hockey team
-
భారత హాకీ జట్టు విజయం అద్భుతం: వైఎస్జగన్
సాక్షి,తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైఎస్ జగన్ కొనియాడారు.ఈమేరకు మంగళవారం(సెప్టెంబర్17)ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.Well done, Congratulations!#AsianChampionsTrophy2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 -
కొరియాను కొట్టేసి...
ఆద్యంతం తమ ఆధిపత్యం కనబరిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ మరోసారి జట్టును ముందుండి నడిపించగా... ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమిండియా నాకౌట్ దశ సెమీఫైనల్ మ్యాచ్లోనూ అదే జోరు కనబరిచింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే టైటిల్ పోరులో చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. హులున్బుయిర్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అంతిమ సమరానికి అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (19వ, 45వ నిమిషంలో) సాధించగా... ఉత్తమ్ సింగ్ (13వ నిమిషంలో), జర్మన్ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు యాంగ్ జిహున్ (33వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభం నుంచే... అటాకింగ్ ఆటకు ప్రసిద్ధి అయిన కొరియాతో మ్యాచ్లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. ప్రత్యర్థి జట్టుకు ఎదురుదాడులు చేసే అవకాశం ఇవ్వకుండా హర్మన్ప్రీత్ బృందం ఆరంభం నుంచే సమన్వయంతో ముందుకు కదులుతూ కొరియా గోల్పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో భారత ఫార్వర్డ్ ఆటగాళ్లను నిలువరించడంపైనే కొరియా ఆటగాళ్లు ఎక్కువ దృష్టి పెటాల్సి వచి్చంది. ఆట నాలుగో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచేది. అభిషేక్ కొట్టిన రివర్స్ షాట్ను కొరియా గోల్కీపర్ కిమ్ జేహన్ నిలువరించాడు. ఆ తర్వాత కూడా భారత్ తమ దాడులు కొనసాగించగా 13వ నిమిషంలో ఫలితం వచి్చంది. అరిజిత్ సింగ్ హుండల్ అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఉత్తమ్ సింగ్ దానిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత కొరియా దూకుడు పెంచి నిమిషం వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే ఈ రెండింటిని భారత రక్షణపంక్తి ఆటగాళ్లు నిర్వీర్యం చేశారు. రెండో క్వార్టర్లో నాలుగు నిమిషాలు గడిచాక భారత్కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ గోల్గా మలచడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో క్వార్టర్లో సుమిత్ అందించిన పాస్ను సర్కిల్ బయట అందుకున్న జర్మన్ప్రీత్ సింగ్ ‘డి’ ఏరియాలోనికి వచ్చి కొరియా గోల్కీపర్ను బోల్తా కొట్టించడంతో భారత్ ఖాతాలో మూడో గోల్ చేరింది. ఈ గోల్ తర్వాత కొరియాకు దక్కిన పెనాల్టీ కార్నర్ను యాంగ్ జిహున్ లక్ష్యానికి చేర్చాడు. కొరియా ఖాతా తెరిచినప్పటికీ భారత్ తమ దాడులను యధేచ్చగా కొనసాగించింది. 45వ నిమిషంలో భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ గోల్గా మలిచాడు. దాంతో భారత ఆధిక్యం 4–1కు చేరుకుంది. మూడు గోల్స్ ఆధిక్యం పొందిన భారత్ ఆ తర్వాత నియంత్రణతో ఆడి కొరియాను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. పాక్కు చైనా షాక్ అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య చైనా జట్టు అద్భుతం చేసింది. రెండుసార్లు చాంపియన్ పాకిస్తాన్ జట్టును మట్టికరిపించి తొలిసారి ఈ టోరీ్నలోఫైనల్కు చేరుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా పాకిస్తాన్ ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్లలో విఫలమయ్యారు. చైనా రెండు షాట్లను వృథా చేసినా మిగతా రెండు షాట్లను గోల్గా మలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. -
హాకీ లెజెండ్ శ్రీజేశ్కు ప్రధాని మోదీ లేఖ..
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అతని కెరీర్ సాఫల్యతలో ఎదురైన ఆటుపోట్లు... పడిన కష్టం... చిందించిన చెమటను కీర్తిస్తూ ఆ లేఖలో ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో భారత జూనియర్ జట్టుకు కోచ్గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్న శ్రీజేశ్కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. గోల్కీపర్గా విజయవంతమైనట్లే... కోచ్గానూ జూనియర్లను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ‘ఆటలో నీ అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. ఇకపై కోచ్గానూ ఇదే పంథా కొనసాగిస్తావని ఆశిస్తున్నా. కోచ్ పాత్రలో జూనియర్ జట్టును ప్రభావంతంగా, స్ఫూర్తిదాయకంగా మలుస్తావని విశ్వసిస్తున్నాను.సుదీర్ఘకాలం పాటు భారత హాకీకి సేవలందించిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’నని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం పతకాలు, ఘన విజయాలే కాదు... లెక్కలేనన్ని స్మృతులెన్నో అతని కెరీర్లో ఉన్నాయని ప్రధాని కొనియాడారు. అతనేంటో అతన్ని వరించిన అవార్డులు, పతకాలే తెలియజేస్తాయని ప్రశంసించారు. ప్రధాని లేఖ తన గుండెని తాకిందని శ్రీజేశ్ బదులిచ్చాడు. ‘హాకీనే నా జీవితం. అందుకే ఆట కోసమే ఇన్నాళ్లు శ్రమించాను. ఇకపై కూడా శ్రమిస్తాను. ప్రపంచ హాకీలో భారత్ బలీయమైన శక్తిగా అవతరించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని ఎక్స్లో పోస్ట్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుపొందడంలో కృషి చేసిన శ్రీజేశ్ తన కెరీర్కు పతకంతో గుడ్బై చెప్పాడు. గోల్పోస్ట్ ముందు పెట్టని గోడలా నిలబడే శ్రీజేశ్ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో రెండు ఆసియా క్రీడల స్వర్ణాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీ రజత పతకాలు కూడా ఉన్నాయి. -
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
పారిస్ ఒలంపిక్స్ లో కొనసాగుతున్న భారత హాకీ జట్టు జైత్రయాత్ర
-
మళ్లీ ఓడిన భారత్
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో టీమిండియా 1–3 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్ వెల్చ్ (54వ ని.లో) ఒక గోల్ అందించారు. ఈ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు జరుగుతుంది. -
అదరగొడుతున్న భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా నాలుగో విజయం
ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్తో జరిగిన చివరి పూల్ మ్యాచ్లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్ గ్రేస్ ఎక్కా తలా మూడు గోల్స్తో అదరగొట్టారు. వీరి ముగ్గురితో పాటు సంగీతా కుమారి రెండు గోల్స్, నవనీత్ కౌర్ ఒక్క గోల్ సాధించారు. కాగా పూల్-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్లో పూల్-బి రన్నరప్తో భారత్ తలపడనుంది. చదవండి: అతడిని భారత క్రికెటర్గా చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్ -
బంగ్లాదేశ్పై ఘన విజయం.. సెమీస్లో భారత హాకీ జట్టు
స్వర్ణ పతకం సాధించి... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించడమే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన భారత్ పూల్ ‘ఎ’లో 15 పాయింట్లతో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్తో సోమవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (2వ, 4వ, 32వ ని.లో), మన్దీప్ సింగ్ (18వ, 24వ, 46వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించి ‘హ్యాట్రిక్’లు నమోదు చేశారు. అభిషేక్ (41వ, 57వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (47వ ని.లో), గుర్జంత్ సింగ్ (56వ ని.లో), అమిత్ రోహిదాస్ (28వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పూల్ ‘ఎ’లోనే జపాన్ జట్టు 12 పాయింట్లతో రెండో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 3–2తో పాకిస్తాన్ను ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ పూల్ ‘ఎ’లో మూడో స్థానానికి పరిమితమై సెమీఫైనల్కు చేరుకోలేకపోయింది. పూల్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, చైనా జట్లు టాప్–2లో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగే సెమీఫైనల్స్లో చైనాతో భారత్; దక్షిణ కొరియాతో జపాన్ తలపడతాయి. భారత్, చైనీస్ తైపీ మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు తొలి మ్యాచ్లోనే ఊహించని ఫలితం ఎదురైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా చైనీస్ తైపీతో సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ను భారత్ 34–34తో ‘డ్రా’ చేసుకుంది. చివరి సెకన్లలో ఆఖరి రెయిడ్తో చైనీస్ తైపీ బోనస్ పాయింట్ సంపాదించి మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. భారత్ ఒకదశలో 26–20తో ముందంజ వేసి ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారత జట్టు వృథా చేసుకొని గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే' -
Neeru Yadav: హాకీ వాలీ సర్పంచ్
రాజస్తాన్లో ఆడపిల్ల పుడితే ఇంకా కొన్ని పల్లెల్లో బంధువులు వెళ్లి ‘శోక్ ప్రకటన్’ (శోక ప్రకటన) చేసే ఆనవాయితీ ఉంది. మొదట కొడుకు పుట్టేశాక రెండో సంతానంగా ఆడపిల్ల పుడితే బిడ్డ బాగోగులు నిర్లక్ష్యం చేసే ఆనవాయితీ ఉండటంతో ప్రభుత్వం ఏకంగా రెండో సంతానం కోసమే ‘మాతృత్వ పోషణ్ యోజన’ పేరుతో తల్లికి 6 వేల రూపాయలు ఇస్తోంది. అలాంటి చోట ఒక మహిళా సర్పంచ్ హల్చల్ చేస్తోంది. తను సర్పంచ్ కావడమే ఊరిలోని ఆడపిల్లలతో ఒక హాకీ టీమ్ ఏర్పాటు చేసి ‘హాకీ వాలీ సర్పంచ్’ అనే పేరు గడించింది. తాజాగా హాకీ బ్యాట్ పట్టుకుని తిరుగుతూ పెళ్లిళ్లలో చెత్త చెదారం వేసినా, ఆహారాన్ని వ్యర్థం చేసినా డొక్క చించుతానని కొత్త ఆర్డర్ పాస్ చేసింది. ప్రజల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్న నీరూ యాదవ్ పరిచయం. జిల్లా అధికారులతో ఎప్పుడు మీటింగ్ జరిగినా నీరూ యాదవ్ లేచి గట్టిగా మాట్లాడుతుంది. అక్కడున్న వాళ్లు ఆమెను ‘మహిళ అయినా’ ఎంత గట్టిగా మాట్లాడుతోందని ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూస్తారు. ‘నేను మహిళనే. కాని బాగా చదువుకున్నాను. మీరు గోల్మాల్ చేసిన బిల్లుల మీద సంతకం పెట్టమంటే పెట్టను. అవినీతి చేయను. నా పంచాయితీలో జరగనివ్వను’ అని తిరగబడుతుంది. అంతే కాదు అది వీడియో తీసి యూట్యూబ్లో పెడుతుంది కూడా. రాజస్థాన్లోని ‘ఝుంజును’ జిల్లాలోని ‘లంబి అహిర్’ అనే పంచాయితీ ఈ నీరూ యాదవ్ అనే సర్పంచ్ వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. లంబి అహిర్ రాజస్థాన్లో ఉన్నా హర్యాణ సరిహద్దులో ఉంటుంది. ఆ ఊళ్లో యాదవులు ఎక్కువ. నీరూ యాదవ్ ఊళ్లోకెల్లా బాగా చదువుకోవడం వల్ల సర్పంచ్గా సులభంగా ఎంపికైంది. మరి... ఎం.ఎస్సీ, ఎం.ఇడి చేసి పిహెచ్.డి కూడా చేసిన నీరూ ఊరికి సేవ చేస్తానంటే ఎవరు వద్దంటారు? ► అమ్మాయిల ప్రగతే ముఖ్యం 2020లో సర్పంచ్ అయిన నాటి నుంచి నీరూ యాదవ్ ముఖ్యంగా అమ్మాయిల ప్రగతి గురించి దృష్టి పెట్టింది. తన పంచాయతీలోని స్త్రీల పట్ల ఉన్న కట్టుబాట్లను బాగ ఎరిగిన నీరూ వారు అన్ని విధాలుగా వికాసం చెందాలంటే విద్యతో పాటు ఇంటి నుంచి బయటకు కదలడం ముఖ్యమే అని ఊరికి చూపించదలుచుకుంది. అందుకే స్కూలు, కాలేజీ వయసున్న ఆడపిల్లల ఇంటింటికి వెళ్లి వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మహిళా హాకీ జట్టుగా జమ చేసింది. సర్పంచ్గా తనకొచ్చే జీతంతో ఒక కోచ్ను ఏర్పాటు చేసింది. పంచాయతీ నిధులతో గ్రౌండ్ను శుభ్రం చేసి ఏర్పాటు చేసింది. ‘మీరు ఉత్తమ హాకీ టీమ్గా విజయాలు సాధించాలి’ అనంటే ఆ ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేస్తూ, ఆటను ఆస్వాదిస్తూ ఇవాళ జిల్లా స్థాయిని దాటి స్టేట్ లెవల్లో ఆడేదాకా ఎదిగారు. ఇది ఊరందరికీ నచ్చి నీరూ యాదవ్ అసలు పేరు మరిచి ‘హాకీ వాలీ సర్పంచ్’ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆటలు మాత్రమే కాదు బాలికల చదువుకు, టెక్నికల్ విద్యకు కూడా నీరూ ప్రోత్సాహం అందిస్తోంది. కొంతమంది యువతులను షార్ట్టెర్మ్ టెక్నికల్ కోర్సులకు పంపి వారికి ఉద్యోగాలు దొరికేలా చూస్తోంది. తన సొంత డబ్బుతో చదివిస్తోంది. ► పెళ్ళిళ్ల వృధాకు విరుగుడు ఊళ్లో పెళ్లిళ్లు, మీటింగులు, ఇతర ఫంక్షన్ల వల్ల భోజనాల సమయంలో పేరుకు పోతున్న చెత్తను గమనించిన నీరూ యాదవ్ తాజాగా ‘చెత్త రహిత వివాహాలు’ అనే ప్రచారాన్ని మొదలెట్టింది. పెళ్లిళ్ల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్లు వాడి పారేయడం వల్ల పేరుకుపోతున్న చెత్తకు విరుగుడుగా స్టీలు పళ్లేలు, గ్లాసులు, బకెట్లు, వంట పాత్రలు కొని పంచాయితీ ఆఫీసులో పెట్టింది. ఊళ్లో ఏ ఫంక్షన్కైనా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే నీరూ యాదవ్ తయారు చేసిన మహిళా కార్యకర్తలు వచ్చి వడ్డిస్తారు. ఎంత తింటే అంత పెట్టడం వల్ల ఆహారం వృధా కాకుండా చూడాలనేది ఆలోచన. అంతేకాదు ఒకవేళ ఆహారం వృధా అయితే దానిని ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే కార్యాచరణ కూడా నీరూ మొదలెట్టింది. ‘మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే’ అంటుంది నీరూ. పిల్లల ఆట కోసం చేతిలో సరదగా హాకీ బ్యాట్ పట్టుకున్నా అది పట్టుకుని ఆమె చేస్తున్న సంస్కరణలు జనం వింటున్నారు. ► రైతుల కోసం నీరూ యాదవ్ పల్లెకు ఆయువుపటై్టన రైతును ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతులకు కావాలసిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ఏర్పాటు కోసం పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం కోసం ఊరి రైతులతో ఎఫ్.పి.ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసింది. దాంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. నీరూ యాదవ్ను మెచ్చుకుంటున్నారు. ‘హాకీ వాలీ సర్పంచ్’ నీరూ యాదవ్ రాబోయే రోజుల్లో సర్పంచ్ కంటే పై పదవికి వెళ్లకుండా ఉండదు. ఆమె చేయాలనుకున్న మంచి పనుల లిస్టులో ఇవి కొన్నే. అన్ని పనులు జరగాలంటే అలాంటి వాళ్లు ఇక్కడితో ఆగకపోవడమే కరెక్ట్. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే. -
తొమ్మిదేళ్ల తర్వాత...సెమీస్లో భారత్
పోష్స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్ను 3–2తో పెనాల్టీ షూటౌట్లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. -
భారత ‘కెప్టెన్’ రీ ఎంట్రీ.. అయితే సారథి మాత్రం..
FIH Pro League 2021-2022- న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ స్టార్ స్ట్రయికర్, గతంలో కెప్టెన్గా వ్యవహరించిన రాణి రాంపాల్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్తో ఈనెల 8, 9 తేదీల్లో రెండు మ్యాచ్ల్లో తలపడే భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్లో రాణి రాంపాల్ కెప్టెన్సీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ తర్వాత తొడ కండరాలు సహా ఇతరత్రా గాయాలతో ఆమె మళ్లీ మైదానంలోకే దిగలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సంతరించుకోవడంతో జట్టుకు ఎంపికైంది. కానీ సీనియర్ గోల్కీపర్ సవితనే సారథిగా కొనసాగించనున్నారు. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజని, దీప్ గ్రేస్, గుర్జీత్, నిక్కీ, ఉదిత, రష్మిత, సుమన్ దేవి, నిషా, సుశీలా చాను, జ్యోతి, నవజ్యోత్ కౌర్, మోనిక, నమిత, సోనిక, నేహ, మహిమ, ఐశ్వర్య, నవ్నీత్ కౌర్, రజ్విందర్ కౌర్, రాణి రాంపాల్, మరియానా కుజుర్. అజేయంగా ముందుకు... పాట్చెఫ్స్ట్రూమ్: జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. మలేసియాతో మంగళవారం జరిగిన పూల్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0తో నెగ్గి ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో పూల్ ‘టాపర్’గా నిలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. మలేసియాతో జరిగిన పోరులో భారత్ తరఫున ముంతాజ్ (10వ, 26వ, 59వ ని.లో) మూడు గోల్స్ సాధించగా... మరో గోల్ను సంగీత కుమారి (11వ ని.లో) చేసింది. చదవండి: IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్! ఆర్సీబీ సంచలన విజయం -
రెండు స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ జ్యోతి; హాకీలో అవార్డులన్నీ మనకే!
Jyothi Surekha Vennam Won 2 Gold Medals: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రపదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో, ఒలింపిక్ రౌండ్లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150–146తో ముస్కాన్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. హాకీలో అవార్డులన్నీ మనకే లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్లకే రావడం మరో విశేషం. భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్ కోచ్లు ఎఫ్ఐహెచ్ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో పీఆర్ శ్రీజేశ్... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్కీపర్’ ట్రోఫీలు గెలుచుకున్నారు. ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా పురుషుల విభాగంలో వివేక్ సాగర్... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్గా రీడ్... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్గా జోయెర్డ్ మరీన్ ఎంపికయ్యారు. ►79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్లో పాలుపంచుకున్నట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. ►ఆగస్టు 23న మొదలైన ఓటింగ్ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్లు, కెపె్టన్లకు 50 శాతం ఓటింగ్ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు. ►అయితే ఓటింగ్ విధానంపై టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్గా అన్షు కొత్త రికార్డు! -
జూనియర్ హాకీ ప్రపంచకప్.. ‘బిగ్ ఎనౌన్స్మెంట్’!
భువనేశ్వర్: భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్ కోసం ఉత్తరప్రదేశ్ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్లో భారత్తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి. చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?! 📢 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 The hockey fever is going to be back in town! 🤩 The showpiece event 𝗙𝗜𝗛 𝗢𝗗𝗜𝗦𝗛𝗔 𝗛𝗢𝗖𝗞𝗘𝗬 𝗠𝗘𝗡'𝗦 𝗝𝗨𝗡𝗜𝗢𝗥 𝗪𝗢𝗥𝗟𝗗 𝗖𝗨𝗣 𝗕𝗛𝗨𝗕𝗔𝗡𝗘𝗦𝗪𝗔𝗥 2021 comes to #Odisha. 🗓️: 24 Nov to 05 Dec, 2021 pic.twitter.com/Zg0hFQylLJ — Odisha Sports (@sports_odisha) September 23, 2021 -
హాకీ ప్లేయర్ వివేక్ సాగర్కు నజరానా.. డీఎస్పీగా ఉద్యోగం
భోపాల్: టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో సభ్యుడైన మధ్యప్రదేశ్కు చెందిన వివేక్ సాగర్ను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో డీఎస్పీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాగా అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోటి రూపాయల చెక్కును కూడా వివేక్ సాగర్కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మీడియాతో మాట్లడూతూ.. భారత హాకీ జట్టులో సభ్యడైన వివేక్ సాగర్ను డీఎస్పీగా నియమించాలని క్యాబినెట్ మంగళవారం నిర్ణయించిందని అన్నారు. 2025-26 నాటికి మధ్యప్రదేశ్లో మొత్తం అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .110.84 కోట్ల నిధులను ఆమోదించిందని, దీని ద్వారా "నవ భారత సాక్షరతా అభియాన్" కింద కోటి మందికి పైగా విద్య అందిస్తామని మిశ్రా చెప్పారు. చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
పాయింట్ల పట్టికలో అట్టడుగున.. పడి పడి పైకి ఎగసి
ఒలింపిక్స్లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్. మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా.. ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్లాల్, కేడీ సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్కు దక్కిన ఒలింపిక్ పతక విజయం అద్భుతమనే చెప్పాలి. క్లిక్ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్ కారణాలు.. క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్స్లో బ్రిటన్ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్లో ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది. మొత్తం 12.. 1980 మాస్క్ ఒలింపిక్స్లో గోల్డ్ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్కు క్వాలిఫై అయ్యింది భారత్)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్లో సెమీస్ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. -సాక్షి, వెబ్ డెస్క్ -
Tokyo Olympics: ఫినిషింగ్ మెరుగుపడితేనే...
బెంగళూరు: అందివచ్చిన అవకాశాలను గోల్స్గా మలచడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని భారత హాకీ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ లలిత్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ప్లేయర్లు చురుకుగా కదులుతూ ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ పోస్ట్ను సమీపించినా ఫినిషింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని... అందులో భారత జట్టు మెరుగు పడాలని లలిత్ పేర్కొన్నాడు. ఇలా జరిగితేనే టోక్యో ఒలింపిక్స్లో భారత్ మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదని లలిత్ అన్నాడు. ఈసారి జరిగే ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనలో భారత్ నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్లతో పాటు... రెండు ప్రొ లీగ్ హాకీ టోర్నీ మ్యాచ్లను ఆడింది. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో 12 గోల్స్ చేసిన భారత్... ప్రొ లీగ్ మ్యాచ్ల్లో ఐదు గోల్స్ చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కోసం భారత హాకీ బృందం బెంగళూరులోని ‘సాయ్’లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. భారత్ గ్రూప్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, స్పెయిన్ జట్లు ఉన్నాయి. -
మన్ప్రీత్ ‘పాజిటివ్’
న్యూఢిల్లీ: భారత హాకీలో కోవిడ్–19 కలకలం చెలరేగింది. భారత పురుషుల సీనియర్ హాకీ జట్టు సభ్యులు ఐదుగురు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తోపాటు డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, కిషన్ పాఠక్లకు వైరస్ సోకింది. నెల రోజుల విరామం తర్వాత... వీరందరూ తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరందరికీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ‘నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. కరోనా నియంత్రణలో భాగంగా ‘సాయ్’ వర్గాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను’ అని మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. స్వస్థలాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీరికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. మన్ప్రీత్, సురేందర్లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఇద్దరితోపాటు మరో పది మంది ఆటగాళ్లు గురువారం ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. ఇతర ఆటగాళ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి. -
ఎట్టకేలకు హాకీ క్రీడాకారులు ఇంటికి
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇంటి మొహమే చూడని భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇరు జట్ల క్రీడాకారులకు నెల రోజుల పాటు ‘హోమ్ సిక్’ సెలవులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సంపాదించాయి. దీంతో వీరికి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైంది. వైరస్ ఉధృతి కొనసాగడంతో టోక్యో ఈవెంట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయినప్పటికీ లాక్డౌన్ వల్ల ఆటగాళ్లంతా బెంగళూరులోనే చిక్కుకుపోయారు. గతనెల చివరి వారం నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇక ఇంటికి వెళ్లే వెసులుబాటు దక్కింది. దీంతో హెచ్ఐ ఇరు జట్ల చీఫ్ కోచ్లను సంప్రదించి నెలపాటు శిక్షణకు విరామం ఇస్తేనే మళ్లీ నూతనోత్సాహంతో బరిలోకి దిగుతారని భావించి సెలవులు మంజూరు చేసింది. -
సహనానికి, ఓర్పుకు హద్దుంటుంది: మాజీ కెప్టెన్
ఇంపాల్ : ఇండియన్ ఉమెన్ హాకీ టీం మాజీ కెప్టెన్ సురాజ్ లతా దేవీ తన భర్త శాంతా సింగ్పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంపాల్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ పెళ్లైన నాటినుంచి అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అనైతిక ప్రవర్తన కారణంగానే నాకు అర్జున అవార్డు వచ్చిందంటున్నాడు. నేనీ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అతడిలో మార్పువస్తుందనే ఇన్నిరోజులు ఎదురుచూశాను. ఏదేమైనప్పటి సహనానికి, ఓర్పుకు ఓ హద్దంటూ ఉంటుంద’ని పేర్కొన్నారు. కాగా, 2005లో శాంతా సింగ్ అనే రైల్వే ఉద్యోగిని పెళ్లాడిన ఆమె హాకీ ఆటకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సురాజ్ లతా దేవీ సారధ్యంలోని ఇండియన్ ఉమెన్ హాకీ టీం మూడు బంగారు పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్లో ఉమెన్ హాకీ టీం కనబరిచిన ప్రతిభ స్ఫూర్తిగా బాలీవుడ్లో ‘ చక్ దే ఇండియా’ అనే సినిమా తెరకెక్కింది. -
మన్ప్రీత్, శ్రీజేష్లకు విశ్రాంతి
న్యూఢిల్లీ: రెగ్యులర్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, మాజీ కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేశ్లకు విశ్రాంతి కల్పిస్తూ... ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్కు తాత్కాలిక సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి డిప్యూటీగా మన్దీప్ సింగ్ వ్యవహరించనున్నారు. నవంబర్లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టు జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్ తెలిపారు. సీనియర్ల గైర్హాజరీలో ఆశిస్ టోప్నో, షంషేర్ సింగ్లు తొలి సారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టు: హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), మన్దీప్ సింగ్ (వైస్ కెప్టెన్), క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెర, గురీందర్ సింగ్, కొత్తాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్, జస్కరణ్ సింగ్, గుర్సాహిబ్జిత్ సింగ్, నీలమ్ సంజీప్, జర్మన్ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, ఆశిస్ టోప్నొ, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, షంషేర్ సింగ్. -
ఓటమితో ముగించారు
పెర్త్: ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన రెండో మ్యాచ్లో భారత హాకీ జట్టు 2–5తో పరాజయం చవిచూసింది. ఈ పర్యటనను ఓటమితో ముగించింది. ఆస్ట్రేలియా తరఫున ట్రెంట్ మిటన్ (11వ, 24వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఫ్లిన్ ఒగిల్వి (3వ నిమిషంలో), బ్లేక్ గోవర్స్ (28వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తరఫున నీలకంఠ శర్మ (12వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. -
మలేసియా హాకీ టూర్కు గోల్కీపర్ రజని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత మహిళల హాకీ జట్టులో తెలుగు అమ్మాయి ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రజని రెండో గోల్కీపర్గా వ్యవహరిస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన గోల్కీపర్ సవిత పూనియా ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుంది. ఏప్రిల్ 4 నుంచి ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. -
స్త్రీలోక సంచారం
దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన యు.పి.లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) తొలిసారిగా బాలికల హాకీ టీమ్ని జాతీయ స్థాయి పోటీలకు పంపించబోతోంది! ఇందుకోసం క్యాంపస్ పరిధిలోని పది స్కూళ్ల నుంచి బాలికల్ని ఎంపిక చేసి వారితో హ్యాకీ టీమ్ని సిద్ధం చేస్తోంది. అంతా సవ్యంగా జరిగితే కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్–స్కూల్ కాంపిటిషన్కి ఎ.ఎం.యు. బాలికల తొట్టతొలి హాకీ జట్టు పోటీ పడుతుంది. సర్ సయ్యద్ హాల్ సమీపంలోని యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారత అంతర్జాతీయ హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు అనీస్ ఉర్ రెహ్మాన్ కోచింగ్లో ఈ జట్టు శిక్షణ పొందుతోంది. మైదానంలో వీళ్ల ప్రాక్టీస్ను చూసి సీనియర్ విద్యార్థినులు (డిగ్రీ) కూడా తరగతులు అయ్యాక సరదాగా హాకీ ఆడేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవడంతో క్యాంపస్ మునుపెన్నడూ లేని విధంగా బాలికలు, యువతుల హాకీ ఆటతో కళకళలాడుతోంది. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో ప్రారంభం అయింది. మహిళలకు లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు స్థానాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ రాష్ట్రాలకు లేఖలు పంపారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రిజర్వేషన్లను తీర్మానించి, ఆమోదం పొందాలని ఆయా రాష్ట్రాలను ఆయన కోరారు. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన తీర్మానాలు చేశాయని ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘‘193 దేశాలలోని పార్లమెంట్లలో ఉన్న మహిళల శాతంతో పోలిస్తే మన దేశం 148వ స్థానంలో ఉంది. అసెంబ్లీలలోనైతే ఈ స్థానం ఇంకా తక్కువ. స్థానిక సంస్థల్లో నయం. మహిళలు ఎక్కువమంది కనిపిస్తున్నారు. స్త్రీలకు సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు కూడా వెరవకుండా గ్రామ సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల్లో స్త్రీలకు సముచిత స్థానం లేకుండా ఏప్రజాస్వామ్య దేశమూ పూర్తిగా అభివృద్ధి చెందలేదు’’ అని డిసెంబర్ 6న రాసిన ఆ లేఖలో రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ లోక్సభలో పెండింగులో ఉంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక 15వ లోక్సభ రద్దయి 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చే జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతుర్నని చెప్పుకున్న యువ డ్యాన్సర్ క్యాథరీనా తిఖోనోవా తొలిసారి రష్యా అధికార టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యారు. గత గురువారం ఆ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి ఉక్కు సంకల్పం వెనుక ఉన్న మృదువైన కోణాల్ని ఆవిష్కరించారు. ‘‘పైకి కఠినంగా కనిపిస్తారు. కానీ ఆయన మనసు మెత్తనైనది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాథరీనా ఇలా టీవీలో కనిపించడం, రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో గత ఇరవై ఏళ్లుగా మీడియాపై ఉన్న ఆంక్షలు కొద్దిగానైనా సడలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆంతరంగిక జీవితం గురించి ఆ దేశంలోనే చాలామందికి తెలియదు. ‘పుతిన్ తాతగారు అయ్యారు’ అన్న వార్త మాత్రం గత ఏడాది దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వార్త అయినా ఆయనకై ఆయనే ఏదో సందర్భంలో బహిర్గతం చెయ్యడం వల్లనే బయటికి వచ్చింది. పుతిన్కి ఎందరో భార్యలు, మరెందరో ప్రియురాళ్లు ఉన్నారని ఒక వదంతి. పుతిన్ గతంలో గూఢచారి. తన కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిగూఢంగా ఉంచదలిచారేమో! ఇక క్యాథరీనా ఆయన సొంత కూతురేనా అనే దానిపై ఆ దేశంలో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. -
మహిళల జట్టుకూ రజతమే
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): బరిలోకి దిగిన తొలిసారే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్లో భాగంగా మొదటిసారి నిర్వహించిన ఫైవ్–ఎ–సైడ్ హాకీ పోటీల్లో భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళల జట్టు కూడా రజతంతో సంతృప్తి పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ముంతాజ్ ఖాన్ చేసిన గోల్తో భారత్ తొలి నిమిషంలోనే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న అర్జెంటీనా ఏడో నిమిషంలో గియానెల్లా గోల్తో స్కోరును 1–1తో సమం చేసింది. తొమ్మిదో నిమిషంలో సోఫియా రమాల్లో... 12వ నిమిషంలో బ్రిసా బ్రుగెస్సర్ ఒక్కో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో టీమిండియా 2–4తో మలేసియా చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. మూడు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలతో పదో స్థానంలో ఉంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఆకాశ్, హిమాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ఆకాశ్ 6–5తో లీ బెంజిమిన్ (కెనడా)పై, హిమాని 7–1తో జిల్ వాల్టర్ (సమోవా)పై గెలుపొందారు. -
‘టాప్స్’లో భారత మహిళల హాకీ జట్టు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్’లో ఉంది. 48 మంది ప్రాబబుల్స్... ‘సాయ్’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన గోల్కీపర్ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు. -
రజత రజనికి స్వాగతం
రజని.. మన జిల్లా క్రీడారత్నం. హాకీలో రాణించి జిల్లాకు, దేశానికి పేరు తెచ్చిన ఆణిముత్యం. ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారి పల్లె నుంచి అంతర్జాతీయ క్రీడా యవనికపై కీర్తి పతాకాన్ని ఎగరేసిన అమ్మాయి. పల్లె నుంచి ‘ఆట’ంకాలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తూ తాజాగా ఆసియా క్రీడల్లోనూ అపూర్వ ప్రతిభ కనబరిచిందీమె. ఇండియా జట్టు కీపరుగా స్వర్ణావకాశం తప్పినా రజత పతకం సాధించడంలో కీలక భూమిక పోషించింది. జకార్తాలో జరిగిన క్రీడల్లో గెలిచాక శుక్రవారం తొలిసారి తిరుపతి చేరుకున్న ఈమెకు క్రీడాభిమానులు.. వివిధ సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈమెకు ప్రభుత్వం రూ.6 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. తిరుపతిలో స్వచ్ఛభారత్కు రజని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. చిత్తూరు, తిరుపతి సిటీ: 2020లో జరిగే ఒలింపిక్స్లో భార త్ మహిళల హాకీ జట్టు తరఫున ఆడి, విజేతగా నిలిచి పతకం సాధించడమే లక్ష్యమని భారత్ మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ యతిమరపు రజని తెలిపారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొని సి ల్వర్ మెడల్ సాధించి శుక్రవారం మొట్టమొదటి సారిగా తిరుపతికి విచ్చేసిన రజనికి జిల్లా క్రీడాపాధికార సంస్థ అధ్వర్యంలో అధికారులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు శ్రీపద్మావతి మహిళ వర్సిటీలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత హాకీలో సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. 2016లో ఒకసారి మహిళా వర్సిటీకి వచ్చానని, తిరిగి 2020లో ఒలింపిక్స్లో పతకం సాధించి మళ్లీ ఇక్కడికి వస్తానని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు ఏషియన్ గేమ్స్లో సిల్వర్ పతకం సాధించిన రజ నికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు జిల్లా కలెక్టర్ ప్రకటించారని జిల్లా క్రీడాపాధికార సంస్థ సీఈఓ లక్ష్మీ తెలిపారు. విద్యార్థులు రజనీని స్ఫూర్తిగా తీసుకుని చదువులో, క్రీడల్లో రాణిం చాలని కోరారు. తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్రెడ్డి, మహిళ వర్సిటీ వీసీ దుర్గాభవాని, రెక్టార్ ఉమ మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన రజని నేడు ఇండియా హాకీ జట్టులో స్థానం సంపాదించడం ఎంతో గర్వకారణమన్నా రు. అంతకు ముందు రజనీని మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు దుశ్శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ చీఫ్ కోచ్ సుదర్శనం నాయుడు, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పాండ్రవేటి గిరి, కబడ్డీ కోచ్ బాలాజీ, హాకీ కోచ్లు వెంకటరమణ, లక్ష్మీ నారాయణ, జూడో కోచ్ గోపి, రజనీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం రేణిగుంట: భారత హాకీ జట్టు గోల్కీపర్ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒంటి గం టకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడా సాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు, విద్యార్థినులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పతకం కోసం తాను పది సంవత్సరాల పాటు శ్రమించానన్నారు. ఈ స్థాయికి వచ్చాక అందరూ గుర్తిస్తున్నారే కానీ, కొన్నేళ్లపాటు తాను ఎన్నో ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. స్మార్ట్ సిటీ అంబాసిడర్గా రజని తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ హాకీ ప్లేయర్ రజనీ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ విజయ్రామరాజు చర్చించి ఆమెను తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అం బాసిడర్గా నియమించారు. అలానే స్వచ్ఛ తిరుపతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రజనీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై కమిషనర్ విజయ్రామరాజు హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్షి’తో కమిషనర్ మాట్లాడుతూ రజనీని విద్యా ర్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తిరుపతి పరపతిని మరింత ఇనుమడింప చేసేందుకు, స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్య పరిచేందుకు రజనీ సేవలను వినియోగించుకుంటామన్నారు. -
అటు క్రికెట్, ఇటు హాకీ...
డబ్లిన్: కేవలం 13 ఏళ్ల వయసులో దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ బరిలోకి... ప్రపంచ క్రికెట్లోనే మరెవరికీ సాధ్యం కాని ఘనత ఇది. 18 ఏళ్లు కూడా నిండకుండానే జాతీయ హాకీ జట్టు తరఫున హాకీ మ్యాచ్... 20 ఏళ్లకే వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన జట్టులో సభ్యురాలు... ఐర్లాండ్కు చెందిన ఎలెనా టైస్ అరుదైన ప్రదర్శన ఇది. ఆదివారం జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన ఐర్లాండ్ జట్టులో టైస్ సభ్యురాలు. ఈ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు అనూ హ్యంగా ఫైనల్కు చేరింది. ఇందులో డిఫెండర్గా టైస్ కూడా కీలకపాత్ర పోషించింది. అంతకుముం దు నాలుగేళ్ల పాటు ఆమె క్రికెటర్గా ఐర్లాండ్ తరఫున సత్తా చాటింది. ఆగస్టు 2015లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఎలెనా... మొత్తం 15 వన్డేలు, 25 టి20ల్లో ఐర్లాండ్కు ప్రాతినిధ్యం వహించింది. లెగ్ స్పిన్నర్ అయిన ఆమె రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 24 వికెట్లు పడగొట్టింది. గతంలో ఎలైస్ పెర్రీ (ఫుట్బాల్), సుజీ బేట్స్ (బాస్కెట్బాల్), సోఫీ డివైన్ (హాకీ) కూడా క్రికెట్తో పాటు మరో ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. వారి స్ఫూర్తితోనే తాను ముందుకు వెళ్లానని ఎలెనా చెబుతోంది. 2020 ఒలింపిక్స్లో ఐర్లాండ్ హాకీ జట్టు అర్హత సాధించేలా చేసి అందులో ఆడటమే తన లక్ష్యమని అంటోంది. -
ఆటగాళ్లకు ఇదేం భోజనం!
న్యూఢిల్లీ: బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఏర్పాటు చేసిన భోజన వసతి అత్యంత అధ్వాన్నంగా ఉందని భారత హాకీ చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ హాకీ ఇండియా (హెచ్ఐ)కి ఫిర్యాదు చేశారు. చాంపియన్స్ ట్రోఫీ కోసం హాకీ జట్టు ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ తీసుకుంటుంది. కానీ అక్కడి వంటలు రుచిగా లేవని, కలుషిత వాతావరణంలో ఇవి తయారవుతున్నాయని, ఆటగాళ్లకు ఇస్తున్న ఆహారంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని కోచ్ హెచ్ఐకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ‘హాకీ జట్టు ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఆసియా క్రీడలు, ప్రపంచకప్కు సిద్ధమవుతున్న కీలక తరుణంలో ఎలాంటి పోషక విలువల్లేని ఆహారం వండుతున్నారు, శుచి–శుభ్రత లేని వాతావరణంలో ఈ వంటలు తయారవుతున్నాయి. నాణ్యత, శక్తి–శుభ్రత లేని ఆహారం ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని కోచ్ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఇక్కడ శిక్షణ పొందుతున్న 48 మంది అథ్లెట్ల రక్త నమూనాలను పరీక్ష చేయగా శక్తిహీనత కనబడిందని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్కు ముందు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ఇక్కడికి విచ్చేసి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఎలాంటి మార్పు లేదన్నారు. -
భారత మహిళలు శుభారంభం
సియోల్:ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భాగంగా దక్షిణకొరియాతో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళలు శుభారంభం చేశారు. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత మహిళలలు 1-0తో విజయం సాధించారు. మ్యాచ్ ఐదో నిమిషంలో భారత క్రీడాకారిణి లాల్రేమ్షియామి గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపింది. ఆ తరువాత దక్షిణకొరియా గోల్ చేయడానికి చివరివరకూ యత్నించినా ఫలితం దక్కలేదు. భారత రక్షణశ్రేణిని ఛేదించలేకపోయిన దక్షిణకొరియా జట్టు గోల్ చేయడంలో విఫలమైంది. భారత జట్టుకు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా దాన్ని దక్షిణకొరియా అడ్డుకుంది. ఆట రెండో క్వార్టర్లో భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకోలేపోయింది. దక్షిణకొరియా గోల్ కీపర్ మిజిన్ సమర్ధవంతంగా పెనాల్టీ కార్నర్ను గోల్ పోస్ట్లోకి వెళ్లకుండా ఆపి భారత్ స్కోరును మరింత పెరగకుండా నిలువరించింది. కాగా, ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిక్యంలో నిలవడంతో సిరీస్లో తొలి గెలుపును అందుకుంది. -
గోల్డ్ గోల్!
గచ్చిబౌలి: ఆ అక్కాచెల్లెళ్లు హాకీలో రాణిస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయస్థాయి మ్యాచ్ల్లో ప్రతిభ కనబరిచారు. తెలంగాణ హాకీ జట్టుకు వీరిద్దరూ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో ఒకరు పదహారుసార్లు, మరొకరు తొమ్మిదిసార్లు గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరే అంజయ్యనగర్కు చెందిన గీత సాగర్, శ్రీదేవి సాగర్. గీత ప్రస్తుతం మెహిదీపట్నం సెయింట్ ఆన్స్లో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్, శ్రీదేవి చందానగర్లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీద్దరిరూ పాఠశాల స్థాయి నుంచే హాకీ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఒకరు సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో.. మరొకరు భారత హాకీ జట్టులో స్థానం సంపాదించాలనే గోల్తో ముందుకెళ్తున్నారు. గీత.. ⇒ గచ్చిబౌలి కేవీ హాకీ జట్టు కెప్టెన్గా.. ⇒ 2008లో ఇంటర్–19 నేషనల్స్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా.. ⇒ 2017 ఏప్రిల్లో హరియాణాలో సీనియర్ నేషనల్స్లో తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్గా.. సివిల్స్ సాధనే ధ్యేయం: గీత చదువులో మంచి మార్కులు సాధిస్తున్నా. డిగ్రీ పూర్తికాగానే సివిల్స్ రాస్తా. నా భర్త రాజు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. హాకీలో ఇప్పటి వరకు 16 గోల్డ్ మెడల్స్ సాధించా. శ్రీదేవి.. ⇒ కేవీ నేషనల్స్లో ఐదు గోల్డ్ మెడల్స్ ⇒ పైకా 2012లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా.. ⇒ జేఎఫ్హెచ్ఏ గరŠల్స్ హాకీ టోర్నమెంట్లో ఔట్ స్టాండింగ్ మిడ్ ఫీల్డర్గా అవార్డు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం: శ్రీదేవి భారత మహిళల హాకీ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యం. హాకీలో తొమ్మిదిసార్లు గోల్డ్ మెడల్స్ సాధించా. అప్పుడప్పుడూ పెయింటింగ్స్ కూడా వేస్తుంటా. -
సర్దార్ సింగ్ పై వేటు
న్యూఢిల్లీ: సీజన్ ముగింపు టోర్నీ హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) ఫైనల్స్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్, ఈ ఏడాది ‘రాజీవ్ ఖేల్రత్న’ అవార్డీ సర్దార్ సింగ్పై హాకీ ఇండియా (హెచ్ఐ) వేటు వేసింది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు భువనేశ్వర్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులు గల భారత జట్టుకు మన్ప్రీత్ సింగ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. గత నెలలో ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 31 ఏళ్ల సర్దార్ను తప్పించడం ఆశ్చర్యకర పరిణామమే. 2006 నుంచి భారత జట్టు సభ్యుడిగా ఉన్న ఈ హరియాణా ప్లేయర్ ఇప్పటివరకు 191 మ్యాచ్ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఆటగాళ్లకు అందలం
తొమ్మిది మంది క్రీడాకారులను డీఎస్పీలుగా నియమించిన పంజాబ్ ప్రభుత్వం న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తమ రాష్ట్ర క్రీడాకారులను పంజాబ్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. తొమ్మిది మందినిS డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా నియమించింది. ఇందులో ఏడుగురు హాకీ క్రీడాకారులున్నారు. స్పోర్ట్స్ కోటా కింద వీరికి ఉద్యోగావకాశం కల్పించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ వీరికి నియామక పత్రాలు అందించారు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల హాకీ జట్టులో ఉన్న మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్, స్ట్రయికర్ ఆకాశ్దీప్ సింగ్, సర్వన్జిత్ సింగ్, రమణ్దీప్ సింగ్, గుర్విందర్ సింగ్ చండి, ధరమ్వీర్ సింగ్లు డీఎస్పీలయ్యారు. 2014 ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెటిక్స్ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించిన మన్దీప్ కౌర్... ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన అథ్లెట్ ఖుష్బీర్ కౌర్ (20 కి.మీ. నడక)... ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలైన అమన్దీప్ కౌర్లను కూడా డీఎస్పీలుగా నియమించారు. -
భారత్ లో ఆడేందుకు పాక్కు క్లియరెన్స్!
కరాచీ:వచ్చే నెల్లో భారత్ లో జరుగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం నుంచి అంగీకారం లభించినట్లు ఆ దేశ హాకీ సమాఖ్య స్పష్టం చేసింది. 'భారత్ లో మా జూనియర్ హాకీ జట్టు పర్యటనపై గత కొంతకాలంగా ఆసక్తిగా ఉన్నాం. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ప్రభుత్వానికి విన్నవించాం. అందుకు అంగీకారం లభించింది. త్వరలో మేము భారత్ లో ఆడబోయే వరల్డ్ కప్ మా హాకీకి భవిష్యత్తుగా భావిస్తున్నాం. భారత్ లో టోర్నీకి సంబంధించి మా విదేశాంగ శాఖ నుంచి అనుమతి వచ్చింది'అని పాక్ హాకీ సమాఖ్య వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ లక్నోలో హాకీ వరల్డ్ కప్ జరుగనుంది. -
మువ్వన్నెలు మురిసేలా..
► ఆసియా చాంపియన్స ట్రోఫీ విజేతగా భారత్ ► ఫైనల్లో 3-2తో పాకిస్తాన్పై విజయం ► ఒక్కో ఆటగాడికి రూ.2 లక్షల నజరానా దేశం మొత్తం దీపావళి పర్వదినాన వెలిగిపోతున్న వేళ... భారత హాకీ జట్టు ఆ వెలుగును రెట్టింపు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి ఆసియా చాంపియన్స ట్రోఫీ విజేతగా అవతరించింది. దేశంలో సెలబ్రిటీలంతా సైనికులకు పండగ సందేశాలను పంపుతుంటే... హాకీ జట్టు ఈ గెలుపును సైనికులకు అంకితం చేసింది. చాలా కాలం తర్వాత జాతీయ క్రీడలో ఓ గొప్ప విజయంతో మువ్వన్నెలు మురిశారుు. పండుగ రోజు దేశం యావత్తు మరింత సంబరపడింది. కౌంటాన్ (మలేసియా): ఆసియా చాంపియన్స హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ను 3-2తో ఓడించి భారతీయుల దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అటు లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన పాక్కు భారత ఆటగాళ్ల వీరోచిత ఆటతో మరోసారి భంగపాటు ఎదురైంది. రూపిందర్ పాల్ సింగ్ (18వ నిమిషంలో), యూసుఫ్ అఫ్ఫాన్ (23), నిఖిల్ తిమ్మయ్య (51) భారత్కు గోల్స్ అందించారు. పాకిస్తాన్ నుంచి ముహమ్మద్ అలీమ్ బిలాల్ (26), అలీ షాన్ (38) గోల్స్ చేశారు. 2011లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్తాన్నే ఓడించి తొలి చాంపియన్గా నిలిచింది. ఆరంభం నుంచే దూకుడు భారత్, పాక్ జట్టు ఈ టోర్నీ తుది సమరంలోనూ నువ్వా..నేనా అనే తరహాలో ఆడారుు. కెప్టెన్, గోల్కీపర్ శ్రీజేష్ గాయం కారణంగా ఫైనల్కు దూరం కాగా అతడి స్థానంలో ఆకాష్ చిక్టే బరిలోకి దిగాడు. ఇరు జట్లు కూడా విపరీతమైన ఒత్తిడితో బరిలోకి దిగినా భారత్కు ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ చిక్కింది. అరుుతే దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోరుుంది. జస్జిత్ సింగ్ కులార్ సంధించిన ఈ షాట్ ఎడమ వైపు నుంచి వైడ్గా వెళ్లడంతో ఫలితం దక్కలేదు. అటువైపు 12వ నిమిషంలో పాకిస్తాన్ తరఫున ముహమ్మద్ రిజ్వాన్ జూనియర్ నుంచి వచ్చిన షాట్ను చాలా దగ్గరి నుంచి కీపర్ ఆకాష్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. ఈ ప్రయత్నాలతో భారత్ 18వ నిమిషంలో లబ్ధి పొందింది. తమకు దక్కిన రెండో పెనాల్టీ కార్నర్ను రూపిందర్ పాల్ సింగ్ మెరుపు వేగంతో ఎడమవైపుకు ఫ్లిక్ చేసి జట్టుకు తొలి గోల్ అందించాడు. టోర్నీలో తనకిది 11వ పెనాల్టీ కార్నర్ గోల్ కావడం విశేషం. మరో మూడు నిమిషాల్లోనే రమణ్దీప్ అందించిన క్రాస్ను యూసుఫ్ ఎలాంటి పొరపాటుకు తావీయకుండా గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ తమ ఎదురుదాడులను ముమ్మరం చేసింది. 26వ నిమిషంలో పాక్ తొలి పీసీని అలీమ్ బిలాల్ గోల్గా మలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. అంతేకాకుండా 38వ నిమిషంలో భారత డిఫెన్స మధ్య గ్యాప్ను సొమ్ము చేసుకుంటూ అలీ షాన్ మరో గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. దీంతో మ్యాచ్లో ఉత్కంఠ తారాస్థారుుకి చేరింది. 40వ నిమిషంలో భారత్ గోల్ చేసినా వీడియో రివ్యూలో అది అవుట్సైడ్ సర్కిల్ షాట్గా తేలింది. అరుుతే జట్టు విజయానికి కారణమైన కీలక గోల్ను నిఖిల్ తిమ్మయ్య 51వ నిమిషంలో సాధించాడు. సర్దార్సింగ్ నుంచి వచ్చిన పాస్ను అందుకున్న తను చక్కటి గోల్తో భారత శిబిరంలో ఆనందం నింపాడు. చివర్లో గోల్ కోసం పాక్ భీకర పోరాటమే చేసినా భారత్ ఎట్టి పరిస్థితిలోనూ ఏమరపాటుకు తావీయకుండా మ్యాచ్ను ముగించింది. మలేసియాకు కాంస్యం ఆతిథ్య మలేసియా జట్టు ఆసియా చాంపియన్స హాకీలో వరుసగా నాలుగోసారి కాంస్యం దక్కిం చుకుంది. మూడో స్థానం కోసం ఆదివారం జరి గిన మ్యాచ్లో మలేసియా 3-1 తేడాతో పెనాల్టీ షూటవుట్లో కొరియాపై నెగ్గింది. అంతకుముం దు నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్తో సమానంగా నిలిచారుు. దీంతో ఫలితం తేల్చేం దుకు పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. ఆటగాళ్లకు నజరానా పాకిస్తాన్పై అద్భుత విజయం సా ధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడితో పాటు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్మన్సకు రూ.2 లక్షల చొప్పున అందించనుంది. సహాయక సిబ్బందికి రూ. లక్ష చొప్పున ఇవ్వనుంది. అలాగే టోర్నీలో అత్యధిక గోల్స్ చేయడంతో పాటు ఉత్తమ ఆటగాడిగా నిలిచిన రూపిందర్ పాల్సింగ్కు మరో రూ.2 లక్షలు ఇవ్వనుంది. అభినందనల వెల్లువ ఆసియా చాంపియన్స హాకీలో విజేతగా నిలిచిన భారత్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు , సచిన్, సెహ్వాగ్ తదితర క్రీడా ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. ⇒మన హాకీ జట్టును చూసి గర్విస్తున్నాను. ఆసియా చాంపియన్స ట్రోఫీ గెలిచినందుకు అభినందనలు. - మోదీ ⇒ భారత హాకీ జట్టు ఎంతో గొప్ప విజయం సాధించింది. - సచిన్ టెండూల్కర్ ⇒ నిన్నటి కథలో నీతి: తల్లి ఆశీర్వాదం ఉంటే విజయం సులువవుతుంది. నేటి కథలో నీతి: తండ్రి స్థారుు తండ్రిదే. - సెహ్వాగ్ కొరియాపై భారత మహిళల విజయం సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీలో భారత జట్టు 2-1తో కొరియాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ నుంచి రాణి (47వ నిమిషంలో), దీపికా ఠాకూర్ (54) గోల్స్ చేశారు. తొలి అర్ధభాగంలో అంతగా రాణించని భారత మహిళలు ద్వితీయార్ధంలో రెచ్చిపోవడంతో రెండు గోల్స్ నమోదయ్యారుు. నేడు (మంగళవారం) భారత జట్టు మలేసియాతో ఆడనుంది. -
పాక్ను ఓడించి వీర జవాన్లకు అంకితమిస్తాం
బెంగళూరు: ఆసియా చాంపియన్స ట్రోఫీలో పాకిస్తాన్ను ఓడించి... ఆ విజయాన్ని వీరజవాన్లకు అంకితమిస్తామని భారత సీనియర్ హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేశ్ తెలిపాడు. ఉడీ ఉదంతం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ నిప్పురాజుకున్న సంగతి తెలిసిందే. మలేసియాలోని కుంటాన్లో వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరగనుంది. ఇందులో భారత సైనికులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చబోమని దాయాది జట్టును ఓడించి మన జవాన్లకు జోహార్లు అర్పిస్తామని శ్రీజేశ్ చెప్పాడు. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థుల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ స్థాయికి తగినట్లు ఆడలేకపోతోందని, అయితే ఆ జట్టు గట్టి ప్రత్యర్థేనని తెలిపాడు. ఆ టోర్నీ కోసం ప్రస్తుతం సీనియర్ హాకీ జట్టుకు ఇక్కడి ‘సాయ్’ సెంటర్లో నాలుగు వారాల పాటు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేడు జూనియర్ల పోరు ఢాకా: ఆసియా కప్ అండర్-18 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ల మధ్య గురువారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్తో తొలి లీగ్ మ్యాచ్లో పోరాడి ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్లో ఒమన్పై గోల్స్ సునామీతో 11-0తో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న భారత్ ఇదే స్ఫూర్తితో పాక్ను కంగుతినిపించాలనే ఉత్సాహంతో ఉంది. ఇబుంగో సింగ్, దిల్ప్రీత్ సింగ్ చెరో 4 గోల్స్ సాధించి చక్కని ఫామ్లో ఉన్నారు. పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో ఊపుమీదుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. -
నేటి నుంచి హాకీ శిబిరం
భోపాల్: ఒలింపిక్స్ తర్వాత మూడు వారాల విరామానంతరం భారత మహిళల హాకీ జట్టు నేటి నుంచి ఇక్కడ జరిగే జాతీయ శిబిరంలో పాల్గొననుంది. మొత్తం 29 మందితో కూడిన బృందం తిరిగి ప్రాక్టీసును ప్రారంభించనుంది. అక్టోబర్ 29న సింగపూర్లో జరిగే ఆసియన్ చాంపియన్స ట్రోఫీతో పాటు నవంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత జట్టు తమ ఆటలోని లోపాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది. -
భారత్కు షాకిచ్చిన నెదర్లాండ్ టీమ్
భారత హాకీ పురుషుల జట్టు నిరాశ పరిచింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు చేతిలో 2-1 తేడాతో భారత్ ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్స్ సమయంలో ఇరు జట్లు హోరా హోరీగా గోల్ కోసం యత్నాలు చేసినా ఖాతా తెరవలేదు. అయితే మూడు, నాలుగో క్వార్టర్స్ సమయాలలో నెదర్లాండ్ రెండు గోల్స్ చేయగా, భారత్ ఒక్క గోల్ నమోదు చేయడంతో ఓటమి పాలైంది. అయితే భారత్ కు క్వార్టర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. -
రియోలో వసతిపై భారత హాకీ జట్టు ఫిర్యాదు
రియో డి జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగనున్న రియోలో వసతులు దయనీయంగా ఉన్నాయంటూ భారత హాకీ జట్టు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్ విలేజ్లో తాము బస చేసే చోట కనీసం కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేవని భారత చీఫ్ కోచ్ ఓల్ట్మన్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆటగాళ్లు ఉండే అపార్ట్మెంట్లలో ఇంకా పూర్తిగా సిద్ధం చేయలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు రియోలో భారత వ్యవహారాలను పర్యవేక్షించే రాకేశ్ గుప్తాకు లేఖలో తెలియజేశారు. 'మాకు ఇంకా పూర్తికాని అపార్ట్మెంట్లు కేటాయించారు. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా లేవు. దాంతో పాటు తగినన్ని టీవీ సెట్లు కూడా లేవు. పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళా క్రీడాకారిణులు పరిస్థితి ఇలానే ఉంది . సరైన టేబుల్స్ కూడా లేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది అపార్ట్మెంట్లలో ఉంటున్న పురుష, మహిళా హాకీ జట్లకు ఇంకా 28 కుర్చీలు అవసరమని పేర్కొన్నారు. దాదాపు ఏడు అపార్ట్మెంట్లలో కనీసం ఒక్కో టేబుల్ ను అమర్చడంతో పాటు, ఒలింపిక్స్ గేమ్స్ జరిగే సమయంలో మ్యాచ్లను చూడటానికి కూడా తగినన్ని టీవీ సెట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల ఆట తీరును తెలుసుకోవడానికి టీవీలు దోహదం చేస్తాయన్నారు. తమ అభ్యర్థనను సాధ్యమైనంత తొందరగా అమలు చేయడానికి యత్నించాలని విన్నవించారు. -
రియోకు పయనమైన హాకీ జట్టు
బెంగళూరు: వచ్చే నెలలో రియోలో జరుగనున్న ఒలింపిక్స్ కు భారత పురుషుల హాకీ జట్టు పయనమైంది. దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున భారత హాకీ జట్టు ముందుగా స్పెయిన్ కు చేరుకుంది. ఆ జట్టుతో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడిన అనంతరం అక్కడ నుంచి రియోకు చేరుతుంది. 'రియోకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడే అవకాశం రావడం కచ్చితంగా లాభిస్తుంది. మాడ్రిడ్లో తగినంత ప్రాక్టీస్ లభిస్తుందని ఆశిస్తున్నా. ఈ నెల 29న మాడ్రిడ్ నుంచి రియోకు వెళతాం. రియో ఒలింపిక్స్ కోసం జట్టులోని ఆటగాళ్లు ఆతృతగా ఉన్నాం. ఏ విధమైన సవాల్నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటీవల కాలంలో భారత జట్టు అనేక విజయాలను సొంతం చేసుకోవడం కూడా మాకు బాగా కలిసొస్తుంది. అక్కడకు వచ్చే ప్రపంచ అత్యుత్తమ జట్లతో తలపడి మమ్మల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది'అని కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ పేర్కొన్నాడు. -
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
చాంపియన్స్ ట్రోఫీ హాకీ లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్ బెర్తు అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 2-4 గోల్స్ తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఆసీస్ తరఫున మిట్టన్ (21వ ని.), జలెవ్స్కీ (23వ ని.), ఫ్లిన్ ఓగ్లివీ (35వ ని.) గోల్స్ చేశారు. ద్వితీయార్థంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను రఘునాథ్ (45వ ని.) గోల్గా మలిచి భారత్కు తొలి గోల్ను అందించాడు. ఆ వెంటనే వైట్ (45వ ని.) మరో కౌంటర్ అటాక్తో భారత్కు షాక్నిచ్చాడు. ఈ దశలో మన్దీప్ సింగ్ (49వ ని.) గోల్ చేసి ఆధిక్యాన్ని 2-4కు తగ్గించాడు. చివర్లో గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ గోల్ చే యడంలో విఫలమైంది. బ్రిటన్, బెల్జియంల మధ్య జరిగే మ్యాచ్ డ్రా అయితే భారత్ ఫైనల్కు చేరుతుంది. లేదంటే కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. -
భారత్x జర్మనీ
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ లండన్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు భారత హాకీ జట్టు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పతకం సాధించాలనే ఉద్దేశంతో ఉంది. జర్మనీతో జరిగే ప్రారంభ మ్యాచ్లో భారత్ తలపడుతుంది. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం సాధించిన అనంతరం భారత జట్టు ఇప్పటిదాకా పోడియం దక్కించుకోలేకపోయింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, బెల్జియం, దక్షిణ కొరియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. -
జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి
నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్కు విజయాన్ని అందించారు. -
'రియో' సమరానికి సన్నాహకం!
ఇఫో(మలేషియా): రియో ఒలింపిక్స్ సన్నాహకాలకు భారత పురుషుల హాకీ జట్టు సన్నద్ధమైంది. మలేషియాలో బుధవారం నుంచి ఆరంభం కానున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ లో పటిష్టమైన జపాన్ తో తలపడనుంది. ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన భారత్.. మరో నాలుగు నెలల్లో ఆరంభమయ్యే రియోకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గతేడాది మూడో స్థానం సాధించి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు యువకులతో జట్టును కూడా పరీక్షించేందుకు సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు సమాయత్తమైంది. రియో ఒలింపిక్స్కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఈటోర్నీకి ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ఆగస్టులో రియో ఒలింపిక్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఎక్కువశాతం మంది యువకులనే ఈ టోర్నీకి ఎంపిక చేసినట్లు భారత హాకీ కోచ్ రియోలాంట్ వాల్ట్ మాన్స్ స్పష్టం చేశాడు. ఇక్కడ తమ ప్రతిభను నిరూపించుకుని ప్రధాన టోర్నీలకు అర్హత సాధించేందకు వారికి ఇదొక సువర్ణావకాశమన్నాడు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కావొద్దని యువ హాకీ ఆటగాళ్లకు వాల్ట్ మాన్స్ సూచించాడు. ఈసారి కప్ ను సాధించి భారత అభిమానుల ఆశలను నిజం చేస్తామన్నాడు. ఇప్పటివరకూ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ను ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు గెలిచి తొలి స్థానంలో ఉండగా, భారత జట్టు ఐదు సార్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. గతేడాది ఆస్ట్రేలియాను ఓడించిన న్యూజిలాండ్ కప్ ను సాధించింది. దీంతో ఆస్ట్రేలియా రన్నరప్ గా సరిపెట్టుకోగా, భారత్ కు మూడో స్థానం దక్కింది. అజ్లాన్ షా కప్లో భారత్తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి. -
భారత్ను గెలిపించిన దీపిక
కేప్ టౌన్: భారత మహిళల హాకీ జట్టు... దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1-0తో సఫారీలపై నెగ్గింది. టీమిండియా తరఫున దీపిక (55వ ని.లో) గోల్ చేసింది. ఆరంభంలో ఇరుజట్లు రక్షణాత్మకంగా ఆడుతూ పరస్పరం తమ ఆటతీరును అంచనా వేసుకున్నాయి. మ్యాచ్ మొత్తం మిడ్ఫీల్డ్లోనే సాగగా, రెండు జట్లు తమ డిఫెన్సివ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. దీంతో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్లో దూకుడును చూపెట్టినా... అవకాశాలను సృష్టించుకోవడంలో రెండు జట్లూ విఫలమయ్యాయి. చివరి క్వార్టర్లో భారత్ మరింత అటాకింగ్ చేయడంతో 55వ నిమిషంలో పెనాల్టీ రూపంలో తొలి అవకాశం లభించింది. దీన్ని దీపిక అద్భుతమైన గోల్గా మల్చడంతో విజయం భారత్ సొంతమైంది. -
భారత హాకీ జట్టు విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనను భారత హాకీ జట్టు విజయంతో ఆరంభించింది. శుక్రవారం కివీస్ ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్లో సర్దార్ సింగ్ సేన 3-1తో నెగ్గింది. ఆకాశ్దీప్ సింగ్, రమణ్దీప్ సింగ్, నికిన్ తిమ్మయ్య భారత్ తరఫున గోల్స్ సాధించారు. -
భారత్ క్లీన్స్వీప్
వాటిగినెస్ (ఫ్రాన్స్) : యూరోప్ పర్యటనలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు ఫ్రాన్స్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలి మ్యాచ్లో 2-0తో నెగ్గిన సర్దార్ సింగ్ బృందం... బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో 4-1తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిందర్ (14వ, 44వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మొహమ్మద్ ఆమిర్ ఖాన్ (30వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (52వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫ్రాన్స్ జట్టుకు బౌమ్గార్టెన్ (21వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత్ ఈనెల 10న స్పెయిన్తో మ్యాచ్ ఆడుతుంది. -
వరల్డ్ హాకీ లీగ్కు సౌందర్య, రజని
మార్చి 7 నుంచి టోర్నీ న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ లీగ్ రౌండ్-2లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల టీమిండియాకు మిడ్ఫీల్డర్ రీతూ రాణి నేతృత్వం వహిస్తుంది. దీపిక వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన గోల్కీపర్ రజని ఎతిమరుపు స్థానాన్ని దక్కించుకున్నారు. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో మార్చి 7 నుంచి 15 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పోలండ్, ఘనా, థాయ్లాండ్... గ్రూప్ ‘బి’లో మలేసియా, రష్యా, కజకిస్థాన్, సింగపూర్ జట్లు ఉన్నాయి. -
బెల్జియంను బోల్తా కొట్టించి...
సెమీస్లో భారత్ క్వార్టర్స్లో 4-2తో విజయం రేపు పాకిస్తాన్తో ‘ఢీ’ చాంపియన్స్ ట్రోఫీ భువనేశ్వర్: సరైన సమయంలో సత్తా చాటుకున్న భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 4-2 గోల్స్ తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ బెల్జియం జట్టును బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18వ నిమిషంలో), ఉతప్ప (27వ నిమిషంలో), ఆకాశ్దీప్ సింగ్ (41వ నిమిషంలో), ధరమ్వీర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టుకు ఫెలిక్స్ (12వ నిమిషంలో),డాకిర్ (18వ నిమిషంలో) ఒక్కో గోల్ను అందించారు. శనివారం జరిగే సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఈ ఏడాది బెల్జియంతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భారత్ సొంతగడ్డపై మాత్రం ఆ జట్టును హడలెత్తించింది. ఒకదశలో 0-2 గోల్స్తో వెనుకబడిన సర్దార్ సింగ్ బృందం ఆ తర్వాత జూలు విదిల్చింది. సమన్వయంతో కదులుతూ గోల్ చేసే అవకాశాలను సృష్టించింది. ఇదే జోరులో తొలుత స్కోరును 2-2వద్ద సమం చేయడంతోపాటు ఆ తర్వాత మరో రెండు గోల్స్ చేసి బెల్జియం ఆటను కట్టించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో పాకిస్తాన్ 4-2తో నెదర్లాండ్స్ను ఓడించగా... ఆస్ట్రేలియా 4-2తో అర్జెంటీనాపై, జర్మనీ 2-0తో ఇంగ్లండ్పై విజయం సాధించాయి. -
తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు
నిజామాబాద్ స్పోర్ట్స్: నేను పదమూడు సంవత్సరాలుగా హాకీ ఆడుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే క్రీడలకు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందుతుంది్ఱూఎఖఖీా అని అంతర్జాతీయ క్రీడా కారిణి యెండల సౌందర్య అన్నారు. బుధవారం నిజామాబాద్లోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.25లక్షల నగదు, 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ప్రకటించడంపై ఆమె సంతోషాన్ని ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తనను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లినట్లు సౌందర్య తెలిపారు. మాకు సీఎం 15 నిముషాల సమయం కేటాయించారు. నేను సాధించిన పతకాలు, మెడల్స్, చూపించగానే చాలా సంతోషంగా సీఎం ఫీలయ్యారు. ఇంతగా సాధించినావు గదా గత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదా అని బాధపడ్డారు. వెంటనే నాకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కేలా చేశారు. ముఖ్యమంత్రికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్కు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్లకు, తనకు గుర్తింపు ఇచ్చిన ప్రింట్, ఎల క్ట్రానిక్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సౌందర్య పేర్కొన్నారు. తనలాంటి క్రీడాకారులకు, ప్రతిభ ఉన్న వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువైందన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీయడానికి కోచ్లు అత్యవసరం అని అన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరును ప్రపంచ దేశాల్లో క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి వీలుంటుందన్నారు. తనకు సమైక్య రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు రాలేదని, కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అందించిందని సౌందర్య పునరుద్ఘాటించారు. క్రీడాకారులు కూడా ఎదైనా ఆటలో ప్రావీణ్యం సాధించడానికి కఠోర శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తాను భారత హాకీజట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్నాని సౌందర్య తెలిపారు. -
‘పసిడి’ ద్రాక్ష అందేనా!
కామన్వెల్త్ గేమ్స్లో భారత హాకీ జట్టు సత్తాకు పరీక్ష సాక్షి క్రీడావిభాగం ఘనమైన నేపథ్యం కలిగిన భారత పురుషుల హాకీ జట్టు దాదాపు అన్ని అంతర్జాతీయ మెగా ఈవెంట్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. అయితే ఈ జాబితాలో ఇప్పటిదాకా కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతకం మాత్రమే చేరలేదు. 84 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్రీడల్లో హాకీని తొలిసారి 1998లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు పర్యాయాల్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరుకొని రజత పతకంతో సంతృప్తి పడింది. క్రితంసారి 2010లో స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ఫైనల్కు చేరిన భారత్ 0-8 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. హాకీ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చాంపియన్గా నిలుస్తోన్న ఆస్ట్రేలియా (1998, 2002, 2006, 2010)ను కంగారెత్తించి అందని ద్రాక్షగా ఉన్న పసిడిని సొంతం చేసుకోవాలంటే భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని టీమిండియా సవాల్కు సిద్ధమై, స్వర్ణం సాధిస్తుందో లేక మళ్లీ రజతంతో సరిపెట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. సెంటిమెంట్... యాదృచ్ఛికమో మరేమిటోకానీ 1998 నుంచి 2010 వరకు ప్రతి కామన్వెల్త్ గేమ్స్లో ఆస్ట్రేలియాను మినహాయిస్తే మరో జట్టు ఒక్కోసారి మాత్రమే ఫైనల్కు చేరింది. 1998లో మలేసియా, 2002లో న్యూజిలాండ్, 2006లో పాకిస్థాన్, 2010లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ నేపథ్యంలో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్కు చేరుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘డ్రా’ అనుకూలం... జాతీయ ఒలింపిక్ సంఘంలో వివాదాల కారణంగా ఈసారి పాకిస్థాన్ హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్కు దూరంగా ఉంది. దాంతో భారత జట్టుకు ‘డ్రా’ అనుకూలమైంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మినహాయిస్తే... దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, వేల్స్ జట్లపై భారత్ నుంచి భారీ విజయాలు ఆశించవచ్చు. ఇక గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియా, కెనడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియాలలో రెండు జట్లు సెమీఫైనల్కు చేరుకోవడం ఖాయం. సెంటిమెంట్ను పక్కనబెడితే... స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుందనడంలో సందేహంలేదు. సమతూకంతో జట్టు ప్రపంచకప్లో మంచి ప్రదర్శన కనబరిచినా చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్లో ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా భారత బృందం పట్టుదలతో ఉంది. గోల్కీపర్ శ్రీజేష్ అద్భుత విన్యాసాలు, మిడ్ఫీల్డ్లో సర్దార్ సింగ్ అప్రమత్తత... ‘స్టార్ డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్పాల్ సింగ్ గురితప్పని షాట్లు... ఫార్వర్డ్ శ్రేణిలో గుర్విందర్ సింగ్ చాంది, డానిష్ ముజ్తబాల చేరికతో భారత్ సమతూకంతో కనిపిస్తోంది. మహిళల జట్టుపై ఆశలు భారత పురుషుల జట్టుతో సాధ్యంకానిది మహిళల జట్టు 2002లోనే చేసి చూపించింది. మాంచెస్టర్లో జరిగిన ఈ గేమ్స్లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది. 2006 మెల్బోర్న్ గేమ్స్లో రజతం నెగ్గింది. అయితే 2010 ఢిల్లీ గేమ్స్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి భారత మహిళల జట్టు నుంచి కనీసం కాంస్యం ఆశించవచ్చు. లీగ్ దశలో న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలపై నెగ్గితే భారత్కు సెమీఫైనల్ చేరే అవకాశముంది. భారత మ్యాచ్ల షెడ్యూల్ పురుషుల విభాగం జూలై 25: వేల్స్తో; జూలై 26: స్కాట్లాండ్తో; జూలై 29: ఆస్ట్రేలియాతో; జూలై 31: దక్షిణాఫ్రికాతో. మహిళల విభాగం జూలై 24: కెనడాతో; జూలై 27: న్యూజిలాండ్తో; జూలై 28: ట్రినిడాడ్ అండ్ టొబాగోతో; జూలై 30: దక్షిణాఫ్రికాతో. -
భారత్కు తొమ్మిదో స్థానం
ది హేగ్ (నెదర్లాండ్స్): టోర్నీ ఆరంభంలో అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు... ప్రపంచకప్లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. 9-10వ స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో టీమిండియా 3-0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ఈ విజయంతో గతేడాది ఆసియా కప్ ఫైనల్లో కొరియా చేతిలో ఎదురైన ఓటమికి సర్దార్ సింగ్ బృందం బదులు తీర్చుకుంది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ రెండు గోల్స్ (6, 50వ నిమిషాల్లో) చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. స్వదేశంలో జరిగిన 2010 ప్రపంచకప్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలువగా... ఈసారి ఒకస్థానం పడిపోయి తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడింది. నెదర్లాండ్స్కు టైటిల్ మహిళల విభాగంలో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2-1తో అమెరికాపై గెలిచింది. -
పరువు కోసం పోరాటం
నేడు దక్షిణ కొరియాతో భారత్ వర్గీకరణ పోరు ప్రపంచకప్ హాకీ మధ్యాహ్నం గం. 12.00 నుంచి టెన్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం ది హేగ్ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక ప్రపంచకప్లో వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత హాకీ జట్టు ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. తొమ్మిదో స్థానం కోసం నేడు జరగనున్న వర్గీకరణ మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో నాలుగు పరాజయాలు, ఒక గెలుపుతో భారత జట్టు నిరాశపరిస్తే... దక్షిణ కొరియా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇద్దరికి కీలకంగా మారింది. మరో మూడు నెలల్లో ఆసియా గేమ్స్ కూడా జరగనున్నాయి. ఇందులో మరోసారి కొరియాతో తలపడాల్సి ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే జట్టులో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. -
‘డ్రా’ చేసుకుంటే గొప్ప!
నేడు స్పెయిన్తో భారత్ ‘ఢీ’ హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత హాకీ జట్టు మూడో పోరుకు సిద్ధమైంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో పటిష్టమైన స్పెయిన్తో భారత్ తలపడనుంది. పాదరసంలాంటి కదలికలకు... చిన్న చిన్న పాస్లతో ప్రత్యర్థి రక్షణ వలయంలో దూసుకుపోవడంలో సిద్ధహస్తులైన స్పెయిన్ ఆటగాళ్లను టీమిండియా ఏమేరకు నిలువరిస్తుందనే అంశంపైనే సర్దార్ సింగ్ బృందం అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్లో 70వ నిమిషంలో... ఇంగ్లండ్తో జరిగిన పోటీలో 69వ నిమిషంలో గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం భారత జట్టు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే స్పెయిన్ను ‘డ్రా’తో నిలువరిస్తే గొప్ప అనుకోవాలి. రక్షణ శ్రేణిలో లోపాలు సరిదిద్దుకొని... పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చడంలో సఫలమైతే మాత్రం భారత్ నుంచి ఈ మ్యాచ్లో విజయాన్ని ఆశించవచ్చు. పొరపాట్లు పునరావృతం చేస్తే మాత్రం ‘హ్యాట్రిక్’ ఓటమి ఖాయమనుకోవాలి. -
భారత్... ఈసారైనా!
టాప్-6 లక్ష్యంగా బరిలోకి నేటి నుంచి హాకీ ప్రపంచకప్ బెల్జియంతో తొలిపోరు ది హేగ్ (నెదర్లాండ్స్): జాతీయ క్రీడకు పునర్ వైభవం తెచ్చేందుకు భారత హాకీ జట్టుకు మరో అవకాశం లభించింది. శనివారం మొదలయ్యే ప్రపంచకప్లో టాప్-6లో నిలువడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే ఇటీవల కాలంలో భారత హాకీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే... టోర్నీ ‘డ్రా’ వివరాలను పరిశీలిస్తే భారత్ తమ లక్ష్యాన్ని అందుకోవడం అంత సులువుకాదని తెలుస్తోంది. తొలి మ్యాచ్లో బెల్జియంతో పోటీపడనున్న సర్దార్ సింగ్ బృందం చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉంటేనే అనుకూలమైన ఫలితం వస్తుంది. గత మూడేళ్ల కాలంలో బెల్జియంతో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో భారత్ కేవలం ఒక మ్యాచ్లో నెగ్గి, మిగతా మూడింటిలో ఓటమిపాలైంది. భారత్ ఉన్న గ్రూప్లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్పెయిన్, మలేసియా జట్లున్నాయి. మలేసియాను మినహాయిస్తే మిగతా జట్లపై భారత్ నెగ్గాలన్నా, ‘డ్రా’ చేసుకోవాలన్నా విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 12 ప్రపంచకప్లలో పాల్గొన్న భారత్ 1975లో విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఏ ప్రపంచకప్లోనూ భారత్ సెమీఫైనల్ చేరుకోలేకపోయింది. 1994లో అత్యుత్తమంగా ఐదో స్థానాన్ని సంపాదించింది. స్వదేశంలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రపంచకప్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ ప్రపంచకప్లో ఆడిన నలుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ‘తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. విజయంతో బోణీ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. బెల్జియం స్టార్ డ్రాగ్ ఫ్లికర్ టిమ్ బూన్ను నిలువరిస్తే భారత్కు సగం విజయం దక్కినట్టే’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ‘టాప్-6లో నిలువాలనే లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నాం. దానికంటే మంచి ప్రదర్శన చేస్తే అది అద్భుతం కాకపోయినా మా కల నిజమైందనే అనుకుంటాం’ అని చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ అన్నారు. క్రికెటర్ల మద్దతు ప్రపంచకప్లో భారత్ రాణించాలని కోరుతూ ‘ట్విట్టర్’ ద్వారా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ధ్యాన్చంద్ స్టేడియంలో భారత జట్టు సభ్యులను సచిన్ టెండూల్కర్ కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: భారత్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, మలేసియా, స్పెయిన్ గ్రూప్ ‘బి’: నెదర్లాండ్స్, జర్మనీ, న్యూజిలాండ్, కొరియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా భారత్ మ్యాచ్ల షెడ్యూల్ (భారత కాలమానం) మే 31: బెల్జియంతో రా. గం. 7.30 నుంచి జూన్ 2: ఇంగ్లండ్తో రా. గం. 7.30 నుంచి జూన్ 5: స్పెయిన్తో రా. గం. 9.00 నుంచి జూన్ 7: మలేసియాతో సా. గం. 6.00 నుంచి జూన్ 9: ఆస్ట్రేలియాతో సా. గం. 4.30 నుంచి నోట్: అన్ని మ్యాచ్లు టెన్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 85 మ్యాచ్లు ఆడింది. 37 మ్యాచ్లో గెలిచి, 38 మ్యాచ్లో ఓడిపోయింది. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఓవరాల్గా భారత్ తరఫున ముగ్గురు క్రీడాకారులు (మొహిందర్ సింగ్, రాజేందర్ సింగ్, ముకేశ్ కుమార్) హ్యాట్రిక్ నమోదు చేశారు. -
హాకీ ప్రపంచకప్లో అద్భుతాలు సృష్టిస్తాం
ఓల్ట్మన్స్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు ఏ టోర్నీలో ఏ మేరకు రాణించగలదన్న విషయంపై ఇప్పటిదాకా హాకీ ఇండియా (హెచ్ఐ)కే ఎప్పుడూ అంచనాల్లేవు. కానీ, జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలాంట్ ఓల్ట్మన్స్ మాత్రం ఈసారి ప్రపంచకప్లో అద్భుతాలు సృష్టిస్తామని చెబుతున్నాడు. ఈ నెల 31 నుంచి నెదర్లాండ్స్లోని ది హేగ్లో ప్రపంచకప్ జరగనుండగా, భారత జట్టు తొలి ఎనిమిది స్థానాల్లో నిలిస్తే చాలని కోచ్ టెర్రీ వాల్ష్ ఆశిస్తున్నాడు. అయితే ఓల్ట్మన్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే, అనూహ్యమైన ఫలితాలు సాధిస్తామంటున్నాడు. గతంలోలా మ్యాచ్ చివరి దశలో చేతులెత్తేయకుండా గోల్స్ సాధించగలిగితే అది పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నాడు. ‘కుర్రాళ్లు వారి ఆటతీరును మెరుగుపరచుకోవడంపై, ఫిట్నెస్పై ఎంతో శ్రమిస్తున్నారు. అయితే దాన్ని మ్యాచ్లో అమల్లో పెడితే తప్పక మంచి ఫలితాలొస్తాయి’ అని ఓల్ట్మన్స్ అన్నాడు. అయితే జట్టు కచ్చితంగా సెమీఫైనల్ దాకా చేరుతుందని చెప్పడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని, ఆరంభంలో ఓడితే దాని ప్రభావం ఇతర మ్యాచ్లపై పడుతుందని తెలిపాడు. 7, 8 స్థానాల్లో నిలవాలన్నా కనీసం రెండు బలమైన జట్లపై గెలవాల్సి ఉంటుందన్నాడు. 2010 ప్రపంచకప్లో 20 జట్లు పాల్గొన్న పోటీల్లో భారత్ 12వ స్థానంలో నిలిచింది. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆర్మూర్ టౌన్, న్యూస్లైన్: పట్టణంలోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో గురువారం అండర్-21 జూనియర్ బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వి హరీష్, బి సుధీర్, కె ఉదేశ్, ఎన్ శ్రీకాంత్, కె రవి, వి వంశీ, కె ప్రవీణ్, కె యోగి, యు శ్రీకాంత్, జి బాలాజీ రెడ్డి, బి సాయి తేజ, వి సుజిన్, ఎన్ సాయి చరణ్, కె రాహూల్, ఎం అజయ్, కెబి హరత్లు అండర్-21 బాలుర జట్టుకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 22, 23, 24 తేదీల్లో అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించనున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా తరపున ప్రతినిధ్యం వహించనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి కె అంజు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ నర్సిం హారెడ్డి, కార్యదర్శి రమణ, టీచర్లు అభినందించారు. -
ఓటమితో మొదలు...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై కొత్త ఏడాదిని భారత హాకీ జట్టు పరాజయంతో ప్రారంభించింది. శుక్రవారం మొదలైన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఆడమ్ డిక్సన్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. కొత్త విదేశీ కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన భారత్కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్ తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్స్లో రెండింటిని లక్ష్యానికి చేర్చింది. ఎదురుదాడుల్లో పదును లోపించడం.. పెనాల్టీ కార్నర్లు వృథా చేయడం... బలహీనమైన రక్షణపంక్తితో భారత జట్టు ఈ మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయింది. ఆట 59వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. అయితే గోల్ పోస్ట్ పక్క నుంచి భారత ఆటగాడు నెట్టిన బంతిని నిబంధనలకు విరుద్ధంగా ‘డి’ సర్కిల్ లోపలే నిలువరించారని ఇంగ్లండ్ ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఊహించినట్టే భారత ఆటగాళ్లు బంతిని ‘డి’ సర్కిల్ లోపలే ఆపడంతో రిఫరీ ఈ గోల్ను రద్దు చేశారు. తొలి రోజే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో జర్మనీ 6-1తో న్యూజిలాండ్పై; అర్జెంటీనా 5-2తో నెదర్లాండ్స్పై; ఆస్ట్రేలియా 3-2తో బెల్జియంపై విజయం సాధించాయి. శనివారం జరిగే లీగ్ మ్యాచ్ల్లో బెల్జియంతో అర్జెంటీనా; నెదర్లాండ్స్తో ఆస్ట్రేలియా; ఇంగ్లండ్తో జర్మనీ; న్యూజిలాండ్తో భారత్ తలపడతాయి. -
ప్రపంచకప్కు భారత హాకీ జట్టు అర్హత
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి భారత పురుషుల హాకీ జట్టు అర్హత సాధించింది. ఈమేరకు ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధికారికంగా ప్రకటన చేసింది. మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆసియా చాంపియన్స్ట్రోఫీలో రెండో ఓటమి న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జూనియర్ ఆటగాళ్లతో ఆడుతున్న జట్టుకు ఈ ట్రోఫీలో రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జపాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో ఓడింది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ 12వ నిమిషంలో గోల్ చేశాడు. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లోనూ భారత జట్టు 0-2 తేడాతో చైనా చేతిలో ఓడింది. వచ్చే నెలలో జరిగే జూనియర్ ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని జట్టులోని 18 మంది ఆటగాళ్లలో 15 మంది జూనియర్స్ను ఎంపిక చేశారు. మహిళల హాకీ జట్టు విజయం పూనమ్ రాణి రెండు గోల్స్తో రాణించడంతో ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. తమకన్నా మెరుగైన ర్యాంకింగ్లో ఉన్న చైనాను 4-2తో కంగుతినిపించింది. భారత్ తరఫున రాణి (8వ ని, 59వ .), అమన్దీప్ కౌర్ (13వ ని.), వందన (61వ ని.) గోల్స్ చేశారు.