురాసి బొట్టుపెడతారు. ధూపం కూడా వేస్తారు. ఆపై ‘మాంగళ్యధారణ’ చేస్తారు. అనంతరం గొర్రెలు, మేకల చెవుల చిగుర్లను కోసి పుట్టలో వేస్తారు. గురువారం కనుమ సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఇది తమ వంశాచారమని రైతులు పల్లా చినబాబు,దేముడుబాబు,గోపన్న చెప్పారు. -
శీతాకాలంలో గొర్రెల, మేకల సంరక్షణ
పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం. వీటి ఉత్పాదకత తగ్గకుండా చలి బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పొట్ట పశువులే కాకుండా, గొర్రెలు, మేకలు కూడా శీతాకాలం ప్రభావానికి లోనవుతాయి. మెలకువలు పాటించడం శ్రేయస్కరం. శీతాకాలంలో గొర్రెల యాజమాన్యం: 1. గొర్రెలకు తప్పనిసరిగా గృహవసతి ఉండాలి. కనీసం చెట్టు నీడనన్నా ఉంచాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మంచు బారిన పడకుండా చూడాలి. 2. ఇటీవల ఉన్నిని కత్తిరించిన గొర్రెలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చలి నుంచి రక్షణ ఇవ్వాలి. 3. అప్పుడే పుట్టిన గొర్రెపిల్లల మీద ఉన్న మాయ తాలూకు తడిని వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి ‘హైపోధర్మియ’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. 4. ఈతకు వచ్చిన గొర్రెలను శ్రద్ధగా పర్యవేక్షించాలి. 5. రెండు నెలల వయస్సున్న గొర్రె పిల్లలు చలిని తట్టుకుంటాయి. కానీ షెడ్లలో తేమతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే న్యూమోనియా ప్రబలే అవకాశముంది. 6. శీతాకాలంలో శరీర ఉష్ణాన్ని కాపాడుకునేందుకు శరీరంలో జీర్ణప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని గొర్రెలు బయటకు పంపవు. కాబట్టి శరీర ఉష్ణ నిర్వహణకు పీచు పదార్థం గల మేతను మేపాలి. 7. చూడి 15 వారాల సమయంలో సుమారు 2 కిలోల పచ్చిమేతను అందించాలి. జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివన్నమాట. చివరి 4 వారాల చూడి దశలో వీటితోపాటుగా 500 గ్రాముల మొక్కజొన్న పిండిని ఇవ్వాలి. 8. గొర్రె ఈనిన తర్వాత 2.5 కిలోల పచ్చిమేతతోపాటుగా 15% ప్రొటీను గల సమీకృత దాణాను ఒక కిలో ఇవ్వాలి. 9. మంచి నీరు నిల్వ లేకుండా అవసరాన్ని బట్టి అందుబాటులో ఉంచాలి. మేకల యాజమాన్యం 1. మందమైన పొడవాటి వెంట్రుకలు చలి నుంచి కాపాడుతాయి. 2. పరిశుభ్రమైన వెచ్చటి గడ్డితో కూడుకున్న పక్కను ఏర్పాటు చేయాలి. 3. పెద్ద మేకలకు గృహవసతి లేకున్నా.. చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 4. గొర్రెలకన్నా మేకలు ఎక్కువ పీచును జీర్ణం చేసుకోగలుగుతాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన చెరకు పిప్పి, పొద్దుతిరుగుడు మొక్కలు, ఎండిన కంది కట్టె వంటి వాటిని మేపవచ్చు. 5. మేకల్లో ఈ సీజన్లో ఎక్కువగా పేలు కనబడతాయి. వాటి నుంచి రక్షణ అవసరం. 6. ఖనిజ లవణ ఇటుకలను షెడ్లలో గాని, చెట్లకు గాని వేలాడదీయాలి. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
గొర్రెల దొంగతనానికి వచ్చి.. గ్రామస్తులకు చిక్కి
అక్కన్నపేట(హుస్నాబాద్): అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన ముగ్గురు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. విద్యుత్ స్తంభాలపై ఉన్న సీసీ కెమెరాల వైర్లను తొలగించి గొర్రెలను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో గ్రామస్తులు పట్టుకొని ఓ ఇంటి ఎదుట గేటుకు కట్టేశారు. ఆ ముగ్గురు గిరిజన యువకులు హుస్నాబాద్ మండలంలోని భల్లునాయక్ తండాకు చెందినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. రెండు రోజుల కింద గండిపల్లిలో కూడా గొర్రెలను ఎత్తుకుపోయారని జల్సాల కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఈ విషయంపై సాక్షి ఎస్ఐ పాపయ్యనాయక్ను సంప్రదించగా ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలపడం కొసమెరుపు. -
మేకను మింగబోయి.. భారీ కొండచిలువ హతం
జి.సిగడాం: మేకను మింగబోయిన కొండచిలువను గ్రామస్తులు హతమార్చారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం మేకలు మేత మేస్తుండగా సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ వచ్చి మాటువేసింది. ఓ మేకపై దాడి చేసి హతమార్చి మింగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను హతమార్చారు. -
కార్లలో మేకల దొంగతనం
రాజేంద్రనగర్ : ఒకటి కాదు... రెండు కాదు... 11 నెలలుగా 30 మేకలను ఎత్తుకెళ్లారు. కారుల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనాల విషయం తెలిసి దొంగలను పట్టుకునేందుకు స్థానిక యువకలు ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు సరికదా.. ఆ కారును వారి మీదకే దూకించి భయపెట్టేవారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్న చందంగా ఎట్టకేలకు మేకల దొంగలు పోలీసులకు చిక్కారు. కారు పంక్చర్ కావడంతో స్థానిక యువకులు గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమావతిపేట ప్రాంతంలో స్థానిక కురుమ, యాదవులు మేకలను పెంచుతున్నారు. వీటిని తమ ఇళ్ల ముందు ఉన్న పాకలతో పాటు బస్తీలోని ఖాళీ స్థలంలో రాత్రి సమయాలలో గడ్డి వేసి ఉంచేవారు. గత 11 నెలలుగా రాత్రి సమయంలో వాహనాలలో వచ్చిన దొంగలు వీటిని ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఇలా 30 మేకలను అపహరించారు. ఈ విషయమై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. స్థానిక యువకులు రాత్రి సమయంలో బస్తీలలో కాపు కాసినా వారిపైకే వాహనాలను తీసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేసి తప్పించుకునే వారు. వాహనాలకు నెంబర్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వారిని పట్టుకోవడంలో స్థానిక యువకులు విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక యువకులు ప్రేమావతిపేట శివాలయం వద్ద కాపు కాశారు. కారులో నలుగురు యువకులు ప్రేమావతిపేట ప్రాంతానికి వచ్చారు. ఓ వీధిలో నిద్రిస్తున్న మూడు మేకలను రెప్పపాటులో కారులోకి వేసుకున్నారు. మేకల శబ్ధానికి అప్రమత్తమైన యువకులు కారు వద్దకు రాగానే రివర్స్లో వారిపైకే వేగంగా పోనిచ్చారు. అప్రమత్తమైన యువకులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో వాహనం ముందు టైర్ పంక్చరైంది. అలాగే ముందుకు వేగంగా పోనిచ్చారు. రోడ్డుపై కొద్దిదూరం వెంబడించినా యువకులకు కారు చిక్కలేదు. విషయాన్ని పెద్దలకు చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాహనం పంక్చర్ కావడంతో దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో డాంబర్ రోడ్డు (బీటీ రోడ్డు)ను రాసుకుంటూ వెళ్లింది. యూనివర్సిటీ రోడ్డు నుంచి బుద్వేల్ మీదుగా స్థానిక చర్చి ప్రాంతంలో పార్కు చేసి ఉంది. దీంతో యువకులు వాహనాన్ని గుర్తించి దానిపై స్థానికులను ఆరా తీశారు. స్థానిక యువకులే దొంగతనాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనంతో పాటు నలుగురు యువకులు, ఒక మేకను స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత 11 నెలల కాలంగా 30 మేకలను దొంగలించింది వీరేనా, వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ యువకులంతా 24 సంవత్సరాలలోపే ఉండడం గమనార్హం. -
దళారుల దందా!
‘పక్క చిత్రం జగిత్యాల మండలం బాలపెల్లి గ్రామంలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలది. ఈ గ్రామంలో మొత్తం 89 యూనిట్లను మంజూరు చేసిన అధికారులు నెలక్రితం 27 మంది లబ్ధిదారులను తమవెంట గుంటూరు జిల్లా మాచర్లకు తీసుకెళ్లి గొర్రెలు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఒక్కో గొర్రెపిల్ల వయస్సు ఏడాది ఉండాలి. కానీ ఈ లబ్ధిదారుల్లో దాదాపు అందరికీ సగం నెల, రెండునెలల వయస్సున గొర్రె పిల్లలు, మిగిలిన సగం పెద్ద జీవాలు అందాయి. ప్రతి యూనిట్లో ఓ పొట్టెలు కచ్చితంగా ఉండాలి. కానీ 17 యూనిట్లకు కూడా ఒక్కపొట్టెలూ లేకుండానే గొర్రెలు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన గొర్రెలు కూడా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పంపిణీ చేసినవాటిలో చాలావరకు చనిపోయాయి. చెట్టె కొమురెల్లి, గుంటి పోశవ్వకు చెందిన రెండు యూనిట్లలో పది గొర్రె పిల్లలు చనిపోయాయి. వీరిద్దరు ఎక్కువగా నష్టపోయారు. అంతేకాదు.. మరో 20 యూనిట్లకు సంబంధించిన డీడీలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వారికి ఇంకా జీవాలు పంపిణీ కాలేదు..’ ‘కోరుట్ల మండలం యూసుఫ్నగర్కు చెందిన పలువురు గొల్లకుర్మలు గతేడాది నవంబర్లో ఓ పశువైద్యాధికారితో కలిసి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లారు. అక్కడ పశువైద్యాధికారి చూపించిన గొర్రెలు బలహీనంగా ఉండడంతో వాటిని తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీంతో సదరు వైద్యుడు వారిని అక్కడే వదిలేసి నాలుగు రోజులపాటు మాయమయ్యాడు. చివరకు లబ్ధిదారులు నేరుగా ఓ ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఆయన జిల్లా అధికారులకు సమాచారమిచ్చి మరో వైద్యుడిని అక్కడికి పంపగా.. లబ్ధిదారులను తిరిగి తీసుకొచ్చాడు. అదే నెలాఖరులో మళ్లీ కనిగిరి వెళ్లిన లబ్ధిదారులు తమకు నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పై రెండు ఉదాహరణలు చాలు.. జిల్లాలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలు తీరును బేరీజు వేసేందుకు. సాక్షి, జగిత్యాల : అధికారుల వైఫల్యంతో సబ్సిడీ గొర్రెల పథకం జిల్లాలో అభాసుపాలైంది. పథకం అమలులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పథకం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీవాలు ఇప్పించడంలో క్యాష్ టీం.. (లబ్ధిదారుల వెంట వెళ్లిన పశువైద్యులు), దళారులు కలిసి అవినీతికి పాల్పడినట్టు లబ్ధిదారులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నా రు. తమ గొర్రెలు విక్రయించినందుకుగానూ విక్రయదారుల వారినుంచి రూ.5వేల వరకు లంచం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. అక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియ ని తమను ఎటూ వెళ్లనీయకుండా చేసి వారికి నచ్చిన గొర్రెలు మాత్రమే చూపించి వాటిని మాత్రమే ఇప్పించారని బాధితులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం సబ్సిడీ మీద అందించే జీవాలు ఏడాది నిండి ఉండాలి. కానీ నెల, రెండు నెలలున్న గొర్రెల పిల్లలు, పొట్టేలు లేకుండా లబ్ధిదారులకు అంటగట్టడం పశువైద్యాధికారులకే చెల్లింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలించక వందల సంఖ్యలో గొర్రెల పిల్లలు చనిపోయాయి. దీంతో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. మరోపక్క.. పక్క రాష్ట్రంలోని జిల్లాలకు లబ్ధిదారులను తీసుకెళ్లిన పశువైద్యాధికారులు వారు చూపించిన గొర్రెలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. జీవాలు బలహీనంగా ఉన్నా.. తమకు నచ్చకున్నా వాటినే తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక సబ్సిడీ రూపంలో వచ్చిన గొర్రెలను కాదనకుండా జీవాలను తమ వెంట తీసుకొచ్చామని చెప్తున్నారు. ఉద్దేశమొకటి.. జరుగుతున్నదొకటి.. చితికిపోతున్న గొల్లకుర్మ కుటుంబాలకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఏడాది ఏప్రిల్ 18న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో లబ్ధిదారులతో కలిసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు పర్యటించిన పశువైద్యాధికారులు జిల్లా వాతావరణాన్ని తట్టుకుని జీవించేలా అనువుగా ఉండే గొర్రెలను కొనుగోలు