Hitler
-
హిట్లర్ను మానవుడన్న మహాత్ముడు!
ఇప్పుడు రాస్తున్న దానిని గతవారమే నేను ఈ కాల మ్లో రాసి ఉంటే, అప్పు డది మహాత్మాగాంధీ వర్ధంతి రోజుకు మరింత సంద ర్భోచితంగా ఉండి ఉండే దని అనిపించవచ్చు. అదే కారణంతో అలా నేను రాసి ఉంటే సమయం,సందర్భం చూసి, రెచ్చకొట్టడానికి నేను రాసిన ట్లుగా ఉండేది. లేదంటే, మనోభావాలను దెబ్బ తీసినట్లయ్యేది. కాబట్టి, ఈరోజు నేను లేవనెత్తు తున్న విషయాలపై మీ ప్రతిస్పందన భావావేశా లకు లోను కాని విధంగా ఉంటుందని ఆశిస్తాను. గాంధీ మరణించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా – ఆయనకున్నటువంటి కొన్ని వివాదాస్పద, లేదా విరుద్ధమైన, అదీ కాకుంటే ఆమోదయోగ్యం కానివైన అభిప్రాయాలను మనం ఎలా పరిగణించాలన్న దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది. 2024లో అవి మనకు దిగ్భ్రాంతిని గొల్పవచ్చు. 1940ల లోనైనా వాటికి ఇప్పటి కన్నా ఎక్కువగానే సమ్మతి లభించి ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. భారత స్వాతంత్య్రం, దేశ విభజనలపై అలెక్స్ వాన్ తంజల్మాన్ (బ్రిటిష్ చరిత్రకారిణి) పుస్తకం ‘ఇండియన్ సమ్మర్’ (2007)ను జాగ్ర త్తగా చదివినప్పుడు–రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, ఆనాటి మారణహోమం పైన గాంధీజీ దృష్టికోణం ఏమిటో తెలిసి నిర్ఘాంతపోయాను. గాంధీ శాంతి కాముకులని, అహింస పట్ల ఆయన నిబద్ధత తిరుగులేనిది, కొదవలేనిదని మనకు తెలిసిందే. ఆ నిబద్ధతే ఆయనను... హిట్లర్, ముస్సోలినీల దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవద్దని బ్రిటన్కు సలహా ఇచ్చేంతవరకు తీసుకెళ్లిందా! ‘‘వారిని మీ అందమైన దీవిని జయించనివ్వండి. పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని చంపేయటానికి మీకై మీరు వారిని అనుమతించండి. అయితే వారికి విధేయంగా ఉండటానికి మాత్రం నిరాకరించండి’’ అని చెప్పారాయన. 1962లో ఇండియాపై చైనా దాడి, లేదా ఇండి యాపై పాకిస్తాన్ పదే పదే చేస్తుండే దాడుల విషయంలో కూడా గాంధీ అలాగే స్పందించే వారా? ఏమైనా మహాత్ముడు భీతికొల్పేంత స్థిర చిత్తుడు అయుండాలి కానీ కపటి మాత్రం కాదు. మరీ అధ్వాన్నం... హిట్లర్ దుష్టుడు అంటే గాంధీకి నమ్మబుద్ధి కాకపోవటం! ‘‘గౌరవనీయు లైన హిట్లర్ను – ఆయన్ని చిత్రీకరించినంత – చెడ్డ వారిగా నేను పరిగణించను’’ అని 1940లో గాంధీ రాశారు. ‘‘ఎక్కువ రక్తపాతం లేకుండా విజయాలు సాధించే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ట్లుగా ఆయన నాకు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘భవి ష్యత్ జర్మన్లు శ్రీ హిట్లర్ను మేధావిగా, ధీశాలిగా, సాటిలేని కార్యాచరణశీలిగా, మరెన్నో విధాలుగా గౌరవిస్తారు’’ అని గాంధీ భావించారు. దీనికన్నా కూడా, మాటల్లో వివరించలేనిది ఏమిటంటే – యూదుల పట్ల నాజీల అమానవీయ ప్రవర్తనపై గాంధీ ప్రతిస్పందన. లూయీ ఫిషర్ (అమెరికన్ జర్నలిస్ట్) రాసిన మహాత్ముడి జీవిత కథను ఉటంకిస్తూ, వాన్ తంజల్ మాన్... యూదులు సానుకూలమైన ప్రతిఘటనను మాత్రమే నాజీలకు అందించాలనీ, అవసరం అయితే తమ జీవితాలను సైతం త్యాగం చేయాలనీ గాంధీ సలహా ఇచ్చారని వెల్లడించారు. అడాల్ఫ్ హిట్లర్ కోసం ప్రార్థించమని కూడా ఆయన వారిని కోరారట. ‘‘కనీసం ఒక యూదుడు ఇలా చేసినా అతడు తన ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నట్లేనని, అందువల్ల ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడని, ఆ మంచితనం అంటువ్యాధిలా విస్త రించి మొత్తం యూదు జాతినే కాపాడుతుందని, మానవాళికి సుసంపన్నమైన ఒక గొప్ప వారస త్వాన్ని వదిలివెళుతుందని గాంధీ అన్నారు’’ అని లూయీ ఫిషర్ రాసినట్లు వాన్ పేర్కొన్నారు. యూదుల నిర్బంధ శిబిరాలను కనుగొన్నాక కూడా, వాటిల్లో జరుగుతున్న అతి భయానక దారుణాలు ప్రపంచం దృష్టికి వచ్చాక కూడా లూయీ ఫిషర్తో గాంధీ ఇలా అన్నారు: ‘‘హిట్లర్ 50 లక్షల మంది యూదులను చంపాడు. ఇది మనకాలపు అతి పెద్ద నేరం. కానీ యూదులు తమకై తాము కసాయి కత్తికి తమను సమర్పించుకుని ఉండాల్సింది. తమను తాము శిఖరం అంచులపై నుండి సముద్రంలోకి తోసుకుని ఉండాల్సింది...’’హింసపై పూర్తి వ్యతిరేకత, అహింస పట్ల అచంచలమైన నిబద్ధత కలిగి ఉన్న కారణంగానే గాంధీ అలా అని ఉంటారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అంతవరకే అది ఏకైక ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన. హిట్లర్ను ఎది రించవద్దని, హిట్లర్ కోసం ప్రార్థించమని, తమకు తాము ఆత్మార్పణం చేసుకోవాలని ఆయన యూదులకు చెప్పటం మాత్రం విడ్డూరం. కనికరం లేకపోవటం, కించపరచటం, క్రూరత్వం.1984లో సిక్కులకు, 2002లో ముస్లింలకు, నేటి ఆదివాసీలకు గాంధీ ఇచ్చే సలహా కూడా అదే విధంగా ఉండేదా? బహుశా... ఉండేది! మళ్లీ అడి గినా ఇదే సమాధానం. బ్రహ్మచర్యంతో గాంధీ చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా... యుద్ధం మీద, హిట్లర్ మీద, మారణహోమం మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత వ్యామోహాలు, బలహీనతల స్థాయికి మించినవి. ఆయన ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే అవి విధానాలుగా మారిఉండేవి. అందుకే వాటిని చర్చించి, పరిష్కరించాల్సి ఉంది. అంతిమంగా, వాటికి ఆమోదయోగ్యమైన వివరణ లభించకపోతే వాటిని విమర్శించాలి. తిప్పికొట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చిక్కుల్లో పడతాననే మాటనైతే నేను కాదనను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చిరంజీవి హిట్ సినిమా.. 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ సినిమా హిట్లర్ రీరిలీజ్ కానుంది. 1997లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత హిట్లర్ సినిమా రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన హిట్లర్ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కోటీ అందించిన సంగీతం చాలా హిట్ అయింది. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం. 42 సెంటర్స్లలో హిట్లర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా జనవరి 1న రీరిలీజ్ కానుంది. 'అంతొద్దు - ఇది చాలు' అన్న డైలాగు ఈ చిత్రం నుంచే ట్రెండ్ అయింది. ఇన్నేళ్లు అయినా ఈ డైలాగ్ మీమ్స్ రూపంలో ఇప్పటికీ సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 'నడక కలిసిన నవరాత్రి' అనే పాటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్. ఇందులో 'అబీబీ.. అబీబీ.. అంటూ సాగే పాటకు చిరు ఎవర్గ్రీన్ స్టెప్ వేశారు. దీనికి లారెన్స్ నృత్యాలు సమకూర్చారు.చిరు సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసిన ఇంద్రజ'యమలీల' సినిమా హిట్తో మంచి క్రేజ్లో ఉన్న నటి ఇంద్రజకు చిరుతో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే, దానిని ఆమె కాదనుకుంది. మొదట అల్లుడా మజాకా సినిమాలో మెగాస్టార్కు చెల్లిగా ఇంద్రజను అనుకున్నారు. కానీ, ఆమె నటించకపోవడంతో ఆ ఛాన్స్ నటి ఊహ దక్కించుకుంది. అలాగే హిట్లర్ సినిమాలో కూడా చిరు పక్కన మళ్లీ సోదరిగా నటించే అవకాశం దక్కింది. అప్పుడు కూడా తనకు డేట్స్ వీలు కాకపోవడంతో నో చెప్పింది. అలా రెంసార్లు చిరంజీవి ప్రాజెక్ట్లను ఆమె తిరస్కరించింది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పింది. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఉండదని భావించి ఆ చిత్రాలను తిరస్కరించానని ఆమె పేర్కొంది. తాను చిరుకు అభిమానినని ఆయనతో కలిసి ఒక పాటకు అయినా డ్యాన్స్ చేయాలనేది తన కోరిక అని ఆమె పేర్కొంది. -
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్టౌన్లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్గా పనిచేశాడు. 2005లో ఇరాక్లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్్క, డేవిడ్ ఓ సాక్స్లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు
దీపావళిని దేశవ్యాప్తంగా అందరూ గ్రాండ్గా జరుపుకొన్నారు. పండగ రోజే తెలుగు, డబ్బింగ్ మూవీస్ కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు వీకెండ్ వచ్చేసింది. ఇందుకు తగ్గట్లే ఓటీటీల్లోకి కూడా క్రేజీ మూవీస్ వచ్చేశాయి. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విశ్వం, కలి అనే తెలుగు చిత్రాలతో పాటు హిట్లర్, లబ్బర్ పందు అనే డబ్బింగ్ మూవీస్.. యుధ్రా అనే హిందీ చిత్రం ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'తంగలాన్' కూడా నెట్ఫ్లిక్స్లో దీపావళికి రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పారు. కానీ ఇందులో కాకుండా ఆస్ట్రో మూవీస్ అనే మరో ఓటీటీలో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వచ్చింది. అది కూడా భారత్లో స్ట్రీమింగ్ కావట్లేదు.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (నవంబర్ 1st)అమెజాన్ ప్రైమ్విశ్వం - తెలుగు సినిమాసూరజ్ సూదేశ్ మూవీ - మలయాళ మూవీసత్తం ఎన్ కయిల్ - తమిళ సినిమాఇబ్బని తబ్బిడ ఇలయాలీ - కన్నడ మూవీబ్లాక్ - తమిళ సినిమాఫ్రీడమ్ - ఫ్రెంచ్ చిత్రంయుధ్రా - హిందీ సినిమా (రెంట్ విధానం)హిట్లర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)నెట్ఫ్లిక్స్లెట్ గో - స్వీడిష్ సినిమాఇట్స్ ఆల్ ఓవర్ - స్పానిష్ సినిమాబార్బీ మిస్టరీస్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ - ఇంగ్లీష్ సినిమాలబ్బర్ పందు - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఎక్స్ప్లోరర్: ఎండ్యురెన్స్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 3)ఆహాఅర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కలి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)జియో సినిమాదస్ జూన్ కి రాత్: చాప్టర్ 2 - హిందీ సిరీస్జీ5మిథ్య: ద డార్క్ చాప్టర్ - హిందీ సిరీస్ఆస్ట్రో మూవీస్తంగలాన్ - తమిళ మూవీఅంధగన్ - తమిళ సినిమా(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్
తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు కనుమరుగైపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం హిట్ సినిమాలు చేసినా సరే కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలాంటి వ్యక్తే. అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి పక్కన నటించింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ఠ. అరె ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరబ్బా అనుకుంటున్నారా? 80-90ల్లో తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. దాదాపు 100కి పైగా తెలుగు సినిమాల్లో బాలనటిగా చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?)'సమరసింహారెడ్డి' సినిమాలో హీరోకి నడవలేక ఇబ్బంది పడే చెల్లి ఉంటుంది. ఆ పాత్ర పోషించింది శ్రేష్ఠనే. ఇదే ఈమెకి చివరి మూవీ కూడా. దీని తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. బీటెక్, ఎమ్ టెక్, ఎమ్ఎస్ చేసి అమెరికాలో జాబ్ చేసింది. తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం తండ్రికి చెందిన కన్స్ట్రక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈమెని చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.ఇక ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సమర సింహారెడ్డి, రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్ తదితర చిత్రాలున్నాయి. ఈమెకు మంచు మనోజ్తో కూడా పెళ్లి చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ప్రస్తుతానికైతే ఈమె సింగిల్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓ బాలనటి ఇలా చాన్నాళ్ల తర్వాత కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?) -
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి. 2008 మేఘాలయ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. నాడు కెన్నెడీతో పాటు హిట్లర్ పేరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో కనిపించాయి. 2024 లోక్సభ ఎన్నికల నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ ఘటనను ‘ఎన్నికల కథనాలు’లో పంచుకుంది.2008లో మేఘాలయలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో ఒక షాకింగ్ న్యూస్ ప్రచురితమైంది. ‘జాన్ ఎఫ్ కెన్నెడీ స్వయంగా అడాల్ఫ్ హిట్లర్ను అరెస్టు చేశారు’ అనేది దాని హెడ్డింగ్. ఆ రెండు పేర్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నఅప్పటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి అడాల్ఫ్ లూ హిట్లర్ మారక్ను ఏదో కేసులో అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ ఎఫ్ కెన్నెడీ అరెస్టు చేశారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘జాన్ ఎఫ్ కెన్నెడీ చేతుల మీదుగా అడాల్ఫ్ లూ హిట్లర్ అరెస్ట్’ అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. నాటి ఎన్నికల ఫలితాల్లో హిట్లర్ విజయం సాధించారు.లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లొ పోస్ట్ చేసింది. గత ఏడాది అడాల్ఫ్ హిట్లర్ మారక్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. కాగా జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా 35వ అధ్యక్షుడు. అతను 1961 నుండి నవంబర్ 1963లో హత్యకు గురయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ ఒకప్పటి జర్మనీ నియంత. ఆయన 1945లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. #Chunaviकिस्सेभारतीय चुनावों से जुड़े रोचक किस्से 🙌#ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 pic.twitter.com/1o88yQB3B2— Election Commission of India (@ECISVEEP) March 18, 2024 -
హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది
లక్నో: 2014లో అధికారంలోకి వచ్చిన నాయకుడు 2024లో పదవి నుంచి దిగిపోతాడని సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ కేవలం 10 సంత్సరాలే అధికారంలో ఉన్నాడని గుర్తుచేశారు. మన దేశంలోని నాయకుడు పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడని, ఇక ఆయన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసిందని తేల్చిచెప్పారు. ఆ నాయకుడికి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని, రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు అంతే ఘనంగా వీడ్కోలు చెబుతారని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను, మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్కు సింధియా కౌంటర్ -
ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం!
‘ద గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి – హిట్లర్ పాత్ర (డిక్టేటర్) రెండు – హిట్లర్ పోలికలతో ఉన్న క్షురకుడి పాత్ర. వేల సంఖ్యలో సైనికులు బారులు తీరి ఉన్న సన్నివేశమది. వందల సంఖ్యలో మిలిట్రీ అధికారులు హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహాసభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి హిట్లర్ బదులు, అతని పోలికలతో ఉన్న క్షురకుడు చేరుకుంటాడు. అతనే హిట్లరనుకుని అధికారులు గౌరవ వందనం సమర్పించి అతణ్ణి వేదిక మీదికి తీసుకు వెళతారు. ఒక నిమిషం తడబడి ఆ తర్వాత – ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్నదేమిటో మాట్లాడతాడు. హిట్లర్ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంత రంగాన్ని అతి సామాన్యుడైన క్షురకుడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ‘ద గ్రేట్ డిక్టేటర్’లోని ఉపన్యాసంముఖ్యాంశాలు ఇక్కడ మీకందిస్తున్నాను. ‘‘క్షమించాలి! నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కాని, ఎవరి మీదనో పెత్తనం చలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు, నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దుఃఖం కాదు – ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిదీ. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతిరూప మవ్వాలి! కానీ, మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మల్ని విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింపజేస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే! కానీ, మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావాల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడం లేదు. మన విజ్ఞానం మనల్ని మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. యంత్రాల యంత్రాంగం కన్నా, మనకు మాన వత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కావాలి. ఈ లక్ష ణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది. రేడియో, విమా నాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవుని లోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వమానవ సౌభ్రా తృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈర్షా్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజల నుండి లాక్కున్న అధికారం మళ్ళీ, తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా, అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! మీకు తిండి పెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. మీరు పశువులు కాదు. గడ్డి పోచలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. యంత్రాల్ని సృష్టించుకోగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. రండి! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం! శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం.. రండి! అందరం ఏకమౌదాం!!’’ ఇది చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్ను చార్లీ చాప్లిన్ ఆటపట్టించాడు. కానీ, చాప్లిన్ అభిమానుల్లో హిట్లర్ ఒకడు! ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ‘వరల్డ్ గ్రేటెస్ట్ ఎంటర్టెయినర్’గా, ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన సర్ చార్లీ చాప్లిన్ (16 ఏప్రిల్ 1889 – 25 డిసెంబర్ 1977) తన విజయ రహస్యాన్ని తానే అనేకసార్లు బేరీజు వేసుకున్నాడు. ‘ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు – పిగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారి పోయే ప్యాంట్ వదిలేస్తే ఎవరికీ నవ్వు రాదు. కానీ, జారిపోకుండా పైకి అనుకుంటూ హడావిడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్ను, ఒక పెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వు రాదు. సమాజంలో తానొక పెద్ద మనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందని బాధ పడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ... చూస్తూ ఉండ టంలో హాస్యం ఉంది... బలహీనుడై ఉండి, పహిల్వాన్తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండ టంలో హాస్యం ఉంది. హాస్యం కత్తి మీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయి. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేధలోంచి వచ్చింది. ‘‘నూటికి పదిమంది బాగా ఉన్నవాళ్ళూ, తొంభయిమంది లేనివాళ్ళూ ఉన్న ఈ సమాజంలో... 90 శాతం ప్రజల్ని నవ్వించడానికి, 10 శాతం మందిని గేలి చేయడంలో– తప్పేమిటి?’’ అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా, సరళంగా చెప్పిన వాళ్ళు బహుశా ఎవరూ లేరేమో! హాస్యంతో మానవ వాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో!! డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్గా విజయ్ ఆంటోని కొత్త లుక్లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
US Elections: అవి హిట్లర్ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్
వాషింగ్టన్: అక్రమ వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన పుస్తకం ‘మెయిన్ కంఫ్’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యల వెనుక హిట్లర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్ గురించి ఏమీ తెలియదు. హిట్లర్ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్ కొట్టిపారేశారు. నేషనల్ పల్స్ అనే వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్ పాయిజనింగ్ ద బ్లడ్ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్లో న్యూ హ్యాంప్షైర్లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇవి హిట్లర్ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్ ఫేవరెట్గా మారారు. ఇదీచదవండి..ఇరాన్పై అమెరికా సంచలన ఆరోపణలు -
యూదుడైన ఐన్స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది?
అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. దీని వెనుక పలువురి సహకారం ఉంది. వీరిలో కొందరు అమెరికన్లు, మరికొందరు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. ఈ సహకారం నేపధ్యంలో ఇతర దేశాల వారు అమెరికన్లుగా మారడం విశేషం. అంతరిక్షంలో అమెరికా సాధించిన విజయం వెనుక మరో దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నరని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు అమెరికాకు బద్ధ శత్రువుగా ఉన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అమెరికా అంతరిక్ష విజయానికి సహకరించారని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను తీసుకువెళ్లడంలో అమెరికాకు హిట్లర్కు అత్యంత సన్నిహితుడైన శాస్త్రవేత్త సహకరించారు. ఈ ప్రయోగం నేపధ్యంలో నాసా ఖ్యాతిని సదరు శాస్త్రవేత్త ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఈ నేపధ్యంలో ఆ శాస్త్రవేత్తకు అమెరికా.. స్థానిక పౌరసత్వం ఇవ్వడంతోపాటు, భారీగా నగదు బహమానం కూడా అందించింది. ఆ శాస్త్రవేత్త పేరు వెర్నెర్ వాన్ బ్రాన్. ఇతను జర్మనీలోని ధనిక కుటుంబంలో జన్మించాడు. అంతరిక్షంపై అతనికున్న అభిరుచి ఈ రంగంలో అతను మరింత ఎదిగేలా చేసింది. వెర్నెర్ వాన్ బ్రాన్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి అంతరిక్షంపై అభిరుచి ఏర్పడింది. బ్రాన్ పుట్టినరోజున అతని తల్లి టెలిస్కోప్ కానుకగా ఇచ్చింది. అది మొదలు బ్రాన్కు ఆకాశంలో ఏముందో చూడాలనే కోరిక మొదలయ్యింది. బ్రాన్ తన 17 ఏళ్ల వయస్సులో బెర్లిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత తన 18 ఏళ్ల వయసులో జర్మన్ రాకెట్ సొసైటీలో ప్రవేశం పొందాడు. ఈ నేపధ్యంలోనే ద్రవ-ఇంధన రాకెట్ నిర్మాణాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. అదే సమయంలో అతనికి హిట్లర్తో అతని సాన్నిహిత్యం ఏర్పడింది. హిట్లర్కు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో ఒకనిగా మారాడు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ అన్ని రంగాలలో ఓటమిని ఎదుర్కొంది. ఈ తరుణంలో హిట్లర్ సన్నిహితులకు ఆశ్రయం కల్పించాలని అమెరికా భావించింది. ఈ నేపధ్యంలోనే అమెరికా ‘ఆపరేషన్ పేపర్క్లిప్’ అనే ఆపరేషన్ చేపట్టింది. అప్పుడే బ్రాన్తో పాటు ఇతర జర్మన్ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా చేరుకున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 1946 ఏప్రిల్ 16న అమెరికాలో తొలి క్షిపణి పరీక్ష వీ-2ను చేపట్టింది. ఇది అమెరికా అంతరిక్ష యాత్రను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. దీని తర్వాత 1955లో అమెరికా ‘నాసా’ను స్థాపించినప్పుడు, బ్రాన్ను అమెరికా అక్కడకు పంపింది. 1969, జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాడు. ఈ ప్రయోగంలో వెర్నెర్ వాన్ బ్రాన్ సేవలు మరువలేనివి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
ఆమె నియంత హిట్లర్కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
బీజేపీ పాలన హిట్లర్, స్టాలిన్ కంటే అధ్వానం: మమతా ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.. కేంద్ర ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. మోదీ పాలన హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలినీ కంటే దారుణంగా ఉందని మమతా ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో సీఎం మమతా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. ఏజెన్సీలను ఉపయోగించి కేంద్రం రాష్ట్రాల పనితీరులో తలదూర్చుతూ సమాఖ్య వ్యవస్ధను ధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై దీదీ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ చర్చను ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు. ఉజ్వల యోజన కింద బీపీఎల్ దిగువన ఉండే కుటుంబాలకు మాత్రమే గ్యాస్ ధరను తగ్గించారని, ఇది ప్రతి ఎన్నికలకు ముందు చేపట్టే కంటితుడుపు చర్యేనని అన్నారు. పేద ప్రజలు రూ. 800 పెట్టి వంట గ్యాస్ సిలిండర్ను ఎలా కొనుగోలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. చదవండి: ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్కు అనుమతిస్తారా? -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
అలా జరిగి ఉండకపోతే..
ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది. మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్ సోవియట్ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్ రష్యాకు సవాల్ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. బ్రిటిష్ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్?’ అని కాలర్ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. -
హిట్లర్ బతికుంటే కేసీఆర్ను చూసి ఏడ్చేవాడు: కోమటిరెడ్డి
హైదరాబాద్: మూసీ నదిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్లో మాట్లాడుతానని ఆయన అన్నారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ను చూసి ఏడ్చేవాడని కోమటిరెడ్డి విమర్షించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రికి రెండు సార్లు వస్తే.. ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని దుయ్య బట్టారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడినట్లన్నారు. దళితులకు కేబినెట్లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్కు తెలుసని విమర్షించారు. -
3,518 మంది హత్య.. 75 ఏళ్ల తర్వాత విచారణ
-
గూగుల్లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్జెక్ పేరుతో పోలాండ్లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్లో డాక్టరేట్ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్విల్లే గేమ్స్ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్’
మహా నియంత హిట్లర్పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్ ఆఫ్ ది విల్ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్స్టాల్ రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా(అనధికారికంగా)తో పాటు, ఫ్రేమ్ టు ఫ్రేమ్లో హిట్లర్ హస్తం ఉందట. ఈ సినిమా నటబృందంలో హిట్లర్ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్ ట్రయంప్ ఆఫ్ ది విల్ స్పీచ్’గా ఇది బాగా పాప్లర్ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్ కెమెరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ, లాంగ్–ఫోకస్ లెన్స్.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్... మొదలైన దేశాల్లో అవార్డ్లు గెలుచుకుంది. l -
హిట్లర్ టోపీ ధర ఎంతో తెలుసా!
మ్యూనిచ్ : అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. రెండో ప్రపంచ యుద్దం జరగడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో హిట్లర్ కూడా ఒకరు. నాజీ వ్యవస్ధాపకుడైన హిట్లర్ జర్మనీకి ఒక నియంతలా వ్యవహరిస్తూ అందరి మాటను పెడచెవిన పెడుతూ తన చావును తానే కొనితెచ్చుకున్నాడు. హిట్లర్ ప్రవర్తనతో పాటు అతని ఆహార్యం కూడా వింతగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ! ఏం లేదండి.. హిట్లర్ చనిపోయి 74 సంవత్సరాలు అయినా ఆయన ధరించిన కొన్ని వస్తువులు మాత్రం మ్యూనిచ్ ప్రాంతంలోని ఒక మ్యూజియంలో భద్రపరచారు. తాజాగా హిట్లర్కు సంబంధించి ఆయన తరచూ ధరించే టోపీతో పాటు నాజీకి సంబంధించిన వస్తువులను బుధవారం ఆన్లైన్లో వేలం వేశారు. అయితే వీటిని చేజెక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోటీ పడ్డారు. కాని, స్విట్జర్లాండ్కు చెందిన అబ్దుల్లా చతీలా అనే వ్యాపారవేత్త హిట్లర్ ధరించిన టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ. 40లక్షలు) దక్కించుకున్నారు. అయితే దీనిని ఇజ్రాయెల్ నిధుల సేకరణ సంస్థ అయిన కెరెన్ హేసోడ్కుకు విరాళంగా ఇచ్చాడు. అయితే ఆఫర్లో ఉన్న మిగతా నాజీ వస్తువులను మాత్రం పొందలేకపోయాడు. కాగా, నాజీ వస్తువులను పొందడానికి ఇతరులు బారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు తెలుస్తుంది. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు ఎవరో తెలుసా?
క్రికెట్ను ఓ మతంలా అభిమానించే మనదేశంలో ఒకప్పుడు ఆ క్రీడాకారుడి కోసం ఆటపై మక్కువ పెంచుకున్నారు. అతి సామాన్యుల నుంచి హిట్లర్ వంటి నియంత కూడా అతని ఆటకు ఫిదా అయ్యారంటే అతని స్పెషాలిటీ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ క్రీడాకారుడు ఎవరు? ఆయన సృష్టించిన అద్భుతాలు ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు!
-
రేపే ‘హిట్లర్’బాబు పతనమయ్యేది!
సాక్షి, హైదరాబాద్ : వంద మందిని తిన్న రాబందు ఒక్క గాలి వానకు నేల కూలుతుందన్నది ఎంత నిజమో.. ఎంతటి వారైనా సమయం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతారన్నది కూడా అంతే నిజమని చరిత్ర చెబుతోంది. ప్రపంచాన్నే శాసించాలనుకున్న హిట్లర్.. చివరకు నియంతగా చరిత్రలో మిగిలిపోయాడు. కాకతాళీయమో.. యాదృశ్చికమో కానీ నియంత హిట్లర్ జన్మదినం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఒకే రోజు (ఏప్రిల్ 20). ఇక జర్మనీలో హిట్లర్ పాలన అంతమైన రోజు 1945 మే 23 కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మే 23( రేపే) వెలువడటం విశేషం. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు పతనం కూడా మే 23నే కాబోతుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. హిట్లర్ బాబు పాలన రేపటితో ముగియనుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సైతం విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. చక్రం తిప్పడం అంటే ఢిల్లీ చుట్టూ తిరగడం కాదనీ, ఢిల్లీ నేతలను మన చుట్టూ తిప్పుకోవడమనే సైరా పంచ్తో చురకలటించారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారని, కానీ చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయని మండిపడ్డారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు. 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త పని కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని, ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరన్నారు. వాళ్లే అసలు ఉద్యోగం లేక, సగం పనితో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఆత్మావలోకనం
నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. నువ్వు ఇంటికి వెళ్తున్నావు. కారు యాక్సిడెంటయింది. భార్యనీ ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాడుదామని డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నీ శరీరం ముక్కలయింది. నన్ను నమ్ము. నీ ప్రాణం పోయిన మరుక్షణం నన్ను కలిశావు. ‘‘ఏం జరిగింది? నేనెక్కడున్నాను?’’ నేను నిజం చెప్పాను. ‘‘నువ్వు మరణించావు. మళ్లీ మళ్లీ అడగాల్సిన పనిలేదు.’’ ‘‘ఆ ట్రక్కు... ఆ ట్రక్కు... దూసుకువచ్చి.’’ ‘‘అవును.’’ ‘‘నేను చచ్చిపోయానా?’’ ‘‘విచారించకు. పుట్టిన ప్రతిమనిషీ చావక తప్పదు.’’ చుట్టూ చూశాడు మరణించిన మనిషి. అంతా శూన్యం. ‘‘ఈ చోటు ఏమిటి? జీవితం ముగిశాక వచ్చేది ఇక్కడికేనా?’’ ‘‘దాదాపు అంతే!’’ ‘‘నువ్వెవరివి? దేవుడివా?’’ ‘‘అలాగే అనుకో.’’ ‘‘నా పిల్లలు... నా భార్య’’ ‘‘వాళ్లతో పనేమిటి?’’ ‘‘వాళ్లు క్షేమంగా ఉంటారా?’’ ‘‘వాళ్లు క్షేమంగా ఉండాలని నేనూ అనుకుంటున్నా. నువ్వు ఇప్పుడే మరణించావు గనక నీ ఆలోచనలు నీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి.’’ మరణించిన మనిషి తన ఎదురుగ్గా ఉన్న ఆకారం వైపు చూశాడు. అతడు దేవుడిలా కనపడలేదు. ఒక మామూలు మనిషిలా కనిపించాడు. ఒక ఆడమనిషిలా కనిపించాడు. ఒక అస్పష్టమైన రూపంలా కనిపించాడు. దేవుడిలా కాకుండా గ్రామర్ స్కూల్ టీచర్లా కూడా కనిపించాడు. ‘‘పెళ్లాం పిల్లల గురించి బాధపడకు. నీ సంతానం నిన్నొక మంచి మనిషిగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్లది నీ పట్ల కోపంగానీ ద్వేషంగానీ ఉండే వయస్సు కాదు. నీ భార్య పైకి దుఃఖిస్తుందేమో గానీ ఎలాగూ మీ పెళ్లి ‘బ్రేక్’ అవబోతున్నది కనుక ఆమెకు ఇది ఉపశమనమే. మహా అయితే కొంచెం విచారిస్తుందేమో!’’ ‘‘ఇప్పుడేం జరుగుతుంది? నేనెక్కడికి వెళ్తాను? స్వర్గానికా, నరకానికా?’’ ‘‘ఎక్కడికీ వెళ్లవు. మళ్లీ పుడ్తావు.’’ ‘‘ఆ... అంటే... అదే కరెక్టా. హిందువులు చెప్పేదే నిజమా?’’ ‘‘అన్ని మతాలూ వాటి పద్ధతుల్లో కరెక్టే. నాతోరా!’’ మరణించిన మనిషి ఆ ఆకారాన్ని అనుసరించాడు. ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ ‘‘ఫలానా చోటనేం లేదు. మాట్లాడుతూ నడుద్దాం, బాగుంటుంది.’’ ‘‘నేను మళ్లీ పుడితే... మళ్లీ అన్నీ మొదట్నించీ అనుభవించాలా?’’ ‘‘అన్ని గత జన్మలలోనూ నువ్వు సంపాదించిన జ్ఞానమూ అనుభవమూ నీ లోపలే ఉంటాయి. కానీ వాటిని నువ్వు గుర్తుచేసుకోలేవు’’ అంటూ మరణించిన మనిషిని ఆ ఆకారం తన భుజం మీద వేసుకుంది. ‘‘నీ ఆత్మ ఎంత గొప్పదో ఎంత అందమైనదో నువ్వు ఊహించలేవు. నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది. గత నలభై ఎనిమిది యేళ్ల నుంచి మనిషిగా ఉన్నావు. అయినా నీ లోపల ఉన్న చైతన్య శక్తి గురించి నీకు తెలీదు. చాలాకాలం పాటు నాతో ఉంటే నీకది తెలుస్తుంది. కానీ జన్మ జన్మకీ మధ్య అంత తీరికా అవకాశమూ దొరకదు నీకు.’’ ‘‘నేను ఎన్నిసార్లు పుట్టి ఉంటాను?’’ ‘‘అనేకసార్లు. వేల సార్లు. అనేక రూపాల్లో. ఈసారి నువ్వు చైనాలో ఓ రైతుకి బిడ్డగా పుడ్తావు అదీ 540 ఎ.డి.లో.’’ ‘‘ఆగాగు. ఏమిటీ? నువ్వు నన్ను కాలంలో వెనక్కి పంపుతావా?’’ ‘‘అవును. సాంకేతికంగా కాలం అనేది మీ ప్రపంచంలోనే ఉంటుంది. నేను ఎక్కడ్నుంచి వచ్చానో అక్కడ అది వేరుగా ఉంటుంది.’’ ‘‘నువ్వు ఎక్కడ్నించి వచ్చావో చెప్తావా?’’ ‘‘తప్పకుండా. నేను ఎక్కడ్నించి వచ్చానో అక్కడ నాలాంటి వాళ్లు ఉన్నారు. అక్కడ ఎలా ఉంటుందో తెల్సుకోవాలని ఉందికదా నీకు. కానీ సూటిగా చెప్పాలంటే అది నీకు అర్థం కాదు.’’ ‘‘కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో నేను మళ్లీ మళ్లీ జన్మించి ఉంటే ఇదివరకు ఎప్పుడో నేను నీతో మాట్లాడి ఉంటానే.’’ ‘‘మాట్లాడే ఉంటావు. కానీ ఏ జన్మలోనూ నీ జీవితకాలంలో ఏం జరుగుతున్నదో నీకు తెలియదు.’’ ‘‘అంటే? జీవితానికి అర్థం ఏమిటి?’’ ‘‘సీరియస్గా అడుగుతున్నావా? ఇదొక రొటీన్ ప్రశ్న.’’ ‘‘కాదు. నా ప్రశ్నకు జవాబు కావాలి.’’ ‘‘నేను ఈ సమస్త విశ్వాన్ని ఎందుకు చేశానో, జీవితానికి అర్థం ఏమిటో తెల్సుకోవడానికి మానసిక పరిపక్వత ఉండాలి. నీకది లేదు.’’ ‘‘అంటే? మానవజాతికా? మానవజాతి ఇంకా పరిపక్వత చెందలేదా?’’ ‘‘మానవజాతి కాదు. నువ్వు! ఈ విశ్వాన్నంతటినీ నీ కోసమే చేశాను. నీ కోసం మాత్రమే. ప్రతి కొత్త జన్మలో నువ్వు మానసికంగా పరిపక్వం అవుతూవుంటావు.’’ ‘‘నేను మాత్రమేనా? మరి మిగిలినవాళ్లంతా?’’ ‘‘ఇంకెవరూ లేరు. ఆ విశ్వంలో నువ్వూ నేనూ అంతే.’’ మరణించిన మనిషికి అర్థం కాలేదు. ‘‘కానీ భూమ్మీద ఇంతమంది మనుషులు ఉన్నారు కదా?’’ ‘‘అందరూ నువ్వే. అన్ని రూపాలూ నీవే.’’ ‘‘ఏమన్నావు? అందరూ నేనేనా? ఈ భూమ్మీద జీవించిన వాళ్లంతా నేనేనా? ప్రతి ఒక్కరూ నేనేనా?’’ ‘‘కాక. నువ్వే. అందరూ నువ్వే.’’ ‘‘అబ్రహం లింకన్ని నేనేనా?’’ ‘‘జాన్ వల్కస్ బూత్వి కూడా నువ్వే’’ (లింకన్ను హత్య చేసిన అమెరికా నటుడు. ‘‘హిట్లర్ని కూడా.’’ ‘‘హిట్లర్ చంపిన లక్షలాది మందివి కూడా నువ్వే.’’ ‘‘జీసస్ని కూడా నేనేనా?’’ ‘‘ఆయనని అనుసరించిన వాళ్లందరూ నువ్వే.’’ మరణించిన మనిషి మౌనంగా ఉండిపోయాడు. ‘‘జన్మించిన ప్రతిసారీ నువ్వు ఎవరో ఒకరిని బలిపశువుని చేశావు. లేదా నువ్వే బలిపశువువి అయ్యావు. ఏ మనిషి అయినా అనుభవించిన సుఖమూ దుఃఖమూ అనుభవించబోయే ఆనందమూ విషాదమూ నువ్వే అనుభవిస్తావు.’’ ‘‘ఎందుకు? ఎందుకిదంతా?’’ ‘‘ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు నాలా మారిపోవడానికి. నువ్వున్నది నాలా మారడానికే. నువ్వు నా జాతివాడివి. నువ్వు నా సంతానానివి.’’ ‘‘ఏమిటీ విచిత్రం? అంటే నువ్వే కాదు నేను కూడా దేవుడినా?’’ ‘‘కాదు. ఇంకా కాలేదు. నువ్వు పిండానివి. నువ్వు ఇంకా పెరుగుతూనే ఉన్నావు. మళ్లీ మళ్లీ మరణించి మళ్లీ మళ్లీ పుట్టి మానవ జీవితాలన్నీ అనుభవించాక... అప్పుడు దేవుడివవుతావు. ఈ విశ్వమంతా కేవలం ఒక అండం మాత్రమే. నువ్వు మరో జన్మలోకి ప్రయాణం చేయాల్సిన సమయం అయింది’’ అంటూ ఆ ఆకారం మరణించిన మనిషిని మరో జన్మలో ప్రవేశపెట్టింది. -
అమ్మమాట
‘‘ఏమైందన్నా అట్టా మొహం మొటమొటలాడిస్తన్నావు? మన హిట్లర్ లీవ్ ఇవ్వనన్నాడా ఏంటి?’’ విసురుగా వస్తున్న విఠల్ని అడిగాడు కండక్టర్ కాంతారావు. ‘‘అవున్రా.. కూతురి పెళ్లికి ఒక్క పదిహేనురోజులుసెలవడితే ఇవ్వనంటాడేమిట్రా? స్టాఫ్ సరిపోకపోతే కొత్తవాళ్లని తీసుకోవాలిగానీ ఒక వారం రోజులు తీసుకో అంటే ఎట్లా? వారం రోజులు ఏమూలకి సరిపోతై చెప్పు?’’ చికాకు పడ్డాడు విఠల్.‘‘అదే అన్నా! సిన్సియర్గా పన్జేసేవాళ్లకి ఇట్టాజేస్తారు. పనెగ్గొటి ్టతిరిగేవాళ్లకి రూల్సేమీ అడ్డురావు. సర్సరే పద పద. ఇది మనకి రోజూ ఉండే రపరపే. మళ్లీ టైంకి బస్సు తియ్యలేదంటే అదొక గొడవ వాడితో. అయినా ఇవ్వన్నీ మనసులో పెట్టుకుని బస్సు డ్రైవింగ్ చేసేవు... అసలే మన రూటు చాలా బిజీ’’ హెచ్చరించాడు కాంతారావు.‘‘అదేం లేదులేరా. పద’’ అంటూ బస్సుకేసి నడిచాడు విఠల్. కాంతారావు బస్సులోకి దూరిజనాన్ని నెట్టుకుంటూ చకచకా టిక్కెట్లివ్వటం మొదలుపెట్టాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. మనసంతా చిరాగ్గా ఉంది. ఒక పక్కన భార్య గొడవ ‘ఇంకో ఇరవై రోజుల్లో చిన్నదాని పెళ్లి ఉంది. ఇప్పటికైనా సెలవు పెట్టరా?’ అని. పెళ్లి పనులు నత్తనడకతో సాగుతున్నాయి. పెళ్లిపత్రికలు అచ్చై ఇంటికొచ్చాయి. అవి బంధువులందరికీ పంచాలి. పెద్దల్లుడు మంచివాడు కాబట్టి మరదలి పెళ్ళికోసం తన భార్యని ముందే పంపాడు. తనూ పది రోజుల ముందు వస్తానన్నాడు. వచ్చీరావటంతోనే తన పెద్దకూతురు అన్నీ తానే అయి ఇంట్లో పనులన్నీ చూస్తోంది. అల్లుడు వస్తే తనకి సహాయంగా ఉండమనొచ్చుగాని మొత్తం బయటి పనులన్నీ అతడి నెత్తిన వేస్తే ఏం బాగుంటుంది? అప్పటికీ శని ఆదివారాల్లో వచ్చి, కొన్ని పనులు చేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆమాత్రంకూడా అతను చెయ్యకపోయివుంటే తనకి ఇంకా కష్టమయ్యేది’. ఇలా ఆలోచనల్లో సతమతమవుతుండగా కాంతారావు విజిల్ వెయ్యటంతో బస్ను ముందుకు కదిలించాడు. అసలే ఆ రూట్ చాలా బిజీ. దానికి తోడు మెట్రో పనులకోసమో, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసమో రోడ్లని ఆక్రమిస్తున్న కాంట్రాక్టర్లు. మామూలుగానైతే అతడి చేతి స్టీరింగ్ కృష్ణుడి చేతిలోని చక్రమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.సాధారణంగా కొందరు డ్రైవర్లు బస్టాప్కి కాస్త ముందోవెనకో కొంత దూరంలో బస్సుని ఆపి, ప్రయాణీకులు పరిగెత్తుకువచ్చి అందుకునేలోపు బస్సుని దౌడు తీయుస్తుంటారు. తమ కోర్కెలు తీర్చని యాజమాన్యంపై కోపంతోనూ, కసితోనూకొందరలా చేస్తుంటారు. మరికొందరికి ఆ రకంగా ప్రయాణీకుల్ని ఊరించి ఊరించి విసిగించటం వినోదం. నిజాయితీపరులైన ఉద్యోగులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో విధిలేక ఆ పని చేస్తుంటారు. ఆ రోజు విఠల్ కూడా తనకు బాస్ లీవ్ ఇవ్వలేదన్న కసిని ప్యాసింజర్ల మీద చూపించసాగాడు. అంతగా రద్దీ లేకున్నా, ప్యాసింజర్లు ఆపమని అభ్యర్ధిస్తున్నా పట్టించుకోకుండా స్పీడుగా బస్ నడపసాగాడు. ఈ విషయంలో జనం తనని తిట్టుకుంటారని అతనికి తెలుసు. ‘అయినా వాళ్లకు ఇదొక్కటే బస్సు కాదుగదా’ అని తనని తాను సమాధానపరచుకున్నాడు. ఇక చివరి ట్రిప్పుకొచ్చేసరికి ఎంత తొందరగా ఇంటికెళ్దామా అనే ఆత్రంలో బస్సు ఖాళీగా ఉన్నా ఎక్కడా ఆపకుండా వేగంగా నడపసాగాడు. తాను ఆపొద్దని చెప్పినావినకుండా, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదంటూ ప్రతి స్టాప్లో బస్సునాపే విఠల్, ఆరోజు అలా బస్సు వేగంగా నడపటం చూసిన కాంతారావు ‘మంచోణ్ణీ కూడా చెడగొట్టావు గదరా!’ అని అనుకున్నాడుం తన బాస్ని తలచుకుంటూ. ఆ రోజు ఆఫీసులో చక్రి మనసు మనసులోలేదు. అతని ధ్యాసంతా తన ఇంటిమీదనే ఉంది. ఆ ఇంటిని ఏవిధంగా సరిచేయాలోపాలుపోని స్థితిలో ఉన్నాడతడు. ఆ పరధ్యానంతో అతడు తెచ్చిన ఫైలు చూసి అతని బాస్ ‘‘ఏంటి చక్రీ ఇది? ఎంతో సిన్సియర్గా పని చేస్తావని నీకు పేరుంది. నువ్వుగూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఫైల్లో చూడు ఎన్ని తప్పులు చేశావో. ఒకసారి మళ్లీ చూసి సరిచేసి తీసుకురా’’ అంటూ సుతిమెత్తగా మందలించాడు. ఆ ఫైలు పట్టుకుని అతడు తన సీట్లోకొచ్చికూర్చున్నాడు. చక్రి అంటే అతని పై ఆఫీసర్కి మంచి అభిప్రాయముంది. కానీ అది జీతం పెంచేంతగాలేకపొవటం వల్ల అతడి జీతం గొర్రెతోకను మించటంలేదు. ఇంట్లో తన తల్లి, భార్య, కూతురు, కొడుకు మొత్తం ఐదుగురి కుటుంబభారం తనే మొయ్యాల్సివుంది. రెండువందల గజాల్లో ఓ మూలగా ఉన్న రెండు గదుల డాబా ఇల్లొక్కటే తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా తనకు సంక్రమించింది. అవీ చిన్న చిన్న గదులు. అదీ నగరం పొలిమేరల్లో ఉన్న ఒక పల్లెటూర్లో. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి ఇప్పటివరకూ ఎలాగో సర్దుకుంటూ వస్తున్నారు. వాళ్లు పెద్దవాళ్లవుతున్నకొద్దీ ఇల్లు మరీ ఇరుకైపోసాగింది. గత వర్షాకాలంలో ఆ ఇల్లు కురవటం మొదలైంది. దాంతో అప్పుడు ఇంట్లోఅందరూ చెట్టుకింద వర్షంలో కూర్చున్నట్లుగా కూర్చుని రాత్రుళ్లు జాగారం చేశారు. ఆ ఇల్లు కట్టి అప్పటికి దాదాపు యాభై ఏళ్లవుతోందిమరి. ఇహ లాభం లేదని తాపీ మేస్త్రీని పిలిచి మాట్లాడాడు. ‘‘ఇల్లు కట్టినప్పుడు డాబా పైన ప్లాస్టరింగ్చేయించివుంటే ఈ సమస్య వచ్చేది కాదు సార్. ఇప్పటికైనా ఆ పని చెయ్యకపోతే వానకి తడిసి తడిసి కొన్నిరోజులకు రూఫ్ కూలినా కూలవచ్చు’’ అని భయపెట్టాడు. వర్షాకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా గడవాలంటే ఆ పని చేయించక తప్పదు. దానికి కనీసం మూడు బస్తాల సిమెంట్, ఒక టిల్లర్ ఇసక తెప్పిస్తే పని మొదలుపెడతానని చెప్పి వెళ్లిపోయాడా మేస్త్రి. అప్పటికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో ఆ పనిని తర్వాతి సంవత్సరానికి వాయిదా వేశాడు. ఎలాగోలా ఆ వర్షాకాలం గడిచి పోయింది. అయితే ఉన్నట్లుండి క్రితంరోజు సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. రాత్రికల్లాకుంభవృష్టి మొదలయ్యింది. మొత్తం కాలనీలన్నీ చెరువులైపోయాయి. పైకప్పు నుంచి నీరు కారటంతో ఆ రాత్రి చాలా ఇబ్బందయ్యింది. దాంతో ఇల్లు కాసారమైపోయింది. తామూ తడుస్తున్నా, తన భార్యతో కలిసి పిల్లలకూ తల్లికీ ఇబ్బంది కాకుండా చూడటానికి ఎంతో కష్టపడ్డాడు. తెల్లారే సరికి మళ్ళీ ఫెళ్ళున ఎండ. హైదరాబాద్ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ‘‘అసలిప్పుడీ అకాలవర్షమేమిటి? కురవాల్సిన కాలంలో, కురవాల్సిన చోట కురవకుండా వుండటం చూస్తుంటే కలి ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఆ సిమెంట్ పనేదో చేయించు నాయినా. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావుగా’’ అందతని తల్లి. అతని ఇబ్బంది ఆవిడకు తెలుసు. కానీ ఇంటి పరిస్థితి చూశాక కొడుకుతో ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. అతని తల్లి ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అతన్ని అడిగి ఎరగదు. అలాంటిది ఇప్పుడిలా అడిగిందంటే ఆమె ఎంత కలత చెంది ఉంటుందో అర్థమై ‘‘అలాగే అమ్మా. ఈ సారి తప్పకుండా చేయిస్తా.’’ అంటూ మాట ఇచ్చాడు. అందుకే తెల్లారగానే మేస్త్రిని పిలిపించాడు. అతడు వస్తూనే ‘‘నేనెప్పుడో చెప్పాగద సార్. మీరు సిమెంట్, ఇసుక తెప్పించండి. ఒక్కరోజులో పని పూర్తవుతుంది’’ అన్నాడతడు. మెటీరియల్కీ, మేస్త్రికీ కలిపి దాదాపు పదివేలు. కనీసం ఇప్పుడైనా ఆ ప్లాస్టరింగ్ పని చేయించకపోతే వచ్చే వర్షాకాలంలో తాము ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ‘తల్లి కోరిక తీర్చేందుకైనా సరే ఈ పని చేయించాల్సిందే’ అని తీర్మానించుకున్నాడు. అందుకే ఒక స్థిర నిర్ణయానికొచ్చినట్లు తన బాస్ గదిలోకెళ్లి తనకొచ్చిన ఇబ్బందిని గూర్చి చెప్పాడు. తనకి కనీసం పదివేలయినా కావాలని అడిగాడు. ఆయన ఏ కళనున్నాడోగానీ అతని పీఎఫ్ అకౌంట్లోంచి పదివేలు లోన్ శాంక్షన్ చేయించాడు. తన ఇంటిదగ్గర్లో కొత్తగా కడుతున్న ఒక ఇంటిదగ్గర మిగిలిన ఇసుకని ఆ ఇంటివారిని బ్రతిమాలి, తక్కువ ధరకు తెచ్చుకున్నాడు. మర్నాడు రెండో శనివారం కావటంతో ఆ పని పూర్తి చేయించాలనుకుని సిమెంట్ కోసం బయల్దేరాడు. తన ఊర్లో సిమెంట్ షాపులేమీ లేకపోవటంతో సిటీకి వెళ్లక తప్పలేదతనికి. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో సిమెంట్ దాదాపు షాపులన్నీ మూసి ఉన్నాయి. ఏం చెయ్యాలోపాలుపోలేదతనికి. నిరాశగా వచ్చి బస్టాపులో నిల్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఒక సిమెంట్ షాపు ముందు ఆగింది. దానిలోంచి ఓ యాభైఏళ్ల వ్యక్తి దిగి, ఆ షాపు మూసి వుండటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతన్ని చక్రి అంతగా పట్టించుకోకపోయేవాడే. కానీ అతగాడొచ్చిన ఆటోలో మూడు సిమెంట్ బస్తాలు కనిపించటంతో అతడి మనసులో ఏ మూలనో చిన్న ఆశ చిగురించింది. అతని దగ్గరికెళ్లి, ‘‘వర్షం భయానికి షాపులన్నీ మూసేశారు’’ అని అతనితో మాటలు కలిపాడు. ‘‘అవునండీ. మా ఇంటిదగ్గరపనంతా అయిపోయింది. కానీ ఈ సిమెంట్ బ్యాగులు మూడూ మిగిలిపోయినై. ఇంటిదగ్గరే ఉంచితే గడ్డగట్టి పోతాయని తిరిగి ఇచ్చేద్దామని వచ్చా. వీడేమో షాపు బంద్ చేసేశాడు’’ అన్నాడు. చక్రి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ‘‘బస్తా ఎంతకి కొన్నారు?’’అనడిగాడు.‘‘ఒక్కొక్క బస్తా మూడొందల యాభై. మీకు కావాలంటే చెప్పండి. బస్తాకి వంద తగ్గించి ఇస్తా’’ అన్నాడు. ఆ మాట వినటంతోటే ప్రాణం లేచొచ్చిందతనికి. ఇక మరోమాట లేకుండా ఏడొందలయాభై అతని చేతిలో పెట్టాడు. అతడు ఆటోవాలా సాయంతో ఆ మూడు సిమెంట్ బస్తాలూ అక్కడి బస్టాప్ దగ్గర దించేసి, అదే ఆటోలో వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి తన ఇంటికి ఆటో మాట్లాడుకుంటే కనీసం రెండొందలౌతుంది. అంత డబ్బు పెట్టటం దండగ. ఎలాగూ డిస్ట్రిక్ట్ బస్సులతోపాటు సిటీ బస్సులుకూడా తన గ్రామం వరకూ వెళ్తుంటాయి. ఆ బస్సు డ్రైవర్నో కండక్టర్నో బ్రతిమిలాడైనా సరే ఆ సంచులు ఇంటికి తీసుకెళ్లాలని అతని కోరిక. కానీ వచ్చిన బస్సులేవీ అక్కడ ఆగకుండా వెళ్లిపోసాగాయి. దాంతో అతడు నిరాశ పడిపోసాగాడు. అదే ఏ డిస్టిక్ బస్సో అయితే లగేజీ టికెట్ కొట్టకుండా, ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇక సిటీ బస్సులవాళ్లైతే పాల క్యాన్లు, కూరలకైతే ఓకే అంటారుగానీ, సిమెంట్ బస్తాలంటే అస్సలు ఒప్పుకోరు. అయినా అతడిలో ఆశ చావక ‘ఒక్క బస్సయినాఆగకపోతుందా’ అని ఎదురు చూడసాగాడు. ఆలోచనలు ఎంతగా ముప్పిరిగొంటున్నా విఠల్ బస్సుని జెట్ స్పీడ్లో లాగించేస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటం మూలాన రోడ్లు ఖాళీ అయిపోసాగాయి. భారీవర్షం పడే సూచనలుండటంతో జనం పలచబడ్డారు. విఠల్ బస్సు స్పీడ్ పెంచేశాడు. తొందరగా డ్యూటీ దిగి ఇంటికెళ్లాలని అతడి మనసు పీకుతోంది. అలా వెళ్తుండగా ఒక బస్టాప్లో ఒక ముసలావిడ నిల్చుని ఉండటం చూడగానే అప్రయత్నంగానే అతడి కాలు బ్రేక్ నొక్కింది. అది చూడగానే కాంతారావు ఆశ్చర్యపోయి, ‘‘ఏంటన్నా. సడెన్గా ఈ ముసలిదాని కోసం బస్సాపావు?’’అనడిగాడు. అతడు జవాబివ్వకుండా నవ్వి, ఆ ముసలావిడ ఎక్కగానే బస్సుని ముందుకు కదిలించాడు. ఆ తర్వాతి స్టాప్లో కూడా ఒక్కరే ఉన్నారు. అది చూసిన కాంతారావు ‘‘ఒక్కడి కోసం బస్సాపటం వేస్ట్. రైట్ రైట్’’ అన్నాడు.కానీ బస్సు ఆ స్టాపులో ఆపటం చూసి, ‘‘ఏమైందన్నా. తొందరగా ఇంటికి పొవాలని లేదా?’’ అన్నాడు. కానీ అతడి నుంచి జవాబుగా అదే నవ్వు. కాంతారావుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాతి స్టాప్లో ఉన్న ఒకే ఒక ప్యాసింజర్ని చూసి ‘‘అన్నా. ఇక ఆపకు. అసలే వాడి దగ్గర సిమెంట్ బ్యాగులున్నట్లున్నై. అవి లోపలికెక్కిస్తే, బస్సంతా ఖరాబవుతుంది. పోనియ్’’ అన్నాడు. ఆ మాటలు అసలు వినబడనట్లువిఠల్ బస్సుని సరాసరి తీసికెళ్లి ఆ సిమెంట్ బస్తాల దగ్గర ఆపి, ‘‘ఎక్కు’’ అన్నట్లుగా సైగ చేశాడు. అప్పటిదాకా ఏ బస్సూ ఆగకపోవటం, మళ్లీ చినుకులు మొదలైతే తక్కువ రేటుకి కొన్న సిమెంట్ పాడైపోతుందేమోనన్న దిగులులో కూరుకుపోయి ఉన్న చక్రికి, బస్సు తన దగ్గరికే వచ్చి ఆగటం, ఎక్కమని డ్రైవర్ సైగ చెయ్యటంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా సిమెంట్ బస్తాల్ని బస్సులోకి ఎక్కించేసి, ‘‘థాంక్యూ... థాంక్యూ వెరీమచ్ డ్రైవర్గారూ’’ అన్నాడు కృతజ్ఞత గుండెలో ఉప్పొంగగా. విఠల్ నవ్వుతూ తలాడించి, గేర్ మార్చి ఏక్సిలేటర్ మీద కాలువేశాడు.‘నక్క తోక తొక్కి వచ్చినట్లున్నావ్’ అన్నట్లుగా చూస్తూ, కాంతారావు అతడికి టికెట్ ఇచ్చాడు. అంతవరకూ ఎవరెంత బ్రతిమాలినా ఆపకుండా బస్సుని లాగించిన విఠల్ వైఖరి ఉన్నట్లుండి ఎందుకు మారిందో అర్థం కాలేదతనికి. అయితే కూతురి పెళ్లికి సెలవివ్వని బాస్ మీద కసితో బస్సు నడుపుతున్న విఠల్కి,ఎందుకో తెలీదుగానీ అక్కడ బస్టాపులో నిలబడ్డ ముసలావిడని చూడగానే చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది.తండ్రి లేని తనను ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా పెంచి పెద్దచేసిందావిడ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమె, ఎప్పుడూ పదుగురికి ఆదర్శంగా నిలిచేది. తన కొడుకుకి చదువు పెద్దగా అబ్బకపోవటంతో ఆమె కొంత కలతచెందినా, అతడికి ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఉద్యోగంలో చేరటానికి బయల్దేరుతున్న సమయంలో ‘‘నాయినా! నువ్వు చెయ్యబోయే ఉద్యోగం సామాన్యమైంది కాదు. ఎంతోమంది ప్రాణాలే కాదు, వారి ఆశలూ, ఆశయాలూ నీ చేతిలో ఉంటాయి. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా దరిచేరనీయకూడదు. జనం ఎన్నో కష్టాల్లోనూ, టెన్షన్లలోనూ ఉండీ, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో నమ్మకంతో నీ బస్సెక్కుతారు. వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకు. నీమూలంగా ఏ ఒక్కరూ ఇబ్బందిపాలు కాకూడదు. నీవల్ల నష్టపోయిన వాళ్ల తిట్లు మన కుటుంబానికి శాపాలవుతాయి. వాళ్ల కృతజ్ఞతలు నీ పిల్లలకు ఆశీర్వచనాలై వారి మంచి భవిష్యత్తుకు సోపానాలవుతాయి. స్టీరింగ్ పట్టుకునే ప్రతిసారీ నా ఈ మాటల్ని మననం చేసుకో’’ అంటూ చెప్పింది. తన ప్రవర్తనవల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయనని తల్లికిచ్చిన మాట గుర్తుకొచ్చి ఒక్కసారిగా వీపుపై చెర్నాకోలతో చరిచినట్లైందతనికి. ‘ఎప్పుడూ నిబద్ధతతో మెలిగే తను ఈరోజిలా మారటం తప్పు. తన కూతురి పెళ్లి పనులురోజూ తాను డ్యూటీకి ఎక్కేముందుగానీ, దిగిన తర్వాతగానీ, నిద్రాహారాలు మానుకునైనా చేసుకోవచ్చు. అంతేగానీ ఒకరిమీద కోపాన్ని మరొకరిమీద చూపించటం ఎంతవరకు సమంజసం!?’ అనుకుంటూ ఆ ముసలమ్మకోసం బస్సాపాడు. కాస్త ఆలస్యంగానైనా సరే తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రతి స్టాపులోనూ బస్సుని ఆపసాగాడు. - గండ్రకోట సూర్యనారాయణ శర్మ -
హిట్లర్కు గోబెల్స్.. మోదీకి ఆయనే!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ను కుదిపేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వినియోగదారులు సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు అపఖ్యాతి ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, జీఎస్టీని ఉద్దేశించి ‘గబ్బర్సింగ్ ట్యాక్స్’ కామెంట్ వెనుక ఉన్నది ఆ సంస్థేనని కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను కాంగ్రెస్ పార్టీ పొందిందని విమర్శించారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే విషయంలో హిట్లర్కు గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని, ఇప్పుడు ప్రధాని మోదీకి రవిశంకర్ప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బూటకపు కథనాలను సృష్టించే కార్ఖానా బీజేపీ ప్రభుత్వమేనని, అతిపెద్ద సమాచార దొంగే.. అందరికంటే గట్టిగా అరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు. -
రొమాంటిక్ హిట్లర్..
అడాల్ఫ్ హిట్లర్.. చరిత్ర మరువని నరహంతకుడు. రెండో ప్రపంచముద్ధం మొదలు.. యూదులు అత్యంత పాశవికంగా హింసించి చంపిన నియంత. రెండో ప్రపంచయుద్ధంలో ఓటమి తప్పదని తెలిసి.. ఆత్మహత్య చేసుకున్న జర్మన్ అధినేత. హిట్లర్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.. అందులోనూ అత్యంత కౄరుడు, నిర్దయుడు, రాక్షసుడు అనే తెలుసు.. ఆయనలోనూ ఒక ప్రేమికుడున్నాడు.. ఒక శృంగార పురుషుడు ఉన్నాడనే విషయం బయటి ప్రపంచానికి దాదాపు తెలియదనే చెప్పాలి. హిట్లర్లోని ఈ కోణం చాలా ఏళ్ల తరువాత ఈ మధ్యే బయటపడింది. అది కూడా హిట్లర్కు మేనకోడలు వరుస అయ్యే ఏంజెలా గెలి రబెల్తో ఆయనకున్న అత్యంత సన్నిహిత సంబంధం కూడా ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలు.. హిట్లర్లోని మరో కోణాన్నితెలిపే కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. ఇంతకూ రబెల్ ఎవరంటే? ఆస్ట్రియాలో 1908లో పుట్టిన రబెల్ హిట్లర్కు మేనకోడలు వరుస అవుతుంది. హిట్లర్ మీద ప్రేమతో ఆమె జర్మనీకి వచ్చింది. ఆకట్టుకునే అందం.. ఆమె సొంతం. హిట్లర్తో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఆమె ఒకరు. కేవలం 23 ఏళ్ల వయసులో అంటే 1931 సెప్టెంబర్ 18.. ఆమె మ్యూనిచ్లోని అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఎరుపురంగు నైట్డ్రెస్లో.. ఆమె ఉన్నారు. ఆమె ఆత్మహత్యపై అప్పట్లో భిన్న కథనాలు వచ్చాయి. హిట్లర్ అధికారంలోకి వచ్చాక..! సాధారణ అమ్మాయిగా జర్మనీ వచ్చిన రూబెల్.. హిట్లర్కు దగ్గర కావడంతో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె అందం.. ప్రవర్తన.. హిట్లర్తో బంధం.. ఆమెకు నాజీ పార్టీలోని ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. హిట్లర్ అధికారంలోకి వచ్చాక.. తన అందం.. ప్రేమతో హిట్లర్ను రూబెల్ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అంతేకాక హిట్లర్తో కలిసి ఆస్ట్రియాకు వెళ్లాలని ఒక దశలో తీవ్ర ప్రయత్నం చేసింది. రబెల్ ఇంట్లోనే బందీ రబెల్ అందం.. పార్టీలోన ఆమెకున్న ప్రత్యేక గుర్తింపుతో హిట్లర్.. ఆమెను ఇంటికే పరిమితం చేశాడు.. ఆమె మీద అనుమానాలు పెరగడంతో పనివాళ్లను కూడా మార్చేసి.. అందరినీ అడవాళ్లనే పెట్టాడు. అయితే కారు డ్రైవర్ ఎమిల్ మౌర్సీతో రబెల్కు శారీరక సంబంధం ఉందన్న అనుమానం హిట్లర్కు వచ్చింది. వెంటనే మౌర్సీని కాల్చి చంపి.. రబెల్ను మరోచోటకు మార్చాడు. అక్కడ నుంచి ఆమె తప్పించుకుని ఆస్ట్రియా పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆత్మ ‘హత్య’ కొత్త ప్రాంతంలో నివాసముంటున్న రూబెల్ ఒక రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున సమయంలో ఒక ససైడ్ నోట్ రాసింది. అందులో.. నేను త్వరలోనే వియాన్నకు వస్తానన్న నమ్మకం ఉంది.. ఒక వేళ రాలేకపోతే.. ఈ జీవితం ఇంతే అని రాసింది. తరువాత ఆమె హ్యాండ్గన్తో తనను తాను కాల్చుకుని చనిపోయింది. అయితే ఈ అత్మహత్యపై పలు అనుమానాలున్నాయి. హిట్లరే హత్య చేసుంటాడు.. అని వారిద్దరి బంధం ఎరిగినవారు చెబుతున్నారు. -
హిట్లర్ సంతకం@17వేల పౌండ్లు
లండన్: తొలిపేజీలో హిట్లర్ సంతకం చేసిన ఓ పుస్తకం వేలంలో 17,000 పౌండ్ల ధర పలికింది. ఈ పుస్తకాన్ని చాలా అరుదైన పుస్తకమని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ఎందుకంటే తన సంతకం విషయంలో ఈ జర్మన్ నియంత చాలా కఠినంగా వ్యవహరించేవాడట. ఎప్పుడో ఒకసారి మాత్రమే సంతకం చేసేవాడట. హిట్లర్ జీవితచరిత్ర ఆధారంగా రాసిన ఈ పుస్తకం తొలిపేజీలో హిట్లర్ సంతకం చేయడమనేది అరుదైన విషయమేనని, అందుకే దీనికి భారీ ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు. ఇంగ్లిష్ రచయిత పీటర్ క్యాడోగన్ 1930లో హిట్లర్ను కలిసిన సందర్భంగా తాను రాసిన పుస్తకంపై జర్మనీ అధినేత నుంచి సంతకం తీసుకున్నాడు. పుస్తకం తొలి పేజీపై హిట్లర్ సంతకం చేసిన ఈ పుస్తకం 1935లో బయటకు వచ్చింది. -
బెర్లిన్ బర్నింగ్
-
స్వేచ్ఛ కావాలి.. యువర్ ఆనర్
మానవ హక్కుల సంఘాలు ఉన్నట్లే, ‘అమానవ హక్కుల సంఘం’ ఒకటి యు.ఎస్.లో ఉంది! దీని అధ్యక్షుడు స్టీవెన్ వైస్. మనుషులకు ఉన్న విధంగానే జంతువులకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలని స్టీవెన్ వాదన. మామూలు మనిషిగా రోడ్డు మీద నిలబడి వాదిస్తే స్టీవెన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ స్టీవెన్ లాయర్. కోర్టులో వాదిస్తాడు. కొన్నాళ్లుగా ఆయన... టామ్, కికో అనే రెండు చింపాంజీల తరఫున మాన్హట్టన్ కోర్టులో తన వాదనలను బలంగా వినిపిస్తున్నారు. అవి రెండూ స్థానికంగా ఓ బోనులో ఉండే చింపాంజీలు. ఫ్లారిడాలోని ఓ పెద్ద సరస్సు మధ్య ఉన్న చిన్నచిన్న దీవులలో హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ చింపాంజీలను పట్టుకొచ్చి మనుషుల సరదా కోసం ప్రదర్శనకు ఉంచారు. అలా చేయడం నేరమని, తిరిగి వాటిని ఫ్లారిడా దీవుల్లో వదిలేయాలని స్టీవెన్ వాదిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ వారం తీర్పును ఇవ్వబోతోంది. నేడో రేపో జడ్జిగారికి జైలు జడ్జీలు కూడా మనుషులే అనుకుని ఈ వార్త చదవాలి. లేకుంటే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ఆర్నాల్డ్ ఆగ్డెన్ జోన్స్ అనే ఆయన ఒకప్పుడు జడ్జి. నార్త్ కరోలినాలో పనిచేసేవారు. తన భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉండేదని ఆయన అనుమానం. మరి ఆ విషయం తేలేదెలా? తనకు పరిచయం ఉన్న ఒక లాయర్ని పట్టుకున్నాడు. అతడికి కొంత డబ్బిచ్చి, కొన్ని బీరు బాటిళ్లు కానుకగా ఇచ్చి, తన భార్య ఫోన్లోని టెక్స్›్ట మెసేజీలు సంపాదించాడు. ఆ సంగతి ఇప్పుడు బయట పడింది. భార్యను అనుమానించినందుకు అతడికేమీ శిక్ష పడలేదు కానీ... లాయర్ని లంచాలతో ప్రలోభపెట్టినందుకు ఫెడరల్ కోర్టు అతడిని దోషిగా నిర్థారించింది. నేడో, రేపో శిక్ష. ఆర్నాల్డ్ ఆగ్డెన్ జోన్స్ (మిమ్మల్ని చూస్తున్న వ్యక్తి) అరుదైన హిట్లర్ ఆల్బమ్ జర్మనీ నియంత హిట్లర్ ఫ్యామిలీ ఆల్బమ్ ఒకటి ఇటీవల వేలానికి వచ్చింది. 1945లో ఆయన బెడ్రూమ్లో బయట పడిన ఈ ఆల్బమ్ గురించి ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. ఆయన దీర్ఘకాల సహచరి (భార్య అనుకోవచ్చు) ఈవా బ్రాన్, ఆయన ఆ బెడ్రూమ్లోనే ఉండేవారు. ఆనాటి ఫొటోలు ఉన్న ఈ ఆల్బమ్ను గతవారం యు.కె.లోని కెంట్ ఆక్షన్ హౌస్లో వేలం వేశారు. 18,340 డాలర్లు (మన రూపాయల్లో సుమారు 12 లక్షలు) పలకొచ్చని అనుకున్నారు. చివరికి ఎంతకు అమ్ముడు పోయిందో వివరాలింకా విడుదల కాలేదు. దొరికితే బాగుండు వరుడు ట్రెండీ కింగ్, వధువు జేమ్స్ గ్యాలీ... పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. ఇళ్ల బయట మనలాగే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పైకి లేపారు. పెళ్లి మంటపానికి దారి ఇదే అని బోర్డు కూడా పెట్టించారు. అప్పుడు మాయమైపోయాడు థియో! థియో ఈ వధూవరుల లవ్ పెట్. బ్రసెల్స్ గ్రిఫన్ జాతి కుక్కపిల్ల. అది తప్పిపోవడంతో ఇద్దరూ అప్సెట్ అయ్యారు. పెళ్లి ఆపేసుకున్నారు. ఇద్దరూ కలిసి థియో కోసం ఇప్పుడు భూమండలం అంతా వెదుకుతున్నారు. థియో ఫిబ్రవరి 13న తప్పిపోయింది. దానిని వెతికి తెచ్చినవారికి 3,500 డాలర్ల బహుమానం కూడా ప్రకటించారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. డిటెక్టివ్లను కూడా పెట్టారు. ‘థియో దొరికితేనే ఎప్పటికైనా మా పెళ్లి’ అంటున్నారు. మనిషికి, కుక్కకు ఉండే అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. కానీ ఇలాంటి సంఘటనల్లో తెలుస్తుంది. పదకొండేళ్ల చిట్టితల్లి! ‘సాక్షి’లో నిన్న ఒక వార్త వచ్చింది. 18 ఏళ్లకు ముందే తల్లులు అవుతున్నవారు మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రా, తెలంగాణాల్లో ఎక్కువగా ఉన్నారట! ఇది మంచి పరిణామం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి.. వార్తల్లోకి వచ్చిన ఓ ‘చిట్టి తల్లి’ గురించి చెప్పుకుందాం. ఆ తల్లిది లండన్. ఇంకా తల్లి కాలేదు. కాబోతోంది. ఆ చిట్టి తల్లి కనుక పండంటి బిడ్డకు జన్మనిస్తే... బ్రిటన్లోనే అతి చిన్నవయసులో బిడ్డను కన్న తల్లిగా రికార్డులలోకి ఎక్కుతుంది. బ్రిటన్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఓ పన్నెండేళ్ల తల్లి పేరు మీద ఉంది! 2014లో ఆ తల్లి ప్రసవించింది. తండ్రికి కూడా అప్పుడు పెద్ద వయసేం కాదు 13 ఏళ్లు. అలా వాళ్లు అతి చిన్న వయసు తల్లిదండ్రులుగా కూడా కంబైన్డ్ గా రికార్డులకు ఎక్కారు. ఇప్పుడీ లేటెస్టు చిట్టితల్లి ప్రసవిస్తే 11 ఏళ్లకే తల్లయిన చిన్నారిగా రికార్టు నమోదు అవుతుంది. రికార్డుల నమోదుకైతే ఇదీ ఒక రికార్డు అవుతుందేమో కానీ, ఆ చిట్టి తల్లికి మాత్రం చాలా దుర్భరమైన కష్టం. ఏ అమ్మాయికీ రాకూడని కష్టం. అడ్డొస్తోందని కాల్చేశారు మనుషులకు తొందర ఎక్కువై, సహనం తగ్గుతోంది. న్యూజీలాండ్లోని ఆక్లండ్ ఎయిర్పోర్టులో ఈ మధ్య విమానాల టేకాఫ్ కొద్దిగా అలస్యం అవుతోంది. అందుకు కారణం ఆ పరిసరాలకు బాగా అలవాటు పడిన ఓ శునకం. ఇంటి యజమాని బయటికి వెళుతుంటే... నేనూ వస్తానని పెంపుడు కుక్క అడ్డుపడిన విధంగా... ఏదైనా ఒక విమానం బయల్దేరబోతోందీ అంటే ఈ శునకం తోక ఊపుకుంటూ పరుగున రన్వే మీదకు వచ్చేస్తోంది. దాన్ని సముదాయించి, పక్కకు తరిమేశాక కానీ రన్వే క్లియర్ కావడం లేదు. నిజానికైతే ఇదేం పెద్ద సమస్య కాదు. యానిమల్ ప్రొటెక్షన్ వాళ్లకు ఓ ఫోన్ కాన్ కొడితే వాళ్లొచ్చి ప్రేమగా తీసుకెళ్లిపోతారు. కానీ అంత ఓపిక ఈ కాలంలో ఎవరికుందీ! ‘ఏంటయ్యా... ఈ చికాకు’ అని ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లొచ్చి, గన్ తీసి, ఫట్ మని... పాపం ఆ కుక్కను కాల్చిపడేసి వెళ్లిపోయారు. రన్వే మీద విమానాలు ఎప్పటిలా టైమ్కైతే బయల్దేరుతున్నాయి కానీ... కుక్క లేని లోటు ఇప్పుడు విమానాశ్రయ సిబ్బందికి స్పష్టంగా కనిపిస్తోందట! యుద్ధకాలపు యోధుడితడు మానవులకు, మూగజీవులకే కాదు.. మృతదేహాలకూ హక్కులుంటాయి! ఆర్కాన్సాస్లోని ఒక పొలంలో మార్చి 5న ఓ సూట్కేస్ బయటపడింది. అందులో 89 ఏళ్ల ఒక వృద్ధుడి మృతదేహం ఏమాత్రం మర్యాద, గౌరవం లేని విధంగా కుక్కేసి ఉంది. ఆనవాళ్లను బట్టి, ఆ చనిపోయిన వ్యక్తిని ప్రపంచ యుద్ధంకాలం నాటి యోధుడిగా పోలీసులు గుర్తించారు. అతడిది న్యూయార్క్ అనీ, అతడి పేరు రాబర్ట్ బ్రూక్స్ అనీ తెలుసుకున్నారు. ఇక తెలుసుకోవలసింది ఆ పండుటాకును ఎవరు, ఎందుకు అంత నిర్లక్ష్యంగా సూట్కేస్లో కుక్కి, పొలాల్లో పడేశారన్నదే. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై మృతదేహాన్ని అగౌరవపరిచారన్న కేసు పెట్టి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. Will You Marry Me? ఇంతకన్నా రొమాంటిక్ ప్రపోజల్ ప్రపంచంలో ఇంకొకటి ఉండి ఉండదు! టిమ్చీ, క్యాండిస్ భార్యాభర్తలు. ఉండడం ఆస్ట్రేలియా. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. పెళ్లికు ముందు మూడేళ్లు డేటింగ్లో ఉన్నారు. ఆ మూడేళ్లలో టిమ్చీ తన ప్రియురాలు క్యాండిస్కి 14 ప్రేమలేఖలు రాశాడు. ఇక పెళ్లికి ప్రపోజ్ చెయ్యడం ఒక్కటే మిగిలింది. Will you marry me అని అబ్బాయి అమ్మాయిని అడగాలి. అడిగాడు! ఎలా అడిగాడో చూడండి. క్యాండిస్ని సర్ప్రైజ్ హాలిడేకి తీసుకెళ్లాడు. వచ్చేటప్పుడు తను రాసిన పద్నాలుగు ప్రేమలేఖల్నీ తీసుకురమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి భయపడింది! ఇదేంటీ ప్రేమ క్యాన్సిల్ అని చెప్పి, ఆ లెటర్స్ని చింపేస్తాడా అనుకుంది. అయినా తీసుకెళ్లింది. ఇద్దరూ ఓ కొండపై కూర్చున్నారు. తన ప్రేమలేఖల్ని బయటికి తియ్యమని చెప్పాడు అబ్బాయి. బిక్కుబిక్కుమంటూ వాటిని హ్యాండ్ బ్యాగ్లోంచి తీసింది అమ్మాయి. అబ్బాయి నవ్వాడు. ఆ లేఖల్లోని మొదటి లెటర్స్ అన్నీ కలిపి చదవమని అడిగాడు. చదివింది అమ్మాయి. చదవగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అక్షరాలన్నీ కలిపి చదివితే Will you marry me అన్న వాక్యం వచ్చింది. వెంటనే అబ్బాయిని అమ్మాయి కౌగలించుకుంది. ఇప్పుడీ దంపతులు ఆ మధుర స్మృతులను లోకానికి వెల్లడించారు. అలా ఈ విషయం మనకూ రీచ్ అయింది. దటీజ్ లవ్. -
హిట్లర్ అరుదైన ఫోటోలకు భారీ ధర
లండన్: జర్మనీ నియంత, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్కు సంబంధించిన అరుదైన ఫోటోలను వేలంలో ఉంచగా అనూహ్యమైన స్పందన లభించింది. వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి ఊహించని విధంగా.. 41,000 డాలర్లు(సుమారు 27 లక్షలు) చెల్లించి ఆ ఫోటోలను సొంతం చేసుకున్నాడు. హిట్లర్ చివరి రోజుల్లో గడిపిన 'ఫ్యూరర్ బంకర్'లో దొరికిన ఫోటోలను ఇటీవల సీ అండ్ టీ అనే సంస్థ వేలంలో ఉంచింది. బ్రిటన్లోని రాయల్ టన్బ్రిడ్జ్వెల్స్లో నిర్వహించిన ఈ వేలంలో.. హిట్లర్ చైర్లో కూర్చొని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఫోటోతో పాటు.. చిన్నారులతో ఉన్న ఫోటోలతో కూడిన ఆల్బంకు భారీ మొత్తం పలికింది. హిట్లర్ దంపతుల మరణానంతరం.. హిట్లర్ భార్య ఇవా బ్రాన్ బెడ్ రూంలో ఓ రష్యన్ సైనికుడికి 1945లో దొరికిన ఈ ఆల్బం తరువాతి కాలంలో ఓ ఫోటో గ్రాఫర్ చేతికి వెళ్లింది. 1945 ఎప్రిల్ 29న ఇవా బ్రాన్ను పెళ్లాడిన హిట్లర్.. మరుసటి రోజు భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుది నియంత పాలన
- రాజధాని పేరుతో ‘రియల్’ బిజినెస్ - టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయి - ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్ఆర్సీపీదే - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని గెలిపించండి - డోన్, కమలాపురం ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి పాలన... హిట్లర్ నియంత పాలనను తలపిస్తోందని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్వగృహంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డితో కలిసి.. డోన్ , ప్యాపిలి, బేతంచెర్ల మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, డోన్ మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్లు ప్లాట్ల వ్యాపారం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాయలసీమలో వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు.. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ఎంపీటీసీ సభ్యులు మొదలుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధుల హక్కులను హరించారన్నారు. పనికో రేటు కట్టి స్థానిక సంస్థలను నిర్వర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలభోలాకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. మూడు సంత్సరాల టీడీపీ పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. హామీల అమలేదీ? మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యేలు రాజేంద్రనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, పట్టభద్రులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని గుర్తు చేశారు. పన్నులు, రాయల్టీలు పెంచి వ్యాపారులను దగా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే.. బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అయితే రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప అక్రమాల కు పాల్పడటం తగదన్నారు. జగన్తోనే అభివృద్ధి సాధ్యం.. రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందని, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యేలు రాజేంద్రనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి గెలిపించి వెఎస్ఆర్ కుటుంబ రుణం తీర్చుకోవాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోచా శీలారెడ్డి, కార్యదర్శి గుండం శేషిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు మూర్తుజావలి, మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి , డోన్, ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దీలిప్ చక్రవర్తి, మండల సింగిల్ విండో అధ్యక్షుడు బుగ్గన నాగభూషణం రెడ్డి, ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, పార్టీ నాయకులు మునేశ్వర్రెడ్డి, బాబుల్రెడ్డి, రాజేంద్రనాథ్రెడ్డి, చందురెడ్డి, ఇబ్రహీమ్, రామచంద్రుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్ వేలం
చెసాపెకే సిటీ: చరిత్ర ఎన్నటికీ మరచిపోని నియంత అడాల్ఫ్ హిట్లర్. ఆయన వినియోగించిన పర్సనల్ ట్రావెలింగ్ ఫోన్ వేలానికి వచ్చింది. చెసాపెకే సిటీల జరగనున్న అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో రెడ్ ఫోన్ను వేలం వేయనున్నారు. రెడ్ ఫోన్పై హిట్లర్ పేరు కూడా ఉంది. హిట్లర్ ఈ ఫోన్లో మాట్లాడటం ద్వారా వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వహకులు తెలిపారు. ఈ వారాంతంలో జరగనున్న వేలంలో రెడ్ ఫోన్కు కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్ డాలర్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. -
వాళ్లు వాడేశారు... వీళ్లు పాడేశారు!
కాలంపాట వాడి పడేసిన వస్తువులకు ఏ విలువా ఉండదు. ఒకవేళ విలువ ఉందీ అంటే ఆ వస్తువును వాడి పడేసింది ఎవరో ప్రముఖులై ఉండాలి. ఈ ఫోన్ను చూడండి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది! దీన్ని వాడిందెవరో తెలుసా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. గిర్రున డయల్ తిప్పి కాల్ చేసి, ‘చంపేయండి’ అని అదేశాలు జారీచేసి లక్షల మంది యూదు జాతీయుల్ని ఈ ఫోన్ ద్వారానే హిట్లర్ హతమార్చాడు. అందుకే దీనికి ‘డెత్ ఫోన్’ అనే పేరొచ్చింది. హిట్లర్ చనిపోయాక ఇది బ్రిటిష్ వాళ్ల చేతికొచ్చింది. ఇప్పుడు దీన్ని యు.ఎస్.లోని ‘అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్’లో ఈ నెల 19న వేలం వేస్తున్నారు. 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోవచ్చని అంచనా. సుమారు 3 కోట్ల 35 లక్షల రూపాయలు. ఈ సందర్భంగా.. ప్రసిద్ధ వ్యక్తులు వాడిన ఇలాంటి కొన్ని వస్తువులను, వేలంలో వాటికి వచ్చిన ధరను ఒకసారి చూద్దాం. జె.కె.రోలింగ్ ఛెయిర్ హ్యారీ పోటర్ రచయిత్రి జె.కె.రోలింగ్ తొలినాళ్లలో ఈ కుర్చీమీద కూర్చొనే తన నవలల్ని రాశారు. గత ఏడాది న్యూయార్క్లోని హెరిటేజ్ ఆక్షన్లో ఇది 3,94,000 డాలర్లకు అమ్ముడుపోయింది! సుమారు 2 కోట్ల 64 లక్షల రూపాయలు. క్వీన్ ఎలిజబెత్ 2 ప్యాంటీలు రాజ కుటుంబాల వస్తువులు అరుదుగా వేలం పాటలో దర్శనం ఇస్తాయి. అందుకే ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయి. 1968లో రాణిగారి ప్యాంటీల జత ఉన్న లగేజీ పొరపాటున విమానంలో ఉండిపోయింది. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్యాంటీలు 2012లో ఈబే అక్షన్స్కు వచ్చాయి. 18,000 డాలర్లకు ఎగిరిపోయాయి! సుమారు 12 లక్షల రూపాయలు. అబ్రహాం లింకన్ కళ్లజోడు 2008 హెరిటేజ్ ఆక్షన్లో జరిగిన వేలంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కళ్లజోడు 1,79,250 డాలర్లు çపలికింది! సుమారు కోటీ 20 లక్షల రూపాయలు. మహాత్మాగాంధీ బౌల్, ఫోర్క్, స్పూన్లు పుణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్లో, ముంబైలోని పామ్ బన్ మౌస్లో ఖైదీగా ఉన్నప్పుడు జాతిపిత మహాత్మాగాంధీ వాడిన ఈ పాత్రలు, స్పూన్లు ‘ఫాల్ ఫ్రేజర్ కలెక్టిబుల్స్’ (ఇంగ్లండ్) లో ఇప్పుడు వేలానికి రాబోతున్నాయి. ఇవి మొత్తం కలిపి 94,000 డాలర్లు పలకవచ్చని అంచనా. సుమారు. 62 లక్షల 83 వేల రూపాయలు. మైఖేల్ జాక్సన్ ఫెడోరాi ఫెడోరా అంటే మగాళ్ల టోపి. 1984 అక్టోబర్లో చికాగోలో జరిగిన స్టేజ్ షోలో పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఈ ఫెడోరాను ధరించాడు. గత ఏడాది జూలియన్స్ ఆక్షన్లో ఇది 10,240 డాలర్లకు పోయింది. సుమారు 6 లక్షల 84 వేల రూపాయలు. -
నాజీ ప్రేతాత్మను నిద్ర లేపకండి!
కొత్త కోణం అమెరికా నల్లజాతీయులను నేరగాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్కీ, హిట్లర్కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ‘బురఖా తొలగించకపోతే నిన్ను కాల్చేస్తాను’– ఇది అమెరికాలోని మిచి గాన్ నగరంలో ఓ ముస్లిం విద్యార్థినికి ఓ శ్వేతజాతీయుడి బెదిరింపు. ఇప్పుడు అమెరికాని కుదిపేస్తున్న భయానికి కేంద్ర బిందువు ఈ ధోరణే. న్యూయార్క్ లోని టాండన్ ఇంజనీరింగ్ స్కూల్ గోడల మీద రాసివున్న ‘ట్రంప్’ అన్న ఐదక్షరాలు కూడా అందరినీ భయకంపితం చేశాయి. దీన్ని ఆ స్కూల్ నిర్వాహకులు తీవ్రమైన చర్యగా భావిస్తుండడం గమనార్హం. మిన్నెసొటలోని స్కూల్ బాత్రూం గోడలపై ‘ట్రంప్’, ‘వైట్స్ ఓన్లీ’, ‘వైట్ అమెరికా’ అని రాసి ఉండడం చాలా మందిని, ముఖ్యంగా శ్వేతేతర ప్రజలను కలవరపరుస్తున్నది. మాప్లెగ్రోవ్ సీనియర్ హైస్కూల్లో ‘గోబ్యాక్ టూ ఆఫ్రికా–మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ రాసిన రాతలు కూడా చర్చనీయాంశాలయ్యాయి. వీట న్నింటికీ మించి న్యూయార్క్లోని వెల్స్విల్లేలో క్వాకెన్ బుష్ఫీల్డ్లో ‘మేక్ వైట్ – అమెరికా ఎగైన్’ అన్న గోడరాతల మధ్య స్వస్తిక్ గుర్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఓ ఆధా రాన్నిస్తున్నదని భావించవచ్చు. జర్మన్ జాత్యహంకారానికి సంకేతంగా భావించే స్వస్తిక్ గుర్తు శ్వేతజాతేతర ప్రజల అస్తిత్వానికి ప్రమాదంగా పరిణ మిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. భయపెడుతున్న ధోరణి అమెరికా ఎన్నికలు ముగిసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రెండు మూడు రోజుల్లోనే ముస్లింలకు, నల్లజాతీయులకు వ్యతి రేకంగా బెదిరింపులూ, దాడులూ మొదలయ్యాయి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అనుచరులు వేసిన స్వస్తిక్ గుర్తులు దేశంలో చాలా ప్రాంతాల్లో దర్శనమి స్తున్నాయి. ఇది అమెరికా భవిష్యత్ దర్శినిగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్లో అనుసరించబోయే విధానానికి ‘స్వస్తిక్’ ని సంకేతంగా చూడాలి. నాజీల గుర్తుగా అడాల్ఫ్ హిట్లర్ ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిందే స్వస్తిక్ గుర్తు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో, జర్మన్ జాతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే పన్నాగంతో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టాడు. సరిగ్గా 83 ఏళ్లక్రితం 1933లో జర్మనీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిట్లర్ నాయకత్వంలోని నేషనలిస్టు సోషలిస్టు జర్మన్ వర్కర్స్ పార్టీ (నాజీ) అధి కారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా హిట్లర్ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ఇతర జాతులకు ప్రత్యేకించి యూదులకు వ్యతిరేకమైన అంశాల్ని ఎజెండాగా చేశారు. నాటి జర్మనీ ఆర్థిక సంక్షోభం హిట్లర్కు పట్టం కట్టడానికి ఉపయోగ పడింది. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత హిట్లర్ ప్రదర్శించిన జాత్య హంకారం యూరప్ను శవాల గుట్టలతో నింపింది. ఆర్యన్ జాతి ఒక్కటే సంకరం కానిదనీ, అన్ని జాతుల కన్నా అదే పవిత్రమైనదనీ, ప్రపంచాన్ని పాలించే హక్కు తమదేననీ నాజీలు బహిరంగంగానే ప్రకటించారు. అందరూ శత్రువులేనా? ప్రస్తుతం అమెరికా గోడల మీద నాజీల, ఆర్యన్ జాతి సంకేతం స్వస్తిక్ దర్శన మివ్వడాన్ని; నల్లజాతి వారికి, ముస్లింలకు వ్యతిరేకంగా కనిపించిన రాతలను తేలికగా తీసుకోలేం. నల్లవారు, ముస్లింల పట్ల ట్రంప్ వ్యతిరేక చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియదు కానీ, ఇప్పటికే శ్వేతజాతి యువతరంలో అటువంటి ధోరణికి బీజాలు పడ్డాయి. అందులో భాగమే ఈ రాతలు, బెది రింపులు. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 నాటి ట్విన్ టవర్స్ పేల్చివేత ఘటనను ట్రంప్ సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇటీవలి పారిస్ బాంబుపేలుళ్ల ఘటనపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మధ్య ఆసియాలో ఐసిస్ చేస్తున్న దాడులను తన జాత్యహంకారానికి మద్దతుగా మలుచుకుంటున్నారు. ఆ విధంగా శ్వేతజాతీయుల మెదళ్లను ముస్లిం వ్యతి రేకతతో నింపడంలో సఫలమయ్యారు. అమెరికా నల్లజాతీయులను నేర గాళ్లుగా చిత్రించి వాళ్ల మీద కసి పెంచాడు. మెక్సికన్లను కూడా అదే స్థాయిలో శత్రువులుగా చిత్రీకరించాడు. చైనీయులు, భారతీయులపై సున్నిత విమర్శలు చేసినట్టు కనిపించినా ఈ రెండు దేశాలపై కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పారాయన. అమెరికాలో నిరుద్యోగ సమస్యకు ఈ రెండు దేశాలే కారణమంటూ ట్రంప్ ప్రచారం చేసి, శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. వీటన్నింటినీ గుదిగుచ్చి చూస్తే ట్రంప్కీ, హిట్లర్కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. అయితే ఈ పోలిక కొందరికి సముచితంగా అనిపించకపోవచ్చు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను, ఉపన్యాసాలను విన్నవారికీ, హిట్లర్ నాటి జర్మనీ చరిత్ర చదివినవారికీ ఈ పోలిక సము చితమైనదిగానే కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వంశీయులు జర్మనీకి చెందిన వారు కావడం గమ నించాల్సిన అంశం. ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ 1885వ సంవత్సరంలో అమెరికాకు వలసవచ్చారు. ఫ్రెడరిక్ హోటల్ వ్యాపారం, డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. దానినే డొనాల్డ్ కొనసాగించి పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ట్రంప్కు శ్వేత జాతీ యులలో బలమైన స్థానం ఏర్పడడానికి కారణాలను పరిశీలించాలంటే అమె రికాలో ఉన్న వివిధ జాతీయుల జనాభాను గమనించాలి. 2010 సంవత్సరం లెక్కల ప్రకారం 30 కోట్ల 87 లక్షల జనాభాలో 22 కోట్ల 35 లక్షల మంది శ్వేత జాతీయులు. నల్లజాతీయులు కేవలం 3 కోట్ల 89 లక్షలు. ఆసియాకు (భారత్ తో సహా) చెందిన వారు ఒక కోటి 40 లక్షల మంది. అమెరికాలో వేలాది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న నేటివ్ అమెరికన్స్ ఒక్క శాతం మాత్రమే. ఈ రకంగా చూస్తే అమెరికాలో ఉన్న జనాభాలో 99 శాతం మంది బయటి ప్రాంతాలవారే. మొత్తంగా శ్వేతజాతీయులు 72.4 శాతం ఉండగా, నల్లజాతీయులు 12 శాతం ఉన్నారు. మద్దతు వెనుక మతలబు శ్వేతజాతీయులలో మళ్లీ అగ్రస్థానం డొనాల్డ్ ట్రంప్ పూర్వీకుల దేశానికి చెందిన జర్మన్లదే. వారు మొత్తం 4 కోట్ల 28 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 15 శాతం. ఆ తర్వాత వరుసగా ఐరిష్ 10.8 శాతం, ఇంగ్ల్లండ్ 8.7 శాతంగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇటాలియన్స్ 5.6 శాతం, పోలిష్ 3.2 శాతం, ఫ్రెంచ్ 3 శాతంగా ప్రభావం కలిగించే స్థానాల్లో ఉన్నారు. అంటే ఈరోజు ట్రంప్ ఇంత బలంగా నిలబడడానికి మూలాలు ఇక్కడివి మాత్రమే కాదన్న విషయం సుస్పష్టం. పకడ్బందీ వ్యూహ రచన చేయడానికి జర్మన్ల అండదండలు మెండుగా ఉండే అవకాశం ఉన్నది. శ్వేత జాతీయులలో సైతం జర్మన్లు అధికంగా ఉండడం ట్రంప్కు కలిసొచ్చిన అంశం. ఇటువంటి పరిస్థితుల్లో జర్మన్ జాతీయులు తమ పాత ఆధిపత్య ధోరణులను అమెరికాలో ప్రతిష్టించడానికి ప్రయత్నం చేస్తారనడంలో సందేహంలేదు. డొనాల్డ్ ట్రంప్ మంత్రి వర్గంలో ఉండబోయే వారిలో ఇప్ప టికే 26 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో 11 మంది పూర్వీకులు జర్మన్ జాతీయులే కావడం యాధృచ్చికం కాకపోవచ్చు. అందుకే స్వస్తిక్ అమెరికాలో హల్చల్ చేస్తున్నది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం మిగల్చిన విషాదం గుర్తుకొస్తున్నది. అందుకే సంప్రదా యానికి భిన్నంగా ట్రంప్ ఎన్నికైన వెంటనే వేలాది మంది వ్యతిరేక ప్రద ర్శనల్లో పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటికీ, ఎలక్టోరల్ కాలేజీ ఈ ఎన్నికను నిర్ధారించాలి. అందుకే ట్రంప్ను తిరస్క రించాలని ఆన్లైన్లో ఆయన వ్యతిరేకులు ఎలక్టోరల్ కాలేజి సభ్యలకు పిటి షన్లు పెడుతున్నారు. వారు గత అయిదారు రోజులుగా అయిదు నినాదాలతో భారీ ప్రదర్శనలు చేశారు. అందులో మొదటి నినాదం ‘డంప్ ట్రంప్’. రెండ వది ‘గోడలను కాదు వార«ధులను నిర్మించండి’అనే నినాదం. అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న మెక్సికన్లను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ తన ఎన్నికల సభల్లో మాట్లాడారు. అందువల్ల అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికో సరిహద్దు పొడవునా గోడను నిర్మిస్తానని ప్రకటించారు. అప్పుడు అందరూ డొనాల్డ్ ట్రంప్ను జోకర్గా భావించారు. కానీ ఈరోజు జరుగు తున్న ఘటనలు ‘గోడ నిర్మాణం’ మాటలను నిజం చేసేటట్టు ఉన్నాయి. మరో అంశం, ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను, ముఖ్యంగా జాత్య హంకార విధానాలను ఎండగట్టాలన్నది ప్రదర్శకుల భావన. నిజానికి హిల్లరీ క్లింటన్కు ప్రజలు నేరుగా వేసిన ఓట్లే అధికం. అయితే కొన్ని రాష్ట్రాలు ట్రంప్కు అనుకూలంగా ఓట్లు వేయడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. ఇది నిజానికి ఎన్నికల విధానంలో ఉన్న సమస్య. ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ పరో క్షంగా కొన్ని ఓట్లను ఇందులో కలపడం సరైనదికాదని ట్రంప్ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా, ట్రంప్ గత ఎన్నికల్లో విద్వేష పూరితమైన ఉపన్యాసాలతో ప్రజల మెదళ్లను కలుషితం చేశారు. అందువల్ల ఆయనే స్వయంగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని ఆందోళనకా రులు కోరుతున్నారు. ఇంకొక అంశం, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ తమ అధ్యక్షుడు కాదని అమెరికా ప్రజలు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రజలు తిరస్కరించిన చరిత్ర ట్రంప్కే సొంతం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే వారెవ్వరైనా తమ నాయకులు కాలేరని ఉద్యమ కారులు తెగేసి చెబుతున్నారు. సంఘర్షణ మొదలైనట్టేనా? అమెరికాలో ఈరోజు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. జాత్య హంకార ధోరణిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపడితే ఏమి జరుగుతుందో ఆయన అనుచరులు అక్కడక్కడా దాడులు, బెదిరింపులతో రుచిచూపిస్తూ తమ ఆధిపత్య ధోరణులను బయటపెట్టుకుంటున్నారు. అటువంటి సంఘటనలను సహించబోమనే ప్రజలు కూడా ఉన్నారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగంగానే తమ నిరసనలను తెలియ జేస్తున్నారు. ఒకరకంగా సంఘర్షణ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానం గురించి పథకాలు రచించుకున్నారు. అధికారంలోకి రావ డానికి ఎటువంటి నినాదాలు కావాలి, ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనేది ముందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా అమలు జరిపినవే. ఇందుకు కచ్చి తంగా జర్మన్ జాత్యహంకారమే పునాది. ముస్లింలను అమెరికాకు రాకుండా అడ్డుకోవడం, అక్కడ ఉన్నవారిని వేధిస్తాడన్న విషయం స్పష్టమైంది.ఆ తర్వాతి వంతు ఆసియా వాసులదే. కాబట్టి ట్రంప్ వ్యతిరేక ఉద్యమం ఎంత బలంగా నిలబడితే అమెరికా ప్రజాస్వామ్యానికి అంత మంచిది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
ఏడాదికి డాలరు జీతం చాలు
ట్రంప్ వెల్లడి వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాని ప్రకారం ఏడాదికి ఒక్క డాలరు జీతం మాత్రమే తీసుకుంటానని పునరుద్ఘాటించారు. సాధారణంగా అధ్యక్షుడికి ఇచ్చే నాలుగు లక్షల డాలర్లను స్వీకరించననీ, సెలవులపై ఎలాంటి విహారయాత్రలకు వెళ్లనని చెప్పారు. పన్నులను తగ్గిస్తాననీ, ఆరోగ్య సంరక్షణ రంగంపై శ్రద్ధ పెడతానని ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హస్య చతురత ఉన్న మనిషి అనీ, అలాగే ప్రచండుడు కూడా అని ట్రంప్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గురువారం శ్వేతసౌధంలో అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీసులో ఒబామా ట్రంప్ను కలవడం తెలిసిందే. ఎన్నికల సమయంలో తమ మధ్య ఉన్న వైరం గురించి భేటీలో అసలేమీ మాట్లాడలేదని ట్రంప్ తెలిపారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సోమవారం ట్రంప్తో మాట్లాడారు. ట్రంప్కు శుభాకాంక్షలు తెలపడంతోపాటు చైనా, అమెరికాల బంధం బలపడటానికి సహకారమే సరైన మార్గమని అన్నారు. ఎఫ్బీఐ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తన ప్రత్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయవాదిని నియమించే అంశంపై ఇంకా ఏమీ ఆలోచించలేదనీ, ప్రస్తుతం ఉద్యోగాల కల్పన, ఆరోగ్యం, వలసలు వంటి వాటిపై దృష్టి పెడుతున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రీన్స ప్రీబస్, ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందం సీఈవో స్టీఫెన్ బ్యానన్లను ట్రంప్ వైట్హౌస్లో కీలక స్థానాల్లో నియమించారు. ప్రీబస్కు ఉద్యోగుల అధిపతిగా, బ్యానన్కు ముఖ్య వ్యూహకర్తగా స్థానాలు లభించారుు. ముస్లింలపై వేధింపులు బాధపెడుతున్నాయి ముస్లింలు, లాటిన్లు, ఆఫ్రికన్-అమెరికన్లపై వేధింపులు ఆపాలని ట్రంప్ తొలిసారిగా ప్రజలను కోరారు. తాను అధ్యక్షుడు అయ్యాక వేధింపులు మొదలయ్యాయన్న వార్తలు తనకు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. హిట్లర్తో పోల్చినందుకు ఉద్వాసన ట్రంప్ను నియంత హిట్లర్తో పోల్చినందుకు కాలిఫోర్నియాలో ఒక ప్రొఫెసర్ను తాత్కాలికంగా తొలగించారు. చరిత్ర, ప్రత్యేక విద్యను బోధించడంలో అపార అనుభవం ఉన్న ఫ్రాంక్ నవరో (65) అనే ప్రొఫెసర్, ఎన్నికలు పూర్తైన తర్వాత పాఠం చెబుతూ ట్రంప్ను హిట్లర్తో పోల్చారు. -
అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం
మనీలా: ''డ్రగ్ బానిసలు, క్రిమినల్స్ లేని ఫిలిప్పీన్ నాలక్ష్యం. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది డ్రగ్ బానిసలున్నారు. భవిష్యత్ తరాల సంక్షేమం కోసం వారినందరినీ చంపడానికైనా నేను సిద్ధమే'' అని ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్రె సంచలన వ్యాఖ్యలు చేశారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం దావోస్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను జర్మనీ నియంత రుడాల్ఫ్ హిట్లర్ తో పోల్చడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశ భక్తి విషయంలో తాను హిట్లర్ కు సోదరుని లాంటి వానినని చెప్పుకొచ్చారు. జర్మనీలో హిట్లర్.. ఫిలిప్పీన్కు తానని అన్నారు. ఇప్పటివరకూ తమ దేశంలో చనిపోయిన వారందరూ క్రిమినల్సేనని స్పష్టం చేశారు. ఈ యేడాది మేలో పదివీ బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో ప్రభుత్వం జూన్ 30 వరకు 3,100 మందిని హతమార్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
హిట్లర్ను తలపిస్తున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజం సాక్షి, హైదరాబాద్: నియంత హిట్లర్ ఆలోచనా ధోరణికి కొనసాగింపుగానే సీఎం చంద్రబాబు నవ నిర్మాణదీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. ఆయన పాలన భయానకం, మాటలు ఓ బూటకమని గురువారం ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాన్ని విభజించడానికి ఒకటి.. రెండు కాదు నాలుగుసార్లు లేఖలివ్వడమేగాక లోక్సభలో తెలంగాణ విభజనకు తొలి ఓటు తమ పార్టీదేనంటూ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతతో ప్రకటింపజేసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టించిన చంద్రబాబు ఇప్పుడు విభజనకు వ్యతిరేకంగా నవ నిర్మాణదీక్ష చేస్తున్నానంటుండటం నయవంచన అని ధ్వజమెత్తింది. ‘‘ఇది నవ నిర్మాణ దీక్ష కాదు... నయవంచన దీక్ష, అవినీతి మీద, కుట్ర రాజకీయాలమీద ప్రజలు ధ్వజమెత్తాలన్న నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం.. రాష్ట్ర ప్రజల తొలి లక్ష్యం కచ్చితంగా ఇక చంద్రబాబు ప్రభుత్వమే కావాలి’’ అని స్పష్టం చేసింది. ప్రతిఒక్కరూ దీక్షలో పాల్గొనాలని, 11 గంటలకు ఎక్కడి వారక్కడ నిలిచిపోవాలంటూ చివరకు నియంతృత్వ దేశాల్లోనూ చేయని వెర్రిమొర్రి ఆలోచనలకు, ఎమర్జెన్సీని మించిన దుష్ట పోకడలకు చంద్రబాబు బుర్ర కేంద్రస్థావరంగా మారిందని మండిపడింది. -
అవాంఛనీయ మానవుడు
ఏప్రిల్ 20 హిట్లర్ పుట్టినరోజు రంగులూ, బ్రష్లూ, కాన్వాస్లతో కళాత్మక జీవితం గడపాలనుకున్నాడతడు. కానీ చరిత్రలో కొన్ని పేజీలని రక్తవర్ణంతో, నిజానికి రక్తంతోనే తడిపాడు. అతడే అడాల్ఫ్ హిట్లర్. అతని జీవితమే పెద్ద నైరూప్య చిత్రం. చిత్రకారునిగా స్థిరపడాలని కలగన్నాడు. పరిస్థితులు అతడిని జర్మన్ సైనికులతో కలసి కవాతు చేయించాయి. అతడి కలని ఒక వికృత చిత్రంగా మార్చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం విసిరిన చేదు ఫలితాలు జీర్ణించుకోలేక రోగిగా మారినవాడు హిట్లర్ (ఏప్రిల్ 20, 1889- ఏప్రిల్ 30, 1945). హిట్లర్ ఆస్ట్రియాలోని బ్రాన్వాలో పుట్టాడు. తండ్రి ఎలోయిస్ షికెల్బర్ కస్టమ్స్ అధికారి. ముక్కోపి. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడికి ఇంకో కొడుకు కూడా ఉండేవాడు. అంటే హిట్లర్కు వరసకు అన్న. చెడు వర్తనతో జైలు పాలయ్యాడు. హిట్లర్ అలా కాకూడదనీ, కస్టమ్స్లోనే మంచి ఉద్యోగం చేయాలనీ తండ్రి కోరిక. కొడుకు దారి తప్పకుండా ఉండటానికి మార్గం దండించడమేనని నమ్మాడు. తండ్రి దాష్టీకం నుంచి ఎలోయిస్ మూడో భార్య క్లారా పొయెల్జ్ హిట్లర్ను కాపాడింది. 1907లో హిట్లర్ ఇల్లు వదిలి నాటి ఆస్ట్రియా రాజధాని వియన్నా వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, హాస్టల్స్లో ఉంటూ బతికాడు. మరుసటి సంవ త్సరమే తల్లి క్యాన్సర్తో కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని కన్నార్పకుండా ఎంతోసేపు చూస్తూ గడిపాడట హిట్లర్. తరువాత మరణ శయ్య మీద తల్లిని ఊహించుకుంటూ ఒక స్కెచ్ గీశాడట. వియన్నీస్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్లో చదువుకోవాలన్నది హిట్లర్ కోరిక. సంస్థ పరిశీలన కోసం పంపిన చిత్రాలు అద్భుతంగా ఉన్నా, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టీసీ లేదంటూ దరఖాస్తును తిరస్కరించారు. 1914లో మ్యూనిచ్ వెళ్లిపోయాడు. అప్పుడే యుద్ధం వచ్చింది. ఆస్ట్రియా తరఫున బవేరి యన్ ఇన్ఫాంట్రీలో చేరడానికి ప్రయత్నించాడు. ఆయుధం కూడా మోయలేనంత బలహీనంగా ఉన్నాడని సైన్యంలో అవకాశం ఇవ్వలేదు. కానీ డిస్పాచ్ రన్నర్గా అవకాశం ఇచ్చారు. గ్రేట్వార్లో అతడు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఐరన్ క్రాస్ను కూడా పొందాడు. జర్మనీ ఓడి పోయింది. అప్పుడు వియన్నాలో ఉన్న పరి స్థితులు హిట్లర్ కళాతృష్ణను హరించేశాయని పిస్తుంది. అతడి దృష్టి రాజకీయాల మీదకు మళ్లింది. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందన్న నిజాన్ని హిట్లర్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడే క్రిస్టియన్ సోషలిస్టు పార్టీ ప్రాచుర్యం లోకి వచ్చింది. వియన్నా మేయర్ కార్ల్ ల్యూర్ ఆ పార్టీవాడే. వక్తృత్వ కళలో హిట్లర్ ఓనమాలు నేర్చుకున్నది కార్ల్ల్యూర్ ఉపన్యాసాలు వినే. రాజకీయవేత్తకు ఉండవలసిన ప్రధాన లక్షణం వక్తృత్వం. హిట్లర్ అందులో పండిపోయాడు. పూనకంతో, వీరావేశంతో, నిప్పులు కురిసినట్టుండే అతడి ఉపన్యాసం విన్న తరువాత ప్రజలు అతడేం చేయమంటే అది చేయడానికి సిద్ధపడేవారు. హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. అతడి నాయకత్వంలో ఏర్పాటైన కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా యూదులే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిట్లర్ బంకర్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. యూదులు విడుదలయ్యారు. స్వేచ్ఛాజీవితంలో కూడా ఆ జ్ఞాపకాలతో పడలేక ఆత్మహత్యలు చేసుకున్న యూదులున్నారు. కానీ హిట్లర్కు యూదులంటే అంత ద్వేషం ఎందుకు? తన తండ్రి ఒక యూదు కుటుంబపు అక్రమ సంతానం అన్న సత్యం అతడికి రుచించేది కాదట. జర్మనీ... వెన్నుపోటుతో యుద్ధంలో ఓడిపోయిందని హిట్లర్ నమ్మకం. ఆ వెన్నుపోటు వర్గాలలో యూదులు కూడా ఉన్నారని నమ్మేవాడు. కానీ ఆ యుద్ధంలో కొన్నివేల మంది యూదులు జర్మనీ తరఫున యుద్ధం చేస్తూ కన్ను మూశారు. ఎంతో సాహసం ప్రదర్శించినందుకు ఇచ్చే ఐరన్ క్రాస్ హిట్లర్కు దక్కడానికి కారణం- ఒక యూదు సైనికాధికారి చేసిన సిఫారసే. హిట్లర్ కుటుంబ పేదరికం కారణంగా ఒక యూదు వైద్యుడు డబ్బు తీసుకోకుండా సేవలు అందించేవాడు. అతడిని ‘నోబెల్ జ్యూ’ అని కీర్తించేవాడు హిట్లర్. కానీ తన తల్లికి వైద్యం చేసిన యూదు వైద్యుణ్ని మాత్రం తల్లి మరణానికి కారకుడని నమ్మి ద్వేషం పెంచు కున్నాడు. కాన్సెంట్రేషన్ క్యాంపులకు యూదుల్ని తరలించే ముందు వారందరినీ తీసుకు వెళ్లవచ్చునని హిట్లర్ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు అవకాశం ఇచ్చాడు. కానీ వారు నిరాకరించారు. ఇది చరిత్రలో వెలుగు చూడని సత్యం. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు. దీనికి పూర్తి భిన్నమైన కోణం కూడా హిట్లర్లో కనిపిస్తుంది. తల్లిని గాఢంగా ప్రేమిం చాడు. ఆమె మరణించాక ఎక్కడికి వెళ్లినా ఆమె ఫొటోను దగ్గరే ఉంచుకునేవాడట. ధూమపానా నికి వ్యతిరేకంగా సామాజికోద్యమాన్ని నడిపిన మొదటి వ్యక్తి హిట్లరే. అతడు శాకాహారి. జంతు హింసకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశాడు. హిట్లర్ అధికారంలోకి రావడం ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో జరిగింది. అతడు జర్మనీ నియంత అయ్యాడు. పోలెండ్ మీద యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచయుద్ధానికి తెర తీశాడు. ప్రపంచ చరిత్ర తట్టుకోలేనంత అవాంఛనీయ మానవుడు హిట్లర్. అతడి ప్రతి కూల ప్రభంజనంలో చరిత్ర పుటలు కకావికలై పోయాయి. ప్రపంచ రాజకీయ నాటకంలో ఇంతకు మించిన ప్రతినాయక పాత్రను అతడికి ముందు, అతడి తరువాత చరిత్ర చూడలేదు కూడా. విరుద్ధ భావాలు ఉన్నా, వికృత చర్యలకు చిరునామాగా మిగిలిపోయాడు హిట్లర్!! - డా॥గోపరాజు నారాయణరావు -
హిట్లర్ కన్ను పడింది!
మన ఘనత భారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో 1949 నుండి ఏటా డిసెంబర్ 7న మనం ‘ఫ్లాగ్ డే’ జరుపుకుంటున్నాం. త్రివిధ దళాల సైనికుల గౌరవార్థం నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మన ఆర్మీ గురించి 5 విశేషాలు! హిట్లర్కు ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం. ఒక సందర్భంలో ఆయన మన ‘గూర్ఖా’ దళం సహాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట. గూర్ఖా సైనికులు తన దగ్గర ఉంటే మొత్తం ఐరోపా ఖండాన్నే తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవచ్చని ఆయన తలపోశారట! జర్మనీ సైనికులకు దీటైన శక్తి ప్రపంచంలో గూర్ఖా దళం ఒక్కటే అని హిట్లర్ అన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సైనిక దళం భారత్కే ఉంది. ఖండాంతర క్షిపణి అగ్ని-5 ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడం ద్వారా భారత్... యు.ఎస్. ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలోని యుద్ధక్షేత్రం భారత్ నియంత్రణలో ఉంది. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో మన సైనికులు గస్తీ కాస్తున్నారు. అతిపెద్ద వలంటీర్ ఆర్మీ.. ప్రపంచంలో ఒక్క భారత్కే ఉంది. నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన వారిని వలంటీర్ ఆర్మీ అంటారు. (నేడు భారతీయ సైనిక దళాల పతాక దినోత్సవం) -
హిట్లర్ అసలు గొంతు ఇలా ఉంటుంది!
-
ఆయన హిట్లర్ను మరిపిస్తున్నారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హిట్లర్ను మరిపించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసును ఏసీబీ విచారిస్తోందా, లేదా టీఆర్ఎస్ విచారిస్తోందా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్పై కేసును ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఏసీబీ కాకుండా ఈ కేసును మరో ప్రైవేటు సంస్థ విచారిస్తోందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ముద్దాయి కాదని, సాక్షి మాత్రమేనన్నారు. -
'కేసీఆర్ మరో హిట్లర్'
హైదరాబాద్: విభజన చట్టాన్ని అంగీకరించిన టీఆర్ఎస్ పార్టీ.. అదే చట్టంలోని సెక్షన్- 8ను ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, రావెల కిశోర్ బాబులు నిలదీశారు. సెక్షన్-8 ను వ్యతిరేకించడం సరికాదని, ఈ విషయంలో నియంతృత్వపోకడను కనబరుస్తూ సీఎం కేసీఆర్ మరో హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన మంత్రులు.. చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసీఆర్ కు శిక్షతప్పదని హెచ్చరించారు. సెక్షన్-8తో ఉమ్మడి రాజధానిపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయని, అది ఆహ్వానించదగిందన్నారు. విభేదాలు తలెత్తినప్పుడే కాకుండా అన్నివేళలా బేషరతుగా సెక్షన్-8ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. -
వర్మ ట్విట్టర్లో హిట్లర్, లాడెన్...
ముంబయి: ఎప్పుడు చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ వివాదాల్లో చిక్కుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏం తోచలేదేమో.. నిన్న ఓ నియంత, నేడు ఓ ఉగ్రవాది ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానులను అవాక్కయ్యేలా చేశారు. మంగళవారం ఉదయాన్నే లాడెన్ చిన్ననాటి ఫొటోలు.. అతడి పిల్లల ఫొటోలు పెట్టి చర్చల్లో నిలిచాడు. వర్మ తన ట్విట్టర్లో ముందుగా హిట్లర్ చిన్న నాటి ఫొటో పెట్టి.. 'ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యి 60 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాడని మనం ఊహించగలమా.. అతడి పేరు అడాల్ఫ్ హిట్లర్ అని వ్యాఖ్య చేశాడు. ఇక లాడెన్ బాలుడిగా ఉన్నప్పటి ఫొటో, యుక్త వయసులో ఉన్న ఫొటో, అతడి పిల్లల ఫొటోలు పెట్టాడు. బాలుడిగా ఉన్నప్పటి ఫొటోపై 'ఈ బాలుడి పేరు ఒసామా బిన్ లాడెన్.. అమెరికాపై యుద్ధం ప్రకటించి పోయి గుహల్లో కూర్చున్నాడు' అని, యుక్త వయసులో ఉన్న ఫొటో పెట్టి 'బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయ్యి లాడెన్ కరాటే నేర్చుకున్నాడని, ఇక లాడెన్ ఆరుగురి పిల్లల ఫొటో పెట్టి 'ఈ ఆరుగురు లాడెన్కు ఉన్న 25 మంది సంతానంలో కొందరు. లాడెన్ మనుషులను చంపడమే కాకుండా.. అందుకు భిన్నమైన మరెన్నో ఎన్నో పనులు చేస్తాడని చెప్పేందుకు ఇదొక నిదర్శనం' అని పేర్కొన్నాడు. This innocent cute kid called Hitler unleashed violence on a scale unseen before or after and hopefully never pic.twitter.com/UxdmgTBksJ — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 Osama bin laden 3rd from left got inspired from Bruce lee pic.twitter.com/sWp5CJ3MKo — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 This boy called Osama Bin Laden grew up and sitting in a cave declared war on America pic.twitter.com/uj5HNBu4UW — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 6 of Bin Laden's children out of estimated 25 children..This proves he did other things too apart from killing people pic.twitter.com/yRLrpsPV6q — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2015 -
హిట్లర్ ఐస్క్రీమ్!
నా అంతవాడు లేడని నియంతగా ప్రవర్తించే నేతలందరికీ ఇదొక హెచ్చరిక. పట్టపగ్గాల్లేని దురహంకారంతో ప్రవర్తించి, లక్షలమందిని ఊచకోత కోసిన జర్మనీ నియంత హిట్లర్ బతికుండగానే చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ‘గ్రేట్ డిక్టేటర్’లో జోకర్గా మిగిలిపోయి నవ్వులపాలయ్యాడు. ఈ నియంత పేరిట ఇప్పుడు యూపీలో ఒకరు ఐస్క్రీమ్ తయారుచేసి అమ్ముతున్నారు. ‘సరుకు అమ్ముకోవడానికి మీకు ఇంతకన్నా మంచి పేరు దొరకలేదా’ అని ప్రశ్నించినవారికి కంపెనీ యజమాని నీరజ్ కుమార్ ఓపిగ్గా జవాబిస్తున్నాడు. ‘ముక్కోపిగా... అయినదానికీ, కానిదానికీ కఠినంగా ప్రవర్తించేవారిని మా దగ్గర హిట్లర్ అనే అంటారు. మా బంధువొకరిని మేం అలాగే పిలిచేవాళ్లం. అందుకే ఐస్క్రీమ్కు సరదాగా ఆ పేరే పెడదామనుకున్నాను...తప్పేంటి’ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రం తప్పే అంటున్నారు. నెటిజన్లలో చాలామంది కూడా అలాగే అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒకనాటికి తమకూ హిట్లర్ గతే పడుతుందని, ఇలా బజారున పడాల్సివస్తుందని నియంతలు తెలుసుకోవాలన్నది మరికొందరి అభిప్రాయం. -
ఫాసిజం అంతానికి 70 ఏళ్లు
సోవియట్ యూనియన్కి చెందిన ఎర్రసైన్యం బెర్లిన్ని ముట్టడించి కైవశం చేసుకోవడంతో హిట్లర్ నెలకొల్పిన థర్డ్ రీచ్, రెండో ప్రపంచ యుద్ధం 1945 మే 9న ముగిసి పోయాయి. జర్మనీ బేషరతుగా లొంగిపోవడంతో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మారణకాండకు ముగింపు పలికినట్లయింది. హిట్లర్ హయాంలో జరిగిన అమానుష ఘటనలు సాంప్రదాయకమైన మానవ చిం తనపై ఎలాంటి ప్రభావం వేశాయంటే ఆనాడు నిజంగా ఏం జరిగిందన్నది అవగాహన చేసుకోవడం నేటివరకు చరిత్రకు సాధ్యం కావడం లేదు. ప్రముఖ తత్వవేత్త థియొడర్ అడోర్నో దీనిపై స్పందిస్తూ ఆస్చ్విట్జ్ (నాజీ చిత్రహింసల కేంద్రం)లో మారణకాండ పరంపర తర్వాత, కవిత్వ రచనను కొన సాగించడం కూడా అనా గరికమే అని వ్యాఖ్యానించారు. నాజీలు ఒక పద్ధతి ప్రకారం ఏకపక్షంగా లక్షలాది మందిని ఊచకోతకు గురి చేసిన తర్వాత ఇక కవిత్వం రాయడానికి ఏమీ లేదన్నది ఆయన భావన. ఆనాడు యూదులపై, తదితర ప్రజా నీకంపై జరిపిన చిత్రహింసలు, దౌర్జన్యాల గురించి తెలుసుకుని భయవిహ్వలతకు గురైనవారు మళ్లీ సాధా రణ జీవితం గడపటం సాధ్యం కాకపోయింది. ‘మళ్లీ ఎన్నడూ ఫాసిజం వద్దు. యుద్ధం వద్దే వద్దు’ అనేది వారి పవిత్ర ప్రమాణంలా మారింది. ఫాసిజంపై విజయం 20వ శతాబ్దికి చెందిన అత్యంత కీలక ఘటనల్లో ఒకటి. ఆ శతాబ్ది ద్వితీయా ర్థం నుంచి నేటి వరకు ఈ మహద్ఘటన మానవ నాగరి కతా వికాసానికి మెరుగులద్దుతూనే ఉంది. అది సాధిం చిన గొప్ప విజయం వలస పాలన నుంచి కోట్లాది మం ది ప్రజలను విముక్తి చేయడం. అనేక దేశాల్లో స్వాతం త్య్ర పోరాటానికి వీలు కల్పించింది. సంక్షేమ రాజ్యం, పెట్టుబడి దారీ దేశాల్లోని ప్రజలకు సామాజిక భద్రతా యంత్రాంగాన్ని నెలకొల్పడం, ప్రజాస్వామ్యాన్ని మరిం త విస్తృతపర్చడం వంటివి ఆ విజయ ఫలితాలే. అనంతరం జరిగిన మానవ చింతన అభివృద్ధిలో నుంచే ఆధునిక ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు, మానవ హక్కులకు కొత్త నిర్వచనాలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ ఈ ఆశ, ఈ విశ్వాసం మనలో ఎంతమేరకు ఇప్పటికీ కొనసాగుతోందంటే చెప్పడం కష్టమే. హిట్లర్ గతించి 70 ఏళ్లు గడిచిన తర్వాత నేడు కూడా మనం శాంతియుత ప్రపంచంలో జీవించలేకపోతున్నాం. పైగా చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా మనుషులు ప్రస్తుతం బానిస జీవితం గడుపుతున్నారు. ఆకలి చావు లు, వలసలు అనేవి మనిషిపట్ల జరుగుతున్న ఘోర అన్యాయానికి నిద ర్శనాలుగా నిలబడుతు న్నాయి. 2001 సెప్టెంబర్ 11తో మొదలుకుని నేటివరకు మధ్యప్రాచ్యంలో జరు గుతున్న యుద్ధాల్లో పది లక్షల మందికిపైగా పౌరులు చనిపోయారు. దేశాలకు దేశాలు బాంబుదాడుల్లో శిథిలమయ్యాయి. ఇక చిత్రహింసలు, అత్యాచారాలు, పాశవిక చర్యల మాట చెప్పనవసరం లేదు. ద్రోన్ దాడుల పేరుతో ఒబామా యంత్రసమన్విత హత్యాకాండను పరాకాష్టకు తీసుకు పోతున్నారు. ఇక యూరప్ మరోసారి ప్రపం చాధిపత్య శక్తుల మధ్య రణస్థలిలా మారే ప్రమాదం పొంచుకుని ఉంది. పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య ఘర్షణ అనంతంగా సాగుతోంది. యూరప్లో అణు యుద్ధ ప్రమాదం ఎన్నడూ లేనంతగా పొడసూపు తోంది. సంపన్న రాజ్యాలుగా భావిస్తున్న యూరప్, ఉత్తర అమెరికాల్లో అసంఖ్యాక ప్రజలు దారిద్య్రంలోకి కూరుకుపోతుండగా, కులీన వర్గాలు పోగుచేసుకుం టున్న సంపద చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సామాజిక అసమానతను పెంచి పోషిస్తోంది. భవిష్య త్తుపై నమ్మకం కోల్పోతున్న ప్రజలకు అవినీతి కరమైన పాలక వర్గంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిణామాలన్నీ కలసి 70 ఏళ్ల క్రితం జర్మనీలో వైమర్ రిపబ్లిక్ చివరి రోజుల్లో నెలకొన్న పరిస్థితిని తలపిస్తు న్నాయి. నాడు సైతం అత్యంత అధికస్థాయికి చేరుకున్న ఆర్థిక అసమానత్వమే ఫాసిజానికి దారి తెరిచింది. గ్రీస్, ఫ్రాన్స్, హంగరీలలో మితవాదశక్తులు పుంజుకుంటున్న తీరు చూస్తే 1933 నాటి ఫాసిస్టు ప్రమాదం విజృం భించడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. నోమ్ చామ్స్కీ కొన్నేళ్ల క్రితం దీనిపై ఎంతో ముందు చూపుతో హెచ్చరించారు కూడా. చరిత్రపై ఇంతటి ప్రభావాన్ని కలిగించిన ఫాసి జంపై విజయ ఘటనకు మన దేశంలో కనీస గుర్తింపు లేకుండాపోవడమే విషాదకరం. వలసపాలనలోని బ్రిటిష్ ఇండియాకు చెందిన 25 లక్షల మంది సైనికులు ఫాసిజంపై వీరోచిత పోరులో పాలుపంచుకున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో హిట్లర్ పక్షాన నిలిచిన జపా న్ను ఓడించడంలో అద్వితీయ పాత్ర భారతీయ సైనికు లదే. ఫాసిజంపై గెలుపులో భారతసైనికుల త్యాగాలు రూపుమాసిపోకూడదు. అలాగే ఫాసిజం చేదు జ్ఞాపకా లను ప్రపంచంలో ఏ ఒక్కరూ మరువకూడదు కూడా. (ఫాసిజంపై విజయానికి నేటికి 70 ఏళ్లు) కె. రాజశేఖరరాజు -
హిట్లర్ మీసం వెనుక...
అదన్న మాట! ముక్కుకు దిగువ గుబురుగా టూత్బ్రష్ను తలపించే మీసం కనిపిస్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు అడాల్ఫ్ హిట్లర్, మరొకరు చార్లీ చాప్లిన్. ఒకరు కరడు కట్టిన నియంతృత్వానికి, మరొకరు కడుపుబ్బ నవ్వించే హాస్యానికీ ప్రతీక. ఇంతకీ ఈ మీసం కథేమిటిటంటే... చార్లీ చాప్లిన్ అయితే జగమెరిగిన హాస్యనటచక్రవర్తి, అందువల్ల జనాలకు నవ్వు తెప్పించే ఉద్దేశంతో అలాంటి మీసం పెంచుకున్నాడనుకోవచ్చు. మరి ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత హిట్లర్ కూడా అలాంటి కామెడీ మీసాన్ని ఎందుకు పెంచుకున్నాడు? నియంతగా ముదరక ముందు సైన్యంలో పనిచేసే కాలంలో హిట్లర్కు తెగబారెడు మెలితిరిగిన మీసాలుండేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం శత్రుసేనలపై మస్టర్డ్ గ్యాస్తో దాడులు ప్రారంభించింది. మస్టర్డ్ గ్యాస్ దాడి నుంచి రక్షణ పొందేందుకు బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులు గ్యాస్ మాస్క్లను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్లు తొడుక్కోవడానికి అనుగుణంగా మీసాల పొడవును కుదించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా హిట్లర్ మీసాలు ఇలా మారాయి. -
నోబెల్ విశేషాలు వివాదాలు
డిసెంబరు 10 న నోబెల్ వర్ధంతి. 9న అస్లో సిటీలోని ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’లో నోబెల్ పురస్కార కార్యక్రమం జరుగుతుంది. 10న వారందరితో ఒక ఫోటోసెషన్ వుంటుంది. అమెరికా, జపాను, జర్మనీ, ఫ్రాన్సు, నార్వే, ఇండియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ఏడాది 13 మంది ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు! ప్రపంచంలో చాలా దేశాలలో అవార్డుల ప్రదాన సంప్రదాయం వుంది. అయినప్పటికీ నోబెల్ అవార్డుకు వున్న ప్రఖ్యాతి వేరు. దాని ద్వారా వచ్చే కీర్తీ ఎక్కువే. రివార్డూ ఎక్కువే. నోబెల్ ప్రారంభ సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే పారితోషికం కూడా చాలానే పెరిగింది. 2013లో అన్ని రంగాలకు కలిపి 343 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు అని కాదు. ప్రచారం కూడా అంతే. అదొక అంతర్జాతీయ ఖ్యాతి. అందుకే ఈ అవార్డులో నామినేషన్ల నుంచి ఎంపిక దాకా ప్రలోభాలు వుంటాయి. ప్రభావాలూ వుంటాయి. విశేషాలు, వివాదాలు ఉంటాయి. ఆ వివరాలే ఈవారం మన ‘వివరం’. ఆల్ఫ్రెడ్ నోబెల్ పుట్టింది స్వీడన్లో. పెరిగింది నార్వేలో. చనిపోయింది ఇటలీలో. నోబెల్ పుట్టే సమయానికి అంటే 1833 నాటికి నార్వే స్వీడన్ ఆక్రమణలో వుంది. అంతకు మునుపు అంటే 1380 నుంచి 1814 దాకా డెన్మార్కు ఆక్రమణలో వుంది. నార్వే కూడా తక్కువేమీ కాదు 13వ శతాబ్దం వరకూ తనదీ ఆక్రమణల చరిత్రే. ఐస్లాండ్, గ్రీన్లాండ్, షట్లాండ్లను తానూ ఆక్రమించుకుని పెత్తనం చేసింది. ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ చేతిలోకి వెళ్లిపోయింది. నార్వేకి ఉన్నది చాలా చిన్న చరిత్ర. ఉన్న ఆ చరిత్ర కూడా ఆక్రమణల చరిత్రే. చేపలకోసం, జంతువులకోసం వేటాడుతూ ఇక్కడకొచ్చి స్థిరపడి ఇనుము, ఇత్తడి యుగాల్లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలమీదా, పాలమీదా ఆధారపడి బ్రతికిన పదివేల ఏళ్లనాటి చరిత్రను పక్కన పెడితే క్రీ.శ.1030లో ‘క్రిష్టియానిటి రాజ్యం’ కింద బ్రతకడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ, నార్వేదంతా ఆక్రమణల చరిత్రే. అయితే 1350లో ప్లేగు వ్యాధి వ్యాపించి దేశంలో సగం మంది చనిపోయారు. ఇక అక్కడి (ఇతరులను ఆక్రమించే స్థితి నించి) ఇతరుల ఆక్రమణలోకి నార్వే వెళ్లిపోయింది. నోబెల్ విల్ 1905లో నార్వే స్వతంత్రతను ప్రకటించుకోవడానికి సరిగ్గా అయిదేళ్లకు ముందు అంటే 1900ల్లో ‘నోబెల్ ఫౌండేషన్’ ఏర్పడింది. దీనికి అయిదేళ్లకు ముందు 1895 నవంబరు 25న నోబెల్ తన వీలునామా రాశాడు. దాని పేరు ‘ఆఖరి వీలునామా’. దీన్ని పారిస్లోని ‘స్వీడిష్ నార్వీజియన్ క్లబ్’లో భద్రపరచి, తన తదనంతరం అమలు పరచమన్నాడు. మానవాళికి ప్రయోజనం కలిగించే పరిశోధనలకు తన పేరుతోవున్న అవార్డులను ఇవ్వమని, ఆ అవార్డులకయ్యే ఖర్చునంతటినీ తన సంపద ద్వారా వచ్చే వార్షిక ఆదాయం నించి వాడమని చెప్పాడు. సహజంగానే ఆస్తివున్న చోట వారసత్వం వుంటుంది. ఆ వారసత్వం దీనికి ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వీలునామా తన పని తాను చేసుకుపోతుంది. వారసులకు కోపమొచ్చింది. అపారమైన సంపద పరులపరం కావడం సహించలేక నోబెల్ మీద కోపంతో ఆ అవార్డుకు నోబెల్ పేరును తొలగించాలని చూశారు. సాధ్యపడలేదు. వీలునామా దానికి సహకరించలేదు. నోబెల్ గురించి కొంచెం నోబెల్ బాలమేధావి. పరిశోధనా పిపాసి. పదిహేడేళ్లకే రష్యా, ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లిషు భాషలు నేర్చుకున్నాడు. కెమికల్ ఇంజనీరు. అనేక రంగాల మీద అనేక పరిశోధనలు చేశాడు. అనేక పుస్తకాలు రాశాడు. తన పరిశోధనల మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అదీ ఇదీ అని లేకుండా అన్ని వ్యాపారాలూ చేశాడు. దీంట్లో తండ్రి ఇమ్మానియేలు అతనికి ఆదర్శం. ఆయన తిరగని దేశం లేదు. చేయని వ్యాపారమూ లేదు. సంతానం అంతా ఇదే పని. వీరికి ఇరవై దేశాలలో తొంభై వ్యాపారాలు వున్నాయి. నోబెల్ పేదల కోసం చేసింది ఏమీ లేదు. పేదరికం మీద ఆలోచించింది అంతకన్నా లేదు. అతనికి సైన్సు పట్ల, సాహిత్యం పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తి వుంది. ఆ ఆసక్తి నుంచి వచ్చిన ఆశయమే ‘నోబెల్ అవార్డు’. 1895 నాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ (ఫిజియాలజీ కూడా), సాహిత్యం, శాంతి, ఇవి మాత్రమే నోబెల్ అవార్డు పరిధిలో వుండేవి. 1968లో ఎకనామిక్స్ను చేర్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్లను ఎంపిక చేసే పనిని ‘రాయల్ ఎకాడమి ఆఫ్ సైన్సు’ చూస్తుంది. మెడిసిన్ ఫిజియాలజిని ‘నోబెల్ అసెంబ్లీ ఎట్ కరోలిన్స్కా’ చూస్తుంటుంది. అలాగే సాహిత్యాన్ని ‘స్వీడిష్ అకాడమీ’, శాంతి అవార్డును ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘నార్వే పార్లమెంటు’ చూస్తుంది. దీంట్లో నార్వే ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులతో పాటుగా న్యాయశాస్త్ర ఆచార్యుడొకరు వుంటారు. మలాలాకు ఎలా ఇస్తారు? నోబెల్ పేరుతో ఇచ్చే అవార్డుల్లో మిగతావన్నీ ఒక ఎత్తు కాగా, ‘శాంతి’ పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఒక్కటీ ఒక ఎత్తు. నోబెల్ ఏ స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పాడో దానికి పూర్తి విరుద్ధంగా అనేకమార్లు ఈ అవార్డు దుర్వినియోగం అయ్యింది. అవుతూనే వుంది. మలాలా, సత్యార్థుల విషయంలో అది మరొకసారి రుజువయ్యింది. ఈ ఇద్దరూ బాల బాలికల కోసం కృషి చేసి వుండవచ్చు. వారి కోసం తమ జీవితాల్ని అంకితం చేసి వుండవచ్చు. కాని అలాంటి కృషికి తన ‘శాంతి అవార్డు’ను ఇవ్వమని నోబెల్ ఎక్కడా చెప్పలేదు. ఇస్లామిక్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టటానికీ, అమెరికాను సంతృప్తి పరచడానికీ ఐక్యరాజ్య సమితి సలహా మేరకు ‘మలాలా’లకు ఈ అవార్డును ఇచ్చారు. మలాలాకు ఇవ్వాలి కాబట్టి సత్యార్థికీ ఇచ్చారు. ఒబామా శాంతి దూతా? ఇలాంటి దుర్వినియోగమే అమెరికా కోసం 2009లో ఒకసారి జరిగింది. ఒబామా అమెరికాకు ప్రెసిడెంటు అయిన 9 నెలలకే ‘ప్రపంచ ప్రజల మధ్య అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి చేసిన కృషికి గాను ఆయనను ఆ ఏడాది శాంతి పురస్కారంతో సత్కరించారు. తాలిబన్ల చేతిలో కూలిపోయిన ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ శకలాలను తొలగించడానికే అమెరికాకు ఆరు నెలలు పట్టింది. అలాంటిది తొమ్మిది నెలల్లో అంతర్జాతీయ సంబంధాలను ఒబామా మెరుగుపరచగలడా? ఇదే ప్రశ్నను అప్పట్లో ‘నోబెల్ కమిటీ’ని మీడియా అడిగింది. ‘‘ఇస్లామిక్ దేశాలలో ఉద్రిక్తతల్ని తగ్గించడానికీ, ఆయా దేశాలలో మోహరించిన సైన్యాన్ని కుదించడానికీ, అణ్వాయుధాల తయారీని తగ్గించడానికీ ఒబామా కృషి చేశారు. పదవిలోకి వచ్చిన మూడు మాసాలకే ఈ విషయం మీద రష్యాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘అందుకే ఆయన్ని ఈ ఏడాది శాంతి దూతగా గుర్తించామని’’ కమిటీ వైస్ ఛైర్మన్ తర్బోజన్ జంగ్లాండ్ జవాబిచ్చారు. నిజానికి ఈ జవాబుకి అమెరికా ప్రెస్సే నవ్వింది. ఛలోక్తులు విసిరింది. ఒబామా వచ్చిన తర్వాత అరబ్బు నేలపై ఉద్రిక్తతలు పెరిగాయి. సైన్యాన్ని పెంచారు. విస్తరించారు. ‘న్యూక్లియర్ వెపన్’ విషయంలో అమెరికాది ఎప్పుడూ గురివింద గింజ సామెతే. సరే. ఒబామా విషయంలో కమిటి చెప్పిందే నిజమనుకుందాం. కొద్దిసేపు ఆయన్ను శాంతి కపోతమనే అనుకుందాం. అయితే అధికారానికి వచ్చిన 12వ రోజుకే ఆ కపోతం శాంతికై పైకి ఎగిరిందా? ఈ అసలు రహస్యాన్ని ఎవ్వరూ పట్టుకోలేదు గానీ ఒబామా ప్రెసిడెంటు పదవిలోకి వచ్చిన 12వ రోజునే నామినేషను పత్రాలు ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’కి చేరాయి. అప్పుడే ఆ ఎంపిక జరిగిపోయింది. ఈ ప్రశ్న తర్బోజన్ని మీడియా అడిగి ఉంటే అప్పుడాయన ఏం చెప్పి వుండేవారో? చైనా దుష్టత్వం - అమెరికా కపటత్వం! 2010లో ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి దుర్వినియోగమే ఇంకోటి జరిగింది. దాంట్లో కూడా అమెరికా హస్తముందని చెప్పుకున్నారు. ‘లియోబియోబో’ అని చైనా హక్కుల కార్యకర్త. ‘అహింసా మార్గంలో మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి’గా ఆ సంవత్సరానికి అతనికిచ్చారు. చైనా ప్రభుత్వం అతణ్ణి చాలా కాలంపాటు జైల్లోనే వుంచింది. ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లనివ్వలేదు. చివరికి అతని తరపున అతని బంధువులని కూడా వెళ్లనివ్వకుండా చైనా ఆంక్షలు పెట్టింది. ఆ రకంగా చైనా తన ‘సోషలిస్టు దుష్టత్వాన్ని’ ప్రదర్శించుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ’ అని వాషింగ్టన్లో ఒక స్వచ్చంద సంస్థ వుంది. దానికి అమెరికా ప్రభుత్వంలోని హోమ్ శాఖ నుంచి నిధులు వస్తుంటాయి. అమెరికా తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న దేశాల్లోని అంతర్గత విషయాల్లోకి ఈ సంస్థను ప్రయోగిస్తుంటుంది. ఈ సంస్థ నుంచి ‘లియోబియాబో’కి ఫండ్సు వస్తుంటాయని, ఆ డబ్బుతోనే అతను చైనాలో పని చేస్తుంటాడనే విషయం బైటికొచ్చింది. అతనికి వచ్చిన ‘నోబెల్ అవార్డు’ వెనక అమెరికా వుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా మానవ హక్కులను మంటగలుపుతున్న అమెరికా ‘చైనా మానవ హక్కుల కోసం’ ఆరాటపడడం, అందుకోసం అతనికి అవార్డు ఇప్పించడం, నార్వే ఇవ్వడం రెండూ విడ్డూరంగా జరిగిపోయాయి. శాంతికి ఛాంపియనా? 2012లో శాంతి పురస్కారం ‘యూరోపియన్ యూనియన్’కి దక్కింది. ఈ యూనియన్లో మొత్తం 28 దేశాలుంటాయి. నోబెల్ అవార్డును వ్యక్తులకూ ఇవ్వవచ్చు. సంస్థలకూ ఇవ్వవచ్చు. అలా అని నోబెలే తన వీలునామాలో చెప్పాడు. ‘యూరప్లో మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, శాంతిని నెలకొల్పడం కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఈసారి శాంతి అవార్డును యూనియన్కి ఇచ్చామని కమిటీ చెప్పుకుంది. అరబ్బు నేలపై యుద్ధాన్ని చేసే ప్రతి సందర్భంలోనూ అమెరికా ఒక ‘సంకీర్ణ కూటమి’ని తయారు చేస్తుంది. ఆస్ట్రియా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, బ్రిటను ఈ కూటమిలో వుంటాయి. ‘యూరప్ యూనియన్’లో ఈ దేశాలదే ప్రముఖ పాత్ర. ఆ కృతజ్ఞతతోనే అమెరికా ఆ అవార్డును ఇప్పించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘శాంతికి యూరోపియన్ యూనియన్ ఏమైనా ఛాంపియనా?’ అనే హెడ్డింగులతో పత్రికలు విమర్శలు కూడా రాశాయి. శాంతే కాదు; సైన్సూ అంతే! శాంతి పురస్కారాలలోనే కాదు. శాస్త్ర, సాహిత్య పురస్కారాలలో కూడా ‘నోబెల్’ వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ‘గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్’ అనే సబ్జక్టు మీద రోజర్ వైసైన్, వసామూ షిమోమురా, మార్టిన్ చెలిఫ్ అనే ముగ్గురికి ‘కెమిస్ట్రీ అవార్డు’ను 2008లో ఇచ్చారు. నిజానికి ఈ ఫార్ములా వీరిది కాదు. డగ్లస్ ప్రెషర్ అనే అత నిది. అవార్డు వచ్చిన ముగ్గురిలో ఒకరైనా రోజర్ వైసైన్ ‘ప్రెషర్’కి స్నేహితుడూ, శిష్యుడు కూడా. ఇతను ప్రెషర్తో వుంటూనే, ‘నోబెల్ అవార్డు మీకు తప్పకుండా వస్తుంది. అందుకు నా వంతు కృషి నేను చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి, ఈ ఫార్ములా రూట్ని తెలుసుకుని, మిగతా ఇద్దరికీ చేరవేశాడు. వారు ముగ్గురూ దాన్ని తమదిగా బిల్డప్ చేసి ‘నోబెల్ కమిటి నామినేషన్’కు పంపారు. అవార్డు వారికి వచ్చింది. అప్పుడు తేరుకున్న ప్రెషర్ ‘ఈ ఫార్ములా నాది’ అని కమిటీకి తెలియజేసి కొన్ని ఋజువుల్ని పంపాడు. ఈ తప్పు సరిదిద్దవలసిన ‘రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సెన్సైస్’ వారు ‘‘నువ్విప్పుడు శాస్త్ర వృత్తిలో లేవు. డ్రైవింగ్ వృత్తిలో వున్నావు. కాబట్టి నీకీ అవార్డు రాదని’’ సమాధానం ఇచ్చారు. ఆ అవార్డు వచ్చే సమయానికి అతను బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మాట నిజమే. అతని ఆర్థిక పరిస్థితి అలాంటిది. అంత మాత్రాన అతను ఆ అవార్డుకు అర్హుడు కాకుండా పోతాడా? నిజానికి ప్రెషర్కి రోజర్ చేసిన ‘గురుద్రోహం’కన్నా, నోబెల్ కమిటి చేసిన ‘సాంకేతిక ద్రోహమే’ ఘోరమైనది. కెమిస్ట్రీ అవార్డు మీదే ఇంకో వివాదం వుంది. ‘కేటలిస్టిక్ ఎఫెక్ట్ ఆన్ మెటల్ సర్ఫేసెస్’ (లోహ ఉపరితలంపై ఉత్ప్రేరకాల ప్రభావం) అనే ప్రతిపాదనకు గాను గెర్హార్ట్ ఇర్టిల్ అనే అతనికి 2007లో అవార్డు ఇచ్చారు. నిజానికి ‘మోడరన్ సర్ఫేస్ సైన్స్ అండ్ కెటాలిసిస్’ (ఆధునిక ఉపరితల శాస్త్రమూ, ఉత్ప్రేరకాలూ) అని ఇర్టిల్ కన్నా ముందే గేబర్ సముర్జాయ్ అనే అతను ఒక ప్రతిపాదనను చేసి వున్నాడు. అతను చేసిన ప్రతిపాదనలో ఇర్టిల్ది ఒక పార్టు మాత్రమే. ఒక రకంగా దీనికి పితామహుడు గేబర్ సముర్జాయే. కాని నోబెల్ కమిటీ మాత్రం (2007లో) గెర్హార్ట్ ఇర్టిల్కి మాత్రమే అవార్డు ఇచ్చింది. దీనిపై అనేకమంది శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పించారు. పొలిటికల్ నోబెల్! నోబెల్ని ‘వివాదాల నోబెల్’గా అర్థం చేసుకున్నట్లుగానే ‘పొలిటికల్ నోబెల్’గా అర్థం చేసుకుంటే సముచితంగా వుంటుంది. చెప్పాలంటే ‘అమెరికా నోబెల్’గా అర్థం చేసుకోవడం ఇంకా అర్థవంతంగా వుంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ వుండకపోవచ్చు. 1901 నించి 2012 వరకు 856 మందికి నోబెల్ అవార్డులు ఇస్తే ఒక్క అమెరికాకు చెందిన వారికే 353 మందికిచ్చారు. అంటే దానర్థం మేధస్సూ, పరిశోధనా, సాహిత్య తపనా, శాంతి అమెరికా సొత్తు అనా? కాదు. అయిల్ పైన, ఆయుధాలపైనా అమెరికాకు ఎంత గుత్తాధిపత్యం వుందో ‘నోబెల్’ పైనా అంతే గుత్తాధిపత్యం వుందని దానర్థం. ఇదీ నోబెల్ కథ. నోబెల్ వివాదాల కథ. - నన్నూరి వేణుగోపాల్ హిట్లర్కి కోపమొచ్చింది! 1936లో కార్ట్ వన్ ఓసిటిజ్కి అనే అతనికి నోబెల్ అవార్డును వచ్చింది. ఇతను ప్రఖ్యాతిగాంచిన జర్మన్ రచయిత. నాజీ సిద్ధాంతాన్నీ, హిట్లర్నీ వ్యతిరేకిస్తూ సాహసోపేతమైన రచనల్ని రాశాడు. ఇతనికి అవార్డు రావడంతో హిట్లర్ సహించలేక పోయాడు. ‘జర్మన్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇకపై నోబెల్ ప్రైజ్ని తీసుకోవద్దని ఒక హుకుం జారీ చేశాడు. దాంతో 1938లో కెమిస్ట్రీకీ, 1939లో మెడిసిన్, కెమిస్ట్రీలకూ నోబెల్ అవార్డులు వచ్చినప్పటికీ హిట్లర్కి భయపడి ఆ అవార్డులను వారు తీసుకోలేకపోయారు. పురస్కార తిరస్కారం! 1964లో సాహిత్యానికిగాను జీన్పాల్ సర్ట్రి అనే అతనికి అవార్డు ఇస్తే అతను తిరస్కరించాడు. 1973లో ‘లిడ్యురాతో’ అనే అతనికి ‘ప్యారిస్లో శాంతిని నెలకొల్పాడు’ అంటూ అవార్డును ఇస్తే అతను ‘వియత్నాం ఒక ప్రక్కన అశాంతితో అల్లాడుతుండగా ఈ అవార్డును నేను తీసుకోను’ అని అవార్డును తిరస్కరించి తన నిరసనను ప్రకటించాడు. మొత్తం నోబెల్ అవార్డు ‘వందేళ్ల చరిత్ర’లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘శాంతి పురస్కారాన్ని’ సిద్ధాంతం కోసం తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఇతనే కావచ్చు. నోబెల్ ఆత్మహత్యలు! ఇప్పటిదాకా మనం నోబెల్ అవార్డు దుర్వినియోగాన్ని చూశాం. వివాదాల్ని చూశాం. తిరస్కరణల్నీ చూశాం. దీంట్లో ఇంకో కోణం వుంది. అది ఆత్మహత్యల కోణం. అయితే ఈ అవార్డుకి ఈ మరణాలకి సంబంధం లేదుగానీ ఆ స్థాయి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1968లో సాహిత్యానికిగాను ‘ఎసూనారి కవాబాట’కి అవార్డు ఇచ్చారు. అతను ‘జపాన్, ది బ్యూటిఫుల్ అండ్ మైసెల్ఫ్’ అని జపాను సంస్కృతి మీద ఒక థీసీస్ రాశాడు. ఈ అవార్డు అందుకున్న నాలుగేళ్లకు అంటే 1972లో బాత్రూమ్లో గ్యాస్ పైపు లీక్ అయ్యి చనిపోయాడు. దానంతట అది యాక్సిడెంటల్గా లీకు అయ్యికాదు; తానే లీక్ చేసుకుని చనిపోయాడు. కవాబాటకు ‘యుకియో మిషియా’ అనే ఒకామెతో వివాహేతర సంబంధం వుందని, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆ షాక్ వలనే ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడనే నిజం ఒకటి ఆ తర్వాత బైటకొచ్చింది. 1972లోనే ‘స్టాన్ఫోర్డ్మూరి’ అనే అతనికి కెమిస్ట్రీ క్రింద నోబెల్ అవార్డునిచ్చారు. అతను ‘ఎమియోట్రాపిక్ లేటరల్ సిరియోసిస్’ అనే కండరాల నరాల జబ్బు వలన ఆత్మహత్య చేసుకున్నాడు. కేన్సర్ మీద రీసెర్చి చేసినందుకు ‘క్రిష్టియన్ డి దువే’ అనే అతనికి 1974లో మెడిసిన్ విభాగంలో అవార్డునిచ్చారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న అతను ఆ వ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే యూరప్లో అప్పటికే రైట్ టు డై అనే చట్టం వుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి అప్పీలు చేసుకుని ప్రభుత్వ అనుమతితో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ మరణం మీద ఎటువంటి వివాదమూ లేదుగాని ‘అతని అప్పీలును ప్రభుత్వం శాస్త్ర బద్ధంగా పరిశీలించకుండానే అతనికి ఆ అవకాశం ఇచ్చిందనే విమర్శ మాత్రం వుంది. గాంధీకి ఎందుకివ్వలేదు? మొత్తం మీద ‘వివాదాల నోబెల్’ అనదగ్గ అవార్డు ఇది. బహుశా ప్రపంచంలో మరే ఇతర అవార్డుకీ లేనంత వివాదం ఈ అవార్డుకు వుంది. అన్నిటిలోకి పెద్ద వివాదాస్పదమైన విషయం ఏమిటంటే గాంధీకి ఈ అవార్డు ఇవ్వకపోవడం. ‘రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించి వాటి మధ్యన శాంతిని నెలకొల్పే విషయంలో విశేషంగా కృషి చేసిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన శాంతి పురస్కారాన్ని ఏనాడో దారి తప్పించారు. అహింసా మార్గంలో కృషి చేసేవారికీ, అంతర్జాతీయంగా ప్రజల మధ్య సంబంధాలు పెంచేవారికీ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ అర్థంలో గాంధీకి ఇవ్వాలి కదా? కాని ఇవ్వలేదు. ప్రపంచ వ్యాపితంగా ‘అహింసా వాది’గా పేరు పొందిన గాంధీకి ఈ అవార్డును ఇవ్వకపోవడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఒక మనిషి ఒక పరిశోధన చేసి ‘నా పరిశోధనను గుర్తించండి’ అంటూ అవార్డుకోసం అర్రులు చాచడంలో అర్థం వుంటుంది. శాంతి కోసమో, అహింస కోసమో నిలబడిన వారు ‘తమను గుర్తించండి’ అంటూ అప్లికేషన్లు పెట్టుకోవడమేమిటి? గాంధీ కోసం భారతదేశం నుంచి ఒకసారి కాదు; 1937 నించి 1948 వరకూ అయిదుసార్లు నామినేషన్ పత్రాలు నార్వేకి వెళ్ళాయి. వెళ్లిన ప్రతిసారీ వాటిని వారు తిప్పికొట్టారు. అయినా వీరు పంపిస్తూనే వున్నారు. చివరకు ‘ఆ పేరుతో వచ్చే నామినేషన్లు తీసుకోవద్దు’ అని తీర్మానం కూడా వారు చేశారు! నోబెల్ అవార్డు రాజకీయాలకు తలొగ్గి వుంటుందనేదానికి గాంధీది ఒక చక్కటి వుదాహరణ. గాంధీకి అవార్డుకోసం ప్రయత్నించిన ఆ కాలమంతా నార్వే జర్మనీ ఆక్రమణలో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కీ, జర్మనీకీ శతృత్వం వుంది. ఆ కాలమంతా మనది ఇండియా కాదు, బ్రిటీష్ ఇండియా. గాంధీ బ్రిటీష్ ఇండియాలో భాగం. బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడానికి ‘సుభాష్ చంద్రబోసు’ జర్మనీతో చేతులు కలపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి కారణాలు ఇంకా వున్నాయి. గాంధీ సినిమాకి అమెరికా ‘ఆస్కార్’ ఇచ్చినంత ఈజీగా గాంధీకి నోబెల్ ఇవ్వడానికి జర్మనీ ఆనాడు సిద్ధంగా లేదు. జర్మనీని కాదని అడుగువేయడానికి నార్వేకి స్వేచ్ఛ లేదు. ఆ రకంగా ఆ అవార్డును అందుకోకుండానే గాంధీ చనిపోయారు. గాంధీకి అవార్డును ఇవ్వకపోవడం నోబెల్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది. ఆ మచ్చనుండి బైట పడడానికి 1948లో ‘శాంతి అవార్డును అందుకోవడానికి ఈ ఏడాది ఎవ్వరూ లేర’ని కమిటీ ప్రకటించింది. ఎందుకంటే ఆ ఏడాదే గాంధీ మరణించాడు కాబట్టి. మరణించిన వారికి కూడా ‘భారత రత్న’ ఇచ్చే సంప్రదాయం మనకి వున్నట్లుగా మరణించిన వారికి ‘నోబెల్’ని ఇచ్చే సంప్రదాయం వారికి లేదు. -
హిట్లర్ బొమ్మకు రూ.కోటి!
జర్మనీలోని మ్యునిచ్లో గల ఓల్డ్ సిటీ హాల్ (ఆల్టస్ రథౌస్)ను చిత్రిస్తూ రూపొందించిన 1914 నాటి వాటర్కలర్ పెయింటింగ్ ఇది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన యుక్తవయసులో చిత్రించిన ఈ పెయింటింగ్ను శనివారం నూరెంబర్గ్లో వేలం వేయగా రూ.99.32 లక్షలు పలికింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు. -
పోలెండ్
చరిత్ర: 10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. 18వ శతాబ్దంలో ప్రపంచ పటం నుండి పోలెండ్ మాయమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ తిరిగి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హిట్లర్ సేనలు పోలెండ్ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల సమయంలో వేలాదిమంది పౌరులు, అధికారులు ఊచకోతకు గురయ్యారు. అటు రష్యా, ఇటు జర్మనీ సేనల మధ్య పోలెండ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది. 1. మాసూరియన్ సరస్సులు: పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మాసూరియా సరస్సు యాత్రికులకు స్వర్గం లాంటిది. దట్టమైన అడవులు, సరస్సులను కలిసే చిన్న చిన్న నదులతో ప్రయాణికులకు ఎంతో అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పోలెండ్ దేశానికి ఉత్తరంలో, లిథువేనియా, రష్యా దేశాల సరిహద్దులలో ఉంది. ఇక్కడ అందమైన గుహలు, అందమైన చర్చిలు, గతరాజుల నివాస భవనాలు ఎన్నో కనబడతాయి. ఈ ప్రదేశమే ఒకప్పుడు హిట్లర్ యుద్ధకేంద్రంగా వెలుగొందింది. 2. స్లోవిన్స్కీ ఇసుక తిన్నెలు: దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్స్కీ జాతీయ పార్కులో ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కనే బాల్టిక్ సముద్రం ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఇసుక తిన్నెలు గాలి వీచడం ద్వారా ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి 30 మీటర్లు ఎత్తు వరకు ఏర్పడతాయి. 3. క్రాకోవ్ నగరం: పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. లెస్సర్ పోలెండ్ ప్రాంతంలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇది మొదటగా నిర్మింపబడిందని చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో స్లావోనిక్ యూరప్ దేశాలతో గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉంది. 1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నగరంలో వావెల్ కెథడ్రాల్, రాయల్ కేజిల్, ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండే విస్తులా నది, సెయింట్ మేరీస్ బాసిలికా, జగిలోనియన్ విశ్వవిద్యాలయం, క్లాత్హల్, ప్యాలస్ ఆర్ట్, కనోనిక్జా వీధి, పావిలాన్ విస్పియన్స్కీ... ఇంకా మరెన్నో చూడదగ్గ స్థలాలు ఉన్నాయి. 4. వార్సా: ఇది పోలెండ్ దేశానికి రాజధాని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నగరం అభివృద్ధిలో ఊపందుకుంది. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. నగరంలో చాలావరకు భవనాలు నాలుగైదు అంతస్తుల్లో రంగుల్లో కనబడతాయి. నగరంలోని పురాతన మార్కెట్ స్థలం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. నగరంలో ఐరోపా సంస్కృతి బాగా కనబడుతుంది. నగరంలో ఓల్డ్టౌన్, రాయల్రూట్, చోపిన్ మ్యూజియం, జ్యుయిస్ ఘెట్టో మొదలైన ఎన్నోప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. 5. వ్రోక్లా ద్వీపకల్పాల నగరం: వ్రోక్లా నగరం లోయర్ సిలేసియా ప్రాంతానికి రాజధాని. ఈ నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక బ్రిడ్జి చొప్పున నగరం మొత్తంలో 100కు పైగా బ్రిడ్జిలు కనబడతాయి. ఇది దేశానికి దక్షిణ-పశ్చిమ భాగంలో ఉంది. ఇదొక పురాతన నగరం. ఇక్కడే ఓద్రా నది ప్రవహిస్తుంది. దీని ఉపనదులే ఈ నగరాన్ని చిన్న చిన్న ద్వీపాలుగా మార్చేశాయి. ఈ నగరంలో మొత్తం 25 మ్యూజియంలు ఉన్నాయి. సెయింట్ జాన్ కెథడ్రాల్, నగరాన్ని ఆనుకొని సుడెటెన్ పర్వతాలు పరుచుకొని ఉండి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. పరిపాలనా విభాగాలు: దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్లుగా విభజించారు. పోలిష్ భాష నోరు తిరగనంత కఠినంగా ఉంటుంది. ఆ పేర్లను ఇంగ్లిష్లోకి తర్జుమా చేసి చెప్పుకుంటే బాగుంటుంది. 16 ప్రాంతాలు... గ్రేటర్ పోలెండ్, కువాయియణ్-పొమెరేనియన్, వెస్సర్ పోలెండ్, లోడ్జ్, లోయర్ సిలేసియన్, లుబ్లిన్, లుబుజ్, మాసోవియన్, ఒపోలే, పోడ్లాస్కీ, పోమరేనియన్, సిలేసియన్, సబ్కార్ఫాథియన్, స్వీటోక్రిజస్కీ. వార్మియన్-మాసూరియన్, వెస్ట్పోమరేనియన్. దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... వార్సా, క్రాకో, లోడ్జ్, వరోక్లా, పోజ్నన్, జిడాన్సక్, సెజెసిన్, బిడ్గోసెజ్, లుబ్లిన్, కటోవైస్, బైలిస్టాక్, జిడినియా, జెస్లోకోవా, రాడోమ్, సోస్నావిక్, టోరున్, కీలెస్, గ్లివైస్, జెస్జోన్, జబ్రెజ్. ప్రజలు - సంస్కృతి: పోలెండ్ దేశానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కువగా యూరోపియన్ సంస్కృతి కనబడుతుంది. ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. ఉంది. పోలెండ్ ప్రజలను పోల్స్ అంటారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. దేశంలో జర్మన్లు, ఉక్రేనియన్లు, బెలారూసియ+న్లు, జిప్సీలు, లిధువేనియన్లు, జ్యుయిష్లు కూడా ఉన్నారు. ఇలా దేశంలో విభిన్న దేశాలకు చెందిన వారు ఉండడం వల్ల దేశమంతటా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనబడతాయి. నైసర్గిక స్వరూపం ఖండం - ఐరోపా వైశాల్యం - 3,12,679 చ.కి.మీ. జనాభా - 3,84,83,957 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని- వార్సా, కరెన్సీ - పోలిష్ జోలోటీ, ప్రభుత్వం - పార్లమెంటరీ రిపబ్లిక్, అధికారిక భాష- పోలిష్, మతం - 97 శాతం క్రైస్తవులు, సరిహద్దులు - బాల్టిక్ సముద్రం, రష్యా, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా, స్వాతంత్య్ర దినాలు - కమ్యూనిస్ట్ పోలెండ్ - 8 ఏప్రిల్ 1945, రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ - 13 సెప్టెంబర్ 1989, పంటలు- తృణధాన్యాలు, చెరకు, నూనెగింజలు, బంగాళదుంపలు, ఖనిజాలు- బొగ్గు, సల్ఫర్, రాగి, జింకు, సీసం, ఇనుము, పరిశ్రమలు - యంత్రభాగాలు, బొగ్గు, రసాయనాలు, పెట్రోలియం శుద్ధి, ఆహార ఉత్పత్తులు, వాతావరణం - జనవరిలో -5 నుండి 0 (సున్న) డిగ్రీలు, 15 నుండి 25 డిగ్రీలు జూలైలో -
అవును.. హిట్లర్కు తాతనే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ అవినీతిపై నేను హిట్లర్నే కాదు.. హిట్లర్ తాతను కూడా... ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. తప్పుడు పనులు, ప్రజాధనాన్ని దోచుకునే వారిపట్ల హిట్లర్గానే వ్యవహరిస్తా... అన్యాయం అరికట్టడానికి ఎంతకైనా తెగిస్తా... మంచికోసం చేస్తే తప్పేమిటి..? ఎవరో ఏదో అన్నారని భయపడను. సకుటుంబ సర్వే ఎవరినో ఉద్దేశించి చేయడం లేదు... నిజమైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ సన్నాసి నోరుపెద్దగా చేసుకుని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి. ఈ పాపం అంతా ఎవరిది.. కేసీఆర్దా? మీ పాలనదా..? సిగ్గుతో తలదించుకోవాలి. మీ హయాంలో చేసిన పాపాలను కడిగేయడానికి ఈ సమయం చాలదు. మీది సంస్కారమేనా.? హైదరాబాద్ను నేనే నిర్మించానన్న దానికి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడిన కేసీఆర్ పలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతోపాటు, ప్రభుత్వ పథకాల అమలులో ఏవిధంగా వ్యవహరించనున్నారో స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ర్టంలోని మార్కెట్ కమిటీలలో దళితులు, గిరిజనులకు 22 శాతం, బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో ఉన్న మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు, డెరైక్టర్ పోస్టుల కోసం పెద్దఎత్తున పైరవీలు జరిగేవి, అయితే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయనున్నట్లు చెప్పారు. అలాగే యూనివర్సిటీల పాలకమండళ్లు, సెనేట్ సభ్యులుగా వీరికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పదవ తరగతి తరువాత కాలేజీలకు వెళ్లలేకపోతున్న దళిత బాలికల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక హాస్టల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. గవర్నర్కు విశేషాధికారాలు లేవు.. రాష్ట్ర విభజన తుది బిల్లు రూపకర్తలు గవర్నర్కు విశేషాధికారాలు ఏవీ కల్పించలేదు. హైదరాబాద్లో 40 లక్షల మంది ఉన్నారు. వారి రక్షణ అంటూ ఆంధ్రా నాయకులు మరీ ఒత్తిడి చేయడంతో రాజ్యాంగంలోని గవర్నర్లకు ఉండే అధికారాల సెక్షన్ 163 మేరకు అధికారాలు ఉంటాయి. దానినే విభజన చట్టంలో పెట్టారు తప్ప ప్రత్యేకాధికారాలు ఏవీ ఉండవు. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ అంటే.. విభజనచట్టం పాస్ కాదని నిర్ణయించి పైవిధంగా సర్దుబాటు చేశారు అంతే. అప్పుడు చట్టం చేసినప్పుడు మౌనంగానే ఉన్నాం. ఇప్పుడూ మౌనంగానే ఉన్నాం. రాజ్యాంగానికి మించి గవర్నర్కు అధికారాలు కల్పించాలంటూ కేంద్ర హోం శాఖ రాసిన రెండు లేఖలపై మేము స్పందించాం. వీటికి అంగీకరించేది లేదన్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఫాసిస్టు అనలేదు. ప్రభుత్వ ఫాసిస్టు చర్యగా మాత్రమే పేర్కొన్నాం.. కేంద్రం మాతో మంచిగా వ్యవహరిస్తే.. మేము వారితో మంచిగా ఉంటాం. వారు చెడ్డగా ఉంటే.. మేము చెడ్డగా వ్యవహరిస్తాం.. అని కేసీఆర్ పేర్కొన్నారు. మంచికోసం సర్వే చేస్తే తప్పేంటి.. ‘నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకే సర్వే చేస్తుంటే కిషన్రెడ్డి, తెలుగుదేశం పార్టీ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కేసీఆర్ను విమర్శించడమే విజ్ఞత అనుకుంటున్నారు. అలా చేస్తే జోకర్లు అవుతారు. సర్వేకు స్థానికతకు సంబంధం లేదు. 1956 కంటే ముందున్నవారికే స్థానికత వర్తిస్తుందని ఇంతకుముందే ఉత్తర్వులు జారీచేశాం. ఇందులో దాచిపెట్టాల్సిందేమీలేదు. గుడ్డుపై ఈకలు పీకుతున్నారు. మూడు నెలలకే ప్రభుత్వంపై అక్కసు పెంచుకుని అప్పుడే బట్టలు చించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఇంకేం చించుకుంటారో అర్థం కావడం లేదు. కుటుంబాల కంటే రేషన్కార్డులు ఎక్కువగా ఉన్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి కంటే కట్టిన ఇళ్లు ఎక్కువ ఉన్నాయి. పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయింది. మా రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే లేదు. మా దగ్గర ఉన్నదల్లా.. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే పథకం. సర్వేపై హైకోర్టుకు వెళ్తే.. దానిని కొట్టేసింది. సర్వేలో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ అకౌంట్లకే వస్తుంది. సర్వేరోజు వారు లేకపోతే పేర్లు తొలగిస్తామా..? చేర్చుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం’ అని చెప్పారు. -
సమంత, తమన్నా కంటే కేసీఆర్ అందంగా...: వర్మ
హైదరాబాద్: నా తదుపరి చిత్రం టైటిల్ కేసీఆర్ అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినడానికి బాగుందని వర్మ మరో ట్విట్ లో పేర్కొన్నారు. ఆధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేశాయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందని వర్మ ట్వీట్ తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేశారు. Naa next picture title "KCR" — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 On every aspect I like the inward sound of a KCR more than the sound of an NTR or a YSR — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 Just in the sheer power combination of presence, persona and intensity KCR is more beautiful than Samantha,Thamanna and Ileana put together — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 Hitler was a bad KCR and KCR is a good Hitler — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 -
హిట్లర్ను చంపాలనుకున్న జర్మన్ అధికారి
జూలై 20, 1944న 36 సంవత్సరాల జర్మనీ ఆఫీసర్ అయిన కో క్లాస్ షెంక్ గ్రాఫ్ వాన్ స్టాఫెన్బర్గ్, అత్యంత భద్రతా వలయంలో ఉన్న తూర్పు ప్రష్యాలోని అరణ్యంలోకి ప్రవేశించాడు. అతని లక్ష్యం హిట్లర్ని హతమార్చడం. ఉల్ఫ్స్ లెయిర్... హిట్లర్ రహస్య స్థావరం. స్టాఫెన్బర్గ్ ఎప్పటిలాగే ఆ రోజు కూడా రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పడానికి వచ్చాడు. అయితే ఆ రోజు అతని చేతిలో ఉన్న బ్రీఫ్కేస్లో బాంబ్ను తీసుకువచ్చాడు. ‘‘హిట్లర్ రాగానే మేమందరం లేచి నిలబడ్డాం. అప్పుడు మా సభ ప్రారంభమైంది’’ అంటూ 1967లో జర్మన్ ఆఫీసర్ జెన్వాల్టేర్ వార్లిమాంట్ గుర్తుకు తె చ్చుకున్నారు. ‘‘హఠాత్తుగా తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. నేను వెంటనే అటుఇటు చూశాను. కలనల్ రావడం గమనించాను... అతడు నా వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఎందుకంటే అతడి కుడి కంటి మీద ఏదో నల్లటి చారిక ఉంది. ఒక చేతిని ఆ కంటి మీద ఉంచాడు. ఆయన వచ్చి నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ సమయంలో అతడు నాకు ఒక ఉన్నతమైన సైనికుడిలా కనిపించాడు’’ అంటారు బెర్థోల్డ్. ‘‘హిట్లర్ అతడి వైపు ఎటువంటి సానుభూతీ ప్రదర్శించలేదు. అయితే అక్కడే ఉన్న జనరల్ కీటెల్ అతడిని పరిచయం చేశాడు’’ స్టాఫెన్బర్గ్ గర్విష్టి. క్యాథలిక్, ఆర్మీ ఆఫీసర్. ‘‘మా నాన్నగారు చాలా బాగుంటారని అందరూ అనేవారు. నల్లటిజుట్టు, నీలిరంగు కళ్లు, గాలికి సన్నగా ఎగిరే పొడవాటి జుట్టు. ఆయన చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆయన చాలా సేపు నవ్వుతూనే ఉంటారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం’’ అంటారు ఆయన కుమారుడైన ఎనభై సంవత్సరాలబెర్థోల్డ్ షెంక్ గ్రాఫ్ వాన్ స్టాఫెన్బర్గ్. 1943లో, స్టాఫెన్బర్గ్, ట్యునీషియాకి సేవలు అందిస్తూ బాగా గాయపడ్డాడు. అందులో ఒక కన్ను, కుడిచేయి, ఎడమచే యిలోని రెండు వేళ్లు పోగొట్టుకున్నాడు. ‘‘గాయాలు కావడం సాధారణం. అలాగే ఆ సమయంలో చెయ్యి పోగొట్టుకోవడం, కళ్లు పోగొట్టుకోవడం కూడా సర్వసాధారణం. అతడు బతకడమే ఒక పెద్ద ఉపశమనం’’ అంటారు బెర్థోల్డ్. స్టాఫెన్బర్గ్ బహిరంగంగా రాజకీయవేత్త కాకపోయినా జాతీయవాది, సంప్రదాయవాది. అప్పుడప్పుడు నాజీ సిద్ధాంతాలను బలపరచేవాడు. అయితే యుద్ధం జరుగుతుండటంతో, రానురాను అతడి ఆలోచనాధోరణి మారింది. తూర్పుభాగం మీద జర్మన్ చేస్తున్న దురాగతాలు అతడి మనసును కలచివేశాయి. ఆ కారణంగా జర్మనీ యుద్ధంలో ఓడిపోతోందని తెలుసుకున్నాడు. ‘‘ఆయనకు హిట్లర్ విధానాల మీద, ఆయన శక్తిసామర్థ్యాల మీద నమ్మకం పోయింది. అంతవరకు మేము చూసిన హిట్లర్ వేరు’’ అంటారు స్టాఫెన్బర్గ్. ‘‘అప్పుడు నాకు పది సంవత్సరాలు. ప్రపంచంలో జరుగుతున్న అంశాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. మిగతా అందరిలాగే నాకు కూడా నాజీ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే ఎన్నడూ మా తల్లిదండ్రులతో ఈ విషయం గురించి సంప్రతించలేదు. ఒకవేళ మా నాన్నగారు మాతో చ ర్చించి ఉంటే, ఆయన తన అసలు భావాలను మా దగ్గర వ్యక్తపరచలేకపోయేవారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. అవి వింటే పిల్లలు భయపడ కమానరు’’ అంటారు బెర్థోల్డ్. ఆయన దెబ్బలు తగ్గుముఖం పట్టాక, స్టాఫెన్బర్గ్ని ఒక గూఢచారి సంస్థ సంప్రతించింది. దానికి నాయకుడు జెన్ హెన్నింగ్ వాన్ ట్రెస్కో. హిట్లర్ని చంపి, నాజీ వ్యవస్థను రూపుమాపాలన్నది ఆయన కోరిక. ఈ ఎత్తుగడకి స్టాఫెన్బర్గ్ ప్రధాన పాత్రధారి. వారు అనుకున్నదే తడవుగా ఎన్నోసార్లు హిట్లర్ని హతమార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయ్యాయి. జర్మన్ సైనిక దళం జెస్టా పో ఈ రహస్యాన్ని ఛేదించి హత్యాయత్నానికి పాల్పడిన వారిని చంపేస్తుందనే భయం వారిలో మొదలైంది. కాని 1944లో స్టాఫెన్బర్గ్ జర్మన్ రిప్లేస్మెంట్ ఆర్మీకి కమాండెర్ స్టాఫ్లో సభ్యుడయ్యాడు. ఈ ఉద్యోగ విధులలో స్టాఫెన్బర్గ్ నేరుగా హిట్లర్ని కలిసే అవకాశం కలగడమే కాకుండా, హిట్లర్ను హతమార్చడానికీ వీలు ఏర్పడింది. హిట్లర్, జర్మన్, అధికారి, వీరు పన్నిన కుట్ర ప్రమాదభరితమైనది. స్టాఫెన్బర్గ్ తన బ్రీఫ్కేస్లో పేలుడు పదార్థాలు తీసుకువెడతాడు, నేరుగా హిట్లర్ దగ్గరకు వెళ్లిన తరవాత ఆయనకు ఆ రోజు కార్యక్రమాల గురించి వివరించేటప్పుడు ఆ బ్రీఫ్కేస్ను హిట్లర్ దగ్గర ఉంచుతాడు. మాటలు పూర్తయిన తర్వాత ఆ గది నుంచి బయటకు వస్తాడు. గదిలో పేలుడు పదార్థాలు పేలగానే, బెర్లిన్కి స్టాఫెన్బర్గ్ వచ్చి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆర్మీని మార్పుచేస్తారు. ఇదీ వారి పన్నాగం... ‘‘అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందన్న నమ్మకం వారికి లేదు. కాని గ్రెస్కో మాత్రం ‘హిట్లర్ మరణించి తీరాలి’ అన్నాడు. అప్పుడే అర్థం అవుతుంది ... జర్మన్లంద రూ ఆయన అనుచరులు కాదని’’ అన్నారు స్టాఫెన్బర్గ్. ఒకవేళ వీరి కుట్ర ఫలించకపోతే, కుట్రదారులు కష్టాలలో చిక్కుకున్నట్లే. ‘‘మా అమ్మ ఎప్పుడూ అంటుండేది, నాన్న పన్నిన పన్నాగం ఆమెకు తెలుసని. ఆమె ఈ విషయంలో మా నాన్నగారిని ప్రశ్నించింది. దానితో ఆయన విషయమంతా వివరించారు. అయితే ఆమెకు తెలియని విషయం ఒకటుంది... అది మా నాన్నగారే బాంబ్ పెడతారని’’ ‘‘పరిణామాలేంటో వారికి తెలుసు. అయితే యుద్ధ సమయంలో, జీవితానికి ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం శాంతిస్థాపన కోసమే ఎదురుచూస్తారు. మనుషులు ఎప్పటికైనా మరణించేవారే, కనుక యుద్ధంలో మరణిస్తే అది దేశం కోసం చేసిన ప్రాణత్యాగం’’ జూలై 20, గురువారం నాడు స్టాఫెన్బర్గ్... ఉల్ఫ్స్ లేయిర్ చేరుకున్నారు. ఆరోజు కార్యక్రమాల వివరాలు12.30 నిమిషాలకు చెప్పాలి. అయితే ఆయన బాంబు పెడుతుండగా ఆయనకు ఎవరో అంతరాయం కలిగించారు. అందువల్ల మీటింగ్కి వెళ్లే లోపుగా ఆయన తాను తెచ్చిన రెండు బాంబులలో కేవలం ఒక దానిని మాత్రమే పెట్టగలిగారు. ‘‘నల్లరంగులో ఉన్న పెద్ద బ్రీఫ్ కేస్ను స్టాఫెన్బర్గ్ తన చేతుల కింద ఉంచుకోవడం నాకు బాగా గుర్తు’’ అన్నారు 1967లో వార్లిమాంట్. ‘‘అతడిని నేను పెద్ద తీక్షణంగా చూడలేదు. అందువల్ల అతడు టేబుల్ కింద బాంబ్ పెట్టి, కొద్ది క్షణాలకే అతడు గది విడిచి వెళ్లడాన్ని నేను గమనించలేదు. సుమారు పది నిమిషాలయ్యాక, బాంబ్ విస్ఫోటనం జరగడంతో నేను అతడి గురించి మర్చిపోయాను’’ బాంబు విస్ఫోటనం జరగ్గానే స్టాఫెన్బర్గ్ వెనక్కి తిరిగి చూడకుండా బెర్లిన్ వెళ్లిపోయాడు. హిట్లర్ తప్పనిసరిగా చనిపోయి ఉంటాడని అతడు భావించాడు. అయితే విస్ఫోటనం జరగడానికి ముందే, ఆ బ్రీఫ్కేస్ హిట్లర్ కాలికి తగిలి, టేబుల్ కింద కొద్దిగా పక్కకి జరిగింది. అంతేకాకుండా స్టాఫెన్బర్గ్ వాళ్లు అనుకున్నట్లుగా ఆ బాంబ్ మరీ ప్రమాదకరమైనది కాదు, అయితే బాంబు పేలడానికి ముందే హిట్లర్ మ్యాపుల్ని చూడటం కోసం దట్టంగా ఉన్న ఓక్ కలపతో తయారైన టేబుల్ మీదికి వంగాడు. బాంబు దుర్ఘటనలో నలుగురు మరణించారు, అనేకమంది గాయాలపాలయ్యారు. హిట్లర్ మాత్రం బతికి బయటపడ్డాడు. ‘‘బాంబు పేలిన శబ్దం విని, ఏదో పెద్ద షాండ్లీర్ నా నెత్తి మీద పడిందనుకున్నాను. నేను కిందికి వెళ్లాను. హిట్లర్ని అప్పటికే బయటకు తీసుకువెళ్లిపోయారు. అయితే ఆయనకు పెద్దగా గాయాలు తగిలి ఉండవనుకున్నాను’’ అని గుర్తు తెచ్చుకున్నారు వార్లీమాంట్. కొద్దిసేపటికే ఏం జరిగిందో తెలిసిపోయింది. స్టాఫెన్బర్గ్, ఇంకా ఇతర కుట్రదారుల్ని బెర్లిన్లోని వార్ ఆఫీస్లో అరెస్ట్ చేసి, కాల్చి చంపారు. ఆ సమయంలో స్టాఫెన్బర్గ్ భార్య నీనా గర్భవతి. అప్పుడు ఆమెతో పాటు నలుగురు పిల్లలూ ఉన్నారు. బెర్థోల్డ్కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ‘‘రేడియోలో సమాచారమంతా విన్నాను. నాకు అప్పటికి పది సంవత్సరాలు. నేను ప్రతిరోజూ వార్తాపత్రిక చదివేవాడిని. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నాను. మా ఇంట్లోని పెద్దవాళ్లంతా నన్ను రేడియోకి దూరంగా ఉంచేవారు. నేను, మా అన్నయ్య .. మా మేనమామతో చాలా దూరం వాకింగ్కి వెళ్లినప్పుడు ఆయన ఆఫ్రికాలోని పెద్ద లేడిని ఏవిధంగా వేటాడిందీ వివరించారు’’ ‘‘ఆ మరుసటి రోజు మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది, ఆ బాంబుని ఉంచింది మా నాన్నగారేనని. నేను ఆశ్చర్యంతో ‘ఇలా ఎలా చేశారు’ అన్నాను. ‘ఆయన జర్మనీ కోసం చేస్తున్నానని నమ్మారు’ అని చెప్పింది.’’ ‘‘నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకు నమ్మకం కుదరలేదు. అది కూడా హిట్లర్ మీద! అంతవరకు స్కూల్లో పాఠాల్లో హిట్లర్ గొప్పదనం గురించి చదువుకున్నాను’’ ఆ రాత్రి జెస్టా పో వారు వచ్చారు. బెర్థోల్డ్ తల్లిని, అమ్మమ్మని, పెద్ద మామయ్యని అరెస్ట్ చేశారు. బెర్థోల్డ్ని, అక్కయ్యను మాత్రం బాలల గృహానికి పంపారు. ‘‘ఇలా ఎందుకు చేశారని మేమెప్పుడూ చర్చించుకోలేదు. ఇంటిపేరుతో ఎక్కడ గుర్తిస్తారోననే భయంతో మా పేర్లు కూడా మార్చేశారు’’ ఈ గొడవ జరిగిన తర్వాత వేలాదిమందిని అరెస్ట్ చేశారు. బెర్థోల్డ్ తల్లిని జెస్టా పో సైనికులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత కొంత కాలానికి ఆమెను ఆమె పిల్లల వద్దకు చేర్చారు. ఆమె పునర్వివాహం చేసుకోలేదు. ‘‘మా అమ్మకి నాన్నంటే ప్రాణం. ఆమెకు ప్రాణం పోసింది ఆయనేనని ఆమె నమ్ముతుంది’’ అంటారు బె ర్థోల్డ్. చాలా కాలం తర్వాత - వెస్ట్ జర్మనీ ఆర్మీలో బెర్థోల్డ్ జనరల్ అయ్యాడు. ఆయన తన కుటుంబంతో తన స్వస్థలంలోనే నివసిస్తున్నాడు. కర్టెసీ: బిబిసి న్యూస్ - డా. పురాణపండ వైజయంతి -
'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబే'
హైదరాబాద్: చంద్రబాబు ఎంత నియంతో హిట్లర్ కూడా అంతే నియంత అని వైఎస్ షర్మిల అన్నారు. హిట్లర్కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికారదాహమని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఐఎంజీకి అప్పనంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు దృష్టిలో లోకకల్యాణం అంటే లోకేష్ కల్యాణం అని అర్థమని షర్మిల ఎద్దేవా చేశారు. -
'ఇద్దరూ 420లు కాబట్టే అదేరోజు పుట్టారు'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ మండిపడింది. గోబెల్ ప్రచారం చేయడంలో జర్మనీ నియంత హిట్లర్ కు , చంద్రబాబుకు చాలా దగ్గర సంబంధాలున్నాయని వైఎస్సార్ సీపీ నేత ఒ.వి. రమణ విమర్శించారు. ఒకే రోజు పుట్టిన వీరిద్దరూ జాతి ద్రోహులేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరూ 420లు కాబట్టే అదే రోజు పుట్టారని రమణ వ్యాఖ్యానించారు. గోబెల్ ప్రచారం చేయడంలో ఇద్దరూ అందివేసిన చేయేనన్నారు.ప్రస్తుతం ఆ తరహా ప్రచారంతో ఆకట్టుకోవాలని చూస్తున్న బాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదని రమణ తెలిపారు. తన మాటలు ప్రజలు నమ్మడం లేదనే ఉద్దేశంతోనే మరో కొత్త ప్రచారానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారన్నారు. జాతీయ ఛానల్స్ ను మేనెజ్ చేసి..తనకు అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చేలా చూసుకుంటున్నారన్నారు. -
పగల్భ 'బాబూ'.. హిట్లరూ నీకు సాటి రాడు
-
కలలో రాక్షసులు కనిపిస్తున్నారా?
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యావర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశపటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది. రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు, ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు. నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి కలలో రాక్షసులు కనిపిస్తున్నారా? స్వప్నలిపి ...ఇదో కలల నిఘంటువు కలలు అనేవి తీసిపారేయదగినవి కాదని, వాటికంటూ నిర్దిష్టమైన అర్థం ఉందని కలలను లోతుగా అధ్యయనం చేసిన నిపుణులు అంటారు. వారు చెప్పే దాని ప్రకారం కల అంటే ఏమిటో కాదు...మన అంతః చేతనలోని వ్యక్తిగత ఉత్తరం. పదాలకు నిఘంటువు ఉన్నట్లే కలల అంతరార్థాలను తెలుసుకోవడానికి కూడా నిఘంటువు ఉంది. దాని ప్రకారం మీ కలకు అర్థం ఇది... స్వప్న తాత్పర్యం మీకో దురలవాటు ఉంటుంది. సపోజ్... మద్యపానం అనుకోండి. ఆ వ్యసనం మిమ్మల్ని అన్ని రకాలుగా బాధ పెడుతుంది. మీలో అంతర్మథనం మొదలవుతుంది. తాగడం మానేయాలని మొదటి రోజు అనుకుంటారు. రెండోరోజు మానేస్తారు. మూడోరోజు మాత్రం ముఖం మాడ్చేస్తారు. ‘ఏదో మిస్ అయింది’ అనుకుంటారు. మళ్లీ మందు కొడతారు. మళ్లీ బాధపడతారు. మానాలనుకోవడం, మానలేకపోవడం ఎన్నోసార్లు జరుగుతుంటుంది. మిమ్మల్ని కలలో వెంటాడుతున్న ఆ రాక్షసుడు ఎవరో కాదు... అలాంటి ఓ వ్యసనం! ఆ రాక్షసుడికి బలవుతారా? సంహరిస్తారా? అనేది మీ సంకల్పబలం మీద ఆధారపడి ఉంటుంది. పోస్ట్కార్డ్లు అమ్మేవాడు! తెలిసిన వ్యక్తి- తెలియని విషయం వయసులో ఉన్నప్పుడు మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. సన్నిహితులు, స్నేహితులు ‘ఆడి’ పేరుతో పిలిచేవారు. తల్లి చనిపోయిన తరువాత వియన్నాలో పోస్ట్కార్డులు అమ్మి తన అవసరాలకు కావలసిన డబ్బు సంపాదించేవాడు. చదువును హైస్కూల్తోనే ఆపేశాడు. హిట్లర్ అనగానే జర్మనీ, జర్మనీ అనగానే హిట్లర్ గుర్తుకువస్తారు. కానీ హిట్లర్ పుట్టింది ఆస్ట్రియాలో! హిట్లర్ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ జర్మనీ సైన్యంలో పనిచేశాడు. తన ధైర్యసాహసాలకు పురస్కారం కూడా లభించింది. హిట్లర్ నిద్రలేమితో బాధపడేవాడు. కొన్ని సందర్భాల్లో పగలు నిద్ర పోతుండేవాడు. ఆర్ట్ స్కూల్లో హిట్లర్ ప్రవేశ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. హిట్లర్ మద్యం ముట్టేవాడు కాదు. శాకాహారి. హిట్లర్కు బ్లేడ్లు అంటే భయం. రక్తతులాభారం! ఆదర్శం పువ్వులు, కరెన్సీ, బెల్లం...రకరకాల తులాభారాల గురించి మనం విని ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలో ‘రక్తతులాభారం’ పేరు కూడా చేర్చవచ్చు. ఇదేమి తులాభారం? అని ఆశ్చర్యపడిపోతున్నారా? అయితే మీరు నందా... సుదీప్ కుమార్ నందా గురించి తెలుసుకోవాల్సిందే. అన్నదానం మహాదానం...అని మనం అనుకుంటాంగానీ గుజరాత్ ఐఏయస్ అధికారి సుదీప్ కుమార్ నందాకు మాత్రం రక్తదానం మహాదానం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రక్తదానం చేయడమే కాదు, దాని ఆవశ్యకతను గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాడు. రక్తదానం గురించి బొత్తిగా తెలియని వారు కూడా సుదీప్ మాటల ప్రభావంతో ఆయన బాటలో నడవడం ప్రారంభించారు. తాజా సంగతి ఏమిటంటే... రక్తదానం విషయంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుదీప్ కుమార్ను ఆయన అభిమానులు సరికొత్త రీతిలో సన్మానించారు. గుజరాత్లోని కల్ల గ్రామంలోని 513 మంది 79 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి ‘రక్త తులా సన్మాన్’ నిర్వహించారు. -
నరేంద్రమోడీ ఓ హిట్లర్: బేణి ప్రసాద్ వర్మ
లక్నో: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ మరోసారి వార్తలకెక్కారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని హిట్లర్తో, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ను ముస్సోలినితో పోల్చారు. ఓట్లను కొల్లగొట్టేందుకు వీరిద్దరి రహస్య అజెండాతో ముందుకువెళ్తున్నారని విమర్శించారు. ‘‘భారత రాజకీయాల్లో హిట్లర్ పుట్టాడు. అలాగే ఉత్తరప్రదేశ్లో ముస్సోలిని జన్మించాడు. వారిద్దరూ ఇప్పుడు మోడీ, ములాయం రూపంలో మళ్లీ పునర్జన్మ ఎత్తారు. ఈ హిట్లర్, ముస్సోలిని వల్లే ఇటీవల ముజఫర్నగర్లో అల్లర్లు జరిగాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మోడీ నియంతలా మారారని, ఆయన ముందు ముస్లింలు నోరెత్తే సాహసం చేయలేరని పేర్కొన్నారు. ‘‘ఆ హిట్లర్కు భయపడి చివరికి ఆరెస్సెస్, బీజేపీలో కూడా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మోడీని 2014 ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించిన గోవా సభలకు వెళ్లని అద్వానీ.. ఈ రోజు ఆయన చేపట్టే ‘ఐక్యతా పరుగు’ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ జపం చేస్తున్న మోడీ... గాంధీని మాత్రం పక్కనపెడుతున్నారు. సర్దార్ను హోంమంత్రిగా చేసింది గాంధీయే అన్న సంగతి గుర్తుంచుకోవాలి’’ అని బేణి అన్నారు. కాగా, బేణి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను సొంత పార్టీయే సీరియస్గా తీసుకోదని ఎద్దేవా చేసింది. ముందుగా మోడీ స్థాయి, అయన ప్రజాదరణ గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు.