icc women cricket world cup 2022
-
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మహిళా క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ రాచెల్ హేన్స్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కరాచీ వేదికగా జరిగిన టెస్టు సిరీస్లో బాబర్ ఆజమ్ రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా(ఆసీస్ బ్యాటర్), అబ్దుల్లా షఫీక్ తర్వాతి స్థానంలో (టాప్-3 రన్ స్కోరర్) నిలిచాడు. ఈ సిరీస్లో మొత్తంగా ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. The crowd cheers, the lion roars. @babarazam258 owns the day. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ndM0RNWPTG — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 రాచెల్ అద్బుతం! ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ రాచెల్ హేన్స్ పాత్ర కీలకం. మార్చి నెలలో ఆమె సాధంచిన మొత్తం పరుగుల సంఖ్య 429 పరుగులు. ఇంగ్లండ్తో మ్యాచ్లో రాచెల్ చేసిన క్లాసీ సెంచరీ(130 పరుగులు) అన్నింటికంటే హైలైట్గా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మార్చి నెలకు గానూ ఆసీస్ స్టార్ అలిస్సా హేలీని, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్డ్లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్నారు. నిలకడైన ఆట తీరుతో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఆ సమయంలో పూర్తి నిరాశలో కూరుకుపోయా'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్ను మరోసారి విజేతగా నిలుపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. రోహిత్ శర్మను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంటర్య్వూ చేసింది. కాగా ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు జెమిమా రోడ్రిగ్స్ టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు. తాను కచ్చితంగా జట్టులో ఉంటానని భావించిన రోడ్రిగ్స్కు భంగపాటే ఎదురైంది. ''నేను మహిళల వన్డే వరల్డ్కప్కు ఎంపిక కాలేదు. అది నన్ను బాధించింది. కానీ ఆ బాధ నాకంటే ముందు మీరు అనుభవించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?'' అని రోడ్రిగ్స్ ప్రశ్నించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''సరిగ్గా 11 ఏళ్ల క్రితం నాకు ఇలాగే జరిగింది. 2011 వన్డే ప్రపంచకప్కు ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా. విషయం తెలియగానే నిరాశలో కూరుకుపోయాను. డ్రెస్సింగ్రూమ్లో ఒంటరిగా ఉన్న నేను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు నా వయసు 23.. 24 ఏళ్లే అనుకుంటా. మంచి భవిష్యత్తు ముందున్న తరుణంలో ఇలా బాధపడితే ప్రయోజనం లేదని అనుకున్నా. వెంటనే 2015 వన్డే వరల్డ్కప్ సన్నాహకాలకు సిద్దమయ్యా.'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Jemimah Jessica Rodrigues (@jemimahrodrigues) -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
అప్పుడు 75.. ఇప్పుడు 170 పరుగులు.. భర్త ఉంటే చాలు.. ‘తగ్గేదేలే..!’
మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022 Final: వరల్డ్కప్ ఫైనల్కు రిఫరీగా ఆంధ్రప్రదేశ్ మహిళ
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- క్రైస్ట్చర్చ్లో ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్కు భారత్కు చెందిన జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మి గతంలోనూ ఇలాంటి పాత్ర పోషించారు. 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్ లీగ్–2 మ్యాచ్లకు ఆమె మ్యాచ్ రిఫరీగా సేవలందించారు ఇక ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుకు రిఫరీగా సేవలు అందించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్-2022 ఫైనల్కు ఫీల్డ్ అంపైర్లుగా లారెన్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), థర్డ్ అంపైర్ (టీవీ)గా జాక్వెలిన్ (వెస్టిండీస్) వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో నలుగురు మహిళలు ఒకేసారి భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తూ భాగం కావడం చరిత్రలో ఇదే తొలిసారి. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: అదరగొట్టిన వ్యాట్.. 6 వికెట్లతో రాణించిన సోఫీ.. ఆసీస్తో పోరుకు సై
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వరల్డ్కప్-2022 తుదిపోరుకు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ అర్హత సాధించింది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డా అవరోధాలు అధిగమించి ఫైనల్కు చేరుకుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి తుదిమెట్టుపై నిలిచింది. 137 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరకు సిద్ధమైంది. అదరగొట్టిన వ్యాట్.. రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రంమలో ఓపెనర్ టామీ బీమౌంట్(7) ఆదిలోనే అవుట్ కాగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హీథర్నైట్ (19 బంతుల్లో ఒక పరుగు)సైతం ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 125 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 129 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. మరో బ్యాటర్ డంక్లే కూడా అర్ధ శతకం(50 పరుగులు)తో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ మహిళా జట్టు 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు లిజెలీ(2), లారా వొల్వార్డ్(0) పూర్తిగా నిరాశపరిచారు. వన్డౌన్లో వచ్చిన లారా గుడాల్, కెప్టెన్ సునే లాస్ వరుసగా 28, 21 పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) వరుసగా వికెట్లు తీస్తూ చెలరేగిపోయారు. ముఖ్యంగా సోఫీ ఎక్లెస్టోన్ 8 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ విజయం ఖారారైంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీకి ఆరు, అన్యాకు రెండు, కేట్ క్రాస్కు ఒకటి, చర్లోట్ డీన్కు ఒక వికెట్ దక్కాయి. ఇక తన సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డానియెల్ వ్యాట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 293/8 (50) దక్షిణాఫ్రికా- 156 (38) చదవండి: IPL 2022: ప్చ్.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్లు చూస్తుంటే చిరాగ్గా ఉంది! నాకు ఛాన్స్ వస్తే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2022: అద్భుత సెంచరీతో మెరిసిన డానియెల్ వ్యాట్.. ఫైనల్లో ఇంగ్లండ్
Update: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 137 పరుగులతేడాతో విజయం సాధించింది. డేనియల్ వ్యాట్ అద్భుత ఇన్నింగ్స్తో తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ICC Women World Cup 2022 Eng Vs SA: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ డానియెల్ వ్యాట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 125 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటింది. క్రైస్చర్చ్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో సెంచరీతో మెరిసింది. కాగా ప్రపంచకప్-2022 రెండో సైమీ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందులో భాగంగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓపెనర్ టామీ బీమౌంట్(7) వికెట్ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ హీథర్నైట్ 19 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో డానియెల్ వ్యాట్ పట్టుదలగా నిలబడింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఇక వ్యాట్కు తోడు సోఫియా డంక్లే 60 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్కు మూడు, మరిజానే క్యాప్నకు రెండు, అయబోంగా ఖాకాకు ఒకటి, మసబాట క్లాస్కు రెండు వికెట్లు దక్కాయి. చదవండి: RCB Vs KKR: ఒక్కసారి మైదానంలోకి దిగితే అంతే.. ఆ సెలబ్రేషన్స్ అందుకే: హసరంగ -
బ్యాట్తోనే అనుకుంటే.. స్టన్నింగ్ క్యాచ్తోనూ మెరిసింది
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ ఏడోసారి టైటిల్ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాటింగ్లో బెత్ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్లో మెరిసిన బెత్ మూనీ.. అనంతరం ఫీల్డింగ్లోనూ సత్తా చాటింది. వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఉమెన్స్కు ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ రషదా విలియమ్స్ను.. మేఘన్ స్కట్డకౌట్గా పెవిలియన్గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్ అయింది మాత్రం బెత్ మూనీనే. విలియమ్స్.. కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఉన్న బెత్ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్డౌన్లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్కు Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్న్యూస్ View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2022: వెస్టిండీస్ను చిత్తు చేసి.. భారీ విజయంతో వరల్డ్కప్ ఫైనల్కు
