industrialists
-
కప్పం కట్టలేం
సాక్షి, అమరావతి: యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు. ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.కేంద్రానికే మొరశ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. » మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. » చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకికొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్ డప్పు కొంటుకుంటున్నారు. » గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు. » వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.మరికొన్ని చిలక్కొట్టుళ్లు» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు » తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం » నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్ షాపుల వరకు కమీషన్లు » కప్పం కడితేనే గనులకు లీజ్ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం » నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్బేస్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి » కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపుసిమెంట్ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితితాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. » రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. » నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్ సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది. » సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. -
Magazine Story: ఆ దేశ ద్రోహులను ఈడ్చుకొచ్చేదెప్పుడు.. ?
-
బడుగు పరిశ్రమలపై కూటమి పిడుగు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించడంపై దళిత పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘వైఎస్సార్ బడుగు వికాసం’ పేరిట ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని 35 శాతానికి పరిమితం చేస్తూ నూతన పారిశ్రామిక విధానం 4.0ను తీసుకొచి్చందని దళిత పారిశ్రామిక సంఘాలు విమర్శించాయి. ఇదే విషయంపై సాక్షి ‘పారిశ్రామిక పాలసీల్లో బడుగులకు మొండిచెయ్యి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత దళిత పారిశ్రామిక సంఘాలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయగా.. జరిగిన తప్పును త్వరలోనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. నవంబర్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిలో ఎస్సీ, ఎస్టీ రాయితీలపై వైఎస్సార్సీపీ ప్రతినిధులతో పాటు చైర్మన్ కూడా ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో గతిలేని పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి పెట్టుబడి రాయితీని 45 శాతానికి పునరుద్ధరించారు. వాస్తవం ఇలా ఉంటే.. కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటనలు జారీ చేయడం, దీనిని బాకా పత్రికలు పతాక స్థాయిల్లో అదనంగా 10 శాతం ప్రయోజనం అని ప్రచురించడాన్ని దళిత పారిశ్రామిక వేత్తలు తప్పుపడుతున్నారు. కేవలం ఉన్న దాన్ని పునరుద్ధరించి.. అదనంగా ఒక్క శాతం కూడా పెంచకుండా పెంచేసినట్టు ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
అమెరికాలో ఉత్పత్తి చేయండి లేదంటే టారిఫ్ కట్టండి
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌదీ.. రేట్లు తగ్గించుకో..‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. -
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...జిందాల్ను వేధించిన బాబు సర్కారు– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..– ఈవీ, సోలార్ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలుసజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.నాడు.. పెట్టుబడులకు రాచబాట..– పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ భరోసావైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. -
ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్ వస్తుందా?
న్యూఢిల్లీ: ‘‘ఆదివారాలు కూడా ఆఫీస్కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి’’అంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే విజయం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని, ఏది ఉన్నా ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ నుంచే ఇది అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతేకాదు, ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు మధ్యస్త వేతనం కంటే 534 రెట్లు అధికంగా రూ.51 కోట్ల వేతనాన్ని 2023–24 ఆర్థిక సంత్సరానికి సుబ్రమణియన్ తీసుకోవడంపైనా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘‘వారంలో 90 గంటలా? సండేని సన్ టు డ్యూటీగా ఎందుకు పేరు మార్చకూడదు. వారంలో ఒకరోజు సెలవుదినాన్ని ఒక భావనగా మార్చేయండి’’ అంటూ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కష్టపడి, స్మార్ట్గా పనిచేయడాన్ని తాను విశ్వసిస్తానన్నారు. జీవితాన్ని పూర్తిగా కార్యాలయానికే అంకింత చేయడం వల్ల విజయం రాకపోగా, అగ్గి రాజుకుంటుందన్నారు. ఉద్యోగం–జీవితం మధ్య సమతుల్యత అన్నది ఐచి్ఛకం కాదని, తప్పనిసరి అని పేర్కొన్నారు. మారికో చైర్మన్ హర్‡్ష మారివాలా కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని ఎక్స్పై వ్యక్తం చేశారు. ‘‘విజయానికి కష్టపడి పనిచేయడం అన్నది కీలకం. ఇందుకు ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. నాణ్యత, ఆ పని పట్ల అభిరుచి విజయాన్ని నిర్ణయిస్తాయి’’అని పేర్కొన్నారు. బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన సందర్భంగా దీనిపై స్పందించారు. ‘‘ఇది అగ్ర స్థాయి ఉద్యోగుల నుంచి ప్రారంభిద్దాం. ఫలితమిస్తుందని తేలితే అప్పుడు మిగిలిన వారికి అమలు చేద్దాం’’అని పేర్కొన్నారు. -
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
CM Jagan: ఎల్లుండి విశాఖకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/విశాఖపట్నం: ఎల్లుండి(మంగళవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం సమావేశం కానున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్, వి–కన్వెన్షన్ హాళ్లను పరిశీలించారు. విజన్ వైజాగ్ పేరుతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం పీఎంపాలెంలోని వి–కన్వెన్షన్ హాలుకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను గమనించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ఇక్కడ సీఎం జగన్ సమావేశమవుతారు. తర్వాత రుషికొండ హరిత రిసార్ట్స్ సమీపంలోని హెలిప్యాడ్ను అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్, వి– కన్వెన్షన్ హాలుకు ముఖ్యమంత్రి చేరుకునే రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే!
కేంద్రం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్, మరో ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మ భూషణ్ సీతారాం జిందాల్ - కర్ణాటకకు చెందిన జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, సీతారాం జిందాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్ (SITARAM JINDAL)కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ లభించింది. యంగ్ లియు - ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్కాన్ సీఈఓ యంగ్ లియుకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ దక్కింది. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో లియు చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుని అందించింది. భారతదేశంలో విస్తృతంగా సేవలందిస్తూ.. ఇప్పటికి సుమారు 40000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇదీ చదవండి: తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు! పద్మశ్రీ కల్పన మోర్పారియా - మహారాష్ట్రకు చెందిన జేపీ మోర్గాన్ ఇండియా సీఈఓ 'కల్పన మోర్పారియా'కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ లభించింది. శశి సోనీ - కర్ణాటకకు చెందిన శశి సోనీకి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ కైవసం చేసుకుంది. -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్కుమార్ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విదేశీ పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే సమయం
సాక్షి, హైదరాబాద్, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే ఉత్తమ సమయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఇంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ వద్ద కేటాయించిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (డబ్ల్యూఐటీటీసీ) కేంద్రానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏకకాలంలో ఐదు విప్లవాలు హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్త్రం దేశానికి ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. రా్రష్తంలోని అన్ని జిల్లాలు పారిశామ్రిక ప్రగతికి అత్యధికంగా వనరులున్నాయన్నారు. వీటిని పారిశ్రామికవెత్తలు అందిపుచ్చుకొని గ్రామీణ స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితేనే సమతుల్యత సాధించగలమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకొని వాటిని సాధించేందుకు కృషి చేస్తే అద్భుతాలు సాధ్యమన్నారు. ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం కేవలం 5 మంది పారిశ్రామికవేత్తలతో ప్రారంభమైన అలీప్లో ఇప్పుడు 10వేల మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, డబ్ల్యూఐటీటీసీ వైస్ చైర్పర్సన్ జ్యోతి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెజ్లర్లకు న్యాయం చేయాలి: కేటీఆర్ లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న దీక్షకు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్పై విచారణ జరిపి, వారికి న్యాయం చేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ‘ఒలంపిక్స్లో పతకాలు సాధించి వారు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు మనం ఉత్సవాలు జరుపుకొన్నాం. ప్రస్తుతం వారు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికీ సంఘీభావం తెలుపుదాం. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్పై నిష్పాక్షిక విచారణ జరిపి, రెజ్లర్లకు న్యాయం అందించాలి’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రెజ్లర్ల సమస్యను పరిష్కరించాలి: కవిత రెజ్లర్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ వేదికలపై మన అథ్లెట్లు కనపరిచిన ప్రతిభను చూసి ఉత్సవాలు చేసుకున్నాం. మన అథ్లెట్లు గ్లోబల్ ఐకాన్స్. వారు మనను ఎంతో ప్రభావితం చేస్తున్నారు. మన అథ్లెట్లు చెబుతున్న సమస్యను విని, దేశ భవిష్యత్ దృష్ట్యా వారి సమస్యను పరిష్కరించాలి’అని ఆమె శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం
సాక్షి, విశాఖపట్నం: అక్షర క్రమంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. విజనరీ లీడర్ షిప్తో అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళుతోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను తమ తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల పరిశ్రమల యాజమాన్యాలన్నీ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. 11.47 శాతం వృద్ధితో ఏపీ అగ్రభాగంలో ఉండటం గర్వకారణం. దూరదృష్టి కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో రూపొందించిన పారిశ్రామిక పాలసీ అద్భుతమని అందరి మాటగా చెబుతున్నా. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన సదస్సులో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలన్న సీఎం వైఎస్ జగన్ భరోసా అందర్నీ ఆకట్టుకుంది. ఆయన చెప్పిన మాట నిజంగా వాస్తవం. ఫోన్ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. – గజానన్ నబర్, నోవా ఎయిర్ సీఈవో, ఎండీ అసాధారణ ఘనత.. ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు పయనిస్తోంది. ఈ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు అనువైన స్థలాలను గుర్తించగలిగాం. సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో పవర్ ఉత్పత్తిలో ఏపీ ప్రపంచంలోనే నంబర్1 గా ఎదిగే అవకాశాలున్నాయి. దీని వెనుక సీఎం జగన్ అకుంఠిత దీక్ష ఉంది. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో పాటు సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్లలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెడతాం. కర్బన రహిత పర్యావరణం కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా తొలి స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. పారిశ్రామిక వాతావరణం అద్భుతంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. – వినీత్ మిట్టల్, ఆవాదా గ్రూప్ చైర్మన్ చురుకైన ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత బల్క్ డ్రగ్ క్యాపిటల్గా ఏపీ మారింది. రాష్ట్రంలో కొన్ని అతిపెద్ద ఏపీఐ యూనిట్లు పనిచేస్తున్నాయి. మేం 2007లో ఒక ఉద్యోగి స్థాయి నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామంటే సీఎం జగన్ అందించిన సహకారమే కారణం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, చురుకైన ప్రభుత్వం, నిపుణులైన అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఏపీకి ప్రత్యేకంగా మార్కెట్ అవసరం లేదు. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పెడితే పెట్టుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డ్రగ్ కంట్రోలర్ అనుమతులతో సహా ప్రక్రియను వేగంగా నిర్వహించేలా డిజిటల్ డ్రైవ్లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ఔషధాలు ఏపీలో తయారవుతున్నాయి. – సూర్యనారాయణ చావా, లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో పరిశ్రమలు కోరుకునే సుస్థిర వాతావరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వం కారణంగా సమ్మిట్లో అనూహ్యరీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిర విధానాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది. పెట్టుబడుల్ని క్రమంగా ఇక్కడ విస్తరిస్తాం. నాణ్యమైన మానవ వనరులను అందించడం, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం నంబర్వన్గా ఉంది. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఏపీలో ఉన్నందున నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చు. – సంతానం, సెయింట్ గోబెన్ సీఈవో 96 సేవలు ఒకే చోట ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. 24 ప్రభుత్వ శాఖలకు చెందిన 96 సేవల్ని ఒకే చోట చేర్చి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు పూర్తి స్థాయి మద్దతిస్తూ ప్రతి విషయంలోనూ సహకరిస్తాం. – డా.కె.ఎస్.జవహర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు కోవిడ్ తర్వాత ఫార్మా రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారత్ను ఫార్మా స్యూటికల్ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వంశీకృష్ణ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ -
జగన్ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి
(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలను అందిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. సదస్సులో తొలి రోజు శుక్రవారం దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతోనే వృద్ధి రేటు, సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొనియాడటం విశేషం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన ఓ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికాభివృద్ధిపట్ల సీఎం జగన్ స్పష్టమైన దృక్పథానికి ఆకర్షితుడయ్యే ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. సహజ వనరులు, భౌగోళిక అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకత అని ఆదానీ పోర్ట్ – సెజ్ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఏపీలో పోర్టుల అభివృద్ధికి జగన్ ప్రణాళికలు ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామిక విధానం, పరిశ్రమల అనుకూల ఎకోసిస్టమ్ కల్పించేందుకు సమర్థంగా అమలు చేస్తున్న సింగిల్ విండో పాలసీ గురించి జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ దార్శనిక విధానాల ఫలితంగానే తమ గ్రూప్ ఏపీలో రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిపి సీఎం జగన్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు. సమర్థ నాయకుడు సంక్షోభం తలెత్తినప్పుడు సమర్థంగా వ్యవహరించడమే నాయకత్వ లక్షణమని కియా మోటార్స్కు చెందిన కబ్ డాంగ్లీ చెప్పారు. అలాంటి నాయకుడు జగన్ అని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు, ముడి సరుకును సురక్షితంగా తరలించడానికి సీఎం జగన్ సత్వరం సహకారం అందించడం ఇందుకు తార్కాణమన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధే ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి అనే వాస్తవాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి కొనియాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య–ఆరోగ్య రంగాలపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుండటం దేశానికే ఆదర్శమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూల పేరుతో చేసిన కనికట్టు అందరికీ తెలిసిందే. ఛోటామోటా నేతలకు సూట్లు వేసి మరీ ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ప్రజల్ని మోసం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలలో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తూ పరిశ్రమల ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే విషయాన్ని కెనాఫ్ సంస్థ సీఈవో సుమిత్ బిదానీ జీఐఎస్ సభా వేదిక మీదే చెప్పారు. 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్ను తాము ఏర్పాటు చేయడం కేవలం సీఎం జగన్ సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోనే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూలత అరుదు సీఎం జగన్ నిబద్ధత గురించి జపాన్కు చెందిన టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగుచి చెప్పిన విషయం అబ్బురపరిచింది. శ్రీ సిటీలో రూ.200 కోట్లతో తాము త్వరగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 132 కేవీ విద్యుత్ లైన్ను ప్రత్యేకంగా వేయడాన్ని ఆయన ఉదహరించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉండటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పారిశ్రామిక పరిణామాలపై ఆయనకున్న ముందు చూపునకు నిదర్శనమని టెస్లా కంపెనీ కో ఫౌండర్ మార్టిన్ ఎబర్హార్డ్ తెలిపారు. శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ బంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిమెంట్ రంగంలో తాము ఈ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నాఉ. ఇప్పటికే రూ.3,000 కోట్లతో గుంటూరులో తాము ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.5,000 కోట్లు పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అపారమైన సహజ వనరులు.. నైపుణ్యమైన మానవ వనరులు అభివృద్ధికి మూలం. కీలకమైన ఆ రెండింటినీ గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమర్థ నాయకత్వం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో అటువంటి సమర్థ నాయకత్వం లభించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవడం ఖాయం. వైఎస్ జగన్ దార్శనికతే ఏపీ ప్రగతికి దిక్సూచి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయమిది. సీఎం జగన్ను చూసి గర్వపడుతున్నా.. పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ ఎంత వేగంగా స్పందిస్తారో చెబుతూ సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా చెప్పిన ఉదాహరణ ఆకట్టుకుంది. ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకోసం నోడల్ ఆఫీసర్ల నియామకంతోపాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఏఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి తదితర అంశాలన్నీ ఒక్క సమావేశంలోనే కొలిక్కి వచ్చేశాయన్నారు. తాను పుట్టిన నేలకు దేశ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను తెచ్చిన సీఎం జగన్ను చూసి గర్విస్తున్నానని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. జె ఫర్ జగన్ కాస్త జె ఫర్ జోష్గా మారిందని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిలో భాగస్వాములవుతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తూ ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ఊహకు మించి అద్భుతంగా ఆరంభమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొనడం హైలెట్గా నిలిచింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఏ ఒక్క పెట్టుబడుల సదస్సుకు హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో కలసి విశాఖ సమ్మిట్లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్షిప్పై ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు. పెట్టుబడులకు స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య రంగం అద్భుతం.. – ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ప్రజల శ్రేయస్సు పరిపూర్ణంగా కనిపించడం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ భూమి తల్లి కుమార్తెగా చెబుతున్నా. వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నిజంగా ప్రశంసనీయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశాలకూ విస్తరించింది. ఆ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మరింత విస్తరింపజేశారు. ఆరోగ్యశ్రీ ఆఫ్రికాలోనూ అమలవుతుండటం గర్వకారణం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. అపోలో కార్యకలాపాలకు సీఎం జగన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మనమంతా చూస్తున్నట్లుగా ఏపీవైపు అన్ని పరిశ్రమలు కలసి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య ప్రమాణాలు అందించేందుకు ఒక కుటుంబంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నా. రూ.5 వేల కోట్ల పెట్టుబడులు – హరిమోహన్ బంగూర్, శ్రీ సిమెంట్ జీఎస్డీపీలో 11.43 శాతంతో అగ్రభాగంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ దేశ జీడీపీలో 5 శాతం వాటా సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నా. సీఎం జగన్ కృషితో విద్య, సామాజిక, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశ్రమల్ని ఆకర్షించే అద్భుతమైన వనరులున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది పారిశ్రామిక వర్గాల్ని ఆకర్షిస్తున్నారు. దాదాపు 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీసిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. 55 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తూ దేశంలోని సిమెంట్ ప్రాజెక్టుల్లో నంబర్ వన్గా ఉన్నాం. ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతంగా భావిస్తున్నాం. రూ.3,000 కోట్లతో గుంటూరులో దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం. ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లోనే పూర్తి – సుమిత్ బిదానీ, కెనాఫ్ సంస్థ సీఈవో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పేందుకు మేమే నిదర్శనం. శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్గా 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో 24 ఎకరాల్లో నిర్మించాం. 200 మందికి నేరుగా ఉపాధి కల్పించాం. సీఎం జగన్ సహకారం, ప్రోత్సాహంతో పెట్టుబడుల ఒప్పందం జరిగిన 18 నెలల్లోనూ మా ప్రాజెక్టుని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాం. ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని అనుమతుల్ని తేలికగా పొందాం. శ్రీసిటీలో విద్యుత్ సరఫరా చాలా అద్భుతంగా ఉంది. ముడిపదార్థాలు, ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు పలు పోర్టులు 100 కి.మీ. లోపు ఉండటం, బహుళ రహదారుల అనుసంధాన వ్యవస్థ కూడా ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామికవేత్తలకు బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు విస్తరణ ఏపీలోనే – సజ్జన్ భజాంకా, సెంచురీ ప్లై చైర్మన్ ఏపీలో 14 నెలల క్రితం మా కలల ప్రయాణం ప్రారంభమైంది. సీఎం జగన్ను మొదటిసారి కలసినప్పుడు మా ప్లాంట్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో వెళ్లాం. ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి? నోడల్ ఆఫీసర్లు ఎవరు..? ఇలా అన్నీ ఒక్క మీటింగ్లోనే డిసైడ్ అయిపోయాయి. అన్నీ కుదిరితే 2024 కల్లా ప్లాంట్లో ఉత్పత్తులు ప్రారంభించగలమని అనుకున్నాం. సీఎం ప్రోత్సాహంతో కేవలం రెండేళ్లలోనే 2021 డిసెంబర్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో మా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సులభంగా మారింది. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మా రాష్ట్రం, మా ప్రాంతం అనే భావనకు వచ్చేశాం. ప్రతి ఒక్క అధికారి, రాజకీయ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీని మా ఫస్ట్ చాయిస్గా మార్చేశారు. రూ.10 వేల కోట్లకు కియా పెట్టుబడులు – కబ్ డాంగ్లీ, కియా మోటర్స్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ప్లాంట్ నిర్మించాం. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరువలేనిది. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో కియా ఇండియా లీడింగ్ కంపెనీగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2023 చివరి నాటికల్లా ఈవీ–6 తయారు చేస్తాం. ఏపీలో 2027 నాటికల్లా కియా పెట్టుబడులు రూ.10 వేల కోట్లకు చేరుకోనున్నాయి. నిరంతర విద్యుత్, స్కిల్డ్ మానవ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అందించారు. కోవిడ్ సమయంలో మా ఉద్యోగులు, ముడి సరుకులను తరలించడంలో సీఎం జగన్ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీరం వెంట పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా. ప్రభుత్వ సహకారానికి సాహో – మసహిరో యమగుచీ, టోరే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ శ్రీసిటీలో ప్లాంట్ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ సహకారం మరువలేనిది. అనుమతులన్నీ అతి తక్కువ సమయంలోనే మంజూరు చేశారు. ఫస్ట్ ఫేజ్లో 2019లోనే ఉత్పత్తులు ప్రారంభించాం. రెండో ఫేజ్లో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ను అభివృద్ధి చేసి ఉత్పత్తుల్ని ఈ ఏడాది మొదలు పెట్టాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయో, నానోటెక్నాలజీ, పాలిమర్ కెమిస్ట్రీ కోర్ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. శ్రీసిటీలో హైక్వాలిటీ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నాం. 132 కేవీ విద్యుత్ లైన్ని ప్రత్యేకంగా మాకోసం అందించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అద్భుతంగా అమలు చేస్తున్నారు. స్టార్టప్, గ్రీన్ ఎనర్జీపై ఆసక్తి.. – మార్టిన్ ఎబర్హార్డ్, టెస్లా కో ఫౌండర్ టెస్లా ప్రారంభించినప్పుడు ఎవరికీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తారనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రతి దిగ్గజ కార్ల కంపెనీకి ఈవీ కార్ల గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్టార్టప్ కంపెనీలకు గొప్ప ఎకో సిస్టమ్ ఉంది. ఏపీలో స్టార్టప్స్తో పాటు గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో సదస్సుకు హాజరయ్యా. ఈవీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. గ్రీన్ రివల్యూషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టార్టప్ కంపెనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక్కటే చెబుతున్నా.. ఓడిపోయామని వదలొద్దు.. విజయం సాధించే వరకూ అడుగులు వేస్తూనే ఉండాలి. -
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది. ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే. కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా? ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే.. వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది. -
నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. బీజేపీకి షాక్ తగులుతుందా?
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్ షాక్ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్ టారిఫ్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్పీపీపీఏ) రూపంలో పెంచింది. ప్రస్తుతం యూనిట్ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్లో విద్యుత్ వినియోగదారులు 2021 మే–జూన్లో యూనిట్కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్ నాటికి యూనిట్ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది. గత రెండు నెలల్లోనే యూనిట్కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్ చెప్పారు. గుజరాత్లో విద్యుత్ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్ గుజరాత్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఆప్ వర్సెస్ బీజేపీ గుజరాత్లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్ 31కి ముందు జారీ అయిన పెండింగ్ విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్ కూడా ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ అధికార పార్టీకి సవాల్గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ హామీ నెరవేరాలంటే గుజరాత్ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్ తిప్పి కొడుతోంది. గుజరాత్లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్ గుజరాత్ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్ పటేల్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్ పటేల్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులను పారిశ్రామికవేత్తలుగా...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్ డ్యూటీ, రీయింబర్స్మెంట్, ఏపీఎస్ఎఫ్లలో అడ్వాన్స్ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?) 2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి. ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎస్ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు) ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. - వి. భక్తవత్సలం డీఐపీసీ సభ్యులు, ఒంగోలు -
జగనన్న దసరా కానుక
సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి వైఎస్సార్ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్సెంటివ్తో ఎంతో ఉపయోగం నేను నోట్బుక్లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్ పని చేస్తుంది. ఈసారి కోవిడ్ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది. – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా రూ.21 లక్షల సబ్సిడీ పొందాను నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. – సీహెచ్ ఏసుపాదం, ఐఎంఎల్ పాలిమర్స్ కంపెనీ, పశ్చిమగోదావరి మమ్మల్ని నిలబెట్టారు నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్ కంపెనీ స్థాపించి, బల్క్ డ్రగ్లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్ లేదు.. ఇంకోపక్క కోవిడ్.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది. – డి.రవికుమార్, విశాఖపట్నం -
స్వచ్ఛతకు పెద్దపీట: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్యం తగ్గించేందుకు పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి పురస్కరించుకుని విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ మహోత్సవ్-2020 అవార్డ్ గ్రహీతలకు ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్- 2021 కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. 2014లో రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారని, ప్రజలంతా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఎయిర్ సీడింగ్ ద్వారా కొండల్లో పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ సిటీ గా విశాఖ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పథకంలోను మహిళలకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సుందర నగరం విశాఖ:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం సుందర నగరమని పేర్కొన్నారు. విశాఖలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు హెలికాప్టర్స్ లో సీడ్ బాల్స్ ను కొండల్లో వదలడం ద్వారా మరింతగా పచ్చదనం పెంచవచ్చన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని, మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎంపీ కె.సత్యవతి మాట్లాడుతూ ఏపీకి వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు.ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే వాసుపల్లి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 25 లక్షలు మొక్కలు నాటాలి అని సీఎం లక్ష్యం గా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 23 శాతం నుంచి 33 శాతం అటవీ ప్రాంతం పెంపునకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు.. విశాఖ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు లక్ష విత్తన బంతులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించుకుంటున్నామని, 50 వేల మందికి చెత్త బుట్టలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు నేడు సాయంత్రం 7 గంటలకు వలంటీర్లు, కార్యదర్శులను చప్పట్లతో అభినందించాలని ఆమె కోరారు. మంచి కోసం జరిగే మార్పులో వీరి పాత్ర చాలా కీలకమైందని ఆమె పేర్కొన్నారు. -
వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి : వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి జరగనుందని, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధపెట్టామన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం 7 హార్బర్లను అధునాతనంగా నిర్మించనున్నామని వెల్లడించారు. మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ఆన్లైన్ సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహా సకల సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్లను నిర్మిస్తాం. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలోని అనువణువు శోధించి పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించనున్నాం. ( ఐఎస్బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి) ఏ పరిశ్రమ వచ్చినా ఎక్కడ ఏర్పాటు చేయాలో రూట్ మ్యాప్ కోసం క్లస్టర్లుగా విభజన జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకెళుతున్నాం. అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్న విశాఖ ఎయిర్ పోర్టును డిసెంబర్లో నిర్మాణ పనులు చేపడతాం. రోడ్లుంటే ఎయిర్ పోర్టులు లేకపోవడం, ఎయిర్ పోర్టులుంటే పోర్టులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు లేకుండా సమగ్రంగా అన్ని రవాణా సదుపాయాలపై శ్రద్ధ వహించాం. తిరుపతి ఎయిర్ పోర్ట్ను ఇంటర్నేషనల్ కార్గో హబ్గా, కర్నూలు ఎయిర్ పోర్ట్ త్వరలోనే ఆన్లైన్లోకి వస్తుంది. కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురానున్నాం. విజయవాడ విమానాశ్రామాన్ని విస్తరించనున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. రానున్న 2-3 సంవత్సరాలలో 5 విమానాశ్రాయాలు పూర్తి సదుపాయాలతో అందుబాటులోకి వస్తాయి. ఒక్కో పోర్టుకు రూ.10వేల కోట్లలాగా...3 మేజర్ పోర్టులు, దాదాపు 2వేల కోట్లు వెచ్చించి 7 ఫిషింగ్ హార్బర్లు, 3 రాజధానులు, కారిడార్లు సిద్ధమవుతాయి. 175 నియోజకవర్గాల్లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య లేకుండా రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేసి వాటర్ గ్రిడ్ ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుంది’’ అని వెల్లడించారు. -
‘కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి’
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ఐఏఎస్ అధికారుల నుంచి.. కాంట్రాక్ట్ ఉద్యోగి వరకు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేశారని పేర్కొన్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో 58 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు 19 వేలకు పైగా పడకలను అత్యవసర చికిత్స కోసం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యుల రక్షణ కోసం పీపీఈ కిట్స్ను విశాఖ జిల్లాలోనే తయారు చేసుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) రాష్ట్రంలో ప్రతి పేదవానికి వాలంటీర్ల ద్వారా రేషన్తో పాటు రూ.1000 సాయం అందించామని చెప్పారు. భౌతిక దూరం పాటించడంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని ఆయన సూచించారు. పేదలెవరూ ఆకలితో ఉండకుండా పారిశ్రామికవేత్తలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణకు విశాఖ పారిశ్రామికవేత్తలు రూ.4 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్కు అందించారన్నారు. సీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయిలకి పైగా విరాళాలు ఇచ్చారని వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో శానిటైజర్లు, మాస్క్లు, వైద్య పరికరాలను ఇవ్వాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. -
సీఎం జగన్ను కలిసిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం
సాక్షి, తాడేపల్లి: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్తో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూలతలను పారిశ్రామికవేత్తల బృందానికి వివరించారు. డైరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల బృందం ఆసక్తి కనబరిచింది. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
వర్సిటీల్లో పరిశోధన వెనకబడుతోందా?
విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రెండు కళ్ళలాంటివి. పరిశోధన ప్రాముఖ్యత విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల బోధనపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. విశ్వవిద్యాలయాల పరిశోధన ఆర్థిక, సామాజికాభివృద్ధి, బోధనా పటిష్టతకు తోడ్పడుతుంది. అనేక దేశాలలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక విప్లవం విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి నడుస్తున్న దృష్టాంతాలు అనేకం. అదే విధంగా మనదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి వుంది. విచిత్రమేమిటంటే పారిశ్రామికవేత్తలు మన దేశంలో విశ్వవిద్యాలయ పరిశోధన పటిష్టతకు ఎక్కువ చేయూతనివ్వలేదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన పారిశ్రామిక వేత్తలకు ప్రత్యక్ష్యంగా ఉపయోగపడే విధంగా లేకపోవడం ఒక కారణం. సమాజాభివృద్ధికి కావల్సిన∙పరిశోధనా పరమైన అంశాలను విశ్వవిద్యాలయాల్లో చేపట్టకపోవడం ఒక విధమైన చేదు అనుభవం. ప్రభుత్వ ఆర్థిక సహాయం, పారిశ్రామికవేత్తల చేయూత విశ్వవిద్యాలయంలో పరిశోధనాభివృద్ధికి రెండు మూలస్తంభాలుగా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయం గత మూడు దశాబ్దాలుగా సన్నగిల్లి, పారిశ్రామికవేత్తలు పూర్తిగా విస్మరించడం వల్ల విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యవస్థ కుంటుపడి ముందుకు నడవలేకపోతోంది. ఈ పరిశోధనా వ్యవస్థ పటిష్టం కాకపోవడానికి ఆర్థిక సహాయ లోపమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పరిశోధనా పటిమ తగ్గడం ముఖ్య కారణంగా భావించవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనా ఫలాలు గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పడిపోయాయని మన గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదకరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పరి శోధన విధానాలను సామాజికాభివృద్ధికి ఉపయోగంగా మలచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇవే విశ్వవిద్యాలయాల పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయ అధ్యాపక నియామకాలను పరిశీలించినట్లయితే 1990 తర్వాత పరిశోధన పటిష్టత లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మన ప్రభుత్వాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై అనేక విధాలుగా నిర్లక్ష్యం వహిస్తూండటం వల్ల వాటి ప్రమాణాలు దిగజారుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత దుర్భర పరిస్థితిని మార్చాలంటే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఇందులో ప్రధానంగా ప్రతిభ, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఉపకులపతులుగా నియమించే ప్రక్రియ అత్యంత కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల స్థితిగతులను పరిశీలిస్తే, ఉన్నతవిద్య ప్రమాణాలు గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలోని 20 విశ్వవిద్యాలయాల్లోనూ బోధన చాలా తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితో కొనసాగుతోంది. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నేను 1977–78లో పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 120 మంది పరిశోధక విద్యార్థులు ఉండేవారు. అప్పటికి యూనివర్సిటీగా గుర్తింపు లేదు. పీజీ సెంటర్గానే వుండేది. కానీ అప్పటి ఆచార్య బృందానికి బోధనపై ఎంత పట్టు ఉండేదో, అంతే స్థాయిలో పరిశోధనపై కూడా ఉండేది. ఇది అన్ని శాఖలకు వర్తించేది. విశ్వవిద్యాలయ హోదా పొందిన తర్వాత గత ముఫ్ఫై ఏళ్లలో వర్సిటీల్లో బోధన పటిమ, పరిశోధనా సామర్థ్యాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా బోధనా సిబ్బంది గణనీయంగా తగ్గిపోవడం, అదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం. 1980వ దశాబ్దంలో దాదాపు 20 విభాగాల్లో 200 మంది బోధనా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు దాదాపు 36 విభాగాల్లో 70 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా విశ్వవిద్యాలయంపై విద్యార్థులకున్న నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఉపకులపతులు అనేక రకాలైన చట్టపరమైన, పాలనాపరమైన చిక్కుముడుల వల్ల అధ్యాపకుల నియామకాలు చేపట్టలేకపోయారు. పీజీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల బోధన లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విష వలయం నుండి బయటపడాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, బోధన సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాల్సి వుంది. ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులైనా సరే వేగవంతం కావాలంటే ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో విద్యా విస్తరణ పటిష్టతతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకొని విశ్వవిద్యాలయాల విశిష్టతను పెంపొందించి, విద్యాభివృద్ధికి, రాష్ట్రాల మానవవనరుల నైపుణ్యాభివృద్దికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఏపీలో, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్ మానవ వనరుల అభివృద్ధికి కృషి చేసే దిశగా ప్రయత్నం చేస్తుండటం శుభసూచకం. ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. వ్యాసకర్త: ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ అనంతపురం, మొబైల్ : 94408 88066 -
‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించేందుకు పరిశ్రమ ప్రముఖులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. మంత్రిని కలిసే వాణిజ్య ప్రముఖుల్లో ఉదయ్ కొటక్, బీకే గోయంకా, సజ్జన్ జిందాల్, అనిల్ ఖైతాన్, అజయ్ పిరమల్, సంగీతా రెడ్డి, దిలీప్ సంఘ్వి, సంజీవ్ పూరి, రిషబ్ ప్రేమ్జీలున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం, సిమెంట్ , ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్పై జీఎస్టీ తగ్గింపు వంటి పలు డిమాండ్లను వారు ఆర్థిక మంత్రి ముందుంచనున్నారు. మధ్య,చిన్నతరహా పరిశ్రమల్లో సులభతర వాణిజ్యం పెంచేందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సూచీ ఆవశ్యకతను వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆర్థిక వ్యవస్ధను ఉత్తేజపరిచేందుకు రూ లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటించాలని కూడా పారిశ్రామికవేత్తలు మంత్రిని కోరతారని సమాచారం. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. -
సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి
న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్లు.. సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్, టాంగ్లిన్ డెవలప్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్స్టార్ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరో 20 శాతం పడిన షేరు.. తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్ను తాకింది. బీఎస్ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్ఎస్ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే. -
పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్ఆర్ఐ హల్చల్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్నెం–12లో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ఎన్ఆర్ఐ సదరు ఇంటి యజమానికోసం గాలిస్తూ ఆయన భార్య, అడ్డువచ్చిన సెక్యురిటీ గార్డులను బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్నెం–12లోని పారిశ్రామికవేత్త ఇంటికి వచ్చిన ఇద్దరు అపరిచితులు వచ్చి తాము సదరు పారిశ్రామికవేత్తను కలిసి బొకే ఇచ్చి వెళ్లడానికి వచ్చినట్లు సెక్యురిటి గార్డు కృష్ణకు చెప్పారు. అతను ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పేందుకు లోపలికి వెళ్లగానే వారు ఇద్దరూ బలవంతంగా లోపలికి ప్రవేశించారు. దీంతో మీరెవరంటూ సదరు పారిశ్రామికవేత్త భార్య మంజులారెడ్డి ప్రశ్నిస్తుండగానే వారు ఇంటి ఫోటోలు తీస్తూ తమకు ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఆయన ఎక్కడ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన ఇంట్లో లేరని చెప్పినా వినిపించుకోకుండా న్యూసెన్స్ చేశారు. ఆసభ్యంగా దూషిస్తూ తమకు రావాల్సిన రూ.18కోట్లు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని బెదిరించారు. దీంతో ఆమె సెక్యురిటీ గార్డులను పిలిచి పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి వెళ్లిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రధాన నిందితుడు తన పేరు పొన్ విశాఖన్ అలియాస్ నిక్గా తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన తనకు ఆ ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఈ విషయం అడగేందుకే వచ్చినట్లు చెబుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. తమిళనాడుకు చెందిన విశాఖన్ ఆస్ట్రేలియాలో స్థిర పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని చెన్నైకి చెందిన రాఖేష్ రాజ్గా తెలిపారు. నమోదు చేసిన పోలీసులు వారిరువురిని అరెస్ట్ చేశారు. -
పన్నుల విధానంలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల విధానంలో సమూల మార్పులు తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో లోపభూయిష్టమైన విధానాల కారణంగా చిన్న, మధ్యతరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్కడ ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ఏర్పాటు చేసిన యువ పారిశ్రామిక వేత్తల ప్రత్యేక భేటీలో రాహుల్ పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రహ్మణి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనయుడు పవన్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూ ల మార్పులతో పాటు ఒకే శ్లాబ్ విధానాన్ని తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పారిశ్రామిక విధానాలు, తెలుగు రాష్ట్రాల వృద్ధిరేటు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై చర్చించిన రాహుల్ ఆ తరువాత అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనలో దేశం వెనుకబడిపోయిందని, చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలను సృష్టిస్తుంటే మన దేశం లో కేవలం 450 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఎవరికి ప్రయోజనం చేకూర్చిందో అంతుపట్టడం లేదన్నారు. సులభతర వ్యాపార నిర్వహణ, ప్రోత్సాహకా లు లాంటివి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సరళీకృత విధానాలను తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపుతామని రాహుల్ హామీ ఇచ్చారు. -
పారిశ్రామికవేత్తలతో ఉంటే భయమేంటి?
లక్నో: పారిశ్రామికవేత్తలతో కలిసి ఉంటారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వారితో కలిసుంటే తప్పేమీలేదని.. అందుకు తాను భయపడబోనన్నారు. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దేశం 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు విపక్షాలే కారణమని.. వీటికి ఆ పార్టీలే జవాబుదారీ అని విమర్శించారు. ఆదివారం లక్నోలో రూ.60వేల కోట్ల విలువైన 81 పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. వారు దొంగలు కారు! పారిశ్రామికవేత్తలను దొంగలు, దోపిడీ దారులంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని మోదీ అన్నారు. తన ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నందున.. వ్యాపార, పారిశ్రామిక వర్గంతో కలిసి నడవడాన్ని తప్పనుకోవడం లేదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి కూడా బిర్లా కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవని.. అంతమాత్రాన గాంధీ ఉద్దేశాలను తప్పుబట్టలేమన్నారు. ‘రైతులు, బ్యాంకర్లు, ప్రభుత్వోద్యోగులు, కార్మికుల్లాగే.. పారిశ్రామికవేత్తలు కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు. నన్ను విమర్శించేందుకు కారణాలు వెదుకుతున్న వారు.. 70 ఏళ్లుగా వారు చేసిన తప్పుల వివరాలు వెతుక్కోవాలి’ అని మోదీ విమర్శించారు. ‘ప్రజలతో కలవలేని వారు, తెరవెనుక పనులు చేసేవారు భయపడుతూనే ఉంటారు. కావాలంటే దీనిపై ఇక్కడున్న మాజీ ఎస్పీ నేత అమర్సింగ్ పూర్తి వివరాలిస్తారు’ అని మోదీ నవ్వుతూ చెప్పారు. ‘తప్పుడు పనులు చేసేవారు దేశాన్ని వదిలిపెట్టి పోవాలి. లేదంటే జైలు జీవితం గడపాలి. గతంలో అంతా తెరచాటున జరిగేది కాబట్టే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. ఇకపై ఇలాంటివి నడవవు’ అని ప్రధాని స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా హాజరయ్యారు. -
వారిని కలిసేందుకు భయపడను..
లక్నో : పారిశ్రామికవేత్తలతో తాను సన్నిహితంగా ఉంటానన్న విపక్షాల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా బదులిచ్చారు. ఇతరుల మాదిరి తాను పారిశ్రామికవేత్తలతో కలిసి కనిపించేందుకు భయపడబోనని పరోక్షంగా రాహుల్, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిప్తారని పేర్కొన్నారు. గతంలో మహాత్మ గాంధీ స్వాతంత్రపోరాట సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన బిర్లా హౌస్లో బస చేసేవారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. పరిశ్రమ అధినేతలు హాజరైన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం లక్నోలో 81 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. కొందరు బాహాటంగా పారిశ్రామికవేత్తలను కలువని నేతలు తెరచాటుగా వారితో సన్నిహితంగా మెలుగుతారని..పారిశ్రామికవేత్తల విమానాల్లో వీరు విహరిస్తుంటారని మోదీ ఆరోపించారు.దేశ అభివృద్ధికి సహకరించే పారిశ్రామికవేత్తలను దొంగలని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. కాగా రైతులు, అణగారిన వర్గాల వారిని విస్మరిస్తూ ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. -
అప్పులతోనే చిన్నాభిన్నం
జయనగర : వ్యాపారంలో వచ్చిన నష్టాలతోనే పారిశ్రామికవేత్త గణేశ్ సహనం కోల్పోయి భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. హాసన్ జిల్లాకు చెందిన గణేశ్ కాఫీ తోటలు విక్రయించి వచ్చిన డబ్బుతో కెంగేరిలో హెర్బల్ ఉడ్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కావడంతో రిసార్టు అమ్మకానికి పెట్టాడు. ఇదే సమయంలో భార్య సహాన ఆస్తి విక్రయానికి సమ్మతించకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన గణేశ్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరి పాడు. తనకు హత్య చేసే ఉద్దేశ్యం లేదని, క్షణికావేశంలో జరిగిన హత్యతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కారులో పారిపోతూ పిల్లలతో పాటు తాను ఆత్మహత్యకు యత్నించడంలో భాగంగా పిల్లలపై కూడా తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా సహనా, గణేశ్లది ప్రేమ వివా హం. గురువారం ఉదయం 11.30 గంటలకు సహనాను హత్య చేసి, స్కూల్లో చదువుతున్న పిల్లలను తీసుకుని కారులో ఉడాయించాడు. పిల్లలను రాత్రంతా రిసార్టులో ఉంచుకున్నాడు. శుక్రవారం పిల్లలను కారులో తీసుకుని వెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పిల్లలు సిద్ధార్థ (15), సాక్షి (9)లు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కుదుంబ బృందం
కోళికోద్.. ఒకప్పటి కాలికట్. అరేబియా తీరం. వాస్కోడిగామా సముద్రమార్గాన ఇండియాకి చేరింది ఇక్కడే. కేరళలోని ఓ జిల్లా కేంద్రం ఇది. ఈ కోళికోద్ ఇప్పుడు మళ్లీ ఓ చరిత్రకు శ్రీకారం చుట్టింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఓ షాపింగ్ మాల్ను కట్టింది కోళికోద్ కార్పొరేషన్. కుదుంబశ్రీ బజార్ ప్రాజెక్ట్ పేరుతో అర ఎకరా స్థలంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ను కట్టింది. ఈ ఐదంతస్తుల భవనంలో ఉన్న అన్ని షాపులనూ మహిళలకే అద్దెకిస్తారన్నమాట. అంటే మహిళలు స్థాపించిన పరిశ్రమలు, వ్యాపారాలకే ఈ దుకాణాలు. ఈ ప్రాజెక్టు ఇచ్చిన భరోసాతో కేరళ మహిళలు కుదుంబశ్రీ (కుటుంబశ్రీ) పేరుతో సంఘటితమయ్యారు. పదిమంది నుంచి పదిహేను మందితో చిన్న చిన్న బృందాలయ్యారు. తమకు ఆసక్తి ఉన్న పనుల్లో నైపుణ్యం సాధించి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సూపర్మార్కెట్, ఫుడ్కోర్ట్, కిడ్స్ పార్క్, స్పా, బ్యూటీపార్లర్, ఉమెన్స్ బ్యాంక్, ఫ్యాన్సీ స్టోర్, టెక్స్టైల్స్, రెడీమేడ్స్, బొటిక్, ఫుట్వేర్, డ్రై క్లీనింగ్, కార్ వాషింగ్, ఆప్టికల్ స్టోర్, హ్యాండీ క్రాఫ్ట్స్, బేబీ కేర్, హోమ్ అప్లయెన్సెస్, బుక్స్టాల్స్.. ఇలా అన్నిట్లో అడుగుపెట్టారు. దాదాపుగా అన్నీ చిన్న తరహా వ్యాపారాలే. తక్కువ పెట్టుబడితో ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటులో భాగం ఇది. కుదుంబశ్రీ బృందాలు మన దగ్గర ఉన్న సెల్ఫ్హెల్ప్ గ్రూపుల వంటివి. వీరిలో కొంతమంది వ్యక్తిగతంగా, మరికొందరు బృందంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తమ వ్యాపారాలతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యత కూడా ఈ మహిళలే చూసుకుంటారు. ఈ మాల్ మొత్తం ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ల కోసమే. కుదుంబశ్రీ సభ్యులకు దుకాణాల అద్దె పదిశాతం తగ్గుతుంది, ఈ బృందంలో సభ్యులు కాని మహిళలకు అద్దెలో రాయితీ ఉండదు. ఈ మాల్లో కాన్ఫరెన్స్ రూమ్లు, ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కేరళ మహిళలు అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నారు, ఉద్యోగాల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండడానికి ప్రభుత్వం ఇస్తున్న సహకారమిది. – మంజీర -
బ్యాంకులను ముంచిన రాజకీయవేత్తలు
-
పెట్టుబడిదారులే వీఐపీలు
సాక్షి, అమరావతి: పెట్టుబడిదారులే వీఐపీలని, వారు దేశం కోసం పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎంఓయూలు కుదుర్చుకుని పరిశ్రమ స్థాపించే వరకు ఇబ్బందులు లేకుండా పారిశ్రామికవేత్తలను వీఐపీలుగా చూస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో ఏర్పాటు చేస్తున్న 75 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఇంజనీరింగ్ క్లస్టర్కు విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని రిమోట్ ద్వారా నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులను వీడియో ద్వారా పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలో 95 శాతం ఎంఎస్ఎంఈలే ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి రేటు 1.60 శాతం ఉంటే ఏపీలో 8.05 శాతం ఉందని, మాన్యుఫ్యాక్చరింగ్లో 1.2 శాతం ఉంటే ఏపీ 8.83 శాతం అభివృద్ధి నమోదు చేసుకుందన్నారు. రాష్ట్రంలో వనరులకు కొదవలేదని, అయితే వాటిపై దృష్టి పెట్టడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. రెండు వేల సంవత్సరాల క్రితమే అమరావతి లాజిస్టిక్ హబ్గా ఉండేదని, ఇప్పటికీ భారతదేశంలో ఏపీనే కార్గో హబ్గా ఉందని సీఎం అన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
► నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు ► అధికారులకు కలెక్టర్ కోనశశిధర్ హెచ్చరిక గుంటూరు వెస్ట్: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను సూచించారు. ఈ విషయంలో అధికారుల అలసత్వం ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్న పరిశ్రమలు పెట్టేందుకు యువత ఆసక్తిని చూపుతున్నారన్నారు. వారిని గుర్తించి ప్రోత్సహిస్తే ఎందరికో ఉపాధి చూపిస్తారని పేర్కొన్నారు. యువత పరిశ్రమల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో లోపాలు ఉంటే అవి అధికారులే సరిదిద్దాలన్నారు. పదే పదే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఇబ్బంది పడతారని అధికారులను హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన వారికి ఏకగవాక్ష విధానంలో వీలైనంత త్వరగా లైసెన్స్లు మంజూరు చేయాలన్నారు. అప్పుడే మిగతా వారికి ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. పరిశ్రమ స్థాపించే వారికి వచ్చే సబ్సిడీ, రుణాలు, ప్రోత్సాహకాలు ఇతర ఉపయోగాలను అభ్యర్థులకు అర్థమయ్యేట్లు వివరించాలన్నారు. అధికారులు మాట్లాడుతూ గత సమావేశం నుంచి ఇప్పటి వరకు 116 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 96 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇన్సెంటివ్స్ కింద 714లు రాగా, వాటిలో 544 మంజూరు కోసం పంపించామన్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల తిరస్కరించామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మళ్ళీ వచ్చే సమావేశానికల్లా ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్శరరావు, పరిశ్రమల శాఖ జీఎం అజయ్కుమార్, ఎల్డీఎం.సుదర్శనరావు,అధికారులు పాల్గొన్నారు. భూములివ్వని వారికి అవగాహన కల్పించండి: కలెక్టర్ గుంటూరు వెస్ట్: రాజధాని నిర్మాణం కోసం భూములివ్వని గ్రామాల ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి, ఒప్పించాలని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని మాస్టర్ ప్లాన్లోని కొండమరాజుపాలెం, లింగాయపాలెం, పెనుమాక గ్రామ ప్రజలు భూమిలిచ్చేందుకు సుముఖత చూపడం లేదన్నారు. కేవలం అవగాహనా రాహిత్యం వల్లే వీరు భూములివ్వడం లేదన్నారు. 2013 చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. పలుగ్రామాల నుంచి వచ్చిన కమిటీ సభ్యులతోనూ కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్ల, ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