చేశారు. మహారాష్ట్ర జీవాలపై లబ్ధిదారులు అనాసక్తి చూపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుగొండ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు, కనిగిరి ప్రాంతాల నుంచి గొర్రెల ను కొనుగోలు చేసి జిల్లాలో గొల్లకుర్మలకు అప్పగించారు. ఒక్కొ యూనిట్కు రూ.1.25 లక్షల చొప్పున ఇప్పటి వరకు 9,739 యూని ట్లు లబ్ధిదారులకు అందించారు. ఒక్కో యూని ట్కు ఇరవై గొర్రెలు.. ఒక పొట్టెలు చొప్పున ఇచ్చారు. ప్రతి యూనిట్కు సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.93,750 (75 శాతం) చొప్పున రూ.31 కోట్ల పైచిలుకు ఖర్చు చేసింది. మిగిలిన రూ.31,250 (25శాతం) లబ్ధిదారులు భరించారు. దీంతో పాటు ప్రతి జీవిపై ఏడాదిపాటు ఇన్సురెన్స్ చెల్లించారు. ఆ లోపు గొర్రె, పొట్టే చనిపోతే దానిస్థానంలో మరో జీవిని ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గొర్రెలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నిర్ణయించిన లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిదేమీ లేదు లబ్ధిదారుల ఇష్టం మేరకే సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశాం. ఇష్టం లేని ఎంతోమంది జీవాలు లేకుండానే తిరిగొచ్చారు. మరోసారి వారిని తీసుకెళ్లి ఇష్టం మేరకు జీవాలు ఇప్పించాం. గొర్రెలు ఇప్పించడంలో దళారుల ప్రమేయం లేదు. పొట్టేలు తక్కువగా ఉండడంతో పలు యూనిట్లకు ఇవ్వలేకపోయాం. -అశోక్రాజు, జిల్లా పశువైద్యాధికారి చిన్నపిల్లలు కొనిచ్చారు గొర్రెల పథకంలో లబ్ధిదారులు ఏరుకున్న గొర్రెలు కాకుండా నచ్చలేదని చెప్పినా వినకుండా 10 పెద్దవి, 11 చిన్న గొర్రెలు కొనిచ్చారు. ఇప్పటికే మూడు పిల్లలు చనిపోయాయి. అధికారులు చిన్న గొర్రెపిల్లలు వద్దని చెప్పినా పట్టించుకోకుండా కొనిచ్చారు. – చెట్టె బుచ్చయ్య, బాలపల్లి పొట్టేలు లేకుండానే ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ఇచ్చారు. 10 పెద్ద గొర్రెలు, 10 చిన్న పిల్లలు ఇచ్చారు. గొర్రెలు నచ్చలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చేలోపు పిల్లలు చనిపోయాయి. నెల్లూరు జిల్లా మాచర్ల, కుంటాల ప్రాంతాల్లో వారే గొర్రెలను చూసి కొనుగోలు చేసి ఇచ్చారు. – ఏగుర్ల రెడ్డి, బాలపల్లి మేం చూసినవి వద్దన్నరు కర్నూలు గొర్రెలు బాగున్నాయి. అధికారులు కుదరవని, కుంటకు తీసుకెళ్లారు. చిన్నవి సగం, పెద్దవి సగం కొనివ్వడంతో కొంత మంది మి విధిలేక తీసుకున్నాం. కొంతమంది వాపస్ వచ్చారు. 20 యూనిట్ల లబ్ధిదారులు గొర్రెలు తీసుకోలేదు. – చెట్టె కొమురయ్య, బాలపల్లి -
అంతర్రాష్ట్ర దొంగల అడ్డా అనంత
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెలు అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో బంధించినవి. గత నవంబర్ 17న బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లిలో గొర్రెల కాపరి వినోద్కు చెందిన మూడు గొర్రెలను దొంగిలించారు. వాటిని మరసటి రోజు గుత్తిరోడ్డులోని వ్యవసాయ మార్కెట్యార్డులో విక్రయించారు. అనుమానం వచ్చిన గొర్రెల కాపరులు అదేరోజు సంతకు వచ్చి వారి గొర్రెలను కనుగొన్నారు. దీనిపై త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు గొర్రెల దొంగతనాలకు పాల్పడింది ఎవరనే అంశాన్ని పక్కన పెట్టి దొరికిన రెండు గొర్రెలకు రూ. 6 వేలు చెల్లించి తీసుకుపోవాలని వాటి యజమానులనే ఆదేశించారు. గొర్రెల దొంగల నుంచి కొనుగోలు చేసింది ఓ సీఐకు చెందిన వ్యక్తులు కావడంతో ఈ విధమైన పంచాయితీ చేశారు. అనంతపురం సెంట్రల్: అంతర్రాష్ట్ర దొంగలకు అనంతపురం జిల్లా అడ్డాగా మారింది. అలా వచ్చి ఇలా దొంగతనాలు చేసుకొని వెళ్లిపోతున్నారు. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం దొంగలకు కలిసొస్తోంది. ఇప్పటికే అనేక మంది అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు కటకటాల వెనక్కు పంపిస్తున్నప్పటికీ జిల్లాలోకి ముఠాలు చొరబడుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలో శుక్రవారం రాత్రి పశువుల దొంగలు చేసిన బీభత్సం పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. గొర్రెలు, పశువుల దొంగతనాలు నిత్యకృత్యం జిల్లాలో 50 శాతం మంది ప్రజలు గొర్రెల పెంపకం, పశు పోషణపై ఆధారపడుతున్నారు. గొర్రెలను ఎక్కువగా ఆరుబయల్లోనే పోషిస్తున్నారు. దీంతో దొంగలు వాహనం నిలబెట్టడం.. గొర్రెలను ఎత్తుకెళ్లడం సులువవుతోంది. పశువుల దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కదిరిలో కూడా ఈ తరహా దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఫిర్యాదుల వరకే పరిమితమవుతున్నాయి. పశువులు, గొర్రెల దొంగతనాలు పాల్పడుతున్నది ఎక్కువగా కర్ణాటకకు చెందినవారిగానే అనుమానిస్తున్నారు. పశువులను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల అపహరణతోపాటు ఇళ్లల్లో చోరీలకు కూడా అంతర్రాష్ట్ర దొంగలు పాల్పడుతున్నారు. ముఖ్యం గా బిహార్ ముఠా అంటే పోలీసులే భయబడాల్సి వస్తోంది. వారు ఎంత కైనా తెగిస్తారనే భయం నెలకొంది. నిఘా.. నిద్రావస్థ! నేరాల నివారణ కోసం అనంతపురంలోని ప్రధాన కూడళ్లలో దాదాపు 300 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరం జరిగిపోయిన తర్వాత ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే ఈ కెమెరాలు పనికి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి పశువుల దొంగలు చొరబడ్డారని స్థానికులు తెలిపేంత వరకు పోలీసులు రంగంలోకి దిగలేదు. దొంగలను గుర్తించినా పట్టుకోలేకపోయారు. నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టులు ఉండి.. అప్రమత్తమై ఉంటే పశువుల దొంగలను పట్టుకునే అవకాశం ఉండేది. అర్ధరాత్రి పూట విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యేక బృందాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ♦ డిసెంబర్ 28న కోవూరునగర్లో భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. బుక్కరాయసముద్రం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న లావణ్య, శివకుమార్ దంపతులు ఇంట్లో లేని విషయాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న సుమారు 41 తులాల బంగారం, రూ.88 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు బిహార్ ముఠాగా నిర్దారించారు. ముఠాను పట్టుకువచ్చేందుకు ప్రత్యేక బృందం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఉత్తచేతులతో వెనుతిరిగి వచ్చింది. -
అమ్మితే జైలుకే!
గొల్లకుర్మలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టకుండా సర్కారు చర్యలు చేపట్టింది. సబ్సిడీపై అందించిన గొర్రెలను అమ్ముకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికా రులు.. దీనిపై టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి క్రైం: యాదవుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సర్కారు గొ ర్రెల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చింది. 18 ఏళ్లు నిండిన గొల్ల కుర్మలందరి కీ గొర్రెల యూనిట్లను అందించాలని నిర్ణయించింది. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్ ధరను రూ. 1.25 లక్షలుగా నిర్ణయించిన సర్కారు.. ఇందులో 25 శాతం లబ్ధిదారుడు వాటాదారుగా చెల్లించాలని సూచించింది. మిగతా మొత్తాన్ని సర్కారు సబ్సిడీగా భరిస్తోం ది. ఆసక్తి చూపిన యాదవులలో మొద టి ఏడాది సగం మందికి, రెండో ఏడా ది మిగతా సగం మందికి యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించి, డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలో మొదటి విడతలో 8,640 యూనిట్లు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికి 4,647 యూని ట్లను పంపిణీ చేశారు. సబ్సిడీ గొర్రెలపంపిణీ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 58 కోట్ల 08 లక్షల 75 వేలు ఖర్చు చేశారు. యూనిట్లోని గొర్రెలు రెండేళ్లలో మూడు ఈతలు వస్తాయని, దీంతో గొర్రెల సంతతి వృద్ధి చెంది యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఆశించింది. కానీ పలుచోట్ల పథకం పక్కదారి పట్టింది. కొందరు లబ్ధిదారులు సబ్సి డీ గొర్రెలను అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. సబ్సిడీపై అందించిన గొర్రెలను పొరుగు రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించిన ఘటనలు వెలుగు చూశాయి. పకడ్బందీ చర్యలు.. గొర్రెల పంపిణీ లక్ష్యం నీరుగారిపోతోందని భావిస్తున్న సర్కారు.. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. సబ్సిడీపై అందించిన గొర్రెలను అమ్ముకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. ఎవరూ అమ్ముకోకుండా చూసేందుకు జిల్లాలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సబ్సిడీ గొర్రెలను ఇతర రాష్ట్రాలకు తరలించేవారిపై ఈ ప్రత్యేక బృందం దృష్టి సారిస్తుంది. ఈ బృందంలో పోలీస్, రవాణా, పశుసంవర్ధక శాఖలకు చెందిన ముగ్గురు అధికారులున్నారు. జిల్లా నుంచి సబ్సిడీ గొర్రెలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో ఈ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారుల తెలిపారు. అంతేగాకుండా సబ్సిడీ గొర్రెల పథకం లబ్ధిదారులు, గొర్రెల పెంపకంపై నిఘా వేసేందుకు మరో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. సబ్సిడీ గొర్రెలు అమ్మితే.. సబ్సిడీపై అందించిన గొర్రెలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. గొర్రెలను అమ్ముతూ పట్టుబడితే వాహనాన్ని, గొర్రెలను వెంటనే సీజ్ చే స్తారు. విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తారు. అంతేకా కుండా ఇచ్చిన సబ్సిడీని రికవరీ చేస్తారు. నిబంధనల ప్రకారం సబ్సిడీ గొర్రెలు తీసుకున్న వ్యక్తి రెండేళ్ల వరకు వాటిని పోషించాలి. ఆ తర్వాతే గొర్రెల సంతానంలోనుంచి పొట్టేలు పిల్లలను మాత్రమే అమ్ముకోవచ్చు. గొ ర్రెలను అమ్మే సందర్భంలో తప్పనిసరిగా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం సర్కారు గొర్రెలను సబ్సిడీపై పంపిణీ చేసింది. రెండేళ్ల వరకు వాటిని అమ్మడానికి వీలులేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గొర్రెలను అమ్మడానికి యత్నిస్తే చర్యలు తప్పవు. సబ్సిడీ గొర్రెల అమ్మకాలను నిరోధించేందుకు జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం. సబ్సిడీ గొర్రెలు విక్రయిస్తే గొర్రెలను, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ రమేశ్కుమార్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి -
మే.. మే కాదు.. యుఆర్ అండర్ అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) పోలీసుల నిర్వాకం ‘పత్తి చేనును మేసిన మేకలను పోలీసులు అరెస్టు చేశారు..‘మేకలు అరెస్టు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన రంగ స్వామి పత్తి చేనులో మంగళవారం మూడు మేకలు మేశాయి. దీంతో ఆ రైతు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మూడు మేకలను పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు.వాటిని తీసుకొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు స్టేషన్లో కట్టేశారు. ఆ తర్వాత మేకల యజమాని రావడంతో మాట్లాడి వదిలి పెట్టారు. ఎన్నో ముఖ్యమైన కేసుల్ని అసలే పట్టించుకోని పోలీసులు.. చేను మేసినట్లు ఈ మేకలపై ఫిర్యాదు రాగానే పట్టుకొని స్టేషన్లో కట్టివేయడంపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. – ఆత్మకూరు–ఎం (ఆలేరు) -
ఎంపీ గారి మేకలు దొరికాయ్!
భోపాల్ : తమ తోటలోని మేకల్ని దొంగలు ఎత్తుకెళ్లారని ఓ ఎంపీ సోదరుడు ఫిర్యాదు చేయడం ఆలస్యం.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో తప్పిపోయిన మేకల్ని స్వాధీనం చేసుకుని స్వామిభక్తిని చాటుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని విదిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ చౌధురీ మునవ్వర్ సలీం తోటలోని 23 మేకల్ని ఎవరో దొంగలించారు. దీంతో ఎంపీ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. చివరికి 17 మేకల్ని స్వాధీనం చేసుకున్నారు. ముర్వా గ్రామ సమీపంలోని అడవిలో ఈ మేకల్ని కనుగొన్నామని.. మూడు మేకలు కుక్కల దాడిలో చనిపోయాయని స్టేషన్ ఇన్చార్జ్ హెచ్ఎస్ రావత్ తెలిపారు. ఇంకా కనిపించని మూడుమేకల్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని మీడియాకు తెలిపారు. గ్రామస్తులు గమనించడంతో దొంగలు మేకల్ని వదిలి పరారై ఉంటారని రావత్ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఎంపీ పోలీసుల్ని అభినందించారు. అపహరణకు గురైన మేకలు అల్వారీ జాతికి చెందినవని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా ఎస్పీ సీనియర్ నేత, యూపీ మంత్రి అజామ్ ఖాన్కు చెందిన 7 గేదెలు తప్పిపోవడంతో పోలీసులు ఈ స్థాయిలోనే స్పందించారు. డాగ్ స్క్వాడ్తో పాటు క్రైమ్ బ్రాంచ్, సాధరణ పోలీసులు కలిసి చివరికి ఎలాగోలా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల అత్యుత్సాహంపై పలు విమర్ళలు చెలరేగాయి. -
కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లల మృతి
ఎల్.ఎన్.పేట: మండలంలోని కృష్ణాపురం, సుమంతాపురం గ్రామాల్లో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 30 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గొర్రెల కాపలాదారులు స్థానిక విలేకర్లకు చెప్పారు. ఇంటి వద్ద కంచె ఏర్పాటు చేసి ఆ కంచెలో నెల రోజుల నుంచి రెండు నెలలు వయసున్న పిల్లలను ఉంచామని, గొర్రెల మందను మేతకు తీసుకుని వెళ్లిపోయామని తెలిపారు. ఇంతలోనే వీధుల్లో ఉన్న కుక్కలు కంచె దాటుకుని వెళ్లి పిల్లలపై దాడి చేసి కరిచాయని పేర్కొన్నారు. గ్రామస్తులు వెంబడించినా ఫలితం లేకుండా పోయిందని గొర్రెల కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి సిమ్మన్నకు చెందిన ఆరు, ముద్ద అప్పన్నకు చెందిన పది, దాసరి పోలోడుకు చెందిన నాలుగు, సుమంతాపురం గ్రామానికి చెందిన తాడిన అప్పయ్య, వంజరాపు సోమేష్లకు చెందిన పది గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మరణించాయని తెలిపారు. -
ఇదో లోకం!
ఫొటో తీయడం కోసం మేకల్ని చెట్టు మీద పెట్టారా లేక ఫొటోషాప్లో ఇలా క్రియేట్ చేశారా అని అనుమానం వస్తోంది కదూ! అవి రెండూ కాదు. నిజంగానే మేకలు చెట్టు మీదికెక్కి ఆకులు తింటున్నాయి. మొరాకోలోని కొన్ని ప్రాంతాల్లో అర్గాన్ అనే చెట్లు పెరుగుతాయి. సంవత్సరమంతా కాసే ఈ చెట్టు పండ్లు, ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. చాలా రుచిగా కూడా ఉంటాయట. దాంతో మేకలు ఇలా చెట్లు ఎక్కి మరీ మేస్తుంటాయన్నమాట! అర్మేనియా దేశంలోని స్కూళ్లలో ఆరేళ్ల వయసు నుంచే పిల్లలకు చెస్ ఆడటం నేర్పిస్తారు. అది అక్కడ మ్యాన్డేటరీ. చెస్ నేర్పించడం వల్ల పిల్లల మెదళ్లు బాగా పదునెక్కుతాయని వాళ్ల ఉద్దేశం, నమ్మకం. యూకేకి చెందిన ఈ అంద మైన భామల పేర్లు లూసీ, మారియా. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. పైగా కవలలు. అలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఎలా నమ్ముతారు? ఎక్కడైనా ఒక్క పోలిక ఉంటే కదా! వీళ్లు ఇలా ఎలా పుట్టారో మాకే అర్థం కావడం లేదు అంటుం టారు వాళ్ల తల్లిదండ్రులు. ప్రపంచం మొత్తంలో ఏమాత్రం పోలిక లేని ట్విన్స్ వీళ్లిద్దరేనట! తెల్లని గౌను, మెడలో పూసల దండ, చేతిలో చాకు, ఎదురుగా కేకు... దీని స్టైల్ చూశారా? క్రిస్టల్ అనే ఈ కోతిగారు పెద్ద సెలెబ్రిటీ. అందుకే అంత ఫోజు మరి. సినిమాలకు జంతువుల్ని సప్లై చేసే ఓ కంపెనీ దీనికి నటనలో తర్ఫీదునిచ్చింది. మన క్రిస్టల్గారు సహజ నటి కావడంతో బాగా ఫేమస్ అయిపోయారు. పాతిక పైగా సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాల్లో నటించి ‘లైఫ్ టైమ్ దివా అచీవ్మెంట్’ అవార్డు కూడా అందుకున్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోయే ఇది! మామూలుగా జూలో జంతువులు బోనుల్లో ఉంటాయి. సందర్శకులు వెళ్లి వాటిని చూస్తుంటారు. కానీ చైనాలోని లెహె లెడూ వైల్డ్ లైఫ్ జూలో అంతా రివర్స్. సందర్శకులను వాహనాలకు అమర్చిన బోనుల్లో బంధించి జూ అంతా తిప్పుతారు. జంతువులేమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలా! బ్రిటన్లోని సమ్మర్హిల్ స్కూల్లో ఉన్నంత స్వేచ్ఛ మరే స్కూల్లోనూ ఉండదు. అక్కడ చదివే పిల్లలు తమకు ఆసక్తి ఉన్నప్పుడే పాఠాలు వినొచ్చు. లేదంటే డ్రామానో, సినిమానో చూడొచ్చు. మ్యూజిక్, పెయింటింగ్ ఇంకేదైనా నేర్చుకోవచ్చు. తమకు నచ్చిన పని చేయొచ్చు. అదంతా కూడా ఎడ్యుకేషనే అంటుంది స్కూల్ యాజమాన్యం. లండన్లోని హాంకీ టాంక్ రెస్టారెంట్లో పనిచేసే క్రిస్ అనే చెఫ్ ఓ బర్గర్ను తయారు చేశాడు. దాని పేరు గ్లామ్బర్గర్. నాణ్యమైన బీఫ్, ఖరీదైన బటర్, ప్రత్యేకంగా పండించిన మిర్చి, రకరకాల సాస్లతో అతడు తయారు చేసిన ఈ బర్గర్ బాగా ఫేమస్ అయ్యింది. దాంతో రేటు చుక్కలను చేరింది. దీని ఖరీదెంతో తెలుసా... 1100 పౌండ్లు. అంటే మన కరెన్సీలో తొంభై ఆరు వేల పైనే. కనిపించాయి కదా చుక్కలు!!! హ్యారీపాటర్ చిత్రాల హీరో డ్యానియెల్ రెడ్క్లిఫ్కి ఓసారి మీడియా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా వెంటపడి ఫొటోలు తీయడంతో విసుగొచ్చి, ఓ ఆరు నెలల పాటు ఎక్కడికి వెళ్లినా ఒకే డ్రెస్ వేసుకుని వెళ్లాడు. కొత్త ఫొటో ఇవ్వ కుండా మీడియాని విసిగించాలని! డిస్నీ వాళ్లు ‘ప్రిన్సెస్ అండ్ ఫ్రాగ్’ పేరుతో ఓ యాని మేషన్ చిత్రం తీశారు. ఇది సూపర్హిట్ అయ్యింది. దీని ప్రభావం పిల్లల మీద ఎంతగా పడిందంటే... ఆ చిత్రంలోని హీరోయిన్ మాదిరిగానే కప్పలను ముద్దాడదామని ప్రయత్నించి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బారిన పడి యాభై మందికి పైగా చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారట! జపాన్లోకి ఒకినావా దీవిలో వందేళ్ల వయసు దాటినవాళ్లు 450 మంది వరకూ ఉన్నారు. అక్కడి వాతావరణం, ఆహారపుటలవాట్ల వల్ల ఇలా ఎక్కువకాలం జీవిస్తున్నారట. అందుకే ఈ దీవిని ‘హెల్దీయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్’ అంటారు. రోమ్లో ‘ద ఆపియన్ వే’ అనే రోడ్డు ఉంది. ఇది అత్యంత పురాతనమైనది. క్రీస్తు శకం 312లో వేశారట. ఇప్పటికీ ప్రజలు దీన్ని వాడుతున్నారు. -
మేకల సంతలో రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు
నవీపేట : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన నవీపేట మండల కేంద్రంలోని మేకల సంతలో శనివారం రూ. కోటిన్నరకు పైగా క్రయవిక్రయాలు జరిగాయి. నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించే ఊర పండగ, వివిధ గ్రామాలలో వన భోజనాల నేపథ్యంలో ఒక్కసారిగా మేకల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. నిజామాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో సరిహద్దు గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని జాల్నా, ముద్ఖేడ్, నాందేడ్, ధర్మాబాద్, పర్భణీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఒక రోజు ముందురాత్రి వాహనాలలో మేకలను తీసుకువచ్చి బేరసారాలు ప్రారంభించారు. వచ్చే నెలలో శ్రావణ మాసం ఉండడంతో ఇంట్లో జరిగే శుభకార్యాల (మాంసాహార విందు)ను ఈ వారంలో నిర్వహించనున్నారు. దూర ప్రాంతాలకు మేకలను తీసుకుని వెళ్లే వారు ఆటోట్రాలీ వాలాలు అడిగినంత ఇచ్చుకోకతప్పలేదు. సంత ఆవరణలో స్థలం సరిపోక బస్టాండ్, ప్రభుత్వ పాఠశాలల ముందు మేకలను తీసుకుని వచ్చిన వాహనాలను నిలిపారు. ఆలస్యంగా వచ్చిన వ్యాపారులు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరిపారు.దీంతో బాసర రోడ్డుపై ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. -
బాచన్పల్లి శివారులో చిరుతల సంచారం
భీమ్గల్ : భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి శివారులో చిరుత పులుల సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ శివారులోని కోటప్పకొండ సమీపంలో రెండు రోజుల క్రితం చిరుతలు మేకల మందపై దాడి చేసి 8 మేకలను చంపివేశాయి. గ్రామానికి చెందిన కటికె కిషన్ మేకలను మేపడానికి మందను తోలుకుని గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అడవిలో మేకల మందను వదిలాడు. ఇదే సమయంలో చిరుతపులి మేకల మందపై దాడి చేసి మేకను నోట కరిచింది. దీన్ని చూసిన మేకల కాపరి దాన్ని తరిమేసేందుకు వెళ్తుండగా మరో చిరుత మేకల మందపైకి వస్తూ కంట పడింది. దీంతో అతను సమీపంలోకి దాక్కున్నానని తెలిపాడు. రెండుచిరుతలు ఒకదాని వెనుక మరొకటి మేకలను నోట కరుచుకుని సమీపంలోని రాతి గుహల్లోకి వెళ్లాయన్నారు. మరుసటి రోజు వెళ్లి చూడగా గుహలో 8 మేకల కళేబరాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని అతను గ్రామస్తులకు తెలిపాడు. దీంతో సమీపంలోని పంట పొలాల రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. -
హై'రా'నా
ఇన్నాళ్లు గజరాజులతో కష్టాలు పడుతున్న పలమనేరు, కుప్పం ప్రాంత వాసులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. కౌండిన్య అడవిలో ఇటీవల నుంచి హైనాల దాటికి పలు మేకలు, గొర్రె పిల్లలు దూడలు మృత్యువాత పడుతున్నాయి. అడవికి ఆనుకుని పశువులను, మేకలను తోలుకెళ్లే కాపరులు ఆందోళన చెందుతున్నారు. నెలరోజులుగా ఈ ప్రాంతంలో దాదాపు 40 దాకా మేకలు, గొర్రెలు, దూడలను హైనాలు పొట్టనబెట్టుకున్నాయి. అయితే ఇది పులి పనే అని స్థానికులు వాపోతున్నారు. కాదు పులిలాగా చారలు కలిగిన హైనా అనే జంతువని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. * మాయమవుతున్న మేకలు, గొర్రెలు * ఇది పులి పనేనని జనానికి గిలి * హైనా పులిని పోలి ఉంటుందంటున్న అటవీశాఖ * ఆందోళన చెందుతున్న పశువులు, మేకల కాపరులు పలమనేరు రూరల్: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో అటవీ సమీప ప్రాంతవాసులు హైనా(దొమ్మలగొండి)తో హైరానా పడుతున్నారు. మేకలు, గొర్రెలు, పశువులను మేతకు తోలుకెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా పలమనేరు రేంజ్ పరిధిలోని నెల్లిపట్ల, బాపలనత్తం, వెగంవారిపల్లె, కడతట్లపల్లె, కుప్పనపల్లె, దేవదొడ్డి, కైగల్, కస్తూరినగరం, చింతమాకులపల్లె, పలమనేరు మండలంలోని కాలువపల్లె, మండీపేట కోటూరు, జగమర్ల తదితర అటవీ సమీప గ్రామాలకు చెందిన వారి జీవాలు అదృశ్యమవుతున్నాయి. సాయంత్రం మందలను గమనిస్తేగానీ విషయం బయటపడడం లేదు. దీంతో కాపరులు అడవిలోకి వెళ్లి పరిశీలిస్తే పశువుల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. హైనాల బారినుంచి తమ జీవాలను కాపాడాలని జనం కోరుతున్నారు. బెరైడ్డిపల్లె, వీకోట మండలాల్లో ఇప్పటివరకు వీటి బారిన పడి మృతి చెందిన మేకలు, దూడల మృతదేహాలను అటవీశాఖ పరిశీలించి ఇది హైనాల పనేనని తేల్చారు. ఎందుకంటే పులి అయితే జంతువు మాంసం కూడా తినేస్తుందని హైనాలు గొంతును కొరికి కేవలం రక్తం, మెత్తని భాగాలను మాత్రమే తింటాయని చెబుతున్నారు. ఇవి పులి కంటే కాస్త తక్కువ ఎత్తు కలిగి, చారలు కలిగి ఉంటాయని, దూరం నుంచి చూస్తే పులిలాగానే కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కడైతే ఏనుగుల సంచారం ఉంటుందో ఆ అడవుల్లో పులులు ఉండవని చెబుతున్నారు. తమిళనాడు అడవుల నుంచి వచ్చినట్టున్నాయి కౌండిన్య అడవిలో హైనాల కారణంగా పలు దూడలు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడుతున్న విషయం వాస్తవమే. మేం కూడా అడవిలో ట్రాకర్స్ ద్వారా వాచ్ చేయిస్తున్నాం. ప్రజలు పులి అనుకుంటున్నారు ఇది ఒట్టిమాటే. అయితే ఇది చూసేందుకు పులిలాగా చారలు కలిగి ఉంటుంది. గతంలో ఇక్కడ హైనాల సంతతి తక్కువగానే ఉండేది. ప్రస్తుతం సంచరిస్తున్న పెద్ద హైనాలు తమిళనాడు అడవి నుంచి వచ్చాయి. - శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు ఫారెస్ట్ రేంజ్ అడవిలోకి వెళ్లాలంటే భయమేస్తోంది అడవికెళ్లిన పశువులు, దూడలు, మేకలు మాయమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. కొందరు మాత్రం పులి అయి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ దెబ్బతో మేమంతా అడవిలోకి పశువులను కూడా తోలడం లేదు. - బాబునాయుడు, ఊసరపెంట, పలమనేరు -
గూగుల్లో గడ్డి కత్తిరించడానికి మేకలు
-
నిప్పంటించడంతో 80 మేకలు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 80 మేకలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం సి.వడ్డెపల్లిలో ఆదివారం జరిగింది. గంగమ్మ అనే మహిళ మేకల పెంపకంతో జీవనం సాగిస్తోంది. సుమారు 80 మేకలు ఇంటి దగ్గర కొట్టంలో ఉండగా.. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలకు 80 మేకలు మృతి చెందాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్ఐ ప్రభాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లిటినట్టు బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాహారం తిని మేకలు మృతి
ఏటూరునాగారం: వరంగల్ జిల్లాలో విషాహారం తిని 20 మేకలు మృతి చెందాయి. ఈఘటన ఏటూరునాగారం మండలం కంతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు తన వరి పంటను పందులు నాశనం చేస్తున్నాయని పొలం వద్ద విష గుళికలు పెట్టాడు. వాటిని పొరపాటున మేకలు తినడంతో మృతిచెందాయి. నష్టపరిహారం చెల్లించాలని మేకల యజమానులు కేసు పెట్టడానికి సిద్ధమైయ్యారు. -
పిడుగుపాటుకి ఇద్దరి మృతి
ఆదివారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన ఆదె కమలాకర్ (23) ఆదివారం మధ్యాహ్నం పిడుగు పాటుకు గురై మరణించాడు. మధ్యాహ్నం పొలంనుంచి ఇంటికి వస్తుండగా అతనిపై పిడుగుపడింది. దాంతో కమలాకర్ అక్కడేకక్కడే మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం తేంగల్ గ్రామానికి చెందిన రాణి పిడుగు పాటుకు గురై మృతి చెందింది. మధ్యాహ్నం అత్తాకోడళ్లు.. సాయమ్మ, రాణి పొలంలో పనిచేస్తుండగా.. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారు సమీపంలోని చెట్టుకిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో.. రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సాయమ్మ తీవ్రంగా గాయపడింది. ఇరుగు పొరుగు రైతులు సాయమ్మను భీంగల్ ఆస్పత్రికి తరలించారు. మరో వైపు నల్లగొండ జిల్లా దేవర కొండ మండలం ఎర్రభాగ్య తాండా వద్ద పిడుగు పడి 12 మేకలు మృతిచెందాయి. -
కల్లు తాగుతున్న మేకలు
-
బక్రీద్ కా బకరా ఆన్లైన్లో..
'ఈద్ కేలియే బకరే లేకే జావో.. యే దేఖో.. జబ్బర్ధస్త్ ఐటమ్.. ఔర్ వో.. ఏక్ దమ్ ఝకాస్..' అంటూ ఆన్లైన్లో అరుపులు హోరెత్తుతున్నాయి. మీరింకా విన్లేదా.. అయితే ఒక్కొసారి ఓఎల్ఎక్స్ లేదా క్విక్కర్ర్ ర్ర్ర్ర్ ద్వారాలు తెరిచి బకరా కావాలనే బటన్ నొక్కండి. ఒకటే 'మే.. మే..' అరుపులు! ఏటా ముస్లింలు ఘనంగా నిర్వహించుకునే బక్రీద్ వేడుకలో మేకలు, ఇతర జంతువులదే ప్రాధాన్యం. జాతి, రంగు, కండపుష్టినిబట్టి ఒక్కోసారి జంతువును భారీ ధరలకూ కొనుగోలు చేస్తారు. చాన్నాళ్లుగా సంతల్లో మాత్రమే సాగిన పశువుల అమ్మకాలు ఒకటిరెండేళ్ల నుంచి ఆన్ లైన్లోనూ ఊపందుకున్నాయి. ఈ నెల 25న బక్రీద్ పండుగ ఉండటంతో అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. నగరాల జాబితాలోకి ప్రవేశించగానే స్థానిక రైతులు లేదా వ్యాపారులు తమ దగ్గరున్న మేకల ఫొటోలతో పాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని బేరానికి దిగొచ్చు. ఇంకొద్దిమందైతే.. 'ముందు మా దగ్గరికొచ్చి మేకల్ని చూడండి.. ఆ తర్వాతే కొనండి' లాంటి ఆఫర్ ను కూడా ప్రకటిస్తున్నారు. -
కుక్కల దాడి : మేకలు మృతి
ఆదిలాబాద్ : కుక్కలు ఓ మేకల గుంపుపై ఆకస్మిక దాడి చేశాయి. ఈ దాడిలో 16 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కామోలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగరి దేవన్న ఇంటి దగ్గర పాకలోని మేకలపై ఆరు కుక్కలు దాడి చేసి కరిచాయి. ఆ విషయాన్ని గమనించిన యజమాని కుటుంబ సభ్యులు కర్రలతో రాగా... ఆ కుక్కుల అక్కడి నుంచి పారిపోయాయి. ఈ దాడిలో మేకలు మరణించాయని యజమాని వెల్లడించారు. -
మేకలను మింగిన ఖాకీలు
-
పోలీసులే దొంగలుగా మారారు...
-
పోలీసులే దొంగలుగా మారారు...
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు దొంగలుగా మారారు. మేతకోసం వచ్చిన మేకలను ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. వీరి నిర్వాకంతో కంగుతిన్న మేకల యజమాని వేరే గత్యంతరం లేక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిజంగానే పోలీసులు మేకలు అమ్మకున్నారని తెలిసింది. ఈ విషయం బయటకు తెలిసి జనాలు ఫక్కుమని నవ్వుతున్నారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ఊరి మధ్యలో ఉంది. ఇదే గ్రామానికి చెందిన రాపర్తి జయమ్మకు భర్త లేడు. కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమెకు నాలుగు మేకలున్నాయి. హరితహారంలో భాగంగా పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మేకలు పోలీస్స్టేషన్ ఆవరణలోకి రావడంతో పోలీసులు వాటిని బంధించారు. జయమ్మ పోలీస్స్టేషన్కు రావడంతో మేకలను ఇటువైపు రాకుండా చూడాలని హెచ్చరించి వదిలేశారు. మళ్లీ 15 రోజులకు మేకలు వచ్చాయి. నాలుగు మేకలను బంధించిన పోలీసులు ఆ వెంటనే రూ.20వేలకు విక్రయించారు. దీంతో సదరు మహిళ ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా పోలీసు అధికారులు రహస్యంగా విచారణ జరిపారు. విచారణలో నిగ్గు తేలిన నిజాలు.. భువనగిరి సబ్డివిజన్ పోలీసు అధికారులు గత మూడు రోజులుగా మేకల విక్రయంపై విచారణ జరుపుతున్నారు. సదరు మహిళను పిలిచి విచారించారు. మేకలను పోలీసులే అమ్మినట్టు తేలింది. పోలీసు ఉన్నతాధికారులకు విషయం చేరడంతో, ఆమెకు స్థానిక పోలీసులు మేకలను అమ్మగా వచ్చిన డబ్బును అందజేశారు. ఈమె ఈ డబ్బులను విచారణకు వచ్చిన పోలీసు అధికారికి అప్పగించినట్టు తెలిసింది. -
మత్తులో మమేకమై...
చదివింత... ‘‘ఆహా ఏమి రుచి... తాగమా మైమరచి’’ అంటూ లొట్టలేసిన మేకలు... ‘‘సేవించితిమి అమృతము...ఇక మత్తులోన జోగెదము’’ అంటూ నిద్రలోకి జారిపోయాయి. అహ్మదాబాద్, మెహసానా జిల్లాలో ఉన్న ఖేరాలు పట్టణంలో నివసించే రమేష్ పాట్ని పశువుల కాపరి. తన మేకల్ని మేపేందుకని ఖాళీ స్థలంలో వాటిని వదిలేశాడు. తిరిగి వచ్చి చూసుకుంటే... సదరు మేకలన్నీ అక్కడే పడి నిద్రపోతూ కనిపించాయి. ఎంత లేపినా లేవని వాటి దగ్గర గుప్పుమంటూ మద్యం వాసన! బెంబేలెత్తిన రమేష్.. మేకలకి మందు తాగించి ఎవరో ఏదో చేయబోయారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంతా చేస్తే... సదరు ఘనకార్యం పోలీసులదేనని తేలింది. స్థానికంగా రైడ్స్లో పట్టుకున్న మద్యం సీసాలను అక్కడకు తెచ్చి పడేసిన పోలీసులు రోడ్డురోలరుతో వాటిని ద్వంసం చేశారు, అక్కడక్కడా ధ్వంసం కాకుండా మిగిలిన, పగిలిన సీసాలలోని మందును మేకలు శుభ్రంగా హాంఫట్ అనిపించాయి. ‘‘ఆ మద్యం వాటికి రుచిగా అనిపించినట్లుంది. అందుకే అలా చేశాయేమో’’ అంటున్నాడు రమేష్. దాదాపు రోజంతా అలాగే బజ్జున్న మేకల కోసం... ‘‘మీ మంద ఎక్కువైనా ఈ మజ్జిగ పలచనయ్యేనా’’ అంటూ మత్తుకి విరుగుడుగా బటర్మిల్క్ తాగిస్తూ మేల్కొలుపుతున్నాడట రమేష్. సత్యవర్షి -
ఒక ఊరి చిత్రం
ఈ రోజుల్లో మొబైల్ఫోన్ లేని ఊరుందా? ఇంజక్షన్ అంటే తెలియని ప్రజలున్నారా? ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ ఇంకా అలాంటి గ్రామాలేంటి అంటారా?.. కానీ, అటువంటి గ్రామం ఉంది. అక్కడి ప్రజలకు మందులు తెలియవు. స్కూల్ మాట దేవుడెరుగు.. ఆ ఊరికి విద్యుత్తే లేదు. చుట్టూ గుట్టలు, లోయలు. కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం. మేనిని తాకుతూ వెళ్లే మేఘాలు. స్వచ్ఛమైన నీటితో ఉరకలెత్తే సుఫిన్ నది. ఆత్మీయత నిండిన మనసులు. శ్రమే దైవంగా బతికే మనుషులు ఆ ఊరి సొంతం. ఆ గ్రామం పేరు కలాప్. ఆ అందాలను తన కెమెరాలో బంధించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఆనంద్శంకర్. ..:: శ్రావణ్ జయ అబ్బురపరిచే ప్రకృతి ఉత్తరాఖండ్ జిల్లాలోని ఉత్తర కాశీలో ఉన్న కలాప్ సొంతం. 450 జనాభా ఉన్న ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామస్తులకు ఆదాయమార్గం అంటే మేకలు, గొర్రెల పెంపకమే. ఆ ఊరికి హస్పిటల్, స్కూల్, కరెంటు వంటివేవీ లేవు. వాటి గురించి అక్కడ ప్రజలకూ తెలియదు. రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అసలే లేవు. ప్రభుత్వం అంటేనే తెలియదు అక్కడి ప్రజలకు. అలాంటివారిలో చైతన్యం కల్పించి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నాడు ఆనంద్ శంకర్. బిజినెస్ స్టాండర్డ్లో జర్నలిస్ట్ వృత్తికి స్వస్తి చెప్పి, సొంతూరు బెంగళూరును వదిలి కలాప్లోనే నివాసముంటున్నాడు. ఆ ప్రజల జాగృతి కోసం ‘కలాప్ ట్రస్ట్’ను ప్రారంభించాడు. అక్కడి అందాలను కెమెరాల్లో బంధించి, ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటీవల నగరంలోని లామకాన్లో ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉద్దేశం ఆయన మాట ల్లోనే... ‘చుట్టూ ప్రకృతి సోయగం ఎంత ఉన్నా ఆ ఊరును ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం ప్రచారం లేకపోవడమే. ప్రభుత్వం, ప్రైవే టు సంస్థలు కలాప్ను సందర్శించిన దాఖలాల్లేవు. నేను 2013లో ఆ ఊరికి వెళ్లాను. గొర్రెలు, మేకల పెంపకం తప్ప ఆ గ్రామానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కలాప్ ప్రజల భాష కూడా మౌఖికమే తప్ప లిఖిత పూర్వకమైనది కాదు. స్వతహాగా ఫోటోగ్రాఫర్నైన నేను అక్కడి ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యాను. అప్పుడే ఫొటోల ద్వారా ఆ ఊరికి ప్రచారం కల్పించాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం అక్కడి అందమైన లొకేషన్లను ఫొటోల్లో బంధించి వాటిని కలాప్ ట్రస్ట్ దార్వా విక్రయించి, వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నా. అక్కడి ఇళ్లు చూస్తే అక్కడి ఆర్కిటెక్చర్ ఎంత సంపన్నమైనదో తెలుస్తుంది. అందుకే వారికి ఇతర చేతి వృత్తులను నేర్పిస్తున్నాను. 2014 అక్టోబర్లో అక్కడ తొలిసారిగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఎక్కువమంది విటమిన్ బీ12 లోపం, ఎనీమియాతో బాధపడుతున్నారు. కలాప్ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా... నా ఫొటోల ప్రచారంతో ఆ ఊరికి యాత్రికులు, పర్వతారోహకులు కచ్చితంగా వస్తారు. టూరిజం అభివృద్ధి అవుతుంది. అందమైన ప్రకృతికి నిలయమైన కలాప్లో షూటింగ్ స్పాట్స్కి కొదవ లేదు. సినిమా వాళ్లు కూడా రావడం వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అనుకుంటున్నా’. ట్రెక్కింగ్కి అనుకూలం... శీతాకాలంలో 3 నుంచి ఐదడుగుల మేర మంచుతో కప్పి ఉండే కలాప్ డెహ్రడూన్కి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిల్లీకి 450 కిలోమీటర్ల దూరం. కలాప్ సమీపంలోని నెట్వార్కి కారులో వెళ్లడానికి 6 గంటలు, బస్సులోనైతే పది గంటలు పడుతుంది. ట్రెక్కింగ్కి రెండు మార్గాలున్నాయి. వేసవి కాలం మార్గంలో 8 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు పడుతుంది. శీతాకాలం మార్గంలో 5 కిలోమీటర్లు నడిచేందుకు 4 గంటల సమయం పడుతుంది. -
బాబోయ్.. మళ్లీ పులి
సంగారెడ్డి రూరల్: మళ్లీ పులి కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఆందోళన కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ శివారులోని మేకల ఫామ్హౌస్లో దూరేందుకు శనివారం రాత్రి ప్రయత్నించింది. అకస్మాత్తుగా రాత్రివేళ కుక్కలు అరువడం, మేకలు చెల్లాచెదురుకావటంతో ఫామ్హౌస్లో పనిచే సే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందని పెద్దలైట్లతో వెతకగా ఎదురుగా ఒక పెద్ద పులి, మరో రెండు చిన్న పులి పిల్లలు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన ఫామ్హౌస్ నిర్వాహకుడు చంద్రశేఖర్ యాదవ్ మిగతా సిబ్బందితో కలిసి రేకులతో పెద్దపెట్టున చప్పుళ్లు చేయటంతోపాటు మంటలు వేయడంతో పులులు భయపడి పారిపోయాయి. ఆదివారం ఉదయమే ఈ విషయాన్ని ఫామ్హౌస్ యజమాని నరహరిరెడ్డి అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అటవీ శాఖ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంద్రకరణ్ శివారులోని నరహరిరెడ్డి ఫామ్హౌస్కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు కలియ తిరిగిన అటవీశాఖ అధికారులు ఫామ్హౌస్ పక్కనే ఉన్న చిమ్నాపురం మల్లారెడ్డి చెరకు తోటలో పులి అడుగుజాడలు గుర్తించారు. పెద్ద పులితోపాటు చిన్న పులిపిల్లల అడుగుజాడలు పసిగట్టిన వారు నమూనాలను సేకరించారు. పులి అడుగుజాడలు ఉన్న నేపథ్యంలో ఇంద్రకరణ్ పరిసర ప్రాంతాల్లో మూడు పులులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. పులులను బంధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సంఘటనా స్థలానికి వచ్చిన అటవీశాఖ అధికారి అనురాధ తెలిపారు. పులులను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణమూర్తి ఇంద్రకరణ్ శివారులో పర్యటించి పులుల సంచారం గురించి వివరాలు సేకరించి తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేస్తారని చెప్పారు. పులి అడుగుజాడలు ఉన్న ప్రాంతానికి వచ్చిన సంగారెడ్డి తహశీల్దార్ గోవర్ధన్ పులి సంచారం విషయమై అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పులుల సంచారం నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వెళ్లవద్దని, పొలాల్లో సంచరించొద్దని కోరారు. రైతులు, ప్రజలు భయాందోళనకు గురికావద్దని పులులను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలా ఉంటే పదిహేను రోజుల క్రితం సంగారెడ్డి మండలంలోని కలివేముల శివారులో కనిపించి మాయమైన పులి మళ్లీ రావటంతో గ్రామాల్లోని ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పదిహేను రోజుల క్రితం కలివేముల గ్రామంలో పులి కనిపించటంతో ప్రజలు విషయాన్ని కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ రాహుల్ బొజ్జా అటవీశాఖ అధికారులను రప్పించి పులిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేయించారు. అయి తే పులి బోనుకు చిక్కలేదు. దీంతో రైతులకు కనిపించిన పులి ఎక్కడికో వెళ్లిపో యి ఉంటుందని అటవీశాఖ అధికారు లు భావించారు. అయితే నాడు ఒక్క పు లి ఉందని రైతులు చెబితే నేడు మూడు పులులు ఉన్నట్లు నిర్ధారణ కావటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే పులులను బంధించాలని కోరుతున్నారు. భయసింది: చంద్రశేఖర్ యాదవ్ అర్ధరాత్రి వేళ ఒకటి కాదు మూడు పులు లు కనబడటంతో భయపడ్డానని ఫామ్హౌస్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ యాదవ్ తెలిపారు. అర్ధరాత్రి వేళ మేకలు, కుక్కలు అరవటంతో నిద్రలో నుంచి మేల్కొని బయటకు రాగా ఫెన్సింగ్ వద్ద పులులు అరుస్తూ కనబడ్డాయన్నారు. దీంతో అప్రమత్తమై లైట్లు కట్టివేసి తమ సిబ్బందితో కలిసి రేకులు గట్టిగా కొడు తూ చప్పుడు చేయటంతో భయపడి పారిపోయాయన్నారు. తమ ఫామ్హౌస్ చుట్టూ పులులు సంచరిస్తుం డడంతో కొంత భయంగా ఉందన్నారు. -
జీవాలతో జీవానోపాధి
నిజామాబాద్ వ్యవసాయం:నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన బైర సుభాష్ ఉన్నత చదువులు చదివారు. ఉపాధి కోసం హైదరబాద్తో పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అలా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయన ఓ గోట్ డెయిరీని చూశారు. బర్రెలు, ఆవుల డెయిరీల గురించే తెలిసిన ఆయన దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ దేశంలో పాల కోసం మేకలను పెంచుతారు. అయితే మనదేశంలో మేకలు, గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించారు. అలా సుభాష్ స్వదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్ల క్రితం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో సుమారు 25ఎకరాల్లో గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటికి కావల్సిన దాణాను సైతం స్వయంగా సమకూర్చుకుంటున్నారు. పెట్టుబడి గొర్రెల పెంపకం కేంద్రానికి కావల్సిన పెట్టుబడి, ఖర్చులు, ఆదాయం వివరాలను సుభాష్ వివరించారు. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవసరం ఉంటుంది. రూ.3లక్షలు పెడితే.. మిగితా రూ.9లక్షలు బ్యాంకు రుణం ఇస్తుంది. దీనికి రూ.రెండున్నర లక్షలు సబ్సిడీని జాతీయ పశుగణాభివృద్ధి సంస్థ(నేషనల్ లైవ్ స్టాక్మిషన్) ద్వారా వస్తుంది. ఏర్పాటు చేయడానికి స్థలం వంద ఆడ గొర్రెలు, ఐదు మగ గొర్రెలు(పొట్టేళ్లు) కలిపి ఒక యూనిట్ అంటారు. వీటికి మూడు ఎకరాల స్థలం కావాలి. ఇందులో రెండు ఎకరాల్లో గడ్డిజాతి పశుగ్రాసం, ఎకరంలో పప్పుజాతి పశుగ్రాసం పెంచాలి. ఖర్చు పెంపకం కేంద్రం నడపడానికి ఇద్దరు కార్మికులు అవసరం. వీరికి నెలకు రూ.6వేల చొప్పున ఇద్దరికి కలిపి రూ.12వేలు అవుతుంది. పశుగ్రాసం పెంపకం కోసం రూ.6వేలు, ఆరోగ్య సంబంధ టీకాలు, మందుల కోసం రూ.6వేలు, మిశ్రమ దాణా కోసం రూ.15వేలు. మొత్తం ఒక నెలకు రూ.39వేలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 8 నెలలకు మొత్తం రూ.3లక్షల 12వేలు ఖర్చు. లాభాలు పుట్టిన గొర్రె పిల్లలను 8 నెలలు పెంచాలి. ఈ 8 నెలల్లో దాదాపుగా 30 కిలోల బరువు పెరుగుతుంది. ఒక్కో కిలోకు రూ.250 చొప్పున 30కిలోలకు రూ.7500 వస్తాయి. వంద గొర్రెలను పెంచితే అందులో పదిశాతం మృతిచెందినా దాదాపు 81పిల్లలు ఉంటాయి. 8 నెలల తర్వాత అవి 30 కిలోల బరువు అవుతాయి. ఈలెక్కన 81 గొర్రెలకు 2,430 కిలోల మాంసం అవుతుంది. దీన్ని కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తే రూ. 6లక్షల 7వేల 5వందలు వస్తాయి. ఇందులో నుంచి పెట్టుబడి రూ.3లక్షల 12వేలు తీసివేస్తే.. రూ.2లక్షల 95వేల 5వందలు మిగులుతాయి. ఇది 8 నెలల ఆదాయం. -
‘షేడ్నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్నెట్ హౌస్తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్నెట్ మౌస్లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
-
క్లాస్ట్రీడియమ్వెల్షీ అనే బ్యాక్టీరియాతో జీవాలు మృతి చెందుతాయి..
కందుకూరు: చిటుకు రోగం (ఇ.టి)తో జీవాలు (గొర్రెలు, మేకలు) మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ వ్యాధి జీవాల పెంపకందారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతుంటారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు కందుకూరు పశువైద్యాధికారి రవిచంద్ర. వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలపై పెంపకందారులకు ఆయన సలహాలు, సూచనలు అందజేశారు. వ్యాధి ఇలా సంక్రమిస్తుంది.. చిటుకు రోగం క్లాస్ట్రీడియమ్వెల్షీ అనే బ్యాక్టీరియాతో తొలకరి వర్షాల తర్వాత పెరిగి వాడుపడిన గడ్డిని తినడంతో తరచూ జీవాలకు ఈ వ్యాధి జూన్ నుంచి జులై మధ్యలో ఎక్కువగా సంక్రమిస్తుంది. కాగా ఇటీవల జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవడంతో ప్రస్తుత వాతావరణం ఆ వ్యాధికి అనుకూలంగా మారింది. ఈ వ్యాధి వాడుపడ్డ గడ్డిని జీవాలు అతిగా తినడంతో వస్తుంది. లక్షణాలు... మందలో బలిష్టంగా ఉన్న గొర్రెలు, మేకలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. గొర్రె, మేక పిల్లలు రాత్రి బాగానే ఉండి ఉదయం చూసే సరికి మృత్యువాత పడతాయి. జీవాలు చనిపోయే ముందు నీరసంగా ఉండి అతి ఉద్రిక్తం చూపడం, నోటి నుంచి నురగలు కక్కుతుండటం, తూలుతూ నడవడం, పళ్లు కొరుకుతూ కనుగుడ్లు తిప్పుతూ గాలిలో ఎగిరి కింద పడి చనిపోతాయి. చనిపోయిన తర్వాత చూస్తే మూత్ర పిండాలు పాడయి కన్పిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కనిపిస్తాయి. నివారణే ప్రధానం ఈ వ్యాధి విషయంలో చికిత్స చేయించినా లాభం ఉండదు. చికిత్స కన్నా వ్యాధి నివారణే అతి ముఖ్యమైనది. ముందస్తుగా టీకా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. చాలా మంది తాపుడు మందు ఉంటుందని మందుల షాపుల నిర్వాహకులు ఇచ్చే దాన్ని తీసుకుని తాపిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. చిటుకు రోగం వస్తే కొద్ది గంటల్లోనే మృత్యువాత పడాల్సిందే. అవసరాన్ని బట్టి స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు, ఇంజక్షన్ల రూపంలో కాని లేదా నీటిలో కలిపి వాడితే వ్యాధిని తట్టుకున్న జీవాలు మాత్రమే కొన్ని సందర్భాల్లో చాలా అరుదుగా తేరుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో కంటే ముందే ఏప్రిల్, మే మాసాల్లో మందలోని అన్ని జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి ఈ వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటి వరకు టీకాలు వేయించని వారు తమ జీవాలకు వేయించుకుంటే మంచిది. -
పశువులు భద్రం
లక్సెట్టిపేట : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు సీజనల్గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సులభమని లక్సెట్టిపే పశు వైద్యాధికారి వీరయ్య వివరించారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పసక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధులు.. నివారణ.. గొంతు వాపు వ్యాధి : ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు వస్తాయి. నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. ఇతర పశువుల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి. గాలి కుంటు వ్యాధి : ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారడం జరుగుతుంది. నివారణ : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. దీనితో గాలికుంటు వ్యాధులను నివారించవచ్చు. గొర్రెలలో నీలినాలుక వ్యాధి : గ్రామాల్లో చాలామంది గొర్రెలను మేపుతూ వాటిపైనే జీవనోపాధి పొందుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చాలా ముఖ్యమైన వ్యాధి నీలినాలుక వ్యాధి. దీనినె మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి దోమకాటు వలన వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె మేత వేయడం మానేస్తాయి. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. నాలుక వాచి నీలి రంగుగా మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి. నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి. -
మేకకి జలుబు చేస్తుందా?!
జంతు ప్రపంచం * మేకపిల్లలకి గారమెక్కువ. తల్లి కాసేపు కనిపించకపోయినా కంగారు పడిపోతుంటాయి! * మేకలు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. పుట్టినప్పట్నుంచీ తమ కూతను వాటికి అలవాటు చేస్తాయి. ఎక్కడ ఉన్నా తల్లి కూతపెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి. * మేక పిల్లల్ని కిడ్స్ అంటారు. * వీటికి ఐక్యత చాలా ఎక్కువ. చుట్టూ ఉండే వాటితో స్నేహంగా మెలగుతాయి. దేనికి కష్టం వచ్చినా అన్నీ చుట్టూ చేరతాయి! * చెట్లెక్కి దూకడమంటే సరదా. * వీటికి కింది వరుసలో కొన్ని పళ్లు, దంతాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే దవడలు చాలా బలంగా ఉండటం వల్ల ఆహారం నమలడంలో ఇబ్బంది ఉండదు! * కొన్ని రకాల మేకలు అసలు నిద్రే పోవని పరిశోధనల్లో తేలింది! * మనుషుల్లాగే మేకలకు కూడా జలుబు చేస్తుంది. * మేకలు తమ శరీర బరువు కంటే ముప్ఫై శాతం ఎక్కువ బరువును మోసేంత బలంగా ఉంటాయి! * వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఏదైనా కొత్త పదార్థం కనిపిస్తే నోటిలో పెట్టుకుని చప్పరిస్తాయి. తినొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాతే ఆరగిస్తాయి! * మేకల్లో కొన్ని జాతుల వాటికి అకస్మాత్తుగా నాడీవ్యవస్థ దెబ్బ తింటుంది. కండరాలు, నరాలు పని చేయడం మానేస్తాయి. దాంతో ఇవి సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ మామూలవుతాయి. -
నట్టలతో జీవాలకు ఎంతో నష్టం
పాడి-పంట: గొర్రె లేదా మేక శరీరంపై దాడి చేసే అంతర పరాన్నజీవుల్లో ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు ప్రధానమైనవి. వీటివల్ల జీవాలకు పోషకాలు సరిగా అందక నీరసించి బక్కచిక్కిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటికీ సుమారు 95% జీవాలను విస్తృత లేదా సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఈ పద్ధతిలో జీవాలను బయళ్లు, అడవుల్లో తిప్పుతూ మేపుతుంటారు. అలా ఆరుబయట మేసే జీవాలకు తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య నట్టల తాకిడి. ఇవి ఆశించడం సహజమే అయినప్పటికీ జీవాల శరీరంలో వాటి సంఖ్య ఎక్కువైతే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. వీటివల్ల జీవాల పెంపకందారులు తమ ఆదాయంలో 30% వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఎంత మేపినా జీవాలు బలం పుంజుకోవడం లేదని పెంపకందారులు కలవరపడుతుంటారు. ‘బలం’ మందు పేరుతో నట్టల నివారణ మందును తాగిస్తూ సమస్యను తాత్కాలికంగా అధిగమిస్తుంటారు. వీటివల్లే నష్టం ఎక్కువ తీగ పురుగులు, పేగు పురుగులు, నల్ల పారుడు పురుగులు, కొరడా పురుగులు... ఇవన్నీ ఏలిక పాములు. జలగల్లో పొట్టి జలగలు, కార్జ్యపు జలగలు, రక్తపు జలగలు అనే రకాలు ఉంటాయి. వీటితో పాటు బద్దె పురుగులు కూడా జీవాలను ఆశించి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. ఏం జరుగుతుంది? జీవాల కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేవులు, జీర్ణాశయం, ఇతర అంతర్గత అవయవాల్లో నట్టలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి గొర్రెలు, మేకల్లోని పోషకాలను, రక్తాన్ని హరిస్తాయి. దీంతో జీవాలు రక్తహీనతకు గురవుతాయి. గొర్రెలు బరువు పెరగవు. ఎంత మేపినా చిక్కిపోతుంటాయి. మేత తినవు. పొట్ట లావుగా ఉంటుంది. దవడ కింద నీరు చేరుతుంది. విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజీర్ణం, అధిక దాహం, ముక్కు-నోటి నుంచి రక్తం కారడం, కడుపుబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. సాయంత్రం వేళ దవడ కింది భాగం వాస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. ఎలా నివారించాలి? నట్టల నివారణకు మందుల వాడకం (డీవార్మింగ్) తప్పనిసరి. సంవత్సరానికి 3-4 సార్లు ఈ మందుల్ని క్రమపద్ధతిలో తాగిస్తే నట్టల్ని సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో, వర్షాకాలం మధ్యలో, వర్షాకాలం తర్వాత... ఈ మందుల్ని తాగించడం మంచిది. మందులు తాగించడానికి ముందు జీవాల పేడను పరీక్ష చేయించాలి. దీనివల్ల గొర్రె లేదా మేకను ఏ రకం నట్టలు ఆశించాయో తెలుస్తుంది. అప్పుడు ఆ నట్టలపై ప్రభావం చూపే మందుల్ని వాడాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకానీ సహచరులు వాడే మందునో లేదా మందుల షాపు వారు ఇచ్చిన దానినో లేదా పక్క గ్రామంలోని మందలకు వాడుతున్న మందునో తెచ్చి వినియోగించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సాధారణంగా ఏలిక పాముల నిర్మూలనకు ఫెన్బెండజోల్, లెవిమిసోల్, టెట్రామిసోల్ మందుల్ని వాడతారు. క్లొసంటాల్, ఆక్సిక్లొజనైడ్ మందులు జలగల్ని నిర్మూలిస్తాయి. బద్దె పురుగుల భరతం పట్టడానికి నిక్లోజమైడ్ వంటి మందుల్ని వాడాలి. ప్రయోజనాలెన్నో... జీవాలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందును ఇస్తే మంద వేగంగా వృద్ధి చెందుతుంది. పెంపకందారులు మంచి ఆదాయం పొందుతారు. ఈ మందుల వల్ల జీవాలు ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉంటాయి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి అధికమవుతుంది. పాలు, మాంసం, ఉన్ని దిగుబడి పెరుగుతుంది. వాటి నాణ్యత కూడా బాగుంటుంది. జీవాల బరువు సగటున 2-3 కిలోల చొప్పున పెరుగుతుంది. తద్వారా వాటి నుంచి మంచి రాబడి వస్తుంది. జీవాలు త్వరగా ఎదకు వచ్చి ఈనతాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుడతాయి. వాటి బరువు కూడా అధికంగానే ఉంటుంది. గొర్రె పిల్లల్లో, పెద్ద జీవాల్లో మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు అవసరం జీవాల శరీర బరువును దృష్టిలో పెట్టుకొని, తగు మోతాదులో నట్టల నివారణ మందును తాగించాలి. మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెలకు ఓ క్రమ పద్ధతిలో మందు తాగించాలి. గ్రామంలోని గొర్రెలన్నింటికీ ఒకేసారి సామూహికంగా మందును తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. పెంపకందారులు తాము వినియోగించిన మందు పేరును రాసిపెట్టుకోవాలి. వైద్యుని సిఫార్సు మేరకే మందు వాడాలి కానీ విచక్షణారహితంగా వినియోగించకూడదు. అవసరం లేకపోయినా మందు తాగించినప్పుడు, తగిన మందును ఎంపిక చేయలేనప్పుడు అది సరిగా ప్రభావం చూపదు. కాబట్టి వైద్యుని సూచన మేరకు తగిన మందును ఎంపిక చేసుకోవాలి. - డాక్టర్ సిహెచ్.రమేష్, హైదరాబాద్ ‘డీవార్మింగ్’ను మరవద్దు జీవాల పెంపకందారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జీవాలకు ఉచితంగా, సామూహికంగా మందులు వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మందులు అందిస్తారు. రెండు రాష్ట్రాలలోని జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ జీవాలకు మందులు వేయించి, అంతర పరాన్నజీవుల బారి నుంచి వాటిని రక్షించుకోవాలి. -
గాడిమేత పద్ధతిలో.. మేకల పెంపకం లాభదాయకం
100 మేకల పెంపకం ద్వారా ఏటా రూ. 6.3 లక్షల వరకు ఆదాయం జీవాల అమ్మకంతోపాటు కంపోస్టు ఎరువు ద్వారా అదనపు ఆదాయం గాడిమేత పద్ధతిలో తలిచేరి మేకల పెంపకంలో ఆదర్శంగా నిలిచిన తమిళనాడు యువ రైతు గొర్రెలు, మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా ఉపవృత్తిగానూ కొనసాగుతున్నది. గొర్రెలు, మేకల పెంపకానికి గ్రామాలను ఆనుకొని ఉన్న బంజర్లు, బీడు భూములు, అటవీ భూములే ప్రధాన ఆధారంగా ఉండేవి. చిన్న పట్టణాలు, నగర పంచాయతీల శివారు భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు మొలవడంతో గొర్రెలు, మేకలకు మేత కరువైంది. దీనికి తోడు వ్యవసాయ రంగాన్ని ఆవరించిన సంక్షోభం ధాటికి గ్రామీణులు వలస బాట పడుతుండడంతో కాపర్ల కొరత ఏర్పడి గొర్రెలు, మేకల పెంపకం కుంటుపడింది. అయితే, విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో మాంసాహారానికి రోజు రోజుకూ గిరాకీ పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం.. కేవలం హైదరాబాద్ నగరంలోనే రోజుకు 8 వేలకు పైగా గొర్రెలు, మేకలు, ఐదు లక్షల కోళ్ల వినియోగం జరుగుతున్నది. మాంసాహారానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే వ్యవసాయానుబంధంగా గొర్రెలు, మేకల పెంపకం లాభదాయకమైన వ్యవ హరమే. మరీ ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే లాభసాటి వ్యాపకం ఇది. వ్యవసాయానికి అనుబంధం పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు మేకలు లేదా గొర్రెల పెంపకాన్ని కూడా సులభంగా చేపట్టవచ్చు. ఒక సంకరజాతి గేదె లేదా ఆవు కొనుగోలుకయ్యే ఖర్చుతో పది మేకలు లేదా గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. బీళ్లు కరువైన పరిస్థితిలో మేకల పెంపకం ఎలా సాధ్యమనే సందేహం వెన్నాడుతుంది. దీనికి పరిష్కారం మేకలు లేదా గొర్రెలను షెడ్డులో ఉంచి మేత వేసి పెంచడమే. పశుగణాభివృద్ధి శాఖ అధికారుల పరిభాషలో చెప్పాలంటే దీన్ని ‘స్టాల్ ఫీడింగ్’ పద్ధతి లేదా గాడి మేత పద్ధతి అంటారు. ఈ విధానంలో మెలకువలను తెలుసుకోవడం కోసం ఆచార్య ఎన్.జీ. రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఉప సంచాలకులు డాక్టర్ పున్నారావు ఆధ్వర్యంలో 18 మంది సృజనాత్మక రైతుల బృందం ఇటీవల తమిళనాడులో పర్యటించింది. వీరితోపాటు వెళ్లిన ‘సాగుబడి’ ప్రతినిధి కోయంబత్తూర్ జిల్లాలో నర్సింహ నాయకన్పాలెంలో వెంకటేశ్ నాయుడు అనే రైతు ఫారాన్ని సందర్శించి గాడి మేత విధానంలో గొర్రెలు, మేకల పెంపకపు పద్ధతులను అధ్యయనం చేశారు. తమిళనాడులోని అనేక జిల్లాల్లో రైతులు గొర్రెలు, మేకల పెంపకాన్ని, బ్రీడింగ్ను పరిశ్రమ స్థాయిలో సాగిస్తున్నారు. అభ్యుదయ యువ రైతు వెంకటేశ్ తలచేరి మేకల పోషణలో ఆదర్శంగా నిలిచాడు. తనకున్న ఎకరంన్నర పొలంలోని 50 సెంట్లలో తీపి సజ్జ(కో ఎఫ్ఎస్-29 రకం), మిగతా 75 సెంట్లలో కో-4 గడ్డిని సాగు చేశాడు. ఈ గడ్డి మడుల మధ్య మునగ, అవిసె చెట్లు అంతర పంటలుగా పెంచాడు. గడ్డికి నీరు పెట్టడానికి మొత్తం పొలాన్ని నాలుగు సమభాగాలుగా విభజించి.. నాలుగు ‘రెయిన్గన్’లు ఏర్పాటు చేశాడు. ఈ రెయిన్గన్ల వినియోగం వల్ల నీరు చాలా మేరకు ఆదా అవుతున్నదని వెంకటేశ్ నాయుడు చెప్పాడు. మిగతా పావు ఎకరం స్థలంలో మేకల పెంపకం కోసం నిర్మించిన దొడ్డిలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్డు నిర్మించాడు. ఈ షెడ్డులో ఐదడుగుల ఎత్తులో కొయ్య పలకలను ఒకదానికి ఒకటిని దగ్గరగా చేర్చి గొర్రెలు, మేకలు పడుకునేందుకు మంచెలాగా నిర్మించాడు. నేలపై కాకుండా దీనిపై విశ్రమిస్తాయి. మేకలు విసర్జించిన పెంటికలు, మూత్రం ఈ కొయ్య పలకల సందుల్లోంచి నేల మీద పడతాయి. పెంటికలను సేకరించి వర్మీ కంపోస్టు తయారీకి వినియోగిస్తారు. తలచేరి మేకలు ఈతకు రెండు పిల్లల్ని పెడతాయి. ఆరు నెలల్లో 20 కిలోల కనీస బరువు పెరుగుతాయి. మాంసానికైతే కిలో రూ. 300ల చొప్పున, బ్రీడింగ్ కోసమయితే కిలో రూ. 350ల చొప్పున అమ్ముతున్నట్లు వెంకటేశ్ నాయుడు చెప్పాడు. ఫారమ్ ప్రారంభించిన సంవత్సరం తరువాత నుంచి ఏటా కనీసం 80 మేకల చొప్పున అమ్మితే రూ. 4,80,000 ఆదాయం వస్తుంది. తల్లి మేకలు అలాగే ఉంటాయి. ఇవి కాకుండా మేకల ద్వారా కనీసం 60-80 టన్నుల ఎరువు వస్తుంది. దీన్ని వర్మీ కంపోస్టుగా చేసి కిలో రూ. 2.50కు అమ్మితే సుమారు రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆయన వివరించారు. - జిట్టా బాల్రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ (కోయంబత్తూరు నుంచి) వేయి అడుగుల్లో వంద మేకలు! ఎంసీఏ చదివాను. ఓ పేరున్న సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగిగా చేరాను. కొద్ది రోజుల తర్వాత విసుగొచ్చింది. ఉద్యోగం వదిలేశాను. తరువాత వ్యాపారం ప్రారంభించి సోని సంస్థ ఉత్పత్తుల పంపిణీ, గోదాము నిర్వహణ చేపట్టాను. వ్యాపారం లాభసాటిగానే ఉన్నా అందులోనూ సంతృప్తి లభించలేదు. పంపిణీ వ్యాపారం వదులుకున్నాను. నాకున్న పొలంలో స్వంతంగా ఏదైనా చేయాలని ఆలోచించి.. మేకల పెంపకం చేపట్టాను. రూ. 4 లక్షల పెట్టుబడి పెట్టాను. 80 తలచేరి మేకలు, కొన్ని జమునాపరి, బీటిల్ మేకలు కొనుగోలు చేశాను. కో-4తోపాటు ఎఫ్ఎస్ 29 తీపి సజ్జరకం సాగు చేశాను. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో షెడ్డు నిర్మించాను. ఇందులో 100 జీవాలను పెంచవచ్చు. పచ్చి మేత కోసి చాప్ కట్టర్తో సన్నగా తరిగి వేస్తాను. సగటున మేకకు రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల మేత అవసరం. పొలంలో అంతర పంటగా మునగ, అవిసె మొక్కలు వేశాను. పచ్చిమేతలో మునగ, అవిసె ఆకు చేర్చడం వలన బరువు పెరగడంతో పాటు జీవాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మేకల్లో సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువ. మేము బ్రీడర్ ఫామ్ను కూడా నడుపుతున్నాం. మేకలను మాంసానికి అమ్మడమే కాకుండా పిల్లలను పెంచి పెంపకందార్లకు అమ్ముతున్నాం. పెంపకానికి ఆరు నుంచి ఎనిమిది నెలల మేక పిల్లలు అనువైనవి. మేక పిల్లలు ఆరు నెలల్లో దాదాపు 16 నుంచి 20 కిలోల బరువు పెరుగుతాయి. పెంపకందార్లకు కిలో రూ. 350 చొప్పున, మాంసం వ్యాపారులకు కిలో రూ. 30 చొప్పున అమ్ముతున్నాం. ప్రధానంగా మేక పిల్లల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేకల పెంపకం చేపట్టదలచిన వారు అందుబాటులో ఉన్న సామగ్రితో షెడ్డు వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. షెడ్డును శుభ్రంగా ఉంచుకోవడం మీద దృష్టి నిలిపితే జీవాలకు వ్యాధులు సోకవు. మాంసాహారానికి నిరంతరం డిమాండ్ పెరుగుతున్నందున రైతుకు నష్టం అనే ప్రశ్నే ఉండదు. రెండేళ్లుగా మేకల పెంపకం కొనసాగిస్తూ.. మంచి ఆదాయంతో పాటు ఆనందాన్నీ పొందుతున్నాను. ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: ఎన్ వెంకటేశ్ నాయుడు (098949 51264) నర్సింహనాయకన్ పాళ్యం, కోయంబత్తూర్ జిల్లా, తమిళనాడు. -
మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే
మూగజీవాల జబ్బులను పారదోలుతున్న అద్భుతమైన సంప్రదాయ మూలికా వైద్యుని విజయగాథ ఇది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంత పల్లెల్లో గొర్రె, మేక, గొడ్డు, గోదున్న రైతులందరికీ పెద్ద రాజన్న పేరు పేదాల మీదే ఆడుతుంది. ప్రాణాంతక వ్యాధి సోకింది.. ఈ పశువు బతకదని పశువైద్యులు తేల్చేసినప్పుడు ‘ఓరె.. పెద రాజన్నకు ఓసారి చూపించు.. చచ్చే బక్కెద్దు కూడా లేచి రంకేస్తుంది’ అంటుంటారు రైతులు. గోళ్ల గ్రామానికి చెందిన పెద్ద రాజన్న పశువైద్యుడిగా అంత పేరొం దాడు. అలాగని పెద రాజన్నకు పశువైద్యంలో పట్టాలేమీ లేవు. మూడో తరగతితో చదువు సరిపెట్టాడు. తాత, ముత్తాతల కాలం నుంచి మూగజీవాలకు ఊపిరిపోస్తున్న కుటుంబంలో పుట్టిన రాజన్న అందుబాటులో ఉన్న వనమూలికలతోనే పశువులకు చికిత్స చేస్తాడు. సంప్రదాయ విజ్ఞానంతో వేలాది పశువులకు ప్రాణంపోస్తున్న రాజన్న సేవలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) సముచిత రీతిన గుర్తించడంతో ప్రతిష్టాత్మ క రాష్ర్టపతి అవార్డు ఇచ్చింది. పల్లెజనుల జ్ఞానాన్ని నెత్తికెత్తుకునే పల్లెసృజన సంస్థ కృషి ఇందుకు దోహదపడింది. తండ్రి, మామలే స్ఫూర్తి వనమూలికలతో పశువులకు వైద్యం చేసే పెద్ద రాజన్న కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాలకు వెళ్లి సేవలందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మూగజీవాలున్న ప్రతి ఇల్లూ తలచుకునే పెద్ద రాజన్నకు పశువైద్యంలో ఆయన తండ్రి మాదప్ప, మామ కామయ్యలే గురువులు. 30 ఏళ్ల వయసు నుంచి రాజన్న మూగజీవాలకు సేవ చేస్తున్నాడు. 65 ఏళ్లు నిండినా నేటికీ మూగజీవాల సేవలోనే తలమునకలుగా ఉంటాడు. ఒక్కో రోజు వేళకు భోజనం చేసేందుకు కూడా వీలుకానంతగా లీనమైపోతాడు. స్వతహాగా రైతైన రాజన్న సొంత పొలం పనులు కూడా మానుకొని పశువుల సేవలో మునిగిపోతుంటాడు. ఒక్కోసారి దూరప్రాంతాల రైతులు కూడా వచ్చి రాజన్నను తీసుకుపోతారు. అయినా, రాకపోకల ఖర్చులు తప్ప వైద్యం చేసినందుకు రూపాయి కూడా ఆశించడు. శాస్త్రీయమైనది రాజన్న వైద్యం ఈ కాలంలో గచ్చాకు పుచ్చాకుతో రోగాలు కుదురుతాయూ? అని కొట్టి పడేసే వారి నోళ్లను పరీక్షల ఫలితాలు అవాక్కయ్యేలా చేశాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లాబ్ పరీక్షల్లో రాజన్న మందులోని శాస్త్రీయత రుజువైంది. ఆ తర్వాత దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. ఐరోపా దేశాల్లో పేటెంట్ కోసం ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసిందంటే రాజన్న మందు గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మార్చిలో రాష్ర్టపతి పురస్కా రంతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని రాజన్న అందు కున్నారు. రాజన్న మందులను పోస్టు/ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. పొదుగు వ్యాధి మందు ప్యాకెట్ ధర రూ.వంద! వివరాలకు: పల్లెసృజన స్వచ్ఛంద సంస్ధ, 122, వాయుపురి, సైనిక్పురి పోస్ట్, సికింద్రాబాద్-500 094. ఫోన్: 040-27111959. జె. శ్రీకర్: 91777 52753 - వంక సోమశేఖర్రెడ్డి, న్యూస్లైన్ , కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా! నోరులేని ప్రాణులు.. రోగాన్ని, బాధను చెప్పుకోలేవు. తండ్రి, మామల వద్ద నేర్చుకున్న విద్యతో 35 ఏళ్లుగా వేలాది పశువులను బతికించాను. ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటా. జబ్బుపడిన పశువు లేచి మేత తినే వరకు ప్రాణం కుదుటపడదు. పశువుకు రోగం కుదిరిందంటే సంతోషపడతాను. నా విద్యను రాష్ర్టపతి గుర్తిస్తారని, బహుమతి ఇస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఢిల్లీ పెద్దల నుంచి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - బోయ పెద్ద రాజన్న, గోళ్ల గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ప్రాణాంతక పొదుగు వ్యాధి పరారే! పాడి పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చిందంటే ప్రాణం మీదకొచ్చినట్లేనని భావిస్తుంటారు. ఈ వ్యాధిని నయం చేయడానికి రూ. వెయ్యి ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కనీసం 3,4 వేస్తుంటారు. అయినా, ఒక్కోసారి పశువు ప్రాణాలూ దక్కక పోవచ్చు. అయితే, రాజన్న ఇచ్చే మూలికల పొడిని నాలుగు పూటలు పొదుగుకు రాస్తే చాలు.. జబ్బు తగ్గిపోతుంది. పొదుగువాపు వ్యాధితో పాటు కట్టువ్యాధి, జబ్జ వాపు, విరేచనాలు, కంటిచూపు దెబ్బతినడం, పాలసార పెంపునకు, కాన్పు చేయడం, విరిగిన అవయవాలకు కట్లు కట్టడంతోపాటు.. చలికుందా, రక్తం కుందా, కుంటికుందా, ఊదా కుందా, ససులవ్యాధి అని స్థానికంగా వాడుకలో ఉన్న వ్యాధులకు కూడా రాజన్న వైద్యం చేస్తాడు. కాళ్లు విరిగిన పశువు రాజన్న వైద్యంతో 15 రోజుల్లో లేచి నడుస్తుంది. కారు చౌకలో ద్రావణ ఎరువు ‘అమృద కైరసాల్’ ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డా. నమ్మాళ్వార్ పంటల పోషణకు రూపొందించిన చౌకైన ద్రావణ ఎరువు అమృద కైరసాల్. అమృద కైరసాల్ తయారీ పద్ధతి: ఐదు కిలోల ఆవు పేడను తీసుకొని ఒక గోనె సంచిలో వేసుకోవాలి. దానిలో ఐదు కిలోల మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విరివిరిగా దొరికే తూటుకాడ (తూటేరు /కాంగ్రెస్ కంప /లొట్టపీసు) మొక్క ఆకులు సన్నగా తరిగి వేయాలి. దీనికి పావు కిలో బెల్లం కలిపి సంచిలో ఒక రాయివేసి తాడుతో కట్టి.. 10 లీటర్ల నీరు పోసిన డ్రమ్ములో వేలాడదీయాలి. నీటిలో ఉన్న సంచిని ఓ 20 సార్లు గట్టిగా కదుపుతూ తిప్పాలి. రోజుకు 3 సార్లు చేయాలి. 2 రోజుల్లో అమృద కైరసాల్ సిద్ధమౌతుంది. దీన్ని పది లీటర్ల నీటిలో కలిిపి పిచికారీ చేసుకోవచ్చు/సాగునీటి కాలువలో కలపవచ్చు. పోషణకు, చీడపీడల నివారణకు ‘హెర్బల్ టీ’ అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగిం చి నమ్మాళ్వార్ కీటక నాశినిని రూపొం దించారు. ఐదు కిలోల పేడను తీసుకొని గోనె సంచిలో వేసుకోవాలి. పేడ ఉన్న సంచిలో వేప, వాయిలి, సీతాఫలం వంటి ఆకులు మరో ఐదు కేజీలు వేసి.. సంచి మునిగేందుకు అందులో ఒకరాయి వేసి.. నీటి తొట్టె లేదా డ్రమ్ములో వేయాలి. రోజుకు మూడు సార్లు కదుపుతూ తిప్పాలి. సంచిలోని పేడ, మొక్కల కషాయం క్రమంగా కరిగి నీటిలో కలుస్తుంది. దీన్ని అన్ని పంటలకు చీడపీడల నివారిణిగా, పోషక ద్రావణంగా ఉపయోగించుకోవచ్చు. -
ఇక్కడే లాగించేస్తున్నారు !
-
ఇక్కడే లాగించేస్తున్నారు !
రాష్ట్రంలో భారీగా పెరిగిన మాంసం ఉత్పత్తి.. దారుణంగా తగ్గిన ఎగుమతులు ఉత్పత్తిలో సగం రాష్ట్రంలోనే వినియోగం మాంసాహారంవైపే 80 శాతం యువత మూడేళ్ళ క్రితం వరకూ మాంసం ఎగుమతుల్లో మన రాష్ట్రానిదే మొదటి స్థానం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఐదేళ్ళ క్రితం రూ. 35,100 కోట్ల ఎగుమతులుంటే, గడచిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. 17,400 కోట్లే!! అంటే ఎగుమతులు సగానికి పడిపోయాయి. ఉత్పత్తి పెరిగింది.. ఎగుమతులు మాత్రం తగ్గాయి.. మరి ఉత్పత్తవుతున్న మిగతా మాంసమంతా ఎటుపోతున్నట్టు చెప్మా అంటే.. మనోళ్లే లాగించేస్తున్నారని తేలింది! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దకాలం క్రితం 25.81 కోట్ల కిలోల మాంసం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇది 2011-12 నాటికి 8.24 లక్షల టన్నులకు, 2012-13లో 9.30 లక్షల టన్నులకు చేరింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 10.30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా. అంటే పదేళ్ళలోనే మాంసం ఉత్పత్తులు దాదాపు 113 శాతం అంటే.. 75 కోట్ల కిలోల మేర పెరిగాయి. ఇది దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మాంసంలో ఐదో వంతు. వాస్తవానికి 1998-2005 మధ్య మాంసం ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండేది. అక్కడ పరిస్థితులు తారుమారవ్వడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కుంచించుకుపోవడం, పారిశ్రామికీకరణ ప్రభావం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం కోళ్ళు, గిత్తలు, దున్నలు, గొర్రెలు, మేకల పెంపకం పెరిగింది. ఫలితంగా శరవేగంగా మాంసం ఉత్పత్తి జరిగింది. దీంతో ఉత్పత్తిలో మన రాష్ట్రమే అగ్రస్థానానికి చేరింది. ఇంత ఉత్పత్తి జరిగినా, ఇది దేశ ఆర్థిక పురోగతిపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. రాష్ట్రంలో మాంసం వినియోగం భారీగా పెరడగమే దీనికి కారణం. ఆధునిక సంప్రదాయ పోకడలు, విదేశీ సంస్కృతి అనుకరణ ఆహార అలవాట్లలో మార్పు తెచ్చింది. ఫలితంగా మాంసాహారుల సంఖ్య పట్టణాలు, నగరాల్లో పెరుగుతోంది. దీంతో ఉత్పత్తయ్యే మాంసంలో అధికశాతం రాష్ట్రంలోనే వినియోగమైపోతోంది. దీంతో ఎగుమతుల్లో మూడేళ్ళ కిందటి వరకు నెంబర్ వన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది. జోరుగా గొడ్డు మాంస విక్రయాలు: గొడ్డు మాంసం ఎగుమతులు దేశంలో 2001-2002లో 2,40,980 టన్నులు ఉంటే, ఇందులో మన రాష్ట్రం వాటా 10 శాతం. 2009-10 నాటికి 513.668 టన్నులకు చేరినా, మన రాష్ట్రం నుంచి 12 శాతం ఎగుమతులు జరిగాయి. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా 5 శాతంకు పడిపోయింది. కాగా రాష్ట్రంలో గొడ్డు మాంసం విక్రయ కేంద్రాలు మూడేళ్ళ క్రితం 2 వేలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 7వేలకు చేరాయి. పెరిగిన మాంసం.. తగ్గిన చేపలు తలసరి మాంసం వినియోగంలోనూ భారీ వ్యత్యాసాలే కన్పిస్తున్నాయి. 2004-05లో 61వ జాతీయ నమూనా సర్వే ప్రకారం గొర్రెలు, మేకల మాంసం తలసరి వినియోగం నెలకు 86 గ్రాములు మాత్రమే. కోడి మాంసం మాత్రం 136 గ్రాములుగా ఉంది. ఇదిప్పుడు మూడు రెట్లు పెరిగినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. చేపల తలసరి వినియోగం మాత్రం బాగా తగ్గింది. నెలకు 71 గ్రాములే తింటున్నట్టు సర్వే తేల్చింది. ఉరుకులు, పరుగుల పట్టణీకరణలో చేపలను వండుకోవడం కష్టంగా ఉంది. దీనికి తోడు రవాణా ఖర్చుల పెరుగుదల చేపల అమ్మకాలపై పడింది. గత పదేళ్ల గణాంకాలు.. 40 శాతం పెరిగిన మాంసాహార హోటళ్ళు 60 శాతం పెరిగిన బిర్యానీ అమ్మకాలు 20 శాతం శాఖాహారం వైపు మళ్లిన వృద్ధులు 80 శాతం నాన్-వెజ్ వైపు మొగ్గుతున్న యువత 176 అనుమతి ఉన్న కబేళాల సంఖ్య 580 పనిచేస్తున్న కబేళాలు -
జీవాలకు భలే గిరాకీ
=బక్రీద్ స్పెషల్ =2 లక్షలకు పైగా జీవాల అమ్మకం =బుధవారం రూ.50 కోట్ల మేర వ్యాపారం =కళ్లు బైర్లు కమ్మించిన ధరలు సాక్షి, సిటీబ్యూరో: ముస్లింలకు పవిత్ర దినమైన బక్రీద్ సందర్భంగా నగరంలో మేకలు, పొట్టేళ్లకు గిరాకీ ఏర్పడింది. ఈ ఏడాది జీవాల కొరత ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి. బుధవారం ఉదయం రెండు పొట్టేళ్లు (జత) రూ.14 వేలకు లభించగా సాయంత్రమయ్యే సరికి రూ.24వేలు ధర పలికాయి. సామాన్య, పేద ముస్లిం లను ఈ ధరలు బెంబేలెత్తించాయి. అనుమతి లేదంటూ ఇతర జిల్లాల నుంచి జీవాలను నగరానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో 30 శాతం మేర కొరత ఏర్పడింది. ఫలితంగానే రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మతపరమైన విశ్వాసాల రీత్యా బక్రీద్ నాడు ఁకుర్బానీరూ. తప్పనిసరి కావడంతో ముస్లింలు తమ స్థోమతను బట్టి జీవాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. మండీలు, కూడళ్ల వద్ద మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగాయి. ఈ పర్వదినానికి ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు తీసుకురాగా, రాజస్థాన్ నుంచి 2 వేల వరకు ఒంటెలు తరలించారు. ఒక్కో ఒంటె పరిమాణాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికాయి. జంటనగరాలు, శివార్లలో కలిపి ముస్లిం జనాభా సుమారు 30 లక్షల వరకు ఉంది. నాణ్యత , పరిమాణాన్ని బట్టి ఒక్కో మేక, పొట్టేలు రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలికాయి. రూ.7వేలు- రూ.12వేల మధ్య ధరకు కొనుగోళ్లు ఎక్కువగా సాగాయి. గోల్నాక, చంచల్గూడ, దారుషిఫా, టోలిచౌకి, బార్కాస్, ముషీరాబాద్, జియాగూడ, చెంగిచెర్ల, మెహిదీపట్నం, కవాడిగూడ, ఎర్రగడ్డ, ఫస్ట్లాన్సర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, మలక్పేట తదితర ప్రాంతాలతో పాటు శివార్లలో తారస్థాయిలో విక్రయాలు జరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా జీవాల అమ్మకాలు జరిగాయని, బుధవారం ఒక్కరోజే రూ.50 కోట్లకుపైగా వ్యాపారం జరిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు కళ్లు బైర్లు కమ్మించాయని, తప్పనిసరి కావడంతో కొనక తప్పలేదని కొందరు ముస్లింలు చెప్పారు. దళారుల హోల్సేల్ దోపిడీ ఛిబక్రీద్ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు దళారులు ఇష్టానుసారం ధరలు పెంచి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. పల్లెల నుంచి మందలుగా తెచ్చిన జీవాలను విడివిడిగా అమ్ముకునేందుకు వాటి యజమానులు ఆసక్తి చూపారు. అయితే, దళారులంతా సిండికేట్గా మారి విడివిడిగా కాక హోల్సేల్గా విక్రయించాలని వారిపై వత్తిడి తెచ్చారు. వాస్తవానికి నూటికి రూ.5-10 కమీషన్ మాత్రమే తీసుకోవాల్సిన దళారులు సొంతంగా కొనుగోళ్లు జరిపి మార్కెట్ను చేతుల్లోకి తీసుకున్నారు. దీనివల్ల మేకల పెంపకందారులకు లాభం రాకపోగా కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. 15 కేజీల పరిమాణం గల మేక రూ.7-12 వేల వరకు ధర పలకడం దళారుల దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం. -
‘క్రిస్గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!! బరువు సుమారు 100 కిలోలు. రాజస్థాన్ నుంచి దిగుమతి అయిన దీని ధర రూ.90 వేలు. ఇక తెల్లగా తళతళలాడిపోతున్న పొట్టేలు బరువు 160 కిలోలు. దాని ధర అక్షరాలా 2 లక్షల రూపాయలు. వయసు మూడేళ్ల్లు. బక్రీద్ను పురస్కరించుకొని ముషీరాబాద్ ఏక్మినార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చారు. కాగా, బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.