ICC women World Cup 2021: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్.. సెమీస్లోనూ జయభేరి మోగించింది. అజేయ రికార్డును కొనసాగిస్తూ వెస్టిండీస్ను చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే, వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్డౌన్లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. 157 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 తొలి సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు ఆస్ట్రేలియా- 305/3 (45) వెస్టిండీస్- 148 (37) చదవండి: SRH Vs RR: 8 కోట్లు పెట్టి కొన్నది ఎనిమిదో స్థానంలో ఆడించడానికా? పూరన్పై మీకు నమ్మకం.. కానీ View this post on Instagram A post shared by ICC (@icc) -
Women World Cup 2022: సెమీస్ కూడా చేరలేదు.. హెడ్కోచ్ పదవికి రాజీనామా!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 టోర్నీలో న్యూజిలాండ్ వైఫల్యం నేపథ్యంలో ఆ జట్టు హెడ్కోచ్ బాబ్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైట్ఫెర్న్స్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాగా వుమెన్ వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్.. ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికే పరిమితమైంది. సోఫీ డివైన్ సారథ్యంలోని వైట్ఫెర్న్స్ సెమీస్ చేరకుండానే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్లో జట్టు పరాభవానికి బాధ్యత వహిస్తూ బాబ్ కార్టర్ తన హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఓటమి బాధించిందని, తను శిక్షణలో తమ జట్టు పలు విభాగాల్లో మెరుగైందని పేర్కొన్నారు. కాగా కార్టర్ ఇకపై న్యూజిలాండ్ క్రికెట్(పురుషులు, మహిళలు)కు హై పర్ఫామెన్స్ కోచ్గా వ్యవహరించనున్నారు. చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
వెస్టిండీస్తో సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరగున్న తొలి సెమీఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా వెస్టిండీస్తో సెమీఫైనల్కు దూరమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో గాయపడిన పెర్రీ ఇంకా కోలులేనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో వెన్ను నొప్పి కారణంగా మూడు ఓవర్లు వేసిన తర్వాత ఆమె మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో కీలకమైన సెమీఫైనల్కు పెర్రీ దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ వెల్లడించింది. "దురదృష్టవశాత్తూ పెర్రీ సేవలను సెమీఫైనల్లో కోల్పోతున్నాము. మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ఆమె ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం పెర్రీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. పెర్రీ స్థానంలో డెత్ బౌలర్ను జట్టులోకి తీసుకువస్తాం" అని లానింగ్ పేర్కింది. ఇక వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 29 న జరగనుంది. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), రాచెల్ హేన్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్) బెత్ మూనీ, తహ్లియా మెక్గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాస్సెన్ అలనా కింగ్, మేగాన్ స్కాట్, డార్సీ బ్రౌన్ చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
ఉత్కంఠభరితమైన దృశ్యాలు..ఊహకందని భావోద్వేగాలు!
-
అరుదైన దృశ్యాలు.. ఊహకందని భావోద్వేగాలు!
అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది. క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్లో రూమ్లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!) ఓడిపోయామనుకున్న మ్యాచ్లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..) -
ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli Message: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్తాన్ చేతిలో కనీవినీ ఎరుగని ఓటమి.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణ.. అప్పటి టీమిండయా సారథి విరాట్ కోహ్లికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తాజాగా ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్కు ఇలాంటి ఘటనే ఎదురైంది. మెగా ఈవెంట్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి మ్యాచ్లో ఆఖరి బంతి వరకు పట్టుదలగా పోరాడినా ఫలితం లేకపోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన వృథాగా మిగిలిపోవడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. అయితే, గెలుపు కోసం వారు పోరాడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సైతం మిథాలీ సేనకు మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు.. ‘‘గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ అలా జరుగలేదు. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం అమితంగా బాధిస్తుంది. అయినా, మీరు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. ఓటమిని తట్టుకోవడం కష్టమేనని , అయితే గెలిచేందుకు చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(88), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (41 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్ ఆడినా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI — IndianPremierLeague (@IPL) March 27, 2022 చదవండి: IPL 2022 MI Vs DC: 6,1,6,4,1,6.. ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అదే.. అందుకే ఓడిపోయింది! Always tough to bow out of a tournament you aim to win but our women's team can hold their heads high. You gave it your all and we are proud of you. 🙏🏻🇮🇳 — Virat Kohli (@imVkohli) March 28, 2022 -
World Cup 2022: ‘హమ్మయ్య భారత్ ఓడిపోయింది’.. వెస్టిండీస్ సంబరాలు.. వైరల్
ICC Women World Cup 2022: తెలిసో తెలియకో ఒకరికి ఎదురైన పరాభవం మరొకరి పాలిట వరమవుతుంది. ఒకరి బాధ పరోక్షంగా మరొకరి సంతోషానికి కారణం అవుతుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ భారత్, వెస్టిండీస్ జట్లకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. మెగా ఈవెంట్ సెమీ ఫైనల్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళా జట్టు ఆఖరి నిమిషంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రిక్త హస్తాలతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నో బాల్ రూపంలో దురదృష్టం వెంటాడంతో మిథాలీ సేనకు భంగపాటు తప్పలేదు. దీంతో భారత జట్టు బాధతో వెనుదిరగగా.. వెస్టిండీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన దక్షిణాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. మిథాలీ సేన ఓటమి పాలు కావడంతో ఎగిరి గంతేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో విండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4 అంటే సెమీస్ చేరే క్రమంలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్తో, భారత్ దక్షిణాఫ్రికాతో తలపడ్డాయి. ఆదివారం నాటి ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ విజయం సాధించి సెమీస్ చేరగా.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఫలితంగా ఇంగ్లండ్తో పాటు వెస్టిండీస్ సెమీ ఫైనల్లో నిలిచింది. ఇదే వారి ఆనందానికి కారణమైంది. ఈ క్రమంలో వారి సంబరాలు అంబరాన్నంటాయి. హమ్మయ్య భారత్ ఓడిపోయిందన్నట్లుగా వారు సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అంతా నువ్వే చేశావు.. కానీ ఎందుకిలా? మా గుండె పగిలింది!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్ టోర్నీ-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత 48 పరుగులు చేసి మిథాలీ సేన భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆమె.. ‘బౌలర్’గానూ అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి బౌలింగ్ వేసిన హర్మన్.. రెండు వికెట్లు తీసింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేకాదు.. దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతున్న వేళ ఓపెనర్ లిజెలీ లీని రనౌట్ రూపంలో వెనక్కి పంపి భారత్కు శుభారంభం అందించింది. అదే విధంగా మరో రెండు రనౌట్లలోనూ భాగమైంది. సెమీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఇలా శాయశక్తులా కృషి చేసింది. కానీ సానుకూల ఫలితం రాలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ.. దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విజయం సాధించి మిథాలీ సేన సెమీస్ చేరకుండా అడ్డుకుంది. దీంతో హర్మన్ ‘హీరోచిత’ పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో హర్మన్ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ తీసినపుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘నీ ఆట తీరు పట్ల మాకెంతో గర్వంగా ఉంది. ఆఖరి వరకు మ్యాచ్ను తీసుకురాగలిగావు. అంతా నువ్వే చేశావు. కానీ దురదృష్టం వెంటాడింది. ఏదేమైనా ఆట పట్ల నీకున్న అంకితభావం అమోఘం. మరేం పర్లేదు హర్మన్.. ఓడినా మీరు మా మనసులు గెలిచారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలై భారత్ వరల్డ్కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. After that wicket, Harman was in tears and was consoled by Smriti. This is what it meant to her.#CWC22 #CricketTwitter pic.twitter.com/rrKJxRRGew — Krithika (@krithika0808) March 27, 2022 -
World Cup 2022: భారత్ కొంపముంచిన నోబాల్.. లక్కీగా వెస్టిండీస్ సెమీస్లోకి!
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్ ప్రయాణం ముగిసింది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మిథాలీ సేన 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గత వరల్డ్కప్ రన్నరప్ భారత మహిళా జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 274 పరుగుల భారీ స్కోరు చేసినా దురదృష్టం వెంటాడింది. ఇక ఆదిలో దక్షిణాఫ్రికా వికెట్ తీసిన ఆనందం అంతలోనే ఆవిరైపోగా.. 26వ ఓవర్ తర్వాత వికెట్లు పడటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా 48 పరుగులతో రాణించిన భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బంతితోనూ అద్భుతం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా 8 ఓవర్లు బౌలింగ్ వేసిన హర్మన్ 2 వికెట్లు కూల్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేగాక మూడు రనౌట్లలో భాగమైంది. ఆమె అద్భుత ప్రదర్శనతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, చివర్లో దీప్తి శర్మ నోబాల్ భారత్ కొంపముంచింది. ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నన్ డు ప్రీజ్ సింగిల్ తీసి మిథాలీ సేన సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి వెస్టిండీస్కు వరంగా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా అంతకు ముందు గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విజయంతో ఇంగ్లండ్ గెలుపొంది సెమీస్ చేరింది. విండీస్ను వెనక్కినెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన కారణంగా టాప్-4లోకి చేరలేకపోయింది. దీంతో మిథాలీ సేన సెమీస్ నుంచి నిష్క్రమించగా.. విండీస్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టులో ఆనందాలు వెల్లివిరిశాయి. చదవండి: IPL 2022: శ్రేయస్ కెప్టెన్సీ భేష్.. అతడిని తుదిజట్టులోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్కప్: ఆఖరి వరకు పోరాడి ఓడిన మిథాలీ సేన(ఫొటోలు)
-
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. తప్పని ఓటమి.. టోర్నీ నుంచి భారత్ అవుట్
ICC Women World Cup 2022 Ind W Vs Sa W: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్కు భంగపాటు తప్పలేదు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మిథాలీ సేనకు నిరాశే ఎదురైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో భారత మహిళా జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వరకు పోరాడిన మిథాలీ సేన పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి శుభారంభం న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ 48 పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మెరుగైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్ రెండు, అయబోంగా ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్ రెండు వికెట్లు పడగొట్టారు. నరాలు తెగే ఉత్కంఠ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెలీ లీను హర్మన్ప్రీత్ కౌర్ రనౌట్ చేయడంతో భారత్కు మంచి బ్రేక్ వచ్చింది. కానీ మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ 80 పరుగులు సాధించి పటిష్ట పునాది వేసింది. వన్డౌన్లో వచ్చిన లారా గుడాల్ సైతం 49 పరుగులు సాధించగా.. కీలక సమయంలో మిగ్నన్డు ప్రీజ్ 52 పరుగులతో రాణించి అజేయంగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖరికి మరోవైపు.. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో తొలిసారి బౌలింగ్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ వికెట్లు తీస్తూ.. రనౌట్లలో భాగం కావడం ముచ్చటగొలిపింది. హర్మన్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు భారత్ పోరాడగలిగింది. అయితే, 49.5వ ఓవర్లో దీప్తి శర్మ నోబాల్ వేయడంతో భారత్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతికి డు ప్రీజ్ సింగిల్ తీయడంతో భారత్ పరాజయం ఖరారైంది. దీంతో టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్కోర్లు: ఇండియా- 274/7 (50) దక్షిణాఫ్రికా- 275/7 (50) View this post on Instagram A post shared by ICC (@icc) -
డివిలియర్స్ను గుర్తు చేస్తూ.. అద్భుతమైన షాట్ ఆడిన భారత ఓపెనర్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం. View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్ను చిత్తు చేసి.. సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ఇక భారత్!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్కు చేరింది. బంగ్లాదేశ్పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ హీథర్నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్తో పాటు టాప్-4లో నిలుస్తుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022 ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 234/6 (50) బంగ్లాదేశ్- 134 (48) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం..
Update: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో మిథాలీ సేన ప్రయాణం ముగిసింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. కాగా క్రైస్ట్చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ 48 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్కు రెండు వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
India Vs South Africa: ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఓటమి.. వరల్డ్కప్ నుంచి ఔట్
-
ఓటమితో ముగించిన పాకిస్తాన్.. కేవలం ఒక్క మ్యాచ్లో!
మహిళల వన్డే ప్రపంచకప్ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 71 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ బ్యాటర్లలో నిదా ధార్(50), బిస్మా మరూఫ్(38) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక న్యూజిలాండ్ బౌలర్ హన్నా రోవ్ ఐదు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ను దెబ్బతీసింది. అదేవిధంగా ఫ్రాన్సిస్ మాకే రెండు వికెట్లు, రోజ్మేరీ మెయిర్, కేర్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో బేట్స్ 126 పరుగులతో రాణించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా ధార్ మూడు వికెట్లు, ఫాతిమా, ఆమీన్ చెరో వికెట్ సాధించారు. కాగా ప్రపంచకప్లో ఆడిన 7 మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఒకే ఒకే మ్యాచ్లో విజయం సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్ కూడా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2022: తొలి సమరానికి సై.. చెన్నైపై కోల్కతా ప్రతీకారం తీర్చుకుంటుందా! -
World Cup 2022: వర్షం పడితేనే.. కానీ అలా జరుగలేదు..
