Heroines
-
నుదుట నామాలు.. శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్స్
మహాశివరాత్రి సందర్భంగా నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల లాంటి హీరోయిన్స్ దేవాలయాలకు వెళ్లారు. సింగర్ శ్రేయా ఘోషల్ శివుడి బొమ్మతో ఉన్న చీరతో కనిపించింది. మరికొందరు బ్యూటీస్ ఎప్పటిలానే కాస్త గ్లామరస్ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Divya khossla (@divyakhossla) View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tridha Choudhury ✨ (@tridhac) -
నార్త్ లేడీస్ టెన్షన్ పెడుతున్న సౌత్ బ్యూటీస్
-
జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య- వరుణ్ తేజ్.. లండన్లో రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేషన్స్
లండన్లో రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రహస్య గోరఖ్..చిల్ అవుదామంటోన్న అనికా సురేంద్రన్...న్యూ ఇయర్ విషెస్ చెప్పిన నేషనల్ క్రష్ రష్మిక..కొత్త ఏడాది ఆలయంలో రాశీ ఖన్నా పూజలు.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో సినీతారలు సందడి (ఫోటోలు)
-
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
హీరామండి సిరీస్లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
-
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ల రాశి ఏంటో తెలుసా? (ఫొటోలు)
-
డీ గ్లామర్కి సై అంటున్న స్టార్ హీరోయిన్లు
డీ గ్లామరస్ క్యారెక్టర్లంటే కొంచెం రిస్క్. అయితే ఆర్టిస్ట్గా మంచి పేరు వస్తుంది. అందుకే ఆ తరహా క్యారెక్టర్లకు చాన్స్ వచ్చినప్పుడు గ్లామర్ గురించి ఆలోచించకుండా డీ గ్లామరస్ క్యారెక్టర్లకు సై అంటారు. ఆ పాత్రల్లో గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కథానాయికల గురించి తెలుసుకుందాం. స్వాగతం బంగారం తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘తంగమ్’గా తయారయ్యారు హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్ర పేరు తంగమ్ (బంగారం) . దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగమ్ అనే యువతి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని తెలిసింది. కథ రీత్యా జాన్వీ కపూర్ కొన్ని సీన్స్లో డీ గ్లామరస్గా కనిపిస్తారు. తెలుగులో చేస్తున్న తొలి సినిమాతో జాన్వీ ఇలాంటి ఓ డీ–గ్లామరస్ రోల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆమె పాత్రలో ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేషధారణ, తెలుగు భాష ఉచ్ఛరణ వంటి అంశాల్లో స్పష్టత ఉండేలా జాన్వీ ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిరిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం అక్టోబరు 10న రిలీజ్ కానుంది. ‘కల్కి’ కోసం... బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఫుల్ గ్లామరస్గా కనిపించారు. ఈ బ్యూటీ హీరోయిన్గా కెరీర్నుప్రాంరంభించింది తెలుగు చిత్రం ‘లోఫర్’తోనే. 2015లో విడుదలైన ‘లోఫర్’ తర్వాత బాలీవుడ్లో దిశా ఫుల్ బిజీ అయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దిశా పటానీ తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సైన్ చేశారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా కొన్ని సీన్స్లో డీ గ్లామరస్గా కనిపిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఫిక్షనల్ ఫ్యూచరిస్ట్ సైంటిఫిక్ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘కల్కి 2898ఏడీ’ మే 9న విడుదల కానుంది. సరికొత్త మేకోవర్ ‘తంగలాన్’ సినిమా కోసం కొత్త మేకోవర్లోకి మారిపోయారు హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతి. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్లో ఆదివాసీ తెగ అమ్మాయిలుగా కనిపిస్తారట మాళవిక, పార్వతి. ‘‘తంగలాన్’ సినిమాలో నా పాత్ర చాలా బలమైనది. ఈ పాత్ర చేయడం నాకు సవాల్గా అనిపించింది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో మాళవిక పాత్రకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. 18వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ‘రాయన్’లో... వరలక్ష్మీ, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి... ఫుల్ డీ గ్లామరస్ రోల్స్లో కనిపించనున్నారు. ఈ ముగ్గురూ ఈ చాలెంజ్ను తీసుకున్నది ‘రాయన్’ చిత్రం కోసం. హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ప్రకాశ్రాజ్, సెల్వారాఘవన్, వరలక్ష్మీ శరత్కుమార్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ‘రాయన్’. కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్లందరూ డీ గ్లామరస్ రోల్స్లో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కిన ‘రాయన్’ని సన్పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇలా డీ గ్లామరస్ సవాల్ తీసుకున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. -
గ్లామర్, డ్యాన్స్లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు
డ్యాన్స్ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్ రావాలి. ఆ చాన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్ యాక్షన్’ గురించి తెలుసుకుందాం. యువతి పోరాటం ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో అనుష్కా శెట్టి సూపర్ హిట్. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సైన్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్లో ఇటీవల షూటింగ్ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్ను అనుకుంటున్నారట. సత్యభామ పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది? అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిటెక్టివ్ అను ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్ నటించిన ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. కాలేజ్ స్టూడెంట్ రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ‘ది గాళ్ ఫ్రెండ్’ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’. ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్ బో’లో చెబుతున్నారట. హక్కుల కోసం పోరాటం ‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్కుమార్ దర్శకుడు. బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్గా ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి. గీతాంజలి మళ్లీ వచ్చింది తెలుగు హీరోయిన్ అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రోడ్ ట్రిప్ హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్ ట్రిప్కు వెళ్లారు. వెకేషన్ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వరుసగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్ రాజశరవణన్ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి సై అన్నారు. -
Heroines New Year 2024 Party Celebrations: తెలుగు హీరోయిన్స్ న్యూ ఇయర్ పార్టీ (ఫొటోలు)
-
Celebrities Christmas Celebrations Photos: క్రిస్మస్ రోజు రెడ్ అండ్ హాట్గా మెరిసిన తారలు..
-
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్గా నిలిచింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్డ్రాప్ మూవీ హిట్గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
అశ్లీల కంటెంట్పై ఆలస్యంగా మన తారలు!
‘ఫన్ కోసం ఫేస్ మార్చేయండి’.. ఓ నాలుగైదేళ్లుగా ఎడిటింగ్ సాంకేతికత ద్వారా నడుస్తున్న సరదా ట్రెండ్. అయితే తెర వెనుక జరిగే తతంగం వేరే ఉంటోంది. సాధారణ జనాలు వీటిని సరదా వ్యవహారంగానే చూస్తున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా పుట్టుకురావడానికి ఈ టెక్నాలజీనే ఒకరకంగా కారణం అవుతోంది. సగటున రోజుకి లక్షల మార్ఫింగ్ వీడియోలు, కోట్లలో మార్ఫింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. అయితే మన దగ్గర సెలబ్రిటీలు ఇంతకాలం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ.. వేరే దేశాల్లో మాత్రం ఈ ఫేక్ కంటెంట్ కట్టడి కోసం ఎప్పటి నుంచో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూసే!. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలోని ఫీమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది అధికప్రచార సాధనం. అందుకే తమ క్రేజ్ను నిలబెట్టుకునేందుకు ఫొటో.. వీడియో ఆధారిత కంటెంట్ను ఫాలోవర్లతో, యూజర్లతో పంచుకుంటారు. ఉదయం లేచింది మొదలు ఫిట్నెస్ మొదలుకుని.. తినడం, తిరగడం, సరదా కబుర్లు ఇలా.. రోజూవారీ అప్డేట్లు ఇస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో దూసుకుపోతోంది. ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. దాదాపు పాత, కొత్త తరం తారలంతా ఫేక్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అశ్లీలత గురించి ఓపెన్గా చర్చించడం మన హీరోయిన్లకు ఇప్పటికీ నామోషీనే. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై కూడా పోరాడటానికి కూడా ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్ను హీరోయిన్లు ఏమాత్రం సహించడం లేదు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్, సీనియర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ఈ విషయంలో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బహిరంగంగా తమ తమ మీద నడుస్తున్న మార్ఫింగ్ కంటెంట్ మీద చర్చించారు. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్ అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటిష్ నటీమణులు సైతం ఇలాంటి అశ్లీల కట్టడి విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించి.. ప్రత్యేక చట్టాలు చేయాలని ఆ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నవాళ్లు లేకపోలేదు. అవకాశం ఉన్నా గప్చుప్.. కానీ, మన దగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా భాషలకతీతంగా సినీ తారలు బాధితులవుతున్నారు. గూగుల్లో వాళ్ల ఎడిటింగ్ కంటెంట్(అసభ్యతతో కూడుకున్నది) కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఎక్స్’, ఫేస్బుక్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా సైట్లలోనూ వేల కొద్దీ అకౌంట్ల ద్వారా అలాంటివి వ్యాప్తి చెందుతుండడం, అలాంటి పేజీలకు వేల నుంచి లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం!. ఈ తరహా వ్యవహారంలో వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఐసీసీలోని సెక్షన్ 292(అశ్లీల కంటెంట్ను సర్క్యులేట్ చేయడం), 354సీ(అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 499(వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం), 509(మహిళా గౌరవానికి భంగం కలిగించడం), వీటితో పాటు ఐటీ యాక్ట్లో 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్లు ఇలాంటి ఫేక్ వీడియో, ఫొటోల సర్యులేషన్ పై కఠిన చర్యలుంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిన్నతారలు ధైర్యంగా.. ఇంటర్నెట్లో దాదాపు అగ్ర హీరోయిన్ల ఫేక్ వీడియోల, ఫొటో కంటెంట్ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ, ఈ విషయంలో అగ్ర తారల కంటే చిన్న ఆర్టిస్టులే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిన్న నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్ను షేర్ చేసి మరీ ఆమె ఫాలో రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది ఆమె. అలా.. కొందరు ఈ-సెలబ్రిటీలు(సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు), షార్ట్ఫిల్మ్ తారలు, చిన్నాచితకా క్యారెక్టర్లు చేసే నటీమణులు ఫిర్యాదుల విషయంలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. రష్మిక వీడియో.. అసలేం జరిగిందంటే.. ఫొటో మార్ఫింగ్, ఎడిటింగ్లు సరదా కోసం చేయడం సాధారణమైన వ్యవహారం. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీప్ఫేక్ టెక్నాలజీ. నేషనల్ క్రష్గా పేరుండి.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అయ్యింది. అయితే ఎక్స్ మాధ్యమం ద్వారా ఆ వీడియో పలువురు ప్రముఖుల దృష్టికి వెళ్లింది. ఫైనల్గా అందులో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది. అయితే అప్పటికే ఆ వీడియో గురించి విపరీతమైన చర్చ నడిచింది. రష్మికతో గతంలో ఓ చిత్రంలో నటించిన బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్దేనని, ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా సదరు ఫ్లాట్ఫారమ్ తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. డీప్ ఫేక్తో పాటు ఫేస్ స్వాప్ కూడా.. డీప్ఫేక్ ఫీచర్.. ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టూల్ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్ మీడియా. డీప్ఫేక్ ఫీచర్ సాయంతో అల్రెడీ మొబైల్లో ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్లో యూజర్ తన ఫేస్ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. కానీ, సినీ ఫీల్డ్ సెలబ్రిటీలకు ఫేక్ వీడియోలతో ఇప్పుడిది కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు యూట్యూబ్లోనూ డీప్ఫేక్ టెక్నాలజీ, బాధిత హీరోయిన్ల గురించి టెక్ గురూలు, నిపుణులు దాని గురించి వీడియోలు బోలెడన్ని కనిపిస్తుంటాయి. ఇక అశ్లీలతను వ్యాప్తిచెందిస్తోన్న మరో టెక్నాలజీ ఫేస్ స్వాప్. రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్గా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. -
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్తో యాక్షన్ సల్మాన్ ఖాన్కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
సమంత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
ఫిల్మ్మేకర్లుగా మారిన హీరోయిన్లు ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
హీరోయిన్స్గా రాణిస్తున్న స్టార్ హీరోల కూతుళ్లు (ఫోటోలు)
-
నాన్న పాటలు మాటలు
అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు. తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్లు పెట్టారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు. నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ. – సోనాల్ కపూర్ నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం. – సోనాక్షి సిన్హా స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం. – సుహానా ఖాన్ బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు చెప్పేవారు. – అనన్య పాండే నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్! – కరీనా కపూర్ మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!! – ఆలియా భట్ -
పెళ్లి తరువాత కరియర్కు గుడ్బై చెప్పిన బ్యూటీస్
-
హీరోలకు కెరీర్ బెస్ట్ ఇస్తున్న..గోల్డెన్ లెగ్ బ్యూటీస్
-
ఈ గ్లామర్ ముంబై ఫ్లేవర్
తెలుగు తెరపై ముంబై హీరోయిన్లు మెరవడం అనేది కొత్తేం కాదు. ఈ ముంబై గ్లామర్ ఫ్లేవర్ ఈ ఏడాది బాగానే కనిపిస్తోంది. మరి.. బాలీవుడ్లో సినిమాలు చేస్తూటాలీవుడ్ స్క్రీ న్ పై మెరవనున్న ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ కె పిలిచింది బాలీవుడ్ టాప్ హీరోయి న్స్ లో ఒకరైన దీపికా పదుకో న్ ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఆమెను టాలీవుడ్కు పిలిచిన కథ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో దీపికా పాత్రకు యాక్ష న్ సీ న్స్ కూడా ఉంటాయన్నది ఫిల్మ్నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సై న్స్ ఫిక్ష న్ మూవీకి నాగ్ అశ్వి న్ దర్శకత్వం వహిస్తున్నారు. యాభై శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ నెల 12న లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో దీపికా పదుకో న్ ఓ ప్రెజెంటర్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనడానికి శుక్రవారం దీపికా ముంబై నుంచి లాస్ ఏంజిల్స్ ప్రయాణమయ్యారు. జాన్వీ ఎంట్రీ షురూ తెలుగు ప్రేక్షకులకు దివంగత ప్రముఖ నటి శ్రీదేవితో ప్రత్యేకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి అంత గొప్ప ప్రేమను పొందారామె. మరి.. అలాంటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ (ఇద్దరు కమార్తెలు జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్) హీరోయి న్ గా కెరీర్ను ఆరంభించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆమె రాక కోసం ఎదురు చూడకుండా ఉంటారా? ఆ ఎదురు చూపుల నిరీక్షణ ఐదేళ్లకు ఫలించింది. 2018లో వచ్చిన హిందీ చిత్రం ‘ధడక్’తో హీరోయి న్ గా పరిచయమైన జాన్వీ కపూర్ ఐదేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు సై న్ చేశారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష న్ లో రూపొందనున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయి న్ గా నటించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 18న జరుగుతుందని, నెలాఖర్లో షూటింగ్ను ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ఢిల్లీ టు హైదరాబాద్ ఒకే సినిమాతో ఇద్దరు ఢిల్లీ బ్యూటీలు తెలుగుకు వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ టైటిల్ రోల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయి న్ గా నటిస్తున్నారు నూపుర్ సన న్ . అలాగే మరో ఢిల్లీ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ కూడా ఇదే సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో మహేశ్బాబు ‘వ న్ : నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ చిత్రాల్లో నటించిన కృతీ సన న్ తాజాగా ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో హీరోయి న్ గా నటించారు. కృతీ చెల్లెలే నూపుర్. ప్రపంచ సుందరికి స్వాగతం ఐదేళ్ల క్రితం.. అంటే 2017లో మిస్ వరల్డ్గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు మానుషీ చిల్లర్. గతంలో మిస్ వరల్డ్గా నిలిచి, సినిమాల్లోకి వచ్చిన లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా తదితరుల మాదిరిగానే మానుషీ చిల్లర్ కూడా నటనను ఓ వృత్తిగా తీసుకున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ హీరోయి న్ గా మానుషీ చిల్లర్కు తొలి సినిమా. ఇక ఈ బ్యూటీ రీసెంట్గా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఓ సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హిందీకి పరిచయం అవుతున్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా తొలిసారి మెగాఫో న్ పట్టారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో ఇండియ న్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్, రాడార్ కమ్యూనికేష న్స్ ఆఫీసర్గా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. మోడల్ టు యాక్టర్ మోడల్గా కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత హీరోయి న్ గా సెటిలైన బాలీవుడ్ అమ్మాయిల జాబితా చాలానే ఉంది. ఈ లిస్ట్లో తాజాగా సాక్షీ వైద్య చేరారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాతో సాక్షీ వైద్య హీరోయి న్ గా తెలుగుకు పరిచయం అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నట్లుగా తెలిసింది. అఖిల్, సాక్షీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. వీరితోపాటు మరికొంతమంది హిందీ తారలు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్దాదా ఎమ్బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్ను జయించిన వారిలో ఉన్నారు. -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
డ్యూయల్ రోల్స్తో శభాష్ అనిపించుకున్న కథానాయికలు
-
60వ దశకం నుంచే కన్నడ భామల హల్చల్
-
కూతురితో అనుష్క ఆటలు, చరణ్తో ఉపాసన సెల్ఫీలు
పొట్టి స్కర్టులో శ్రీముఖి మిమ్మల్ని ఆరాధించేవాళ్లను గుర్తించండంటోన్న మలైకా అరోరా షెహజాదా అప్డేట్ షేర్ చేసిన కృతీ సనన్ 2023ని షేక్ చేయడానికి రెడీ అంటున్న కరీనా కపూర్ గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్కు చరణ్తో పాటు హాజరైన ఉపాసన కూతురితో ఆడుకుంటున్న అనుష్క శర్మ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Anush 🦭 (@anushkaranjan) -
స్టార్టప్ కంపెనీల్లో హీరో, హీరోయిన్స్ పెట్టుబడులు
-
హీరోయిన్ల రెమ్యునరేషన్పై మృణాల్ షాకింగ్ కామెంట్స్
మృణాల్ ఠాకుర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన మృణాల్ పలు సినిమాల్లో హీరోయిన్గానూ నటించింది. అయితే సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఆమె ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మరాఠి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె పిప్పా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన మృణాల్ హీరోయిన్ల రెమ్యునరేషన్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్ హీరోయిన్లు పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని.. డిమాండ్ చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల్లో నటీనటులకు ఉన్న గుర్తింపు, పాపులారిటిని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న రెమ్యునరేషన్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరే,న్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. చదవండి: సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో రామ్తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్డ్రాప్లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
ముంబై హీరోయిన్స్పై షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్
విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. మేజర్తో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న ఆయన హిట్-2 అనే స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ ముంబై హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హిట్-2లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. సాధారణంగా ముంబై వాళ్లు ఉంటారు కదా.. ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు. కానీ మీనాక్షి అలా కాదు. అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడింది. టీజర్ లాంచ్లోనే ఇంత ప్రిపేర్ అయ్యిందంటే సినిమాలో ఎంత కష్టపడి ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ సందర్భంగా ముంబై హీరోయిన్స్పై శేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్
‘‘ఓరి దేవుడా’ చిత్రకథ, కథనాలు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉంటాయి. ఫ్యామిలీ, యూత్.. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ని మా చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది’’ అని హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా వెంకటేష్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వంశీ కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మిథిలా పాల్కర్, ఆశాభట్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఓ మై కడవులే’ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి, ఆ చిత్రాన్ని ‘ఓరి దేవుడా’గా రీమేక్ చేయడం జరిగింది. ఇందులోని ట్విస్టులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. అశ్వత్ అద్భుతంగా తెరకెక్కించారు. వెంకటేశ్ సార్ లాంటి లెజెండ్తో నటించడం మా అదృష్టం. ఆయన నటించడం మా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. విశ్వక్ సేన్ అంకితభావంతో పనిచేస్తారు. ఆయనతో నటించడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. దీపావళికి కుటుంబమంతా కలిసి మా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ఇక నటి మిథిలా పాల్కార్ మాట్లాడుతూ.. ‘నేను నటించిన ‘లిటిల్ థింగ్స్’ వెబ్ సిరీస్ని రామ్ చరణ్లాంటి స్టార్ హీరో, ఆయన సతీమణి ఉపాసనగారు చూడటం ఆనందంగా ఉంది. నా నటనకి ఫ్యాన్ అంటూ ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్చరణ్గారు మాట్లాడటంతో నా ఆనందానికి అవధుల్లేవు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
Tamannaah: తమన్నా ఆవేదన.. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే..
తమిళసినిమా: సినిమా రంగంలో హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని మిల్కీబ్యూటీ తమన్నా వాపోతోంది. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికగా రాణించిన ఈమెకు ప్రస్తుతం క్రేజ్ తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విశాల్కు జంటగా నటించిన యాక్షన్ చిత్రం తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఇలాంటి నటీమణులను కదిలిస్తే చిత్ర పరిశ్రమలో తమ అనుభవాల గురించి కథలు, కథలుగా చెప్పేస్తారు. వాటిలో చేదు అనుభవాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని కెరీర్ ప్రారంభంలో చెప్పడానికి వెనుకాడే నటీమణులు ఒక స్టేజ్ వచ్చాక అది అవకాశాలు తగ్గిన తరువాత ఏకరువు పెడుతుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ.. చిత్ర పరిశ్రమలో చాలా అసమానతలు జరుగుతుంటాయని తెలిపింది. వీటి గురించి మహిళలు సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పింది. తాను పని చేసిన చిత్రాలల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే దానిని వారు తీసుకునేవారు కాదని పేర్కొంది. ఆ తరువాత తన అభిప్రాయం సరైందేనా? కాదా? అన్న విషయం గురించి తానే పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపింది. చదవండి: (అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం) మహిళలకు సినిమా రంగంలో మర్యాద లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక సమయంలో తాను హీరోలను ప్రేమించే పాత్రలకే పరిమితమయ్యారని చెప్పింది అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోందని, కథా పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. హీరోలకే అధికంగా పారితోషికం ఇస్తున్నారని, హీరోయిన్లకు ఇవ్వడం లేదని అన్నారు. నిర్మాత నుంచి ఎలాగోల పారితోషికాన్ని పొందవచ్చునని, అయితే తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదని వాపోయింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరని, అదే హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం జరుగుతోందని వివరించింది. ప్రస్తుతం తాను రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. -
గ్లామర్తో హీరోయిన్ల యాక్షన్.. సినిమాకే హైలెట్ !
Bollywood Actress Action With Glamour In Upcoming Movies: బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. ఆల్రెడీ కొన్ని యాక్షన్ సినిమాలు చేసిన దీపికా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. గన్ పట్టుకుని తీక్షణంగా దీపికా గురిపెట్టినట్లు ఈ పోస్టర్ను చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు పోలీస్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, అలనాటి పాపులర్ హీరోయిన్ శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శిల్పాది పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్. ఈ రోల్ కోసం గన్ను ఫుల్గా లోడ్ చేసి వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టారు శిల్పా. ఇక 2017లో మిస్ వరల్డ్గా నిలిచిన మానుషీ చిల్లర్ ‘పృథ్వీరాజ్’ అనే పీరియాడికల్ ఫిల్మ్తో హీరోయిన్గా కెరీర్ను ఆరంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా వెండితెరపై యాక్షన్ టర్న్ తీసుకున్నారు. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘టెహ్రాన్’లో మానుషీ ఓ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘గుడ్లక్ జెర్రీ’ అనే సినిమా కోసం గన్ పట్టు కున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో కామెడీ టచ్ ఉంది. ఈ చిత్రం ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ ఫిల్మ్లో ఇంటర్పోల్ ఆఫీసర్గా చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అక్టోబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీరే కాదు.. ‘టైగర్ ఫ్రాంచైజీ’లోని ‘టైగర్ 3’లో చిత్రకథానాయకుడు సల్మాన్ ఖాన్కి దీటుగా కత్రినా కైఫ్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. అలాగే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ లేడీ సూపర్ హీరో సినిమా అంగీకరించారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘హీరో పంతి 2’ కోసం తారా సుతారియా గన్ పట్టుకున్నారు. ఈ చిత్రానికి అహ్మద్ఖాన్ దర్శకుడు. అలాగే టైగర్ ష్రాఫ్ హీరోగా చేస్తున్న మరో ఫిల్మ్ ‘గణపత్’లో కృతీసనన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ యాక్షన్ జాబితాలో ప్రియాంకా చోప్రా (హాలీవుడ్ ఫిల్మ్ ‘మ్యాట్రిక్స్ 4’), దిశా పటానీ వంటి వారు కూడా ఉన్నారు. అంటే.. ఈ ముద్దుగుమ్మలందరూ తమ గ్లామర్తోపాటు యాక్షన్ను పండించనున్నారని తెలుస్తోంది. మరి వీరి యాక్షన్ ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కానుందో, లేదా హైలెట్ అవనుందో వేచి చూడాల్సిందే. -
అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే
Radhika Apte Shocking Comments On Heroines Cosmetic Surgerie: నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ‘‘ప్యాడ్మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్వేదా చిత్రాల్లో నటిస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందిని చూశాను. చాలామంది సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం అలాంటి వారిని చూసి నేను విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్స్పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అలాగే తనకు బి-టౌన్ పార్టీస్, కల్చర్ పడదని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తా’ అని తెలిపింది. -
ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్
Geetha Krishna Shocking Comments On Casting Couch: కాస్టింగ్ కౌచ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎలాంటి రంగానికి చెందిన మహిళలైన ఈ కమిట్మెంట్ కల్చర్కు బాధితులు అవుతున్నారు. ముఖ్యంగా సీని ఇండస్ట్రీలో ఈ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటికే దీనిపై పలువురు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ నోరు విప్పుతున్నారు. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా బయట పెడుతున్నారు. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. సంకీర్తన, కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు గీతా కృష్ణ. ఈ మధ్య ఆయన పలు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ హీరోహీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆయన పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పకొచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్! ఎక్స్ గర్ల్ఫ్రెండ్ వార్నింగ్ ‘ఆఫర్ల కోసం చాలా మంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు. అలా అయితేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఈ ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ కాదు’ అన్నాడు. సింగర్స్ విషయంలోనూ ఇది జరుగుతుందని, ఈ విషయాలను బయటపెడితే కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే తాను అందరినీ అనడం లేదని ఇలాంటివి వద్దు అని అనుకునే వాళ్లు 10 నుంచి 15 శాతం ఉంటారని గీతాకృష్ణ తెలిపాడు. కాగా ప్రస్తుతం డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. -
పదిమంది హీరోయిన్లతో ప్రశాంత్ వర్మ సినిమా!
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘అ’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం ప్రశాంత్ వర్మ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. పది మంది హీరోయిన్లతో డిఫరెంట్ సబ్జెక్ట్తో కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ను సంప్రదించడం, ఆమె ఓకే చేయడం చకాచకా జరిగిపోయాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఆర్ఆర్ఆర్ సినిమాను వదులుకున్న టాప్ హీరోయిన్స్ వీళ్లే..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 500కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిందీ చిత్రం. కొమురం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమలో ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అయితే వీరికంటే ముందే చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వారు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించేందుకు రిజెక్ట్ చేశారట. దీంతో జక్కన్న సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఆ ఆ హీరోయిన్స్ ఎవరా అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సీత పాత్ర కోసం ఆలియా కంటే ముందుగా శ్రద్దా కపూర్ని అప్రోచ్ అయ్యారట. కానీ ఆమె బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్ని తిరస్కరించిందట. ఆ తర్వాత పరిణితి చోప్రాను అడగ్గా ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమాను వదులుకుంది. ఇక ఎన్టీఆర్కి జోడీగా ఒలివియా కంటే ముందు అమీ జాక్సన్ని సంప్రదించారట. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కూడా నో చెప్పిందట. దీంతో బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని తీసుకున్నా కొద్ది రోజులకే ఆమె ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్కు దక్కిందనమాట. -
షీరోయిజం
-
100 కోట్ల క్లబ్లో హీరోయిన్స్
-
స్టార్ హీరోయిన్ల పారితోషికం ఎంతో తెలుసా?
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత తీసుకుంటున్నామనేదే ముఖ్యం అంటున్నారు స్టార్స్. కొద్దోగొప్పో, తక్కువో ఎక్కువో.. ఎన్ని సినిమాలు చేసినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోటీపడి మరీ వసూలు చేస్తున్నారు. సినిమా హిట్ఫ్లాప్లతో సంబంధం లేకుండా తమ పారితోషికాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. లక్షలు తీసుకోవడం మానేసి కోట్లే కావాలంటున్నారు. ఇంతకీ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు ఎంతెంత తీసుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంది? అన్న విషయాలను చూద్దాం.. బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఒక్క సినిమాకు రూ.21-25 కోట్ల దాకా వసూలు చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. కానీ ఆమె పారితోషికం 9 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె 'పఠాన్', 'గెహ్రియాన్' సినిమాలకుగానూ రూ.15 కోట్లు, 'డార్లింగ్స్' కోసం ఆలియా భట్ రూ.15 కోట్ల వసూలు చేశారట! 'గంగూబాయ్ కతియావాడి'తో పాటు 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్కహానీ'లో భాగమవడానికి ఆలియా తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 'జీ లె జరా' సినిమా కోసం కత్రినా కైఫ్ రూ.12 కోట్లు, ప్రియాంక చోప్రా రూ.10 కోట్లు తీసుకుంది. కానీ 'స్కై ఈజ్ పింక్' మూవీకి మాత్రం ప్రియాంక రూ.8 కోట్లకే సంతకం చేసిందట. ఇక శ్రద్ధా కపూర్ రూ.7 కోట్ల వసూలు చేస్తుండగా తాప్సీ 'లూప్ లపేటా' కోసం రూ.5 కోట్లు తీసుకుంది. విద్యాబాలన్ చాలా రోజుల నుంచి రెమ్యునరేషన్ను పెంచకుండా నిలకడగా రూ.4 కోట్లు వసూలు చేస్తుండగా కృతి సనన్ కూడా తన ప్రతి సినిమాకు అంతే మొత్తం తీసుకుంటోంది. 'జగ్ జగ్ జియో'కు కియారా అద్వానీ రూ.2.50 కోట్లు తీసుకున్నట్లు టాక్! జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ప్రతి సినిమాకు రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటుంటే అనన్య పాండే రూ.1.50 కోట్లు వసూలు చేస్తోంది. -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్కి ముందు నేను మిథాలీ రాజ్తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్ద ఎక్స్ప్రెస్’ టైటిల్తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్ద ఎక్స్ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్ద ఎక్స్ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
లేడీస్ స్పెషల్ సినిమాలపై హీరోయిన్ల కన్ను!
బస్సుల్లో లేడీస్ స్పెషల్ బస్సులుంటాయి.. గుడిలో లేడీస్ స్పెషల్ క్యూలుంటాయి.. లేడీస్ స్పెషల్ టికెట్ కౌంటర్లుంటాయి... మరి సినిమాల్లో... ఇక్కడా లేడీస్ స్పెషల్స్ ఉంటాయి. స్పెషల్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. ఈ సినిమాలను కథానాయికలు సవాల్గా తీసుకుంటారు. ఆ ‘లేడీస్ స్పెషల్’ సినిమాల గురించి తెలుసుకుందాం. ‘అనామిక’, ‘మాయ’, ‘డోర’... ఇలా ఇప్పటికే కెరీర్లో పలు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసి, ప్రేక్షకులను మెప్పించారు నయనతార. ప్రస్తుతం ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘కనెక్ట్’. 2015లో నయనతార నాయికగా ‘మాయ’ సినిమాను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ ‘కనెక్ట్’కు దర్శకుడు. ఇది థ్రిల్లర్ జానర్ మూవీ. ఈ చిత్రానికి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాతలు. ఇక 2007లో వచ్చిన ‘పరుత్తి వీరన్’లో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు సాధించిన హీరోయిన్ ప్రియమణి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. ఇటీవల హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’లో ఓ లీడ్ రోల్ చేసి అందర్నీ మెప్పించిన ప్రియమణి చేతిలో ప్రస్తుతం ‘సైనైడ్’, ‘కొటేషన్ గ్యాంగ్’ అనే రెండు ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ క్రైమ్ థ్రిల్లర్సే కావడం విశేషం. ‘సైనైడ్’ చిత్రానికి రాజేష్ టచ్రివర్ దర్శకుడు కాగా, ‘కొటేషన్ గ్యాంగ్’ చిత్రానికి వివేక్ దర్శకుడు. మరోవైపు ‘హ్యాపీ బర్త్డే’ అనే క్రైమ్ థ్రిల్లర్లో లావణ్యా త్రిపాఠి లీడ్ రోల్ చేస్తున్నారు. ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఇక యాభై సినిమాలు చేసిన అనుభవం ఉన్న సమంత ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘యశోద’, ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో శాంతరూబన్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్లోనూ సమంత భాగమయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంది. హరి అండ్ హరీష్ ద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, మిగతా చిత్రాల రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ‘శాకుంతలం’ చిత్రం ఈ ఏడాది వెండి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డీకే దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న తమిళ చిత్రం ‘కరుంగా ప్పియమ్’లో కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇక రెజీనా నటించిన మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ‘శాకిని డాకిని’. ఇందులో నివేదా థామస్ మరో హీరోయిన్. సుధీర్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే కీర్తీ సురేష్ గుర్తు రాకుండా ఉండరు. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’తో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కు ఓ బెస్ట్ ఆప్షన్గా మారారు కీర్తి. ఈ చిత్రం తర్వాత కీర్తి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. తాజాగా చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్లక్ సఖి’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇటు దాదాపు తొమ్మిది ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న హన్సిక చేతిలో మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘మై నేమ్ శ్రుతి’, ‘105 మినిట్స్’, ‘రౌడీ బేబీ’.. హన్సిక చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఇవే. ఇంకోవైపు ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ముందు వరుసలో ఉండే సాయిపల్లవి ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశారు. ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక వీరితోపాటు మరికొందరు హీరోయిన్స్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్తో సెట్స్లో బిజీగా ఉన్నారు. కెరీర్ మొత్తంలో ఏ హీరోయిన్కి అయినా గ్లామర్ క్యారెక్టర్స్కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అందుకే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు అవకాశం వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఈ సినిమాలను ‘స్పెషల్’గా భావించి, హార్డ్ వర్క్ చేస్తారు. హిందీలో లేడీస్ స్పెషల్స్ బాలీవుడ్లోనూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీ టౌన్ క్వీన్ కంగనా రనౌత్ చేతిలో ప్రస్తుతం మూడు (‘థాకడ్’, ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్’) ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే తాప్సీ చేతిలో ఐదు (శభాష్ మిథు’, దోబార’, లూప్ లపేట’, ‘బ్లర్’, ‘ఓ లడకీ హై కహాన్’) ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ‘ద్రౌపది’లో దీపికా పదుకోన్, ‘గుంగూబాయి కతియావాడి’లో ఆలియా భట్, ‘జీ లే జరా’లో ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, ‘ది లేడీ కిల్లర్’లో భూమీ ఫడ్నేకర్, ‘ఉమ’లో కాజల్ అగర్వాల్, ‘చత్రీవాలీ’లో రకుల్ప్రీత్ సింగ్, ‘గుడ్లక్ జెర్రీ’లో జాన్వీ కపూర్... ఇలా మరికొందరు హీరోయిన్స్ ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనా దృష్టి పెడుతున్నారు. -
టాలీవుడ్లో కొత్త భామల సందడి.. అందాలతో కట్టిపడేసిన భామలు వీరే
ప్రతి ఏటా టాలీవుడ్కి కొత్త హీరోయిన్స్ పరిచమవుతుంటారు. వారిలో కొంతమంది తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంటారు. మరికొందరు ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి వెళ్లిపోతుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్కి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అలా 2021లో తెలుగు తెరను పలకరించిన కొత్త అందాలు ఏంటి? ఎక్కువ మందిని ఆకర్షించిన కొత్త భామలెవరు? ఓ లుక్కేద్దాం. ఉప్పెనలా వచ్చి.. సముద్రమంత ప్రేమను పంచి.. తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు, సుదీర్ బాబు సినిమా, అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది. టాలీవుడ్ బ్యూటిరత్నం.. ‘చిట్టి’ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల విడుదలైన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’లో కనిపించి సందడి చేసింది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘బంగార్రాజు’లో ఓ ప్రత్యేక గీతంలో చిందులు వేయనుంది. అలాగే విష్ణు హీరోగా తెరకెక్కనున్న ‘డి అండ్ డి’లో సందడి చేయనుందని సమాచారం. ‘రొమాంటిక్’చూపులతో.. డాష్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది ముద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి సినిమాతోనే తనదైన అందాలతో కుర్రకారు చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ షూటింగ్లో ఉండగానే.. నాగశౌర్య‘లక్ష్య’మూవీలో చాన్స్ దక్కించుకుంది. తొలి మూవీలో ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసిన కేతికా.. ‘లక్ష్య’లో తనదైన నటనతో ఆకట్టుకుంది. శ్రీలీల.. అందాల మాయ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్న భామ శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ‘చెక్’తో చెక్ పెట్టి.. కన్ను గీటుతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. . నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్’తో మరోసారి ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రమిది.. తాజాగా ఆమె కిట్ లో మరో మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు జమ అయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. మీనాక్షి చౌదరి.. అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా మారింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో అవకాశం దక్కించుకుంది. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ కొట్టేసింది. వీరితో పాటు మరికొంతమంది నటీమణులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ వివరాలు.. నవమి - నాంది అమృత - రెడ్ శివానీ రాజశేఖర్ - అద్భుతం లవ్లీసింగ్ - గాలి సంపత్ దియా మీర్జా - వైల్డ్ డాగ్ తాన్యా రవిచంద్రన్ - రాజా విక్రమార్క గీత్ సైని - పుష్పక విమానం కశిష్ ఖాన్ - అనుభవించు రాజా వైశాలి రాజ్ - కనబడుట లేదు మిశా నారంగ్ - తెల్లవారితే గురువారం కృష్ణ ప్రియ - అర్ధ శతాబ్దం ఆర్జవీ రాజ్ - వివాహ భోజనంబు దృశ్య రఘునాథ్ - షాదీ ముబారక్ -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్లు కామనే. కొందరు ఈ రిలేషన్ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్హాసన్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్కల్యాణ్తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్ఫ్రెండ్ జార్జ్తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
కాజల్ ప్లెస్లో త్రిష.. సాయేషా స్థానంలో ప్రగ్యా.. చివరి క్షణంలో మారిన తారలు
‘యస్... ఈ సినిమా చేస్తా’... హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘అయ్యో... కుదరడం లేదండీ’... కొన్నాళ్లకు రెడ్ సిగ్నల్ పడింది. మళ్లీ కొత్త హీరోయిన్ వేటలో పడింది సినిమా యూనిట్. ఈ మధ్యకాలంలో ఇలా తారుమారు అయిన తారల జాబితా చాలానే ఉంది. ఒకరు తప్పుకుంటే.. ఇంకొకరికి ఆ చాన్స్ దక్కింది. ఆ ‘తారమారె’ విశేషాలు తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ‘ఆచార్య’ తొలి ప్రియురాలు త్రిషే. 2016లో వచ్చిన ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మరోసారి ‘ఆచార్య’ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకోవడం, ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ రీప్లేస్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ‘ఆచార్య’ చిత్రంలో త్రిష ప్లేస్ను కాజల్ రీప్లేస్ చేస్తే కమల్హాసన్ ‘భారతీయుడు 2’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోల్ను త్రిష రీప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ‘భారతీయుడు 2’ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆ పాత్రకు త్రిషను సంప్రదించారట చిత్రదర్శకుడు శంకర్. ‘భారతీయుడు 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తాజా చిత్రాలు ‘పొన్నియిన్ సెల్వన్’, ‘రాంగీ’ (ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది)లో త్రిష నటించారు. సో.. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధం, కమల్తో సినిమా కాబట్టి ‘భారతీయుడు 2’కి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగూ ‘భారతీయుడు 2’ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి... ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర నుంచి ఐశ్వర్యా రాజేశ్ కొన్ని కారణాల వల్ల∙తప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మాటకొస్తే ‘భారతీయుడు 2’ సినిమాయే కాదు.. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’లో రానా భార్య పాత్ర ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు ఐశ్వర్యా రాజేశ్. దాంతో రానా భార్యగా సంయుక్తా మీనన్ సీన్లోకి వచ్చారు. ఇక 2015లో ‘అఖిల్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన సాయేషా సైగల్ చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకున్న చిత్రం బాలకృష్ణ ‘అఖండ’. అయితే ఆర్యను పెళ్లి చేసుకున్న సాయేషా తల్లయ్యారు. దాంతో ఆమె ప్లేస్ను ప్రగ్యా జైస్వాల్ రీప్లేస్ చేశారు. ఇంకా నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర అమలాపాల్కు దక్కిందన్నది ఫిల్మ్నగర్ లేటెస్ట్ టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు హిందీకి వెళితే.. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో కథానాయికగా నటించడానికి ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు కీర్తీ సురేశ్. ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇదిలా ఉంటే.. తొలి హిందీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఓ తమిళ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నారు నయనతార. అయితే షారుక్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ కారణంగా యువరాజ్ దయాలన్స్ దర్శకత్వంలో అంగీకరించిన తమిళ సినిమాకు డేట్స్ కేటాయించలేక నయనతార వదులుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటించే అవకాశం శ్రద్ధా శ్రీనాథ్ సొంతమైనట్లు టాక్. వీరే కాదు.. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రీప్లేస్ అయిన తారలు ఇంకొందరు ఉన్నారు. -
అనూహ్య రేఖ
ఆమె సరళ రేఖ కాదు. వక్రరేఖ కాదు. ఒక అనూహ్య రేఖ. తెలుగు, తమిళం అనే మాతృ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్లో చక్రం తిప్పింది. హీరోలకు ఇన్స్పిరేషన్. హీరోయిన్లకు గ్లామర్ టీచర్. నేడు ఆమెకు 67 నిండి 68 వస్తున్నాయి. రేఖను తాడేపల్లిగూడెం అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి నటి పుష్పవల్లిది అదే ఊరు. పుష్పవల్లి నటిగా ఎదగడం, జెమిని గణేశన్తో సహజీవనం చేయడం ఆ రోజుల్లో సంచలనం. జెమిని గణేశన్ వల్ల ఆమెకు రేఖ, మరో కుమార్తె రాధ పుట్టారు. కాని రేఖ జీవితంలో తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. తండ్రి చాలా కాలం రేఖను తన కూతురుగా అంగీకరించలేదు. అప్పటికే ఒక పెళ్లి అయిన జెమినీ గణేశన్ సావిత్రితో పెళ్లి సమయంలో పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు. సావిత్రితో పెళ్లి బహిర్గతం అయ్యాక ఆమెకు దూరం అయ్యాడు. అందువల్ల కావచ్చు బహుశా పబ్లిక్గా రేఖను తన కుమార్తె అని ఆయన చెప్పుకోలేదు. రేఖకు ఈ గాయం ఒకటైతే తల్లి ఆ తర్వాత మరో సంబంధంలోకి వెళ్లి ఫలితంగా పుట్టిన మరో ముగ్గురిని పెంచాల్సి రావడంతో రేఖ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. తన జీవితం తాను జీవించాలనుకుంది. తన జీవిత రేఖ తానే గీసుకోవాలనుకుంది. రేఖ అలా పెరిగింది. ఇంతేరా ఈ జీవితం ‘రంగుల రాట్నం’లో భుజంగరాయ శర్మ రాసిన ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ పాట రేఖకు సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రేఖ ‘బేబీ రేఖ’ పేరుతో నటించింది. రంగుల రాట్నంలో పైకి కిందకు ఉత్థాన పతనాలు ఉంటాయి. రేఖ జీవితంలో కూడా ఉన్నాయి. తెలుగులో ‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణంరాజు పక్కన నటించిన రేఖ తన తల్లి సమాజానికి తండ్రి సమాజానికి దూరంగా వెళ్లదలుచుకుంది. ముంబై వెళ్లి 14–15 ఏళ్లకే ‘సావన్ భాదో’ సినిమాలో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయినా రేఖను ఎవరూ లెక్క చేయలేదు. పైగా ‘నల్లబాతు’ అని పిలిచేవారు. ఆమె రంగు, బొద్దుగా ఉండే రూపం నార్త్కు పనికి రాదని పత్రికలు రాశాయి. కాని రేఖ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అసలు మన రూపాన్ని మనం చెక్కుకోవచ్చు అని మొదటిసారి బాలీవుడ్కి తెలియచేసింది రేఖ. ఆ తర్వాత ఆమె రూపం మారింది. ఫ్యాషన్ మారింది. నటన మారింది. రేఖ అంటే ‘ఫ్యాషన్ దివా’ అని పేరు తెచ్చుకుంది. తోడు ఎవరు? రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అమితాబ్తో ఆమె తొలిసారిగా ‘దో అంజానే’ లో నటించింది. పెళ్లయిన అమితాబ్ రేఖ ఆకర్షణలో పడ్డాడని ఆ వెంటనే వాళ్లు కలిసి చేసిన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘మొకద్దర్ కా సికిందర్’, ‘సిల్సిలా’... ఇవి రేఖ–అమితాబ్ల చిత్రాలు. వీరి ప్రేమ, ఆ సమయంలో జయభాదురి మానసిక సంఘర్షణ యశ్చోప్రాను ‘సిల్సిలా’ తీసేలా చేశాయి. నిజ జీవితం లోని పాత్రలు సినిమా తెర మీద నటించడం బహుశా మొదటి చివరి సారిగా ఈ సినిమాలోనే జరిగిందేమో. అయితే ఈ సినిమా అంత విజయం సాధించలేదు. రేఖ తన తోటి నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకుందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ముంబై వ్యాపారి ముఖేశ్ అగర్వాల్ను వివాహం చేసుకుంది. నాలుగు పార్టీల్లో కలిసిన ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని దూకుడుగా అడిగితే రేఖ కూడా అంతే దూకుడుగా ఓకే అనడం ఆ రోజే వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ వెంటనే ఒకరి లోపాలు ఒకరికి తెలిసి ఆ పెళ్లి ప్రమాదంలో పడింది. ముఖేశ్ అగర్వాల్ పెళ్లయిన ఒక సంవత్సరం లోపే రేఖ చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దృష్టి నుంచే చూసింది. గొప్పనటి రేఖ గొప్ప నటి, డాన్సర్. రేప్ విక్టిమ్గా ‘ఘర్’ సినిమాలో నటించి ఆమె తన సీరియస్ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్ అలీ దర్శకత్వంలో ‘ఉమ్రావ్జాన్’లో నటించి రేఖ విమర్శకులను అప్రతిభులను చేసింది. ఒక తవాయిఫ్ జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్ ‘కలియుగ్’, గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ ఆమెను పార్లల్ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు ‘ఫూల్ బనే అంగారే’, ‘ఖూన్ భరీ మాంగ్’ ఆమెను యాక్షన్ హీరోయిన్ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది. జుట్టు తెల్లబడని నటి రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘ఆజ్ కల్ పావ్ జమీపర్ నహి పడ్తే హై మేరే’, ‘తేరే బినా జియా జాయేనా’, ‘సున్ సున్ దీదీ తేరే లియే ఏక్ రిష్టా ఆయాహై’, ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే రాజ్ హై’, ‘పర్ దేశియా ఏ సచ్ హై పియా’... ఎన్నో హిట్ సాంగ్స్ రేఖకు. ఆమెకు 68 వచ్చేశాయంటే నమ్మడం కష్టం. కాని వయసును జయించిన భాగ్యం ఈ భానురేఖదే కదా. రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. -
సైమా అవార్డులు: వేదికపై తారల సందడి.. ఫొటో హైలైట్స్
దక్షిణాది సినీ పురస్కారాల వేడుకలో తారలు తళుక్కుమన్నారు. 2020 ఏడాదికి గాను సైమా అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదికపై సినీ తారలు రష్మిక మందన్నా, కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, పూజా హెగ్డే, రీతూ వర్మ, మరికొందరు నటీనటులు సందడి చేశారు. డియర్ కామ్రేడ్లో నటనకు అవార్డు అందుకున్న రష్మిక సైమా వేడుకల్లో రీతూ వర్మ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఉత్తమ నటిగా పూజా హెగ్డే (అల వైకుంఠపురములో..) డ్యాన్స్తో ఆకట్టుకున్న ఫరీయా అబ్దుల్లా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ కథానాయికగా ఐశ్వర్యారాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్) నిక్కీ గల్రానీ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం. అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్ హీరోహీరోయిన్లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమైన ప్రభాస్ హైదరాబాద్లో నలంద కాలేజీలో ఇంటర్మిడియట్ చదివాడు. అనంతరం హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీటేక్లో డిగ్రీ పట్టా పొందాడు. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్గా టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు మేనమామ మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్ స్టార్ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కృష్ణ ఘట్టమనేని వారసుడిగా, బాలనటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆప్ కామర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి టాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగాడు. నాగార్జున్ అక్కినేని అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్గా మారిపోయాడు నాగార్జున. అయితే నాగార్జున నటనకు ముందు అమెరికాలో జాబ్ చేసిన సంగతి తెలిసిందే. అమోరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వెంటనే చందమామ, మగధీర వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్లో డిగ్రీ పూర్తి చేసింది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత నటిగా, గాయనీగా, మ్యూజిక్ కంపోజర్గా ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతి ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో పట్టా అందుకుంది. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పనిచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అటూ బాలీవుడ్, ఇటూ టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్గా పనిచేశాడు. -
రవి వర్మ పెయింటిగ్స్: మన అందాల తారల అద్భుతం
-
ఎవరేమన్నా పట్టించుకోను!
సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి నెటిజన్ల నుంచి ప్రశంసలు ఏ స్థాయిలో ఉంటాయో విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిని హేళన చేస్తూ (బాడీ షేమింగ్) రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్టులు సదరు సెలబ్రిటీలను బాధకు గురిచేస్తుంటాయి. గోవా బ్యూటీ ఇలియానా కూడా శరీరాకృతిపై వేధింపుల్ని ఎదుర్కొన్నారట.. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ – ‘‘ఇన్ స్టాగ్రామ్లో నా శరీరాకృతి విషయంలో వేధింపులకు గురికావడం నాకు కొత్త కాదు. ఆ మాటకొస్తే ఇన్స్టాగ్రామ్ లేని రోజుల్లోనే.. నా బాల్యం నుంచే ఇలాంటి వేధింపులను భరిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారు. నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా? నీ కాళ్లు అలా ఎందుకున్నాయి? వంటి ప్రశ్నలను సంధిస్తుంటారు. సోషల్ మీడియాలో నాకు వచ్చే మెసేజెస్లో కనీసం 10 మెసేజ్లు ఇలాంటివే ఉంటాయి. ఆ ప్రశ్నలతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి. నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుంది.. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలి. మాటల రూపంలో నెటిజన్లు పెట్టే హింసను పట్టించుకోవద్దని అనుకొంటాను.. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదనకు గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి. వేధింపులను తట్టుకోలేక ఓ సందర్భంలో వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మార్ఫియా అంటారట. ఈ రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేవాళ్లు కామెంట్ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడేది. అయితే ఈ మానసిక వేదన అంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదు. మన గురించి మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. కాగా ఇలియానా ప్రస్తుతం రణ్దీప్ హుడాతో కలిసి ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘బాద్షా హో’ (2017), ‘రైడ్’ (2018) చిత్రాల్లో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. తాజాగా అజయ్, ఇలియానా మరోసారి జోడీ కట్టనున్నారనే టాక్ బీ టౌన్లో వినిపిస్తోంది. అజయ్ దేవగణ్ ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో అజయ్, ఇలియానా జంటగా కనిపించనున్నారట. ఇది నిజమైతే వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టినట్లు అవుతుంది. -
‘పిట్ట కథలు’ వెబ్సిరీస్ హిరోయిన్లతో స్సేషల్ చిట్చాట్
-
తెలుగు తెరపై బాలీవుడ్ భామల గ్రాండ్ ఎంట్రీ
ప్రతి ఏడాది తెలుగు తెరపై బాలీవుడ్ భామలు ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మధ్య తెలుగు చిత్రపరిశ్రమ బాక్సాఫీస్ స్టామినా పెరగడంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్వైపు దృష్టి పెడుతున్నారు. హిందీ సినిమాల్లోని పాపులర్ పాటల్లో ‘బొంబై సే ఆయా మేరీ దోస్త్’ (ముంబై నుంచి ఫ్రెండ్ వచ్చారు) ఒకటి. సినిమాకి భాషా భేదాలు లేవు. హిందీ దోస్తులు ఇక్కడ... ఇక్కడి దోస్తులు అక్కడ సినిమాలు చేస్తుంటారు. రానున్న రోజుల్లో తెలుగు తెరపై ప్రత్యక్షం కానున్న కొందరు హిందీ హీరోయిన్లపై స్పెషల్ స్టోరీ. ఆర్ఆర్ఆర్తో ఆలియా ఎంట్రీ ఖరార్ బీ టౌన్లో టాప్ హీరోయిన్స్లో ఆలియా భట్ ఒకరు. ఈ క్రేజీ హీరోయిన్ను తెలుగుకి తీసుకువచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ఆలియా భట్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. చరణ్కు జోడీగా కనిపిస్తారు ఆలియా. ఇదే చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా నటిస్తున్నారు ఐరిష్ నటి ఒలీవియా మోరిస్. ఈ హీరోయిన్కు కూడా ఇది తొలి తెలుగు సినిమానే. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. గ్రాండ్ ఎంట్రీ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం గ్లామర్ పాత్రలే కాదు.. ‘చప్పాక్’లో యాసిడ్ బాధితురాలికి గురైన అమ్మాయిగా డీ–గ్లామరస్ రోల్ చేశారు. ‘పద్మావత్’ వంటి పీరియాడికల్ సినిమా కూడా చేశారు. ఇప్పుడు దీపికా ప్రతిభ తెలుగు తెరపైకి రానుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు దీపికా పదుకోన్. ఈ సినిమా షూటింగ్ వేసవి తర్వాత ఆరంభం అవుతుంది. అనన్యా ఆగయా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో వస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’లో హీరోయిన్గా చేస్తున్నారు అనన్యా పాండే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ‘లైగర్’ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ సినిమాకు ముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ పత్నీ ఔర్ ఓ, ఖాలీ పిలీ వంటి హిందీ సినిమాల్లో నటించారు అనన్యా. ప్రియాంకా, జోయా మధ్యలో రానా! మరాఠీ ఫిల్మ్ ‘ఏకుల్తి ఏక్’ (2013) సినిమాతో నటిగా శ్రియా పిల్గొన్కర్ జీవితం మొదలైంది. ఆ తర్వాత హిందీలో ప్యాన్, హౌస్ అరెస్ట్ వంటి సినిమాలు చేశారు శ్రియ. తాజాగా రానా ‘అరణ్య’ సినిమాలో ఓ లీడ్ క్యారెక్టర్ చేశారామె. శ్రియ యాక్టర్ మాత్రమే కాదు.. డైరెక్టర్గా కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా చేశారు. స్విమ్మింగ్లోనూ ప్రావీణ్యత ఉంది. ‘అరణ్య’ సినిమా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కాడన్’గా మార్చి 26న విడుదల కానుంది. ఇదే సినిమాతో న్యూఢిల్లీకి చెందిన జోయా హుస్సేన్ టాలీవుడ్ ఎంట్రీ కూడా జరుగుతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘ముక్కాబాజ్’ (2018) సినిమాతో నటిగా జోయా హుస్సేన్ స్టార్ట్ అయ్యారు. సయీ.. వచ్చిందోయీ హీరోయిన్గా తొలి ప్రయత్నంలోనే సల్మాన్ ఖాన్ వంటి టాప్ స్టార్ సినిమాలో నటించే అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఈ అదృష్టం సయీ మంజ్రేకర్కు దక్కింది. సల్మాన్ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ సయీ మంజ్రేకర్. ఇప్పుడు ఈ భామ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించబోతున్నారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ‘గని’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. అందాల ఊర్వశి ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో హీరోయిన్గా హిందీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఊర్వశీ రౌతేలా. ఇప్పుడు ఊర్వశి మనసు తెలుగువైపు మళ్లింది. మోహన్ భరద్వాజ్ డైరెక్షన్లో వస్తోన్న హిందీ, తెలుగు ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో నటిస్తున్నారు ఊర్వశి. ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘బ్లాక్ రోజ్’ సినిమాకు తెలుగు దర్శకుడు సంపత్ నంది కథ అందిస్తున్నారు. జాక్వెలిన్... ఇన్ ప్రభాస్ ‘సాహో’ సినిమాలో ‘బ్యాడ్ బాయ్’ పాటలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ను కుర్రకారు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సాంగ్ నిడివి తక్కువే. కానీ ఇప్పుడు ఓ ఫుల్లెంగ్త్ లీడ్ క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు జాక్వెలిన్. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నిధీ అగర్వాల్తో పాటు జాక్వెలిన్ కూడా హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. వీరితో పాటు మరికొంతమంది ఉత్తరాది భామలు కూడా తెలుగుతెరపై కనిపించనున్నారు. చదవండి: రన్నింగ్ బస్లో లిప్లాక్.. ‘రొమాంటిక్’గా పూరీ కొడుకు స్టేజ్పైనే..హీరోను 'అన్నా' అని పిలిచిన హీరోయిన్ -
మూవీ క్విజ్: రవితేజ ‘భద్ర’లో హీరోయిన్ ఎవరు?
సినీ సెలబ్రిటీలు తమ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో చాలా ఆసక్తి చూపుతారు. తమ సినిమాలను వారు పుట్టిన లక్కీ నెలలో ప్రకటించడం, విడుదల చేయటం వంటివి చేస్తారు. తాజాగా ఫిబ్రవరి నెలలో పుట్టి, ప్రేక్షకుల మనసు దోచుకున్న పులువురు మూవీ స్టార్స్ గురించి క్విజ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిమ్ జిమ్.. జిమ్..
హీరోయిన్లు మెరుపుతీగలు. ఎప్పుడూ నాజూకుగానే ఉండాలి. స్క్రీన్ మీద స్లిమ్గా కనిపించాలి. జీరో సైజ్తో సందడి చేయాలి. హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని ప్రేక్షకులు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. వాటిని నిలబెట్టుకోవడానికి హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇష్టమైన వాటికి నో చెప్పాల్సి ఉంటుంది. నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి జిమ్లో బరువులు ఎత్తాల్సి ఉంటుంది. అయితే ఇవేం కష్టం కాదంటున్నారు కొందరు హీరోయిన్లు. ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. రిమ్ జిమ్ అంటూ ఉల్లాసంగా జిమ్లో కసరత్తులలో మునిగిపోయిన హీరోయిన్ల వివరాలు చూద్దాం. ‘మన శరీరాన్ని సరైన షేప్లో ఉంచేది మన కష్టం కాదు.. మన మెదడు. దాన్ని శ్రద్ధగా, ఫోకస్గా ఉంచితే ఏదైనా చేయొచ్చు. ఫోకస్ ఎక్కడుంటుందో ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది’ అంటారు రాశీ ఖన్నా. జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోను, ఫోటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం వెయిట్ను కంట్రోల్లో పెట్టే పనిలో పడ్డారు పాయల్ రాజ్పుత్. 63 కేజీల నుంచి 58 కేజీల వరకూ వచ్చారట ఆమె. ‘ఈ ప్రయాణం ఎంత వరకూ సాగుతుందో చూద్దాం. మెల్లిగా అయినా నేను అనుకున్న గోల్ చేరతాను’ అంటూ కొత్త లుక్ ఫోటోలను షేర్ చేశారు పాయల్ రాజ్పుత్. ‘మన బలం, బలహీనత రెండూ మన మెదడే. దాన్ని సరిగ్గా ట్రైన్ చేస్తే చాలు. ఫిజికల్ ట్రైనింగ్ ఈజీగా చేసేయొచ్చు’ అంటారు సమంత. ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలు సమంత వర్కౌట్స్ అస్సలు మిస్ కారని అర్థం చేసుకోవచ్చు. ‘మనకు 24 గంటలున్నాయి. అందులో ఒక్క గంట అయినా శరీరం మీద దృష్టి పెట్టడానికి ఉపయోగించాలి’ అంటారు రష్మికా మందన్నా. ‘శరీరాన్ని తరచూ కదిలిస్తే మనం చెప్పిన మాట వింటుంది’ అంటారు రకుల్ ప్రీత్ సింగ్. ‘ఫిట్నెస్లో కావాల్సింది స్పీడ్ కాదు.. శ్రద్ధ. రోజూ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది ముఖ్యం’ అంటారు లావణ్యా త్రిపాఠి. వీళ్లందరూ షేర్ చేసిన ఫోటోలను పక్కన చూడొచ్చు. -
అవును... మాకు కాళ్లున్నాయి
కేరళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గత రెండు రోజులుగా తమ కాళ్లు కనిపించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘ఎస్ వుయ్ హావ్ లెగ్స్’ అని పెడుతున్నారు. ఇప్పుడక్కడ అది ఉద్యమం. అక్కడి వర్ధమాన నటి అనస్వర రాజన్ ‘షార్ట్స్’ ధరించి పెట్టిన ఫొటోను చూసి కేరళలోని పురుషులు ‘అమ్మాయిలు ఇలా చేయొచ్చా’ అని ట్రోల్ చేయడమే ఇందుకు కారణం. అనస్వర రాజన్కు మద్దతుగా దేశ విదేశాలలోని మహిళా నెటిజన్స్ కూడా తమ కాళ్ల ఫొటోలు పెట్టి మగవారిని హెచ్చరిస్తున్నారు. తమ శరీరం తమ ఇష్టం అని తేల్చి చెబుతున్నారు. ఇటీవల తెలుగులో ‘అల వైకుంఠపురములో’ సినిమా ‘లవ్ ట్రాక్’ అచ్చు హీరోయిన్ కాళ్ల చుట్టే తిరిగింది. అందులో హీరో అయిన అల్లు అర్జున్ హీరోయిన్ అయిన పూజాహెగ్డే కాళ్లను చూసే ప్రేమిస్తాడు. ‘సిరివెన్నెల’ను అరువు తెచ్చుకుని పాట కూడా పాడతాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది కూడా. సినిమా మొత్తం ఆ హీరోయిన్ కాళ్లు కనిపించేలానే దుస్తులు ధరించి ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. కాళ్లు కనిపించడాన్ని అభ్యంతరం పెట్టే రోజులు దాటేశామని స్త్రీలు భావిస్తున్నారు కూడా. కాని కాదు. వివాదం రేపిన అనశ్వర రాజన్ ఫొటో, భర్త ఫాహద్ ఫాజిల్తో నజ్రియా నజీమ్ సెప్టెంబర్ 12– శనివారం కేరళలో జరిగిన ఒక సంఘటనే ఇందుకు తార్కాణం. అక్కడి వర్ధమాన నటి అనుస్వర రాజన్ తన తాజా ఫొటోను ఆ రోజున ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో ఆమె ‘షార్ట్స్’లో ఉంది. అలాంటి ఫొటోలు సర్వసాధారణమైనవే. అయినప్పటికీ కేరళలో పురుషులు ఆమె మీద దాడి మొదలెట్టారు. ఆమె ఫొటో కింద కామెంట్స్లో ‘పద్దెనిమిదేళ్ల అమ్మాయివి. ఇలా చేయొచ్చా’ అని ఒకరు, ‘మంచి అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించరు’ అని మరొకరు వందల మంది కామెంట్లు చేశారు. దాదాపు 13 వేల కామెంట్లు నడిచాయి. మొత్తం మీద ఆ కామెంట్స్ సారాంశం ‘దుస్తులను బట్టి మర్యాద’. ‘స్త్రీ తన శరీరాన్ని దాచుకోవాలి’. ‘స్త్రీ అనవసరంగా తన అవయవాలను బహిర్గతం చేయకూడదు’, ‘ఇలా చేయడం కామ ప్రకటన చేయడం’... గట్రా గట్రా అనే. ఇంకా చెప్పాలంటే స్త్రీ శరీరానికి మాత్రమే ‘లైంగికత’ ఉంటుంది. స్త్రీ శరీరం మాత్రమే ‘సంస్కృతికి ప్రతీక’. ‘ఆమె శరీరాన్ని చూపించడం అంటే సంస్కృతిని నాశనం చేయడమే’. పార్వతి తిరువోతు అనశ్వర రాజన్ ప్రతిభ కలిగిన అమ్మాయి. ఆమె నటించిన ‘ఉదాహరణం సుజాత’, ‘తన్నీర్ మథన్ దినన్గళ్’ సినిమాలు హిట్ అయ్యాయి. తనమీద వచ్చిన కామెంట్స్కు ఆమె రియాక్ట్ అయ్యింది. ‘నేనేం చేస్తున్నాననే దాని గురించి ఆందోళన చెందకండి. నేను చేస్తున్నదాని గురించి మీరెందుకు ఆందోళన చెందుతున్నారో దానిగురించి ఆందోళన చెందండి’ అని కామెంట్ పెట్టింది. అయితే మరో మలయాళ నటి రీమా కళింగల్ తాను బికినిలో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘హ్యాష్టాగ్ ఎస్ వుయ్ హావ్ లెగ్స్’ ఉద్యమాన్ని మొదలెట్టింది. ‘స్త్రీలకు మెదడు ఉంది. భుజాలున్నాయి. హక్కులున్నాయి. కలలున్నాయి. తెలివితేటలు ఉన్నాయి. కాళ్లు కూడా ఉన్నాయి. ఆమె తనను ఎలా వ్యక్తపరుచుకోవాలనుకుంటున్నదనేది ఆమె ఇష్టం. దీనికి వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రతిష్టను ముడిపెట్టాల్సిన అవసరం లేదు’ అని ఈ ఉద్యమ ప్రకటనలో భావాన్ని మరికొంత మంది నెటిజన్లు పోస్టర్లుగా విడుదల చేశారు. దీనికి వెంటనే మలయాళ ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు స్పందించారు. ప్రసిద్ధ హీరో ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ కూడా తన భర్తతో పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘లెగ్డే’ అని క్యాప్షన్ రాసింది. ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ఫేమ్ మలయాళ నటి పార్వతి తిరువోతు, అహనా కృష్ణ లాంటి హీరోయిన్లు అందరూ తమ కాళ్ల ఫొటోలు పెడుతున్నారు. ‘మగవాళ్ల శరీరాలు ఆడవాళ్ల శరీరాలు ఒకటే. మగవాళ్లు పొట్టి దుస్తులు ధరిస్తే రాని కామెంట్లు ఆడవాళ్లు ధరించగానే వచ్చేస్తాయి. మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం. మీ ఇష్టం కాదు’ అని అహనా కృష్ణ రాసింది. ఇది మగస్వామ్యపు వ్యవస్థ అనేది వాస్తవం. ఇక్కడ స్త్రీలకు బంధనాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాళ్లు కనిపించినా కూడా సమస్య చేసేంతగా వారికి బంధనాలు వేస్తుంటే వారింక ఏ విధంగా అడుగు ముందుకేస్తారనేది కూడా ప్రశ్నే. తెలుగునాట కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. గతంలో పార్లమెంట్లో నటుడు మురళీమోహన్ స్త్రీల దుస్తుల గురించి ‘జాగ్రత్తలు’ చెప్పి తీవ్రమైన నిరసనను ఎదుర్కొన్నారు. ఇటీవల యాంకర్ అనసూయ ఒక టీవీ షోలో ధరించిన బట్టలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఈ సాంఘిక భద్రత, సంఘ మర్యాదల బరువును తమ శరీరాల మీద వేయడం గురించి స్త్రీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ‘స్త్రీలు శరీరాలను చూపడం వల్లే అత్యాచారాలు’ అనే మూస అభిప్రాయానికి ‘మరి చిన్న పిల్లల మీద పండు ముదుసలుల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?’ అని నిలదీస్తూనే ఉన్నారు. స్త్రీని భోగవస్తువుగా చూసే దృష్టి, ఆమె శరీరాన్ని లైంగిక కారకంగా చూసే దృష్టి పోనంత కాలం ఇలాంటి హాష్టాగ్ ఉద్యమాలు మరిన్ని జరుగుతూనే ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ -
ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’
స్కూల్కి వెళ్లేటప్పుడు క్లాస్మేట్స్ కావాలి. చదివింది షేర్ చేసుకోవడానికి.. అల్లరి పనులు చేయడానికి. పనిలో ఉన్నప్పుడు ఆఫీస్ మేట్స్ కావాలి పని పంచుకొని ఒత్తిడి తగ్గించుకోవడానికి. సినిమా విషయానికి వస్తే గ్రీన్మ్యాట్ కావాలి గ్రాఫిక్స్ ద్వారా కష్టాన్ని తగ్గించుకోవడానికి. గ్లామర్ ఇండస్ట్రీలో వాళ్లకు యోగా మ్యాట్ కూడా కావాలి ఫిట్నెస్ పెంచుకోవడానికి. ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’ మ్యాటర్ చదవండి.. అర్థమైపోతుంది. కరోనా వల్ల ఎవ్వరం ఇంట్లో నుంచి కాలు కదపడానికి లేదు. ఫిట్నెస్ ప్రియులకు ఇది కాళ్లు కట్టేయడంలాంటిదే. కానీ హీరోయిన్లు ఫిట్గా ఉండాలి. ఫిట్నెస్ని అశ్రద్ధ చేయకూడదు. ఫిట్గా స్క్రీన్ మీద కనిపించాలి. అందుకే నోరు కట్టేస్తూ, జిమ్ చుట్టేస్తారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో జిమ్ సెంటర్ కి వెళితే రిస్క్ని వర్కవుట్ తో తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్య అందాల తారలు ఎక్కువగా ‘యోగా మ్యాట్’తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. మ్యాట్రేంటంటే ... హీరోయిన్లందరూ తరచూ యోగాసనాలు చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే క్లిష్టమైనవి నేర్చుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈ కరోనా లాక్ డౌన్ హీరోయిన్లకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. దీంతో కొత్త ఆసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. కొందరు టార్గెట్ ను చేరుకున్నారు. మరికొందరు చేరుకుంటున్నారు. మ్యాట్ మీద ఫీట్లు చేస్తున్న హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘లాక్ డౌన్లో గార్డెనింగ్తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నా’ అని సమంత తెలిపారు. యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం వేయాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు సమంత. రకుల్కు ఫిట్నెస్ మీద ఎంత శ్రద్ధో అందరికీ తెలిసిందే. యోగా కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు, మన జీవిత విధానానికి సంబంధించింది అంటారామె. ‘వర్కౌట్లో క్రమం తప్పేది లేదు’ అంటున్నారు తమన్నా. ఎప్పటికప్పుడు వర్కౌట్ ఫోటోలతో అభిమానులనూ వర్కౌట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారామె. ధనురాసనం నేర్చేసుకున్నారట పూజా హెగ్డే. ‘యోగా చేస్తే తెలియని సంతోషం’ అంటున్నారు పూజ. ‘ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్ చేయండి.. నేను చేస్తున్నా’ అంటారు రాశీ ఖన్నా. అదా శర్మ, తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. -
హీరోయిన్స్; భ‘లేడీ విలన్లు’
హీరోయిన్స్ అంటే...? ఐ క్యాండీగా స్క్రీన్ను కలర్ఫుల్గా మార్చేవాళ్లు. బబ్లీనెస్తో హీరోను బబుల్గమ్లా చుట్టుకునేవాళ్లు. పాటల వరకూ కనిపించి వెళ్లిపోయేవాళ్లు. హీరోయిన్ల పాత్రల డిజైన్లో మనకు తరచూ వినిపించే కామెంట్స్ ఇవి. హీరోయిన్కి స్ట్రాంగ్ రోల్స్తో వస్తున్న సినిమాలు తక్కువే. మెల్లిగా ఈ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల ఆదరణ పెరుగుతోంది. హీరోయిన్లు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. నెగటివ్ రోల్స్లోనూ కనిపిస్తున్నారు. సీత మంచి అమ్మాయి అనే పాత్రలే కాకుండా నెగటివ్ సైడ్ని ఆవిష్కరించి భలేడీ విలన్లు అనిపించు కుంటున్నారు. విలన్ – నయన్ హిందీ చిత్రం ‘అంధాధూన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇందులో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రకు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టబు పోషించిన పాత్రకు నయనతారను సంప్రదించినట్టు సమాచారం. నయన్ కూడా ఈ ప్రాజెక్ట్కి సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయానికి వస్తే.. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. సినిమా కథకు కీలకమైన పాత్ర ఇది. నయనతార టెర్రరిస్ట్ స్యామ్ సమంత తన కెరీర్లో ఫుల్ఫామ్లో ఉన్నారు. కమర్షియల్ సక్సెస్తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’తో మంచి ఫామ్లో ఉన్నారు. తాజాగా వెబ్స్పేస్లోకి అడుగుపెడుతున్నారు స్యామ్. వెబ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ రెండో పార్ట్లో సమంత కూడా జాయిన్ అయ్యారు. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటించారు. టెర్రరిస్ట్గా కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానుంది. సమంత కనులతో దోచారు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఫిబ్రవరిలో విడుదలయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇందులో రీతూ అమాయకంగా కనిపించే దొంగ పాత్ర చేశారు. తెలివిగా ప్లాన్ చేసి మోసాలు చేశారు. ‘పెళ్లి చూపులు’తో ఒకలాంటి ఇమేజ్ ని సంపాదించుకొని ఇలాంటి పాత్ర చేయడంలో రీతు విభిన్నత కనిపిస్తుంది. ‘కనులు కనులను..’ చిత్రంతో తాను నెగటివ్ క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నారు రీతూ వర్మ. ‘కనులు కనులు దోచాయంటే’లో రీతూ వర్మ సీతతో వీజీ కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ పాత్రలో కొంచెం నెగటివ్ యాంగిల్ ఉంది. తనది పక్కా ప్రాక్టికల్ బిజినెస్ ఉమెన్ పాత్ర. డబ్బు కోసం తెలివితేటలతో మోసం చేయడం తప్పు కాదని నమ్మే పాత్ర తనది. అందులో పెద్ద తప్పు కూడా లేదనుకుంటుంది ఆ పాత్ర. అప్పటివరకూ పాజిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన కాజల్ ‘సీత’లో అందుకు భిన్నంగా కనిపించి, ప్రసంశలు దక్కించుకోగలిగారు. ‘సీత’లో కాజల్ అగర్వాల్ బోల్డ్ ఎంట్రీ తొలిసారి తెరపై కనబడినప్పుడే ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకుంటారు ఎవరైనా. కానీ పాయల్ రాజ్పుత్ తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 10’లో భిన్నమైన పాత్ర ఎంచుకున్నారు. ఈ సినిమాలో కొంచెం హాట్గా కనిపించారు. అలాగే సినిమాలో ఆమెది విలన్ పాత్ర. స్వార్థం కోసం ప్రేమించి మోసం చేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. మామూలుగా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం కష్టం అంటారు. ఆ విధంగా తొలి సినిమాతోనే పాయల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ నల్ల విలన్ తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్గా, లేడీ విలన్గా తమిళ సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ‘నల్ల’ విలన్ (మంచి విలన్) అని పేరు తెచ్చుకున్నారు కూడా.. ఆ మధ్య ‘సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణ’ చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. ‘సర్కార్, తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన ఎత్తులకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’లోను పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు వరలక్ష్మి. వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ‘భలే’డీ విలన్ అనిపించుకుంటున్నారు వరలక్ష్మి. ‘పందెం కోడి 2’లో వరలక్ష్మీ మహా విలన్ అనిపించుకోవాలని... హీరోయిన్గా 49 సినిమాలు పూర్తి చేశారు హన్సిక. 50వ సినిమా మైలురాయి గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రం చేస్తున్నారామె. ఇందులో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ‘హన్సిక మహా విలన్’ అని అందరితో అనిపించుకోవాలనే పట్టుదలతో నటనపరంగా చాలా కేర్ తీసుకున్నారట ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘మహా’లో హన్సిక ‘పాటల కోసం హీరోయిన్’ అనే గ్లామరస్ క్యారెక్టర్స్ కే పరిమితం కాకుండా వీలు కుదిరినప్పుడల్లా విలన్ పాత్రల్లో భ‘లేడీ విలన్లు’ అనిపించుకుంటున్న నాయికలను అభినందించాల్సిందే. -
బాలికళు
భమ్ చికి చికి భమ్చికి భమ్ భమ్ చికి చికి భమ్బాంబేకి వెళ్లారు సౌత్ బాలికలు కళ ఉంటేనే కదా బాలికలకు బాలీవుడ్ ఎంట్రీ దొరికింది అందుకే మన హీరోయిన్లు బాలికలు కాదు బాలికళు. బాలీవుడ్లో చక్రం తిప్పాలని చాలామంది కథానాయికలు కోరుకుంటారు. అప్పట్లో దక్షిణాది నుంచివెళ్లిన హేమ మాలిని, శ్రీదేవి, జయప్రద వంటివారు బాలీవుడ్వారిని ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత మలయాళీ బ్యూటీ విద్యాబాల గురించి చెప్పక్కర్లేదు.మంచి మంచి సినిమాలు చేస్తూ హిందీలోనే సెటిలయ్యారు.ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న సౌత్ కథానాయికల్లో కొందరు ‘అప్నా టైమ్ ఆగయా’ అంటూ హిందీలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. డబుల్ ధమాకా సౌత్లో నిత్యామీన కి సూపర్ పేరుంది. అద్భుతమైన నటి. దాదాపు పదేళ్లుగా సౌత్కే పరిమితమైన ఈ మలయాళ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ప్రస్తుతం ‘మిష మంగళ్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు నిత్యామీన . ఇస్రో మార్స్ మిష సక్సెస్ కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో వర్ష అనే శాస్త్రవేత్తగా నటిస్తున్నారు నిత్యా. మరోవైపు ఆమె ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్లో అభిషేక్ బచ్చ సరసన కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో మాధవ నటించారు. ఇలా హిందీ సినిమా, వెబ్ సిరీస్లతో ఒకేసారి నిత్యామీన డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. ఇప్పుడుకథానాయికగా... ‘అర్జు రెడ్డి’ సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకున్నారు కథానాయిక షాలినీ పాండే. ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమాలతో ఆమె డైరీ బాగానే ఫుల్ అవుతోంది. ఈ టైమ్లోనే ఆమె కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కేలా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్యా రావల్ హీరోగా ‘బాంఫాడ్’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా నటించనున్నారు షాలినీ పాండే. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించనున్నారు. రంజన్ చంఢీలా అనే రచయిత ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు ఓ రెండు హిందీ సినిమాల్లో షాలినీ కనిపించారు కానీ కథానాయికగా ఆమెకు చా రావడం ఇదే తొలిసారి. ఇక కల్యాణ్రామ్తో కలిసి ఆమె నటించిన తెలుగు చిత్రం ‘118’ మంచి విజయాన్ని అందుకుంది రెండుభాషలకు హాయ్ ‘యుటర్న్’ సినిమాలో అద్భుతంగా నటించి ఆడియ ్స దృష్టిని తనవైపు తిప్పుకున్నారు కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయి గా నటిస్తున్నారామె. అలాగే బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్కు సై చేశారు శ్రద్ధా. సౌత్లో ఇంత బిజీగా ఉన్న ఈ కన్నడ భామ బాలీవుడ్లో కూడా బిజీ కావాలని బాలీవుడ్ వైపు టర్న్ తీసుకున్నారు. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో ‘మిలా టాకీస్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అలీ ఫజల్ హీరోగా నటిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్కి, ‘మిలా టాకీస్’తో బాలీవుడ్కి ఒకేసారి హాయ్ చెప్పారన్న మాట ఈ కన్నడ బ్యూటీ. తిరుగులేని తాప్సీ సౌత్లో కథానాయికగా నిరూపించుకున్నాక బాలీవుడ్ వెళ్లారు తాప్సీ. ఆమె నటించిన చిత్రాల్లో ‘పింక్’ తాప్సీకి మంచి పేరు తెచ్చింది. అంతే.. హిందీలో తాప్సీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బాలీవుడ్లో ఇప్పుడు ఆమె వన్నాఫ్ది బిజియస్ట్ హీరోయి . ‘పింక్’ తర్వాత ఆమె పది బాలీవుడ్ సినిమాలు చేశారంటే ఆమెకు ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు హిందీలో బిజీగా ఉన్నా సౌత్ని కూడా వదలడంలేదు తాప్సీ. ‘ఘాజీ, ఆనందోబ్రహ్మా, నీవెవరో’ సినిమాలు చేశారు. లేటెస్ట్గా ఆమె చేసిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘గేమ్ఓవర్’ రిలీజ్కు రెడీగా ఉంది. హిందీలో ‘బద్లా’ రిలీజ్కి రెడీ అవుతోంది. ‘మిషన్ మంగళ్’ ఆన్ సెట్స్లో ఉంది. ఇది కాకుండా హిందీలో మరో చిత్రం అంగీకరించారు. బోల్డ్ ఎంట్రీ తమిళ, తెలుగు భాషల్లోని సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు రెజీనా. గతేడాది ‘ఆంఖే 2’ చిత్రంతో ఆమెబాలీవుడ్ తెరపై కనిపించాల్సింది కానీ కుదర్లేదు. ఈ ఏడాదికుదిరింది. ఈ నెల విడుదలైన ‘ఏక్ లడ్ఖీ కో దేఖా తోఏసా లగా’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రెజీనా. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాలో లెస్బియ గా బోల్డ్ క్యారెక్టర్ చేశారామె. రెజీనా యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. మరి.. రెజీనాకు మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వస్తాయా? వేచి చూద్దాం. బాణంబాలీవుడ్ వైపు ‘ముని, విజయదశమి, బాణం’ వంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించారు వేదిక ముఖ్యంగా ‘ముని’, ‘బాణం’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు హిందీ చిత్రపరిశ్రమకు కథానాయికగా బాణం వేస్తున్నారు. మలయాళ దర్శకుడు ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో హిందీలో ‘ది బాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఇమ్రా హష్మి హీరోగా నటిస్తున్నారు. ఇందులోనే కథానాయికగా నటిస్తున్నారు వేదిక. స్పానిష్ ఫిల్మ్ ‘ది బాడీ’ చిత్రానికిది హిందీ రీమేక్. ఇక సౌత్లో ‘ముని’ ఫోర్త్ పార్ట్ ‘కాంచన 3’లో ఒక హీరోయి గా నటించారు వేదిక. ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. రూల్ బ్రేక్ సౌత్ కథానాయికలకు హిందీ సినిమాల్లో అవకాశం రావాలంటే ఆల్రెడీ దక్షిణాదిన కొన్ని సినిమాలు చేసి, ప్రూవ్ చేసుకోవాలనే నియమాన్ని బ్రేక్ చేశారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. హీరోయి గా ఆమె నటించిన ఒక్క సినిమా కూడా తెరపైకి రాకుండానే బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. ‘శ్రీదేవి బంగ్లా’ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ప్రశాంత్ మాబుల్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఇది నటి శ్రీదేవి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అని ’శ్రీదేవి బంగ్లా’ హెడ్ లై నిలిచింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్రనిర్మాతలకు నోటీసులు కూడా పంపారు. కానీ చిత్రబృందం బెదరలేదు. శ్రీదేవికి, ఈ సినిమాకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంతకీ సౌత్లో ప్రియా ప్రకాశ్ ఒక్క సినిమాలో కనిపించక ముందే నార్త్లో ఎలా చా స కొట్టేయగలిగారంటే.. అంతా ‘కన్ను మహిమ’. తొలి సినిమా మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. (‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో విడుదలైంది) టీజర్లో జస్ట్ కన్ను కొట్టే సీ తో సోషల్ మీడియా సపోర్ట్తో స్టార్ అయిపోయారామె. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ ఆమెను పిలిచింది. ఇప్పుడు ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్తో మరోసారి హైలైట్ అయ్యారు. ఇలా టీజర్లతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారనిపిస్తోంది. అన్నట్లు టీజర్తో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ‘ఒరు అదార్ లవ్’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరి.. ‘శ్రీదేవి బంగ్లా’ అయినా ప్రియాకి సక్సెస్ రుచిని చూపిస్తుందా? నచ్చినకథతో ఎంట్రీ రిజల్ట్, రిలీజ్లు పక్కనపెడితే సౌత్లో రెండేళ్లలో అరడజను సినిమాలు చేశారు మేఘా ఆకాష్. ఆమె తెలుగులో నటించిన ‘లై, ఛల్మోహ రంగ’ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’లో మేఘాకు మంచి రోల్ దక్కింది. ఆమెకు బాలీవుడ్ నుంచి చాలా పిలుపులొచ్చాయి కానీ నచ్చిన స్క్రిప్ట్తో కబురు రాలేదట. ఈ మధ్య విన్నవాటిలో ‘శాటిలైట్ శంకర్’ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇర్ఫా కమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూరజ్ పాంచోలి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను జులైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈసారి ప్రొఫెషనల్ ట్రిప్ సౌత్లో కథానాయికగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు నటి అమలాపాల్. అటు హీరోయిన్గా గ్లామర్ పాత్రలే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. రీసెంట్గా తమిళ మూవీ ‘రాక్షసన్’ అనే సినిమాతో మంచి హిట్ సాధించారామె. ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేశారు. అర్జు రామ్పాల్ హీరోగా హిందీలో రూపొందనున్న ఓ థ్రిల్లర్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించనున్నారు. నరేశ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా హిమాలయాల్లో గడపడం అమలాపాల్కు అలవాటు. ఈ సినిమాలో ఒక షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు. ప్రొఫెషనల్గానూ హిమాలయాలకు వెళ్లే అవకాశం రావడంతో ఆమె చాలా ఎగై్జటెడ్గా ఉన్నారట. అంతేకాదు కొంతకాలం అమలా పాల్ ఢిల్లీలో ఉన్నారు. సో.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేదు. -
హారోయిన్స్
కథానాయికలు లేటెస్ట్ ట్రెండ్కి మారిపోయారు. ఓన్లీ గ్లామర్, సాంగ్స్కే కాదు. యాక్షన్ సినిమాలు చేయడానికైనా, బయోపిక్స్లో ఒదిగిపోవడానికైనా, థియేటర్స్లో ఆడియన్స్ను భయపెట్టడానికైనా సై అంటున్నారు. వారి ఉత్సాహాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఆడియన్స్ను భయపెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి భయమే అభయంగా బాక్సాఫీస్ వద్ద వెండితెర ఆత్మలుగా హారర్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్న కొందరి హారోయిన్స్ గురించి తెలుసుకుందాం. ఐరాగా.. అందాల తార రెండేళ్ల క్రితం ‘డోరా’ సినిమాతో భయపెట్టడానికి ఆడియన్స్ను థియేటర్స్లోకి పిలిచారు నయనతార. కానీ ప్రేక్షకులు అంతగా భయపడలేదు. ఇప్పుడు ‘ఐరా’ సినిమాతో మరో సారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో నయనతార డబుల్ రోల్ చేయగా ఒకటి డీ–గ్లామర్ రోల్ కావడం విశేషం. కేఎమ్. సర్జున్ దర్శకత్వం వహించిన ‘ఐరా’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. నయనతార ట్రిపుల్ టెర్రర్ కథానాయిక అంజలి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా లిస్ట్ను చెక్ చేస్తే అందులో మూడు హారర్ సినిమాలు (గీతాంజలి 2, ఓ, లీసా)ఉన్నాయి. 2004 లో వచ్చిన ‘గీతాంజలి’ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్కు ప్రిపేర్ అవుతున్నారు. మరో హారర్ మూవీ ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు త్రీడీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఇక ‘ఓ’ సినిమా దగ్గరకు వస్తే... తన చుట్టూ ఏం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుని భయపడే క్యారెక్టర్లో అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకుడు. ఇలా.. ఈ ఏడాది ట్రిపుల్ హారర్ థమాకా ఇవ్వనున్నారు అంజలి. అంజలి మహా భయం తన సినీ కెరీర్లో 50వ చిత్రాన్ని కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు హన్సిక. ఆ ఆలోచనలోనే ‘మహా’ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. హారర్ అండ్ సస్పెన్స్తో కూడిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ వివాదం అయ్యాయి. కానీ, టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు డిఫరెంట్ పోస్టర్స్ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. హన్సిక ఫాంటసీ హారర్ ప్రస్తుతం సౌత్లో మంచి బిజీగా ఉన్నారు రాయ్లక్ష్మీ. కన్నడలో ‘ఝాన్సీ’, తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ సినిమాల షూటింగ్స్ను కంప్లీట్ చేసిన ఆమె ‘సిండ్రెల్లా’ అనే ఫ్యాంటసీ కమ్ హారర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది. రాయ్లక్ష్మీ థ్రిల్లింగ్ హారర్ థియేటర్లో ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాత ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి జంకేలా ఉన్నాయి ఆ సినిమాలో హారర్ సీన్స్. ఆ తర్వాత అనుష్క ‘పంచాక్షరి, భాగమతి’ వంటి సినిమాలను చేసినప్పటికీ ఆ రేంజ్ హిట్ను సాధించలేకపోయారనే చెప్పొచ్చు. మళ్లీ ఇప్పుడు ‘అరుంధతి’ రేంజ్లో ఆడియన్స్ను హడలెత్తించడానికి రెడీ అవుతున్నారట అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారామె. ఇది కేవలం హారర్ సినిమానే కాదు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయట. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా నటిస్తారు. కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ∙‘భాగమతి’లో అనుష్క ఎక్స్ట్రా ఫియర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆడియన్స్ను బాగానే కంగారు పెట్టారు నందితా శ్వేతా. ఇప్పుడామె ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరి కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ ముఖ్య తారలుగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన నందిత లుక్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘దేవి 2’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన దేవి (తెలుగులో ‘అభినేత్రి’) సినిమాకు ఇది సీక్వెల్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభుదేవా, తమన్నా ముఖ్య తారలు. తమిళంలో ‘నర్మద’ అనే సినిమాకు కమిట్ అయ్యారు నందిత. ఈ సినిమాలో కూడా హారర్ అంశాలు ఉంటాయని టాక్. మరి.. ఈ మూడు సినిమాలతో నందితా ఆడియన్స్కు ఎక్స్ట్రా ఫియర్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. నందితా శ్వేతా హీరోలు కూడా హారర్ జానర్పై దృష్టిపెట్టారు. 2017లో ‘గృహం’ సినిమాతో బంపర్హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ‘అరువమ్’ అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. ‘ముని’ సిరీస్ మూవీస్తో రాఘవ లారెన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టారు. ఆయన తాజా హారర్ మూవీ ‘కాంచన 3’ (ముని 4) ఏప్రిల్లో విడుదల కానుంది. ‘నిను విడని నీడను నేనే’ చిత్రంతో తొలిసారి హారర్ జానర్లో నటిస్తున్నారు సందీప్ కిషన్. ‘చీకట్లో చితక్కొట్టుడు’ వంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిద్ధార్థ్, రాఘవ లారెన్స్ – ముసిమి -
రియల్ తాళి
సినిమాల్లో మన హీరోయిన్లు తాళి కట్టించుకుంటుంటారు.. ఉత్తుత్తిగా! ఇప్పుడు తాళి కట్టించుకుంటున్నారు... బహు తృప్తిగా! మిసెస్లమైనా సినిమాలు మిస్ కొట్టం అని చెబుతున్నారు. మరి.. మీరూ కొట్టండి తాలి. అంటే.. అంటే చప్పట్లు. ‘పై లోకంలో వాడు ఎప్పుడో ముడి వేసేశాడు’... స్క్రీన్ మీద నాగచైతన్య, సమంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో వచ్చే పాట. వినడానికి బాగుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకున్న ఆడియన్స్ మనసు కూడా మురిసిపోతుంది. ఓ ప్రేమ జంట పెళ్లితో తమ బంధాన్ని ముడి పెట్టుకున్నందుకు ఆనందంగా థియేటర్ నుంచి బయటికొచ్చేస్తాం. సినిమా పెళ్లిళ్లను ఎంజాయ్ చేస్తాం. కానీ రియల్గా ఆ స్టార్స్.. ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారంటే చిట్టి గుండెని చిన్నగా గిచ్చినట్లుగా బాధపడిపోతుంటారు కొందరు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ హీరోయిన్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేస్తుందేమోనని కంగారు. ఒకవేళ తను కంటిన్యూ అవ్వాలనుకున్నా అవకాశాలు వస్తాయో రావోనని టెన్షన్. ఒకవైపు అభిమాన కథానాయిక పెళ్లి చేసుకుంటున్నందుకు ఆనందపడినా, స్క్రీన్కి దూరం అవుతుందేమోననే భయం ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్లో చాలామంది అభిమానులకు ఆ భయం పట్టుకుంది. మరి.. ప్రేమించినవాళ్లు ప్రేమించినట్లు పెళ్లి చేసేసుకుంటున్నారు! మొన్న అనుష్కా శర్మ– విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సోనమ్ కపూర్–ఆనంద్ అహూజా ఒకింటివారయ్యారు. మరో రెండు మూడు జంటలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ మిస్సులందరూ మిసెస్లయ్యి, సిల్వర్ స్క్రీన్ని మిస్సవుతారనే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ‘డోంట్ వర్రీ.. మేం సినిమాలను వదలం’ అని హామీ ఇస్తున్నారు. ఇక.. పెళ్లి చేసుకోబోయే జంటల గురించి చెప్పుకుందాం. ప్రిక్ బాలీవుడ్లో ఓ ట్రెండ్ ఉంది. ఏదైనా ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్నారంటే.. వాళ్లిద్దరి పేర్లను కలిపి ఒక పేరుగా పిలుచుకుంటారు. ఉదాహరణకు సైఫ్ అలీఖాన్–కరీనా కపూర్లను ‘సైఫీనా’ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే అనుష్కా శర్మ–విరాట్ కోహ్లీని ‘విరుష్కా’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఓ జంటను ‘ప్రిక్’ అని పిలుస్తున్నారు. ఆ పేరుకి అర్థం ‘గుచ్చుకోవడం’. ఇదేం పేరబ్బా అనుకోకండి. ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ల పేర్లను ‘ప్రిక్’ అంటూ ఒక పేరుగా చేశారు. అంటే.. గుచ్చుకోవడమే కదా. ప్రేమలో ఉన్న ఆ ఇద్దరూ ఆనందంగా ఉన్నా హాలీవుడ్కి వెళ్లాక హిందీ సినిమాలు తగ్గించేసి, ఇప్పుడు పెళ్లికి రెడీ అయి అభిమానుల గుండెల్లో ప్రియాంక ఎప్పుడో ముల్లు గుచ్చేశారు. నిజానికి హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్–మన దేశీ భామ ప్రేమలో పడి ఏడాది కూడా అవ్వలేదు. పైగా ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్నవాడు. అయినా ప్రేమ ముందు వయసు అంకెలు కనబడలేదు. తక్కువ పరిచయంలోనే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా అర్థం చేసుకున్నట్లున్నారు. ఏడడుగులు వేయడానికి రెడీ అయిపోయారు. అసలే హిందీ సినిమాలు తగ్గించేసిన ప్రియాంక పెళ్లి తర్వాత నిక్తో యూఎస్లో సెటిలై, ఇక్కడి సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేస్తారా? ఇప్పట్లో ఆ చాన్స్ లేదు. ఎందుకంటే హిందీలో ఆమె ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాతో పాటు మన ప్రాంతీయ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. అలాగే, ఇప్పట్లో పెళ్లి లేదట. రణ్దీప్ ప్రశ్న ఒకటి.. సమాధానం కూడా ఒకటే. ఆప్షన్స్ నాలుగు ఉంటాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఏంటీ? స్కూల్ డేస్లో రాసిన పరీక్షలు గుర్తొస్తున్నాయా? లేక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గుర్తొస్తోందా? ఇప్పుడీ విషయం ఎందుకంటే హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ముందు ఓ ప్రశ్న ఉంచి, ‘ఒప్పుకుంటారా? కాదంటారా?’ అనడిగితే ‘కాదనను’ అన్నారట. ఆ ప్రశ్న ఏంటంటే.. ‘దీపికా–రణ్వీర్ సింగ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. ఒప్పుకుంటారా? కాదంటారా?’. కరణ్ చెప్పిన సమాధానంతో ఈ ఇద్దరి పెళ్లి ఖరారు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. నవంబర్లో జరగబోయే ఈ వేడుకకు సంబంధించిన పనులు రెండు కుటుంబాల్లోనూ మొదలయ్యాయట. ఇటలీలోని లేక్ కోమోలో ఈ వేడుకను ప్లాన్ చేసుకున్నారట. ఇక్కడివాళ్ల కోసం ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇటీవల బెంగళూరులోని దీపిక స్వగృహంలో ప్రత్యేక పూజ ఏదో జరిగిందని టాక్. అన్నట్లు ముంబైలోని బాంద్రాలో తాను ఉంటున్న ఇంటిని సర్వాంగ సుందరంగా తయారు చేయిస్తున్నాడట రణ్వీర్. ఆ ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయో ఇటీవల దీపిక వెళ్లి చూడటం కొందరి కళ్లల్లో పడింది. ఇంకేం కల్యాణం కరెక్టే అనుకుంటున్నారు. అన్నట్లు ఈ ఇద్దరికీ పెట్టిన పేరు ‘రణ్దీప్’ అట. రణ్బీరాలియా ప్రేమ ఎప్పుడు పుట్టునో ఎవరికీ తెలియదు. పుట్టిన ప్రేమ పది మందికీ తెలియకుండా దాగదు. రణ్బీర్ కపూర్–ఆలియా భట్ల ప్రేమ కహానీ కూడా చాలా త్వరగా బయటికొచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ జంట జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ మొదలైంది ఆ నెలలోనే. ఇద్దరూ కలసి నటిస్తున్న తొలి చిత్రం. సినిమా షూటింగ్ రోజులు పరిగెడుతున్నాయి. ఇద్దరి మనసులూ ప్రేమ వైపు పరుగులు పెట్టాయి. ‘అవునూ.. ఆలియా, మీరు లవ్లో ఉన్నారట?’ అని ఆ మధ్య ఎవరో రణ్బీర్ని అడిగితే – ‘కొత్తగా మొదలైన ఏ రిలేషన్షిప్ గురించైనా అప్పుడే ఏం మాట్లాడతాం’ అన్నాడు. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పడానికి ఇది చాలదా? పైగా.. ఆ మధ్య రణ్బీర్ తల్లి నీతూని ఆలియా ఓ రెస్టారెంట్లో కలవడం, ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈ విందులో రణ్బీర్ సిస్టర్స్ రిధిమా కపూర్, షానీ కూడా పాల్గొన్నారు. వీళ్లతో ఆలియా కెమిస్ట్రీ ఓ ప్రత్యేకమైన బంధాన్ని సూచించింది అని చూపరులు అంటున్నారు. ఆ తర్వాత రణ్బీర్ తండ్రి రిషీ కపూర్ని కూడా ఆలియా కలిశారట. విశేషం ఏంటంటే.. ఈ జంటకు పెద్దలవైపు నుంచి ఎలాంటి ఆటంకాలు లేవు. రెండూ పేరున్న కుటుంబాలే. ఒకటి కపూర్ ఫ్యామిలీ.. ఇంకోటి భట్ ఫ్యామిలీ. ‘మీ అమ్మాయి డేటింగ్ విషయం మీకు తెలుసా?’ అని ఇటీవల మహేశ్ భట్ని ఓ విలేకరి అడిగితే – ‘‘చెప్పాలనుకుంటే చెబుతుంది. మా ఇంట్లో ఎవరి స్వేచ్ఛ వారికుంటుంది. అయినా తనేం చిన్నమ్మాయి కాదు’’ అన్నారట. రణ్బీర్ని అల్లుడిగా చేసుకోవడానికి మహేశ్ భట్ కుటుంబం రెడీగా ఉందని టాక్. అయితే 2020లో పెళ్లి చేసుకోవాలని రణ్బీరాలియా (ఈ ఇద్దరికీ బీ టౌన్ పెట్టిన పేరు) అనుకుంటున్నారట. అంత గ్యాప్ అంటే.. ఇప్పుడున్న ప్రేమ ఇలానే ఉంటుందా? లేక దీపికా పదుకోన్తో లవ్కి ఫుల్స్టాప్ పెట్టి, కత్రినా కైఫ్తో కటీఫ్ చెప్పినట్లు ఆలియాకి కూడా రణ్బీర్ హ్యాండిస్తాడా? లేక ఆలియా ఆ పని చేసే అవకాశం ఉందా? కాలమే చెప్పాలి. అదండీ సంగతి... రానున్న రోజుల్లో బాలీవుడ్లో వరుసగా పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అభిమానులూ గుండె దిటవు చేసుకోండి. మీ స్టార్లు ఎక్కడికీ పోరని ముందే చెప్పాం కదా. సినిమాలు చేస్తారు. ఆ సంగతలా ఉంచితే.. వీళ్ల పెళ్లిళ్ల వల్ల డిజైనర్లకు, మేకప్ ఆర్టిస్ట్లకు, హెయిర్ స్టైలిస్టులకూ చేతుల నిండా పని. విందు గురించి మరచిపోతే ఎలా? భలే పసందుగా ఉంటుంది. తిన్నాక ‘కైకే పాను బనారసు వాలా’ అంటూ కిళ్లీ వేసుకోకుండా ఉండరు. ఏదో ఉంది! ‘అబ్బే అలాంటిదేమీ లేదు’ అంటున్నారు కానీ ఇద్దరి వాటం చూస్తుంటే ‘ఏదో ఉంది’ అన్నట్లే ఉంది. టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ గురించి చెబుతున్నాం. ‘భాగీ –2’లో జతకట్టిన ఈ జంట ఆ సినిమా సెట్స్లోనే ప్రేమలో పడ్డారని బీ టౌన్ కోడై కూస్తోంది. లంచ్లు, డిన్నర్లకు రెస్టారెంట్లకు వెళ్లిన ఈ ఇద్దరూ చాలామంది కంట్లో పడ్డారు. పైగా టైగర్ తల్లి అయేషాతో దిశా ఓ రెస్టారెంట్లో విందు లాగిస్తూ చాలా కళ్లకు చిక్కింది. ఆ తర్వాత టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్తో సరదాగా దిశా దిగిన ఓ ఫొటో కూడా బయటికొచ్చింది. దాంతో అబ్బాయి ఇంటి నుంచి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నది చాలామంది నమ్మకం. మరి.. తమ బంధాన్ని ఈ ఇద్దరూ బాహాటంగా ఎప్పుడు చెబుతారో చూడాలి. ఇల్లూ బేబీ.. ఏంటి సంగతి? ‘మా హబ్బీ ఈ ఫొటో తీశారు’ అని ఏ అమ్మాయి అయినా అంటే.. అది భర్త తీసిన ఫొటోనే అని అర్థమైపోతుంది. ఆ మధ్య ఇలియానా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ ఒకటి చేశారు. ఆ హబ్బీ ఎవరంటే.. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్. మూడు నాలుగేళ్లుగా ఈ ఇద్దరూ లవ్లో ఉన్నారు. ఆండ్రూతో మీ రిలేషన్షిప్ ఎలాంటిది? అని ఇల్లూ బేబీని అడిగితే– ‘‘ఆయన స్పెషల్ పర్సన్’’ అంటుంది. లవ్ని కన్ఫార్మ్ చేయలేదు. ‘ఈ మధ్య నా లైఫ్ చాలా బాగుంది’ అని మాత్రం చెబుతూ వస్తోంది. దానికి కారణం అంటే ‘ఇంకెవరూ.. ఆండ్రూనే’ అంటోంది కానీ పెళ్లి చేసుకున్నాం అని మాత్రం అనడంలేదు. ‘హబ్బీ’ అని అంది కాబట్టి, సైలెంట్గా పెళ్లాడారని అర్థమవుతోంది. మరి.. ఇల్లూ బేబీ.. ఏంటి సంగతి? అసలు విషయం చెబితే ఔత్సాహికరాయుళ్లు ఆనందపడతారు కదా? చాలా స్పెషల్ అండీ.. డెన్మార్క్కు చెందిన మథియాస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నారని మూడు నాలుగేళ్లుగా వినిపిస్తున్న వార్త. మథియాస్ మంచి ఆటగాడు. ఒలింపిక్స్లో మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఓ సందర్భంలో తాప్సీ, మథియాస్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట. ఇతగాడి ఆట ఉంటే.. తాప్సీ స్టేడియమ్ గ్యాలరీలో కనిపిస్తారనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మథియాస్తో మీ రిలేషన్ అంటే.. ఇలియానాలానే తాప్సీ కూడా ‘అతను వెరీ స్పెషల్’ అంటుంది. అసలు ఈ స్పెషల్ స్టేటస్కి అర్థం ఏంటో? ఆ సంగతి పక్కన పెడితే ఈ ఇద్దరూ ఆ మధ్య ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి బయటికొస్తూ మీడియా కంటికి చిక్కారు. మరి.. ఇద్దరి మధ్యా ఏమీ లేదంటారా? – డి.జి. భవాని -
‘అశ్లీలం’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఓ సివిల్ ఇంజినీర్ను అరెస్టు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు గత ఏడాది ఈ కేసు నమోదైన విషయం విదితమే. అప్పటి నుంచి బాధ్యులను గుర్తిస్తున్న సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. బోడుప్పల్కు చెందిన రుద్రవరకు రఘువరన్ ఓ ప్రైవేట్ సంస్థలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఇంటర్నెట్లో ఓ బ్లాగ్స్పాట్ క్రియేట్ చేసిన ఇతను ప్రముఖ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కల్పిత కథలను పొందుపరుస్తున్నాడు. తద్వారా సైట్కు హిట్స్ పెరగడంతో ఆర్థికంగా లాభం పొందుతున్నాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అంగరంగ వైభవంగా ఫిలింఫేర్ అవార్డుల
-
హీరోయిన్లు తెలుగు మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా!
‘‘తెలుగు ఇండస్ట్రీ రాను రాను ఇంగ్లీష్ ఇండస్ట్రీ అయిపోయింది. ఆర్టిస్టులందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. టైటిళ్లు కూడా ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. శోభారాణికి సినిమాలంటే ప్యాషన్. తమిళ చిత్రాలు డబ్బింగ్ చేసి ఎంత డబ్బు పోగొట్టుకుందో నాకు తెలుసు. ‘ఎందుకమ్మా అంత డబ్బు పెట్టి డబ్బింగ్ సినిమాలు కొనడం, సొంతంగా ఓ చిత్రం నిర్మించు’ అన్నా. ఇప్పుడు తను ఓ మంచి కథతో సినిమా నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో సీఎల్ఎన్ మీడియాపై శోభారాణి నిర్మిస్తున్న ‘100 డిగ్రీ సెల్సియస్’ చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. హీరోయిన్లు రాయ్లక్ష్మీ, నికిషా పటేల్, అరుంధతి నాయర్లపై దాసరి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలోని అన్ని భాషల హీరోయిన్స్ను తెలుగు ఇండస్ట్రీ గౌరవిస్తుంది. సో, హీరోయిన్స్ ఫస్ట్ తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీకి రావాలి. ఇది నా సిన్సియర్ అండ్ సీరియస్ సలహా. ఈ హీరోయిన్స్ నెక్ట్స్ నేనున్న స్టేజ్పైకి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా’’ అన్నారు. ఇదే వేదికపై ‘కోటికొక్కడు’ చిత్రం ఆడియో వేడుక జరిగింది. సుదీప్, నిత్యామీనన్ జంటగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళంలో తెరకెక్కిన చిత్రాన్నే ‘కోటికొక్కడు’ పేరుతో సిఎల్ఎన్ మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్శెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీలను దాసరి, సముద్ర విడుదల చేశారు. ఈ వేడుకల్లో నిర్మాతలు శోభారాణి, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డీఎస్ రావు, ప్రతాని రామకృష్ణగౌడ్, హీరోలు భరత్, మనోజ్ నందమ్ పాల్గొన్నారు. -
డ్రెస్సు మూరెడు... రేటు బారెడు!
‘చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్న గౌనులో కనువిందు చేసిన రమ్యకృష్ణను కూడా అంత సులువుగా మర్చిపోలేం. ‘అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ పాట గుర్తు రాగానే వయ్యారంగా నర్తించిన ఊర్మిళ కళ్ల ముందు మెదలకుండా ఉండదు. ఇక్కడ పేర్కొన్న రెండు డ్రెస్సులూ సినిమాల్లోవి. నేటి తరం నాయికలు కూడా ఇలా సినిమాల్లో అదిరేటి డ్రెస్సులతో అదరగొడుతున్నారు. అయితే విడిగా కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్లోనే దర్శనాలిచ్చి మతులు పోగొడుతున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలకు తారలు వస్తున్న తీరు చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని చూసేవాళ్లు అంటున్నారు. ఎంతైనా మన కథానాయికల మనసు చాలా విశాలమైనదనీ, ఏదీ పెద్దగా దాచుకోరనీ జోకేసేవాళ్లూ ఉన్నారనుకోండి. ప్రతిదానికీ బడ్జెట్ చెక్ చేసుకునేవాళ్లు మాత్రం ‘ఎంతైనా అమ్మాయిలకు రూపాయంటే చాలా జాగ్రత్త. బట్టల ఖర్చు తక్కువే’ అంటారు. కానీ, పెద్ద గౌనుకి ఎంత అవుతుందో చిన్న గౌనుకీ అంతే ఖర్చవుతుందట! చిన్న డ్రెస్సు మొత్తం మూడు మీటర్లు ఉండదేమో.. రేటు మాత్రం వేలల్లోనే! పొడవాటి డ్రెస్సులకి 70వేల నుంచి లక్ష వరకూ ఖర్చు పెడుతుంటే.. పొట్టి డ్రెస్సులకు కాస్తంత తక్కువగా అంతే ఖర్చుపెడుతున్నారు. అందాల తారలు వేసుకునే డ్రెస్సుల ఖరీదు ఓ సామాన్య ఉద్యోగి నెల జీతంకన్నా కొంచెం ఎక్కువే అంటే అతిశయోక్తి కాదు. ఇంత ఖర్చుపెట్టడం అవసరమే. ఎందుకంటే ఉండేది గ్లామర్ ఫీల్డ్లో. ఎప్పుడూ గ్లామరస్గా కనిపించాలి. లేకపోతే ‘ఎందుకోగానీ ఆ హీరోయిన్ ఈ మధ్య అంత బాగుండట్లేదు’ అని స్టాంప్ వేసేస్తారు. అలా అనిపించుకోవడంకన్నా ఉన్న అందం ఎంతో కొంత కనపడేలా డ్రెస్సులేసుకోవడం మేలు. అందుకే తారలందరూ సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా రెచ్చిపోతున్నారు. పైగా.. ఆ మధ్య ఎండలు దంచేశాయ్ కదా. అందుకే గత రెండు, మూడు నెలల్లో తారలందరూ దాదాపు పొట్టి గౌన్లూ, మినీ స్కర్టులే బెస్ట్ అనుకున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లుగా దర్శనమిచ్చారు. అదిరేటి డ్రెస్సులు వీళ్లేస్తే చూసేవాళ్లకి దడ పుట్టకుండా ఉంటుందా? -
అబ్బో.. ఎంత రేటో!
వెండి తెరపై జిగేల్ మనే అందాలతో మైమరపించే ప్రముఖ నటీమణుల తాజా పారితోషికాల వివరాలను చూస్తే ఎవరికైనా కచ్చితంగా అబ్బా అనిపించక మానదు.ఇంతకు ముందు చిత్రపరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగేది. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు ప్రత్యక్షంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.హీరోలు ఆధిక్యం వారి పారితోషికం విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తుండేది. అలాంటిదిప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందని అనలేము గానీ, మార్పు వచ్చిందని మాత్రం చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అధికంగా హీరోల చుట్టూనూ కథలు తిరుగుతుండేవి. అందుకే వారు అధిక పారితోషికం డిమాండ్ చేస్తుండేవారు.తాజాగా కథల విషయంలోనే మార్పు వచ్చిందని చెప్పక తప్పదు.హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్న పరిస్థితి అధికమైందనే చెప్పాలి.ఆ తరహా కథా చిత్రాలు విజయం సాధించి,ముఖ్యంగా నిర్మాతలకు లాభాలను ఆర్జించి పెట్టడంతో హీరోయిన్లు తమ పారితోషికాలను పలు రె ట్లు పెంచేస్తున్నారు. నయనాధిక్యం: ఇక నేటి ప్రముఖ కథానాయికల పారితోషికాలను ఒక్కసారి పరిశీలిస్తే వామ్మో అనిపించక మానదు.పలు సంచలనాలకు కేంద్రంగా మారి ఒక దశలో నటనకు గుడ్బై కూడా చెప్పేసి మళ్లీ నటనను ఆశ్రయించిన నటి నయనతార ప్రాచుర్యంతో పాటు పారితోషికం విషయంలోనూ తన ఆధిక్యాన్ని చాటుకుంటున్నారు.ఇటీవల ఆమె నటించిన తనీఒరువన్, మాయ, నానుమ్ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించడం గమనార్హం. అందులో మాయ చిత్రం ఆమె చుట్టూ తిరిగే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడంతో ఆ చిత్ర విజయం నయనతార సొంతం అయ్యిపోయింది. ఆ తరువాత ఆ తరహా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు నయనతారను వెతుక్కుంటూ రావడం గమనార్హం.దీంతో ఆమె తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచేశారు.కాగా ఇటీవల ఒక హారర్ కథా చిత్రం అవకాశం రాగా నయనతార నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు,ఆ చిత్ర దర్శక నిర్మాతలు ముచ్చెమటలు పోయడంతో మరో మాట లేకుండా వెనుదిరిగినట్లు ప్రచారం జరిగింది.అందువల్ల నయనతార పారితోషికం మూడు కోట్ల వద్ద పుల్స్టాప్ పడినట్లు సినీ వర్గాల టాక్. ఇక పారితోషికం విషయంలో రెండో స్థానంలో ఉన్న నటి అనుష్క. అరుంధతి చిత్రం తరువాత ఈ యోగా సుందరి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి.అది బాహుబలి వరకూ అప్రహతంగా సాగుతూ వస్తోంది. దానితో పాటు పారితోషికం పెంచుకుంటూ పోయారు.ప్రస్తుతం అనుష్క రూ.1.5 కోట్ల నుంచి 2కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం.అదే విధంగా చెన్నై చిన్నది సమంత కూడా రూ. 1.45 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. నటి కాజల్అగర్వాల్ కోటి నుంచి కోటిన్నర వరకూ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఈమె తెలుగులో చందమామ తదితర చిత్రాల విజయాల తరువాత రూ.20 లక్షల పారితోషికం అందుకున్నారు.అయితే మగధీర చిత్రం కాజల్ క్రేజ్ను అమాంతంగా పెంచేసింది. అదే విధంగా తమిళంలో తుపాకీ,జిల్లా వంటి చిత్రాల విజయాలు ఈ బ్యూటీకి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక గుజరాతీ గమ్మ తమన్న సినిమాల్లోకి రాక ముందు వాణిజ్య ప్రకటనలకు రెండు వేల చొప్పున పారితోషికం పుచ్చుకున్నారు. ఇప్పుడామె అందుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అదనపు కాల్షీట్స్ అడిగితే మరో రూ.20 లక్షలు డిమాండ్ చేస్తారట. ఈ ముద్దుగమ్మ ఇటీవల ఐటమ్ సాంగ్స్ స్పెషల్గా వాసికెక్కారు. ఒక్కో పాటకు 40 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక ఫ్లాప్లతో కెరీర్ను ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన నటి శ్రుతిహాసన్. గ్లామర్కు అర్థం ఏమిటని ఎదురు ప్రశ్నలు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలారబోతలో సాటిలేరు తనకెవ్వరూ అన్నంతగా పేరు తెచ్చుకుని తన మార్కెట్ను పెంచుకున్నారు. ఈమె ఇప్పుడు కోటి వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు నక్షత్ర హోటళ్లు, షూటింగ్లో క్యారవన్ వ్యాన్ ఖర్చులు అంటూ అదనంగా నిర్మాతలకు తడిపిమోపెడవుతుంది. ఈ బ్యూటీస్ మల్టీ పర్పస్ హీరోయిన్లు కావడంతో నిర్మాతలు కోట్లలో పారితోషికాలు చెల్లించడానికి వెనుకాడడం లేదు.తమిళంలో నటించే చిత్రాలు తెలుగు తదితర భాషల్లోనూ కలెక్షన్లు రాబట్టడానికి ఈ కథానాయిక క్రేజ్ చాలా ఉపయోగ పడుతుండటం భారీ పారితోషికాలకు ఒక కారణం అని చెప్పవచ్చు. -
రెండు రోజులు... ఐ-ఫీస్ట్
-
రెండు రోజులు... ఐ-ఫీస్ట్
‘‘పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్...’’ అంటూ సిల్వర్ స్క్రీన్పై శ్రీయ నర్తిస్తుంటే కళ్లప్పగించి చూసేస్తాం.. ‘‘ఏం సక్కగున్నావ్రో నా సొట్ట సెంపలోడ’’ అంటూ తాప్సీ డ్యాన్స్ చూస్తే అదో ఐ-ఫీస్ట్... తెరపై వీళ్ల డ్యాన్స్ చూసినప్పుడే పసందుగా ఉంటే, ఇక డెరైక్ట్గా స్టేజిపై డ్యాన్స్ చేస్తేచూడ్డానికి రెండు కళ్లూ చాలవు. శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ.. ఇలా భాషాభేదం లేకుండా పలువురు కథానాయికలు కనువిందు చేయబోతున్న వేడుక ‘ఐఫా- ఉత్సవమ్’. జియోవన్ స్మార్ట్ఫోన్, రేనాల్ట్ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. దశాబ్దన్నర పైగా కేవలం హిందీ చలనచిత్ర పరిశ్రమకే ఈ అవార్డులు పరిమితమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా దక్షిణాది సినిమాలకు అవార్డులివ్వాలని ‘ఐఫా’ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ తారలు తమ నృత్యాలతో అలరించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో మమతా మోహన్దాస్, శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ, పారుల్ యాదవ్ బిజీ బిజీగా రిహార్సల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నృత్య కళాకారుడు షియామక్ దావర్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది. ప్రాక్టీస్ బ్రేక్లో ‘సాక్షి’తో తారలు ముచ్చటించారు. ఆ విశేషాలు... ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం - శ్రీయ ‘‘దక్షిణాదివారికి ఐఫా అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. సౌతిండియాలోనే పెద్ద వేడుక ఇది. అదో ఆనందం అయితే ఈ వేడుక హైదరా బాద్లో జరగడం మరో ఆనందం. ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ప్రభుదేవాతో కలిసి 45 సెకన్ల పాటు డ్యాన్స్ చేయబోతున్నాను. అంత టాలెంటెడ్ డ్యాన్సర్తో స్టేజ్ షేర్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఇప్పుడీ వేడుకలకు ఆయన దగ్గర మళ్లీ నేర్చుకోవడం ఓ మంచి అనుభూతి. ఆయన ట్రెడిషనల్ బుక్స్ చదువుతుంటారు. నాక్కూడా ఇస్తుంటారు. నేను డ్యాన్స్ చేయబోయే పాటల్లో ‘వాజి... వాజి... వాజి.. శివాజీ’, ‘మన్మథ.. మన్మథ...’ మొదలైన సూపర్ హిట్స్ ఉన్నాయి. నాతో డ్యాన్స్ చేయనుంది నా టీచర్లే! - తాప్సీ ఈ వేడుక గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత ఎగ్జయిటింగ్గా ఉంది. నేను సినిమాల్లో బాగా డ్యాన్స్ చేస్తున్నానంటే షియామక్ దావర్ కారణం. ఆయన దగ్గర ఆరేళ్లు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడీ వేడుకలో నా వెనకాల గ్రూప్ డ్యాన్స్ చేసేవాళ్లందరూ నా టీచర్లే కావడం విశేషం. నా గురువులకూ, ఐఫాకీ గర్వకారణంగా నిలిచేలా డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుక నాకు మరపురాని అనుభూతి అవుతుంది. హేమాహేమీలతో డ్యాన్స్ చేయనున్నా - నిక్కీ గల్రానీ ఇప్పటివరకూ మలయాళంలో నాలుగు, కన్నడంలో నాలుగు, తమిళంలో రెండు సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమా చేస్తున్నాను. ఈ వేదికపై డ్యాన్స్ చేయబోతున్నవాళ్లందరూ హేమాహేమీలే. వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయనుండటం నాకో అందమైన కల నెరవేరినట్లుగా ఉంటుంది. మొత్తం నాలుగు పాటలకు డ్యాన్స్ చేయబోతున్నాను. నా చిన్నప్పుడు షియామక్ దావర్ గురించి చెబుతుంటే వినేదాన్ని. ఆయన కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది. -
కోట్లల్లో కొందరు!
తెలుగు సినిమాలో..... ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాలో..... అదీ కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకి అంత విలువండదు. కథంతా హీరో చుట్టే తిరుగుతుంటుంది అనేది మనం తరచూ వినే కమెంట్. అంత విలువ లేని పాత్రలు ఈ హీరోయిన్లు ఎందుకు చేస్తారన్న అనుమానం మనకు రాకుండా ఉండదు. అందుకే ఓ చిన్న పరిశోధన చేసి, ఇండస్ట్రీ పొరలను ఎన్నో తవ్వి... కొన్ని విషయాలను గోడలను అడిగి, ఇంకొన్నిటిని గుర్రాలతో చెప్పించుకునిమీదాకా తీసుకొస్తున్నాం. దిమ్మ దిరిగింది. విలువ లేదంటారేంటి? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో చూడండి. అంత తీసుకున్నాక కథ ఎవరి చుట్టు తిరిగితేనేమి? మనం బ్యాంకు చుట్టూ తిరిగితే చాలదూ? అని హీరోయిన్లు తప్పకుండా నవ్వుకుంటూ ఉంటారని అనిపించింది. డైరీలో డేట్లు తక్కువ ఉంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అదీ మా పరిశోధనా సారాంశం. సమంత చెన్నై చందమామ 28 ఏళ్లు తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఏ మాయ చేసావె’ (2010) చేస్తున్న సినిమాలు: ‘అ..ఆ..’, ‘బ్రహ్మోత్సవం’, తమిళంలో అరడజను సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25 - 1.75 కోట్లు రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ పిల్లతెమ్మెర 24 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘కెరటం’ (2011) ఫస్ట్ బ్రేక్: ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ (2013) చేస్తున్న సినిమాలు: రామ్చరణ్తో ‘బ్రూస్లీ’, బన్నీతో, ఎన్టీఆర్తో సినిమాలు, హిందీలో ‘సిమ్లా మిర్చి’. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. కోటి దాకా నయనతార మలయాళ మకరందం 30 ఏళ్లు తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘చంద్రముఖి’ (2005) చేస్తున్న సినిమాలు: తమిళంలో 5, మలయాళంలో 1, తెలుగులో 1. ఇప్పుడు మార్కెట్ గిరాకీ:రూ. 2.25 కోట్లకు పైగా అనుష్క కన్నడ స్వీటీ 33 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘సూపర్’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘విక్రమార్కుడు’ (2006) చేస్తున్న సినిమాలు: ‘రుద్రమ దేవి, సైజ్ జీరో, దోస్త్ (గెస్ట్ రోల్), బాహుబలి-2’ ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 2 కోట్ల పై మాటే. శ్రుతీ హాసన్ తమిళ తంగవు 29 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘అనగనగా ఓ ధీరుడు’ (2011) ఫస్ట్ బ్రేక్: ‘గబ్బర్సింగ్’ (2012) చేస్తున్న సినిమాలు: విజయ్తో ‘పులి’, అజిత్తో ఒకటి, సూర్యతో ‘సింగం-3’, హిందీలో 2 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25-1.5 కోట్లు కాజల్ అగర్వాల్ ముంబై ముద్దుగుమ్మ 30 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘లక్ష్మీ కల్యాణం’ (2007) ఫస్ట్ బ్రేక్: ‘చందమామ’ (2007) చేస్తున్న సినిమాలు: పవన్ కల్యాణ్తో ‘సర్దార్ గబ్బర్సింగ్’; మహేశ్బాబుతో ‘బ్రహ్మోత్సవం’; తమిళంలో 3, హిందీలో 1. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1- 1.25 కోట్లు తమన్నా పంజాబీ మిల్కీబ్యూటీ 25 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘శ్రీ’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘హ్యాపీడేస్’ (2007) చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, నాగార్జున-కార్తీతో ‘దోస్త్’, ప్రభాస్తో ‘బాహుబలి-2’. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1-1.25 కోట్లు నిత్యామీనన్ మలయాళ మందారం 27 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అలా మొదలైంది’ (2011) చేస్తున్న సినిమాలు: ‘రుద్రమదేవి’, తమిళంలో 3 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 - 60 లక్షలకు పైగా ‘కలర్స్’ స్వాతి పదహారణాల తెలుగమ్మాయి 28 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘డేంజర్’ (2005) ఫస్ట్ బ్రేక్: ‘అష్టా చమ్మా’ (2008) చేస్తున్న సినిమాలు: ‘త్రిపుర’, తమిళంలో 3 సినిమాలు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 45 లక్షలు రాశీ ఖన్నా ఢిల్లీ పోరీ 23 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఊహలు గుసగుసలాడె’ (2014) చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, రామ్తో ‘శివమ్’, సాయిధరమ్ తేజ్తో ఓ సినిమా. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 -75 లక్షలు రెజీనా తమిళ మిలమిల 23 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఎస్ఎమ్ఎస్’ (2012) ఫస్ట్ బ్రేక్: ‘రొటీన్ లవ్స్టోరీ’ (2012) చేస్తున్న సినిమాలు: సాయిధరమ్తేజ్తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, గోపీచంద్తో ఓ సినిమా, సాయిధరమ్ తేజ్తో మరో చిత్రం. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.25 - 50 లక్షలు లావణ్యా త్రిపాఠీ ఉత్తరప్రదేశ్ బ్యూటీ 24 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అందాల రాక్షసి’ (2012) చేస్తున్న సినిమాలు: నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’, అల్లు శిరీష్తో ఓ సినిమా, మంచు మనోజ్తో ఓ సినిమా ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.35 లక్షలు. త్రిష తమిళ్ అళగి 32 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) ఫస్ట్ బ్రేక్: ‘వర్షం’ (2004) చేస్తున్న సినిమాలు: తెలుగులో కమలహాసన్తో ‘చీకటి రాజ్యం’, ‘నాయకి’, తమిళంలో 4, మలయాళంలో 1 సినిమా. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: అర కోటి పైనే ఇలియానా గోవా సుందరి 27 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేవదాసు’ (2006) చేస్తున్న సినిమాలు: రామ్చరణ్ ‘బ్రూస్లీ’లో ఐటమ్సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: కొత్తగా ఏవీ ఒప్పుకోవట్లేదు. పెళ్ళి చేసుకొనే యోచన. హన్సిక సింధీ బొద్దుగుమ్మ 24 ఏళ్లు ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేశముదురు’ (2007) చేస్తున్న సినిమాలు: విజయ్తో ‘పులి’; మరో 3 తమిళ సినిమాలు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.75 లక్షల నుంచి ఒక కోటి దాకా. అంజలి గోదావరి తెలుగందం 29 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఫొటో’ (2006) ఫస్ట్ బ్రేక్: ‘జర్నీ’ (2011) (డబ్బింగ్ ) చేస్తున్న సినిమాలు: బాలకృష్ణతో ‘డిక్టేటర్’, లేటెస్ట్ ‘శంకరాభరణం’, ‘చిత్రాంగద’, తమిళంలో 5 సినిమాలు ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.50 లక్షల దాకా. శ్రీయ ఢిల్లీ మోడల్ 33 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఇష్టం’ (2001) ఫస్ట్ బ్రేక్: ‘సంతోషం’ (2002) చేస్తున్న సినిమాలు: ప్రస్తుతం తెలుగులో ఏవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 లక్షల దాకా. తాప్సీ ఢిల్లీ గ్లామర్ గాళ్ 28 ఏళ్లు ఫస్ట్ మూవీ: ‘ఝుమ్మంది నాదం’ (2010) ఫస్ట్ బ్రేక్: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (2011) చేస్తున్న సినిమాలు: తమిళంలో 1, హిందీలో 2 సినిమాలు, తెలుగులో ఏమీ చేయడం లేదు. ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 30 లక్షల దాకా -
ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడబోతున్న చైతూ
-
హీరోని ఆకట్టుకోడానికి ‘జీరో’ అక్కర్లేదు!
గ్లామర్ పాయింట్ హీరోయిన్ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు మొదటగా వచ్చే సమాధానం స్లిమ్గా, నాజూగ్గా ఉండాలి అని. స్లిమ్నెస్ అన్నదే హీరోయిన్కి కొలమానమా? కానే కాదు అని ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఒకనాడు సావిత్రి, మీనాకుమారి వంటి నటీమణులు ప్రతిభ ముందు పర్సనాలిటీ పని చేయదని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఖుష్బూ, సౌందర్య లాంటి తారామణులు ఫిగరుతో సంబంధం లేకుండా తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ యంగ్ యాక్ట్రెస్లు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు. సినిమాలో హీరోని ఆకట్టుకోడానికి జీరో సైజు అవసరం లేదు, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడానికి స్లిమ్గానే ఉండక్కర్లేదు అని బాక్సాఫీసులు బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. వాళ్లకున్న క్రేజ్ మనకు తెలుసు కాబట్టి ఒప్పుకోక తప్పుతుందా! -
విశాఖలో తమన్నా,కాజల్ సందడి
-
హీరోయిన్లు గ్లామర్ కోసమే
హీరోయిన్లను దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్ కోసమే వాడుకుంటున్నారని నటి నిత్యామీనన్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ కేరళ కుట్టికి పొగరుబోతు అనే పేరు కూడా ఉంది. అలాంటి నిత్యమీనన్ ఇటీవల వరుసగా మూడు విజయాలను అందుకున్న ఆనందంలో మాట్లాడుతూ సమీపంలోని నటించిన మూడు చిత్రాలు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మూడు చిత్రాల్లోనూ వైవిధ్యభరిత పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కన్మని(ఒకే బంగారం)లో నటించడం మరచిపోలేని అనుభవంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ చిత్రంలో కంటే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన-2లో వికలాంగ యువతిగా నటించడం బాగా నచ్చిందన్నారు. అది దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కినా తన పాత్రను చాలెంజ్గా తీసుకుని నటించానన్నారు. తాను నటించే చిత్రాల్లో కొన్ని నిబంధనలు విధించుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా చిత్ర స్క్రీన్ప్లే నచ్చకుంటే అందులో నటించే ప్రసక్తే లేదన్నారు. సినిమా కథను ఎలా చెబుతున్నారన్నది ముఖ్యం అన్నారు. కథా పాత్రతో పాటుగా కథనం చిత్రానికి ముఖ్యం అని అన్నారు. మరో విషయం ఏమిటంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారన్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. హీరోయిన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలని నిత్యామీనన్ విజ్ఞప్తి చేశారు. -
రుద్రమదేవికి ఆకర్షణ ఆ ముగ్గురే
-
హీరోయిన్లకు సమంత స్ఫూర్తి
మంచి, మానవత్వం అనేవి స్వతహాగానే ఉంటాయి.లేని పక్షంలో ఇతరుల నుంచి స్ఫూర్తి పొంది అయినా ప్రవర్తించవచ్చు. వీటిలో మొదటి కోవకు చెందిన నటి సమంత సహ నటీమణులకు స్ఫూర్తినిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. విజయ్, అజిత్ లాంటి నటులు ప్రతి చిత్ర షూటింగ్ గుమ్మిడికాయ కొట్టే సమయంలో యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందు ఇవ్వడం, లేక ప్రయోజన కరమైన బహుమతులను అందించడం లాంటి చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇటీవల ఇలాంటి సంప్రదాయాన్నే నటుడు ధనుష్, విశాల్ అమలు పరుస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు గొలుసులు, డాలర్లు అందించారు.అయితే ఇలా కథానాయికలేవరూ చేయడం చూడలేదు. తాజాగా నటి సమంత అలాంటి సత్సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నది గమనార్హం.ధనుష్కు జంటగా వీఐపీ2 చిత్రంలో నటించిన సమంత ఆ చిత్ర షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులందరికీ తలా ఐదు వేలు చొప్పున్న నగదు బహుమతిని అందించి వారికి అభిమాన పాత్రురాలయ్యారు.అంతేకాదు సహ నటీమణులకు స్పూర్తిగా నిలిచారు. సమంత తన హేర్డ్రస్సర్, మేకప్మన్, ఇతర సహాయకులనూ చక్కగా చూసుకుంటారని, వారి అవసరాలను గుర్తెరిగి సాయం చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారనే పేరుంది.అంతే కాదు తన అందానికి కారణం హేర్డ్రెస్సర్, మేకప్మన్లే కారణం అని బహిరంగంగానే ప్రకటించి ఆ క్రెడిడ్ను కూడా వారికే ఇచ్చిన డేరింగ్ నటి సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్తో తాజా చిత్రంలో డ్యూయెట్లు పాడుతున్నారు. విక్రమ్ సరసన నటించిన పత్తుండ్రదుకుళ్, ధనుష్కు జంటగా నటించిన వీఐపీ2 చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
హీరోయిన్స్ని తెగపొగిడేస్తున్న మహేష్
-
సింగింగ్ బ్యూటీస్
ఓ పక్క తమ నటనతో అలరిస్తూనే మరోపక్క గాయని అవతారమెత్తారు ఎంతోమంది బాలీవుడ్ నటీమణులు. శ్రీదేవి, జూహీచావ్లా, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లంతా ఆ కోవకు చెందినవారే. అయితే ప్రస్తుతం కొందరు హీరోయిన్లు సింగింగ్ను సరదాగా కాకుండా సీరియస్గా తీసుకుంటున్నారు. గాయనీమణులుగా ముద్ర వేయించుకోవాలని తపిస్తున్నారు. వారే వీరు... ముద్దుగా, ముచ్చటగా కనిపించే ఆలియాలో ఓ మంచి సింగర్ ఉందన్న సంగతి రెహమాన్ కనిపెట్టారు. ‘హైవే’ సినిమాలో ‘సూహా సూహా’ అనే పాట పాడించి, ఆమె టాలెంట్ని అందరికీ తెలిసేలా చేశారు. ఆ తర్వాత ‘హప్టీ శర్మాకీ దుల్హనియా’లో ‘సమ్ఝావా’ పాటతో సింగర్గా నిరూపించేసుకుంది ఆలియా. ఆ పాట వీడియో అయితే కుర్రకారుకి యమా కిక్కిచ్చింది. త్వరలో మరో సినిమాలో కూడా గొంతు సవరించబోతోందట ఈ చిన్నది. సోనాక్షికి సంగీతమంటే పిచ్చి. చక్కగా పాడగలదు కూడా. తన సినిమాకి తాను పాడుకోవాలన్న ఆశ ఆమెలో ఎప్పట్నుంచో ఉంది. ‘లూటేరా’ చిత్రంలోని ‘సవార్లూ’ పాట పాడాలని ఉవ్విళ్లూరింది కానీ అది నెరవేరలేదు. చివరికి ‘తేవర్’లో ‘లెట్స్ సెలెబ్రేట్’ అంటూ సింగేసి సరదా తీర్చుకుంది. త్వరలో ఇండియన్ ఐడల్ జూనియర్స్కి జడ్జిగా కూడా వ్యవహరించబోతోంది. అప్పుడు తను కూడా పిల్లలతో పాటు పాటలు పాడేయవచ్చు అంటూ సరదాపడుతోంది సోనాక్షి. ‘ఏక్ విలన్’ చిత్రంలో ‘గలియా’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందంటే... ఆ సినిమా రిలీజయ్యాక అందరినోటా ఆ పాటే. ఆ పాటలోని ఫిమేల్ వాయిస్ శ్రద్ధాకపూర్ది అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. ‘ఆషికీ 2’లో సింగర్గా నటించిన శ్రద్ధలో నిజంగానే గాయని ఉందన్న విషయం ఆ పాటతో అర్థమయ్యింది. శ్రద్ధ తల్లి శివంగీ కొల్హాపురి, లతామంగేష్కర్కి దగ్గరి బంధువు. ఆ జీన్సే శ్రద్ధకీ వచ్చినట్టు న్నాయి. సరదాగా తన సినిమాలో పాడటం కాకుండా, ఏకంగా ఓ పాటల ఆల్బమ్నే రిలీజ్ చేసిన ఘనత ప్రియాంకాచోప్రాది. ఆమె పాటలు పాడిన ‘ఎగ్జాటిక్’ ఆల్బమ్... అప్పటికే నటిగా పేరెన్నికగన్న ఆమెని సింగర్గా కూడా ప్రపంచం ముందు నిలబెట్టింది. నిజానికి 2002లోనే తమిళంలో తాను నటించిన తొలి సినిమాలో పాడింది ప్రియాంక. ఆ తర్వాత నటన మీద దృష్టి పెట్టడంతో ఏ సినిమాలోనూ పాడలేదు. ఆ మధ్య వచ్చిన ‘మేరీ కోమ్’లో ఆమె పాడిన ‘చావోరో’ బాలీవుడ్లో ఆమె తొలి పాట. ముందు ముందు మరిన్ని పాటలు పాడబోతోందట ప్రియాంక. -
కో అంటే కోటి అంటున్న హీరోయిన్లు
-
ఎండల్లో హాయ్.. హాయ్..!
బాలీవుడ్ చల్లటి వాతావరణం చల్లగా జారుకుంది. ‘ఇన్నాళ్లూ కూల్ కూల్గా ఉన్నారు కదా... ఇప్పుడు చూపిస్తా నా తడాఖా’ అంటూ సూర్యుడు చెలరేగిపోతున్నాడు. భానుడి భగభగలకు ఎలాంటివారైనా భయపడాల్సిందే. తాకితే కందిపోయే అందాల తారలనూ కనికరించడాయె. ఈ సూరిబాబు ముందు ఎవరైనా ఒకటే. ఈ ఎండల్లోనూ అందం, ఆరోగ్యం బాగుండాలంటే, జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ముఖ్యంగా వెండితెర భామలైతే మరింత జాగ్రత్తపడాలి. వాళ్లు డల్గా కనిపిస్తే అభిమానులు ఫీలైపోతారు కదా. అందుకే, వేసవిలో కథానాయికలు మరీ జాగ్రత్తగా ఉంటారు. సెగలు కక్కుతున్న సూర్యుడి తాపం తట్టుకోవడానికి మన ప్రసిద్ధ హిందీ సినీ కథానాయికలు ఏం చేస్తారో... వారి మాటల్లోనే తెలుసుకుందాం. జలకాలాటకు అరగంట! : నర్గిస్ ఫక్రీ వేసవి అంటే నాకు అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే, నా స్కిన్ చాలా సెన్సిటివ్. ఇలా ఎండలో వెళితే అలా కమిలిపోతుంది. అందుకే, రసాయనాలు ఎక్కువ ఉన్న క్రీములు కాకుండా తేలికపాటి మాయిశ్చరైజర్లు వాడతాను. కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దన చేస్తాను. విడి రోజుల్లో ఓ పది, ఇరవై నిమిషాల్లో స్నానం చేస్తే.. వేసవిలో మాత్రం అరగంటైనా నా జలకాలాట సాగుతుంది. వీలు కుదిరితే రోజుకి మూడుసార్లు లేకపోతే ఉదయం, రాత్రి స్నానం చేస్తాను. ఈ సీజన్లో అవుట్డోర్ షూటింగ్లు ఉండకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా. చురుక్కుమన్నా.. ఎంజాయ్ చేయొచ్చు : కరీనా కపూర్ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే ఎండ చురుక్కుమన్నప్పటికీ... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. స్వచ్ఛమైన కాటన్ దుస్తులు వాడితే శరీరానికి హాయిగా ఉంటుంది. వేసవి కాలం వస్తోందంటే నేను ప్రత్యేకంగా కొన్ని దుస్తులు కొనుక్కుంటా. అలాగే, సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటికి అడుగుపెట్టను. చలువ కళ్లద్దాలు లేకుండా అస్సలు బయటికి వెళ్లను. వేసవిలో నేను చాలా తక్కువ మేకప్ వేసుకుంటా. జుత్తు గురించి అదనపు శ్రద్ధ తీసుకుంటా. దుమ్ము, ధూళికీ జుత్తు పాడైపోతుంది. అందుకే ఎస్పిఎఫ్ ఉన్న షాంపూ ఉత్పత్తులను వాడతాను. స్కూల్ డేస్లో వేసవి సెలవులకు అలవాటుపడినందునో ఏమో ఇప్పుడు కూడా వేసవి అంటే హాలీడే మూడ్లోకి వెళ్లిపోతా. ఈ సీజన్లో షూటింగ్స్కి డమ్మా కొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. ఒకవేళ షూటింగ్ లేకపోతే నేనెక్కడికి వెళతానో తెలుసా? బీచ్లున్న ప్రదేశాలకు వెళ్లిపోతాను. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తా. కానీ, సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే వెళతాను సుమా. ఈ సీజన్లో ఆహార పరంగా నేను పెద్దగా నియమాలేవీ పెట్టుకోను. కానీ, నీళ్లు ఎక్కువ తాగుతాను. జ్యూసులు బాగా తీసుకుంటాను. సమ్మర్.. సో నైస్ : కత్రినాకైఫ్ అన్ని సీజన్ల కన్నా నాకు వేసవి అంటే చాలా ఇష్టమని చెబితే కొంతమందికి వింతగా ఉంటుందేమో. చలికాలంలో దుప్పటి ముసుగు తన్ని నిద్రపోవాలనిపిస్తుంది. వర్షాకాలంలో కాలు బయటపెట్టడం కష్టం. అదే ఎండాకాలంలో అయితే సమస్యే లేదు. హాయిగా బయటికెళ్లచ్చు. కానీ, చర్మం కమిలిపోతుంది కదా అంటున్నారా? అందుకే, తేనె ఉన్న ఫేస్ ప్యాక్లు కొనుక్కోవాలి. అలాగే, సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. మిగతా సమయంలో ఎలా ఉన్నా, వేసవిలో నేను మూడు, నాలుగు సార్లు మొహం కడుక్కుంటాను. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఎండలకు అలసిపోకుండా ఉండడం కోసం పుచ్చకాయ జ్యూస్, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటాను. మజ్జిగ కూడా చాలా మేలు చేస్తుంది. మసాలా కూరలు, వేపుళ్లు తినను. శరీరం తేలికగా అనిపించే ఆహారం తీసుకుంటా. ఎండ వేళ బీచ్లో హాయిగా : బిపాసా బసు ప్రతి ఏడాదీ వేసవిలో వీలు కుదిరినంతవరకూ బీచ్లకు వెళతాను. నా ఫేవరెట్ ప్లేస్ - గోవా. కానీ, ఎండల్లో బీచ్కెళితే సూర్యుడు తన ప్రతాపం చూపించేస్తాడు. అందుకే మొహానికి ముసుగు వేసుకుంటాను. దీనివల్ల రెండు సౌలభ్యాలున్నాయి. ఎండకు నా మొహం పాడవ్వదు.. నన్నెవరూ గుర్తు పట్టరు. ఈ సీజన్లో బత్తాయిలు, కమలా పండ్ల రసం బాగా శక్తినిస్తుంది. కానీ, నాకు నిమ్మజాతి పండ్లు పడవు. అందుకని, ఈ పండ్లకు దూరం. కొబ్బరి నీళ్లు, దానిమ్మ జ్యూస్లు తీసుకుంటాను. ఇంకా ఆకుపచ్చ కూరగాయలతో చేసిన ఏ జ్యూస్ అయినా ఆరోగ్యానికి మంచిదే. వేసవిలో ఎక్కువగా ద్రవ పదార్థాల మీదే ఆధారపడతాం కాబట్టి, ఈ జ్యూసులు తీసుకోవడం మంచిది. బాగా నూనె పట్టించేస్తా : అలియా భట్ సమ్మర్ అనగానే నాకు ముందు గుర్తొచ్చేది ఎండ కాదు.. మామిడి పండ్లు. మామూలుగా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ‘ఏంటి ఫ్రూట్స్ తినే బతికేస్తావా?’ అని ఆటపట్టిస్తుంటారు. చెర్రీస్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష.. ఇలా అన్నీ తింటాను. వేసవిలో మాత్రం మామిడి పండ్లే తింటాను. రోజుకో పండు తిననిదే నాకు నిద్రపట్టదు. ఇక, వేసవిలో నేను చేసే మరో విషయం ఏంటో చెప్పనా? మిగతా అన్ని సీజన్స్లో నా జుత్తును స్వేచ్ఛగా వదిలేస్తాను. కానీ, సమ్మర్లో మాత్రం టైట్గా పోనీటెయిల్ వేసుకుంటా. దీనికోసం ‘బటర్ఫ్లై క్లిప్’నే వాడతా. ఈ సీజన్లో నా చర్మం సంగతెలా ఉన్నా జుత్తు మాత్రం చాలా ఎండిపోయినట్లుగా అయిపోతుంది. అందుకే వారంలో రెండు సార్లయినా బాగా నూనె పట్టించేస్తా. ఆ తర్వాత మంచి షాంపూతో ఆ జిడ్డు అంతా వదిలించేస్తా. అలాగే, బయటికి వెళితే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళతా. వేసవిలో నీళ్లు ఎక్కువ తాగాలి. కాటన్ దుస్తులు, చలువ కళ్లద్దాలు.. ఇలా సమ్మర్కి అనువుగా ఉండే దుస్తులు, వస్తువులు వాడతాను. -
సల్మాన్ క్లబ్లో మన ముద్దుగుమ్మలు
సినిమాల వసూళ్లను ఇప్పుడు వందకోట్ల క్లబ్, రెండు వందల కోట్ల క్లబ్, ఐదొందల కోట్ల క్లబ్ అంటూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ తరహా ప్రచారం ముందుగా బాలీవుడ్లో ఆరంభమైంది. అక్కడ షారూఖ్ఖాన్, అమీర్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్ చిత్రాలు భారీ వసూళ్లతో ఈ క్లబ్ల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. తాజాగా సల్మాన్ఖాన్ క్లబ్ అనే ప్రచారం మొదలవుతోంది. దాని ప్రత్యేకత ఏమిటంటే ఒకస్థాయి దాటిన అవివాహిత హీరోయిన్లు ఈ క్లబ్లోకి చేరుతారట. అలా సల్మాన్ క్లబ్లో ఇప్పటికే టబూ, ప్రీతిజింతా, ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్ వంటి నాయికలు చేరారు. వీరంతా పెళ్లీడు దాటినా ఎలాంటి చింతా లేకుండా నటనకే అంకితమైపోయారు. ఇక దక్షిణాదిలో అనుష్క, శ్రీయ, ఇలియానా, నయనతార, తమన్న, ఛార్మి వంటి వారు సల్మాన్ క్లబ్లో చేరిపోయారట. నటి త్రిష మాత్రం ఇటీవల వరుణ్మణియన్తో నిశ్చితార్థం జరుపుకుని ఈ క్లబ్లో పేరు నమోదు కాకుండా తప్పించుకున్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా...
చాలామంది హీరోయిన్లు అమ్మానాన్న చూసిన వరుడినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారు. నిజంగా ప్రేమలో పడ్డా పెళ్లి జరిగే వరకు వారి నోట ఇలాం టి మాటే వస్తుంది. లక్ష్మీమీనన్ మాత్రం ధైర్యంగా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది. కుంకీ నుంచి మంజాపై వరకు వరుస విజయాలను తన ఖాతా లో వేసుకుంది ఈ కేరళ కుట్టి. పాండియనాడు, నాన్సిగప్పు మనిదన్ చిత్రాల్లో విశాల్తో జతకట్టి ఆయనతో ప్రేమ నడుపుతోందంటూ వదంతులు ఎదుర్కొంది. అలాంటిదీ మధ్య కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కారణం ప్లస్టూ పరీక్షలకు సిద్ధమవడమే అంటోంది. అందుకే సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్తో మూడవసారి కలిసి నటించే అవకాశాన్ని వదులుకుందట. ఆ అవకాశాన్నికాజల్ అగర్వాల్ అందుకుంది. ఈ మలయాళ బ్యూటీ కార్తీతో నటించిన కొంభన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. లక్ష్మీమీనన్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడు తూ తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని కుండబద్ధలు కొట్టింది. -
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్గా...
పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు. పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు. గౌతమి పునరాగమనం పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు. బుల్లి తెరపై మెరుపులు అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు. మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు. ఏడేళ్ల తరువాత... కోలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. -
అరచేతి ఆభరణం
ఆధునికం కథానాయికలు ఏం చేసినా అందమే! అలంకరణకు కొత్త భాష్యం చెప్పడానికి వారు రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. అవి అందరినీ ఆకర్షిస్తుంటాయి. అనుసరించేలా చేస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్ నుంచి బాలీవుడ్కి అటు నుంచి మన తెలుగు చిత్రసీమకు పరిచయం అయిందో ఆభరణం. ‘పామ్ కఫ్’గా పిలిపించుకుం టున్న ఈ అరచేతి ఆభరణానికి ఇటీవల క్రేజ్ వచ్చేసింది. సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక వేషధారణ అయినా ఈ అరచేతి ఆభరణాన్ని ధరిస్తే ఫ్యాషనబుల్ అనిపిస్తారు. అందుకేనేమో అమెరికా నుంచి ఆసియా వరకు ప్రపంచ సుందరీమణులు అనదగ్గ వారిందరి కోమలమైన చేతులకు ఇది కొత్త కాంతులిస్తోంది. గాజు మాదిరిగానూ, బ్రేస్లెట్ లాగానూ, అత్యంత సౌకర్యమైన ఆభరణంగానూ పలువురు మెచ్చుకుంటున్న ‘పామ్ కఫ్’ ప్రస్తుతం ఓ ట్రెండ్గా నడుస్తోంది. ఇవి బంగారు, వెండి, కాపర్, ఐరన్లలో.. ఎన్నో విభిన్న ఆకృతులతో అతివలను అలరిస్తున్నాయి. -
టాలెంట్ చూపించే హీరోయిన్స్ లేరా...?
-
అజిత్తో రొమాన్స్ చేయాలని!
సూపర్స్టార్ రజనీకాంత్ తరువాత కోలీవుడ్లో హీరోయిన్లు ఎక్కువగా నటించాలని కోరుకునేది అజిత్ సరసనే అంటారు. ఇప్పుడు సరిగ్గా నటి హన్సిక అలాంటి ఆశనే వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యూటీ ఆర్య, ధనుష్, కార్తీ, జీవా, జయం రవి వంటి యువ హీరోలతో పాటు ఇళయదళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్తో కూడా జతకట్టారు. అజిత్ సరసన మాత్రం నటించే అవకాశం ఇంకా రాలేదు. అజిత్ ఆరంభం చిత్రంలో నటించినా ఆయనకు జంటగా నటించలేదు. దీంతో ఆమె అజిత్తో రొమాన్స్ చే యాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి హన్సిక మాట్లాడుతూ తాను అజిత్ వీరాభిమానినన్నారు. ఆయనతో ఒక చిత్రంలో అ యినా నటించాలన్నది తన స్వప్నమన్నా రు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోఉన్నట్టు తెలిపారు. -
హీరోయిన్ల ముద్దుల పోటీ
అందాలను ఆరబోయడానికి ఒకప్పటి కథా నాయికలు సంకోచించే వారు. అలాంటిది ఇప్పటి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలు దాటి లిప్లాక్ కిస్ల వరకు వచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు హీరోకు ఎవరెక్కువ పెదవిపై ముద్దులు పెడతారన్న విషయంలో పోటీ నెలకొనడం విశేషం. గ్లామరస్ అనేది పాత దయిపోయింది. లిప్లాక్ కిస్లు లేటెస్ట్ ఎట్రాక్షన్గా మారింది. తమిళంలో ఇంతకు ముందు అళగియ అసురా, కేడీ బిల్లా కిల్లాడి రంగా చిత్రాల్లో నటించిన రెజీనా అప్పట్లో అరకొర దుస్తులు ధరించేది లేదంటూ షరతులు పెట్టింది. దీంతో లాభం లేదనుకుందో ఏమో తాను అందాలారబోతకు రెడీ అంటూ గ్లామరస్ గోదాలోకి దిగింది. మరో నటి రకుల్ ప్రీతి అయితే ఆరంభంలోనే పొదుపు దుస్తులతో నటించడానికి సిద్ధం అయిపోయింది. తడయర తాక్క, ఎన్నమో ఏదో చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి, రెజినాకు మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ అవకాశాలను రాబట్టుకోవడానికి లిప్లాక్ సన్నివేశాలలో నటించడానికి రెడీ అంటూ బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. దీంతో ఈ భామలకు అవకాశాలు క్యూకడుతున్నాయి. తమిళంతోపాటు తెలుగులోనూ రకుల్ప్రీతి, రెజీనాలు బిజీ హీరోయిన్లుగా మారిపోయారు. వీళ్ల తెగింపు నటి ప్రణీతకు ముప్పుగా మారిందట. తమిళంలో శకుని చిత్రంలో కార్తీకి జంటగా నటించిన ప్రణీత ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో అమ్మడు టాలీవుడ్పై దృష్టిసారించింది. అక్కడ అత్తారింటికి దారేది లాంటి ఒకటి రెండు చిత్రాలు విజయం సాధించడంతో మంచి పేరు వచ్చింది. అయితే కాస్త సంసారపక్షంగా నటిస్తున్న ప్రణీతకు రకుల్ప్రీతి, రెజీనాల ఎక్స్పోజింగ్ నటన భయం పుట్టిస్తుందట. ఇక ప్రణీత కూడా మనసు మార్చుకోక తప్పదేమో అంటున్నాయి సినీ వర్గాలు. -
చాలా ఎంజాయ్ చేశాం..
బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది ఆదివారం రక్షాబంధన్ను ఆనందంగా జరుపుకున్నారు. తమ సోదరులు ఇంటివద్ద అందుబాటులోనే ఉండటంతో రాఖీ పండుగను ఆనందంగా గడపగలిగామని బిపాసాబసు, రిచా చద్దా వంటి హీరోయిన్లు చెప్పారు. రాఖీ పండుగను ఇంకా కొంద రు హీరోయిన్లు ఎలా జరుపుకున్నారో.. వారి మాటల్లోనే.. తాప్సీ పన్నూ: నాకు సొంత అన్నదమ్ములు లేకపోవడంతో చిన్నప్పటినుంచీ మా పెదనాన్న కొడుకులు తాజిందర్, తన్వీర్,ఉదయ్వీర్లకే రాఖీ కడుతున్నా. ఒకప్పుడు రాఖీ పండుగనాడు వారికి దూరంగా ఉంటే రాఖీతోపాటు చాక్లెట్ పంపించేదాన్ని.. ఇప్పుడు మాత్రం బహుమతి వసూలు చేస్తున్నా.. మందిరాబేడీ: నా దురదృష్టం ఏంటంటే చిన్నప్పటినుంచీ నేను, నా సోదరుడు రాఖీ బంధన్నాడు ఎప్పుడూ ఒకే దేశంలో ఉండలేదు. అందుకే కొరియర్ చేస్తా.. దాంతోపాటు మా అన్నకు ఇష్టమైన స్వీట్లు చేసిపెట్టమని ఒదినకు లేఖ కూడా రాస్తా. కృతి సనూన్: నాకు సొంత అన్నదమ్ములు లేరు. అందుకే నా చెల్లికే ప్రతి యేటా రాఖీ కడతాను. ఈ ఏడాది మేము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాం. ఆమె నాకు రాఖీ పంపించింది.. నేను కూడా పంపించా.. ఫోన్లోనే శుభాకాంక్షలు చెప్పుకున్నాం. అహనా కుమ్రా: ఈ ఏడాది నా బ్రదర్ ఫిలడెల్ఫియాలో ఉన్నాడు. అందుకే నేను, నా చెల్లి వాడికి రాఖీ పంపించాం. నాకు ముంబైలో కజిన్ ఉన్నాడు. అతడికి రాఖీ కట్టా. అలాగే ‘యుద్ధ్’ సినిమాలో నాకు అన్నగా నటిస్తున్న పవైల్ గులాటికి ఒక సన్నివేశంలో రాఖీ కట్టా. అయితే ఇప్పుడు పండుగ నాడు నిజంగా రాఖీ కడదామనుకుంటే ఢిల్లీ వెళ్లిపోయాడు. అతడు రాగానే రాఖీ కట్టి బహుమతి తీసుకోవడం ఖాయం. స్వరభాస్కర్: ఎన్నో యేళ్లుగా విదేశాల్లో ఉన్న మా అన్నయ్య ఈ పండుగ రోజు ఇంటి దగ్గర ఉంటే నేను షూటింగ్ నిమిత్తం లండన్లో ఉండాల్సి వచ్చింది.. రాఖీ పంపించా.. అతడు కొత్తగా ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందాలని దేవుడికి ప్రార్థించా. రిచా చద్దా: ముంబైలోనే మా కజిన్కు రాఖీ కట్టి నేను సొంతంగా తయారుచేసిన డాల్ కిచిడీ పెట్టా. బిపాసాబసు: నేను నా ‘మూ-బోలా’ భాయ్ సోహమ్ షా కు రాఖీ కట్టా.. తర్వాత కలిసి స్వీట్ తిన్నాం.. -
బ్యాడ్మింటన్లో తలపడనున్న హీరో హీరోయిన్లు
సినీ తారలు సినిమాలతోనే కాకుండా క్రీడలతోను ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సెలిబ్రిటీ క్రికెట్ లీగ్లతో కాలక్షేపాన్నిచ్చిన సినీ తారలు ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడతో ఎంజాయ్మెంట్ను కలగజేయనున్నారు. క్రికెట్ క్రీడలో హీరోలు మాత్రమే పాల్గొని ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సారి బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో యువ హీరోలతోపాటు హీరోయిన్లు తలపడి వీక్షకుల్ని జోష్లో ముంచెత్తడానికి రెడీ అవుతున్నారు. సినిమాల్లో ఎప్పుడూ హీరోలదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడీ బ్యాడ్మింటన్ క్రీడలో హీరోలతో పోటాపోటీకి హీరోయిన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆగస్ట్లో జరగనున్న తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 50 మందికి పైగా నటీనటులు రెడీ అవుతున్నారు. వీరిలో ఆర్య, జయం రవి, శివ, ఆది, నరేన్, భరత్, వెంకట్ ప్రభు, ఆది తదితర హీరోలున్నారు. ఓవియా, రాయ్ లక్ష్మీ, రూపా మంజరి, అమలాపాల్, జనని అయ్యర్ తదితర హీరోయిన్లు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈ తారల బ్యాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ కళాకారుల సంక్షేమం కోసం ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ అనే సంస్థ నిర్వహించనుంది. దీంతో జూలై నుంచి మన అందాల తారలు ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. -
నిజంగా విశేషమే!
సినిమా వేడుకలకు హీరోయిన్లు అతిథులుగా వెళ్లడం కామనే. కానీ... త్రిష, నయనతార కలిసి ఓ వేడుకకు అతిథులుగా వెళ్లడం మాత్రం నిజంగా విశేషమే. ఎందుకంటే... ఒకప్పుడు వీరిద్దరూ బద్ద శత్రువులు. ఇప్పుడేమో ప్రాణ మిత్రులు. తాము నటించిన సినిమాల వేడుకలకే వారు సరిగ్గా హాజరవ్వరు. ఆ విషయంలో త్రిష కొంచెం పర్లేదు. అగ్ర హీరోల సినిమా అంటే.. అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. కానీ నయన మాత్రం... ‘ఎవరి సినిమా అయితే ఏంటి? డోంట్కేర్’ అనే రకం. తను ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ సినిమానే పట్టించుకోని విశాల హృదయం నయనది. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రానికి అతిథులుగా వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే- తన తమ్ముడు సత్యని హీరోగా పరిచయం చేస్తూ తమిళ స్టార్ హీరో ఆర్య ‘అమరకావ్యం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక త్వరలో జరగనుంది. ఈ వేడుకకు త్రిష, నయన అతిథులుగా వస్తే... వేదిక గ్లామరస్గా ఉంటుందని, తన తమ్ముడికి కూడా వీరి రాక కలిసొస్తుందని ఆర్య భావించాడట. పైగా ఆర్యకు త్రిష, నయనతార మంచి ఫ్రెండ్స్. ఇంకేముంది! అడగడమే ఆలస్యం ఇద్దరూ ‘సై’ అనేశారట. తమ సినిమాల ప్రమోషన్లు పట్టించుకోరు కానీ, పరాయి సినిమాల వేడుకలకు అతిథులుగా వెళ్లడం నిజంగా విడ్డూరం అంటూ కోలీవుడ్డంతా చెవులు కొరుక్కుంటున్నారట. -
అమ్మ మాట జవదాటను
అమ్మ మాట జవదాటను చాలా మంది హీరోయిన్లు అమ్మ గారాల బిడ్డలే. వారి మాటలే వేదం. క్రేజీ నటి హన్సిక తల్లి చాటు కూతురే. అమ్మే ఆమెకు మార్గ దర్శకురాలు. బాలతారగా ప్రవేశించిన ఈ బబ్లీ గర్ల్ స్టేజీ కార్యక్రమాలు, మోడలింగ్, యాడ్స్ అంటూ తన నటనకు పదునుపెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కోలీవుడ్లో అత్యధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ హన్సికే. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో కాస్త వేడి పుట్టించినా ప్రస్తుతం బుద్దిగా నటనపైనే దృష్టి సారించింది. ఈ భామ త్వరలో నటుడు విశాల్తో రొమాన్స్కు సిద్ధం అవుతోంది. అమ్మ మాట జవదాటని హన్సిక ఈ మధ్య నటుడు శింబుతో ప్రేమ వ్యహారంలో పడి తల్లి హితబోధను పెడచెవిన పెట్టి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా కాస్త సంచలనం కలిగించినా శింబు ప్రేమకు రాంరాం పలికి మళ్లీ అమ్మ గూటికే చేరింది. ఏ విషయమైనా అమ్మతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటోందట. కథల ఎంపికలోనే కాకుండా ఏ హీరోతో జత కట్టాలి వంటి విషయాలను హన్సిక అమ్మే చూసుకుంటున్నారట. దీని గురించి ఈ క్రేజీ హీరోయిన్ తెలుపుతూ బాల తారగా నటిస్తున్నప్పటి నుంచే అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికీ అదే అలవాటుగా మారిందని పేర్కొంది. ఇటీవల ఈ అమ్మడు ఒక సాహస కార్యం చేసింది. చెన్నైలోని ఒక సినీ కాంప్లెక్స్కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లి సినిమా చూసొచ్చింది. హన్సిక లాంటి స్టార్ సినిమా కొస్తే ప్రేక్షకుల కంట పడకుండా ఉండడం సాధ్యమా చాలా మంది ఆమెను గుమికూడి ఆటోగ్రాఫ్లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడం కార్యక్రమాలతో ఆ ప్రాంతం కలకలంగా మారిపోయింది. అయినా అదంతా అధిగమించి హన్సిక సురక్షితంగా ఎవరి సాయం లేకుండా ఇల్లు చేరింది. -
మొన్న ఇద్దరు ఇప్పుడు ముగ్గురు...
-
పెళ్లి బంధం ఎంత గట్టిది?
తమిళసినిమా, న్యూస్లైన్ : ప్రేమతో మనసులు కలిస్తే పెళ్లితో బంధం బలపడుతుంది. ప్రేమలో ఆకర్షణ ఉన్నా పెళ్లి మాత్రం ఆదర్శంగా ఉండాలి. అయితే ఈ కాలంలో ఇదంతా చెప్పుకోవడానికే బాగుంటుంది. ఈ బంధం ఎంత గట్టిదో కొన్ని జంటలను పరిశీలిస్తే తెలుస్తుంది. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఎన్నో పెళ్లిళ్లు సుఖ సంసారంగా మారుతున్నాయి? మరి కొన్ని కలహాల కాపురాలుగా మారుతున్నాయి? ఇక సినిమా వాళ్ల విషయానికొస్తే ప్రేమ పెళ్లిళ్ల సక్సెస్ శాతం తక్కువే. కలహాలతో విడిపోయిన వారి శాతమే అధికం అని చెప్పచ్చు. పెళ్లి విషయంలో నేటి తరం హీరోయిన్లు ఆచి తూచి అడుగేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు వ్యాపారవేత్తలనే మనువాడటానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లైఫ్కు సెక్యూరిటీ ఉంటుంది. అదీ కాకుండా సినిమాకు సంబంధం లేని కుటుంబం కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఇవన్నీ ఆలోచించే చాలామంది హీరోయిన్లు ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటున్నారు. సినిమావారైతే సమస్యలే : సినిమా రంగానికి చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండటం లేదా? అన్న తలంపు రావచ్చు. అలాంటి వారు లేకపోలేదు. అలా సక్సెస్ అయిన జంటలు చాలా తక్కువ. చాలామంది ప్రేమిం చి పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా ఉన్నా ఆ తరువాత రకరకాల కారణాలతో విడిపోతున్న జంటలే అధికం. ఇది దృష్టిలో పెట్టుకునే అధికశాతం హీరోయిన్లు సినిమాకు సంబంధం లేని వ్యాపారవేత్తలను పతులుగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అన్యోన్యం: వ్యాపారవేత్తలను పతులుగా పొంది సౌకర్యంగా ఉన్న జంటలను తెలుసుకుందాం. 1980లో గ్లామర్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి రాధ ముంబయికి చెందిన హోటల్ అధినేత రాజశేఖర్ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాకు దూరంగా భర్త వ్యాపారంలో పాలు పంచుకుంటూ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఆ పిల్లలే నేటి యువ హీరోయిన్లుగా కార్తీక, తులసి సినీ రంగంలో అడుగు పెట్టారు. మలయాళ నటి నవ్యనాయర్ ముంబ యికి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. నటి సమీరా రెడ్డి ఇటీవలే మోటార్బైక్ తయూరీదారు అక్షయ్వర్దేను వివాహమాడారు. బాలీ వుడ్ హీరోయిన్లు అధిక శాతం ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. నటి మాధురీదీక్షిత్, శిల్పాశెట్టి, జుహ్లీ చావ్లా తదితరులందరూ వ్యాపారవేత్తలనే పెళ్లాడారు. కలసి రాని బంధం : ఇకపోతే సినిమాకు చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకుని కాలం కలిసి రాకో మరో విధంగానో విడిపోయి విడాకులు పొందిన వారిలో కమలహాసన్ - సారిక, పార్తీపన్ - సీత, ప్రకాష్రాజ్ - లలితకుమారి, మనోజ్ కె జయన్ - ఊర్వశి, ముఖేష్ - సరిత తది తరులు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకా దర్శకులు, నిర్మాతలు పలువురు ప్రేమ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా విడిపోయిన వారున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ - సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లాడి ఆ తరువాత విడిపోయారు. గత కొన్ని రోజుల క్రితం దర్శకుడు ప్రియదర్శన్ - నటి విజి మధ్య మనస్పర్థలు విడాకుల వరకు దారి తీశాయి. ఆ తరువాత సన్నిహితులు రాయబారంతో వివాదం సమసిపోయింది. ఆదర్శ సినీ దంపతులు : ముందే చెప్పినట్లుగా సినిమావాళ్లలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో ఆదర్శ దంపతులుగా జీవిస్తున్న వాళ్లూ ఉన్నారు. సూర్య - జ్యోతిక, అజిత్ - శాలిని, ప్రసన్న - స్నేహ, దేవయాని - రాజ్కుమార్, శ్రీదేవి - బోనీ కపూర్, జెనీలియా - రితేష్ దేశ్ముఖ్ ఈ కోవలోకి వస్తారు. అయితే వీరి శాతం తక్కువేనంటున్నారు విశ్లేషకులు. -
ఐటమ్... ప్లీజ్
-
సింగర్లుగా మారిన హీరోయిన్లు
-
ఆన్ డిమాండ్..?
-
సన్నబడాలి.. ఒళ్లు చేయాలి!!
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. హీరోయిన్లయితే సన్నగా ఉంటేనే చూస్తామంటారు చాలామంది. అయితే.. అందరి విషయంలోనూ ఇది వర్తించదండోయ్. ఎందుకంటే, కొంతమంది బొద్దుగుమ్మలను సన్నబడాలని దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే మరికొందరిని మాత్రం మరీ చిన్నపిల్లలా కనపడుతున్నావు.. కొంచెం ఒళ్లు చేస్తేనే మంచిదంటున్నారు. ఈ రెండు విషయాలకు రెండు మంచి ఉదాహరణలున్నాయి. కెరీర్ ప్రారంభంలో తాను నటించిన షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో సన్నగా, స్లిమ్గా కనిపించిన పదహారణాల తెలుగమ్మాయి అంజలి.. ఆ తర్వాత సీతమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది. తర్వాతి కాలంలో మాత్రం అంజలి కొంచెం లావెక్కింది. అందుకే యంగ్ హీరోలు ఈ అమ్మడి జోలికి పోవటంలేదు. దాంతో సీనియర్ హీరోల సరసన చేయడమైతే చేస్తోంది. కానీ తనకు చాన్సులు ఎందుకు రావట్లేదో లేటుగా తెలుసుకుంది. అందుకే జిమ్లో తెగ కుస్తీలు పడుతోందట. ఎలాగైనా సరే బరువు తగ్గించుకుని యంగ్ హీరోలతో ఆడిపాడాలని ఆశపడుతుంది. ఈమె ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.. ఏ హీరోలు ఛాన్సులిస్తారో వేచి చూడాలి. మరోవైపు బుల్లితెర నుంచి వెండితెరమీదకు ప్రమోషన్ తెచ్చుకుని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే దగ్గర్నుంచి ఇటీవలే విడుదలైన బంగారుకోడిపెట్ట వరకు ఓ అరడజను సినిమాల్లో నటించేసిన కలర్స్ స్వాతికి మాత్రం దర్శక నిర్మాతలు కొంచెం లావెక్కితే మంచిదని చెబుతున్నారు. మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావని, అందువల్ల కొంచెం లావెక్కితే మంచిదని ఆమెకు చెప్పడంతో ఎంచక్కా తనకిష్టమైన ఫుడ్ లాగించేస్తూ లావయ్యే ప్రయత్నాలు చేస్తోందట స్వాతి. -
సింగ్పూర్, మలేషియా దేశాల్లో డాక్టర్ టీఎస్.రావు బృందం పర్యటన
విజయవాడ, న్యూస్లైన్ : ప్రముఖ సైకాలజిస్టు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ టీఎస్.రావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ఎంవీ.రావు, విక్టరీ పబ్లిషకేషన్స్ అధినేత ఇమ్మడిశెట్టి రామకుమార్లతో కూడిన బృందం ఈ నెల 12వ తేదీ నుంచి ఆరు రోజులపాటు మలేషియా, సింగపూర్ల దేశాల్లో పర్యటించనుంది. ఆయా దేశాల్లోని తెలుగు సమాజం వీరిని ఆహ్వానించింది. సూర్యారావుపేటలోని స్పందన సైకియాట్రి సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ టీఎస్.రావు వివరాలు వెల్లడించారు. మలేషియా, సింగపూర్లో నివసించే తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, త ల్లిదండ్రులతో పిల్లల సంబంధ బాంధవ్యాలు, తెలుగు భాషపై వారి అభిరుచి ఎలా ఉంది తదితర అంశాలపై బృందం పరిశోధిస్తుందని చెప్పారు. అక్కడి బాలబాలికలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాను రచించిన ‘బాలలకు బంగారు బాట’ పుస్తకాన్ని మలేషియాలో ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాన్ని అక్కడ స్థిరపడి తెలుగు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ అచ్చయ్యకుమార్కు అంకితం ఇస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ నెల 16న సింగపూర్లో జరిగే కార్యక్రమంలో ‘ఆనందానికి 50 మార్గాలు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని, అలాగే డాక్టర్ ఎంవీ.రావు రచించిన ‘ఆనందంతో విజయం’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. -
వీళ్ల గుండెజారి గల్లంతయ్యిందా?
-
ఫోటోషూట్స్ ని నమ్ముకుంటున్న బేబ్సీ
-
హాట్ బేబీకి ఇప్పుడు టైం వచ్చింది
-
పెళ్లి ఊసెత్తని హీరోయిన్లు
-
ఐటమ్ గాళ్స్గా మారుతున్న సీనియర్లు
-
మెరుపు తీగలు
-
రీఎంట్రీ ఇస్తున్న మాజీ హీరోయిన్లు
-
ఓం అంటున్న అందాలభామలు