Gynecologist
-
ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ అంటున్నారు.. నిజమేనా?
నా వయసు 35 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. నాకు ట్యూబ్స్, ఓవరీస్లో ఇన్ఫెక్షన్ ఉందని ఈమధ్యే సర్జరీ చేసి రెండు ఓవరీస్ను తీసేశారు. ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు. నిజమేనా? – లక్ష్మీపద్మజ, కిసాన్నగర్ఓవరీస్ అనేవి పిల్లలు కావటానికి మాత్రమే కాదు, అవి కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేయ్యటం వలన ఆరోగ్యానికీ చాలా అవసరం. 50 నుంచి 55 సంవత్సరాల మధ్య అండాల విడుదల ఆగిపోయా, ఓవరీస్ ఎండిపోతాయి. అప్పుడు ఇంక హార్మోన్స్ విడుదల ఉండదు. నెలసరి కూడా ఆగిపోతుంది. దాన్ని నేచురల్ మెనోపాజ్ అంటాం. కానీ 50 ఏళ్లలోపు ఏ కారణంతో అయినా సర్జరీ ద్వారా ఓవరీస్ను తొలగిస్తే దానిని సర్జికల్ మెనోపాజ్ అంటాం. చిన్న వయసులో హఠాత్తుగా పీరియడ్స్ ఆగిపోతాయి. హర్మోన్స్ రిలీజ్ ఆగిపోతుంది. ఇలా సర్జరీ తర్వాత మెనోపాజ్ వచ్చిన వాళ్లకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. ఒంట్లోంచి వేడివేడి పొగలు రావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, గుండె దడ, మూడ్ స్వింగ్స్, యాంగ్జయిటీ, నిద్ర పట్టకపోవడం, నీరసం, మతిమరుపు, వజైనల్ డ్రైనెస్, యూరీనరీ ఇన్ఫెక్షన్స్, జాయింట్ పెయిన్స్, చర్మం పొడిబారిపోవడం వంటివి ఉంటాయి. అయితే వీటన్నిటినీ జీవనశైలి మార్పుతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారాన్ని తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం, మసాలా ఫుడ్కి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వంటివాటితో మెనోపాజ్ ఇబ్బందులను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను విభజించి.. పాజిటివ్ అప్రోచ్తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. అలాంటివారికి డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని సూచిస్తారు. హార్మోన్స్ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడమే హెచ్ఆర్టీ. ఇవి జెల్స్, ప్యాచెస్, స్ప్రేలుగానూ అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ గర్భసంచి ఆరోగ్యానికి అవసరం. మీకు గర్భసంచి తీయలేదు కాబట్టి కేవలం ఈస్ట్రోజన్ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ రెండూ ఇవ్వాలి. కుటుంబంలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి హెచ్ఆర్టీ మంచిది కాదు. అలాంటివారికి కొన్ని ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు. వాటిని ఎస్సెస్సారై ( ఖఐ) అంటారు. ఈ మెడిసిన్ను డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. వజైనా డ్రైనెస్, ఇచింగ్ తగ్గడానికి వజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ను సూచిస్తారు. ఇలా ఒక్కోవ్యక్తికి వాళ్ల వాళ్ల ఆరోగ్యపరిస్థితిని బట్టి సరైన చికిత్సను అందిస్తే రిస్క్, కాంప్లికేషన్స్ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాకు మూడు సిజేరియన్స్ అయ్యాయి. మొదటి ఆపరేషన్ తర్వాత కుట్ల మీద నల్లటి పెద్ద మచ్చ ఏర్పడింది. దాన్ని కెలాయిడ్ అంటారని చెప్పారు. చివరి రెండు సర్జరీల్లో దాన్ని తొలగించినా, మళ్లీ ఏర్పడింది. అక్కడ చర్మం పొడిబారిపోయి.. దురదగా ఉంటోంది. ఇది శాశ్వతంగా ఉంటుందా? దీనికి ట్రీట్మెంట్ లేదా? – అంజలి, వైజాగ్సిజేరియన్స్కి పెద్దగా కోత పెడతాం కాబట్టి ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కెలాయిడ్స్ పెద్దగానే ఉంటాయి. ఈ టెండెన్సీ ఉన్న వారిలో తర్వాత డెలివరీలో ఆ కెలాయిడ్ స్కార్ను తీసేసినా హీలింగ్ ప్రాసెస్లో మళ్లీ ఫామ్ అవుతుంది. కొంచెం లైట్గా ఉన్న కెలాయిడ్ స్కార్కి అయితే కార్టిసోన్ అనే స్టెరాయిడ్ క్రీమ్ లేదా ఇంజెక్షన్స్ని ట్రై చేస్తారు. వీటిని అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లను నెలకొకటి చొప్పున ఆరునెలల పాటు వాడినవారిలో ఈ మచ్చ ఫేడ్ అవటం కనిపించింది. అయితే కొంతమందికి పిగ్మెంటేషన్ స్కార్స్ కూడా రావచ్చు. కొంతమందిలో ఈ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క్రిప్టోథెరపీ అని.. లిక్విడ్ నైట్రోజన్ను అప్లై చేసిన కొంతమందిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. Pulsed dye laser థెరపీ ద్వారా 80 నుంచి 90 శాతం కెలాయిడ్ స్కార్ని తగ్గించవచ్చు. ఈ ట్రీట్మెంట్ 4 నంచి 8 వారాలుంటుంది. లో లెవెల్ రేడియోథెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీంతో మచ్చ మాసిపోవడమే కాక, దురద, అనీజీనెస్ కూడా తగ్గుతాయి. ఈ చికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కెలాయిడ్ స్కార్ని ఆపరేషన్ ద్వారా తీసేసి, 48 గంటల్లోపే ఫస్ట్ డాక్స్ ఆఫ్ ఎక్స్–రే థెరపీని ఇస్తారు. వారం తర్వాత రెండో డాక్స్ను ఇస్తారు. ఈ ప్రోసీజర్కు 2 నుంచి 3 గంటలు పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని షార్ట్టర్మ్ సైడ్ఎఫెక్ట్స్ 2 నుంచి 3 వారాలు ఉండి తగ్గిపోతాయి. కొంచెం మంట ఉంటుంది. దీనికి డ్రెస్సింగ్ను సూచిస్తారు. లాంగ్టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్.. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలల తర్వాత స్కిన్ డార్క్ అవటం, పింగ్మేంటేషన్ కనిపిస్తుంది. సన్స్క్రీన్ వాడాల్సి వస్తుంది. పాజిటివ్ అప్రోచ్తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఇక్కడంతా ప్రసెస్డ్.. ఎలాంటి ఫుడ్ తినాలి
నేను దుబాయ్లో ఉంటాను. ఇప్పుడు నాకు మూడో నెల. ఇక్కడంతా ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ ఎక్కువగా వాడతారు. హెల్దీ బేబీ కోసం నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సజెస్ట్ చేయగలరు. – చరిత రెడ్డి. తాజా పళ్లు, ఆకు కూరలు, కూరగాయలు అన్నీ తినొచ్చు. పాశ్చరైజ్డ్ సాఫ్ట్ చీజ్ అంటే కాటేజ్ చీజ్ (పనీర్), మోజారెల్లా క్రీమ్ చీజ్ వంటివి తీసుకోవచ్చు. పాశ్చరైజ్డ్ మిల్క్, యోగర్ట్, క్రీమ్, ఐస్క్రీమ్ తినొచ్చు. అన్పాశ్చరైజ్డ్ చీజ్, మిల్క్, బ్లూ చీజ్, పాశ్చరైజ్ చేయని గేదె పాలు, మేక పాలు తీసుకోకూడదు. ఎందుకంటే పాశ్చరైజ్ చేయనివాటిలో Listeria బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో listeriosis అనే ఇన్ఫెక్షన్ని కలగజేసి గర్భస్రావానికి కారణమవుతుంది. కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్ని బాగా ఉడికించి తినాలి. ప్రెగ్నెన్సీలో ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే మంచిది. రా, అన్కుక్డ్ మీట్, లివర్ ప్రొడక్ట్స్ని అసలు తీసుకోకూడదు. అన్కుక్డ్ మీట్ వల్ల Toxoplasmosis అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది తల్లి నుంచి బిడ్డకు చేరుతుంది. గర్భస్రావానికి ఈ ఇన్ఫెక్షనూ ఒక కారణమవుతుంది. లివర్లో అధిక మోతాదులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది గర్భస్థ శిశువుకు హాని చేస్తుంది. కోడిగుడ్లను బాగా ఉడికించి తినొచ్చు. హాఫ్ బాయిల్డ్, హాఫ్ కుక్డ్ ఎగ్స్ని అసలు తినకూడదు. ఇలా సగం ఉడికిన ఆహారం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫిష్ విషయానికి వస్తే సీ ఫిష్, షెల్ ఫిష్, రొయ్యలను కూడా పూర్తిగా వండినవే తినాలి. అదీ వేడివేడి ఆహారపదార్థాలనే తీసుకోవాలి. నాకు తరచు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తోంది. రోజూవారీ జాగ్రత్తలేమైనా చెప్పగలరా? – సరిత పవార్, భైంసా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవటం. ప్రతి ఒక్కరూ వాళ్ల బరువుని బట్టి రోజూ లిక్విడ్స్ తీసుకోవాలి. ఒక కేజీకి ఇరవై ఐదు ఎమ్.ఎల్ అని సూచిస్తాం. అంటే యాభై కేజీల బరువున్నవారు 1.2 లీటర్లు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు తక్కువ నీరు తీసుకుంటారో యూరినరీ బ్లాడర్లో ఇరిటేషన్ స్టార్ట్ అయి, ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది. దీంతోపాటు తొందరగా వెళ్లాలనీ అనిపిస్తుంది. అప్పుడు యూరిన్ ముదురు పసుపు రంగు, గాఢమైన వాసనతో ఉంటుంది. హెల్దీ బ్లాడర్ కోసం రోజూ 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల నీరు తాగాలి. చల్లటి పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్లలో స్పార్కి్లంగ్ వాటర్తో కార్బన్డైయాక్సైడ్ కలసి యూరిన్ని అసిడిక్గా మారుస్తుంది. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్కు కారణంగా చెప్పచ్చు. అందుకే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగకూడదు. కెఫీన్ బ్లాడర్ని ఉత్తేజపరస్తుంది. టీ, గ్రీన్ టీ, కాఫీ, హాట్ చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్లో కెఫీన్ ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్లలో కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే బ్లాడర్లో యూరిన్ పెరిగి ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ద్రాక్ష , నిమ్మ, పైనాపిల్, ఆరెంజ్ పండ్ల రసాలు అసిడిక్గా ఉంటాయి. ఇవి కూడా బ్లాడర్ని ఇరిటేట్ చేస్తాయి. ఈ పండ్ల రసాలను ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు. హెర్బల్ టీ, బార్లీ వాటర్ మంచివి. ఇవి ఎంత తాగినా అసిడిక్ గా ఉండవు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ. అయితే, యూరిన్లో రక్తం కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. కొన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ పరీక్షలు చేయించుకోవాలి. చాలామందికి చాలాసార్లు యూరిన్కి వెళ్తే ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారనే అనుమానం ఉంటుంది. రోజుకు 8 నుంచి 10 సార్ల కన్నా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సివస్తే.. దానిని ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారు. సాధారణంగా రోజుకు 4 నుంచి 7 సార్లు కామన్. ఈ సంఖ్య పెరిగినప్పుడు డాక్టర్ని కలవటం మంచిది. మలబద్ధకం, యూరిన్ ఇన్ఫెక్షన్స్కు ఎక్కువగా టీ, కాఫీ, చల్లటి పానీయాలు కారణం. ఇందుకు రెగ్యులర్గా ‘బ్లాడర్ ట్రైనింగ్’ను సూచిస్తాం. అంటే బ్లాడర్ మజిల్ శక్తిని పెంచటం. అప్పుడు బ్లాడర్ ఎక్కువ కెపాసిటీ యూరిన్ను హోల్డ్ చేస్తుంది. యూరిన్కి వెళ్లే ముందు ఐదు నిమిషాల పాటు హోల్డ్ చేయటానికి ప్రయత్నించండి. దీంతో యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఈ స్థితితో బ్లాడర్ని ట్రైన్ చేయొచ్చు. అయినా మూత్ర పరీక్షలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ నిర్ధారణైతే, ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. యూరిన్ ఫ్లో టెస్ట్, కొన్ని యూరిన్ డయాగ్నసిస్ స్టడీస్ పరీక్షల ద్వారా యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ను తెలుసుకోవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అది ఏ వయసు వారికి?
సర్విక్స్ క్యాన్సర్ రాకుండా టీకా ఉంది అంటున్నారు కదా.. దాన్ని ఏ వయసువారైనా తీసుకోవచ్చా? – ఎన్. విజయలక్ష్మి, హిందూపూర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలావరకు 65 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకి కూడా రావచ్చు. చాలా అధ్యయనాల తరువాత టీనేజ్లోనే అమ్మాయిలకు వ్యాక్సీన్ ఇస్తే భవిష్యత్లో సర్విక్స్ క్యాన్సర్ని నివారించవచ్చు అని రుజువు అయింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ 16, 18 ద్వారా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అది రాకుండా చిన్న వయసులోనే వ్యాక్సీన్ ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్లను సంప్రదిస్తే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో సూచిస్తారు. 11–12 ఏళ్ల వయసులో కనీసం మొదటి డోస్ వ్యాక్సీన్ ఇస్తే మంచిది. ఈ వ్యాక్సీన్ మూడు డోసుల్లో ఉంటుంది. నెలకి, 6 నెలలకి రెండవ, మూడవ డోసులను ఇస్తారు. ఈ వ్యాక్సీన్తో చాలావరకు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వ్యాక్సీన్ తీసుకున్నవారిలో వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది. కొంతమందికి అంటే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మాత్రం 27–45 ఏళ్లకి కూడా ఇస్తున్నారు. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పెళ్లికి ముందే వ్యాక్సీన్ ఇవ్వటం మంచిది. చిన్న వయసులో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువకాలం ఉంటుంది. ఇప్పుడు Gardasil 9 అనే సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్ను ఇస్తున్నారు. యీస్ట్ అలెర్జీ ఉన్నా.. ఫస్ట్ డోస్ హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సీన్కి అలెర్జీ వచ్చినా తరువాత డోస్లను తీసుకోకూడదు. 25 ఏళ్లు దాటిన వారికి పాప్ స్మియర్ టెస్ట్ చేసి.. సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్ను ఇస్తారు. నాకిప్పుడు పాతికేళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. రోజుకి పది గంటలు వర్క్ చేస్తాను. కొన్నాళ్లుగా నడుము కింది భాగమంతా నొప్పిగా ఉంటోంది. అది కాళ్ల దాకా లాగుతోంది. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా? మెడికల్ షాప్లో అడిగి కొనుక్కోవచ్చా? – పేరు రాయలేదు, హైదరాబాద్ నడుము కింది భాగంలో నొప్పి అంటే నడుము నొప్పి, సోర్నెస్, స్టిఫ్గా ఉండి సయాటికా పెయిన్ అంటే నొప్పి వెనుక నుంచి రెండు కాళ్లల్లోకి రావడం. కొంతమందికి తిమ్మిర్లు కూడా వస్తాయి. సయాటికా నర్వ్ అనేది బ్యాక్ నుంచి నడుము, కాళ్లు, పాదాల్లోకి వెళ్తుంది. ఈ నర్వ్ ఒత్తిడికి గురైనా.. ఇరిటేట్ అయినా నొప్పి వస్తుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే.. ఈ పెయిన్ ఏమైనా బోన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందా లేక వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అరుదుగా బోన్ క్యాన్సర్ ఏమైనా కావచ్చా అని మొదటగా రూల్ అవుట్ చేస్తారు. చేసి.. ఫిజియోథెరపిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ టీమ్కి రిఫర్ చేసి.. ఆ నొప్పికి కారణమేంటో కనిపెడతారు. ఎక్స్రే లేదా ఎమ్ఆర్ఐ తీస్తారు. మీ రోజూవారీ పనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ఏ మందులు వాడాలో సూచిస్తారు. కొంతమందిలో మందుల్లేకుండానే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా లో బ్యాక్ పెయిన్ని మేనేజ్ చేయవచ్చు. బెల్టులు, corsets, ఫుట్ సపోర్ట్ షూస్ వంటివేమీ నొప్పిని తగ్గించడంలో సహాయపడవు. అలాగే ఆక్యూపంక్చర్,ట్రాక్షన్, ఎలక్ట్రోథెరపీ లాంటివీ చాలామందికి పనిచేయవు. వీటివల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంటుంది. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి.. మీ వయసు, మీ వృత్తిని బట్టి మీకు ఏ విధమైన చికిత్స సరిపోతుందో ఆ చికిత్సను సూచిస్తారు. NSAIDs(పెయిన్ కిల్లర్స్)ని సాధారణంగా మొదటి దశలో నొప్పి నుంచి ఉపశమనానికి వాడొచ్చు. కానీ వీటివల్ల కడుపులో నొప్పి, అల్సర్లు కావచ్చు. అందుకే యాంటాసిడ్స్ కూడా తీసుకోవాలి. opioids అనేవి చాలా బాగా రిలీఫ్నిస్తాయి. అయితే వీటిని తక్కువ మోతాదులో.. చాలా తక్కువ రోజులు మాత్రమే వాడాలి. ఇవేవీ పనిచేయనప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. అంటే ఈ బ్యాక్ పెయిన్కి కారణమవుతున్న నర్వ్ని బ్లాక్ చేయడం, లోకల్ ఎనస్తీషియా లేదా స్పైన్లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాక్ సర్జరీతో నర్వ్ మీద ఒత్తిడి తగ్గించడం లాంటి పరిష్కారాలన్నమాట. స్ట్రెయిన్, స్లిప్డ్ డిస్క్ లాంటివి మందులతో తగ్గుతాయి. మీ జీవనశైలిని కొంత మారిస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవడం, యాక్టివ్గా ఉండడం, రోజూవారీ ఇంటి పనులను మీరే చేసుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్ని తీసుకోవడం, Ibuprofen, పారాసిటమాల్ లాంటి మాత్రలను తక్కువ మోతాదులో వాడటం, ఐస్ ప్యాక్తో బ్యాక్ పెయిన్కి కాపడం పెట్టుకోవడం, హాట్ ప్యాక్తో జాయింట్స్ దగ్గర స్టిఫ్నెస్ను, మజిల్స్ స్పాజమ్ని తగ్గించడం, క్రమం తప్పకుండా బ్యాక్ స్ట్రెచెస్ చెయ్యడం లాంటివాటితో నొప్పిని తగ్గించే వీలుంది. ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ అప్రోచ్తో కూడా బ్యాక్ పెయిన్ను మేనేజ్ చేయొచ్చు. చాలామందికి ఇది పనిచేస్తుంది. మందులను మాత్రం డాక్టర్లు తక్కువ మోతాదులో.. అదీ అతి తక్కువ రోజులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పి తీవ్రత తగ్గాక.. స్ట్రెచింగ్, మసాజ్లు, కొన్ని రకాల ఎక్సర్సైజ్లను సూచిస్తారు. మూడు నెలల కంటే తక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు. ఆ నొప్పికి పెయిన్ రిలీఫ్ మందులు పనిచేస్తాయి. మూడు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దీని చికిత్సకు టీమ్ అప్రోచ్ అవసరం. డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్గానే వస్తోంది. రొటీన్ స్కాన్లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్తో మేనేజ్చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్ను తగ్గిస్తుంది. ఇన్సులిన్తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా? జెనెటికల్ కౌన్సెలింగ్ హెల్ప్ అవుతుందా?
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్లో.. భవిష్యత్లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్గా జిమ్కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
40లోనే మోనోపాజ్.. ఏమైనా ప్రమాదమా?డాక్టర్లు ఏమంటున్నారంటే
నాకు 43 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావడం లేదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెనోపాజ్ అంటున్నారు. ఇంత త్వరగా నెలసరి ఆగిపోతుందా? మా అక్కకి 50 ఏళ్ల తరువాత ఆగిపోయాయి. 43 ఏళ్లకే ఆగిపోవడం ఏదైనా ప్రమాదమా? – సీహెచ్. లావణ్య, కర్నూలు ఎర్లీ మెనోపాజ్ అంటే 45 ఏళ్లు నిండకుండా నెలసరి ఆగిపోవడం. 40 ఏళ్లలోపు ఆగిపోతే అది ప్రీమెనోపాజ్. ఈ రోజుల్లో చాలామందికి 45 ఏళ్లలోపే నెలసరి ఆగిపోతోంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందువల్ల అండాలు విడుదలకాకుండా అండాశయాల్లోనే ఉండిపోయి నెలసరి రాదు. వీరిలో మస్కులోస్కెలిటల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మజిల్ మాస్ తగ్గినందువల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. మీరు ఏడాదికోసారి కార్డియో వాస్కులర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్లను సంప్రదిస్తుండాలి. వంద మందిలో అయిదుగురికి 45 ఏళ్లలోపు నెలసరి ఆగుతోంది. ఇలా మెనోపాజ్ త్వరగా వచ్చినా.. ఈస్ట్రోజెన్ థెరపీతో రిస్క్ని తగ్గించవచ్చు. జన్యుపరంగానైనా.. కాకపోయినా మీకు మెనోపాజ్ త్వరగా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా 51 ఏళ్లకు మెనోపాజ్ వస్తుంది. మీరు ఎర్లీ మెనోపాజ్లో ఉన్నారు కాబట్టి.. మీకు ఈస్ట్రోజెన్ థెరపీతో గుండె, ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదిస్తే.. మీకు ఎలాంటి మందులు ఇవ్వాలి.. వాటితో భవిష్యత్లో ఇతర రిస్క్స్ అంటే క్యాన్సర్ లాంటిదేమైన పొంచి ఉండే ప్రమాదం ఉందా అని పరిశీలిస్తారు. కాల్షియం, విటమిన్ డి మాత్రలు కూడా తీసుకోవాలి. వెజైనా పొడిబారుతుంటే లూబ్రికెంట్ జెల్ లేదా ఈస్ట్రోజెన్ క్రీమ్ని సూచిస్తారు. హెచ్ఆర్టీ.. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎంత వరకు పనిచేస్తుందో చూస్తారు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ను కూడా సూచిస్తున్నారు. -
మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను...
నాది నార్మల్ డెలివరీ. నెలవుతోంది. ఇంకా చాలా బ్లీడింగ్ అవుతోంది. మాది పల్లెటూరు. ఆసుపత్రి టౌన్లో ఉంది. డాక్టర్కి చూపించుకోవాలా? – డి. కృష్ణకుమారి, రంగరావు పేట ప్రసవమైన ఆరు వారాల వరకు అప్పడప్పుడు బ్లీడింగ్ అవడం సహజమే. కానీ అధిక రక్తస్రావం, క్లాట్స్, వాసన, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు మాత్రం నార్మల్ కాదు. మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ మీ టెంపరేచర్, యూటరస్, వెజైనల్ బ్లీడింగ్ మొదలైనవి చెక్ చేస్తారు. ఇంటర్నల్ స్కాన్ చేసి ప్లెసెంటాకు సంబంధించినవేమైనా మిగిలిపోయాయా.. ఇన్ఫెక్షన్ ఏమైనా సోకిందా అనీ పరీక్షిస్తారు. నార్మల్ డెలివరీలో అయితే కుట్లు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలా మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. అయినా మీరు బిడ్డకు పాలివ్వచ్చు. రక్త, మూత్ర పరీక్షలు చేసి.. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూస్తారు. మీకు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ అవసరం అవుతాయి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు, కోడిగుడ్లు, మాంసపు కూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కాళ్లల్లో, ఛాతీలో కూడా బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి టెడ్ స్టాకింగ్స్ను సజెస్ట్ చేస్తారు. మేడం.. నాకు 25 ఏళ్లు. ప్రైవేట్ పార్ట్స్లో తరచుగా ఇచ్చింగ్ వస్తూంటుంది. ఎన్నిసార్లు మందులు వాడినా.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంది. కిందటేడాది మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అయినా తగ్గట్లేదు. ఎందుకు? – సరళ గ్రేస్, పెనుగొండ మీరు చెప్పేదాన్ని బట్టి మీకు వెజైనల్ యీస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. దీన్ని వెజైనల్ కాండిడయాసిస్ అంటారు. ఈ కండిషన్లో దురద, డిశ్చార్జ్ ఉంటాయి. కానీ రికరెంట్ కాండిడయాసిస్ అంటే ఏడాదిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ వస్తే లాంగర్ ట్రీట్మెంట్ కోర్స్, మెయిన్టెనెన్స్ కోర్స్ను ప్రిస్క్రైబ్ చేయాలి. మామూలు మందులతో తగ్గదు. ఆయింట్మెంట్లు, క్రీములు, వెజైనాలో పెట్టుకునే మాత్రలతో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్ప ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గదు. సరైన చికిత్స అందాలంటే ఈ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను అంచనా వెయ్యాలి. యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడినా.. చక్కెర వ్యాధి అదుపులో లేకపోయినా, రోగనిరోధక శక్తి సన్నగిల్లినా, హార్మోన్స్ థెరపీ తీసుకుంటున్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా రిస్క్ పెరుగుతుంది. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ – స్పెక్యులమ్ ఎగ్జామ్ చేయించుకోవాలి. వెజైనల్ స్వాబ్ కల్చర్ పంపించాలి. లాంగ్ కోర్స్ వెజైనల్ థెరపీలో రెండు వారాలపాటు కంటిన్యుయస్గా యాంటీఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. తరువాత వారానికి ఒకసారి అలా ఆరు నెలల వరకు కొనసాగించాలి. ఓరల్ యాంటీఫంగల్ మందులను కూడా ఇస్తారు. రక్త, మూత్ర పరీక్షలను చేస్తారు. ఇలా కంప్లీట్ కోర్స్తో ఫంగల్ ఇన్ఫెక్షన్కి చికిత్సను అందిస్తారు.. అది తిరగబెట్టకుండా ఉండడానికి! నా వయసు 25 సంవత్సరాలు. ఈ మధ్య నాకు నెలసరికి ముందు చాలా నొప్పి, మూడ్ స్వింగ్స్, తలనొప్పి అనిపిస్తున్నాయి. నా జాబ్లో కూడా నేను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకేదైనా సమస్య ఉందా? – నైమిష, వైజాగ్ దీనిని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. ఇది ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వారి దినచర్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి. పీఎంఎస్కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల మార్పు వల్ల వస్తుందని అనుకుంటాం. మీలో ఉన్న మార్పులన్నీ ఒక కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటాం. దీనిని రెండు మూడు నెలలు రాసినప్పుడు కారణాలు తెలుస్తాయి. దినచర్యలో మార్పులతో దీనిని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతుల పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు వారాల ముందు నుంచి కాఫీ, టీ, జంక్ఫుడ్ తగ్గించుకోవడం, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల పీఎంఎస్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడుకోవలసి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ సప్లిమెంట్లు కూడా కొంత వరకు ఉపయోగపడతాయి. కొంతమందికి పైమార్పులతో కూడా లక్షణాలు తగ్గకపోతే, డాక్టర్లను సంప్రదిస్తే జీఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ మందులు ఇస్తారు. అత్యంత అరుదుగా ఈ సమస్యకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
Health: పందొమ్మిదేళ్లు.. తొలి చూలు ప్రెగ్నెంట్.. నార్మల్ డెలివరీ కావాలంటే?!
నాకు పందొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను తొలి చూలు ప్రెగ్నెంట్ని. టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్కి వెళ్లాలి? ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – టీ. ప్రణీత, ధర్మవరం ప్రెగ్నెన్సీలో వేసుకునే టెటనస్ ఇంజెక్షన్ వాక్సినేషన్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మన గవర్నమెంట్ సెటప్లో T.T plain ఇంజెక్షన్ను 13–39 వారాల మధ్యలో నాలుగు వారాల తేడాతో రెండు డోస్లు ఇస్తారు. సెకండ్ డోస్ టీటీ వాక్సీన్ను ప్రసవానికి కనీసం మూడు నెలల ముందు తీసుకునేట్టు చూడాలి. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ పాస్ అవడానికి.. హైకాన్సంట్రేషన్ ఉండటానికి సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు.. ప్రెగ్నెన్సీ సమయంలో 27– 36 వారాల మధ్య.. Tdap అనే కాంబినేషన్ వాక్సిన్ సింగిల్ డోస్ను ఇస్తున్నారు. దీన్ని మన దేశంలో కూడా ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్), ఎఫ్ఓజీఎస్ఐ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) అనుమతించాయి. చెకప్స్ విషయానికి వస్తే ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్స్ విషయానికి వస్తే.. మొదటి ఏడు నెలల వరకు నెలకు ఒకసారి చెకప్కి వెళ్లాలి. ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెలదాకా రెండు వారాలకు ఒకసారి చెకప్స్కి వెళ్లాలి. తొమ్మిదవ నెలలో వారానికి ఒకసారి చెకప్కి వెళ్లాలి. ఇలా కరెక్ట్గా చెకప్స్కి వెళ్తే తల్లీ, పొట్టలోని శిశువు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. బీపీ, సుగర్, థైరాయిడ్లాంటివి డిటెక్ట్ చేసి.. వెంటనే చికిత్సను అందించే వీలు ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మందులను ఇస్తూ ప్రసవం సాఫీగా అయ్యేలా చూసే చాన్స్ ఉంటుంది. గర్భస్థ శిశువు పెరుగుదలను చూడ్డానికి స్కాన్, TIFFA స్కాన్, NT స్కాన్ను సజెస్ట్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావడానికి ప్రెగ్నెన్సీ మొదలు పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కొన్ని మెడికల్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ముందుగానే డాక్టర్ను కలిస్తే.. మెడికల్ హిస్టరీ తెలుసుకుని.. ప్రెజెంట్ కండిషన్ను అంచనా వేస్తారు. రిస్క్ ఉంది అనుకుంటే.. తొమ్మిదవ నెల నిండాక ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం వంద శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు. తొమ్మిదవ నెలలో పెరినియల్ మసాజెస్.. నార్మల్ డెలివరీకి కొంతవరకు సాయపడవచ్చు. కనీసం ఒక గంట వాకింగ్, 15– 20 స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామం అందుతుంది. అధిక బరువు లేకుండా, బీపీ, సుగర్, థైరాయిడ్లు రాకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి. రెగ్యులర్ చెకప్స్లో ఇంటర్నల్ పెల్విస్ చెక్ చేసి నార్మల్ డెలివరీ చాన్స్ ఎంత ఉందో మీ డాక్టర్ చెబుతారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఆ సర్జరీ చేయించుకుంటే .. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా?
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. వైవాహిక జీవితంలో సమస్యలు? అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి. ప్రత్యేకంగా టెస్టులు విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్తో చూపించుకోవాలి. బీఎమ్ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్ల ఫాలో అప్లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ని బట్టి తీసుకోవాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?
సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?అంటే దానికి ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమిటి? – కొండపల్లి వాసవి, నందిగామ సరోగసీ అంటే అద్దెకు గర్భాన్ని తీసుకోవడం. ఎవరికైనా గర్భధారణ కష్టమైనప్పుడు గర్భకోశం బిడ్డని మొయ్యలేదని తేలినప్పుడు వాళ్ల అండం.. స్పెర్మ్ టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెంది పిండంగా మారాక దాన్ని ఇంకొకరి గర్భంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్లాంట్ చేసి.. వారు డెలివరీ తరువాత బయోలాజికల్ పేరెంట్స్కి తిరిగి ఇచ్చేయడం.. ఇదన్న మాట ఆ ప్రక్రియ. మన దేశంలో అయితే కమర్షియల్ సరోగసీకి అనుమతి లేదు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ పని చేయాలి. ఇండియన్ సరోగసీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన దంపతులు ఏవైనా అనారోగ్య సమస్యల వల్ల ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతే.. ఒకసారి మాత్రమే సరోగేట్ ప్రెగ్నెన్సీని మోయాలి. ఐవీఎఫ్కి 3 అటెంప్ట్స్ మాత్రమే ప్రయత్నించాలి. శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండాలి. వైద్య ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. గోప్యతను పాటించాలి. సరోగసీ కోసం రిజిస్టర్ అయిన సంతానసాఫల్య కేంద్రంలో మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: తొలి చూలు అలా.. ఇప్పుడు మళ్లీ ఇలా! భయంగా ఉంది..
ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత వచ్చే గర్భం కూడా ఎక్టోపిక్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే నాకు తొలి చూలు ముత్యాల గర్భమని తేలడంతో సర్జరీ చేసి ఆ గర్భాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే భయంగా ఉంది. – బి. రాధిక మూర్తి, విశాఖపట్టణం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భసంచిలో కాకుండా బయట అంటే ఫాలోపియన్ ట్యూబ్స్లో, అండాశయాల్లో, పొత్తికడుపులో నిలవడం. దీన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా కనిపెడ్తారు. ఈ గర్భం నిలిచిన స్థానం, పరిమాణం, బ్లడ్ వాల్యూ మీద దీని చికిత్స ఆధారపడి ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్లో గర్భం నిలవడమనేది సాధారణంగా అంటే ఒక శాతం మందిలో చూస్తాం. కారణాలివే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చినవారిలో మళ్లీ 11 నుంచి 20 శాతం వరకు వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని కేసెస్లో కారణం తెలిసినప్పుడు దానికి సరైన చికిత్స చేస్తే.. ఎక్టోపిక్ మళ్లీ వచ్చే చాన్స్ని తగ్గించవచ్చు. ట్యూబ్స్ డామేజ్ అవడం, ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ సర్జరీ, అతుక్కుని ఉండడం.. వంటివి కొన్ని కారణాలు. ట్యూబ్స్లో, ఓవరీస్లో నిలిచే ప్రెగ్నెన్సీ వల్ల లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చిన వారు.. ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొంతమందిలో కాపర్ – టీ అనే గర్భనిరోధక డివైజ్ గర్భసంచిలో ఉన్నప్పుడు.. ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే చాన్సెస్ ఎక్కువ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల్లోనూ ఎక్టోపిక్ చాన్సెస్ ఎక్కువే. 6 – 7 వారాల ప్రెగ్నెన్సీలోనే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ద్వారా ఎక్టోపిక్ను కనిపెట్టవచ్చు. ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే దానికి మందులు, శస్త్రచికిత్స .. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మందులతో చికిత్స అనేది కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో చేస్తాం. Methotrexate అనే ఇంజెక్షన్ ఇస్తాం. ఇది తీసుకున్న తరువాత మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చెయ్యాలి. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఈ ఎక్టోపిక్ వచ్చే చాన్స్ అరుదుగా ఉండొచ్చు. మీకు ఇంతకుముందు ముత్యాల గర్భం వచ్చింది అన్నారు. అది క్రోమోజోమ్స్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది. దీన్ని సర్జరీ ద్వారా తొలగించినా ఏడాది వరకు ఫాలో అప్ కేర్ అవసరం ఉంటుంది. మీకు హెచ్సీజీ హార్మోన్ లెవెల్స్ను బ్లడ్ టెస్ట్ ద్వారా పరీక్షించి కంట్రోల్ అయిందా లేదా చూస్తారు. అయితే వందలో ఒకరికి ఈ ముత్యాల గర్భం రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. ఎక్టోపిక్ లాగే దీన్ని కూడా తక్కువ వారాల వ్యవధిలోనే స్కానింగ్లో గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు గర్భంతో ఉన్నాను అంటున్నారు కాబట్టి.. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే.. -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్ని, షేప్ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
Health: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్ను రీప్లేస్ చేయవచ్చా? – సీహెచ్. వెంకటలక్ష్మి, సామర్లకోట మెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు. మెనోసాజ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు. వారికి హెచ్ఆర్టీ సురక్షితం కాదు ఒకవైళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్ను సింగిల్ డోస్గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం?
నాకు 26 ఏళ్లు. సడెన్గా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ మొదలైంది. పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయి. అయినా ఇలా పై పెదవి మీద, చుబుకం కింద, చెంపలకు డార్క్గా హెయిర్ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి ప్లీజ్! – మాన్విత, హైదరాబాద్ అన్వాంటెడ్ హెయిర్ని హర్సుటిజమ్ (Hirsutism)అంటారు. శరీరంలో ఆండ్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు ఇలా సడెన్గా మొహం, ఛాతి, పొత్తి కడుపు మీద, వీపు, తొడల మీద ఇలా డార్క్గా హెయిర్ వస్తుంది.ఈ సమస్య కనపడగానే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ లేదా స్కిన్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. సాధారణంగా పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్లలో ఇలా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ను చూస్తాం. అయితే ఈ పీసీఓఎస్లో నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం వంటి సమస్యలూ ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్ అనే కండిషన్లో కాటిసాల్ (Cartisol) స్థాయి పెరిగి అవాంఛిత రోమాల సమస్య వస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడినా ఈ సమస్య తలెత్తవచ్చు. క్రీమ్స్ వాడుతున్నట్టయితే కేశ, చర్మ సంరక్షణకు సంబంధించిన మినాక్సిడిల్, డనేజోల్ వంటి మందుల వల్లా ఈ సమస్య రావచ్చు. మీరు స్కిన్ కోసం ఏవైనా క్రీమ్స్ వాడుతున్నట్టయితే ఒకసారి దాని కంపోజిషన్ చెక్ చేసుకోండి. ఒకసారి డాక్టర్ను సంప్రదిస్తే మీ హెల్త్ హిస్టరీలో పైన వివరించిన కండిషన్స్ గురించి తెలుసుకుంటారు. కొన్ని రక్తపరీక్షలు చేసి టెస్టోస్టిరాన్ స్థాయి, ఆండ్రోజెన్ స్థాయిలను చెక్ చేస్తారు. అబ్డామిన్ స్కాన్ చేసి.. అడ్రినల్ గ్లాండ్లో ఏవైనా గడ్డలున్నాయా అని కూడా చెక్ చేస్తారు. కొన్నిసార్లు సీటీ స్కాన్ అవసరం కావచ్చు. ఇవన్నీ లేవని తేలి.. నెలసరి క్రమం తప్పకుండా వస్తూంటే.. తాత్కాలిక హెయిర్ రిమూవల్ సొల్యూషన్స్ను సూచిస్తారు. కొంతమందికి గర్భనిరోధక మాత్రలు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. శాశ్వత చికిత్స అవసరం లేదు ఎండోక్రైన్ అంటే హార్మోన్ సమస్య లేకపోతే అవాంఛిత రోమాలకు శాశ్వత చికిత్స అవసరం లేదు. ఉన్న కండిషన్, సమస్యకు తగ్గట్టుగా చికిత్సను అందించాలి. ట్రీట్మెంట్ ప్రభావం కనిపించడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నా.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నా ఈ ట్రీట్మెంట్ను తీసుకోకూడదు. అవాయిడ్ చేయాలి. చాలామందిలో ఏ ఆరోగ్యసమస్య లేకుండా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ రావచ్చు. అలాంటివారు లేజర్, ఎలక్ట్రాలిసిస్ వంటి హెయిర్ రిమూవల్ ఆప్షన్స్ గురించి ఆలోచించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
Health: పదిహేడేళ్లు.. ఏ అనారోగ్యం లేదు.. అయినా ఎందుకిలా?!
మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంకా రజస్వల కాలేదు. ఏ అనారోగ్యమూ లేదు. అయినా రజస్వల ఎందుకు కావట్లేదో తెలియడం లేదు. – అనూరాధ, చింతలపూడి డిలేయ్డ్ మెనాకీ సాధారణంగా పదమూడేళ్ల లోపు బ్రెస్ట్ డెవలప్మెంట్, పదహారేళ్లలోపు నెలసరి మొదలు అవుతాయి. పదహారేళ్ల తర్వాత కూడా రాకపోతే డిలేయ్డ్ మెనాకీ (delayed menarche) అంటాము. చాలామంది అమ్మాయిలు తక్కువ బీఎమ్ఐ.. అంటే ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి 17 కన్నా తక్కువ ఉంటే బరువు పెరిగిన తర్వాతే నెలసరి మొదలవుతుంది. కొంమందిలో హార్మోన్స్ ఇంబాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ఆలస్యంగా రజస్వల అవుతారు. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మన్ డాక్టర్)ను సంప్రదించాల్సి రావచ్చు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఆక్సిలా, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ గ్రోత్ ఉండడం, బ్రెస్ట్ డెవలప్మెంట్ మొదలవడం కనుక ఉంటే హార్మోన్ల పరీక్ష అవసరం లేదు. తక్కువ బరువు ఉన్నా ఆలస్యంగానైనా నెలసరి మొదలవ్వొచ్చు. కానీ పదిహేడేళ్లు దాటినా ఇలాంటి మార్పులేనప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించాలి. స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నవారిలో కూడా పీరియడ్స్ లేట్గానే మొదలవుతాయి. వయస్సుకి ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నా నెలసరి ఆలస్యంగానే మొదలువుతుంది. ఒకసారి స్కానింగ్ చేయించి, డాక్టర్ను సంప్రదిస్తే .. థైరాయిడ్ పరీక్ష చేసి ఏ సమస్యాలేదు అంటే.. నెలసరి కోసం వేచి చూడవచ్చు. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: ఫోర్స్ చేస్తున్నారు -
Health: డెలివరీ తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు! కారణమేంటి?
Postnatal Stress Disorder: మా అక్క రీసెంట్గా డెలివరీ అయింది. నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశారు. హఠాత్తుగా బేబీ హార్ట్ బీట్ తగ్గడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. డెలివరీ అయినప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కంగారుగా ఉంటోంది. నిద్ర పోవడం లేదు. కోపమూ ఎక్కువైంది. అగ్రెసివ్గా బిహేవ్ చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. ప్రసవం తర్వాత సహజంగానే ఇలా ప్రవర్తిస్తారా? – రమణి మీరు చెప్పినదాన్ని బట్టి తనకి యాంగ్జైటీ ఉన్నట్టుంది. మామూలుగా డెలివరీ టైమ్లో చాలా మార్పులు ఉంటాయి. హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. డెలివరీ హఠాత్తుగా కాంప్లికేట్ అయినా, వాళ్లు ఊహించినట్లు కాకపోయినా, బర్త్ ట్రామాతో మానసికంగా డిస్టర్బ్ అవుతారు. దీనిని పీఎన్ఎస్డీ.. పోస్ట్నాటల్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. దీన్ని ఎమోషనల్ కేర్, సపోర్ట్తో సంభాళించాలి. చాలామందికి మందుల అవసరం ఉండదు. కొంతమంది తమ ప్రసవం తాలూకు విషయాలను పదే పదే గుర్తుతెచ్చుకుంటూ.. అదే పునరావృతమవుతున్నట్టు భావిస్తారు. దీనివల్ల చురుకుదనం, బిడ్డ మీద శ్రద్ధ, ఆత్మవిశ్వాసమూ తగ్గుతాయి. తమను తామే నిందించుకునే స్థితిలోకి వెళ్లిపోతారు. వీళ్లకు టాకింగ్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. ప్రసవమప్పుడు జరిగిన అనుకోని సంఘటలను వాళ్ల మెదడు యాక్సెప్ట్ చేయడానికి ఈ టాకింగ్ థెరపీ దోహదపడుతుంది. డాక్టర్ను సంప్రదిస్తే ఈ థెరపీ గురించి చెప్తారు. ఏ సమయంలో వాళ్ల మూడ్ చేంజ్ అవుతోందో గమనించాలి. కొన్ని తేదీలు.. వాసనలు.. మనుషులను చూసినప్పుడు పాత విషయాలు, ఎక్స్పీరియెన్సెస్ గుర్తుకువచ్చి డిప్రెస్ అవుతారు. డిప్రెషన్ ఎక్కువగా ఉంది అంటే దానికి సంబంధించి మందులు వాడాలి. కొన్నిసార్లు నమ్మకం ఉన్నవారితో తమ ఆలోచనలను షేర్ చేసుకొమ్మని సూచిస్తాం. చాలాసార్లు కౌన్సెలింగ్తో సమస్యను పరిష్కరించవచ్చు. పాత అనుభవంతో కొంతమందికి భవిష్యత్లో ప్రెగ్నెన్సీ అంటేనే భయం పట్టుకోవచ్చు. అందుకే సమస్య కొంచెంగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదిస్తే ఏ విధమైన కౌన్సెలింగ్ ఇవ్వాలి అనేది నిర్ణయించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. పరిష్కారం ఏమిటి?
మాది మేనరికం. పెళ్లై మూడేళ్లవుతోంది. పిల్లల్లేరు. నెల నిలిచినా ఆగట్లేదు. నాలుగు సార్లు అబార్షన్ అయింది. నాకింకా పిల్లలు పుట్టరా? – కె. ఇందుమతి, మెదక్ నాలుగు సార్లు అబార్షన్ అవడం అనేది చాలా అరుదు. కారణం తెలుసుకోవడానికి కంప్లీట్ ఓవ్యులేషన్ చేయించుకోవాలి. మేనరికం ఒక్కటే కారణం కాకపోవచ్చు. రెండుసార్లు అబార్షన్ అయిన తరువాత ఇటు పిండానిదీ, అటు తల్లిదండ్రులదీ జెనెటిక్ మేకప్ అనేది కచ్చితంగా చేయించాలి. మూడు నాలుగుసార్లు గర్భస్రావం అయిన తరువాత కూడా గర్భం వచ్చి.. నిలిచే అవకాశం లేకపోలేదు. అయితే మీరు ఒకసారి గర్భసంచి లోపల సెప్టమ్ లేదా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా.. గర్భసంచి ముఖద్వారం అంటే సెర్విక్స్ ఏమైనా వీక్గా ఉందా డిటైల్డ్ పెల్విక్ ఆల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. కొంతమందిలో రక్తం గడ్డకట్టడం ఎక్కువగా ఉంటుంది. వీళ్లకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బిడ్డకి వెళ్లే రక్తనాళాల్లో గడ్డకడితే బిడ్డ ఎదుగుదల లేకపోవడం.. గర్భస్రావం జరగడం వంటివి సంభవిస్తాయి. దీనిని అ్కఔఅ సిండ్రోమ్ అంటారు. దీనిని రక్త పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే సరైన రేంజ్లో ఉండేట్టు చూడాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్ కారణాలతో గర్భస్రావం అవుతుంటే అది ప్రతిసారి రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. కానీ మీది మేనరికం అంటున్నారు కాబట్టి ఒకసారి మీది, మీవారిది కార్యోటైప్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ కౌన్సెలింగ్కి తప్పనిసరిగా వెళ్లాలి. కొన్ని టెస్ట్లు చేసి మళ్లీ గర్భస్రావం అయ్యే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ లేకపోయినా మళ్లీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 60 శాతం ఉంటుంది. అయినా ఒకసారి పైన చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ కంటే మూడు నెలల ముందు నుంచే బీ–కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకోవడం మొదలుపెట్టాలి. హెల్దీ, బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! వాళ్ల మాటలు నిజమే అంటారా?
Thyroid- Pregnancy Possibilities: నాకిప్పుడు 22 ఏళ్లు. మొన్ననే ఉద్యోగంలో చేరాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే అయిదేళ్ల కిందట నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అంటున్నారు నా సన్నిహితులు. అది నిజమేనా? – వీణ, భైంస ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ థైరాయిడ్ డిజార్డర్స్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చూస్తున్న సమస్య. సరైన సమయంలో సరైన చికిత్సతో ఫెర్టిలిటీ, గర్భధారణ, ప్రసవం వంటి వాటి మీద ఈ సమస్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని HPO axis అనేది బ్రెయిన్లో కంట్రోల్ చేస్తుంది. ఇదే HPO axis ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ను కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి, అండాశయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భందాల్చే అవకాశాలు, హెల్దీ ప్రెగ్నెన్సీ, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశాలు తక్కువ. అందుకే 25–5 ఏళ్ల మధ్య ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వారికి తప్పనిసరిగా మొదట టీఎస్హెచ్ పరీక్ష చేస్తాం. గర్భస్రావం అయ్యే రిస్క్ ఈ వాల్యూ 2.5 కన్నా తక్కువ ఉంటే అవుట్కమ్ బాగుంటుందని అర్థం. గర్భస్రావం అయ్యే రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ లెవెల్ సరిగ్గానే ఉన్నా థైరాయిడ్ యాంటీబాడీస్ పాజిటివ్గా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. గర్భస్రావం అయ్యే రిస్క్ని పెంచుతాయి. కడుపులో బిడ్డ మెదడు పెరుగుదల మీదా ప్రభావం పడుతుంది. థైరాయిడ్ సమస్యకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూంటే ఈ రిస్క్ తగ్గుతుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ సమస్య వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. దీనివల్ల గర్భధారణా ఆలస్యం అవుతుంది. వెంటనే చికిత్స మొదలుపెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి నెల టీఎస్హెచ్ టెస్ట్ చేస్తూ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అని చూస్తాం. దాన్నిబట్టి మందుల డోస్ను అడ్జస్ట్ చేస్తాం. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Birth Control Methods: ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా.. ఇలా చేశారంటే! Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా.. -
ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా సరే..
Health- Safest Contraceptive Methods: నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం ఉంచాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – లక్ష్మీ వాసంతి, కడప ప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు. సమస్యలు ఉండవు అవి శరీరంలోకి ఇన్సెర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు. మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్ను విడుదల చేస్తూ బ్లీడింగ్ని తగ్గిస్తుంది. కాపర్ టీ కాయిల్ ఎందుకంటే! ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్ను సూచిస్తారు. అవుట్ పేషంట్గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు! -
ఛీ.. ఛీ ఇదేం ఎయిర్ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు
దోహ ఎయిర్పోర్ట్లో ఆస్ట్రేలియాకి చెందిన ఐదుగురు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది. సదరు మహిళా ప్రయాణికులు 2020లో ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నప్పుడూ ఘోర పరాభవాన్ని చవి చూశారు. దీంతో సదరు మహిళలు ఆ ఖతార్ ఎయిర్ వేస్పై దావా వేయాలని సన్నద్ధమవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అక్టోబోర్ 2020లో ఖతార్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వెళ్లినప్పుడూ ఆ మహిళలు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే...అక్కడ ఖతార్లో పెళ్లికాకుండా గర్భం దాల్చితే వారిని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తుంది. ఐతే ఆ రోజు ఈ మహిళలు దోహా ఎయిర్పోర్ట్లో ఖాతర్ ఎయిర్వేస్లో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో దోహా ఎయిర్పోర్ట్ బాత్రూంలో ఒక నవజాత శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు సదరు మహిళలను తుపాకితో బెదిరించి బలవంతగా అంబులెన్స్లో టార్మాక్కు తీసుకెళ్లి బలవంతంగా గైనాకలజిస్ట్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రయాణికురాలు నర్సు మాట్లాడుతూ... ఆ ఘటన తర్వాత మళ్లీ ఈ ఎయిర్వేస్లో ప్రయాణించలేదని, చాలా మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. సదరు మహిళా ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్పై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఖతార్ అధికారులు ఈ విషయమై ఆ మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేసి సదరు అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...) -
Health Tips: బర్త్ ప్లాన్ అంటే ఏమిటి? డెలివరీ టైమ్లో..
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. చాలా ఆసుపత్రుల్లో బర్త్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నారని తెలిసింది. అసలు ఈ బర్త్ ప్లాన్ అంటే ఏంటండీ? – కె. అమరజ, నాగర్ కర్నూల్ బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి తల్లికి మరచిపోలేని అనుభవం.. అనుభూతి. అలాంటి ప్రసూతికోసం ఉన్న చాయిసెస్ ఏంటో తెలుసుకుని వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న చాయిస్ను ముందుగానే డాక్టర్కు, స్టాఫ్, నర్సెస్, మిడ్వైఫ్కి తెలియజెప్పే అవకాశాన్ని బర్త్ ప్లాన్ ఇస్తుంది. ప్రసవ ప్రక్రియ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం కష్టం. డెలివరీ టైమ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు డాక్టర్, స్టాఫ్ సపోర్ట్ ఎంత వరకు కావాలనుకుంటున్నారు.. ఎలాంటి వాతావరణంలో ప్రసవాన్ని కోరుకుంటున్నారు.. ఎలాంటి మందులు వాడాలి.. పెయిన్ రిలీఫ్కి ఏవి కావాలి .. ప్రసవమప్పుడు ఎలాంటి సాయం పొందాలనుకుంటున్నారు.. వంటి విషయాలన్నిటినీ మీరు, మీ భర్త ఇద్దరూ కలసి డాక్టర్స్తో చర్చించే అవకాశాన్ని ఈ బర్త్ ప్లాన్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బర్త్ ప్లాన్ అనేది మీ ప్రసవానికి ఒక గైడ్ లాంటిది. దీని గురించి ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల మధ్యలో ఎప్పుడైనా గైనకాలజిస్ట్తో డిస్కస్ చేయొచ్చు. మీకు ప్రెగ్నెన్సీతో పాటు ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేకపోతే ఇప్పుడు మీరు మీ బర్త్ ప్లాన్ను పూర్తిగా ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు కానీ.. బిడ్డకు కానీ మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరమయ్యి డాక్టర్ మీ బర్త్ ప్లాన్ను ఫాలో కాలేకపోతే ఆ విషయాన్ని మీకు ముందుగానే చెప్పి మీకున్న ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ బర్త్ ప్లాన్లో.. మీ డెలివరీ టైమ్లో మీతోపాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు.. మీ హజ్బెండ్ లేక మీ అమ్మగారు, లేదంటే మిడ్వైఫ్ లేక ఫ్రెండ్ .. ఇలా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారో సజెషన్స్లో ముందే పేర్కొనవచ్చు.. మీ ప్రసవమప్పుడు బీన్ బాగ్స్, బర్తింగ్ బాల్స్, మాసాజెస్, లేదా అటూ ఇటూ నడవడం వంటి వాటిలో ఏవి కావాలనుకుంటున్నారు.., సంగీతం వినాలనుకుంటున్నారా? ఒకవేళ సంగీతం వినాలనుకుంటున్నట్టయితే మంద్రమైన సంగీతాన్ని ఇష్టపడ్తారా? పెద్ద సౌండ్ అంటే చిరాకుగా ఉందా? మంద్రమైన కాంతి లేదా బ్రైట్ లైట్.. మరీ చల్లగా ఇష్టమా? లేక వేడిగా.. వెచ్చగా ఇష్టమా? ఎలాంటి పెయిన్ రిలీఫ్ కావాలనుకుంటున్నారు? పారాసిటమాల్, ఎంటోనాక్స్ (గ్యాస్), ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్ ఎనాల్జెసికా? సహజంగా నొప్పులు పెరగాలనుకుంటున్నారా? లేక ఇంజెక్షన్స్, మాత్రలతో నొప్పులను పెంచమంటారా? ముందే వాటర్ బ్రేక్ (ఉమ్మనీరు పోయేలా)అయ్యేలా చేయమంటారా? లేదా సహజంగా బ్రేక్ అయ్యేవరకు వేచి చూస్తారా? మాయ సహజంగానే పడిపోవాలా? లేక ఇంజెక్షన్స్ ద్వారానా? బిడ్డ బొడ్డు తాడు ఎవరు కట్ చేయాలి? మీరా? మీ భర్తా? లేక మిడ్వైఫ్ చెయ్యాలా? బిడ్డకు మీ పాలు పడతారా? లేక పోత పాలా? వంటి కొన్ని ఆప్షన్స్ను గైనకాలజిస్ట్ ఒక బుక్లెట్ రూపంలో మీకు తెలియజేస్తారు. మీరు చర్చించుకొని ఆ ఆప్షన్స్ను ఎంచుకోవచ్చు. మీకు ఎప్పుడు నొప్పులు వచ్చినా ఈ బుక్లెట్లో మీరు ఇచ్చిన ఆప్షన్స్ను డాక్టర్లు ఫాలో అవుతారు. ఒకవేళ మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి ఆప్షన్స్ను ఫాలో అయితే మీకు సేఫ్గా ఉంటుందో వాటిని డాక్టర్లు మీకు సూచిస్తారు. వీటిన్నిటి వల్ల ప్రసవాన్ని గొప్ప అనుభవంగా.. మంచి అనుభూతిగా మలచుకునే వీలు ఉంటుందన్నమాట. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Health: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! డోనర్ స్పెర్మ్ ద్వారా
మాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. పిల్లల్లేరు. టెస్ట్స్ చేయించుకుంటే మా వారికి స్పెర్మ్ కౌంట్ తక్కువ అని తేలింది. డాక్టర్లు ఐవీఎఫ్ సూచించారు. మావారి స్పెర్మ్ కౌంట్ తగినంత లేదు కాబట్టి.. డోనర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు. – జి. మాలిని, బెంగళూరు Sperm Donor: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే కౌంట్ను పెంచడానికి కొన్ని మందులను డాక్టర్ సూచిస్తారు. అవి వాడిన మూడు నెలల తర్వాత మళ్లీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేస్తారు. అయితే అరుదుగా కొన్ని కేసెస్లో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా అంటే మంచి స్ట్రక్చర్ లేని స్పెర్మ్ ఉన్నప్పుడు వాటి మొటిలిటీ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు మందులతోటి ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతాయి. అలాంటి కేసెస్లో డోనర్ స్పెర్మ్ను సజెస్ట్ చేస్తారు. చాలాసార్లు స్పెర్మ్ డీఎన్ఏలో లోపాలు ఉన్నప్పుడు డోనర్ స్పెర్మ్ను సూచిస్తారు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో సక్సెస్ రేట్స్కి చాలా ఫ్యాక్టర్స్ను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ స్పెర్మ్ డీటైల్డ్ ఎనాలిసిస్ విత్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్టడీస్ వల్ల స్పెర్మ్ మార్ఫాలజీ కనిపెట్టవచ్చు. పదేపదే గర్భస్రావం అవుతుంటే ఈ స్పెర్మ్ స్ట్రక్చర్లో సమస్య ఉండొచ్చు. భర్తకు ఏదైనా జెనెటిక్ మెడికల్ కండిషన్ ఉన్నా.. స్పెర్మ్ క్వాలిటీ తగ్గినా.. డోనర్ స్పెర్మ్ను సూచిస్తారు. స్పెర్మ్ డోనర్స్ స్క్రీనింగ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అని వైరల్ ఇన్ఫెక్షన్స్ స్క్రీనింగ్ చేస్తారు. స్పెర్మ్ 750 శాతం మొటైల్ 74 శాతం నార్మల్ మార్ఫాలజీ ఉండి కౌంట్ 39 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ 15 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, డీఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ 30 శాతం కంటే తక్కువ ఉంటే డోనర్ స్పెర్మ్ అవసరం ఉండదు. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త -
Health: ఐదో నెల ప్రెగ్నెన్సీ.. కాళ్ల వాపులు.. నొప్పిగా ఉన్నా, పాదాలు ఎర్రగా అవుతున్నా..
నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. అయిదవ నెల. కాళ్లకు వాపులు వచ్చాయి. భయంగా ఉంది. డాక్టర్ను కన్సల్ట్ చేయాలా? – ఎన్. ప్రగతి, సూరారం ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు అనేది సర్వసాధారణం. అయితే నొప్పిగా ఉన్నా, పాదాలు ఎర్రగా అవుతున్నా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇన్ఫెక్షన్ ఉన్నా.. బ్లడ్ క్లాట్స్ ఉన్నా నొప్పి, ఎరుపు రంగు ఉంటాయి. బ్లడ్ థిక్గా అయినప్పుడు గర్భిణీల్లో బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇవి కాళ్లల్లో, చెస్ట్లో ఎక్కువగా వస్తాయి. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించి.. నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే రిస్కేమీ ఉండదు. ఒకవేళ ఇవి బ్లడ్ క్లాట్స్ అయితే కొన్నిసార్లు అవి కాళ్ల నుంచి రక్తం ద్వారా చెస్ట్కి వ్యాపిస్తే దమ్ము, ఆయాసం వచ్చి ఎమర్జెన్సీకి దారి తీస్తుంది. అందుకే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. రెండు కాళ్లకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే స్కానింగ్ చేస్తారు. బ్లడ్ క్లాట్స్ ఉన్నాయేమో చెక్ చేస్తారు. సురక్షితమైన యాంటీబయాటిక్స్ను సూచిస్తారు. కాపడం పెట్టుకోవచ్చు. ఒకటి.. రెండు రోజుల్లో తగ్గకపోతే తదుపరి పరీక్షలను సూచిస్తారు. కొంతమందికి Heparin అనే ఇంజెక్షన్ అవసరం అవుతుంది. మీరు ఒకసారి బాడీ టెంపరేచర్ చెక్ చేయించండి. డీవీటీ/ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ప్రెగ్నెన్సీలో వెయ్యిలో ఒకరికి వస్తుంది. దీనివల్ల కాళ్ల వాపులు, కాళ్లు బరువుగా ఉండడం, నొప్పి, కాళ్లు ఎర్రబాడడం వంటివి ఉంటాయి. కొన్ని కేసెస్లో ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా చేస్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
Health Tips: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా?
నాకు 55 ఏళ్లు. ఏడాదిగా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గర్భసంచి జారింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతో నా సమస్య తగ్గే మార్గం లేదా? – ఎన్. విజయలక్ష్మి, బాల్కొండ గర్భసంచికి ఉండే సపోర్ట్ స్ట్రక్చర్స్ అయిన లిగమెంట్స్, మజిల్స్ని పెల్విక్ ఫ్లోర్ అంటారు. వయసు పైబడుతున్న కొద్దీ పెల్విక్ ఫ్లోర్ బలహీనమవుతూ ఉంటుంది. దాంతో గర్భసంచి, యూరిన్ బ్యాగ్, మోషన్ ఏరియా వదులై జారుతుంది. యూరిన్ బ్యాగ్ ఉన్న స్థానం నుంచి కిందికి జారినప్పుడు యూరిన్ పూర్తిగా ఖాళీ అవకపోవడం, పదేపదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కాళ్లు, నడుము నొప్పి ఉంటాయి. దీనిని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటాం. కారణాలు ఇవే! యూరిన్ బ్యాగ్ మాత్రమే జారితే cystocele qgzeg.యాభై ఏళ్లు దాటిన వాళ్లలో పదిలో ఎనిమిది మందికి ఇలాంటివి ఉంటాయి. ప్రసవాలు, అధిక బరువు, తీవ్రమైన మలబద్ధకం, తీవ్రమైన దగ్గు, అధిక బరువులను ఎత్తడం, పైబడుతున్న వయసు వంటి కారణాల వల్ల గర్భసంచి జారుతుంది. ఇది డాక్టర్ చేసే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ద్వారా తెలుస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి వైద్య పరీక్షలు చేస్తారు. అల్ట్రాస్కానింగ్ చేస్తారు. కొందరి విషయంలో యూరోడైనమిక్ స్టడీస్ అవసరం ఉంటుంది. ఈ సమస్యకు చాలా చికిత్సా పద్ధతులున్నాయి. చిన్న ప్రొలాప్స్ అయితే కనుక జీవన శైలిని మార్చుకుని అంటే అధిక బరువు ఉంటే వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవడం, దగ్గు, మలబద్ధకానికి చికిత్స తీసుకోవడం, అధిక బరువులు ఎత్తకుండా చూసుకోవడం వంటివాటి పట్ల శ్రద్ధ పెట్టి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి పెల్విక్ ఫ్లోర్ పటుత్వాన్ని కాపాడుతాయి. బలహీనమైన కండరాలను బలోపేతం చేస్తాయి. మూడు నుంచి ఆరు నెలల వరకు నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. వెజైనల్ హార్మోన్ క్రీమ్స్ .. ఈస్ట్రోజెన్ క్రీమ్తో కూడా ఆ అసౌకర్యం కొంత తగ్గే అవకాశం ఉంది. vaginal pessary అని సిలికాన్ రింగ్ దొరుకుతుంది. దీన్ని డాక్టర్ పర్యవేక్షణలో వెజైనాలో అమర్చి.. ప్రొలాప్స్ తగ్గుతుందా లేదా అని చూస్తారు. ఈ pessaryని డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతో చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం. పైన విధానాలేవీ పనిచేయనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్లో యూరిన్ బ్యాగ్ని, గర్భసంచిని పైకి లిఫ్ట్ చేసి సపోర్ట్ చేస్తారు. దీంతో యూరినరీ, పెల్విక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు! Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా.. -
Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు!
చాలా ఏళ్లుగా మైగ్రేన్తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ను. మూడవ నెల. ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే మందుల్లేకుండా ఎలాంటి జాగ్రత్తలతో తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చో చెప్పగలరు. – సి. కళ్యాణి, మండపేట మైగ్రేన్ అనేది చాలా కామన్గా చూసే తలనొప్పిలో ఒక రకం. చాలామందికి ఈ తలనొప్పితో వాంతులు, ఎసిడిటీ వస్తాయి. మైగ్రేన్ను సరిగ్గా కంట్రోల్ చేయకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. మైల్డ్ హెడేక్ అయితే నీళ్లు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం, పారాసిటమాల్ తక్కువ డోస్ మాత్ర వేసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. గర్భం దాల్చిన నాటి నుంచే... ఒత్తిడి వల్ల కూడా మైగ్రేన్ పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ను అలవాటు చేసుకోవాలి. గర్భం దాల్చిన దగ్గర్నుంచే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయాలి. శ్రావ్యమైన సంగీతం వింటూండాలి. మైగ్రేన్ రావడానికి కారణాలు ఏముంటున్నాయో గుర్తించాలి. కొంతమందికి సమయానికి భోజనం చేయకపోయినా.. లేదా భోజనం స్కిప్ అయినా, నిద్రలేకపోయినా మైగ్రేన్ అటాక్ అవుతుంది. సురక్షితమేనా? ఈ ట్రిగ్గర్ పాయింట్లను గ్రహించి.. సమయానికి భోజనం.. 8– 10 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పారాసిటమాల్, వాంతులు తగ్గే మందులతో మైగ్రేన్ను చాలా కంట్రోల్ చేయవచ్చు. తరచుగా మైగ్రేన్ వచ్చే వాళ్లకు ప్రెగ్నెన్సీలో ప్రభావం చూపని సురక్షితమైన మందులను డాక్టర్లు సూచిస్తారు. వాటిని ఎలా వాడాలో కూడా చెబుతారు. మీరు ఆల్రెడీ మైగ్రేన్కి మందులు వాడుతున్నట్లయితే.. అవి ప్రెగ్నెన్సీలో సేఫ్ అవునో కాదో మీ డాక్టర్ను అడిగి తెలుసుకోండి. Brufen, Ergotamine వంటి మందులు అసలు వాడకూడదు. ఆరవ నెల తర్వాత పెయిన్ కిల్లర్స్ వంటివి వాడకూడదు. ఎపిలెప్సీ మందులను కొంతమంది మైగ్రేన్కి కూడా వాడుతుంటారు. అలాంటివి మీరు వాడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వాటివల్ల పొట్టలో బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది విషయంలో న్యురాలజిస్ట్ అభిప్రాయం తీసుకుని మందులు మార్చటం జరుగుతుంది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... -
Health Tips: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్తో కంట్రోల్ చెయ్యొచ్చా?
Hypothyroidism During 2nd month Pregnancy: నాకిప్పుడు రెండవ నెల. నాకు హైపో థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యమన్నారు. దీన్ని డైట్తో కంట్రోల్ చెయ్యొచ్చా? మందులు తప్పనిసరిగా వేసుకోవాలా? – ఎన్. సీతాలక్ష్మి, గణపవరం థైరాయిడ్ గ్రంథి కొన్ని హార్మోన్స్ను విడుదల చేస్తుంది. ఈ గ్రంథి రిలీజ్ చేయవలసిన దానికన్నా తక్కువ విడుదల చేస్తుంది అని గ్రహించగానే దానికి బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది ఎక్కువ విడుదల చేయమని. అందుకే టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది. ఈ గ్రంథి నుంచి వచ్చే థైరోక్సిన్ హార్మోన్ బాగా పనిచెయ్యాలంటే మీరు తినే ఆహారంలో అయోడిన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో.. టీఎస్హెచ్ ఎక్కువ అయితే హైపోథైరాయిడిజం అంటారు. బిడ్డకు తల్లి నుంచే థైరాయిడ్ హార్మోన్స్ వెళ్తాయి. మీకు హార్మోన్స్ తక్కువ ఉంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో బిడ్డ థైరాయిడ్ గ్రంథి ఇంకా వృద్ధి చెందదు. ఈ థైరాయిడ్.. బిడ్డ మెదడు ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే మీకు థైరాయిడ్ డెఫిషియెన్సీ ఉంటే వెంటనే మెడికేషన్ తీసుకోవాలి. డాక్టర్ తొలి పన్నెండు వారాల్లో టీఎస్హెచ్ హార్మోన్ 2–5 కన్నా ఎక్కువ ఉంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ను సూచిస్తారు. ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి టీఎస్హెచ్ చెక్ చేస్తారు. థైరాయిడ్ యాంటీబాడీస్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. మూడవ నెల తరువాత టీఎస్హెచ్ మూడు కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా మందుల మోతాదును నిర్ణయిస్తారు. కొన్నిసార్లు తల్లికి ఏ సింప్టమ్స్ ఉండవు కానీ టీఎస్హెచ్ ఎక్కువ అవుతుంది. దీనిని సబ్కెమికల్ థైరాయిడ్ అంటారు. వీళ్లకు యాంటీబాడీస్ ఫర్ థైరాయిడ్ చెక్ చేస్తారు. టీపీఓ యాంటీబాడీస్ నెగెటివ్ ఉంటే ట్రీట్మెంట్ అవసరం లేదు. క్రమం తప్పకుండా టీఎస్హెచ్ చెక్ చేసుకోవాలి. ప్రసవం అయిన ఆరువారాలకు తల్లికి మళ్లీ టీఎస్హెచ్ చెక్ చేసి మందులు కొనసాగించాలా.. వద్దా అనేది చెప్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Pregnancy 1st Trimester: మూడో నెల.. ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? -
Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా..
నాకు ఏడవనెల నడుస్తోంది. రక్తహీనత ఉందని చెప్పారు డాక్టర్. తొమ్మిది గ్రాముల కన్నా పెరగడం లేదు. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు అవుతున్నాయి. ఏదైనా పరిష్కారం చెప్పండి.. ప్లీజ్! – దుర్గా వాణి, విజయవాడ Pregnancy Tips- Iron Rich Foods: ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటే విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఏ పనినీ చురుకుగా చేసుకోలేరు. ఐరన్ లోపంతో కడుపులో బిడ్డకూ ఎదుగుదల సమస్యలు ఉంటాయి. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ, అంజీర్ (డ్రై ఫ్రూట్స్) రోజూ తినాలి. అలాగే క్యారెట్, బీట్రూట్ , టమాటా జ్యూసెస్ను తాగొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలాపళ్లు, నిమ్మ వంటి వాటిని తీసుకోవాలి. చాలామందికి ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉంటాయి. కొంతమందికి తిన్న వెంటనే విటమిన్ సి ( చప్పరించే) మాత్రలతో ఐరన్ మాత్రలు ఇస్తే వాంతులు కావు. మీరు ఈ పై పద్ధతులను ప్రయత్నించి చూడండి. మాత్రలు అసలే సరిపడకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ (ఇప్పుడు ఇస్తున్నారు) తీసుకోవచ్చు. ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలోకి ఆక్సిజన్ను క్యారీ చేస్తుంది. ఈ ఇంజెక్షన్స్ హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ను త్వరగా పెరిగేట్టు చేస్తాయి. వికారం వల్ల మీరు తినలేకపోయినా పొట్టలో బిడ్డకు పోషకాల లోపం లేకుండా చూస్తాయి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు మీకు ఐరన్ మోతాదు ఎంత ఉంది? ఏదైనా జెనెటిక్ సమస్యలు, సికెల్ సెల్, తలసీమియా వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గాయా? వంటివన్నీ చెక్ చేసి, బరువును బట్టి మోతాదును లెక్కగడతారు. ఎలాంటి జెనెటిక్ సమస్యలు లేనివారికి ఐరన్ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. కనీసం వారానికొకటి ఐవీ ఇంజెక్షన్ ఐరన్ను చేయించుకోవాలి. ఇలా రెండు వారాలు ఇస్తాం. ఒక నెల తరువాత ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. కొంతమందికి వీటివల్ల శ్వాసలో ఇబ్బంది, దద్దుర్లు వంటి రియాక్షన్స్ ఉంటాయి. అందుకే డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. మీకు ఆస్తమా, ఎలర్జీలు, లివర్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఉంటే మోతాదును మార్చాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ చేయించుకున్న వారం తరువాత మీకు కొంచెం నీరసం తగ్గి ఓపిక పెరుగుతుంది. ఐరన్ను పెంచే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్స్ను గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో చేయకూడదు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? -
Health Tips: ప్రెగ్నెన్సీలో ఈ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందా?
Health Tips- Pregnancy 1st Trimester: నాకు 25 ఏళ్లు. ఇప్పుడు మూడో నెల. మా ఫ్రెండ్కి ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అనే బ్లడ్ టెస్ట్ చేశారు. మా డాక్టర్ నాకు అలాంటి టెస్ట్ చెప్పలేదు. ఈ టెస్ట్ ఎవరు చేసుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? – కె. పూర్ణిమ, ఉమ్నాబాద్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలల ప్రెగ్నెన్సీ. ఈ టైమ్లో కొన్ని ఇంపార్టెంట్ స్కాన్, బ్లడ్టెస్ట్లు ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ లేక డబుల్ మార్కర్ అనే టెస్ట్లు తల్లి రక్తంలో చెక్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా బేబీకి ఉన్న కొన్ని క్రోమోజోమ్ సమస్యలు తెలుస్తాయి. డౌన్ సిండ్రోమ్ అనే క్రోమోజోమ్ లోపం వల్ల బిడ్డకు మెదడు, బాడీ సరిగా డెవలప్ కాదు. ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది. ఈ టెస్ట్స్లో మూడు క్రోమోజోమ్ డిజార్డర్స్ అంటూ టీ 21, టీ 18, టీ13ను చెక్ చేసి మీకు ఎంత చాన్స్ ఉంది అనేది చెప్తారు. ఈ రోజుల్లో ప్రతి గర్భిణీకి ఈ పరీక్షలను సూచిస్తున్నాం. ముందుగా రిస్క్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు రిస్క్ను మాత్రమే చెప్తాయి. కచ్చితమైన నిర్ధారణ, హైరిస్క్ వచ్చిన వాళ్లకు తదుపరి పరీక్షలను ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఈ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది స్పెషలైజ్డ్ స్కాన్స్ చేసే ప్రదేశం. Nuchal translucency స్కాన్ అనేది చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మీకు తరువాత ప్రెగ్నెన్సీలో బీపీ, బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన సమస్యలేమైనా వస్తాయా అని కూడా అంచనా వేస్తారు. దీనివల్ల తగిన జాగ్రత్తలను ముందే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్టీ స్కాన్, బ్లడ్ టెస్ట్ల ద్వారా స్కాన్ సాఫ్ట్వేర్తో రిస్క్ కాలిక్యులేషన్ చేస్తారు. మీకు 1:150 కన్నా తక్కువ రిస్క్ ఉంటే టెస్ట్లు అవసరం లేదు. హై రిస్క్ అంటే 1:150 కన్నా ఎక్కువ రిస్క్ ఉందని అర్థం. అంటే వాళ్లకు ఉమ్మనీరు టెస్ట్ గానీ లేక NIPS (Non invasive prenatal screenings) గానీ చేస్తారు. అందుకే అందరూ గర్భిణీలు ఈ టెస్ట్లు చేయించుకోవాలి. ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఈ టెస్ట్లు చేస్తే మంచిది. మీరు డాక్టర్ను సంప్రదించినప్పుడు ఈ టెస్ట్ల గురించి వివరంగా కౌన్సెలింగ్ చేస్తారు. ఎన్టీ స్కాన్, ఈ ఎఫ్టీఎస్ టెస్ట్ ద్వారా 90 శాతం రిస్క్ను అంచనా వేయొచ్చు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. -- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... -
Health Tips: సిజేరియన్ అయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డెలివరీ అయ్యి వారమవుతోంది. సిజేరియన్ అయింది. ఇంటికి వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి. సంధ్యారాణి, కొత్తపేట ఈరోజుల్లో సిజేరియన్ను చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో చేయడం వలన రికవరీ చాలా వేగంగా ఉంటోంది. కొన్ని జాగ్రత్తలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్లాకా తీసుకుంటే దాదాపుగా సాధారణ ప్రసవంలో ఎంత త్వరగా కోలుకుంటారో.. సిజేరియన్లోనూ అంతే త్వరగా కోలుకుంటారు. ఆసుపత్రిలో డాక్టర్ సలహా ప్రకారం యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. పోషక ఆహారం తీసుకోవాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం మొదటి మూడురోజుల వరకు ఆపరేషన్ కుట్లు వంటివన్నీ ఆసుపత్రిలో చూస్తారు. వాళ్లు సూచించిన ఆయింట్మెంట్, పౌడర్ ఇంటికి వచ్చాక కూడా అప్లయ్ చేసుకోవాలి. మీరు బెడ్ మీద ఎలాగంటే అలా కదలకూడదు. మంచం దిగేప్పుడు ఒక పక్కకి తిరిగి కూర్చుని, కాసేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా దిగాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం. దగ్గు, తమ్ములు వచ్చినప్పుడు కుట్ల మీద దిండు కానీ, చేయి కానీ పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తే నొప్పి ఉండదు. ఆరు వారాల తర్వాత మీరు చేసే రోజూవారీ పనులు ఒక వారం తరువాత మొదలుపెట్టవచ్చు. ప్రతి పనికి మధ్య విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డను ఎత్తుకోవచ్చు. బరువులు ఎత్తే పనులు ఆరు వారాల తరువాతనే చేయాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు చేయాలి. కార్ డ్రైవింగ్ను మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మొదలుపెట్టవచ్చు. సాధారణంగా సిజేరియన్ అయిన ఆరు వారాల తరువాత చేయవచ్చు. వాకింగ్ చేయవచ్చు అవుతూ.. ఆగిపోతూ అలా ఓ నెల వరకూ బ్లీడింగ్ ఉంటుంది. డెలివరీ అయిన మొదటి ఆరువారాలు మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. 20 నిమిషాలపాటు వాకింగ్ చేయవచ్చు. స్విమ్మింగ్ లాంటివి ఆరు వారాల తరువాత చేయాలి. కూర్చునేటప్పుడు వెనుక నడుముకి సపోర్ట్ అందేలా పోశ్చర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కుట్లు మానిన రెండు వారాలకు నడుము బెల్ట్ పెట్టుకోవాలి. డెలివరీ అయిన ఆరు, ఎనిమిది వారాల తరువాత కూడా పొట్టలో నొప్పి, జ్వరం ఉన్నా.. కుట్ల దగ్గర నొప్పి లేదా చీము వస్తున్నా, తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెలివరీ తర్వాత చేసే వ్యాయామాలను ఇప్పుడు ఆన్లైన్లోనే నేర్పిస్తున్నారు. మీ డాక్టర్ సూచించిన వ్యాయామాలను ఇలా మీరూ ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటూ చేయొచ్చు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? -
Health: నెలసరి మొదలయ్యే ముందు కూడా ఇలా జరగొచ్చు! కాబట్టి..
మా పాపకు పదేళ్లు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇరిటేటింగ్గా ఫీలవుతోంది. వెజైనల్ క్రీమ్ ఏదైనా వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దీప, హిందూపురం చిన్న పిల్లల్లో చాలామందికి యూరిన్, వెజైనా ప్లేసెస్లో దురద, మంట ఉంటుంది. చాలా మంది రాత్రిపూట స్క్రాచ్ చేస్తూంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. దీనిని vulvovaginitis అంటారు. నెలసరి మొదలయ్యే ముందు కూడా కొంతమంది ఇలా దురద, ఇరిటేషన్తో ఇబ్బందిపడుతుంటారు. సున్నితమైన ప్రాంతం కాబట్టి ఎక్కువగా స్క్రాచ్ చేయడం వల్ల రక్తం కూడా వస్తుంది. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. యూరిన్కు వెళ్లిన తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోమని ఆడపిల్లలకు నేర్పాలి. వాష్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనుక భాగం వైపుగా వాష్ చేయాలి. ఆ నీళ్లలో కెమికల్స్, పెర్ఫ్యూమ్స్, డెటాల్ వంటివి వేయకూడదు. వీటివల్ల ఇరిటేషన్ పెరుగుతుంది. మోషన్కు వెళ్లిన తర్వాత యూరిన్ ప్లేస్, వెజైనా కూడా వాష్ చేసుకోమని చెప్పాలి. టైట్గా ఉండే దుస్తులు, నైలాన్ ఇన్నర్వేర్స్ వేసుకోకూడదు. రాత్రివేళ వదులుగా ఉండే కాటన్ డ్రెస్లు వేసుకోవాలి. వాషింగ్ పౌడర్లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ను వాడకపోవడమే మంచిది. బబుల్ బాత్స్ చేయకూడదు. మలబద్ధకం లేకుండా.. రాకుండా ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పళ్లు తినాలి. తగినన్ని నీళ్లు తాగాలి. గాఢత కలిగిన సబ్బులను వాడకూడదు. యాంటీ సెప్టిక్ లేదా యాంటీబయాటిక్ క్రీముల వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి వెజైనాలో ఇంబాలెన్స్ వస్తుంది. మామూలు నీళ్లల్లో కొంచెం ఉప్పు వేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలకు కాస్మెటిక్ లోషన్స్ వాడకూడదు. ఎప్పుడైనా వెజైనా ఇరిటేషన్తోపాటు రక్తస్రావం అవుతున్నా.. వాసన వస్తున్నా.. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. పరీక్ష చేసి తగిన మందులు ఇస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో కనుక్కోవడానికి యూరిన్ టెస్ట్ చేస్తారు. పైన చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండానూ ఉంటాయి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే.. -
Health: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి?
What Painkillers Are Safe During Pregnancy?: నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. ఇప్పుడు నాకు ఆరోనెల. నాకు నడుము నొప్పి, కాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ను సేఫ్గా వాడుకోవచ్చు. – దేవి, ఏలూరు ప్రెగ్నెన్సీలో పెయిన్ కిల్లర్స్ సేఫ్ కాదు. మెడికల్ షాపుల్లో అడిగి ఓవర్ ది కౌంటర్ దొరికే పెయిన్ కిల్లర్ మందులను అసలే వాడకూడదు. చాలా పెయిన్ కిల్లర్స్ రక్తం ద్వారా కడుపులోని బిడ్డకు వెళతాయి. ఇవి బిడ్డలోని అవయవాల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే నొప్పి నివారణ కోసం మందులు వాడాలి. ప్రెగ్నెన్సీలో ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేసినప్పుడు కాళ్లవాపులు, నొప్పి రావడం సహజం. ప్రెగ్నెన్సీలో బరువు పెరిగినందు వల్ల ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే వ్యాయామాలు మొదలుపెట్టాలి. గంట గంటకూ ఓ ఐదు – పది నిమిషాలు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి. కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్, పోషకాహారం, పాలు తీసుకోవాలి. ఫిజియో థెరపిస్టును సంప్రదిస్తే, సరైన భంగిమలో కూర్చోవడంతో పాటు కూర్చుని చేసే ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. వీటితో నొప్పి తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసెటమాల్ను సేఫ్గా వాడుకోవచ్చు. అలాగే, తగినంత విశ్రాంతి, హాట్ అండ్ కోల్డ్ మసాజ్లు కూడా నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. మొదటి మూడు నెలలు.. కడుపులో బిడ్డ అవయవాలు ఏర్పడుతూ ఉండే దశ. ఆ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకపోవడమే మంచిది. అయితే, పారాసెటమాల్ వల్ల బిడ్డపై పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని పరిశోధనల్లో తేలింది. కొన్ని దగ్గు మందులు, సిరప్లలో కూడా పారాసెటమాల్ ఉంటుంది. అన్నీ కలిపి తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లవచ్చు. అందుకే ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ సేఫ్గా వాడుకోవాలంటే, తక్కువ మోతాదు, తక్కువ రోజులు వాడేలా చూసుకోవాలి. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఏఐడీస్) అనే కొన్ని రకాల మందులు మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. ఇబుప్రొఫెన్, నాప్రోక్సెన్, మెఫెనామిక్ యాసిడ్లాంటివి.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అసలు వాడకూడదు. ఏడో నెల తర్వాత ఇవి వాడినట్లయితే, కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే వీటిని ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ఓపియాయిడ్స్ అనే కొన్నిరకాల పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల పుట్టే బిడ్డలకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ట్రామడాల్ అనే మందు ఈ కోవలోకి వస్తుంది. తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో సరైన మోతాదులో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడుకోవలసి ఉంటుంది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే.. -
స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలా?
పిల్లలు పుట్టని ఆపరేషన్ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్ ప్లాన్ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పురుషులలో నూటికి ముగ్గురే వేసెక్టమీకి వెళుతున్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి స్త్రీలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సర్వే మరోసారి విశదపరిచింది. ఇవాళ దేశంలోని 15–49 వయసు మధ్య ఉన్న వివాహితులలో 99 శాతం మందికి కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఏదో ఒక పద్ధతి గురించి తెలుసనేది ఒక అంచనా. అయినప్పటికీ తాత్కాలిక నియంత్రణ కాకుండా శాశ్వత నియంత్రణ విషయానికి వచ్చేసరికి మన దేశంలో ఆ బాధ్యత స్త్రీదేనన్న అవగాహన స్థిరపడిపోయింది. ‘ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ అధ్యయనంగానీ తాజాగా వెలువడ్డ ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021)గాని ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశంలోని మగవారు ‘వేసెక్టమీ’ పట్ల చాలా వైముఖ్యంగానే ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణ గురించి ప్రభుత్వంగాని, స్వచ్ఛంద సంస్థలుగాని చేసే ప్రచారం ఎప్పుడూ స్త్రీ కేంద్రితంగానే ఉంటుంది. ఆపరేషన్ గురించి, పిల్స్ గురించి, లేదా స్త్రీకి అమర్చే గర్భనిరోధక సాధనాల గురించి ఎక్కువ ప్రచారం ఉంటుంది. పెళ్లయి సంతానం పుట్టడం మొదలయ్యాక ఏ కాన్పులో ఆపరేషన్ చేయించాలో భర్తో అత్తామామలో నిర్ణయిస్తూ ఉంటారు. భార్యకు కూడా కుటుంబ నియంత్రణ సమ్మతమే అయినా ఆపరేషన్ భర్తకు జరగడం గురించి ఆమె అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉండదు. అసలు ఆ ఆలోచనే లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. ‘వేసెక్టమీ చేయించుకుంటే పురుషుడిలో లైంగిక శక్తి బలహీన పడుతుందని... మునుపటి ఉత్సాహం ఉండదని... శారీరక కష్టం చేసే వృత్తులలో ఉన్నవారైతే బరువులెత్తలేరని ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు దూరం చేయాల్సిన పని తగినంతగా జరగడం లేదు. పురుషులతోపాటు స్త్రీలు కూడా వీటిని నమ్మడం వల్ల ఇంటికి సంపాదించుకుని తేవాల్సిన మగవాడు ఎక్కడ బలహీన పడతాడోనని తామే ఆపరేషన్లకు సిద్ధం అవుతున్నారు’అంటున్నారు (గైనకలాజికల్) ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శాంత కుమారి. ‘నిజానికి స్త్రీల ఆపరేషన్ కన్నా పురుషులు చేయించుకునే వేసెక్టమీ సులువైనవి, సురక్షితమైనది’ అంటారు ఆమె. కాని వేసెక్టమీ వైపు చూసే పురుషులు లేరు. పిల్స్ వత్తిడి శాశ్వత నియంత్రణకు వెళ్లే ముందు సంతానానికి సంతానానికి మధ్య తాత్కాలిక నియంత్రణ విషయంలో కూడా స్త్రీల మీదే ఒత్తిడి ఉంటోంది. మన దేశంలో కేవలం 10 శాతం మంది పురుషులే కండోమ్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. 90 శాతం మంది స్త్రీలు పిల్స్ వాడటం గురించి, గర్భనిరోధక సాధనాలు అమర్చుకోవడం గురించి ‘ప్రోత్సహిస్తున్నారు’. దీర్ఘకాలం పిల్స్ వాడటం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా. ‘పల్లెల్లో పురుషులు లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆరోగ్య కార్యకర్తలు స్త్రీలే కావడం వల్ల వీరి మాటామంతి స్త్రీలతోనే సాగుతోంది. పురుషులను ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి మగవారిలో కుటుంబ నియంత్ర ఆపరేషన్ల పట్ల ప్రచారం కలిగిస్తే మార్పు రావడం సాధ్యం’ అని సర్వేలో పాలుపంచుకున్న నిపుణులు అంటున్నారు. కుటుంబ బాధ్యత స్త్రీ పురుషులదైనప్పుడు కుటుంబ నియంత్రణ బాధ్యత స్త్రీ పురుషులదే. కాని అది స్త్రీదిగానే ఎంచేంత కాలం స్త్రీకి ఈ భారం తప్పదు. పురుషులు మేల్కోవాలి. 3 శాతమే పురుషులు 2019–2021 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వంద మంది వివాహితలలో 38.9 శాతం మంది ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. గత సర్వేతో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాని ఆశ్చర్యకరమైన పరిశీలన ఏమిటంటే గత సర్వేలోనూ ఈ సర్వేలోనూ కేవలం 3 శాతానికే పురుషుల శాతం వేసెక్టమీకి పరిమితమైంది. అంటే పురుషులు ఇది ఏ మాత్రం తమకు సంబంధించిన వ్యవహారంగా చూడటం లేదు. ఈ సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఉత్తర ప్రదేశ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలలో 50 శాతం మంది మగవారు ‘అది ఆడవాళ్లు చేయించుకోవాల్సిన ఆపరేషన్’గా జవాబు ఇస్తే మధ్యప్రదేశ్లో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు ‘కుటుంబ నియంత్రణ ఆడవాళ్లదే’ అన్నారు. చదవండి: Normal Delivery: నార్మల్ డెలివరీ టిప్స్! -
ఇంకా రజస్వల కాలేదు... ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
Gynecologist Venati Sobha Counselling Suggestions Irregular Periods: మా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఇంకా రజస్వల కాలేదు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ‘టర్నర్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో దయచేసి వివరించగలరు. – సుగుణ, మధిర ఆడపిల్లల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్. వీటిలో 22 జతల ఆటోసోమ్స్, ఒక జత ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిని 46 ఎక్స్ఎక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఈ ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ జతలో ఒక ‘ఎక్స్’ తల్లి నుంచి, ఒక ‘ఎక్స్’ తండ్రి నుంచి పిండం ఏర్పడినప్పుడే బిడ్డకు సంక్రమించి, ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ మాత్రమే బిడ్డకు సంక్రమిస్తుంది. దీనినే ‘45ఎక్స్జీరో’ అంటారు. దీనినే ‘టర్నర్స్ సిండ్రోమ్’ అంటారు. ఇలా పుట్టిన పిల్లలు పొట్టిగా ఉండటం, వారిలో మానసిక ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండటం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, రజస్వల కాకపోవడం, రొమ్ములు సరిగా పెరగకపోవడం, అండాశయాలు చాలా చిన్నగా ఉండి, అవి పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్ రాకపోవడం, ఎముకల సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కొందరిలో అండాశయాలు కొన్నిరోజులు హార్మోన్లు విడుదల చేసి, తర్వాత అవి చిన్నగా అయిపోయి అండాలు తగ్గిపోవడం వల్ల కొంతకాలం పీరియడ్స్ వచ్చి తొందరగా ఆగిపోతాయి. ఇది జన్యుపరంగా ఏర్పడింది కాబట్టి, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, అవసరమైన పరీక్షలు చేయించి, స్కానింగ్లో గర్భాశయం, అండాశయాల పరిమాణం బట్టి, పీరియడ్స్ కోసం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కొంతకాలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలను బట్టి చికిత్స సూచించడం జరుగుతుంది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 48 కిలోలు. రెండేళ్లుగా నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఒక్కోసారి పదిహేను రోజులకే అయిపోతే, ఒక్కోసారి నెల్లాళ్లు గడిచాక అవుతోంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటోంది. ఆ సమయంలో ఏ పనీ చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమ్య, తగరపువలస మీ ఎత్తుకి మీరు కనీసం 54 కిలోల బరువు ఉండాలి. కాని, 48 కిలోలే ఉన్నారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, థైరాయిడ్, పీసీఓడీ వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవడం వల్ల పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తహీనత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, ఎస్ఆర్. టీఎస్హెచ్, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, నడక, యోగా, ధ్యానం వంటివి కూడా చెయ్యడం వల్ల చాలావరకు హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమీ లేకున్నా, పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు రెండురోజులు నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. ∙నా వయసు 46 ఏళ్లు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకోసారి వస్తోంది. వచ్చినప్పుడు కూడా రుతుస్రావం రెండు రోజులే ఉంటోంది. ఇటీవల పరీక్షలు జరిపిస్తే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితిలో గర్భసంచి తీసేస్తేనే మంచిదని డాక్టర్లు అంటున్నారు. నాకైతే ఆపరేషన్ అంటే భయంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా? – లక్ష్మి, రేణిగుంట మీకు 46 ఏళ్లు. పీరియడ్స్ రెండు మూడు నెలలకోసారి వచ్చి, బ్లీడింగ్ రెండురోజులే ఉంటుంది. అంటే మీకు ఫైబ్రాయిడ్స్ కారణంగా ప్రస్తుతానికి పెద్దగా లక్షణాలేమీ లేనట్లే! సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో పెరిగే కంతులు. ఇవి 99.9 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. వాటి పరిమాణం, గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయి అనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపలి పొరలో (సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, బ్లీడింగ్ ఎక్కువ కావడం, మధ్య మధ్యలో స్పాటింగ్ కనిపించడం వంటివి ఉంటాయి. మయోమెట్రియమ్ పొరలో (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, వాటి పరిమాణం బట్టి బ్లీడింగ్ ఎక్కువ కావడం, చిన్నగా ఉంటే కొందరిలో ఏ సమస్యా లేకపోవడం జరగవచ్చు. గర్భాశయం బయటి పొరలో (సబ్ సిరీస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే చుట్టు పక్కల అవయవాల మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి, మూత్ర సమస్యలు, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే, ప్రస్తుతానికి ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు ఎటువంటి లక్షణాలూ కనిపించడం లేదు. బ్లీడింగ్ కూడా రెండు మూడు నెలలకోసారి రెండురోజులే అవుతుంది కాబట్టి మీకు త్వరలోనే పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ రావచ్చు. పీరియడ్స్ ఆగిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఇంకా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా, వాటి పరిమాణం మెల్లగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లక్షణాలు లేనంత వరకు ఫైబ్రాయిడ్స్ గురించి కంగారు పడకుండా కొంతకాలం ఆగి చూడవచ్చు. ఆరునెలలకోసారి స్కానింగ్ చేయించుకుంటూ, వాటి పరిమాణం పెరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు. వాటి పరిమాణం మరీ పెద్దగా అవుతూ, మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ బదులు ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఎంఆర్ఐ గైడెడ్ హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవచ్చు. డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
అప్పుడే పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. ఎంతకాలం ఉంచుకోవచ్చు?
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. ఆరునెలల కిందట నాకు కోవిడ్ వచ్చి, నెల్లాళ్లకు పైగా చికిత్స తర్వాత నయమైంది. కోవిడ్ తగ్గినప్పటి నుంచి నాకు నెలసరి క్రమం తప్పింది. ఒక్కోసారి త్వరగా, ఒక్కోసారి ఆలస్యంగా అవుతోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుజాత, యలమంచిలి నీ ఎత్తుకి నువ్వు బరువు తక్కువగానే ఉన్నావు. కోవిడ్ తర్వాత నువ్వు ఇంకా బలహీనపడి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కొందరిలో ఈ మార్పుల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి క్రమం తప్పే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. కొందరిలో వేరే కారణాల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి బరువు ఎంత ఉన్నావు. కోవిడ్ తర్వాత బరువు తగ్గావా లేదా పెరిగావా అనేది చూసుకుని, మరీ తక్కువగా ఉంటే సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించి చూడవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా, బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి యోగా, నడక, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంటే, అది సరిగా అయ్యి కొందరిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్ను అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటివి చెయ్యించుకుని, పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు కారణాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 28 ఏళ్లు. నాకు పాప పుట్టి ఏడాదైంది. అప్పుడే మళ్లీ పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. రెండో కాన్పు కోసం మరికొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. లూప్ను ఎంతకాలం ఉంచుకోవచ్చు? వేయించుకుని ఏడాది గడిచింది కాబట్టి, పాతది తీయించేసి, కొత్తది వేయించుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు. – రాధిక, తాడేపల్లిగూడెం లూప్ లేదా కాపర్ ‘టీ’ (ఐయూసీడీ) అనేది పుల్లలాంటి సన్నటి ప్లాస్టిక్ పరికరంపైన కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది. దీనిని గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలికంగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. వీటిలో 3 సంవత్సరాల వరకూ, 5 సంవత్సరాల వరకూ, 10 సంవత్సరాల వరకూ గర్భం రాకుండా చేసే లూప్లు ఉంటాయి. లూప్లలో ఇంకోరకం హార్మోన్ లూప్ ఉంటుంది. ఇందులో లెవనార్జెస్ట్రాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది 5 సంవత్సరాల పాటు గర్భం రాకుండా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ సమస్యలు ఉన్నవారికి కూడా దీనిని గర్భాశయంలోనికి వేయడం జరుగుతుంది. మీరు వేయించుకున్న లూప్ ఎలాంటిది? ఎన్ని సంవత్సరాల వరకు పని చేసేది? అనే విషయాలు తెలియవలసి ఉంది. ఒకసారి మీకు లూప్ వేసిన డాక్టర్ని సంప్రదించి, ఎన్ని సంవత్సరాల వరకు పని చేస్తుందో కనుక్కోవడం మంచిది. లూప్ వల్ల సమస్య ఏమీ లేకపోతే.. 6 నెలల కొకసారి లూప్ పొజిషన్లో ఉందా లేదా? ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని గైనకాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకుంటూ అన్నీ సరిగా ఉంటే కనీసం మూడు సంవత్సరాల వరకూ లూప్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు పెళ్లయి మూడేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. నా వయసు 27 ఏళ్లు. నేనూ మావారూ ఇద్దరమూ అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. ఇద్దరికీ ఏ సమస్యా లేదనే డాక్టర్లు చెప్పారు. ఇంకా పిల్లలు కలగకపోవడానికి కారణమేంటో అర్థం కావడంలేదు. మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – మౌనిక, మహబూబ్నగర్ గర్భం దాల్చాలి అంటే ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు, హార్మోన్లు అన్నీ సక్రమంగా ఉండాలి. వాటి పనితీరు సరిగా ఉండాలి. నెలనెలా అండం సరిగా విడుదల కావాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉండాలి. అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత అన్నీ సరిగా ఉండాలి. మీకు చేసిన పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఉన్నాయి, ఏ సమస్య లేవంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి చేసే పరీక్షలలో 70 శాతం వరకే కారణాలు తెలుస్తాయి. 30 శాతం కారణాలు పరీక్షల్లో తెలియవు. అవి చాలా సూక్ష్మమైన కారణాలు. పరీక్షలలో సమస్యలు ఏమీ కనిపించక పోయినా కానీ కొందరిలో గర్భాశయద్వారం దగ్గర ఉండే యాంటీ స్పెర్మ్ యాంటీబాడిస్ వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోనికి వెళ్లనీయకుండా చేయడం, వాటి కదలికను తగ్గించడం వల్ల అండం వరకు చేరలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరికొందరిలో శుక్రకణాలు.. అండంలో చొచ్చుకునిపోలేకపోవడం, దాని వల్ల ఫలదీకరణ అవ్వకపోవడం వల్ల పిండం ఏర్పడకపోవడం, పిండం ఏర్పడినా, గర్భాశయం పిండాన్ని స్వీకరించకపోవడం వల్ల పిండం గర్భాశయంలో అంటుకోకుండా ఉండడం వల్ల గర్భం రాకపోవచ్చు. సాధారణ పరీక్షల్లో ఈ సమస్యలు తెలియకపోవచ్చు. 3 సంవత్సరాలు అయినా సాధారణ పద్ధతిలో గర్భం రానప్పుడు, రిపోర్టులన్నీ మామూలుగానే ఉన్నప్పుడు.. కొన్ని నెలలు అండం నాణ్యత, వీర్యకణాలు నాణ్యత పెరగడానికి మందులు వాడి చూడవచ్చు. తర్వాత మూడునెలలు అండం విడుదల అయ్యే సమయంలో వీర్యకణాలను శుభ్రపరచి, మంచికణాలను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం చేయొచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండొచ్చు. అలాంటప్పుడు డీ అండ్ సీ పద్ధతి ద్వారా గర్భాశయ ముఖద్వారాన్ని కొద్దిగా వెడల్పు చేసి, గర్భాశయపొరను శుభ్రపరచడం, ఆ పొరను బయాప్సీకి పంపించడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. దాని బట్టి కూడా చికిత్స తీసుకోవచ్చు. కొంతమందికి డీ అండ్ సీ తర్వాత గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. కొందరిలో హిస్టెరోస్కోపీ పద్ధతి ద్వారా నేరుగా గర్భాశయం లోపల చూస్తూ, ఏదైనా పొరలు, వాటి సమస్యలు ఉంటే అప్పుడే తొలగించడం వల్ల కూడా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. అన్నిరకాలుగా ప్రయత్నించినా గర్భం అందనప్పుడు, చివరిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం.. -
తొలి కాన్పు సిజేరియన్ చేశారు.. రెండోసారి కూడా తప్పదా?
నా వయసు 28 ఏళ్లు. రెండేళ్ల కిందట తొలి కాన్పు జరిగింది. బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి, సిజేరియన్ చేశారు. ప్రస్తుతం నాకు ఆరో నెల. ఒకసారి సిజేరియన్ జరిగితే, రెండోసారి కూడా సిజేరియన్ తప్పదని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒకసారి సిజేరియన్ జరిగితే నార్మల్ డెలివరీకి అవకాశం ఉండదా? రెండోసారి కూడా సిజేరియన్ జరిగితే ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. – సాయిగీత, శ్రీకాకుళం మొదటి కాన్పు సిజేరియన్ అయితే తప్పనిసరిగా రెండో కాన్పు సిజేరియన్ ద్వారానే కావాలనేమీ లేదు. కాకపోతే అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే రెండోది నార్మల్ డెలివరీకి ప్రయత్నించవచ్చా, లేదా, రిస్క్ అనేది ఎంత మేరకు ఉంది అనే అంచనాకు వచ్చి సలహా ఇవ్వడం జరుగుతుంది. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు ఎక్కువగా లేకుండా ఉండాలి. బిడ్డ తల కిందకు ఉండి, పెల్విస్ దారిలోకి ఫిక్స్ అయి ఉండాలి. బిడ్డ బయటకు వచ్చే దారి బిడ్డకు సరిపడా వెడల్పుగా ఉండాలి. అంతేకాకుండా, ముందు సిజేరియన్ కాన్పుకి, మళ్లీ గర్భం దాల్చడానికి మధ్య కనీసం మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉండాలి. ఇవన్నీ సరిగానే ఉన్నా, సిజేరియన్ సమయంలో గర్భాశయంపైన కోత పెట్టి బిడ్డను బయటకు తీసి, మళ్లీ కుట్టడం జరుగుతుంది. ఆ కుట్లు తొమ్మిది నెలలు బిడ్డ పెరిగే కొద్ది సాగి, అవి పల్చబడటం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుట్లు మానే తీరును బట్టి మరో కాన్పును సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు, కొందరిలో గర్భాశయం కుట్లు విడిపోయి, గర్భాశయం పగిలి బిడ్డ కడుపులోకి రావడం, బిడ్డ ఊపిరి ఆగిపోవడం, తల్లికి విపరీతమైన బ్లీడింగ్ అవడం, షాక్లోకి వెళ్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులలోకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. కొందరిలో పెద్దగా ఇబ్బంది లేకుండా, సాధారణ కాన్పు కావచ్చు. ఎవరిలో ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అంచనా వేయడం కాస్త కష్టం. ముందు కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగి, మళ్లీ కాన్పును సాధారణంగా ప్రయత్నించడాన్ని ‘వీబీఏసీ’ (వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్) అంటారు. వీబీఏసీకి ప్రయత్నించాలని అనుకున్నప్పుడు 24 గంటలు గైనకాలజిస్ట్, పిల్లల డాక్టర్, మత్తు డాక్టర్ అందుబాటులో ఉండి, అన్ని పరికరాలు, వసతులు ఉన్న హాస్పిటల్లోనే అడ్మిట్ అవడం మంచిది. లేకపోతే ఆఖరి నిమిషంలో ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటాయి. మీకు మొదటి బిడ్డ అడ్డంగా ఉండటం వల్ల ఆపరేషన్ చేసి తీశారు. మళ్లీ ఇప్పుడు రెండు సంవత్సరాలకే గర్భం అందింది. తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్ని బట్టి, మీ డాక్టర్ చెప్పే సలహాను అనుసరించడం మంచిది. రెండోది కూడా సిజేరియన్ అయినప్పుడు పెద్దగా సమస్యలేవీ ఉండవు. కాకపోతే మళ్లీ మత్తు ఇవ్వాలి, పొట్ట కొయ్యాలి, కుట్లు వెయ్యాలి, కుట్లు సరిగా మానాలి కాబట్టి కొద్దిగా నొప్పి, అసౌకర్యం తప్పవు. నా వయసు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట రీకానలైజేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, ట్యూబులు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఇంతవరకు మళ్లీ గర్భం రాలేదు. రీకానలైజేషన్ ఫెయిలై ఉంటుందా? ఒకవేళ ఫెయిలైతే ట్యూబులు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయా? – సౌజన్య, ఉరవకొండ రీకానలైజేషన్ ఆపరేషన్లో కుటుంబ నియంత్రణ కోసం చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ ద్వారా ముడి వేసి కట్ చేసిన ఫెలోపియన్ ట్యూబ్లను మళ్లీ అతికించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేసినంత మాత్రాన అది సక్సెస్ అయి, మళ్లీ గర్భం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆపరేషన్ సమయంలో ట్యూబ్లు తెరుచుకున్నట్లు అనిపించినా, కొంతకాలానికి అవి కొద్దిగా లేదా పూర్తిగా మూసుకుపోవచ్చు. మూసుకుపోయిన ట్యూబ్లలో గర్భం వచ్చినా, అది ట్యూబ్లోనే ఉండిపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవొచ్చు. కొందరిలో ట్యూబ్లు బయటి నుంచి బాగానే ఉన్నా, లోపలి భాగంలో ఉండే సీలియా పాడై, దాని పనితీరు సరిగా లేకపోవచ్చు. అందువల్ల కూడా గర్భం అందకపోవచ్చు. ట్యూబ్స్ బాగానే ఉన్నా, కొన్నిసార్లు అండం విడుదల సరిగా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, భర్తలో వీర్యకణాల లోపాలు వంటి ఇతరేతర సమస్యల వల్ల కూడా గర్భం రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే టెస్ట్ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ప్రెగ్నెంట్ అయ్యాను.. వ్యాక్సిన్ తీసుకోవచ్చా?!
నా వయసు 23 ఏళ్లు. నాలుగు నెలల కిందట నాకు ‘కరోనా’ వచ్చి, చికిత్స తర్వాత తగ్గింది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నేను ‘కరోనా’ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ టైమ్లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? – రాణి, చోడవరం భారతదేశంలో మూడు నెలల కిందటే గర్భవతులు ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే మార్గదర్శకాలను భారత ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ప్రెగ్నెన్సీలో కరోనా రావడం వల్ల వచ్చే దుష్ప్రభావాలతో పోల్చుకుంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే చిన్న ఇబ్బందుల కంటే ఉపయోగాలే ఎక్కువ కాబట్టి గర్భిణులు వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది. అందరిలోలాగానే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఒకరోజు జ్వరం, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, వాపు కొందరిలో ఉండవచ్చు. దీనికి పారాసెటిమాల్ మాత్ర అవసరాన్ని బట్టి రోజుకు ఒకటి రెండు రోజులు రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు. గర్భవతులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తంలో ఏర్పడే యాంటీబాడీస్ మాయ ద్వారా బిడ్డకు చేరి, పుట్టిన తర్వాత బిడ్డకు కరోనా రాకుండా ఉండేలా చేస్తాయి. కరోనా వచ్చిన తర్వాత శరీరంలో ఏర్పడే యాంటీబాడీస్ శరీరంలో ఎక్కువకాలం ఉండకపోవచ్చు. కాని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తయారయ్యే యాంటీబాడీస్ ఎక్కువకాలం శరీరంలో ఉండి కరోనా రాకుండా కాపాడతాయి. ఒకవేళ వచ్చినా, ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా రక్షిస్తాయి. నా వయసు 49 ఏళ్లు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు తేలింది. వీలైనంత త్వరగా గర్భసంచి తొలగించుకోవడమే మంచిదని డాక్టర్ చెప్పారు. నాకు సర్జరీ అంటే చాలా భయం. దీనికి మరే పరిష్కారమార్గం లేదా? – వనజ, శృంగవరపుకోట గర్భాశయంలో ఎక్కడైనా ఫైబ్రస్ కణజాలం అధికంగా పెరిగి గడ్డలా ఏర్పడుతుంది. దీనినే ఫైబ్రాయిడ్ అంటారు. జన్యుకారణాలు, హార్మోన్ల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి. ఇవి కొందరిలో ఒకటే ఏర్పడవచ్చు, కొందరిలో రెండు, మూడు ఇంకా అనేకం 0.5 సెం.మీ నుంచి 10 సెం.మీ. పైన అనేక పరిమాణాలలో పెరిగి ఏర్పడవచ్చు. దీనినే మల్టిపుల్ ఫైబ్రాయిడ్ అంటారు. ఇవి గర్భాశయంపైన ఏర్పడితే సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మొత్తం లోపలి ఎండోమెట్రియం పొరలో ఏర్పడితే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని అంటారు. ఫైబ్రాయిడ్స్ ఎక్కడ, ఎన్ని, ఎంత పరిమాణంలో ఉన్నాయనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బ్లీడింగ్, కడుపునొప్పి వంటివి ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్లో ఉంటాయి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంటే పెద్ద లక్షణాలు ఉండవు. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా సరే కొందరిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండవచ్చు. సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ వల్ల చాలావరకు సమస్యలు ఉండవు. కాని వాటి పరిమాణం పెరిగి, చుట్టుపక్కల అవయవాలపై ఒత్తిడి పడుతుంటే, మల మూత్ర విసర్జనకు ఇబ్బంది కలిగిస్తుంటే, అప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, మీకు ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది ఉన్నట్లు లేదా మామూలుగా స్కానింగ్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ జరిగినట్లు అనిపిస్తుంది. అవి ఎంత సైజు, ఎక్కడ ఉన్నాయి అనేది వివరించి ఉంటే బాగుండేది. మీకు ఇప్పుడు 49 సంవత్సరాలు. వాటి వల్ల లక్షణాలు ఏమీ లేకుండా, వాటి పరిమాణం పెద్దగా లేకుండా ఉన్నట్లయితే కొంతకాలం ఆగి చూడవచ్చు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి, దాని ప్రభావం లేకపోవడం వల్ల అవి ఇంకా పెరగకుండా ఉండి, మెల్లగా పరిమాణం తగ్గే అవకాశాలు ఉంటాయి. క్రమంగా ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ కొంతకాలం ఆపరేషన్ లేకుండా ఆగవచ్చు. లేదా మీకు అధిక బ్లీడింగ్, పొత్తికడుపు నొప్పి, విపరీతమైన నడుము నొప్పి, వాటి ఒత్తిడి వల్ల మలమూత్ర విసర్జనలో సమస్యలు అధికంగా ఉంటే అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. లేదంటే, పీరియడ్స్ ఆగిపోయే వయసు దగ్గరపడుతోంది కాబట్టి లక్షణాల తీవ్రత లేకపోతే కొంతకాలం గైనకాలజిస్టు పర్యవేక్షణలో ఫైబ్రాయిడ్స్ పెరుగుదల ఆపడానికి మందులు వాడవచ్చు. ఇవి వాడినన్ని రోజులు బ్లీడింగ్ తగ్గి, ఫైబ్రాయిడ్స్ పరిమాణం కొన్ని మిల్లీమీటర్లు తగ్గవచ్చు. కాబట్టి మీరు భయపడకుండా గైనకాలజిస్టును మళ్లీ ఒకసారి సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ అవసరమా లేదా అనేది లక్షణాల తీవ్రత, ఫైబ్రాయిడ్స్ పరిమాణం, అవి ఉండే ప్రదేశం, ఏ రకానికి చెందినవి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ పెరగకుండా, వాటికి రక్తప్రసరణను ఆపడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ పద్ధతి, లేదా ఫైబ్రాయిడ్స్ చాలా వరకు కరగడానికి ఎంఆర్ఐ ద్వారా హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించడం జరుగుతుంది. ‘ఎంఆర్జీఎఫ్యూఎస్’ వంటి పద్ధతులు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ వద్దనుకుంటే, డాక్టర్ను సంప్రదించి, వాటి మంచిచెడులను బేరీజు వేసుకుని, వాటిని కూడా ప్రయత్నించవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్. హైదరాబాద్ -
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. çసూరత్కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్పూర్కు చెందిన అనుమిత, ఫరిదాబాద్కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
గైనకాలజిస్టు, ఆరంకెల జీతం, అయినా సంతోషం లేదు.. బాడీబిల్డర్గా
Bodybuilder Maya Rathod (సాక్షి, వెబ్డెస్క్): ‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం.. కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకానీ.. మనకు ఇట్లాంటి ఆటలు వద్దు’’... సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు ఉండే ‘సహజమైన’ ఆంక్షలు ఇవి. ముంబైకి చెందిన మాయా రాథోడ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను తైక్వాండో శిక్షణ తీసుకుంటానని చెప్పినపుడు ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే వారించారు. చక్కగా చదువుకుంటే చాలని, అనవసర ఆలోచనలతో తమను ఇబ్బంది పెట్టవద్దని సున్నితంగా మందలించారు. అమ్మానాన్నల మాట కాదనలేకపోయింది మాయా. తండ్రి కోరుకున్నట్టుగానే డాక్టర్ అయ్యింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిగా, గైనకాలజిస్టుగా అటు వ్యక్తిగత, ఇటు వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. కానీ అథ్లెట్ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె మనసులో. ఎక్కడో ఏదో వెలితి. పైగా రోజురోజుకు పెరుగుతున్న బరువు. తీవ్ర ఒత్తిడికి లోనైంది. తనను తాను కనుగొనే మార్గం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాడీ బిల్డర్గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్(ఐఎఫ్బీబీ) ఆస్ట్రేలియన్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచింది. ఆరంకెల జీతం.. అయినా సంతోషం లేదు ‘‘చిన్నప్పటి నుంచీ నాకు క్రీడలంటే ఆసక్తి. మా కాలేజీ క్యాంపస్లో బెస్ట్ అథ్లెట్ నేనే. కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం ఏమాత్రం నచ్చేది కాదు. ఆటలాడేటపుడు ఒకవేళ గాయపడితే.. నన్నెవరూ పెళ్లి చేసుకోరనేది వారి భయం. అయినా, నేను వెనుకడుగు వేయలేదు. భరతనాట్యం క్లాసులు ఎగ్గొట్టి మరీ తైక్వాండో శిక్షణ తీసుకున్నా. అంతేకాదు సాయంకాలం వేళ గ్రౌండ్కు వెళ్లి క్రికెట్ కూడా ఆడేదాన్ని!. అథ్లెట్ కావాలన్న ఆశయం గురించి మా నాన్నకు చెప్పినపుడు.. ‘‘నువ్వు అమ్మాయివి. బాగా చదువుకుని గౌరవప్రదమైన వృత్తి చేపట్టినపుడే మనకు మంచి పేరు వస్తుంది’’ అని చెప్పారు. ఆయన చెప్పిన బాటను అనుసరించాను. మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి గైనకాలజీ పూర్తిచేశాను. కాలేజీ చదువు అయిపోగానే పెళ్లి చేశారు. సంవత్సరం తిరిగేలోపే తల్లినయ్యాను. మంచి డాక్టర్గా పేరు. ఆరంకెల జీతం. అయినా.. నాకు సంతోషం లేదు. స్థూలకాయురాలిలా మారిపోయాను. ఊరికే అలసిపోయేదాన్ని. ఏదో తెలియని భయం ఆవహించింది. నన్ను నేను కోల్పోతున్న భావన. ఆ సమయంలో నా స్నేహితురాలు ఒకరు.. జిమ్కు వెళ్లమని సూచించింది. 20 కిలోల బరువు తగ్గాను అలా ఏడాది కాలంలో 20 కిలోల బరువు తగ్గాను. మా కోచ్ ఆశ్చర్యపోయారు. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాకు మొదటి నుంచి బరువులు ఎత్తడం అంటే ఇష్టం. వెంటనే ఓకే అన్నాను. బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లిన తొలినాళ్లలో అక్కడ చాలా తక్కువ మంది మహిళలు కనిపించేవారు. కాస్త మొహమాటంగా అనిపించేది. కానీ నా భర్త నన్ను ప్రోత్సహించేవారు. అయితే, మా అమ్మానాన్న, అత్తామామలు మాత్రం.. ‘‘మంచి జాబ్ వదులుకుని... ఇదంతా అవసరమా’’ అని నిట్టూర్చేవారు. నన్ను నేను నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యాను. మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను. అప్పటికి మా పాప ఇంకా నా చనుబాలు తాగుతూనే ఉంది. తన ఆలనాపాలన, ఆస్పత్రిలో షిఫ్టుల్లో ఉద్యోగం, జిమ్కు వెళ్లడం... అబ్బో.. కాస్త కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఉండేది కాదు. అనుకున్నది సాధించడానికి ఇవన్నీ తప్పవు మరి. రెండేళ్ల తర్వాత విజయం నన్ను వరించింది. స్టేట్ లెవల్ చాంపియన్షిప్లో రెండో స్థానం. ఈ క్రమంలో.. పీహెచ్డీ పూర్తి చేసేందుకు మూడేళ్ల తర్వాత సిడ్నీకి షిఫ్ట్ అయ్యాం. అప్పుడే రెండో కూతురు జన్మించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి మహిళగా అక్కడికి వెళ్లాకే నాకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. గత 25 ఏళ్లలో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయ మహిళా బాడీబిల్డర్ లేరని చెప్పారు. ఒక భారతీయురాలిగా నేను ఈ విజయం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎనిమిది నెలల పాటు కఠోర శ్రమ... ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ట్రెయినింగ్, పెద్దమ్మాయిని స్కూళ్లో దింపడం, వంట చేయడం, ఆస్పత్రికి వెళ్లడం... ఇంటికి వచ్చి మళ్లీ పనులు చేసుకుని పిల్లల్ని నిద్రపుచ్చడం.. తర్వాత రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రాక్టీస్. ఎట్టకేలకు నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఐఎఫ్ఎఫ్బీ 2021 ఆస్ట్రేలియన్ చాంపియన్షిప్ టైటిల్ రూపంలో విజయం వరించింది. ఆస్ట్రేలియా గడ్డమీద ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచాను. ప్రస్తుతం నా వయస్సు 30 ఏళ్లు. ఇప్పటికీ గైనకాలజిస్టుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్లుగా బాడీబిల్డర్గా వివిధ పోటీల్లో రాణిస్తున్నా. పెళ్లై.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంతదాకా వస్తానని అస్సలు ఊహించలేదు. నాలో ఉన్న నిజాయితే నన్ను ఈరోజు ఈస్థానంలో నిలబెట్టింది. నేను ప్రేమించిన లక్ష్యం కోసం.. ఇతరులు ఏమనుకున్నా లెక్కచేయలేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. మనకు నచ్చింది చేయాలి. నేను తల్లిని, వైద్యురాలిని, బాడీ బిల్డర్ను అని గర్వంగా చెప్పగలను’’ అని మాయా రాథోడ్ ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాథ గురించి పంచుకున్నారు. -
గర్భిణులు కరోనా వ్యాక్సిన్ను ఎప్పుడు తీసుకోవాలి?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా సోకిన ఓ మహిళా పీడియాట్రియన్ చనిపోయారు. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశాక ఆమె మరణించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన గర్భవతులకు కోవిడ్ టీకా ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. మరోవైపు టీకా వేసుకోవడం వల్ల గర్భవతులకు ఎలాంటి నష్టం జరగదని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధన స్పష్టం చేసింది. గర్భవతులకు కరోనా వైరస్ సోకడం ద్వారా వారి గర్భంలోని ప్లాసెంటా (మాయ)పై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతేడాది మేలో ఓ అధ్యయనంలో తేలింది. మాయ ప్రాధాన్యం కలిగిన ఈ మాయకు వైరస్ నష్టపరుస్తుందన్న విషయం తెలిసింది. అంటే కరోనా సోకిన వారిలో అత్యంత రిస్క్ ఉన్న వారు గర్భిణులే అని చెప్పొచ్చు. మరి ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో.. గత ఏప్రిల్లో అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఓ పరిశోధన ప్రచురితమైంది. వ్యాక్సినేషన్ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలి్చంది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు, వ్యాక్సిన్ అపోహలను కేర్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డా.కావ్య ప్రియ వజరాల నివృత్తి చేశారు. ఫస్ట్వేవ్ అనుభవాలే స్ఫూర్తి.. కరోనా ఫస్ట్వేవ్ సమయంలో పాజిటివ్ వచ్చి డెలివ రీ అయిన మహిళలకు పుట్టిన పిల్లల్లో ఎలాంటి అవయవ లోపం కని్పంచలేదు. పుట్టిన శిశువుల్లో యాం టీబాడీలు కూడా కని్పంచాయి. అంతేకాకుండా యూకే, అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెరి్టలిటీ, సీడీసీ, ఫాగ్సీ గైడ్లైన్స్ కూడా గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే భారత్లో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అయినా కూడా టీకా లభ్యతను బట్టి కాబోయే తల్లులు కోరుకుంటే ఇవ్వొచ్చు. గర్భం దాలి్చన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిది. అయినా పరిస్థితులను బట్టి వైరస్ విజృంభణ స్థాయిని బట్టి ఏ నెలలోనైనా ఇవ్వొచ్చు. జ్వరం వచి్చనా.. వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో కొందరిలో జ్వరం వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది సాధారణ వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే అందరికీ ఇచి్చనట్లే గర్భిణులకు కూడా పారాసిటమాల్ ఇస్తే సరిపోతుంది. నీరు ఎక్కువ తాగాలని సూచించాలి. ఫ్లూ వ్యాక్సిన్తో పాటు కలపకూడదు.. తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని గర్భం దాలి్చన తర్వాత సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తుంటా రు. కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడానికి, కోవిడ్ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. ప్రసవం తర్వాత కూడా టీకా తీసుకోవచ్చు. c -
లైంగిక వేధింపులు.. రూ.7 వేల కోట్లకు సెటిల్మెంట్
లాస్ ఏంజెలిస్: మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా(7,246,00,00,000 రూపాయలు) చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఒక ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా(యూఎస్సీ) ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ కోర్టుకు తెలిపింది. గతంలో 2018లో ఫెడరల్ క్లాస్ చర్య ఫలితంగా ఇప్పటికే 215 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ సందర్భంగా న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ మాట్లాడుతూ.. ‘‘సివిల్ లిటిగేషన్ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే ప్రథమం’’ అన్నారు. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రబుద్ధుడు ఎవరు.. ఏంటి అనే వివరాలు.. జార్జి టిండాల్(74) అనే వ్యక్తి తన 30 ఏళ్ల సర్వీసులో వందల మంది మహిళలను లైంగిక వేదింపులకు గురి చేశాడు. వీరిలో మైనర్ల నుంచి మధ్య వయసు మహిళల వరకు ఉన్నారు. మెడికల్ చెకప్ కోసం వచ్చిన ఆడవారిని టిండాల్ లైంగికంగా వేధించేవాడు. రోగుల వ్యక్తిగత శరీర అవయాలను ఫోటోలు తీయడం.. ప్రైవేట్ పార్ట్స్ని తాకడం.. శరీరాకృతి గురించి చండాలమైన కామెంట్స్ చేయడం వంటివి చేసేవాడు. అంతేకాక యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం విద్యార్థులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. ఇలా సాగిపోతున్న ఇతడి అరాచకాల గురించి 1990లో మొదటి సారి ఓ టీనేజ్ యువతి ఫిర్యాదు చేయడంతో టిండాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. మెడికల్ చెకప్ కోసం వెళ్లిన తనను టిండాల్ అసభ్యకర రీతిలో తాకుతూ.. అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ టిండాల్పై వచ్చిన ఆరోపణలపై స్పందించడంలో విఫలమైనందుకు వేలాది మంది మాజీ రోగులు విశ్వవిద్యాలయంపై కేసు వేశారు. వైద్యుడి చర్యల గురించి సంస్థకు తెలుసని.. అయినప్పటికి అతడిపై చర్యలు తీసుకోకుండా సర్వీసులోనే కొనసాగించారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్సీ అధికారులు టిండాల్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని.. ఈ విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ ఇప్పటికే 200,000 డాలర్టు(1,45,23,803 రూపాయలు) చెల్లించినట్లు తెలిసింది. "కొన్నిసార్లు అతడి వద్ద పరీక్షలకు హాజరైన నర్సులు టిండాల్ దుర్మర్గాలను ప్రత్యక్షంగా చూశారని’’ న్యాయవాది తెలిపారు. బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘యూఎస్సీ హెల్త్ సెంటర్లో ఎన్నో వందల మంది మహిళలు ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ పలు తప్పుడు కథనాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఇవన్ని అవాస్తవాలని మేం నిరూపించగలం. అలానే తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను నేను అభినందిస్తున్నాను. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను’’ అన్నారు. ఇక నేరం రుజువైతే టిండాల్ 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడు. చదవండి: తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు -
డబ్బు ఆశతో భారీ మూల్యం చెల్లించుకున్న వైద్యుడు
వర్జీనియా: డబ్బు ఆశకు పోయి ఓ డాక్టర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని గైనకాలజిస్టు విభాగాంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ అవసరం లేకపోయినా శస్త్ర చికిత్సలు చేసి 465 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. ఈ డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్. వర్జీనీయాకు చెందిన ఈ వైద్యుడు గైనకాలజిస్ట్గా పనిచేస్తూ సొంతంగా ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్నాడు. అధిక డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన వద్దకు వచ్చిన రోగులకు అవసరం లేకపోయిన శస్త్రచికిత్స చేయాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఎక్కువగా అతడు గర్భసంచి సంబంధిత ఆపరేషన్స్ చేసేవాడు. మందులకు తగ్గే జబ్బులకు సైతం ఆపరేషన్ చేసేవాడు. అలా ఈ ప్రబుదుడు పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్లు అమెరికా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. (చదవండి: ఈమె 8 మంది శిశువులను చంపారట!) అయితే ఓ డాక్టర్ పదేళ్లలో సగటున 7.63 శాతం మాత్రమే ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. జావేద్ పర్వేజ్ మాత్రం పదేళ్లలో ఏకంగా 41.26 శాతం శస్త్ర చికిత్సలు చేశాడు. ఈ వైద్యుడి వద్దకు చికిత్సకు వెళ్లిన కొంతమంది మహిళలు అనుమానంతో మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. జావేద్ ఆస్పత్రిపై రైడ్ చేసిన మెడికల్ కౌన్సిల్ పదేళ్లలో 41.26 శాతం ఆపరేషన్స్ చేసినట్లు గుర్తించింది. అతడిని విచారించగా అధిక డబ్బు గడించాలనే ఆశతోనే ఇలా చేసినట్లు సదరు వైద్యుడు ఒప్పుకున్నాడు. దీంతో వర్జీనియా న్యాయస్థానం అతడికి దాదాపు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే) -
'ఆ ఫోటో నాదే.. నేను చనిపోలేదు'
ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. వారిలో వైద్య సిబ్బంది కూడా ప్రముఖంగా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87వేల మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడగా.. అందులో 2వేల మంది వైద్యులు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 600 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది డాక్టర్లు కరోనాకు బలయ్యారు. క్లిష్ట కాలంలో వీరు చేస్తున్న సేవలకు .. వారి ప్రాణత్యాగాలకు సెల్యూట్ చెప్పి తీరాల్సిందే. తాజాగా అహ్మదాబాద్కు చెందిన యువ గైనకాలజిస్ట్ డాక్టర విధి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారంటూ సోషల్మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొట్టింది. దీనిపై సోషల్మీడియాలో నెటిజన్లు ఆ డాక్టర్ మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులు ప్రకటించారు. (చదవండి : సుధా మూర్తి కూరగాయలు అమ్మారా.. నిజమెంత?) 'గుజరాత్కు ఈ వార్త దురదృష్టకరం. విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ విధి ఆత్మకు శాంతి చేకూరాలి.. ఒక యంగ్ కరోనా వారియర్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. ఆమె మరణం వాళ్ల కుటుంబానికి తీరని లోటు.. విధికి శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నాం' అంటూ కామెంట్ చేశారు. అయితే విధి కరోనాతో చనిపోయిందో లేదో తెలియదు గానీ ఆమె పేరుతో వాడిన ఫోటో మాత్రం ఆమెది కాదని యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చి చెప్పింది. వాస్తవానికి ఫోటోలో ఉన్న వ్యక్తి డాక్టర్ విధి కాదని.. దక్షిణాది సినీ నటి, మోడల్ సంస్కృతి షెనాయ్ అని వెల్లడించింది. కాగా సంస్కృతి పలు తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ విషయం తెలుసుకోవడానికి ఇండియా టుడే బృందం సంస్కృతి ఆఫీస్కు వెళ్లింది. 2015లో మలయాళం సినిమా అనార్కలి షూటింగ్ సందర్భంగా సంస్కృతి ఆ ఫోటో దిగిందని తేలింది. (చదవండి : దీపికా, రణ్వీర్తో దావుద్ ఇబ్రహీం డిన్నర్!) ఫోటోలో ఉన్నది నేనే : సంస్కృతి ఇదే విషయమై సంస్కృతి తన ఫేస్బుక్ పేజీలో సెప్టెంబర్ 14న క్లారిటీ ఇచ్చింది. వైరల్గా మారిన ఫోటోలో ఉన్నది తనేనని.. గుజరాత్కు చెందిన విధి ఎవరో తెలీదనీ.. తన ఫోటో ఎందుకు ఆమెకు వాడారో అర్థంకాలేదన్నారు. ఈ సందర్భంగా సంస్కృతి తన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ రాసుకొచ్చారు. ' డియర్ ఫ్రెండ్స్.. కొచ్చి నుంచి సంస్కృతి షినాయ్ మాట్లాడుతున్నా. గుజరాత్కు చెందిన యువ వైద్యురాలు విధి కరోనా మృతి చెందారంటూ ఆమెకు నా ఫోటో వాడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ఫోటో వాట్సప్, ఫేస్బుక్లో వైరల్గా మారింది. డాక్టర్ విధి ఎవరో నాకు తెలీదని.. ఒకవేళ ఆమె కరోనా సోకి మరణిస్తే ఆమెకె ఇవే నా ప్రగాడ సానభూతి తెలుపుతున్నా. కానీ ఆ ఫోటోలో ఉన్నది కచ్చితంగా నేనే అంటూ' కామెంట్ చేశారు. కాగా రివర్స్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా జూన్ 15,2016లో సంస్కృతి ఈ ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసినట్లు ఇండియా టుడే తెలిపింది. మరి డాక్టర్ విధి ఎవరు? సినీ నటి సంస్కృతి స్వయంగా ఆ ఫోటోలో ఉన్నది తానేనని స్వయంగా వెల్లడించడంతో .. అసలు డాక్టర్ విధి ఉన్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్ 9న డాక్టర్ విధి పీపీఈ కిట్ ధరించి పేషంట్ను చెక్ చేస్తున్న ఫోటో ఒకటి ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఐఎంఎస్వో) తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ఈ విషయమై యాంటీ ఫేక్వార్ రూమ్ ఐఎంఎస్వో సభ్యురాలు, డాక్టర్ విధి స్నేహితురాలు డాక్టర్ శుభమ్ కుమారిని కలిసింది. ఈ సందర్భంగా శుభమ్ కుమారి మాట్లాడుతూ.. 'విధి అనే అమ్మాయి బిహార్ నుంచి వచ్చిన మెడికల్ స్టూడెంట్. ఇంటర్న్షిప్ పని మీద ఆమె అహ్మదాబాద్కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 9న విధి కరోనా బారిన పడిందని' తెలిపారు.అయితే సోషల్మీడియాలో వైరల్ అయిన ఫోటో మాత్రం సినీ నటి సంస్కృతిదేనని.. డాక్టర్ విధి కాదని రివర్స్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా తేలింది. అయితే విధి కరోనాతో నిజంగా చనిపోయిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. -
కరోనా గుప్పిట్లో గైనకాలజిస్టులు!
నగరంలోని పలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు కోవిడ్–19 గుప్పిట్లోవిలవిల్లాడుతున్నాయి. ఇతర వైద్యులతో పోలిస్తే గైనకాలజీ వైద్యులు వైరస్కుఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫలితంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రసవం చేయాలంటేనే వైద్యులు భయపడుతున్నారు.సకాలంలో వైద్యసేవలు అందక గర్భిణులు సైతం ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సహజ, సిజేరియన్ ప్రసవ సమయంలోనే కాదు.. ఓపీకి వచ్చే గర్భిణులను వివిధ చెకప్ల పేరుతో తరచూ ముట్టుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ థియేటర్, ఐసీయూలో పని చేస్తున్న వైద్యులు పీపీ ఈ కిట్స్, ఎన్–95 మాస్క్లు, చేతి గ్లౌజులు ధరించి వైరస్ బారిన పడకుండా కొంత వరకు జాగ్రత్త పడుతున్నప్పటికీ... ఓపీ, ఐపీల్లో పనిచేసే వారు మాత్రం వైరస్ బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో... పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు యూనిట్లు ఉండగా, ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల చొప్పున మొత్తం 24 మంది పని చేస్తున్నారు. వీరిలో ఒక ప్రొఫెసర్ సహా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఇక్కడ పని చేస్తున్న 20 పీజీల్లో ఇప్పటికే 12 మందికి పీజీలకు పాజిటివ్ వచ్చింది. మరో 8 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వైద్యులను కింగ్కోఠి, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. వారికి సన్నిహితంగా మెలిగిన సహచర వైద్యులను క్వారంటైన్ చేశారు. ఇక ఆస్పత్రిలో పన్నెండు మంది కాంట్రాక్ట్ రెసిడెంట్లు ఉండగా, వీరిలో ఇద్దరికి వైరస్ సోకడంతో మిగిలిన వారంతా భయంతో విధులకు గైర్హజరవుతున్నట్లు తెలిసింది. కీలక విభాగాల్లోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైరస్ సోకడం, ఒకరు లీవ్లో ఉండటంతో మిగిలిన తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఐసీఎంఆర్ నిబంధనల మేరకు కేవలం నలుగురు డ్యూటీలో ఉంటే.. ముగ్గురు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 400–600 మంది గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ రోజుకు 40 నుంచి 60 ప్రసవాలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి తగి నంత మంది వైద్యులు లేక పోవడం, ఉన్నవారిని కూడా కరోనా వైరస్ భయం వెంటాడుతుండటంతో రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. సుల్తాన్బజార్ ఆస్పత్రి కిటకిట... గాంధీ గైనకాలజీ విభాగంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. వీటిలో రెండు యూనిట్లను కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులకు చికిత్స చేసేందుకు గాంధీలోనే ఉంచారు. ఇప్పటికే వీరు కరోనా బారిన పడిన నలుగురు గర్భిణులకు కూడా విజయవంతంగా ప్రసవం చేశారు. మిగిలిన యూనిట్లను ఉస్మానియా వైద్య కశాళాలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్ప్రతికి తరలించారు. దీంతో ఈ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. మార్చి వరకు గాంధీలో ఫాలో అప్ కోసం వచ్చిన ఆయా ప్రాంతాలకు చెందిన గర్భిణులను సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. వైద్యులు కూడా ఒక రోజు రెండు ఆస్పత్రులు తిరిగి చికిత్సలు చేయాల్సి వస్తుంది. కరోనా వైరస్ భయంతో సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనూ గర్భిణులను చూసేందుకు వైద్యులు భయపడుతున్నారు. ఒకే యూనిట్గా పరిగణించాలి పేట్లబురుజు, సుల్తాన్బజార్, నిలోఫర్, గాంధీ గైనకాలజీ విభాగాలను వేర్వేరు యూనిట్లుగా కాకుండా ఒకే యూనిట్ కిందికి తీసుకురావడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్, పీజీల్లో 2/3 వైద్యులను విధుల్లో ఉంచిæ, మరో 1/3 వైద్యులు క్వారంటైన్లో ఉండేలా చూడొచ్చు. ఓపీకి వస్తున్న గర్భిణులకు ముందే కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల వైద్యులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. – డాక్టర్ బొంగు రమేష్, చైర్మన్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
ఆ డాక్టరమ్మ బదిలీ
సంగారెడ్డి టౌన్: ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వచ్చే పేదలకు ఓ డాక్టరమ్మ నరకం చూపిస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. ప్రసవం సమయంలో పెద్ద మనసుతో వ్యవహరించాల్సిన వైద్యురాలు గిచ్చుడు, గిల్లుడు, చెంపలపై కొట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సదరు గైనకాలజిస్ట్పై వేటు వేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో సదరు గైనకాలజిస్ట్ను పటాన్చెరు బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి తెలిపారు. మమ్మల్ని కాపాడేదెవరు.. జిల్లా ఆసుపత్రిలో తరచూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. పెషేంట్లను కాపాడటమే తమ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రసవానికి వచ్చే గర్భిణి, పుట్టబోయే బిడ్డను కాపాడటం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రసవం సమయంలో తల్లి ఆవేదన ఎలా ఉంటుందో తమకు తెలుసని, ఒక వేళ బిడ్డగాని, తల్లి గాని ప్రాణాలు కోల్పోతే తమపై దాడి జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వైద్యురాలు కూడ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తోటి వైద్యులు తెలిపారు. ఉన్నత చదువులు చదివినా తాము రోగులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో తమకే తెలుసని ఆవేదన వెల్లగక్కారు. వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీకమిషనర్ ఆరా సంగారెడ్డి జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై తరచూ పత్రికల్లో వస్తున్న కథనాలపై వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి ఆరా తీశారు. జిల్లా ఆసుపత్రిలో పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, సంగారెడ్డి సూపరింటెండెంట్లతో సమావేశమై ఇటీవలి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గర్భిణుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. -
అబార్షన్లు ఆగట్లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అబార్షన్లు ఏడాదికేడాదికి పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో తెలంగాణలో 27,559 మంది మహిళలకు అబార్షన్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. ఈ అబార్షన్లలో కొన్నింటిని బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు గైనకాలజిస్టుల సలహా మేరకు చేస్తారు. కానీ మరికొన్ని అబార్షన్లు మాత్రం ఆడబిడ్డను వదిలించుకోవడానికి జరుగుతున్నవిగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2016–17 నుంచి 2019–20 (డిసెంబర్ నాటికి) దేశవ్యాప్తంగా 45.24 లక్షల అబార్షన్లు జరిగాయి. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువగా కనిపిస్తున్నా, ఏటేటా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. పాత అబార్షన్ల చట్టం ప్రకారం 20 వారాల వరకు జరిగే అబార్షన్లకు మాత్రమే చట్టబద్ధత కల్పించింది. దీనివల్ల నిజమైన కారణాలు ఉన్నప్పటికీ అబార్షన్లు చేసే అవకాశం లేక కొంత మంది అశాస్త్రీయ పద్ధతులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన కేంద్రం అబార్షన్ల గడువును 24 వారాలకు పొడిగించింది. వారి చేతిలోనే 46.6%.. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం దేశంలో 46.6 శాతం అబార్షన్లు వైద్యులు కానివారు చేస్తున్నారు. వాస్తవంగా గైనకాలజిస్ట్ మాత్రమే ఈ అబార్షన్లను చేయాలి. అది కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. కానీ నర్సులు, మంత్రసానులు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు, కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగతంగా కొందరు అనైతికంగా అబార్షన్లు చేస్తున్నారు. 27.4 శాతం అబార్షన్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అనైతిక అబార్షన్లు నేరం.. అనైతికంగా ఎవరుపడితే వారు అబార్షన్లు చేయడం నేరం. కేవలం గైనకాలజిస్ట్లు మాత్రమే తల్లి, బిడ్డల ఆరోగ్య విషయాలు పరిశీలించి, సమస్య వస్తేనే 20 వారాల గడువులోగా అబార్షన్ చేయాలి. డాక్టర్ కానివారు ఎవరైనా అబార్షన్ చేయకూడదు. చాలామంది ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఆడబిడ్డ ఉందని గుర్తించి, తల్లిదండ్రుల విన్నపం మేరకు అబార్షన్లు చేస్తున్నారు. ఇది అనైతికం. ఆడబిడ్డ కడుపులో ఉన్న విషయాన్ని స్కానింగ్ ద్వారా తెలుసుకొని కొందరు తీవ్రమైన తప్పుకు ఒడిగడుతున్నారు. మేము అలాంటి వాటిపై సీరియస్గా వ్యవహరిస్తున్నాం. –డాక్టర్ కృష్ణవేణి, గైనకాలజిస్ట్, హైదరాబాద్ వివిధ సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అబార్షన్ల సంఖ్య -
పెళ్లయి నాలుగేళ్లయినా సంతానం లేదు... తగిన సలహా ఇవ్వండి
నా వయసు 39 ఏళ్లు. నా భార్య వయసు 36 ఏళ్లు. కెరీర్లో పడి పెళ్లి లేటయ్యింది. పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు లేరని మా ఇరువైపుల తల్లిదండ్రులు, పెద్దల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. ‘బాగా లేటైంది కదా... ఇప్పుడు కష్టమే’ అని కొందరు భయపెడుతున్నారు. మాకు ఏ రకమైన ఇతర సమస్యలూ లేవు. దయచేసి పిల్లల తొందరగా పుట్టడానికి మేము ఏయే పరీక్షలు చేయించుకోవాలి వంటి వివరాలను తెలియజేయగలరు. సంతానం ఇప్పుడు అందని మానిపండేమీ కాదు... ఆధునిక వైద్య చికిత్సలతో సంతానలేమికి చెక్ పెట్టవచ్చు. ముందుగా మీరు అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ను కలవండి. సంతానలేమితో వచ్చిన దంపతులకు ముందుగా సంతాన పొందలేకపోవడానికి వారికి గల కారణాలేమిటో వైద్యులు తొలుత గుర్తిస్తారు. వాటిని అధిగమించడానికి తోడ్పడగల ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళికలకు అనుగుణంగా నిపుణులు–అనుభవజ్ఞులైన వైద్యుల బృందంతో పాటు ఆధునికమైన సౌకర్యాలు కలిగిన కేంద్రాల్లో తగిన చికిత్స అందించి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతున్నారు. సంతానం పొందాలనుకునే వారు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా ఏడాది వరకు ప్రయత్నించినా గర్భం రాకపోతే దాన్ని వైద్యులు ‘ఇన్ఫెర్టిలిటీ’గా పరిగణిస్తారు. ఈ సంతానలేమికి కొన్ని ప్రధాన కారణాలను వైద్యనిపుణులు గుర్తించారు. అవి... ఓవ్యులేషన్ డిజార్డర్ : కొంతమంది మహిళల్లో పలు కారణాల వల్ల అండాలు విడుదల కావు. లేదా సహజమైన క్రమంలో విడుదల కావు. హార్మోన్లతో పాటు రుతుక్రమాన్ని అదుపు చేసే అనేక కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి. పిట్యుటరీ గ్రంథి – అండాశయాలు – ఫాలికిల్స్ మధ్య సున్నితమైన సమాచార మార్పిడి సంబంధం సరిగా పనిచేయకపోవడం, చాలాకాలం పాటు హార్మోనక్ష ఆధారిత గర్భనిరోధక విధానాలు అనుసరించడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యేందుకు అవకాశం ఉంది. లో స్పెర్మ్ కౌంట్ సంతానాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉండాలంటే పురుషుడి ఒక మిల్లీలీటర్ వీర్యంలో రెండు కోట్ల పురుష బీజకణాలు ఉండాలి. ఈ సంఖ్య కోటీ యాభైలక్షలు... లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని లో–స్పెర్మ్ కౌంట్గా పరిగణిస్తారు. ఈ పురుష బీజకణాల సంఖ్య సహజ పద్ధతిలో అండాన్ని ఫలదీకరించడానికి సరిపోదు. అందువల్ల దంపతుల్లో సంతానలేమి ఏర్పడే అవకాశం ఉంది. మద్యం అలవాటు, పొగాకు వాడటం, అనారోగ్యకరమైన జీవనశైలి ఇలా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. అనారోగ్యకరమైన పురుష బీజకణాలు పురుష బీజ కణాల కదలికల్లో (దాని తోక భాగంలో చలనంలో) లోపం, పురుష బీజ కణం నిర్మాణంలో (రూపం – తయారుకావడం – డీఎన్ఏ) లోపం వంటివి కూడా సంతానలేమికి కారణమవుతాయి. సంతానలేమి కేసుల్లో దాదాపు 25 శాతం ఈ కారణంవల్లనేనని ఒక అంచనా. పోషకాలు కొరవడిన అనారోగ్యకరమైన ఆహారం, పొగాకు, మద్యపానం వంటి అలవాట్లు పురుష బీజ కణాల ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం అండాశయం నుంచి విడుదలైన అండాలు గర్భాశయానికి రావడం అన్నది ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి ప్రయణించడం ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ గొట్టాలు మూసుకుపోయినట్లయితే ఫలదీకరణం చెందిన అండం (జైగోట్)... గర్భాశయానికి చేరి గర్భం వచ్చే అవకాశాలు ఉండవు. పెల్విక్ ఇన్ఫెక్షన్ డిసీజ్ (పీఐడీ... అంటే కటి ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావడం), ఎండోమెట్రియాసిస్, లైంగికంగా వ్యాపించే రోగాలు (సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డీసీజెస్–ఎస్టీడీస్) వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫెలోపియన్ టీబీ కారణంగా కూడా ఈ గొట్టాలు మూసుకుపోవచ్చు. ఎండోమెట్రియాసిస్ సంతానలేమితో బాధపడుతున్న మహిళల్లో దాదాపు మూడోవంతు (35 శాతం) ఎండోమెట్రియాసిసే ఇందుకు కారణం. గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధం ప్రక్రియలో భాగంగా ఏర్పడే ఎండోమెట్రియమ్ పొర రుతు సమయంలో మొత్తంగా విడిపోకుండా అక్కడే ఉండిపోతుంది. అలా ఉండిపోయిన ఆ పొర అంతర్గత అవయవాల్లో ఇతర భాగాలకు అతుక్కుపోతుంది. గర్భాశయంలో మిగిలిపోయిన ఎండోమెట్రియం... ఫలదీకరణం చెందిన అండం (జైగోట్)... అక్కడ స్థిరపడానికి ఆటంకం అవుతుంది. మరోవైపు ఇతర భాగాల్లో అతుక్కున్న ఎండోమెట్రియమ్ కొన్నిసార్లు ఫిలోపియన్ ట్యూబ్స్లో అడ్డంకిగా మారి అండం–పురుషబీజకణం కలవకుండా అడ్డుపడుతుంది. అనారోగ్యకరమైన అండం పోషకాహారలోపం, విపరీతమైన శారీరక–మాసనిక ఒత్తిడి, హార్మోన్లలోపం, అనారోగ్యకరమైన జీవనశైలి, వయసుపైబడటం వంటి కారణాల వల్ల మహిళల్లో అండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది సహజంగానే అండం ఫలదీకరణం, గర్భం దాల్చడంపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. లోపాలను గుర్తించే పరీక్షలు సంతానలేమికి గల కారణాలను తెలుసుకునేందుకు దంపతులిద్దరికీ విడివిడిగా కొన్ని పరీక్షలు నిర్వహించాలి. మహిళల్లో సంతానలేమికి దారితీసిన పరిస్తితులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షగా ఓవ్యులేషన్ మానిటరింగ్ చేస్తారు. ఇందుకుగాను గర్భాశయానికి అల్ట్రాసౌండ్ టెస్ట్, ట్యూబ్యులార్ ప్రెగ్నెన్సీ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షల ఫలితాలపైన ఆధారపడి చికిత్సను నిర్ణయించేందుకు ముందుగా మరికొన్ని పరీక్షలు జరపాల్సిరావచ్చు. అవి... ఎఫ్ఎస్హెచ్, ఈ2, ఎల్.హెచ్., హెచసీవీ యాంటీబాడీస్, కంప్లీట్ హీమోగ్రామ్, హెచ్ఐవీ – 1, 2 యాంటీబాడీస్, టీఎస్హెచ్, హెచ్పీఎల్సీ, ఏఎంహెచ్, రుబెల్లా 1 జీజీ, ఎఫ్టీ3, ఎఫ్టీ4, బ్లడ్షుగర్ మానిటరింగ్, ప్రోలాక్టిన్, హెచ్బీఎస్ యాంటిజెన్, యాంటీహెచ్బీసీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో పురుషుడిలో గల లోపాలను తెలుసుకునేందుకు ముందుగా సెమన్ ఎనాలిసిస్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తారు. ఈ పరీక్ష ద్వారా ఆ వ్యక్తికి గల ఫలదీకరణ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. సెమన్ ఎనాలజిస్లో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటిలో కదలిక శక్తి తగినంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏమైనా బయటపడితే... డాక్టర్ మరికొన్ని పరీక్షలకు సిఫార్సు చేయవచ్చు. అవి... అడ్వాన్స్డ్ స్మెర్మ్ ఎనాలిసిస్ పరీక్ష, కంప్లీట్ హీమోగ్రామ్, టెస్టిక్యులార్ బయాప్సీ, హెచ్బీఎస్ యాంటిజెన్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, హెచ్సీవీ యాంటిబాడీస్, జెనెటిక్ టెస్ట్, హెచ్ఐవీ 1, 2 యాంటీబాడీస్, క్యారియోటైప్ ఎగ్జామినేషన్, వీడీఆర్ఎల్ వంటి పరీక్షలను ప్రాథమిక పరీక్షల తర్వాత దంపతులకు అవసరమైన ఈ అదనపు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... ఆ ఫలితాల ఆధారంగా వారు సంతాన్ని పొందలేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. దానికి అనుగుణంగా వారికి అవసరమైన చికిత్సా విధానాన్ని గుర్తించి, దాన్ని అమలు చేస్తారు. డాక్టర్ ధాత్రీ కుమారి, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ వైద్యనిపుణులు, యశోద ‘మదర్ అండ్ ఛైల్డ్’ ఇన్స్టిట్యూట్ యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ -
గర్భంలోనే సమాధి..!?
చొప్పదండికి చెందిన దంపతులకు మూడేళ్ల క్రితం ఆడశిశువు జన్మించింది. రెండోసారి గర్భం దాల్చగా కరీంనగర్లోని ఓ గైనకాలజిస్టు నర్సింగ్హోంలో వైద్యసేవలు పొందుతున్నారు. మూడో నెల మొదలు కడుపులో ఉన్నది ఆడా మగా ఎవరో తెలుసుకునేందుకు డాక్టర్ను సంప్రందించారు. ఆ డాక్టర్ ముందుగా లింగనిర్ధారణ చేయబోమని, ఇది చట్టరీత్యా నేరమని వివరించింది. అయినా వినిపించుకోకుండా స్కానింగ్ పరీక్షలు చేయకపోతే వేరే హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటామని చెప్పి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో వైద్యురాలు స్కానింగ్ చేసింది. కడుపులో ఉన్నది మళ్లీ అడశిశువు అని స్కానింగ్లో తెలిసింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి నగరంలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఎలాంటి అర్హతలు లేకుండానే నిర్వహిస్తున్న ఓ క్లీనిక్ను సంప్రదించారు. అక్కడ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని తల్లి గర్భంలోనే తుంచివేశారు. కరీంనగర్హెల్త్: నవ మాసాలు మోసి కని పెంచాల్సిన అమ్మా ఆడపిల్లలు వద్దనుకుంటోంది. తను కూడా ఆడే అనే విషయాన్ని మరిచిపోయి ఆడశిశువుల పట్ల వివక్ష చూపుతోంది. కడుపులో ఉన్న శిశువు ఆడ అని తేలగానే గర్భంలోనే సమాధి చేస్తున్నారు. ఆడపిల్లలను వద్దని వివక్ష చూపడం సరైంది కాదని తెలిసినా గర్భంలోనే తుంచివేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆడపిల్ల వద్దనుకుంటున్న వారికి శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు చేయడం చట్టరీత్యా నేరమని బోర్డులు ప్రదర్శిస్తూనే గట్టుచప్పుడు కాకుండా స్కానింగ్సెంటర్లలో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. కొందరు అర్హత లేకున్నా వైద్యులుగా క్లీనిక్లు నడుపుతున్న వారు అబార్షన్లు చేస్తున్నారు. కరీంనగర్లో భ్రూణహత్యలు నిత్యకృత్యాలుగా మారాయని, జనావాసాల మధ్య ఇలాంటి వాటిని నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బంగారు తల్లి, కల్యాణలక్ష్మి, బేటీ బచావో.. బేటీ పడావో వంటి పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వాలు భ్రూణహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం అధికారులు భ్రూణహత్యల నివారణకు వంద శాతం చర్యలు తీసుకుటుంన్నట్లు పేర్కొంటున్నా జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1991 జనాభా లెక్కల ప్రకారం 0–6 బాలబాలికల నిష్పత్తి 1000 : 981 ఉంటే 2011 జనాభా లెక్కల వరకు 0–6 వయసు గల బాలబాలికల నిష్పత్తి 1000 :937కు పడిపోయింది. 2001 ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000 :982 ఉంది. ప్రభుత్వం 1994లో గర్భస్థ పిండ ప్రక్రియ నిరోధక చట్టాన్ని(పీఎన్డీటీ) ప్రవేశపెట్టింది. చట్టాలపై అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో నిధులు విడుదల అవుతున్నా బాలికల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు స్కానింగ్సెంటర్లపై పూర్తిగా నిఘా కొరవడింది. వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 140వరకు స్కానింగ్ కేంద్రాలు ఉండగా 52 వేర్వేరు కారణాలతో మూసివేశారు. వీటిలో నాలుగు కేసులు మాత్రమే నమోదైనట్లు సమాచారం. 2017లో కరీంనగర్ మంకమ్మతోటలోని ఓ స్కానింగ్సెంటర్ను సీపీ కమలాసన్రెడ్డి తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గర్భిణికి ఎన్నో కాన్పు, గతంలో అబార్షన్లు జరిగాయా, అనే ప్రాథమిక సమాచారం లేకుండానే రికార్డులు నిర్వహించడం వారి డొల్లతనానికి నిదర్శనం. తనిఖీలు చేయని కమిటీలు.. నిత్యకృత్యాలుగా మారిన శిశువు లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను అరికట్టడంలో ఏర్పాటైన కమిటీలు ఏనాడూ స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. భ్రూణహత్యల నివారణకు గతంలో మొబైల్ బృందాలు ఏర్పాటు చేసుకొని స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న సౌకర్యాలు, స్కానింగ్ నిర్వహణ, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం ఆ బృందాలు ఉన్నా, అడ్వయిజరీ కమిటీలు వంటివి ఏర్పాటు చేసిన భ్రూణహత్యలు నివారిండంలో విఫలం అవుతున్నారు. నగరంలోని అన్ని గైనకాలజిస్టు హాస్పిటల్స్లో స్కానింగ్ నిర్వహిస్తున్నా నాలుగేళ్లలో ఒక్క కేసు నమోదు చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. చట్టం ఏం చెబుతోంది.. గర్బంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగనిర్ధారణ నిరోధక చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి గర్భిణి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు, పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తప్ప ఎలాంటి పరిస్థితిలోనూ పరీక్షలు చేయకూడదు. గర్భస్థ శిశు పరీక్షలు నిర్వహించే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఇతర కేంద్రాలు వైద్య, ఆరోగ్య శాఖలో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. శిశు లింగ నిర్ధారణ చేస్తే చర్యలు.. స్కానింగ్ సెంటర్లలో శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 140వరకు శిశు లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉండగా వీటిలో 52 స్కానింగ్ సెంటర్లు మూసేయడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా మూసివేయగా, మరికొన్ని కేంద్రాలు తొలగించుకోగా మరికొన్నింటిని మూసేశాం. శిశువు లింగనిర్ధారణ నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. లింగనిర్ధారణ నివారణకు దాదాపు 10మందితో కూడిన అడ్బయిజరీ కమిటీ ఉంది. అందులో డీఎంహెచ్ఓ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, న్యాయవాదితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్కానింగ్ సెంటర్లు నిర్వహించే హాస్పిటల్స్లో ఆ గైనకాలజిస్టు కనీసం ఆరు నెలలపాటు స్కానింగ్పై శిక్షణ పొంది ఉండాల్సి ఉంది. స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసుకునే వారు తప్పకుండా రిజిష్టర్ చేయించుకోవాలి. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్రావు, కరీంనగర్ -
అమ్మకు ఎంత కష్టం
అమ్మతనం కమ్మదనం పొందడానికి ఆ తల్లీ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. కాన్పు పునర్జన్మతో సమానం అని తెలిసినా అందుకు సిద్ధపడుతుంది. బిడ్డను చేతికివ్వగానే ఆమె మేను పులకురిస్తుంది. కానీ ఆ అమ్మకు ‘కడుపుకోత’లతో అనేక వ్యాధుల పలకరిస్తున్నాయి. వైద్యో నారయణ హరీ! అంటారు, కానీ ప్రైవేటు వైద్యుల పట్టనితత్వమో, పైసల వ్యామోహమో సహజ కాన్పుకు నోచుకోలేక అమ్మకు ఈ దుస్థితి వచ్చింది. సాక్షి, పాలమూరు: అనవసర శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వాటిని మూసివేయడానికి కూడా వెనుకాడం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసే సాధారణ ప్రసవాలు, సిజేరియన్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని ఇటీవల సమీక్షలో కలెక్టర్ ప్రైవేట్ వైద్యులకు చెప్పిన మాటలివి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే కోతగా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకొని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంతమేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం దాదాపు 80 శాతానికిపైగా సిజేరియన్లే జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు అయ్యాయి. ఇందులో సాధారణ 307, సిజేరియన్లు 640 కాగా.. ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది పుట్టారు. అవసరం లేకున్నా.. విదేశాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ప్రసవం సిజేరియన్ ద్వారా చేయరు. స్థానికంగా మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉ న్నా.. లేకపోయినా శస్త్రచికిత్స నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకైతే మరీ నరకం. ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ లో మాత్రమే అధికంగా సిజేరియన్ కాన్పులు నిర్వ హిస్తున్నారు. ఒక్కో కాన్పునకు కనీసంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో ప్రైవేట్లో అయిన 648 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30 వేలు లెక్కించినా రూ.1.94 కోట్ల సొత్తు ప్రైవేట్ ఆస్పత్రులు వెనకేసుకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా వారే రూ.12 వేలు చెల్లించడంతోపాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనే.. వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్కు వెళ్లాల్సి వస్తోంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు.. బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలు ఉంటేనే సిజేరియన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణాలు లేకపోయినా గర్భిణులు, వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేసి కోతలకు వెళ్తున్నారు. అవగాహన లేని ప్రజలు వైద్యులు సూచనల మేరకు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు. కోతలతో దీర్ఘకాలిక నష్టాలు కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది. మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తుంటాయి. హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. రెండోకాన్పు తప్పకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సిజేరియన్ జరిగే సమయంలో గర్భాశయం పక్కన భాగాలపై గాయాలవడంతోపాటు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి. ూ రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భసంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది. గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి సమస్యలు ఎదురవుతాయి. కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు. చర్యలు తీసుకుంటాం గతంతో పోలిస్తే ప్రస్తుతం సిజేరియన్లు తగ్గాయి. వాటిని మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చ ర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైనా మాకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నార్మల్ ప్రసవాలపై నిబంధనలు వివరిస్తాం. – డాక్టర్ రజిని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి, మహబూబ్నగర్ సాధారణ కాన్పుతో ఆరోగ్యం సాధారణ కాన్పుతో మహిళకు ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్లో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవవు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా శస్త్రచికిత్స ప్రసవం చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కాన్పు అయ్యాక కొన్ని దుష్పరిణామాలు భవిష్యత్లో ఏర్పడవచ్చు. సిజేరియన్తో శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తాయి. లీటరు రక్తం వరకు వృథాగా వెళ్తుంది. – రాధ, గైనిక్ హెచ్ఓడీ జనరల్ ఆస్పత్రి, మహబూబ్నగర్ -
ఈస్ట్రోజెన్ తగ్గకుండా ఉండాలంటే?
నాకు ఈమధ్య బాగా చెమటలు పడుతున్నాయి. చికాకుగా ఉంటోంది. మెనోపాజ్ అని అనుమానంగా ఉంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోకుండా శరీరానికి అవసరమైన ఆహారం తీసుకోవచ్చు అని విన్నాను. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నీరజ, సింగరాయకొండ మీ వయసు ఎంత అని రాయలేదు. పీరియడ్స్ అవుతున్నాయా లేదా రాయలేదు. చెమటలు పట్టడం, చిరాకు వంటి లక్షణాలు మెనోపాజ్ సమయంలోనే కాకుండా, వేరే హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, విటమిన్ లోపాలు, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు ఎన్నో కారణాల వల్ల ఉండవచ్చు.కొందరిలో పీరియడ్స్ ఆగిపోయే 4–5 సంవత్సరాల ముందు నుంచి కూడా అండాశయాలు తగ్గి వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం మెల్లగా తగ్గిపోతూ వచ్చి చాలావరకు ఆగిపోతుంది.ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఉన్నట్టుండీ శరీరం వేడిగా అనిపించడం, అలాగే చెమటలు పట్టడం (hotflushes), చికాకు, కోపం, డిప్రెషన్ వంటి అనేక మార్పులు జరుగుతుంటాయి. వీటినే మెనోపాజల్ లక్షణాలుగా పరిగణించటం జరుగుతుంది. సహజంగా వచ్చే ఈ మార్పులను మనం నివారించలేము. కాకపోతే, తప్పిపోయిన ఈస్ట్రోజన్కు బదులుగా, ఈస్ట్రోజన్లాగా పనిచేసే ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్ అనే పదార్థాలను వాడవచ్చు. ఇవి సాధారణంగా సోయాబీన్స్, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, పిస్తా, బఠాణీలు, పప్పులు, లవంగాలు, ఎండు ఖర్జూరాలు, నారింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్స్, వాటి ఉత్పత్తులయిన సోయా పాలు, చీజ్, సోయాపిండి, తోçఫు... వంటివాటిలో ఎక్కువగా ఐసోఫ్లావోన్స్ అనే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో ఇడ్లీలలో మినపప్పు బదులు, ఉడికించిన సోయాగింజలు, చపాతీల్లో సోయా పిండి అలా రకరకాలుగా తీసుకోవచ్చు. అలాగే ఎక్కువగా నీళ్ళు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. (ఈ సమయంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకలు అరగటం, గుండె పనితీరులో మార్పులు కూడా జరుగుతాయి) వాకింగ్, వ్యాయామాలు, ధ్యానం చెయ్యటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం దృఢంగా ఉంటుంది. కాఫీ, టీ, కారం, మసాలాలు బాగా తగ్గించడం మంచిది. ఈ ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్ ఆహారంలోనే కాకుండా, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. ఇవి డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పాపాయికి ఏ సమయాల్లో పాలు పట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వివరంగా తెలియజేయగలరు. – బి.సుమ, సామర్లకోట బాలింతలలో కాన్పుకి ముందు కంటే ఎక్కువగా ఆహారంలో మంచి పోషక పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డ పెరగటానికి, తల్లిలో మార్పులకు, కలిగిన అలసటకు, కాన్పు తర్వాత ఆ నీరసం తగ్గటానికి, బిడ్డకు పాలు ఇవ్వటానికి తగిన శక్తి కావలసి ఉంటుంది. బిడ్డకు కావలసిన పోషకాలు అన్నీ తల్లి పాల ద్వారానే అందుతాయి. కాబట్టి కాన్పు తర్వాత ఆహారంలో అన్నం, చపాతీలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రైప్రూట్స్, పాలు, పెరుగు, మాంసాహారులు అయితే చేపలు, మాంసం అన్నీ కొద్దికొద్దిగా రోజూ తీసుకోవచ్చు. వీటివల్ల తల్లికి చీముపట్టడం, బిడ్డకు జలుబు చెయ్యడం వంటి సమస్యలు ఏమీ ఉండవు. తల్లి ఆహారంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొటీన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి పాలు బాగా పడతాయి. కుట్లు తొందరగా మానుతాయి. ఎక్కువగా మంచినీళ్లు తీసుకోవాలి. దాని వల్ల పాలు బాగా వస్తాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, మలబద్ధకం లేకుండా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు త్రాగడం వల్ల పొట్ట పెద్దగా రావడం ఉండదు. పాపకి పాలు 3 గంటలకొకసారి తాగించాలి. పాలు తాగించేటప్పుడు బిడ్డను సరిగా పట్టుకొని, రొమ్ములను సరిగా పట్టించి తాగించాలి. పాలు సరిగా రావటానికి పౌష్టికాహారంతో పాటు, తల్లి మానసికంగా సంతోషంగా ఉండటం కూడా ముఖ్యం.కాన్పు తర్వాత తల్లి కనీసం మూడునెలల పాటు ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవాలి. కాన్పు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా, కొద్దిగా మెల్లగా నడవడం వంటి చిన్న పనులు చేసుకుంటూ ఉండటం, రెండు నెలల తర్వాత వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. నా వయను 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. నాకు డయాబెటిస్ ఉంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను బరువు ఎక్కువగా ఉన్నాను. ఈ టైమ్లో బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చా? ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. – యస్.పల్లవి, సిద్దిపేట మీకు డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో వచ్చిందా, లేక గర్భం రాక ముందు నుంచే ఉందా అనేది సరిగా రాయలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీలో మార్పుల వల్ల షుగర్ లెవల్స్ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. దాన్ని నియంత్రించడానికి మందులు (ఇన్సులిన్) ఎక్కువ డోసులో వాడవలసి ఉంటుంది. ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఈ సమయంలో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. దీనికోసం ఆహారంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆహారంలో అన్నం తక్కువ (కార్బోహైడ్రేట్స్) తీసుకోవాలి. స్వీట్లు, షుగర్ ఎక్కువ ఉన్న అరటిపండ్లు, సపోటా వంటివి తీసుకోకపోవడం మంచింది. పాలలో షుగర్ లేకుండా తీసుకోవాలి. ఆహారం కొద్దికొద్దిగా 4,5 సార్లుగా విభజించుకుని తీసుకోవడం మంచిది. ఒకసారి డైటీషియన్, నిపుణులను సంప్రదిస్తే వారు మీ బరువుకి తగ్గ ఆహార నియమాలను ప్లాన్ చేసి ఇస్తారు. అలాగే ఫిజీషియన్ దగ్గర సక్రమంగా చెకప్లకు వెళ్ళడం, షుగర్ లెవెల్స్ అవసరాన్ని బట్టి 15 రోజులకు లేదా నెలకోకసారి పరీక్ష ద్వారా తెలుసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ మందులు, ఇన్సులిన్ డోస్ను సరిచేసుకుంటూ వాడుకోవాలి. ఈ సమయంలో గైనకాలజిస్ట్ సలహా మేరకు, రోజూ అరగంట వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు, యోగ, ప్రాణాయామం వంటివి చెయ్యడం తప్పనిసరి. - డా‘‘ వేనాటి శోభ, బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
సిప్రిడోఫోబియా నుంచి బయటపడేదెలా?
నాకు పెళ్లి నిశ్చయమైంది. కానీ మనసులో ఏవో భయాలు. నాకు కాబోయే భర్త చెడుతిరుగుళ్లు తిరిగి ఉంటే నా పరిస్థితి ఏమిటి? అతనికేమైనా సుఖవ్యాధులు ఉన్నాయేమో... ఇలా రకరకాల భయాలు మొదలయ్యాయి. ‘సిప్రిడోఫోబియా’ నుంచి ఎలా భయటపడాలో దయచేసి తెలియజేయగలరు. – కెఆర్, కాజీపేట సిప్రిడోఫోబియా అంటే కలయిక గురించిన భయం. దాని వల్ల లైంగిక వ్యాధులు, సుఖవ్యాధులు వస్తాయోమోనన్న భయం, అపోహలతో చాలామంది పెళ్లి అంటేనే భయపడిపొతుంటారు. పెళ్లయినా, భర్తని దూరం పెట్టడం, వాళ్లకి వాళ్ళే ఏదో అయిపోతుందని ఊహించేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. దీని లక్షణాలలో భాగంగా కంగారు, భయం, గుండెదడ, లేనిపోని అనుమానాల వంటివి ఎన్నో ఉండవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆందోళన తగ్గడానికి కొన్ని మందులు వంటివి ఉంటాయి. అలాగే పాజిటివ్ థింకింగ్, యోగా, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీలో భాగంగా ఈ సమస్య ఉన్నవాళ్లకి రకరకాల ఉదాహరణలు ఇవ్వడం, సుఖవ్యాధుల గురించి అవగాహన, కొన్ని వీడియోలు చూపడం వంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించి భయపడడం మానేసి ఒకసారి సైకాలజిస్ట్ను లేదా సైకియాట్రిస్ట్ను సంప్రదించి కౌన్సెలింగ్ చేయించుకోవడం మంచిది. నాకు తరచుగా వైట్ డిశ్చార్జి అవుతుంది. నెలసరికి సంబంధం లేకుండా రక్తస్త్రావం అవుతోంది. దీనికి కారణాలు, నివారణ గురించి తెలియజేయగలరు.– యస్బి, రాజంపేట వైట్ డిశ్చార్జ్, రక్తస్రావం తరచుగా అవుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ను సంప్రదించడం మంచిది. తరచుగా వైట్ డిశ్చార్జ్ అవుతుందన్నారు, అందులో దురద, చెడువాసన ఏమైనా ఉన్నాయా అని రాయలేదు. ఇవన్నీ కలిపి ఉంటే యోనిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది.కొంతమందిలో పిరియడ్ మధ్యలో, పిరియడ్ వచ్చే ముందు కొద్దిగా జిగటగా వైట్డిశ్చార్జ్ అవుతుంది. అది మాములే.కొందరిలో రక్తహీనత, నులిపురుగులు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వైట్డిశ్చార్జ్ అవుతుంది. నెలసరి అప్పుడు కాకుండా మిగతా సమయంలో కూడా రక్తస్రావం అవుతుంటే మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల మార్పులు, థైరాయిడ్ సమస్య, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో పుండ్లు, ఇన్ఫెక్షన్లు, అండాశయంలో సిస్ట్ల వంటి అనేక కారణాల వల్ల రావచ్చు.ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, పెల్విక్ స్కానింగ్, బీపీ, థైరాయిడ్ వంటి కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల మీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గ, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నాకు మంటగా ఉంటోంది. ఇది క్లమిడియా లక్షణమని మా కొలీగ్ చెబుతున్నారు. ఇది నిజమేనా? ఈ బ్యాక్టీరియా ఎందుకు సోకుతుంది? నివారణ చర్యలు ఏమిటి? – విఎన్, నరసరావుపేట మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా ఉండడం అనేది కేవలం క్లమిడియా బ్యాక్టీరియా వల్లే కాదు ఇంకా అనేక రకాల బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు. క్లమిడియా బ్యాక్టీరియా జాతికి చెందిన క్రిములు. ఇవి మగవారిలో వీర్యంలో, ఆడవారిలో యోనిస్రావాలలో ఉంటాయి. ఇవి కలయిక ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట, పచ్చని యోని ద్రవాలు వస్తాయి. దురద, మంట, కలయికలో నొప్పి, నెలసరి మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యం చేస్తే క్లమిడియా బ్యాక్టిరియా యోని నుంచి గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ తద్వారా పొత్తి కడుపులోకి పాకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్(పీఐడి)ని కలుగజేస్తుంది. ఇందులో ట్యూబ్స్ పాడై అవి మూసుకోవడం, వాటి పనితీరు తగ్గడం... తద్వారా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వవచ్చు. ఇందులో జ్వరం, ఒళ్లునొప్పులు, వాసన, దురదతో కూడిన తెల్లబట్ట, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గర్భం దాల్చితే అవి బిడ్డకు కూడా సోకి ఇబ్బందులు కలిగించవచ్చు. దీనికి లక్షణాలను బట్టి వెజైనల్ స్వాబ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. లక్షణాల తీవ్రతను బట్టి దీనికి అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్వంటి యాంటిబయాటిక్స్తో చికిత్స వారం నుంచి రెండు వారాల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కలయికకు దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో మగవారు కూడా మందులు వాడితే మంచిది.మంచి ఆహార నియమాలు, వ్యాయామాలతో రోగనిరోధకశక్తిని పెం చుకోవడం, శారీరక,వ్యక్తిగత శుభ్రతను పాటించడం, కలయిక సమయంలో కండోమ్స్ వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను చాలావరకు అరికట్టవచ్చు.క్లమిడియా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిపోయినా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి రోగనిరోధకశక్తిని బట్టి కలయిక ద్వారా మళ్లీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
పెళ్లికి ముందే నిల్వ చేసుకోవడం ఉత్తమం
సాక్షి, సిటీబ్యూరో: వివాహాన్ని వాయిదా వేసుకునే యువతీ, యువకులు భవిష్యత్తు అవసరాల కోసం ముందే తమ అండం, వీర్యకణాలను భద్రపరుచుకోవడం ద్వారా 35 నుంచి 40 ఏళ్ల తర్వాత కూడా సంతానాన్ని పొందగలిగే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి చిరుమామిళ్ల అన్నారు. మంగళవారం నోవా ఇన్ఫెర్టి లిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల పేరుతో చాలా మంది యువతీ, యువకులు వివాహాన్ని వాయిదా వేసుకోవడం, ఒక వేళ పెళ్లి చేసుకున్నా..పిల్లలను కనడం వాయిదా వేసుకుంటున్నారన్నారు. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాశయాలు, పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గి తీరా పిల్లలు కావాలనుకునే సమయంలో పుట్టకుండా పోతున్నారన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందున వల్ల చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదని, ఆ సమయంలో చికిత్స కోసం వచ్చినా వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నా రు. ఇటీవల ఈ తరహా కేసులు నగరంలో ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. దంపతులకు ఎగ్ ఫ్రీజింగ్పై అవగాహన లేనందున వారు నష్ట పోతున్నట్లు తెలిపారు. పెళ్లి సహా పిల్లలను వాయిదా వేసుకునే దంపతులు ముందే(25 ఏళ్లలోపు)తమ అండాలు, వీర్య కణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలను పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. -
డాక్టరమ్మ.. లేదమ్మా!
సాక్షి, నాగర్కర్నూల్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రాస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక గర్భిణులు, బాలింతలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతకాలం ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇద్దరు గైనకాలజిస్ట్లు బదిలీపై వచ్చారు. కోర్సు ముగియడంతో వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు కొత్తవారిని నియమించకపోవడంతో ఆ ప్రభావం గర్భిణులపై పడుతోంది. పురిటినొప్పులతో కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చినవారికి నర్సులే దిక్కవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆస్పత్రులను మార్చాయలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే 102 అంబులెన్స్, కేసీఆర్ కిట్ను తీసుకొచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను విడతల వారీగా ఇవ్వడంతో సామాన్యులు సైతం ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి వస్తున్నారు. ఈ కారణంగా ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టు ఏరియా ఆస్పత్రిని జి ల్లా ఆస్పత్రిగా మార్చినా దానికి అనుగుణంగా వై ద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ వి ఫలమైంది. దీనికి కారణాలేమైనా గర్భిణులు పు రిటి నొప్పులతో వచ్చి గైనకాలజిస్టు లేదని తెలిసి ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కార్పొరేట్ వైద్యం ఎక్కడా? ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరుగుతాయని ఆశించి ప్రతినెలా చెకప్లు చేయించుకోవడానికి సైతం సర్కారు దవాఖానాలకే వస్తున్నారు పేదలు, సామాన్యులు. సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా గైనకాలజిస్టులు, అనస్థీషియన్, పీడియాట్రిస్ట్లు, స్టాఫ్నర్స్లను నియమించక పోవడంతో కొర్పొరేట్ వైద్యం సరికదా సాదాసీదా వైద్యం కూడా అందడంలేదు. కంటి తుడుపు చర్యగా రోజుకు రెండు, మూడు చొప్పున ప్రసవాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బుధవారం నుంచి కోర్సుపై పనిచేస్తున్న గైనకాలజిస్ట్లు సైతం వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రి మొత్తానికి గైనకాలజిస్ట్ లేకుండా పోయారు. అన్నింటా ఇదే సమస్య జిల్లా ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఎక్కడ చూసినా వైద్యులు లేక ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సైతం ఇన్చార్జి అధికారే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేందుకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ గైనకాలజిస్ట్పై ఆధారపడి ఉండటంతో అవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పీహెచ్సీలు, 4 సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రితో పాటు 178 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఏఎన్ఎంలు 88 మంది ఉండగా, 16 మంది మాత్రమే రెగ్యులర్గా పనిచేస్తున్నారు. సెకండ్ ఏఎన్ఎంలు 178 మంది ఉండాల్సి ఉండగా 162 మంది ఉన్నారు. వారితోపాటు యురోపియన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఏఎన్ఎంలు 39మందికి 25మందే ఉన్నారు. అలాగే 944 మంది ఆశా కార్యకర్తలు అవసరం కాగా 921 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా డీఎంహెచ్ఓ పరిధిలో 62మంది ఎంబీబీఎస్ వైద్యులకు గానూ 48 మంది ఉండగా వీరిలో 12మంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. మరో 14 ఖాళీలు ఉన్నాయి. ఫార్మాసిస్టులు 31మందికి గానూ 19మంది రెగ్యులర్, ఆరుగురు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. నలుగురు డెంటల్ వైద్యులు ఉన్నారు. ఇవీ చేయాల్సినవి.. ప్రతి పీహెచ్సీలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రతి సీహెచ్సీలో ఒక మత్తు డాక్టర్తో పాటు ఇద్దరు చొప్పున డీజీఓ (స్త్రీల వైద్య నిపుణులు) అవసరం. అలాగే ఇద్దరు మత్తు డాక్టర్లు, నలుగురు డీజీఓలు ఉండాలి. ప్రతీ సీహెచ్సీ కేంద్రాల్లో చిన్నపిల్లల వైద్యులు ఒకరు అవసరం. ముఖ్యంగా డీఎంహెచ్ఓ పోస్టు రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తే ప్రజలకు వైద్య సేవలు చేరువవుతాయి. జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు 20మంది ఉండాలి. హెడ్ నర్సులు ముగ్గురు ఉండాలి. అన్ని విభాగాల్లో కనీసం 9 మంది వైద్యులు, ఐదుగురు సర్జన్లు, మత్తు వైద్యుడు ఉండాలి. ప్రతిపాదనలు పంపించాం జిల్లా ఆస్పత్రిలోని సమస్యలు, పరిష్కారాలపై ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను పంపాం. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు, డయాలసిస్ కేంద్రాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఇదే స్థాయిలో గర్భిణులకు సైతం నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించనున్నాం. ప్రస్తుతం గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా ఓ డాక్టర్ను నియమించాం. త్వరలోనే గైనకాలజిస్ట్ పోస్టులు భర్తీ చేయిస్తాం. – డాక్టర్ రాకేష్చంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 17. నాకు వైట్ డిశ్చార్జీ చాలా ఎక్కువగా అవుతోంది. దురద ఎక్కువగా ఉంటోంది. ఇలా వైట్ డిశ్చార్జీ అవ్వడం వల్ల బలహీనపడతారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? - స్రవంతి, ఏలూరు మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది... సాధారణంగా యోనిలోనూ, సర్విక్స్ నుంచి మ్యూకస్ స్రవించడం వల్ల, సన్నగా తీగలాగా, నీరులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇందులో వాసన, దురద ఉండవు. ఇది రజస్వల అయ్యే ముందు, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ మధ్యలో, అండం విడుదలయ్యేటప్పుడు స్రవిస్తుంది. దీని గురించి ఆందోళన అక్కర్లేదు. ఇక రెండోది... బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది. ఇందులో తెల్లబట్ట పెరుగులాగా, కొందరిలో నురగలాగా, కాస్త పచ్చగా ఉండి, దురద-మంటలతో కూడి ఉంటుంది. దీనిని అశ్రద్ధ చేయకూడదు. ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదిస్తే, వారు దానికి తగిన యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తారు. వైట్ డిశ్చార్జీ వల్ల బలహీనపడటం అంటూ ఏదీ ఉండదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఇలా ఎవరైనా బలహీనపడతూ ఉంటే... దానికి వేరే కారణాలు ఉండవచ్చు. అంటే రక్తహీనత, రోగనిరోధకశక్తి తగ్గడం వంటి సందర్భాల్లో తరచూ ఇన్ఫెక్షన్ వచ్చి బలహీనపడటం జరగవచ్చు. అంతేగానీ వైట్డిశ్చార్జీతో మీరు చెప్పే పరిణామం సంభవించదు. నా వయసు 16. ఇటీవలే రజస్వల అయ్యాను. రుతుస్రావం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - సుమ, నిర్మల్ రజస్వల అయినవారు రుతుస్రావం అవుతున్న సమయంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వుంచిది. అంటే వూంసాహారం తినేవాళ్లరుుతే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంతో లివర్; శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, నువ్వులు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియుడ్స్కు వుుందే తీసుకుంటూ ఉండండి. దానివల్ల మీరు కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పీరియుడ్స్లో ఉన్న సవుయుంలో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవారుుడ్ చేయుండి. ఆ సవుయుంలో అవి తీసుకుంటే మీరు వురింత వుందకొడిగా తయూరవుతారు. ఒకేసారి ఎక్కువగా తీసుకునే బదులు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహరం తీసుకోండి. ఆ సవుయుంలో నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్