Update: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 నుంచి మిథాలీ సేన సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు మరో రెండు స్ధానాల కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం(మార్చి 28) క్రైస్ట్చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు చావోరేవో తేల్చుకోనుంది. మరోవైపు ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఆదివారం(మార్చి 27) బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే బంగ్లాదేశ్పై ఇంగ్లండ్ విజయం లాంఛనమే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును బంగ్లాదేశ్ వంటి పసి కూన ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి దక్షిణాఫ్రికాపై భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్కు చేరుతుంది. ఒకవేళ ఓటమి చెందితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఎందుకంటే 7 పాయింట్లతో వెస్టిండీస్ సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. మరోవైపు రానున్న మూడు రోజులు పాటు క్రైస్ట్చర్చ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. ఒక వేళ దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లుకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో భారత్ జట్టు 7 పాయింట్లతో విండీస్తో సమంగా నిలుస్తుంది. అయితే వెస్టిండీస్(-0.890) రన్రేట్ కంటే భారత్(+0.768) మెరుగ్గా ఉంది. దీంతో భారత్ సెమీస్కు చేరుకుంటుంది. ఇక గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. భారత్ 6 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది. మరోవైపు శుక్రవారం(మార్చి 25)న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి అజేయ రికార్డును కొనసాగించి అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది. చదవండి: World Cup 2022: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన ఆసీస్.. ఏడింటికి ఏడు గెలిచి.. అజేయ రికార్డుతో -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్డౌన్లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
సెమీ ఫైనల్కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ చేరాలంటే!
వెల్లింగ్టన్: మహిళల వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్కు అర్హత సాధించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గురువారం వెస్టిండీస్తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడం ఆ జట్టుకు మేలు చేసింది. వాన వల్ల మ్యాచ్కు 26 ఓవర్లకు కుదించగా ఒక దశలో సఫారీ స్కోరు 22/4 వద్ద నిలిచింది. ఆట ఆగిపోయే సమయానికి ఆ జట్టు 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 61 పరుగులు చేసింది. మళ్లీ వర్షం కురవడంతో ఇక మ్యాచ్ తిరిగి మొదలయ్యే అవకాశమే రాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మెగా ఈవెంట్లో రద్దయిన మ్యాచ్ ఇదొ క్కటే! దీని వల్ల 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా వెస్టిండీస్ 7 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంగ్లండ్ సునాయాస విజయం క్రైస్ట్చర్చ్: ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు పాక్పై సునాయాస విజయంతో సెమీస్ వైపు అడుగులేస్తోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై జయభేరి మోగించింది. మొదట పాక్ 41.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సీమర్ క్యాథరిన్ బ్రంట్ (3/17), స్పిన్నర్ సోఫీ (3/18) పాక్ ఇన్నింగ్స్ను కూల్చేశారు. వీళ్లిద్దరి దెబ్బకు... ఓపెనర్ సిద్రా అమీన్ (32; 4 ఫోర్లు), సిద్రా నవాజ్ (23; 1 ఫోర్) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 107 పరుగులతో ఛేదించింది. ఓపెనర్ డానీ వ్యాట్ (76 నాటౌట్; 11 ఫోర్లు) కెప్టెన్ హీథర్ నైట్ (24 నాటౌట్) రాణించారు. తప్పనిసరిగా గెలవాల్సిందే! భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిథాలీ సేన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. సఫారీని ఓడిస్తే వెస్టిండీస్ (7)ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో జట్టు ముందంజ వేస్తుంది. ఇంగ్లండ్ ఖాతాలో కూడా 6 పాయింట్లే ఉన్నప్పటికీ వారికి ఆఖరి పోరులో ఎదురయ్యేది కూన బంగ్లాదేశ్ కావడంతో ఇంగ్లండ్కూ మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు మ్యాచ్లు ఒకే రోజు ఉన్నాయి. అయితే మన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే అప్పుడు భారత్, విండీస్ ఖాతాలో 7 పాయింట్లుంటాయి. అప్పుడు విండీస్కంటే మెరుగైన రన్రేట్ ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీస్ చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మన జట్టు పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. చదవండి: World Cup 2022: భారత్కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! -
'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం పాకిస్తాన్, ఇంగ్లండ్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ బౌలర్ కేథరిన్ బ్రంట్ మ్యాచ్లో సూపర్ బంతితో మెరిసింది. పాక్ బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచిన అమీన్ను ఔట్ చేసిన విధానం అద్బుతమనే చెప్పాలి. ఇన్నింగ్స్ 25వ ఓవర్లో మూడో బంతిని బ్రంట్ మంచి లైన్ అండ్ లెంగ్త్తో విసిరింది. క్రీజులో ఉన్న అమీన్ బంతిని డిఫెన్స్ చేయడంలో విఫలమైంది. అంతే బ్యాట్కు తాకిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని మిడిల్స్టంప్ను ఎగురగొట్టింది. ఇలాంటి బంతులను క్రికెట్ బాషలో 'జప్ఫా' అని పిలుస్తారు. జప్ఫా అంటే బ్యాట్స్మన్ ఆడే వీలు కూడా లేకుండా బౌల్డ్ చేయడమే దీనర్థం. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తా్న్ 41.3 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. పాక్ ఓపెనర్ అమీన్ 32 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచింది. ఇంగ్లీష్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, ఎకిల్స్టోన్లు చెరో మూడు వికెట్లు తీయగా.. కేట్ క్రాస్, హెథర్నైట్లు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం 106 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేనియల్ వ్యాట్ 76 నాటౌట్, హెథర్నైట్ 24 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించారు. చదవండి: MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్గా ముగిస్తే బాగుండేది! View this post on Instagram A post shared by ICC (@icc) -
‘టీమిండియా’కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!
ICC Women World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. వర్షం కారణంగా వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు కావడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ రద్దు కావడంతో విండీస్- ప్రొటిస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగు పెట్టగా, విండీస్ 7 పాయింట్లతో మూడో స్ధానానికి చేరుకుంది. ఇక భారత్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి పడిపోయింది. మరోవైపు పాకిస్తాన్పై ఘన విజయంతో ఇంగ్లండ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. దీంతో భారత్కు దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. సెమీఫైనల్స్కు భారత్ అర్హత సాధించాలంటే ఆదివారం(మార్చి 27) జరుగనున్న తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను భారత్ కచ్చితంగా ఓడించాలి. అప్పుడు 8 పాయింట్లతో భారత్ మూడో స్ధానానికి చేరుకుంటుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అదే విధంగా ఇంగ్లండ్ కూడా తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధిస్తే మూడో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇంగ్లండ్, భారత్ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్లో నిలుస్తాయి. ఒకవేళ అనూహ్యంగా బంగ్లా చేతిలో ఇంగ్లండ్ ఓటమి చెంది, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ కూడా ఓటమి పాలైతే రన్రేట్ కీలకం కానుంది. మరోవైపు న్యూజిలాండ్ శనివారం బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధిస్తే.. భారత్, ఇంగ్లండ్తో పోటీపడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో ఉంది. చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్కప్ సూపర్ లీగ్ టాప్లో బంగ్లాదేశ్! టీమిండియా ఎక్కడ? View this post on Instagram A post shared by ICC (@icc) -
ICC Womens WC 2022: టీమిండియా సెమీస్కు చేరాలంటే..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా మహిళల జట్టు ఆకట్టుకునే ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆరు మ్యాచ్ల్లో మూడు విజయాలు.. మూడు ఓటములతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నెట్రన్రేట్ను కూడా మెరుగుపరుచుకుంది. బంగ్లాతో మ్యాచ్కు ముందు మైనస్లో ఉన్న రన్రేట్.. ఇప్పుడు +0.768గా ఉంది. కాగా సెమీస్లో మూడు, నాలుగు స్థానాల కోసం ఇంగ్లండ్, భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్కు రెండు మ్యాచ్లు ఉన్నప్పటికి నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం(మార్చి 27న) సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సమీకరణాలు అవసరం లేకుండా 8 పాయింట్లతో సెమీస్లో అడుగుపెడుతుంది. ఒకవేళ సాతాఫ్రికాతో మ్యాచ్లో ఓడినప్పటికి మరో అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గనుక వెస్టిండీస్ ఓడిపోతే.. టీమిండియా సెమీస్కు చేరుకుంటుంది. అలా కాకుండా వెస్టిండీస్ గెలిస్తే టీమిండియాకు నెట్రన్రేట్ కీలకం కానుంది. సౌతాఫ్రికాతో మ్యచ్లో టీమిండియా ఓడినప్పటికి.. తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడే నెట్ రన్రేట్ ఆధారంగా సెమీస్కు వెళుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనతో మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్ను ఓడిస్తే సరిపోతుంది. చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్ ఆడుతున్నావా? World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్గా! View this post on Instagram A post shared by ICC (@icc) -
అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్గా!
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత స్టార్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచకప్లో 30 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా ఝులన్ గోస్వామి నిలిచింది. హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన గోస్వామి ఈ ఘనత సాధించింది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్పై 110 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 119 పరగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను దెబ్బతీసింది. అదే విధంగా ఝులన్ గోస్వామి,పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: World Cup 2022: ఎదురులేని ఆసీస్.. కెప్టెన్ 15వ సెంచరీ.. అద్భుత విజయం -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆష్లీ గార్డనర్ ఓ స్టన్నింగ్ క్యాచ్తో అభిమానులను ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన జెస్ జోనాసెన్ బౌలింగ్లో.. మిగ్నాన్ డు ప్రీజ్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే అంతా బంతి బౌండరీ దాటడం ఖాయమని భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్లీ గార్డనర్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దీంతో గార్డెనర్ క్యాచ్ను మైదానంలో ఉన్న వాళ్లంతా ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లు లీ(36), వొల్వార్ట్(90) కెప్టెన్ సునే లాస్ (52) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్లు రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) వికెట్లు కోల్పోయింది.ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. Take a bow, Ash Gardner 🙌😍 #CWC22 #SAvAUS pic.twitter.com/KY3Cu9F9Mn — Female Cricket #CWC22 (@imfemalecricket) March 22, 2022 -
పాకిస్తాన్ సంచలన విజయం.. పదమూడేళ్ల తర్వాత తొలిసారి!
మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హామిల్టన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా 2009 తర్వాత పాకిస్తాన్ తొలిసారి ప్రపంచకప్లో విజయం సాధించింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెండీస్.. పాకిస్తాన్ స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల మాత్రమే చేయగల్గింది. పాక్ స్పిన్నర్ నిదా దార్ కేవలం 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ డాటిన్(27) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ(37), కెప్టెన్ మహారూప్(20)పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: 'ఢిల్లీ జట్టు చాలా వీక్.. ఓపెనర్గా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు' -
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ విజయం.. న్యూజిలాండ్కు ఇక కష్టమే!
మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆల్రౌండర్ స్కివర్ 61 పరుగులతో కీలక పాత్ర పోషించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ డేనియల్ వ్యాట్ వికెట్ను కోల్పోయింది. అయితే రెండో వికెట్కు బ్యూమాంట్, కెప్టెన్ హీథర్ నైట్ కలిసి 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే అఖరిలో ఇంగ్లండ్ వరుస క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోడంతో మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మలుపు తిరిగింది. దీంతో న్యూజిలాండ్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఈ సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ అన్య ష్రూబ్సోలీ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్రాన్సిస్ మాకే నాలుగు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్ రెండు వికెట్లు సాధించింది. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 203 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివైన్(41), మాడీ గ్రీన్(52) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రాస్, ఎక్లెస్టోన్ చెరో మూడు వికెట్లు సాధించారు. ఇక వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచిన న్యూజిలాండ్కు సెమీస్కు చేరే అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి. చదవండి: IPL 2022: 'కేకేఆర్ నాకు లక్కీ టీమ్.. ఈ సారి ఐపీఎల్ కప్ మాదే' -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్
మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులలెక్కింది. మరో వైపు తమ రికార్డునే ఆస్ట్రేలియా ఐదేళ్ల తర్వాత బ్రేక్ చేసింది. 2017 ప్రపంచకప్లో శ్రీలంకపై 262 పరుగుల లక్క్క్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) హర్మన్ ప్రీత్ కౌర్ (57) పరుగులతో రాణించారు. ఇక 278 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో రేచల్ హేన్స్(43), అలీసా హేలీ(72), కెప్టెన్ లానింగ్(97) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన ఆసీస్ -
మైదానంలో కుప్పకూలిన వెస్టిండీస్ బౌలర్.. ఒక్క సారిగా షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్ జరుగుతుండగా మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ఫీల్డర్ షమిలియా కానెల్ ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో ఒక్క సారిగా సహచర ఆటగాళ్లు ఆమె దగ్గరకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే కానెల్కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని టీమ్ కెప్టెన్ స్టఫానీ టేలర్ వెల్లడించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. విండీస్ బ్యాటర్ కాంప్బెల్ 53 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరైన చేయగల్గింది. ఇక 141 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌటైంది. హేలీ మ్యాథ్యూస్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో విండీస్ మూడో స్ధానంలో నిలిచింది. చదవండి: Pooja Vastrakar: ప్రపంచకప్లో అతి భారీ సిక్సర్ బాదిన టీమిండియా బ్యాటర్ West Indies Women cricket’s Team player named Connell has collapsed, Hope she is fine. That was terrible. prayers for her. #CricketTwitter pic.twitter.com/8E8BvWRlyh — Gujju (@TheBluesIndia_) March 18, 2022 -
టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా!
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే 200 వన్డేలు ఆడిన తొలి బౌలర్గా గోస్వామి రికార్డులకెక్కింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో గోస్వామి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా 200 వన్డే మ్యాచ్లు ఆడిన రెండో క్రికెటర్గా గోస్వామి నిలిచింది. ఇక భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వన్డేలు ఆడి తొలి స్ధానంలో ఉంది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గోస్వామి వరుసగా ఐదో వన్డే ప్రపంచకప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 2005లో తొలి వరల్డ్కప్ భారత తరుపున ఆడింది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది. చదవండి: Jhulan Goswami: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా'
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శనివారం టీమిండియా మహిళల జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా సెమీస్లో అడుగుపెట్టాలంటే టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. అందులో భాగంగా మొదట బ్యాటింగ్లో సక్సెస్ అయింది. టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 68 పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. యస్తికా బాటియా 53, హర్మన్ప్రీత్ కౌర్ 50 పరుగులతో రాణించారు. ఇక బౌలర్లు ఫామ్లో ఉన్న ఆసీస్ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. కాగా మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన యస్తికా బాటియా గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు బాటియా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇంటర్య్వూ ఇచ్చింది. యస్తికా బాటియాకు చికెన్ బిర్యానీ అంటే ప్రాణం. అయితే ఆమె న్యూట్రిషన్ సలహాదారు చికెన్, రైస్ కాంబినేషన్ తింటే.. శరీరం పెరిగే అవకాశం ఉంటుందని.. ఫిట్నెస్ కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పాడంటా. అంతే అప్పటినుంచి యస్తికా బాటియా చికెన్ బిర్యానీని వదిలేసింది. ఆటలో రాణించాలని అనుకున్నప్పుడు ఇలాంటి బిర్యానీలు ఎన్నైనా వదులేసుకుంటా అని యస్తికా వెల్లడించింది. అయితే చికెన్ బిర్యానీ వదులుకున్న సమయంలో నా గుండె తట్టుకోలేకపోయిందని.. మనసు చంపుకోలేకపోయానని తెలిపింది. చికెన్ బిర్యానీతో పాటు ఇంకేమైనా వదిలేశారా? పానీ పూరి తినడం తగ్గించేశా. కొన్ని సంవత్సరాల కిందట పానీపూరి విపరీతంగా తినేదాన్ని. అమ్మ కోరిక మేరకు ఇంట్లోనే పానీపూరిని తయారు చేసుకోవడం వల్ల బయట తినడం తగ్గించేశాను. అయితే ఒక విషయం మీకు చెప్పాలి. ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత రోడ్సైడ్ పానీపూరి తిన్నాను. ఆ మరుసటి రోజే డమొస్టిక్ క్రికెట్లో భాగంగా బరోడా తరపున సెంచరీ బాదడం సంతోషంగా అనిపించింది. మరి టీమిండియా సహచరులలో ఎవరు బెస్ట్ కుక్ అని భావిస్తున్నారు? నా జట్టు సహచరులు ఏది తయారు చేసినా తినడానికి ఇష్టపడుతా. అయితే స్మృతి మంధాన మంచి కుక్ అని తెలిసింది. త్వరలోనే ఆమె చేతి వంట రుచి చూస్తా. ఇక బరోడా టీమ్మేట్ చార్మి షా మ్యాగీ, ఫిజ్జాలు చేయడంలో మంచి నేర్పరి. ప్రపంచకప్లో బిజీగా ఉన్నారు.. ఇదే సమయంలో ఇష్టమైన ఫుడ్ను మిస్సవుతున్నారా? అవును.. దాల్ చావల్ మిస్సవుతున్నా. మన సంప్రదాయ ఫుడ్ ఇక్కడ తక్కువగా దొరుకుతుంది. మ్యాచ్లు లేని సమయాల్లో మంచి రెస్టారెంట్కు వెళ్లి దాల్ చావల్ తింటున్నప్పటికి.. ఎంతైనా ఇంటి ఫుడ్ వేరుగా ఉంటుంది. మీ బ్యాటింగ్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారా? ఒక బ్యాటర్గా మంచి ఇన్నింగ్స్లు ఆడాలని కోరుకుంటా. వన్డే వరల్డ్కప్లో ఆడడం మాకు పెద్ద విషయం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాకు కీలకం. ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాం. చదవండి: World Cup 2022: అర్ధ శతకాలతో అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్.. ఆఖర్లో పూజా మెరుపులు Womens WC 2022 WI vs BAN: విండీస్ క్రికెటర్ వింత ప్రవర్తన.. సూపర్ అంటున్న ఫ్యాన్స్ View this post on Instagram A post shared by ICC (@icc) -
Womens WC 2022: ఆస్ట్రేలియా విజయం.. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
-
విండీస్ క్రికెటర్ వింత ప్రవర్తన.. సూపర్ అంటున్న ఫ్యాన్స్
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్లో విండీస్ బౌలర్ అఫీ ఫ్లెచర్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూడు కీలక వికెట్లు తీసిన ఫ్లెచర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. కాగా ఈ విషయం పక్కనబెడితే.. ఫ్లెచర్ ఫ్లెచర్ వన్డే ప్రపంచకప్ కోసం తన ఏడు నెలల కొడుకుని వదిలివచ్చింది. ఈ సందర్భంగా తన చిన్నారిని గుర్తుచేసుకుంటూ సూపర్ సెలబ్రేషన్తో మెరిసింది. బంగ్లా బ్యాటర్ ఫర్గానా హోక్యూ వికెట్ తీసిన తర్వాత ఫ్లెచర్.. తన చేతిని ఫోన్గా మార్చి నెంబర్ డయల్ చేసి కొడుకుతో మాట్లాడినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. హాయ్ బేబీ.. హౌ ఆర్ యూ మై చైల్డ్ అంటూ నవ్వడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెచర్ కంటే ముందే పాకిస్తాన్ మహిళా ప్లేయర్ బిస్మా మరూఫ్ క్రాడిల్ రాకింగ్ సెలబ్రేషన్తో మెరిసింది. ఇక ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వుమెన్స్ నాలుగు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కీపర్ క్యాంప్బెల్ 53 పరుగులతో టాప్స్కోరర్ కాగా.. హేలీ మాథ్యూస్ 18, అఫీ ఫ్లెచర్ 17 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వుమెన్స్ 49.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది. నిగర్ సుల్తానా 25, నదియా కేర్ 25 నాటౌట్, సల్మాన్ కాతున్ 23 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 4, అఫీ ఫ్లెచర్ 3, స్టిఫానీ టేలర్ 3 వికెట్లు తీశారు. #CWC22 #BANvWIhttps://t.co/jPcITcLslf pic.twitter.com/QGecvbIxqG — hypocaust (@_hypocaust) March 18, 2022 -
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్!
మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా విజయాల పరంపర కొనసాగిస్తోంది. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై దక్షిణాఫ్రికా రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా 8 వికెట్లు కోల్పోయి చేధించింది. అఖరి ఓవర్లో 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ కాప్ బౌండరీ బాది జట్టును గెలిపించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (67),సునే లూస్ (51), కాప్ (34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టగా, మాకే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 228 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సోఫియా డివైన్(93), అమేలియా కేర్(42) గ్రీన్(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, ఖాకా చెరో మూడు వికెట్లు సాధించారు. కాగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికా రెండో స్ధానంలో ఉంది. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి.. View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ .. వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్!
మహిళల వన్డే ప్రపంచకప్-2022లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఇక పాకిస్తాన్ ఈ మెగా టోర్నమెంట్లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేయగల్గింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఆద్భుతమైన సెంచరీ సాధించనప్పటికీ ఫలితం లేక పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో పాక్కు ఓటమి తప్పలేదు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఫాహిమా ఖాటాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రుమానా అహ్మద్ రెండు, ఆలాం ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకుమందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఫర్గానా హాక్(71), నిగర్ సుల్తానా(46) పరుగులతో రాణించారు. కాగా వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అఖరి స్ధానంలో పాక్ నిలిచింది. ఇక పాకిస్తాన్ సెమీస్కు చేరడం కష్టమే అని చెప్పుకోవాలి. చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్ -
టీమిండియాతో ఓటమి.. వెస్టిండీస్కు మరో భారీ షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే వెస్టిండీస్కు మరో భారీ షాక్ తగిలింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో విండీస్ జట్టుకు 40 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సరికి వెస్టిండీస్ రెండు ఓవర్లు వెనుకబడింది. ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే ఆటగాళ్లకు, జట్టు సహాయకి సిబ్బందికి ప్రతి ఓవర్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. అయితే విండీస్ జట్టు 2 ఓవర్లు వెనుకబడింది కనుక 40 శాతం జరిమానా విధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్పై 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
ఆస్ట్రేలియా విజయాల పరంపర.. న్యూజిలాండ్పై భారీ విజయం
మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ను దెబ్బతీసింది. అదే విధంగా వెల్లింగ్టన్, గార్డెనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాటర్త్వైట్(44) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ(68),తహ్లియా మెక్గ్రాత్(57),గార్డెనర్(48) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు మూడు వికెట్లు పడగొట్టగా..అమేలియా కెర్,హన్నా రోవ్, మాకే చెరో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా, హర్మన్ప్రీత్ 107 బంతుల్లో 109పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో 119 పరగులు చేసిన స్మృతి మంధాన ఎంపికైంది. అయితే ఇక్కడే మంధాన తన క్రీడా స్పూర్తిను చాటుకుంది. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్మన్ప్రీత్ కౌర్తో పంచుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మంధాన మాట్లాడుతూ.. "నేను సెంచరీ సాధించాను, కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక అవ్వాలని ఒక క్రికెటర్గా నేను ఎప్పుడూ కోరుకోను. మా జట్టు 300 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో మేమిద్దరం సమానంగా సహకరించామని నేను భావిస్తున్నాను. కాబట్టి, ట్రోఫీని హర్మన్తో పంచుకోవాలి అనుకున్నాను. అదే విధంగా అవార్డు పొందడానికి మేమిద్దరం అర్హులమని నేను అనుకుంటున్నాను. మేము న్యూజిలాండ్, పాక్తో జరిగిన మ్యాచ్లో మా తప్పులను మేము గ్రహించాం. ఇకపై వాటిని మేము పునరావృతం చేయబోమని భావిస్తున్నాను" అని మంధాన పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగల భారీ స్కోర్ సాధించింది. ఇక 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 162 పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. ఝులన్ గోస్వామి ఒకటి, మేఘన సింగ్ 2, రాజేశ్వరీ గైక్వాడ్ ఒకటి, పూజా వస్త్రాకర్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! -
వైడ్ కాదు, నోబాల్ కాదు.. కానీ ఓవర్లో 7 బంతులు.. అదెలా?
Women's ODI World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో నోబాల్ గాని, వైడ్ బాల్ గాని లేకుండా ఒకే ఓవర్లో 7 బంతులు వేయబడ్డాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 27వ ఓవర్ ఓవర్ వేసిన ఒమైమా సోహైల్ బౌలింగ్లో అఖరి బంతికు బ్యాటర్ సునే లూస్ను ఎల్బీగా అంపైర్ ఔటిచ్చాడు. దీంతో ఆమె రివ్యూ వెళ్లగా నాటౌట్గా తేలింది. ఇది ఇలా ఉంటే.. రివ్యూకు పోయిన బంతి అఖరి బంతి అన్న విషయం మర్చిపోయిన అంపైర్ బౌలర్తో ఆదనంగా ఇంకో బాల్ను వేయించాడు. ఆదనపు బంతికి సింగిల్ లభించింది. అయితే అంపైర్ చేసిన ఈ నిర్వహకం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. చదవండి: ICC Womens World Cup: పాకిస్తాన్కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు! Legal 7 ball over… 😲 What’s happening?#PAKvSA #CWC22 pic.twitter.com/V3Y8GpF2Aq — ಒಬ್ಬಟ್ಟು | O ₿ ₿ A T T U 🔑 (@7cr0re) March 11, 2022 -
పాకిస్తాన్కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు!
మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుసగా మూడో ఓటమి చూవి చూసింది. లీగ్ మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 217 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో రాణించినప్పటికీ పాక్కు ఓటమి తప్ప లేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, గులాం ఫాతిమా చెరో మూడు వికెట్లు సాధించారు. ఇక మూడు ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచిన పాకిస్తాన్కు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో మార్చి14న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
టీమిండియా బౌలర్ అరుదైన ఫీట్.. చరిత్రకు అడుగుదూరంలో
మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. ఆస్ట్రేలియన్ మహిళా బౌలర్ లిన్ ఫుల్స్టన్తో కలిసి గోస్వామి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఉమెన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేటీ మార్టిన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ను అందుకుంది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్లు ఆడిన గోస్వామి.. కేటీ మార్టిన్ వికెట్తో కలిపి 39 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్స్టన్ 39 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గోస్వామి ఆమె సరసన చేరింది. రాబోయే మ్యాచ్ల్లో గోస్వామి ఒక వికెట్ తీస్తే చాలు.. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కనుంది. ఇక 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో.. క్లేరీ టేలర్(ఇంగ్లండ్) 36 వికెట్లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50 పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్లు తయారు చేయకండి' -
దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం
క్రికెట్లో కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. నిజజీవితంలో భార్యభర్తలైన ఇద్దరు క్రికెటర్లు ఒకే జట్టుపై ఒకే సమయంలో(వేర్వేరు ప్రాంతాల్లో) బ్యాటింగ్ దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరే మిచెల్ స్టార్క్, అలిస్సా హేలీ. ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ పాకిస్తాన్ పర్యటనలో ఉండగా.. అలిస్సా హేలీ వన్డే వరల్డ్కప్లో బిజీగా ఉంది. ఇక విషయంలోకి వెళితే.. వరల్డ్కప్లో భాగంగా మౌంట్ మాంగనూయి వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్ పాకిస్తాన్ వుమెన్స్తో మ్యాచ్ ఆడింది. ఓపెనర్గా అలిస్సా హేలీ దుమ్మురేపింది. 72 పరుగులతో అలిస్సా హేలీ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ విజయంలో భాగం పంచుకుంది. ఇదే సమయంలో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆఖరిరోజు మిచెల్ స్టార్క్ ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా బ్యాటింగ్కు వచ్చాడు. ఇంకేముంది అటు భార్య.. ఇటు భర్త విభిన్న పార్శ్వాల్లో ఒకే సమయంలో బ్యాటింగ్ రావడంతో కెమెరాలన్ని క్లిక్మనిపించాయి. అలిస్సా హేలీ, మిచెల్ స్టార్క్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక మ్యాచ్ల విషయానికి వస్తే.. పాకిస్తాన్ వుమెన్స్పై ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ 34.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మరోవైపు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పరుగులు తీస్తుంది. ఐదోరోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా 459 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్కు తొలి ఇన్నింగ్స్లో 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. చదవండి: ICC Womens WC 2022: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే Shaheen Shah strikes 🔥 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ZjINDSGnid — Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022 Wife and husband are both batting against Pakistan at the same time. That's too cute. 💛💚 @ahealy77 #PAKvAUS #CWC22 pic.twitter.com/ku9bnHCOzf — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 8, 2022 -
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
వన్డే మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. ఇక వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. కాగా పాక్కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఘోరమి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. చదవండి: Shane Warne: ‘నేను వార్న్ను అంతమాట అనకుండా ఉండాల్సింది’ -
పూజా వస్త్రాకర్.. నీ ఆటకు ఫిదా
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా భోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్తాన్పై భారత మహిళల జట్టు తమకున్న రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్తో 11 వన్డేలు ఆడి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. తాజాగా వన్డే ప్రపంచకప్ వేదికగా భారత్ పాక్పై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక కెప్టెన్గా మిథాలీరాజ్కు కూడా పాకిస్తాన్పై ఇది 11వ విజయం కావడం విశేషం. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూజా వస్త్రాకర్ ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే షెఫాలీ వర్మ డకౌట్గా వెనుదిరగ్గా.. ఆ తర్వాత ఓపెనర్ మంధాన(52 పరుగులు), దీప్తి శర్మ(40 పరుగులు) రెండో వికెట్కు 92 పరుగులు జోడించి ఇద్దరు ఒకేసారి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ మిథాలీతో పాటు మిగతా బ్యాట్స్మన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్.. స్నేహా రాణాతో కలసి ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్కు దాదాపు 122 పరుగులు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. పూజా వస్త్రాకర్(59 బంతుల్లో 67, 8 ఫోర్లు), స్నేహ రాణా(48 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ వుమెన్స్ను టీమిండియా బౌలర్లు కట్టడిచేశారు. రాజేశ్వరీ గైక్వాడ్ 4 వికెట్లతో రాణించడంతో పాకిస్తాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్ మార్చి 10న న్యూజిలాండ్తో ఆడనుంది. Pooja Vastrakar brings up a brilliant 50 on her World Cup debut! 👏 Can she take India past 250?#CWC22 pic.twitter.com/0LgDBMfX6z — ICC (@ICC) March 6, 2022 -
రెప్పపాటులో స్టన్నింగ్ క్యాచ్.. చూపులతోనే ఫిదా
ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్ను జోనాస్సెన్ వేసింది. ఓవర్ రెండో బంతిని ఇంగ్లండ్ బ్యాటర్ కాథరిన్ బ్రంట్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేసింది. అందుకు తగ్గట్టగానే బ్యాట్తో పర్ఫెక్ట్ షాట్ ఆడింది. కానీ బౌలర్ జొనాస్సెన్ బంతికి అడ్డుగోడలా నిలిచింది. తన చేతికి చిక్కితే బంతి ఎక్కడికి వెళ్లదు అన్నట్లుగా.. రెప్పపాటులో వేగంగా వెళుతున్న బంతి ఎడమ చేత్తో స్టన్నింగ్గా అందుకుంది. అంతే పట్టిన ఆమెకు.. చూస్తున్న మనకు.. క్రీజులో ఉన్న బ్యాటర్కు.. ఫీల్డర్లు అందరికి షాక్ తగిలింది. అసలు క్యాచ్ పట్టానా అన్న రీతిలో జొనాస్సెస్ ఇచ్చిన లుక్స్.. చిరునవ్వు హైలెట్గా నిలిచాయి. జొనాస్సెన్ క్యాచ్ పట్టిన దానికంటే ఆమె ఇచ్చిన లుక్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోనూ షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్ను గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ 3 వికెట్లు, తహిల మెక్గ్రాత్, జెస్ జొనాస్సెన్ తలో 2 వికెట్లు, మెగాన్ ష్కట్ ఓ వికెట్ పడగొట్టడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: Womens World Cup 2022: ఇంగ్లండ్ను దెబ్బ కొట్టిన ఆసీస్... బంగ్లాను ఆటాడుకున్న సౌతాఫ్రికా Icc women's world cup 2022: న్యూజిలాండ్పై వెస్టిండీస్ సంచలన విజయం View this post on Instagram A post shared by ICC (@icc) -
వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన
రంగియోరా (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. ఓపెనర్ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. -
ఐసీసీ వరల్డ్కప్ 2022: పాక్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ICC Womens World Cup 2022 Schedule Announced.. ఐసీసీ వుమెన్స్ వరల్డ్కప్ 2022కు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ మార్చి 4న మొదలై ఏప్రిల్ 3న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఇక మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను మార్చి 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 10న న్యూజిలాండ్తో, మార్చి 12న వెస్టిండీస్తో, మార్చి 16న ఇంగ్లండ్తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, మార్చి 22న బంగ్లాదేశ్తో , మార్చి 27 సౌతాఫ్రికాతో టీమిండియా మహిళల జట్టు మ్యాచ్లు ఆడనుంది. చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననుండగా.. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో మ్యాచ్లు ఆడుతుంది. ఆక్లాండ్, క్రైస్ట్చర్చి, డ్యునెడిన్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్ వేదికలుగా టోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ మార్చి 30న వెల్లింగ్టలన్ వేదికగా.. రెండో సెమీఫైనల్ మార్చి 31న క్రైస్ట్చర్చి వేదికగా జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న క్రైస్ట్చర్చి వేదికగానే జరగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేను కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఐసీసీ వుమెన్స్ చాంపియన్షిప్ 2017-20 వరకు పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్లు ప్రపంచకప్కు క్వాలిఫై అయినట్లు పేర్కొంది. ఇక ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ కూడా నేరుగా క్వాలిఫై జాబితాలో చేరింది. ఇక మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్లు అర్హత కోసం క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. కోవిడ్ నేపథ్యంలో మ్యాచ్లను రద్దు చేశారు. ఇక చివరిసారి ఐసీసీ వుమెన్స్ టి20 ప్రపంచకప్లో భారత్ను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: Under-19 World Cup: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు