hacked
-
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, అధికారులు, కంపెనీలు ఇలా అన్నీ సైబర్లో వలలో చి కుటున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాక్కు గురైంది. యూట్యూబ్ ఛానల్ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్టు చేశారు.సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అందులో ప్రస్తుతం అమెరికాకు చెందిన రిపిల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. -
హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని.. తమ ఎక్స్ అకౌంట్ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.⚠️ Important Notice: Our official Twitter/X account (@ltmhyd) has been hacked. Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024 -
నటుడి ట్విటర్ ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్కు హెచ్చరిక!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్ వెబ్సైట్ హ్యాక్
బంగ్లాదేశ్లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్సైట్లు హ్యాక్నకు గురయ్యాయి. ‘ది ఆర్3 సిస్టన్స్3’ అనే గ్రూప్ ఈ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్డౌన్, స్టాప్ కిల్లింగ్ స్టూడెంట్స్’ అనే సందేశం హ్యాక్ అయిన ఈ మూడు సైట్లలో కనిపించింది.‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు. మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. -
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
స్విగ్గీ అకౌంట్తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్పూర్కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్ను హ్యాక్ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు. -
ఎమ్మెల్సీ కవిత సోషల్మీడియా అకౌంట్స్ హ్యాక్!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు నా సోషల్ మీడయా ఖాతాల హ్యాకింగ్కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు. My social media account experienced a brief unauthorized access. The suspicious activities and contents during this time do not reflect our values. Security measures have been reinforced, and we will observe a downtime to ensure security and we appreciate your understanding as my… — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2024 అయితే వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చదవండి: Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్కు ఝలక్ -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్
సంగారెడ్డి, సాక్షి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, అలాగే.. తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దీంతో మంత్రి అనుచరులు స్పందించారు. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ నుంచి సందేశాలు వస్తే స్పందించవద్దని కార్యకర్తలను కోరుతున్నారు. -
ఏపీ: వైఎస్సార్సీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. ప్రొఫైల్పిక్, కవర్ పిక్లను మార్చేశారు హ్యాకర్లు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్విటర్ పేజీలో క్రిప్టో పోస్టులు చేశారు దుండగులు. రంగంలోకి దిగింది వైఎస్సార్సీపీ టెక్నికల్ టీం. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి వైఎస్ఆర్సీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పలు ట్వీట్లను రీట్వీట్లు సైతం చేస్తున్నారు హ్యాకర్లు. -
మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్తో కలిసి ఓ షోకు యాంకర్గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఫేస్బుక్ పేజీలో అశ్లీల ఫొటోలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి చూసి అంత షాక్ ఒక్కసారిగా అయ్యారు. విష్ణు ప్రియ ఎంటి ఇలాంటి ఫొటోలు షేర్ చేసిందంటూ ఆశ్చర్యపోయారు. చదవండి: ‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా చివరకు తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని, తన పేజీని అన్ఫాలో చేయాల్సిందిగా ఆమె తన ఫాలోవర్స్కు సూచించింది. అయితే అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ తన పేజీలో న్యూడ్ వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీంతో తన స్నేహితులు, బంధువుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్కాల్స్ వచ్చాయట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలాటే నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి ఫేస్బుక్లో ఆ వీడియోలు ఎంటని అడుగుతున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కాదు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? పదే పదే నా అకౌంట్ను ఎందుకు హ్యాక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ అంటూ తన స్నేహితుల వద్ద ఆమె వాపోయిందట. కాగా ఆమె ఫేస్బుక్ పేజీతో తరచూ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట, అప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్న విష్ణు ప్రియ ఎందుకు సైలెంట్గా ఉంటుందని, ఎందుకు సైబర్ క్రైమ్ని ఆశ్రయించడం లేదని.. తన పేజీని ఎందుకు డిలిట్ చేయడం లేదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
డేంజర్లో ఫేస్బుక్ ఖాతాలు: డక్టైల్ మాల్వేర్ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఫేస్బుక్ బిజినెస్ ఖాతాలు కొత్త మాలావేర్ దాడికి గురయ్యాయి. డక్టైల్ మాల్వేర్ కొత్త పీహెచ్పీ వెర్షన్తో వినియోగదారులనుప్రమాదంలో నెట్టేసింది. పలు బిజినెస్ ఖాతాలు హ్యాకింగ్గు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్ సెక్యూరిటీ క ంపెనీ తాజా హెచ్చరికలు జారీచేసింది. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ, ZScaler అక్టోబర్ 13న తన బ్లాగ్ పోస్ట్లో ఈ కొత్త వాలావేర్ గురించి నివేదించింది. ఫ్రీ, క్రాక్డ్ అప్లికేషన్ ఇన్స్టాలర్గా ఆయా ఖాతాల్లోకి జొర పడుతోందని తెలిపింది. ఈ కొత్త పీహెచ్పీ డక్టైల్ మాల్వేర్, యూజర్ల ఇమెయిల్ అడ్రస్లు, పేమెంట్ రికార్డ్లు, ఫండింగ్ సోర్స్లు అకౌంట్ స్టేటస్లలో చెల్లింపు సమాచారం కూడా దృష్టి సారించింది. అంతేకాదు ఇది పేజీలను మార్చగలదు.. కీలక ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేయగలదని, ఫేస్బుక్తో పాటు టెలిగ్రామ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ సహా వివిధ ప్లాట్ఫారమ్లను కూడా లక్ష్యంగా చేసుకుందని కంపెనీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన డక్టైల్ డాట్నెట్ బైనరీకి బదులుగా తాజాగా దీన్ని సైబర్ నేరగాళ్లు పీహెచ్పీ మార్చారని పేర్కొంది. యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, అప్లికేషన్ కంపాటబిలిటీని చెక్ చేసే నెపంతో, రెండు.tmp ఫైల్స్ జనరేట్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ రెండు డక్టైల్ వెర్షన్లు అత్యంత ప్రమాదకర మైనవని సూచించింది. ఇవి హానికరమైన కోడ్ను యూజర్ల ఖాతాలో వదిలి, దీని తరువాత, డేటా చోరీ చేస్తోందని వివరించింది. పుర్రె ఆకారంలో ఉండే కంప్యూటర్ కోడ్ డక్టైల్ మాలావేర్ను 2021లో తొలిసారి గుర్తించారు. డక్టైల్ ఇన్ఫోస్టీలర్ కీలకమైన డేటాను యాక్సెస్ చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశంకూడా ఉందని, ప్రొటెక్టివ్ లాగిన్ మెజర్స్ తీసుకున్న ఖాతాలు కూడా ప్రమాదంలో పడవచ్చని హెచ్చరిచింది. పీహెచ్పీ ఇన్ఫోస్టీలర్తో వినియోగ దారుల సమాచారం ఇప్పటికీ ప్రమాదంలో ఉందని తెలిపింది. -
జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పేపర్ లీక్ కేసులో రష్యన్ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్ వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్ సాఫ్ట్వేర్ను హ్యాక్ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. మిఖాయిల్ కజికిస్తాన్లోని అల్మాటీ నుంచి భారత్కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్తో సహా వివిధ ఆన్లైన్ పరీక్షల్లో కొందరు విదేశీయులు కుమ్మక్కై హ్యాకింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్ సాఫ్ట్వేర్ను మిఖాయిల్ షార్గిన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్ సిస్టమ్ను హ్యాక్ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. (చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం) -
యూపీ CMO ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు
-
యూపీ సీఎంవో ట్విటర్ అకౌంట్ హ్యాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
పరీక్షల్లో ఫెయిలవ్వొద్దు అన్నందుకు తండ్రి హత్య! ట్విస్ట్ ఏంటంటే?
Scared of rebuke for failing exams: తల్లిదండ్రులు మందలించారనో లేకు తాము అడిగింది కొనివ్వటం లేదనో కన్న తల్లిదండ్రుల పై కక్ష సాధించే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. అంతెందుకు దురాలవట్లకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాస్త కఠినంగా వ్యవహరించినందుకే తల్లిదండ్రులనే హతమార్చే కిరాతక పిల్లల గురించి విన్నాం. అచ్చం అలానే మధ్యప్రదేశ్లోని ఒక బాలుడు దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అతని తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంటి నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్ అయితే కచ్చితంగా ఇంటి నుంచి గెంటేయడం ఖాయం అన్న భయంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ బాలుడు నేరం చేయడమే కాకుండా ఈ హత్య నేరంలో తమ పక్కంటివాళ్లను ఇరికించేందుకు యత్నించాడు. అంతేకాదు తమ పక్కింటివాళ్లే తన తండ్రిని చంపారని, తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఫోరెన్సిక్ విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించడు. ఫైనల్ పరీక్షలు సరిగ్గా చదవలేదని అందువల్ల ఫెయిల్ అవుతానని భయపడ్డానని ఆ బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజీవ్ మిశ్రా ఆ బాలుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. (చదవండి: జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..) -
హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్, అప్రమత్తం చేసిన యామీ
సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేరుగా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్కు గురవుతుంటాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయయే అయినప్పటికీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తత లేకపోతే ఎలాంటి నష్టమైన జరగొచ్చు. గతంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్ల అకౌంట్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి డబ్బు వసూలు చేయడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం చేస్తుంటారు. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ అందుకే ముందు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్ను వారు అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా తన ఫ్యాన్స్ను, ఫాలోవర్స్ను అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దీనిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది. ప్రస్తుతం ఆమె టీం దీనిపై వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగ ఇటీవల పెళ్లి చేసుకున్న యామీ ప్రస్తుతం దస్వీ మూవీతో బిజీగా ఉంది. అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీనితో పాటు ఆమె ‘ఓ మై గాడ్ సిక్వెల్’లో కూడా నటిస్తోంది. Hi, This is to inform you all that I've been unable to access my Instagram account since yesterday, it's probably hacked. We're trying to recover it as soon as possible. Meanwhile, if there is any unusual activity through my account, please be aware of it. Thank you! — Yami Gautam Dhar (@yamigautam) April 3, 2022 -
'టెంపర్' బ్యూటీ ఇన్స్టా అకౌంట్ మాయం.. అసలు సంగతి ఏంటంటే ?
Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్ సాంగ్స్లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్తో అభిమానులను ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్స్టా అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. నోరానే తన ఇన్స్టా పేజీని డిలీట్ చేసిందని భావించారు. అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్కు ధన్యవాదాలు.' అని రీస్టోర్ అయిన అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్స్టాలో 37 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్ చేశాక అకౌంట్ హ్యాక్ అయింది. 'బాహుబలి', 'టెంపర్' తదితర సినిమాల్లో నోరా ఐటమ్ సాంగ్స్లో అలరించిన సంగతి తెలిసిందే. -
హ్యాకింగ్ బారిన పడిన సెలబ్రిటీలు వీళ్లే..
Celebrities List Who Have Been Affected By Hacking: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలు, మెమోరెబుల్ సంఘటనలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ టచ్లో ఉంటారు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటారు. కామెంట్స్ రూపంతో సెలబ్రిటీలతో వారి ఫ్యాన్స్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. అయితే తారలకు, అభిమానులకు అనుసంధానంగా ఉన్న ఈ సామాజిక మాధ్యామాలకు హ్యాకర్ల బెడద తక్కువేమి కాదు. ఇప్పటివరకు అనేకమంది ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేశారు కొందరు ఆకతాయిలు. హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు, కామెంట్స్ పెడుతూ తారలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్కు గురై ఇబ్బందులపాలైన సెలబ్రిటీలు వీళ్లే. అమితాబ్ బచ్చన్ పవన్ కల్యాణ్ పూజా హెగ్డె టబు వరలక్ష్మీ శరత్ కుమార్ అమృత అయ్యర్ అవికా గోర్ ఈషా రెబ్బా మేఘా ఆకాష్ అమీ జాక్సన్ అమృతా రావు ఇషా డియోల్ యాంకర్ గాయత్రి భార్గవి విద్యుల్లేఖ -
అవును.. నా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్
Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరోయిన్ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్ అయిన అమృత అయ్యర్ ఇన్స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్కు గురైన అమృత ఇన్స్టా అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon . — Amritha (@Actor_Amritha) February 1, 2022 -
వాటిని పాస్వర్డ్గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే
మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్ బర్త్లు నచ్చిన నెంబర్లను పాస్వర్డ్లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్ నేరస్తుల నుంచి సేఫ్గా ఉండేందుకు 123లు, abcdలను పాస్వర్డ్లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్వర్డ్లుగా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హీరోల పేర్లు పాస్వర్డ్లుగా పెట్టుకుంటే 'దొంగ చేతికి తాళం' ఇచ్చిట్లవుతుందని తేలింది. మోజిల్లా ఫౌండేషన్ సంస్థ పాస్వర్డ్లపై రీసెర్చ్ నిర్వహించింది. ఆ రీసెర్చ్లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, వోల్వరైన్, ఐరన్ మ్యాన్, వండర్ ఉమెన్, డేర్ డెవిల్, థోర్, బ్లాక్ విడో, బ్లాక్ పంతార్ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్ అయినట్ల వెల్లడించింది. వీరితో పాటు క్లార్క్ కెంట్, బ్రూసీ వ్యాన్, పీటర్ పార్కర్, హీరోల పేర్లతో పాటు ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, 12345, ఏబీసీడీలను పాస్వర్డ్లుగా పెట్టుకోవద్దని హెచ్చరించింది. అలా పెట్టుకున్న వారి అకౌంట్లు హ్యాక్ అయినట్లు స్పష్టం చేసింది. మరి ఎలాంటి పాస్వర్డ్లు పెట్టుకోవాలి హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్లను పెట్టుకోవాలని మోజిల్లా ఫౌండేషన్ తెలిపింది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో పాటు '@#$*' ఇలా క్లిష్టమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలని సూచించింది. మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్లు ఇవే ఇక తాము నిర్వహించిన రీసెర్చ్లో '12345', '54321' పాస్వర్డ్లు అత్యంత ప్రమాదకరమని మోజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2020లో పాస్వర్డ్ మేనేజర్ అయిన 'నార్డ్ పాస్' ప్రకారం '123456' మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్ అని తెలిపింది. ఈ పాస్వర్డ్ను ఉపయోగించిన అకౌంట్లను హ్యాకర్లు 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.'123456789' లను పాస్వర్డ్లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్ చేస్తారని నార్డ్ పాస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: 18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..! -
మొబైల్ నెట్వర్క్ యూజర్ల డేటా లీక్.!
వాషింగ్టన్: సుమారు పదికోట్ల మొబైల్ నెట్వర్క్ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండో అతిపెద్ద టెలికాం సంస్థ టీ-మొబైల్ యూజర్ల డేటాను డార్క్వెబ్లో హ్యాకర్లు విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. పదికోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హాక్ చేసినట్లు వస్తోన్న వార్తలపై దర్యాప్తు చేయనున్నట్లు టీ-మొబైల్ ప్రకటించింది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్..!) వినియోగదారుల ఫోరమ్లో యూజర్ల డేటా హ్యాక్కు గురైన్నట్లు వస్తున్న క్లెయిమ్స్ను కంపెనీ పరిశీలిస్తుందని, వాటిని వెంటనే పరిష్కారిస్తామని టీ-మొబైల్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ-మొబైల్ వినియోగదారుల డేటా హ్యక్కు గురైనట్లు మొదటిసారిగా వైస్కు చెందిన మదర్బోర్డ్ టెక్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. కస్టమర్ల పేర్లు, చిరునామాలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్లో ఉంచినట్లు మదర్బోర్డ్ పేర్కొంది. జూన్ చివరి నాటికి టీ-మొబైల్ 26 మిలియన్ పోస్ట్పెయిడ్ ఖాతాలను, 84 మిలియన్ల మొబైల్ నెట్వర్క్ కనెక్షన్లను టీ-మొబైల్ కలిగి ఉంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) -
ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్.. బ్రియాన్గా పేరు మార్పు
Khushbu Sundar Twitter Account Hacked: నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ ట్విటర్ మరోసారి హ్యాకింగ్కు గురైంది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరును బ్రియాన్గా మార్చారు. అలాగే కవర్ ఫోటోని కూడా మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లన్నీ తొలగించారు. గతేడాది ఏప్రిల్లోనూ ఆమె అకౌంట్ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్కి తెలియజేసింది. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్ను కోరింది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్
తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది. తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్వర్డ్ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి. -
మంచు లక్ష్మికి షాకిచ్చిన హ్యాకర్లు
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారావిడ. బుల్లితెర, వెండితెర ఇటీవల డిజిటల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నారు. కూతురు మంచు నిర్వాణ విద్యా ఆనంద్తో కలిసి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల పెంపకం, వాళ్లు చేసే అల్లరిని ఎలా అర్థమయ్యేలా వారికి చెప్పాలి? లాంటి పేరేంటింగ్ గైడ్లైన్స్తో కూడిన వీడియోలను చిట్టి చిలకమ్మ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నారు. అయితే హ్యాకర్లు మంచు లక్ష్మికి షాకిచ్చారు. చిట్టి చిలకమ్మ అకౌంట్ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురయ్యిందని, ఆ ఛానల్ నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని తెలిపారు. తన టీం దీనిపై పనిచేస్తోందని, వీలైనంత త్వరగా అకౌంట్ రికవర్ అయ్యేలా చూస్తున్నారని చెప్పారు. గతంలోనూ మంచు లక్ష్మి సహా మంచు మనోజ్ వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్కు గురయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మంచు లక్ష్మి చేసే పోస్టింగులు ట్రోల్స్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ ఛానెల్ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందన్న లక్ష్మి ట్వీట్పై కూడా నెటిజన్లు తనదైన స్టైల్లో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. The Chitti Chilakamma YouTube Account has been hacked. Kindly avoid any kind of misinterpreted content on the page. My Team is looking into it and we are trying to get back the account as soon as possible. — Lakshmi Manchu (@LakshmiManchu) May 10, 2021 చదవండి : వచ్చే ఏడాదే రకుల్ ప్రీత్ పెళ్లి : మంచు లక్ష్మీ లైవ్లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్.. -
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, డబీర్పురా: ఓ రౌడీషీటర్ను దారుణంగా హత్య చేసిన సంఘటన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్పురా జవహర్నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ పర్వేజ్ ఆలియాస్ ఫర్రు డాన్ (26)పై 20 చోరీ కేసులు ఉన్నాయి. మంగళవారం రాత్రి చోటాపూల్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులు, డాగర్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న రెయిన్బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు చేదువార్త..
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు చేదువార్త. 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్లో లీక్ అయ్యాయి. భారతీయ సైబర్ సెక్యురిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా తెలిపిన వివరాల ప్రకారం, లీక్ అయిన డేటాలో భారతీయ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు మరియు మరిన్ని ఉన్నాయి. బయటకి వచ్చిన డేటాలో 2010 నుండి 2019 వరకు గల వినియోగదారుల సమాచారం ఉంది.(చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున) గూగుల్ డ్రైవ్ లింక్లోని 2 జీబీ డేటాబేస్లో క్రెడిట్, డెబిట్ కార్డుదారుల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, వినియోగదారుల యజమానుల పేరు, పాన్ కార్డ్, వార్షిక ఆదాయం వివరాలు ఉన్నాయి. డార్క్ వెబ్లోని ఫోరమ్స్ కస్టమర్ల డేటాను సర్క్యులేట్ చేస్తున్నట్టు రాజశేఖర్ గుర్తించారు. ఈ డేటాను సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్లైన్ మోసాలకు ఉపయోగించొచ్చు. డార్క్ వెబ్లో బహిర్గతం చేసిన డేటాలో యాక్సిస్ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇంకొంత మందికి సమాచారం ఉన్నట్లు ఇంక్ 42 తన నివేదికలో పేర్కొంది. ఈ ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ.7 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందని నివేదికలో పేర్కొంది. క్రెడిట్/డెబిట్ కార్డులను విక్రయించడానికి బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు డార్క్ వెబ్లో ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని రాజహరియా తన నివేదికలో పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్లో అత్యంత ఖరీదైన డేటా అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ రజారియా ఈ విషయం గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్)ను సంప్రదించారు. కానీ ఈ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఇంటర్నెట్లో డేటా లీక్ల కేసులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు నవంబర్లో ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ హ్యాకర్ల లక్ష్యంగా మారింది. సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, బిగ్బాస్కెట్ వినియోగదారుల యొక్క పూర్తి పేర్లు, ఇమెయిల్ ఐడిలు, పాస్వర్డ్ హాష్లు, కాంటాక్ట్ నంబర్లు, చిరునామాలు వంటివి హ్యాకర్ల చేతికి చిక్కడంతో డార్క్ వెబ్లో బహిర్గతమయ్యాయి. బిగ్బాస్కెట్ యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు 30 లక్షల రూపాయలకు అమ్మారు. -
బిగ్బాస్కెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్బాస్కెట్ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్ వెబ్ను మానిటర్ చేస్తున్నప్పుడు బిగ్బాస్కెట్కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్ తన బ్లాగ్లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది. బిగ్బాస్కెట్ వినియోగదారులు - జాగ్రత్తలు ఓటీపీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ చెప్పవద్దు. ఆప్ నుండి ఆర్డర్ చేయడానికుపయోగించే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లను మార్చండి. యూపీఐ యాప్ పిన్లను మార్చండి. అలాగే ఈమెయిల్, ఇతర సేవలకు ఒకే పాస్వర్డ్ లేదా పిన్లను ఉపయోగిస్తుంటే తక్షణమే వాటన్నింటి పాస్వర్డ్లను మార్చండి. వేరు వేరు పాస్వర్డ్లను ఉపయోగించడం ఉత్తమం. బిగ్బాస్కెట్ యాప్ను అధికారిక ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి లేదా అప్ డేట్ చేయండి. అప్డేట్కు సంబంధించి ఎలాంటి తప్పుడు సందేశాలను నమ్మకండి. కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లపై పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకుసంబంధంలేని, మీరు ఆర్డర్ ఇవ్వని ప్యాకేజీలను డెలివరీలు స్వీకరించవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వని క్యాష్ ఆన్ డెలివరీ ప్యాకేజీలను విశ్వసించకండి. వాటికి ఎలాంటి నగదు చెల్లించకండి. డెలివరీ ఎగ్జిక్యూటివ్గా నటిస్తూ మానిప్యులేట్ చేస్తున్న స్కాం పట్ల జాగ్రత్త వహించండి. -
బుట్టబొమ్మ సారీ చెప్తుందా?
టాలీవుడ్ ప్రముఖ కథానాయుకలు సమంత అక్కినేని, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వివాదం మరింత ముదిరింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గురువారం పూజా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు తన టెక్నికల్ టీం సాయంతో ఖాతాను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సందర్భంలో పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్లో.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ఈమె (సమంత )నాకు పెద్దగా అందంగా కనిపించదు అంటూ కామెంట్ చేశారు హ్యాకర్స్ . ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. (సమంతకు సారీ చెప్పాలి ) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. వెంటనే సమంతకు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద..పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది అంటూ నందనీ కామెంట్ పెడితే, ప్లీజ్ లవ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు అంటూ చిన్మయి వరుస కామెంట్లు పెడుతూ సమంతకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తూ.. ఫెమినిస్ట్ అని చెప్పుకునే తిరిగే చిన్మయి ఇంకో అమ్మాయిపై ఎలా నిందలు వేయగలుగుతుంది అంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందనీరెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు సమంత ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ వరుస ఆరోపణలు చేస్తూ ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వి సపోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. Without knowing the real reason,how could u guys form a group and pass sarcasm on one.Ok...now what this doesn't come under ur so called "feminism" #WeSupportPoojaHegde pic.twitter.com/J4uh7nmQBw — Harshi✨ (@hd_2207) May 28, 2020 -
హ్యకర్స్పై మండిపడ్డ పూజా
తన సోషల్ మీడియా అకౌంట్ను హ్యక్ చేసిన వారిపై హీరోయిన్ పూజా హెగ్డే మండిపడ్డారు. మీరు బాగుపడరంటూ హ్యకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను సుమారు గంటసేపు హ్యక్ చేసినట్లు ఆమె గురువారం తెలిపారు. అయితే వెంటనే అకౌంట్ను సరిచేయాలని తన టెక్నికల్ టీమ్కు చెప్పినట్లు వెల్లడించారు. ఈ మేరకు పూజా ట్వీట్ చేశారు.‘బుధవారం రాత్రి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యక్ అయ్యింది. నేను నా టెక్నికల్ టీమ్కు ఇన్ఫార్మ్ చేశాను. వాళ్లు నాకు సహాయం చేస్తున్నారు. నా అకౌంట్ నుంచి ఏవైనా మెసెజ్లు, పోస్టులు వస్తే దయచేసి అంగీకరించవద్దు. అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారం పంపించవద్దు. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. (దుల్కర్కు జోడిగా బుట్టబొమ్మ!) Hi guys, so I’ve been informed by my team that my insta account has been hacked and my digital team is helping me with it. Please do not accept any invitations or pass out any personal information out to the person asking. Thank you. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అయితే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని పూజా తెలిపారు. గంట నుంచి ఇన్స్టా అకౌంట్ భద్రత గురించి ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అంతా బాగుందని అన్నారు. తనకు సహాయం చేసినందుకు టెక్నికల్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి ఎప్పటిలాగే ఇన్స్టాను ఉపయోగిస్తానని పేర్కొన్నారు. కాగా సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యక్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు అనుపమ పరమేశ్వరన్, కలర్స్ స్వాతి అకౌంట్లు కూడా హ్యక్ అయ్యాయి. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 -
చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
-
ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం
మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34). లైంగిక ఫోటోలు, వీడియోల కోసం ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు. అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు. ఎన్గాడ్జెట్ అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్వర్క్కు తన కున్న యాక్సెస్ను ఉపయోగించుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తద్వారా వేలాది వినియోగదారుల పాస్వర్డ్స్ను హ్యాక్ చేశాడు. వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్కు డౌన్లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలే అతడి టార్గెట్. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారని స్వయంగా రూయిజ్ వెల్లడించాడు. థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్బుక్, జీమెయిల్, డ్రాప్బాక్స్ తదితర ఖాతాల పాస్వర్డ్ రీసెట్ చేసి, తనకు కావాల్సిన డాటాను చోరీ చేసేవాడు. తాజాగా రూయిజ్ తన నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా. -
ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్
ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ట్విటర్ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు. ప్రధానంగా ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు వుందంటూ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాదాపు 4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న ట్విటర్ సీఈవో ఎకౌంట్నే హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ షాకిచ్చారు. స్వయంగా సంస్థ సీఈవో ఖాతాకు భద్రత లోపించడం చర్చనీయాంశమైంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది. అయితే హ్యాకింగ్ను పసిగట్టిన భద్రతా సిబ్బంది డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్ ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. మరోవైపు డోర్సీ ట్విటర్ ఎకౌంట్ ఎలా హ్యాక్ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు గుర్తించామన్నారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్ను హ్యక్ చేసారన్నారు. కాగా డోర్సీ ఖాతా హ్యాక్ అవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ హీరోయిన్కు సైబర్ షాక్
ముంబై : బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సైబర్ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్, షాహిద్ కపూర్, అద్నాన్ సమీల తర్వాత తాజాగా నటి అమృతా రావు తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైందని వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్ధ నుంచి వచ్చిన లింక్ ద్వారా ట్విటర్ ఖాతా హ్యాకైందని ఆమె పేర్కొన్నారు. వారం రోజుల కిందట తన ట్విటర్ అకౌంట్ హ్యాకైందని చెబుతూ ఇటీవల తనకు ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి మెసేజ్ వచ్చిందని, తన ఇంటర్వ్యూ కోసం అనుమతి కోరుతూ వచ్చిన ఆ మెయిల్ను తన సోషల్ మీడియా టీమ్ క్లిక్ చేయగానే ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైందని అమృతా రావు చెప్పారు. దీంతో తనకు వెంటనే గతంలో అమితాబ్ బచన్ అకౌంట్ హ్యాక్ అయిన ఉదంతం గుర్తుకువచ్చిందని, పరిశ్రమకు ఇది ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు తుషార్ కపూర్ ట్విటర్ ఖాతా నుంచి మెసేజ్ రాగా, ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారని అమృత గుర్తుచేశారు. -
బీజేపీ వెబ్సైట్ హ్యాకింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికారిక వెబ్సైట్ మంగళవారం హ్యాకింగ్కు గురైంది. పార్టీ వెబ్పేజ్ ఎర్రర్ 522 మెసేజ్ చూపడంతో గందరగోళం నెలకొంది. కాగా అంతకుముందు బీజేపీ వెబ్సైట్లో ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకర ఫోటోలు, భాషతో కూడిన వ్యాఖ్యలు కనిపించాయని కొందరు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరలో వెబ్సైట్ను అందుబాటులో ఉంచుతామని అడ్మిన్ పేర్కొన్న సందేశం ఉంచారు. అయితే పార్టీ వెబ్సైట్ హ్యాకింగ్పై బీజేపీ ఇంతవరకూ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్సైట్లను పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీజేపీ వెబ్సైట్ను యాక్సెస్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ల వీడియా అభ్యంతరకర పదజాలంతో కనిపించిందని హిందీ న్యూస్ వెబ్సైట్ అమర్ ఉజాలా పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్సైట్ అందుబాటులో లేదని ఎర్రర్ మెసేజ్ చూపిందని ఆ వెబ్సైట్ తెలిపింది. -
హ్యాకింగ్ బారిన పడ్డ మరో హీరోయిన్
నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన బ్యూటీ మేఘా ఆకాష్. రెండో సినిమా కూడా నితిన్కు జోడిగా నటించిన ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయి సక్సెస్ దక్కలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మేఘాకు షాక్ తగిలింది. తాజాగా ఈ అమ్మడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దాదాపు ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి రష్యాకు చెందిన ఒక కాస్మోటిక్ హస్పిటల్కు చెందిన పోస్టింగ్లు చేశారు. వీటిలో కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉండటంతో మేఘా అభిమానులు షాక్కు గురయ్యారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మేఘా ఆకాష్ ట్విట్టర్ ద్వారా తన ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని అభిమానులకు తెలిపారు. ‘ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది. ఆ అకౌంట్లో వచ్చే మెసేజ్లు పోస్టింగ్లను పట్టించుకోకండి’ అంటూ ట్వీట్ చేశారు. Instagram hacked! Kindly please ignore all the messages and random things! My backend team working on it.. will retrieve it asap...Thank you🙏🏽🙏🏽🙏🏽 — Megha Akash (@akash_megha) 4 February 2019 -
2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకయ్యాయి
-
హ్యాకింగ్ బాధితులు : నిన్న త్రిష.. నేడు రకుల్
తమ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ చెబుతున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. రెండు, మూడు రోజుల క్రితమే త్రిష తన ట్విట్టర్ ఖాతాని ఎవరో ఆగంతకులు హ్యాక్ చేశారని తెలిపింది. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని రకుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దంటూ రకుల్ అభిమానులను కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ కార్తీ దేవ్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. Hey guys !! My Instagram account has been hacked ! Please do not respond to any links or messages till it’s recovered !! Thanks — Rakul Preet (@Rakulpreet) October 24, 2018 -
త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తన ట్విట్టర్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని నటి త్రిష పేర్కొంది. దక్షిణాదిలో సంచలన నటీమణుల వరుసలో నటి త్రిష పేరు కచ్చితంగా ఉంటుంది. ఇటీవల తెరపైకి వచ్చిన 96 చిత్రంలో ఈ బ్యూటీ నటనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది. నటీనటుల ట్విట్టర్ అకౌంట్స్ తరచూ హ్యాక్కు గురవుతుండడం, ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని సమస్యల్లోకి నెట్టడం జరుగుతుంటుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ల ట్విట్టర్ హ్యాక్కు గురవుతుంటాయి. అలా నటి త్రిష ట్విట్టర్ ఇప్పుడు హ్యాక్కు గురైంది. ఈ విషయాన్ని త్రిష శనివారం ఉదయం గుర్తించిందట. దీంతో ఎవరో అగంతుకులు తన ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారని, అభిమానులెవరూ ఏ విషయాన్ని తన ట్విట్టర్కు పోస్ట్ చేయవద్దని ట్వీట్ చేసింది. అదే విధంగా తన పేరుతో పోస్ట్ కాబడిన విషయాలను ఎవరూ నమ్మొద్దు అని పేర్కొంది. దీని గురించి త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పందిస్తూ ఎవరో అగంతకులు త్రిష ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారన్నారు. వారు త్రిష ట్విట్టర్ను ఓపెన్ చేసి చూస్తున్నారు. వారు త్రిష ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇతరులకు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం శనివారం ఉదయమే తమకు తెలిసిందని, దీంతో వెంటనే ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ను మార్చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పేట చిత్ర షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్న త్రిష తన అభిమానులకు తెలిపిందని అన్నారు. త్రిష ట్విట్టర్ అకౌంట్ను ఇంతకు ముందొకసారి అగంతకులు హ్యాక్ చేశారన్నది గమనార్హం. ఆ సమయంలో త్రిష జల్లికట్టుకు మద్దతు తెలపగా ఆమె ట్విట్టర్ను హ్యాక్ చేసిన వారు త్రిష గురించి ఇష్టమొచ్చిన విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై త్రిష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజా పరిణామాలకు చెన్నైకి తిరిగొచ్చిన తరువాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
షాక్కి గురయ్యా: నటి విద్యుల్లేఖ రామన్
సాక్షి, చెన్నై: క్యారెక్టర్ ఆర్టిస్ట్ విద్యుల్లేఖ రామన్కి సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ఆమె అఫీషియల్ ఫేస్బుక్ హ్యాకింగ్కు గురైంది. విద్యు ఫేస్బుక్ పేజీ మొత్తాన్ని ఫోటోలతోసహా మార్చేసిన హ్యాకర్లు.. రమ్య అనే పేరుతో ఫోటోలు, సమాచారాన్ని అప్లోడ్ చేశారు. దీంతో కంగారుపడిన ఆమె ట్విటర్లో విషయాన్ని తెలియజేశారు. ‘ఆశ్చర్యంతోపాటు భయంగొల్పే అనుభవం. నా పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్, హ్యాకింగ్కు గురైంది. నా ఫాలోవర్లను, డేటాను మొత్తం చోరీ చేశారు. ఎవరో నటి పేరిట ఖాతాను రీప్లేస్ చేశారు. ఎలా జరిగిందో తెలీదు. కానీ, నేరస్థుడిని పట్టుకుని తీరాలి’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. వెరిఫైడ్ అకౌంట్ హ్యాక్ కావటమేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, తక్షణమే జోక్యం చేసుకోని అకౌంట్ పునరుద్ధించాలని ఆమె ఫేస్బుక్కు విజ్ఞప్తి చేశారు. Something bizarre, strange & horrible has happened. My Facebook page Vidyu Raman has been HACKED, HIJACKED & STOLEN with all my 450K followers and made into the page of some actress. No one but me managed my page. I don’t understand how this happened but the culprit will b caught pic.twitter.com/FNyuRHebAW — Vidyu Raman (@VidyuRaman) 4 July 2018 -
‘నా ఫేస్బుక్ను సీఎం హ్యాక్ చేశారు’
పట్నా : తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారని ఆర్జేడీ ఛీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్ తెలిపారు. సీఎం నితీష్ కుమార్, బీజేపీ కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తన తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి తనను ఆదేశించినట్లు తన ఖాతాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారని తెలిపారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక తమ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని జేడీయూ-బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని తమ కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. తన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కి తనకు ఎలాంటి విభేదాలు లేవని, నా బలం తేజస్వీ అని పేర్కొన్నారు. జేడీయూ-బీజేపీ ఎన్నికుట్రలు చేసినా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా తేజ్ప్రతాప్ రాజకీయల నుంచి తప్పుకుని సినిమా రంగంలోకి వెళ్తున్నారని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. -
జొమాటోకు హ్యాకర్ల భారీ దెబ్బ
-
జొమాటోకు హ్యాకర్ల భారీ దెబ్బ
న్యూఢిల్లీ: కొనసాగుతున్న హ్యాకింగ్ భూతం మరో తీవ్రమైన రూపాన్ని తీసుకుంది. హ్యాకింగ్ తాజా బాధితుడు ఆన్లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటో. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటోకు హాకర్ల దెబ్బ భారీగా తగిలింది. ఈ సంస్థకు సంబంధించిన 17మిలియన్ల ఖాతాలు సైబర్ దాడికి గురయ్యాయి. తమ కంపెనీపై భారీ సైబర్ ఎటాక్ జరిగిందని సంస్థ బ్లాగ్ పోస్ట్ లో నిర్వాహకులు గురువారం తెలిపారు. తమ డేటా బేస్ నుంచి ఈ సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారని ప్రకటించింది. తమ ఖాతాదారుల పేర్లు, పాస్ వర్డులను వారు చేజిక్కించు కున్నారని నిర్వాహకులు ప్రకించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్వర్డ్లను మార్చుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది. మొత్తం 120 మంది మిలియన్ యూజర్లలో సుమారు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులు చోరీకి గురైనట్టు తమభద్రతా సిబ్బంది గుర్తించారని జొమాటో వెల్లడించింది. దీంతో తమ సంస్థ యూజర్లు వెంటనే తమ పాస్ వర్దులను మార్చుకోవాలని, మల్టిపుల్ సైట్స్ లో ఒకే పాస్ వర్డ్ వినియోగించవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. పే మెంట్ డేటా సమాచారాన్ని మొత్తం అత్యంత భద్రతా (పీసీఐ సెక్యూరిటీ) వ్యవస్థలో ఉంచినందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ ను గానీ, క్రెడిట్ కార్డు డేటాను గానీ హ్యాకర్లు దొంగిలించలేకపోయారని స్పష్టం చేశారు. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని ఈ సంస్థ ఆర్గనైజర్లు తెలిపారు. అయితే పే మెంట్ డేటాను వేరు చేసి భద్రంగా ఉంచాం గనుక యూజర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా వచ్చారు. మరో రెండు, మూడురోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టం ను మెరుగు పరుస్తామని వారు హామీ ఇచ్చారు. -
ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్
డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్.. దొంగలించిన డ్రగ్స్, ఆయుధాలు, డేటా బేస్, నకిలీ డాక్యుమెంట్ల విక్రయానికి ఇదే అడ్డా. ఈ అడ్డా వలలో ఇప్పుడు దేశీయ అతిపెద్ద ఆన్ లైన్ రెస్టారెంట్ గైడ్ జోమాటో చిక్కుకుంది. జోమాటోకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు సెక్యురిటీ బ్లాక్ హ్యాక్ రీడ్ రిపోర్టు చేసింది.. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడని హ్యాక్ రీడ్ తెలిపింది. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమవుతోంది. ఆ డేటా మొత్తాన్ని 1,001.45 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు చేస్తోంది. అమ్మకందారుడు ఎన్క్లే పేరుతో ఈ డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు తెలిసింది. జోమాటోలో రిజిస్ట్ర్ అయిన ప్రతి కస్టమర్ ఫోన్ నెంబర్, అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ వారిదగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ హ్యాకింగ్ కనుక నిజమైతే, ఇండియన్ ఐటీ యాక్ట్ సెక్షన్ 43ఏ కింద జోమాటోనే యూజర్ల వ్యక్తిగత డేటాకు బాధ్యత వహించి, పరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ సైబర్ లా, సైబర్ సెక్యురిటీ ఎక్స్ పర్ట్ ప్రశాంత్ మలి చెప్పారు. 20 కి పైగా దేశాల్లో జోమాటో యప్ ను వాడుతున్నారు. నెలకు 90 మిలియన్ కు పైగా యూజర్లు ఈ యాప్ ను వాడుతున్నారు. -
పోలీసు స్టేషన్లపై హ్యాకర్ల పంజా
► తిరుపతిలో పలు చోట్ల సమాచారం గల్లంతు ► డబ్బులు డిమాండ్ చేస్తూ హ్యాకర్ల లాక్లు ► చిత్తూరులో తప్పిన ముప్పు ► సమాచారం పేపర్లలోనూ ఉంది: అర్బన్ ఎస్పీ హ్యాకర్లు మన జిల్లానూ వదల్లేదు. 70కి పైగా దేశాల్లోని సాంకేతిక రంగ సమాచారాన్ని తస్కరించిన సైబర్ దుండగులు తిరుపతి అర్బన్ పోలీసు వ్యవస్థను టార్గెట్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. చిత్తూరులో మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చిత్తూరు (అర్బన్)/తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్ పోలీస్ వ్యవస్థ పరిధిలోని పలు స్టేషన్లలో శనివారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది కంప్యూటర్లు ఆన్ చేయగానే కొత్త పాస్వర్డ్లు అడుగుతూ స్క్రీన్పై సమాచారం వచ్చింది. కొన్ని చోట్ల మెయిల్ ఓపెన్ చేయగా మాల్వేర్ (వైరస్)ను ఎన్క్రిప్టెడ్ ఫైల్ ద్వారా పంపించారు. తెరిచి చూసే సరికి కంప్యూటర్లు పనిచేయలేదు. ఇలా జిల్లాలోని తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్, తిరుమల, ఏర్పేడు, కలికిరి స్టేషన్లతో పాటు ఎనిమిది చోట్ల పోలీస్ శాఖకు సంబంధించిన డేటా హ్యాక్ అయ్యింది. పాస్వర్డ్ను డీ–కోడ్ చేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ సూచనలతో ఓ ప్రత్యేక బృందం ఇందుకోసం పనిచేస్తోంది. రాష్ట్ర పోలీస్ కమ్యూనికేషన్ సర్వీస్ (పీసీఎస్) కంప్యూటర్ల స్క్రీన్పై కనిపిస్తున్న పాస్వర్డ్లను డీ–కోడ్ చేసే పనిలో పడింది. డేటా(సమాచారం) చోరీనుంచి చిత్తూరు పోలీసు జిల్లాకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం రాత్రి ఎస్పీ శ్రీనివాస్ సెట్ కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లకు ఉన్న ఇంటర్నెట్, ల్యాన్ కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అన్ని స్టేషన్లలో ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడంతో డేటా హ్యాకర్ల చేతిలో పడలేదు. ఏమిటీ హ్యాకింగ్..? ఓ వ్యవస్థకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వాటిని ఇంటర్నెట్ ద్వారా మెయిల్స్కు పంపడం, ఆన్లైన్ డ్రైవ్లో స్టోరేజీ చేసుకుంటారు. ఈ మొత్తం డేటా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడానికి కొన్ని వందల గంటల సమయం నుంచి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. డేటాను ఎవరూ చూడకుండా సీక్రెట్ కోడ్లు ఉంచడం, కంప్యూటర్లకు పాస్వర్డ్లు పెట్టడం ఆనవాయితీ. మన ప్రమేయం లేకుండా ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని తస్కరించడానికి సాంకేతిక దొంగలు ప్రయత్నిస్తుంటారు. వీళ్లనే హ్యాకర్లుగా పిలుస్తారు. శుక్రవారం ప్రపంచంలోని 70 దేశాలకు పైగా పలు వ్యవస్థలో ఇలా హ్యాకింగ్ చేసేశారు. ఇది మన దేశానికి సైతం వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలోని సమాచారాన్ని హ్యాకర్లు చేతుల్లోకి తీసుకున్నారు. డబ్బులిస్తేగానీ సమాచారం ఇవ్వబోమని.. కంప్యూటర్లకు కొత్త పాస్వర్డ్లు, సీక్రెట్ కోడ్లు ఏర్పాటుచేశారు. దీన్నే ‘వానా క్రై రాన్సమ్వేర్’ వైరస్గా గుర్తించారు. తొలిసారి ఇలా ... హ్యాకింగ్ జరిగిన మాట వాస్తవమే. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేదు. అర్బన్ ఎస్పీ కార్యాలయంతో పాటు ఆరు స్టేషన్లలో 8 సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి. అర్బన్ జిల్లా కార్యాలయంలో మూడు కంప్యూటర్లు, వెస్టు పోలీసుస్టేషన్, యూనివర్సిటీ పోలీసు స్టేషన్, తిరుపతి, తిరుమల క్రైం పోలీసు స్టేషన్, ఏర్పేడు మహిళా పోలీసు స్టేషన్లలో వీటిని గుర్తించాం. వెస్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాం. నాలుగైదు రోజుల్లో మాన్యువల్గా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం. హ్యాకర్లు విదేశాల నుంచి మాల్వేర్ ద్వారా సిస్టమ్ డేటాను ఎన్క్రిప్ట్(బ్లాక్చేసి) నగదు చెల్లిస్తే వాటిని విడుదల చేస్తామని మెసేజ్లలో తెలిపారు. అర్బన్ జిల్లాలో మొదటిసారిగా హ్యాకర్లు మాల్వేర్ లను పంపి నగదు డిమాండ్ చేశారు. నగరంలోని పోలీసు స్టేషన్లలో డేటా వివరాలు పేపర్ల రూపంలో భద్ర పరిచాం. నిపుణుల ద్వారా సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా గుర్తు తెలియని వ్యక్తులనుంచి వచ్చే మెయిల్స్ రిసీవ్ చేసుకోకుండా ఉండడమే మంచిది. పూర్తిస్థాయిలో హ్యాకింగ్ అయిన సిస్టమ్స్ త్వరలోనే పనిచేస్తాయి. మళ్లీ హ్యాకింగ్కు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అయినా అప్రమత్తంగా ఉన్నాం. – విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మి -
పోలీసు స్టేషన్లపై హ్యాకర్ల పంజా
♦ తిరుపతిలో పలు చోట్ల సమాచారం గల్లంతు ♦ డబ్బులు డిమాండ్ చేస్తూ హ్యాకర్ల లాక్లు ♦ చిత్తూరులో తప్పిన ముప్పు ♦ సమాచారం పేపర్లలోనూ ఉంది: అర్బన్ ఎస్పీ హ్యాకర్లు మన జిల్లానూ వదల్లేదు. 70కి పైగా దేశాల్లోని సాంకేతిక రంగ సమాచారాన్ని తస్కరించిన సైబర్ దుండగులు తిరుపతి అర్బన్ పోలీసు వ్యవస్థను టార్గెట్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. చిత్తూరులో మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చిత్తూరు (అర్బన్)/తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్ పోలీస్ వ్యవస్థ పరిధిలోని పలు స్టేషన్లలో శనివారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది కంప్యూటర్లు ఆన్ చేయగానే కొత్త పాస్వర్డ్లు అడుగుతూ స్క్రీన్పై సమాచారం వచ్చింది. కొన్ని చోట్ల మెయిల్ ఓపెన్ చేయగా మాల్వేర్ (వైరస్)ను ఎన్క్రిప్టెడ్ ఫైల్ ద్వారా పంపించారు. తెరిచి చూసే సరికి కంప్యూటర్లు పనిచేయలేదు. ఇలా జిల్లాలోని తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్, తిరుమల, ఏర్పేడు, కలికిరి స్టేషన్లతో పాటు ఎనిమిది చోట్ల పోలీస్ శాఖకు సంబంధించిన డేటా హ్యాక్ అయ్యింది. పాస్వర్డ్ను డీ–కోడ్ చేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ సూచనలతో ఓ ప్రత్యేక బృందం ఇందుకోసం పనిచేస్తోంది. రాష్ట్ర పోలీస్ కమ్యూనికేషన్ సర్వీస్ (పీసీఎస్) కంప్యూటర్ల స్క్రీన్పై కనిపిస్తున్న పాస్వర్డ్లను డీ–కోడ్ చేసే పనిలో పడింది. డేటా(సమాచారం) చోరీనుంచి చిత్తూరు పోలీసు జిల్లాకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం రాత్రి ఎస్పీ శ్రీనివాస్ సెట్ కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లకు ఉన్న ఇంటర్నెట్, ల్యాన్ కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అన్ని స్టేషన్లలో ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడంతో డేటా హ్యాకర్ల చేతిలో పడలేదు. ఏమిటీ హ్యాకింగ్..? ఓ వ్యవస్థకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వాటిని ఇంటర్నెట్ ద్వారా మెయిల్స్కు పంపడం, ఆన్లైన్ డ్రైవ్లో స్టోరేజీ చేసుకుంటారు. ఈ మొత్తం డేటా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడానికి కొన్ని వందల గంటల సమయం నుంచి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. డేటాను ఎవరూ చూడకుండా సీక్రెట్ కోడ్లు ఉంచడం, కంప్యూటర్లకు పాస్వర్డ్లు పెట్టడం ఆనవాయితీ. మన ప్రమేయం లేకుండా ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని తస్కరించడానికి సాంకేతిక దొంగలు ప్రయత్నిస్తుంటారు. వీళ్లనే హ్యాకర్లుగా పిలుస్తారు. శుక్రవారం ప్రపంచంలోని 70 దేశాలకు పైగా పలు వ్యవస్థలో ఇలా హ్యాకింగ్ చేసేశారు. ఇది మన దేశానికి సైతం వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలోని సమాచారాన్ని హ్యాకర్లు చేతుల్లోకి తీసుకున్నారు. డబ్బులిస్తేగానీ సమాచారం ఇవ్వబోమని.. కంప్యూటర్లకు కొత్త పాస్వర్డ్లు, సీక్రెట్ కోడ్లు ఏర్పాటుచేశారు. దీన్నే ‘వానా క్రై రాన్సమ్వేర్’ వైరస్గా గుర్తించారు. తొలిసారి ఇలా ... హ్యాకింగ్ జరిగిన మాట వాస్తవమే. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బం ది లేదు. అర్బన్ ఎస్పీ కార్యాలయంతో పాటు ఆరు స్టేషన్లలో 8 సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి. అర్బన్ జిల్లా కార్యాలయంలో మూడు కంప్యూటర్లు, వెస్టు పోలీసుస్టేషన్, యూనివర్సిటీ పోలీసు స్టేషన్, తిరుపతి, తిరుమల క్రైం పోలీసు స్టేషన్, ఏర్పేడు మహిళా పోలీసు స్టేషన్లలో వీటిని గుర్తించాం. వెస్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాం. నాలుగైదు రోజుల్లో మాన్యువల్గా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం. హ్యాకర్లు విదేశాల నుంచి మాల్వేర్ ద్వారా సిస్టమ్ డేటాను ఎన్క్రిప్ట్(బ్లాక్చేసి) నగదు చెల్లిస్తే వాటిని విడుదల చేస్తామని మెసేజ్లలో తెలిపారు. అర్బన్ జిల్లాలో మొదటిసారిగా హ్యాకర్లు మాల్వేర్ లను పంపి నగదు డిమాండ్ చేశారు. నగరంలోని పోలీసు స్టేషన్లలో డేటా వివరాలు పేపర్ల రూపంలో భద్ర పరిచాం. నిపుణుల ద్వారా సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా గుర్తు తెలియని వ్యక్తులనుంచి వచ్చే మెయిల్స్ రిసీవ్ చేసుకోకుండా ఉండడమే మంచిది. పూర్తిస్థాయిలో హ్యాకింగ్ అయిన సిస్టమ్స్ త్వరలోనే పనిచేస్తాయి. మళ్లీ హ్యాకింగ్కు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అయినా అప్రమత్తంగా ఉన్నాం. – విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మి -
మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..?
-
రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ బుధవారం హ్యాక్ అయింది. రాహుల్ అకౌంట్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. రాహుల్ గాంధీని, అయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు ఇష్టానుసారంగా పోస్టులు చేశారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుంచి సదరు ట్విట్లను తొలగించారు. హ్యాకర్లు పోస్టు చేసిన ట్విట్లు: -
పేటీఎం హ్యాక్ అయిందా...?
• కొద్దిసేపు నిలిచిపోయిన వ్యాలెట్ సర్వీసులు • హ్యాక్ అంటూ సోషల్ మీడియాలో వదంతులు • 2 లక్షల యూజర్ల డేటా హ్యాకర్లకు చిక్కిందంటూ టీవీల్లోనూ వార్తలు • సాంకేతిక కారణాలవల్లే నిలిచాయన్న పేటీఎం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అందరూ ఎలక్ట్రానిక్ లావాదేవీలవైపు మళ్లుతున్న తరుణంలో... ఊహించని సంఘటన జరిగింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు పర్యాయపదంగా నిలుస్తూ... ప్రతి చిన్న వర్తకుల మొబైల్లోనూ కనిపిస్తున్న వ్యాలెట్ దిగ్గజం పేటీఎం... మంగళవారం కాసేపు పనిచేయకుండా పోరుుంది. చాలామంది తమ లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించగా పనిచేయలేదు. కొందరు తమ పేటీఎం ఖాతాల్లోని నగదును బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవటానికి ప్రయత్నించగా ‘నెట్వర్క్ ఎర్రర్’ అంటూ కనిపించింది. అరుుతే ఇదే సమయంలో... పేటీఎం డేటా బేస్ హ్యాక్ అరుుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అరుుంది. అందరూ ఈ రకమైన మెసేజ్లు చూసి కంగారు పడ్డారు. ‘‘దాదాపు 2 లక్షల మంది పేటీఎం యూజర్ల తాలూకు డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లింది. హ్యాకర్లు ఇపుడు పేటీఎం సర్వర్లను బైపాస్ చేయగలుగుతున్నారు. అంటే మీరు రూ.100 రీచార్జ్ చేయాలనుకుంటే ఆ సందేశం పేటీఎంకు చేరకుండా నేరుగా హ్యాకర్లకు చేరుతుంది. వారే మీకు అనుమతిచ్చేస్తారు’’ అనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అరుుంది. దీన్ని కొన్ని చానెళ్లు కూడా ప్రసారం చేయటంతో జనంలో ఆందోళన పెరిగింది. ఇదే విషయమై పేటీఎం ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు మొదట్లో అవుననిగానీ, కాదని గానీ ఏమీ చెప్పలేదు. అరుుతే చివరకు తమ అధికారిక ట్వీటర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ... ‘వి ఆర్ బ్యాక్’ అని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల తమ సేవలు కొంతసేపు నిలిచిపోయాయని, ఇది హ్యాకింగ్ లాంటిదేమీ కాదని వారు స్పష్టం చేశారు. తమ సేవలు మామూలుగానే అందుతున్నాయని చెప్పారు. ఎంతవరకూ సేఫ్? పేటీఎం కార్యకలాపాలు సాంకేతిక కారణాలతో కొద్దిసేపే నిలిచినప్పటికీ... దాని వాడకందార్లలో ఆందోళన మాత్రం ఎక్కువే రాజ్యమేలింది. తమ తమ వ్యాలెట్లలో డబ్బులు మాయమై అన్నీ జీరోలు కనిపిస్తే ఏం చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలోనే ప్రశ్నలు వేయటం కనిపించింది. దీనిపై బ్యాంకింగ్, సాంకేతిక నిపుణులను సంప్రదించగా... ‘‘ఏ లావాదేవీలకై నా రక్షణ ఉంటుంది. అరుుతే చాలామంది పేటీఎం వంటి వ్యాలెట్లలో తమ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేవ్ చేసి ఉంచుతున్నారు. దీనివల్ల ప్రతిసారీ ఆ కార్డుల వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదనే మాట నిజమే. కానీ టెక్నాలజీ బాగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మోసగాళ్లు కూడా అంతకు మించిన ఎత్తులు వేస్తుం టారు. అలాంటి వారికి డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చిక్కితే ఇబ్బందే. అందుకే మీ వ్యాలెట్లలో మీ కార్డుల వివరాలు సేవ్ చేయకపోవటమే ఉత్తమం. ఒకవేళ సేవ్ చేసి ఉంటే తక్షణమే తొలగించటం మంచిది. దానివల్ల మీరు ఒకవేళ నష్టపోరుునా ఆ నష్టం మీ వ్యాలెట్లో ఉన్న కొద్ది మొత్తానికే పరిమితమవుతుంది’’ అని వారు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇలాంటి సంధి సమయంలో ఇలాంటివి జరగటం ఇబ్బందికరమే!!. -
వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా జాతీయ వాతావరణ బ్యూరో కంప్యూటర్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఏసీఎస్సీ) అధికారికంగా బుధవారం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్య సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. గత ఏడాది కూడా వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. అయితే, హ్యాకింగ్ కు గల కారణాలు తెలియరాలేదు. కేవలం నష్టం కలిగించడానికి మాత్రమే హ్యాకర్లు ఈ పని చేసుంటారని నిపుణులు అంటున్నారు. ఏసీఎస్సీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణ కేంద్రంలో గల రెండు కంప్యూటర్లలోకి వైరస్ చొరబడినట్లు గుర్తించామని చెప్పారు. పరిశీలించి చూడగా అంతర్జాతీయ హ్యాకర్లు ఉపయోగించే రిమోట్ యాక్సెస్ టూల్(ఆర్ఏటీ)గా తేలిందని వెల్లడించారు. ఈ టూల్ ను ఉపయోగించే గతంలో కొన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ కంపూటర్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు యత్నించారని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో 1,095సార్లు ప్రభుత్వ కంప్యూటర్లపై హ్యాకర్లు దాడులు చేశారని పేర్కొన్నారు. కాగా, గతంలో ఆస్ట్రేలియా అధికారులు హ్యాకింగ్ పై చైనాను దూషించిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ అకౌంట్ హ్యాక్
ముంబై: బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఇన్కం ట్యాక్స్ చెల్లింపుల అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ మేరకు ఆమె గత శుక్రవారం ముంబై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్ ఆమె చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిసింది. ట్యాక్స్ చెల్లింపు కోసం అకౌంట్ ను ఓపెన్ చేయడానికి కరీనా చార్టెడ్ అకౌంటెంట్ ప్రయత్నించగా లాగిన్ కాకపోవడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా పాన్ కార్డు నంబర్ తెలుసుకున్న హ్యాకర్ దానిని ఉపయోగించి ఆమె అకౌంట్ ను హ్యాక్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. హ్యాకింగ్ తర్వాత ఈ-ఫైలింగ్ పాస్ వర్డ్ ను కూడా హ్యాకర్ మార్చినట్లు తెలిసింది. ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం తీవ్రమైన నేరమని సైబర్ పోలీసులు తెలిపారు. ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం ద్వారా తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చి సదరు వ్యక్తి ఎక్కువ ట్యాక్స్ లు కట్టేలా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అకౌంట్ ను తిరిగి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. నేరస్తుడి కోసం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
ట్రాయ్ చైర్మన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ట్విట్టర్ అకౌంట్ శనివారం హ్యాంకింగ్ కు గురైంది. శర్మ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆయన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన ట్రాయ్ అధికారులు.. మెసేజ్ లలో ఉన్న సారాంశంపై స్పందించొద్దని కోరారు. శర్మ ప్రస్తుతం అధికారిక పనుల మీద ఫిజి, ఆస్ట్రేలియాల పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. టెలికాం సంస్థల ఆర్ధిక విషయాలపై రెగ్యులేటరీ పాత్ర కాన్ఫరెన్స్ కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది. -
వీఎస్యూ వెబ్సైట్ మళ్లీ హ్యాక్
పాకిస్థాన్ జిందాబాద్ మెసేజ్ నెల్లూరు (టౌన్): నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్సైట్ను కొందరు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం నుంచి మరోసారి హ్యాక్ చేశారు. కొంత మంది విద్యార్థులు డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల కోసం వీఎస్యూ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పనిచేయలేదు. అయితే గూగూల్ కెళ్లి వీఎస్యూ రిజల్ట్స్ టైపు చేస్తే ఓపెన్ అవుతుంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. వీఎస్యూ అధికారులకు మాత్రం ‘సాక్షి’ సమాచారం ఇచ్చేదాక తెలియక పోవడం గమనార్హం. పాకిస్థాన్కు చెందిన కొంత మంది వ్యక్తులు వీఎస్యూ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. పాకిస్థాన్ జిందాబాద్ అని, వెబ్సైట్కు సెక్యూరిటీ అనుకోవడం కేవలం మీ భ్రమని పోస్టు చేశారు. దీంతో పాటు ఈ నెల 14న దేశ వ్యాప్తంగా అనేక వెబ్సైట్లను హ్యాక్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఇదే వీఎస్యూ వెబ్సైట్ను గత నెల 30న పాకిస్థాన్కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. అయితే వీఎస్యూ వెబ్సైట్పై సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెబ్సైట్ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహణలో ఉంది. వీఎస్యూ వెబ్సైట్ హ్యాక్ విషయంలో వీఎస్యూ రిజిస్ట్రార్ శివశంకర్కు ఫోన్ చేయగా మాల్వేర్ ఇంజక్షన్ వైరస్ ఫైర్వాల్ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. సంస్థ నిర్వాహకులకు ఈవిషయాన్ని తెలియజేసి వెబ్సైట్ను క్లోజ్ చేయించారని తెలిపారు. -
వర్సిటీ వెబ్సైట్ హ్యాక్ రెండో సారి
వెబ్సైట్ హ్యాకింగ్పై కేసు నమోదు 2013లోనూ ఓ సారి హ్యాక్ నెల్లూరు (క్రైమ్) : సింహపురి వర్సిటీ వెబ్సైట్ హ్యాకింగ్ చేయడం ఇది రెండో సారి. 2014 ఆగస్టులో నకిలీ సర్టిఫికెట్ల ముఠా హ్యాకింగ్కు పాల్పడినట్లు వర్సిటీ అధికారులు గుర్తించి అప్పట్లో ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైబర్ క్రైం కింద కేసు నమోదు చేశారు. వర్సిటీ ఆధీకృత www.simhapuriuniv.org వెబ్సైట్ ని 2008లో ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్కు చెందిన ఐసీఎం. స్పాట్ సంస్థ నిర్వహిస్తోంది. 2012లో వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్సైట్కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. పాత వెబ్సైట్ను తొలగించాలని ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్ (ఈఆర్ఎన్ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అప్పటి నుంచి ఆ వెబ్సైట్ గురించి వర్సిటీæ అధికారులు పట్టించుకోలేదు. 2013 అక్టోబర్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్సైట్ను హ్యాకింగ్ చేశాడు. అందులో నకిలీ ఐడీని క్రియేట్ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తుందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందు పరిచాడు. చిరునామా, సెల్ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆ సెల్ఫోన్ నంబర్లను సంప్రదించారు. వారి వద్ద నుంచి సదరు హ్యాకర్ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశాడు. నకిలీ సర్టిఫికెట్లను వారికి మంజూరు చేశాడు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు మొదటి వారంలో కర్ణాటక హోసూరుకు చెందిన నూర్ఇస్తా హ్యాకర్ వద్ద నుంచి ఎంఈడీ సర్టిఫికెట్ పొంది పైచదువులకు మైగ్రేషన్ సర్టి్టఫికెట్ కోసం యూనివర్సిటీకి వచ్చాడు. అధికారులు వాటిని పరిశీలించి అవి నకిలీవిగా తేల్చారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్సైట్ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్న విషయం తేట తెల్లమైంది. దీంతో 2014 ఆగస్టు 12వ తేదీన యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్.మురళీమోహన్రెడ్డి ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఒకటోనగర ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్లో ఐడీని క్రియేట్ చేశాడని, తన కార్యకలాపాలు బెంగళూరు, హరయనా నుంచి సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే ఇంత వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు సైతం కేసు నమోదుతో సరిపెట్టుకున్నారు. తాజాగా తీవ్రవాదులు వెబ్సైట్ను హ్యాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వర్సిటీ అధికారులు కోరుతున్నారు. తాజాగా మళ్లీ కేసు నమోదు విక్రమ సింహపురి యూనివర్సిటీ వెబ్సైట్ను తీవ్రవాదులు హ్యాకింగ్ చేయడంపై వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మురళీమోహన్ ఫిర్యాదు మేరకు సోమవారం ఒకటో నగర ఇన్స్పెక్టర్ అబ్దుల్ కరీం సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటి అధికారిక వెబ్సైట్ www.simhapuriuniv.ap.inను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం వె»Œ సైట్ హ్యాకింగ్కు గురైంది. ఆదివారం కొందరు విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీకి చెందిన వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో హోమ్ పేజీపై దేశప్రధాని, బాలీవుడ్ హీరో షారూఖ్ఖాన్లకు హెచ్ఈఎక్స్786 పేరిట హెచ్చరికలు ఉండటాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే శ్రీవా టెక్నాలజీస్ ద్వారా సైట్ను పునరుద్ధరించారు. -
సుందర్ పిచాయ్ కూడా బుక్కయ్యాడు...!
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ అనంతరం హ్యాకింగ్ గ్రూప్ అవర్ మైన్ లేటెస్ట్ టార్గెట్ గా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బుక్కాయ్యారు. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసింది. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. సుందర్ పిచాయ్ ఫాలోవర్స్ 508,000 మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు సోమవారం పాల్పడామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. ఈ హ్యాకింగ్ రిపోర్టుపై గూగుల్, క్వారాలు వెంటనే స్పందించలేదు. ఈ హ్యాకింగ్ గ్రూప్ ఈ నెల మొదట్లో జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
బంగ్లాదేశ్ లో హిందువు దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కరువుతోంది. మైనారిటీల వరుస హత్యలు అక్కడ పరిపాటిగా మారాయి. ఓ ఆశ్రమంలో పని చేస్తున్న వ్యక్తిని శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరల ప్రకారం.. పాబ్నా జిల్లాలోని శ్రీ ఠాకూర్ అనుకూల్ చంద్ ఆశ్రమంలో పని చేస్తున్న నిత్యరంజన్ పాండే(62) ను శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి నరికి చంపారు. దాడి ఉదయం పూట జరగడంతో సాక్షులు ఎవరూ లేరని పోలీసు అధికారి అబ్దుల్లా అల్ హసన్ తెలిపారు. గడిచిన మూడేళ్లలో బంగ్లాదేశ్ లో 50 మంది మైనారిటీలు హత్యకు గురయ్యారు. -
మైస్పేస్ అకౌంట్లు హ్యకింగ్
శాన్ ఫ్రాన్సిస్కో : ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ మైస్పేస్ అకౌంట్లు భారీ ఎత్తున్న హ్యాకింగ్ కు గురయ్యాయి. దొంగలించబడ్డ 3600లక్షలకు పైగా పాత అకౌంట్ల పేర్లు, పాస్ వర్డ్ లు ఆన్ లైన్ హ్యాకర్ ఫోరమ్ లో అమ్మకం జరిగాయని టైమ్ ఇంక్ నిర్థారించింది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ను ఫిబ్రవరిలో టైమ్ కొనుగోలు చేసింది. లిమిటెడ్ యూజర్ పేర్లు, పాస్ వర్డ్ లు, ఈ-మెయిల్ అడ్రస్ లతో 2013 జూన్ 11న గట్టి అకౌంట్ సెక్యురిటీతో ఈ ప్లాట్ ఫామ్ ను పున: ప్రారంభించారు. తమ సమాచార భద్రత, గోప్యత టీమ్ లు మైస్పేస్ టీమ్ కు సపోర్టుగా నిలుస్తారని టైమ్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జెఫ్ బెయిర్ట్స్ తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్ ప్రభావం టైమ్ ఇంక్ సిస్టమ్స్, చందాదారులు సమాచారం, ఇతర మీడియా ఆస్తులపై లేదని టైమ్ ఇంక్ ప్రకటన విడుదలచేసింది. 2003 లో మైస్పేస్ స్థాపించారు. సోషల్ నెట్ వర్గింగ్ లో ఇది చాలా ప్రాధాన్యత కల సైట్. కానీ ఫేస్ బుక్ వంటి సైట్ ల పోటీని తట్టుకోలేక తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. మల్టిపుల్ అకౌంట్లకు, మైస్పేస్ కు ఒకే పాస్ వర్డ్ కలిగి ఉన్నవారు ఎక్కువ హ్యాకింగ్ కు గురవుతున్నారని మైస్పేస్ తెలిపింది. యూజర్ల పాస్ వర్డ్ లను, ఈ-మెయిల్ అడ్రస్ లను వివిధ సైట్లలో ప్రయత్నిస్తూ ఈ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారని పేర్కొంది. -
ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా?
కాలిఫోర్నియా : లింక్డ్ ఇన్ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యాధికులు, ప్రముఖులకు పరిచయం అక్కర్లేని పేరు. మిలియన్ల కొద్దీ యూజర్లు రిజస్టర్ అయి ఉన్న ఈ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ , కెరియర్ ఓరియెంటెడ్ ప్లాట్ ఫాం ఖాతాలు ఇపుడు ప్రమాదంలో పడ్డాయి. దాదాపు 10కోట్ల( 100 మిలియన్ ప్రొఫైల్స్)కు పైగా ఖాతాలు హ్యాకింగ్కు గురయ్యాయని తాజా నివేదికలు వెల్లడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన లింక్డ్ ఇన్ స్వయంగా సంస్థ ప్రతి ఖాతాదారుడిని ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేసింది. 100 మిలియన్ లింక్డ్ ఇన్ ప్రొఫైళ్లకు చెందిన ఈమెయిల్ డాటాబేస్లు, పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాయని అవి ఆన్లైన్లో అందరికీ కనిపించేలా అందుబాటులోకి వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన సంస్థ, 167మిలియన్ల ప్రొఫైల్స్,వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయ్యాయని అంగీకరించింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఖాతాదారులను ఈ మెయిల్ ద్వారా అప్రమత్తం చేసింది. పాస్ వర్డ్స్ ను రద్దుచేశామని.. రీసెట్ చేసుకోవాలని కోరింది. 400 మిలియన్ యూజర్లకు పాస్వర్డ్ల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ఈ ఖాతాల సేఫ్టీని కనుగొనేందుకు సహాయపడేలా హేవ్ ఐ బీన్ పీఓన్డ్ అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు. దీని సహాయంతో మన ఖాతాను చెక్ చేసుకోవచ్చని సూచించారు. కాగా 2009లో లాంచ్ అయిన లింక్డ్ ఇన్ 2012 లో హ్యా కింగ్ బారిన పడింది. 6.5 మిలియన్ల ప్రొఫైల్స్ ను రష్యాలోని సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత సుమారు 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో ప్రొఫైళ్లు హ్యాకవ్వడం ఇదే తొలిసారి అని సైబర్ నిపుణలు వ్యాఖ్యానించారు. -
బంగ్లాదేశ్లో బౌద్ధ సన్యాసి దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల ఆ దేశంలో ఓ హిందువును నడిరోడ్డుపై దారుణంగా హతమార్చిన ఘటన మరువక మరో దారుణం చోటు చేసుకుంది. బందర్బన్ జిల్లాలో 75 ఏళ్ల బౌద్ధ సన్యాసిని కిరాతకంగా నరికి చంపారు. సమీప ఆలయం మాంగ్ షూ అనే బౌద్ధ సన్యాని మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు బందర్బన్ డిప్యూటీ పోలీస్ చీఫ్ జైషీముద్ధీన్ తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఓ బ్లాగర్, ఇంగ్లిష్ ప్రొఫెసర్ను వీరు హతమార్చిన విషయం తెలిసిందే. -
శృతిహాసన్ ఫేస్బుక్ ఎకౌంట్ హ్యాక్
సెలబ్రిటీలకు సోషల్ మీడియా కష్టాలు తప్పటం లేదు. పెరుగుతున్న సాంకేతికతతో అభిమానులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్న తారలకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ప్రముఖుల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ కూడా హ్యాకర్స్ బారిన పడగా.., తాజాగా శృతిహాసన్ ఫేస్బుక్ ఎకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. అయితే శృతి పేజ్పై అభ్యంతరకరంగా ఎలాంటి పోస్ట్లు పెట్టకపోయినా, మరో హీరోయిన్ కృతి సనన్, తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలను శృతి ఫేస్ బుక్ పేజ్లో పోస్ట్ అయ్యాయి. దీంతో ఎలర్ట్ అయిన శృతి టెక్నికల్ టీం, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించిన శృతిహాసన్, 'కొంత మంది హ్యాకర్స్ నా ఫేస్బుక్ ఎకౌంట్ ను హ్యాక్ చేశారు. ప్రస్తుతం దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాం. అప్పటి వరకు నా ఎకౌంట్లో వచ్చే పోస్ట్లను పట్టించుకోకండి' అంటూ ట్వీట్ చేసింది. Attention ! Some jackass has hacked my Facebook account and we are working on fixing it ! Till then . Kindly ignore ! Thanks — shruti haasan (@shrutihaasan) March 5, 2016 -
ఐఆర్ఎస్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు
న్యూఢిల్లీ: ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిక వెబ్సైట్ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన http://www.irsofficersonline.gov.in వైబ్సైట్ శనివారం నుంచీ పనిచేయడం లేదని, అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
నిఘా నీడలో 'శ్రీరంగం'
తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ వెబ్సైట్ హ్యాక్కు గురైంది. దీంతో ఆలయ పరిసరాల్ని, శ్రీరంగం పట్టణాన్ని నిఘా నీడలోకి తెచ్చారు. చెన్నై: వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఒకటి. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో, దేదీప్యమానంగా కన్పిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగిసి , కుంభాభిషేక వేడుకలు గతనెల కోలాహలంగా జరిగాయి. భక్తులు ఆలయానికి రాక పెరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఆలయం ముస్తాబు అవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఆలయ వెబ్సైట్ హ్యాక్కు గురైంది. ఉదయం రెండన్నర గంటల సమయంలో వెబ్సైట్ను హ్యాక్ చేసిన వ్యక్తులు, కశ్మీర్ కైవసం తమ లక్ష్యం అంటూ, పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండటంతో కలవరం బయలు దేరింది. దీంతో ఆలయ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఈ వెబ్ సైట్ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారో ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వైకుంఠ ఏకాదశి వివరాలను ప్రజలకు అందించడం కష్టతరంగా మారింది. ఇక, ఈ హ్యాక్తో శ్రీరంగం ఆలయం, పరిసరాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే వరకే తిరుచ్చి కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు సైతం వచ్చి ఉన్న దృ ష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ భద్రత నిమిత్తం మదురై నుంచి బలగాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలోని హిందూ మున్నని ప్రధాన కార్యాలయానికి సైతం బాంబు బూచి రావడంతో ఉత్కంఠ బయలు దేరింది. చింతాద్రి పేటలో ఉన్న ఆ కార్యాలయానికి సిమీ తీవ్ర వాదుల పేరిట వచ్చిన లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకనప్పటికీ, ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేయక తప్పలేదు. -
విశాఖ ట్రఫిక్ వెబ్సైట్ హ్యకింగ్
-
పోలీస్ వెబ్సైట్ హ్యాక్..
విశాఖపట్నం నగర ట్రాఫిక్ పోలీస్ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. దాదాపు మూడు గంటలపాటు హ్యాకర్ల ఆధీనంలోనే ఉండిపోయిన సైట్ ను పోలీసులు ఎట్టకేలకు పునరుద్ధరించగలిగారు. నగరంలోని ట్రాఫిక్ ప్రభావిత ప్రాంతాలు, ట్రాఫిక్ నియమాలు, చట్టాలు, వాహనదారులకు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల వివరాలు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్ నంబర్లతో పాటు నిషిద్ధ ప్రాంతాల వివరాలతో కూడిన రూట్ మ్యాప్ను పొందుపరుస్తూ ఏడాది క్రితం వైజాగ్ పోలీస్ డాట్ కామ్ వెబ్ సైట్ ను రూపొందించారు. గత ఆదివారం మధ్యాహ్నం వెస్సైట్పై హ్యాకర్లు దాడిచేశారని తెలుసుకున్న తెలుసుకున్న పోలీసు అధికారులు హుటాహుటిన సైబర్ వింగ్తో కలిసి వెబ్సైట్ను హ్యాకర్ల బారినుంచి కాపాడుకున్నారు. అప్పటికే వెబ్సైట్లో హ్యాకర్లు పాకిస్థాన్ జాతీయ జెండాను పోస్ట్ చేసినట్లు తెలిసింది. విషయం బయటలకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన అధికారులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. కానీ, ఎలాగోలా బడటికి పొక్కింది. వెబ్ సైట్ హ్యాక్ అయింది నిజమేనని విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ అంగీకరించారు. మూడు రోజుల క్రితం మూడు గంటల పాటు హ్యాకర్ల ఆధీనంలో ఉందని, ఆ సమయంలో మానిటర్లపై 'దిస్సైట్ హ్యాక్' అనే మెసేజ్ ప్యానెల్ మాత్రమే కనిపించిందని, హ్యాకర్ల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఏడీసీపీ కె. మహేంద్రపాత్రుడు చెప్పారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. హ్యాకర్లు టర్కీ దేశస్ధులని, ఆ దేశం నుంచే హ్యాకింగ్కు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. హ్యాకర్లు ట్రాఫిక్ వెబ్సైట్ను టార్గెట్ చేయడం వెనుక కారణాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. సీఎంతో సహా ప్రముఖులు నగరానికి ఎక్కువగా వస్తున్నందున ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారెవరైనా వారికి హాని తలపెట్టడం కోసం చేసే ప్రయత్నాలో భాగంగా ట్రాఫిక్ సమాచారం. -
రచయిత అభిజిత్రాయ్ దుర్మరణం
-
ఇస్రో సైట్పై చైనా హ్యాకర్ల దాడి
-
అమెరికా ప్రభుత్వశాఖల కంప్యూటర్ నెట్వర్క్ హ్యాకింగ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్తో పాటు వివిధ సంస్థలు, విదేశాంగ శాఖ, తపాలా శాఖ, జాతీయ వాతావరణ శాఖలకు చెందిన కంప్యూటర్ నెట్వర్క్లు హ్యాకింగ్కు గురయ్యాయి. దీంతో తమ నెట్వర్క్లను తాత్కాలికంగా షట్డౌన్ చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అధికారిక రహస్య సమాచారానికి సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్లు మాత్రం హ్యాకింగ్కు గురికాలేదని తెలిపింది. బహిరంగ సమాచారంతో కూడిన ఈ-మెయిల్ వ్యవస్థలపైనే హ్యాకర్లు దాడి చేశారని పేర్కొంది. హ్యాకింగ్కు పాల్పడిన వారి గురించి ఇంకా తెలియదని తెలిపింది. ఈ-మెయిల్ వ్యవస్థలను సోమవారం తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ** -
అన్నాడీఎంకే వెబ్సైట్ హ్యాక్
అన్నాడీఎంకేకు చెందిన వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో పాకిస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు పొందుపరిచారు. దీంతో ఆ వెబ్సైట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.విచారణ కు సైబర్ క్రైం రంగంలోకి దిగింది.సాక్షి, చెన్నై: వె బ్సైట్ల మీద ఆధారపడే వారి సంఖ్య ఆధునిక యుగంలో పెరిగింది. సమాచార మార్గాలుగా అనేక వెబ్సైట్లు మారాయి. ఈ అవకాశాల్ని రాజకీయ పార్టీలు అందిపు చ్చుకున్నాయి. ప్రభుత్వ, ప్రరుువేటు రంగ సం స్థలకు సంబంధించిన వెబ్సైట్లు కోకొల్లలుగా ఆన్లైన్లో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీ య పార్టీలకూ అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా తమ సమాచారం, సంక్షేమ కార్యక్రమాలు, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారుు. గుర్తు తెలియని వ్యక్తులు తరచూ వెబ్సైట్ల హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. ఇటీవల చెన్నై పోలీసు కమిషనరేట్ వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. దీనికి పాల్పడ్డ వారెవరో ఇంత వరకు గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో అధికార పక్షానికి చెందిన వెబ్సైట్ సైతం హ్యాక్ కావ డం చర్చనీయాంశంగా మారింది. విచారణ ప్రారంభం:అన్నాడీఎంకే నేతృత్వంలో ఏఐఏడీఎంకే ఆల్ ఇండియా.ఆర్గ్ వెబ్సైట్ ఉంది. ఇందులో పార్టీ కార్యక్రమాలు, ఫొటో లు, వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. ఈ వెబ్సైట్ రెండు రోజుల క్రితం హ్యాక్ కావడాన్ని ఆ పార్టీ వర్గాలు గుర్తించాయి. అందులో పాకిస్థాన్ జెండాతో కూడిన పుర్రె బొమ్మను, పాకిస్థాన్ జిందాబాద్, ఇస్లాం జిందాబాద్ వంటి నినాదాల్ని పొందుపరిచారు. తమకు న్యాయం కావాలని, శాంతి కావాలని అందుకే హ్యాక్ చేశామంటూ ప్రకటించి ఉన్నారు. ఈ విషయూన్ని అన్నాడీఎంకే నేతలు చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. అలాగే క్రైం బ్రాంచ్ సైతం విచారణ చేపట్టింది. వెబ్సైట్ సేవల్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వెబ్సైట్ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, దీని వెనుక ఎవరున్నారనే విషయూలపై విచారణ సాగుతోంది. -
హ్యాక్ అయిన దలైలామా సైట్
ధర్మశాల(హిమాచల్ప్రదేశ్): ప్రముఖ టిబెటిన్ ఆధ్యాత్మివేత్త 14వ దలైలామాకు చెందిన వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. ఇది చైనీ భాషలో ఉన్న సైట్. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ కంపెనీ ‘కాస్పర్స్కై ల్యాబ్’, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ( సిటిఏ) సైట్ హ్యాక్ అయ్యిందని ప్రకటించింది. ఇందు కోసం హ్యాకర్లు ‘మాలిక్యులస్ సాప్ట్వేర్’ను ఉపయోగించి ఉంటారని భావిస్తోంది. టిబెట్.నెట్ అనేది సిటిఏ వారి అధికారిక వెబ్. ఇది ఉత్తరభారతంలోని ధర్మశాలలో ఉంది. 2011 నుంచి ఈ సైట్ను తరచుగా హ్యాక్ చేస్తున్నారని కాస్పర్స్కై ప్రకటించింది. అయితే ఇంత వరకు హ్యాక్ అయిన ప్రతిసారీ, సైట్కు ఆటంకం కలగకుండా ఈ సంస్థ అరికడుతోంది. ఈ హ్యాకర్లు అంతర్జాతీయ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కాస్పర్స్కై లాబ్ పరిశోధకులైన కర్ట్ బంగార్ట్నర్, ‘హ్యాకర్లు ‘వాటరింగ్ హోల్ అటాక్’ పద్ధతిలో ఈ సైట్ను హ్యాక్ చేశారు’ అని తెలిపారు. ఒరాకిల్లోని జావా సాప్టవేర్, ఈ హ్యాకర్లను బహుశ ఇంటిముఖం పట్టేస్తాయేమో వేచి చూడాలి. ‘‘ఇప్పుడు వీరు చేసినది చాలా చిన్నదే. కాని ముందుముందు, వాళ్లు ఇంపార్టెంట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి, డిలీట్ చేసేస్తారేమో’’ అని సందేహం వెలిబుచ్చారు బంగార్ట్నర్.