పైసల్లేవు.. పరి‘శ్రమే’ మిగిలింది!
‘టీ–ప్రైడ్’కు నిధుల జాడ్యం మంజూరై రెండేళ్లయినా విడుదల కాని పెట్టుబడి రాయితీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.262 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు నిరర్థక ఆస్తులుగా మారుతున్న పెట్టుబడి రుణాలు రుణాలు తీర్చాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు సంక్షోభంలో ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలు! ఓ దళిత మెకానికల్ డిప్లొమా ఇంజనీర్ హైదరాబాద్లోని బాలానగర్ పారిశ్రామికవాడలో ‘టీ–ప్రైడ్’ పథకం కింద రూ.కోటి పెట్టుబడితో సీఎన్సీ మౌల్డింగ్ మెషీన్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, డీఆర్డీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వర్క్ ఆర్డర్లు కూడా వచ్చాయి. అయితే ఆయా సంస్థలు ఆరు నెలలకోసారి బిల్లులు చెల్లిస్తుంటాయి. దీంతో పరిశ్రమ నిర్వహణ కష్టతరంగా మారింది. పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించలేక.. ఉత్పత్తి కొనసాగించేందుకు కావాల్సిన నిధుల్లేక ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాయితీ నిధులు వస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. బ్యాంకులు ఈ పరిశ్రమకు ఇచ్చిన రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా లెక్కగట్టి.. మొత్తం రుణం కట్టేయాలంటూ నోటీసులిచ్చాయి. దీంతో పరిశ్రమ సంక్షోభంలో పడింది. ‘టీ–ప్రైడ్’అమల్లో జాప్యం కారణంగా ఇలా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీ–ప్రైడ్’కార్యక్రమం ఆచరణలో విఫలమవుతోంది. పరిశ్రమలు స్థాపించిన వెంటనే రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తే పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండగా... దరఖాస్తు చేసుకుని రెండేళ్లయినా పెట్టుబడి రాయితీ అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల వడ్డీలు పెరిగి పెట్టుబడి రుణాలు భారంగా మారుతున్నాయి. ఉత్పత్తుల విక్రయాల బిల్లులు సకాలంలో అందక పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోంది. తీవ్ర జాప్యం.. అరకొరగా నిధులు.. రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీ ప్రతి మూడు నెలలకోసారి, జిల్లా స్థాయి కమిటీలు నెలకోసారి సమావేశమై ‘టీ–ప్రైడ్’ పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేయాలి. కానీ సమావేశాలు జరిగి ఏడాదిన్నర, రెండేళ్ల తర్వాత కూడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీలు విడుదల కావడం లేదు. ఈ పథకానికి ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించినా.. విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2016–17లో ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం రూ.128 కోట్లు కేటాయించగా.. రూ.32 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. 96 కోట్లు కేటాయించగా.. రూ.24 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2017–18లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కలిపి రూ.218 కోట్లు కేటాయించగా.. ఏప్రిల్లో రూ.101 కోట్లు విడుదలయ్యాయి. 2016–17లో ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించిన మొత్తం రూ. 128 కోట్లు ఇందులో విడుదల చేసిన మొత్తం రూ. 32 కోట్లు 2016–17లో ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించిన మొత్తం రూ. 96 కోట్లు ఇందులో విడుదల చేసిన మొత్తం రూ. 24 కోట్లు 2017–18లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించిన మొత్తం రూ. 218 కోట్లు ఇందులో ఏప్రిల్లో విడుదల చేసిన మొత్తం రూ. 101 కోట్లు టీ– ప్రైడ్ పథకమిదీ.. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు 2014 నవంబర్ 2న ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ ఎంటర్ప్రినియర్స్ ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ (టీ–ప్రైడ్)’అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా రూ.75 లక్షలకు మించకుండా పరిశ్రమలో 35 శాతం పెట్టుబడి రాయితీతోపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎస్టీ, ఎస్టీలు పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారు. రూ. 262 కోట్ల బకాయిలు ∙ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి.. 2016 ఏప్రిల్ 22 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎస్ఎల్సీ సమావేశాల్లో, 2016 ఆగస్టు 10 నుంచి ఇప్పటివరకు జరిగిన డీఎల్సీ సమావేశాల్లో మంజూరు చేసిన రూ.130 కోట్ల పెట్టుబడి రాయితీ నిధులను ఇంతవరకు చెల్లించలేదు. దాదాపు 2,500 మంది దళిత పారిశ్రామికవేత్తలు ఈ ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నారు. ∙ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి 2016 జనవరి 8 నుంచి ఎస్ఎల్సీ సమావేశాల్లో, 2015 ఆగస్టు 31 నుంచి జరిగిన డీఎల్సీ సమావేశాల్లో మంజూరు చేసిన రూ.132 కోట్ల నిధులను ఇంకా చెల్లించాల్సి ఉంది. సుమారు 2,500 మంది రాయితీ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మూతపడేలా ఉన్నాయి ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ–ప్రైడ్ కింద చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీలను ఆరు నెలలలోపు విడుదల చేయాలి. పెట్టుబడి రాయితీలు ఆలస్యంగా విడుదల చేస్తుండటంతో బ్యాంకు రుణాలు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తుతోంది..’’ – రాహుల్ కిరణ్, డిక్కీ -
జార్ఖండ్లో పెట్టుబడులు పెట్టండి-రతన్ టాటా
జార్ఖండ్ లోపెట్టుబడులు పెట్టాల్సిందిగా తోటి పారిశ్రామిక వేత్తలకు టాటా గ్రూపు అధినేత పిలుపునిచ్చారు. జంషెడ్ పూర్ లోని వ్యాపార ప్రారంభ రోజుల గుర్తుచేసుకున్న టాటా గ్రూప్ మూలపురుషుడు రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పొటెన్షియాలిటీని అందిపుచ్చుకోవాలని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ 'సమ్మిట్ 2017 లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా వద్ద మాట్లాడుతూ దేశంలో వ్యాపారానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూ ఇండియాగాఅవతరించబోతోందన్నారు. అయితే కేవలం పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాలపైనే దృష్టిపెడితే సరిపోదని, ఈ ప్రగతిని మరింత విస్తరించాల్సినఅవసరం ఉందన్నారు. ఖనిజ సంపదలతో అలరారుతున్న సహజ సౌందర్యంతో విలసిల్లే ప్రదేశం జార్ఖండ్ లో పెట్టుబడులపై దృష్టిపెట్టాలని టాటా చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిందనీ ఆ దిశగా పురోగమిస్తూ ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కోరారు. కాగా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ . ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన టాటా స్టీల్ ప్రస్తానం జంషెడ్ పూర్ లో మొదలైన సంగతి తెలిసిందే. -
మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి
పలు రాష్ట్రాల పారిశ్రామిక విధానాల అధ్యయనం * పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ, ఎస్టీ మహిళలు * హైదరాబాద్కు దూరంగా ‘కాలుష్య’ పరిశ్రమలు * పరిశ్రమల శాఖపై కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మానవీయ కోణంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ పనిచేస్తుందని ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇటీవల పరిశ్రమల శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం పరిశ్రమల భవన్లో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, పెట్టుబడిదారులను తెలంగాణకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా పెట్టుబడులు వస్తున్నా దానికి పారిశ్రామిక వర్గాల్లో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘ప్రమోషనల్ వింగ్’ ఏర్పాటు చేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడంతో పాటు ఇదివరకే స్థాపించిన వాటిని కాపాడుకుంటూ వృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యతలో రాష్ట్రం తక్కువ ర్యాంకు సాధించడానికి కారణాలను ఆరా తీశారు. టీఎస్ఐపాస్ ఆవిష్కరణలో ఆలస్యమే అందుకు కారణమని అధికారులు వివరించారు. ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అసోచామ్, ఫిక్కి, డిక్కి వంటి పారిశ్రామిక, వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ చుట్టూ వున్న కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించేందుకు వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. చేనేత కార్మికులకు తగిన ప్రతిఫలం చేనేత కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలముండేలా ప్రణాళికలు రూపొందించాలని చేనేత, జౌళి శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. తమిళనాడు కో ఆప్టెక్స్ తరహాలో చేనేత, పవర్లూమ్ వస్త్ర దుకాణాల ఏర్పాటును పరిశీలించాలన్నారు. చేనేత విభాగంలో విభజన సమస్యలపై సమీక్ష జరిపారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చేనేత, వస్త్ర పరిశ్రమ డైరక్టర్ సభ్యసాచి ఘోష్, ఆప్కో ఎండీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్ల వ్యాపారం ఫ్లాప్!
ఆకివీడు: రాష్ట్ర విభజనతో భూములు విలువ భారీగా పెరుగుతుందని భావించారంతా. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, మదుపరులు ఇలా డబ్బున్న ఆసాములంతా భూములపై పెట్టబడులు పెట్టారు. పంట భూములు, ఖాళీ స్థలాలు, ఇతరత్రా భూముల్లో లే అవుట్లు వేశారు. జిల్లాలో 4 వేల ఎకరాలకు పైగా భూములు లేఅవుట్లుగా మారాయి. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ప్రాంతాల్లో 200 నుంచి 500 ఎకరాల భూములు, మండల కేంద్రాల్లో 50 నుంచి 200 ఎకరాలు, గ్రామ స్థాయిలో 5 నుంచి 20 ఎకరాల భూముల్ని లేఅవుట్లుగా మార్చేశారు. భూముల విలువకు రెక్కలొస్తున్నాయని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రూ.5 లక్షలున్న ఎకరం భూమి విలువను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పెంచి, ప్లాట్లుగా విభజించి బేరం పెట్టారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఈ భూములు కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గతేడాది చివరి నాటికి భూముల కొనుగోళ్లు ఒక్కసారిగా పడి పోయాయి. అమరావతి శంకుస్థాపన, ఆ ప్రాంతంలో భూముల కొనుగోళ్ల వ్యవహారం తదితర అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక మాంద్యమూ కారణమే! ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు సరిగా సాగక వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతుల దుస్థితి చెప్పనక్కరలేదు. ఇవన్నీ పరోక్షంగా భూముల కొనుగోళ్లు స్తంభించటానికి కారణమయ్యాయి. మున్సిపాల్టీల సరిహద్దు గ్రామాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూముల విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలూ కన్పించడంలేదు. వ్యాపారం పడిపోయింది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ప్రజల వద్ద డబ్బులేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన, విద్యా సంస్థల స్థాపన, ఇతరత్రా అభివృద్ధి ఏమీ జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొనేవారు లేకపోయినా లేఅవుట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. - అంబటి రమేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి తగ్గిన రిజిస్ట్రేషన్లు, పెరిగిన దస్తావేజులు భూముల అమ్మకాల శాతం తగ్గినా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు. భీమవరం జిల్లా రిజిస్టార్ పరిధిలో క్రియ దస్తావేజులు రిజిస్ట్రేషన్లు 1.52 శాతం పడిపోయింది. కొనుగోలు శాతం తగ్గడంతో క్రియ దస్తావేజులు చేయించుకునేవారి శాతం తగ్గింది. గతేడాది 27,541 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఈ ఏడాది 27,197 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భీమవరం పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. - మహ్మద్ సిరాజుల్లా, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం -
వారిని వ్యక్తిగతంగా కలవాలా?
పారిశ్రామికవేత్తలతో ప్రధాని, ఆర్థికమంత్రి భేటీలపై తన తాజా పుస్తకంలో ప్రణబ్ ప్రశ్న న్యూఢిల్లీ: ‘భారత ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలవాలా?’.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వీయ అనుభవాలతో విడుదల చేసిన తాజా పుస్తకంలో ఈ ప్రశ్నను సంధించారు. అయితే ఈ ప్రశ్నను ఆయనే జవాబూ ఇచ్చేశారు. పారిశ్రామికవేత్తలతో తనకు వ్యక్తిగతంగా లేదా సమష్టిగా జరిగిన భేటీలు చాలా కీలకమైనవని చెప్పారు. ప్రణబ్ అనుభవాలతో రచించిన ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-1996’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో 1988-1991 మధ్య దేశంలో సామాజిక, రాజకీయ సంక్షోభ సమయంలో వీపీ సింగ్కు తనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన వివరించారు. రాజీవ్గాంధీ కేబినెట్లో ఆర్థికమంత్రిగా నియమితులైన వీపీ సింగ్ పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా సమావేశం అయ్యేవారు కాదని, కానీ తాను ఆర్థికమంత్రి, వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో వారితో వ్యక్తిగతంగా, సమష్టిగా సమావేశమయ్యే వాడినని, ఇది సంబంధిత రంగాల గురించి పూర్తి అవగాహన చాలా కీలకమని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో విభేదాల గురించి ప్రణబ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ పదవి నుంచి మన్మోహన్ తప్పుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. తమ మధ్య వృత్తిపరమైన వైరుధ్యాలే తప్ప, మన్మోహన్తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సాధించిన అతి పెద్ద విజయం ఏమిటంటే.. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమే అని చెప్పారు. వీటి కారణంగానే మన దేశ వృద్ధిరేటు పెరిగిందని, మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేశాయని చెప్పారు. -
తెలంగాణలో పెట్టుబడులు కోరనున్న కేసీఆర్
-
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల సబ్సిడీ అందిస్తున్నాయని, దేశానికి వెన్నుముక అయిన రైతులకు అందించే రాయితీల విషయంలో వెనుకంజ వేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. పాలకొల్లు మార్కెట్యార్డులో గురువారం రైతులకు సబ్సిడీపై పవర్టిల్లర్లు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సభకు ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు అధ్యక్షత వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 878 మంది రైతులకు పవర్ టిల్లర్లు పంపిణీ చేయాల్సి వుండగా కొందరికే అందించారన్నారు. గ్రామాన్ని యూనిట్గా చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వవిప్ అంగర రామమోహన్, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా సబ్సిడీపై 30 పవర్టిల్లర్లు, మూడు వరికోత యంత్రాలు, 20 ఆయిల్ ఇంజన్లు, వంద టార్పాలిన్లు పంపిణీ చేశారు. మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్చైర్మన్ కర్నేన రోజారమణి, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, యలమంచిలి ఎంపీపీ బొప్పన సుజాత, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, ఆత్మ చైర్మన్లు అందే కోటి వీరభద్రం, ఆరిమిల్లి రామశ్రీనివాస్ (చిన్ని), వీఎస్టీ కంపెనీ ప్రతినిధి ప్రసాద్, శ్రీరామ ఆటోమొబైల్స్ అధినేత బలుసు శ్రీరామమూర్తి, ఏడీఏ పి మురళీకృష్ణ, ఏవో ఇడవలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కోతల్లేని కరెంట్
-
కోతల్లేని కరెంట్
* పారిశ్రామిక వేత్తలకు సీఎం కేసీఆర్ హామీ.. పరిశ్రమలు పెట్టాలని పిలుపు * రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన * రూ. 91.5 వేల కోట్లతో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం * మెదక్ జిల్లా కొడకంచిలో దక్కన్’ పరిశ్రమను ప్రారంభించిన సీఎం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ ఇస్తామని, ఇకముందు కరెంటు కోతలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో దక్కన్ ఆటో లిమిటెడ్ సంస్థ తయారుచేసిన బస్సులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇస్తున్నాను. గతంలో ఇక్కడ కరెంటు సమస్య విపరీతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత మొదట్లో కరెంటు సమస్య ఉన్నా... మేం చేపట్టిన చర్యల వల్ల ఆ సమస్యను అధిగమించాం. ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు కోతలు ఉండవు. ఈ రోజు 4,320 మెగావాట్లు ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్లకు పెంచబోతున్నాం. ఇప్పటికే రూ.91.5 వేల కోట్లు అంచనాతో పనులు ప్రారంభించాం. నూతన పారిశ్రామిక విధానంలో ప్రకటించిన విధంగా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న పదకొండో రోజునే 17 కంపెనీలకు అన్ని అనుమతులతో స్వయంగా అనుమతి పత్రాలు ఇచ్చాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 1997లో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే వారి కోసం ఆర్టీసీ తరఫున స్లీపర్కోచ్ బస్సులను డిజైన్ చేశామని చెప్పారు. అప్పటి బస్సులతో పోల్చి చూస్తే ఇప్పటి బస్సులు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని, త్వరలోనే దక్కన్ ఆటో సంస్థకు చెందిన బస్సులను తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీ బీ బీ పాటిల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి
* పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు * టీఎస్ ఐపాస్ కింద 17 పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేత * ఉపాధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికే నూతన పారిశ్రామిక విధానం * సత్వర అనుమతులతో పారిశ్రామిక స్వర్ణయుగానికి నాంది సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ప్రకటించాక తొలిసారి పరిశ్రమల స్థాపన/విస్తరణకు ముందుకొచ్చిన 17 పరిశ్రమల ప్రతినిధులకు కేసీఆర్ మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరి శ్రమల స్థాపనకు ముందుకొచ్చిన యాజమాన్యాలను అభినందించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేసే లక్ష్యంతో సింగిల్ విండో అనుమతులతో కూడిన సరళతర విధానం టీఎస్ ఐపాస్ను రూపొందించామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పరిశ్రమల విభాగం అధికారులు వేగంగా పనిచేశారని సీఎం కితాబిచ్చారు. తక్కువ వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం తెలంగాణ పారిశ్రామిక స్వర్ణయుగానికి నాందిగా నిలుస్తుందన్నారు. సీఎం చేతుల మీదుగా అనుమతి పత్రాలు పొందిన వారిలో చిత్తరంజన్ ధర్, సంజయ్ సింగ్ (ఐటీసీ), బి.రవీంద్రనాథ్ (న్యూజెన్), ఎన్.వెంకటరాజు (అంజనీ పోర్ట్లాండ్), ఎన్.రెడ్డి (ఎంఎస్ఎన్ లైఫ్ సెన్సైస్), డి.రామిరెడ్డి (స్నేహ ఫాం), రాజరతన్ (పయనీర్ టార్స్టీల్), టీఎస్ ప్రసాద్ (సాలిత్రో), అంబుల్గే (కోవాలెంట్), వి.వి.రావు (భావనా సోలార్), కార్తీక్ పోల్సాని (ప్రీమియర్ ఫొటో వోల్టాయిక్), హరిబాబు (ఉషా వెంచర్స్), కృష్ణారెడ్డి (వాల్యూ లాబ్స్), సునిల్రెడ్డి (దొడ్ల డెయిరీ), జీఎం రమణ (హెచ్ఐఎల్), రాహుల్ వెంకట్ (డ్యూరాలైన్) తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, కె. తారక రామారావు, తుమ్మల నాగేశ్వర్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, వినయ్ భాస్కర్, జీవన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి
శుక్రవారం హెచ్ఐసీసీలో తెలంగాణ పారిశ్రామిక విధానం -2015ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు జూపల్లి, కేటీఆర్, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు ♦ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణకు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి ఉంది. హైదరాబాద్ ఒక విశ్వనగరం. యవ్వనోత్సాహంతో ఉన్న నూతన రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా మంచి పనులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులతో తరలిరండి’’ అని సీఎం చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం ‘తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్)’ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులకు నూతన విధానంలోని ప్రత్యేకతలను వివరించారు. ‘‘మాకు సమర్థులైన అధికారుల బృందం ఉంది. మా సామర్థ్యమున్నంత వరకు పనిచేసి మీ అంచనాలకు తగినట్లుగా రాణిస్తాం. లేనిదానిని ఉన్నట్లుగా చూపుతూ పత్రికలు, మీడియాలో ప్రకటనలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కాదు. మేం చెప్పిన దాంట్లో సగం ఆచరణలోకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలంగాణలో బారులు తీరుతారని పారిశ్రామిక ప్రముఖులు అంటున్నారు. మా పనితీరు ద్వారానే సమాధానం చెబుతాం..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవాంతరాలు, అవినీతి లేని రీతిలో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక విధానం ఉంటుందని.. పైరవీలు చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రత్యేక’ స్వాగతం.. ‘‘ప్రపంచంలోని ఏమూల నుంచైనా అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానం ఉంటుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక ప్రోటోకాల్ అధికారుల బృందం పారిశ్రామికవేత్తలకు ఎయిర్పోర్టులోనే స్వాగతం పలుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారి చిత్తశుద్ధిని పరిశీలించి, అవాంతరాలు లేకుండా చూసేందుకు స్వయంగా భేటీ అవుతాను..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నీరు, భూమి, విద్యుత్ తదితర అనుమతులను 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అన్నీ ఒకే ప్యాకెట్లో పెట్టి స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. అనుమతుల్లో ఆలస్యానికి బాధ్యులయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తుల్లో మూడింట ఒకవంతు ఫార్మా రంగానిదేనని... ఫార్మాను ప్రోత్సహించేందుకు ముచ్చెర్లలో ఫార్మా సిటీ, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఫార్మా అభివృద్ధికి రసాయన వ్యర్థాల నిర్వహణ అవరోధమనే భావన ఉందని, ఫార్మాసిటీలో వ్యర్థాల నిర్వహణకు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యతిరేక భావన తొలగిస్తామని ప్రకటించారు. ఐటీసీ నుంచి రూ. 8 వేల కోట్లు.. నూతన పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ రాష్ట్రంలో రూ. 8 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఐటీసీ భద్రాచలం పేపరు మిల్లు సామర్థ్యాన్ని మరో లక్ష టన్నులు పెంచడం ద్వారా 90 మిలియన్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్లోని సైబర్సిటీలో రూ. వెయ్యి కోట్లతో హోటల్, మెదక్లో రూ.800 కోట్లతో ప్రపంచ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తర లివచ్చిన ప్రముఖులు.. పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతోపన్యాసం చే శారు. కెనడా, ఫ్రాన్స్, టర్కీ, జపాన్ దేశాల కాన్సుల్ జనరల్లు సిడ్నీ ఫ్రాంక్, ఎరిక్ లావెర్టూ, మూరత్ ఒమెరోగ్లు, సీజీబాబాతో పాటు బీహెచ్ఈఎల్ ఎండీ ప్రసాద్రావు, మైక్రోమాక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్, వాల్మార్ట్ సీఈవో క్రిష్ అయ్యర్, జీఎంఆర్ చైర్మన్ మల్లికార్జున్రావు, జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్రెడ్డి, టీసీఎస్ హెడ్ రాజన్న, సీఐపీ అధ్యక్షురాలు వనితా దాట్ల, ఫిక్కి తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు సంగీతారెడ్డి ప్రసంగించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, డైరక్టర్ మానిక్రాజ్ నూతన విధాన ప్రత్యేకతలను వివరించారు. టీఎస్ ఐపాస్ వెబ్సైట్తో పాటు సోలార్ పవర్ పాలసీని సీఎం ఆవిష్కరించారు. అన్నీ ఒక్కచోటే.. టీఎస్ ఐపాస్ బిల్లును గత ఏడాది నవంబర్ 27న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా.. మార్గదర్శకాలకు ఈనెల 10న రాష్ట్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. జూన్ 12 నుంచి టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విధానంలోని ప్రత్యేకతలు.. - వారంలో రెండు పర్యాయాలు దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల తరఫున అనుమతులు జారీ చేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఐపాస్ కమిటీ దరఖాస్తుల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంది. - రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు సీఎస్ నేతృత్వంలోని ‘తెలంగాణ స్టేట్వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు (టీ స్విఫ్ట్)’ అనుమతులు మంజూరు చేస్తుంది. - రూ. 5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులుండే పరిశ్రమలకు జీఎం, డీఐసీ నేతృత్వంలో జిల్లా స్థాయిలోనే అనుమతులు. - వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ దరఖాస్తు (సీఎఎఫ్) ద్వారా సింగిల్విండో పద్ధతిలో అనుమతులు. - అనుమతుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నోడల్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. రూ.200 కోట్లకు పైబడి పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు 15 రోజులు, అంతకంటే తక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు నెల రోజుల్లో అనుమతి. - టీఎస్ ఐపాస్ సెక్షన్ 13(1) ప్రకారం నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకుంటే అనుమతులు వచ్చినట్లుగానే దరఖాస్తులు భావించాల్సి ఉంటుంది. - పరిశ్రమలకు కేటాయించే భూములకు టీఎస్ ఐఐసీ నోటిఫైడ్ అథారిటీగా వ్యవహరిస్తుంది. - లేఔట్, భవన నిర్మాణం తదితర అనుమతులను గ్రామ పంచాయతీ ద్వారా పొందాలనే నిబంధనను సవరిస్తూ టీఎస్ఐఐసీకి అధికారం అప్పగించారు. అయితే ఆదాయాన్ని మాత్రం గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేస్తారు. - అనుమతుల్లో జాప్యాన్ని ప్రశ్నించే అధికారాన్ని దరఖాస్తుదారుకు అప్పగిస్తూ.. నిర్దేశిత గడువులోగా అనుమతుల పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత విభాగాల అధిపతులకు అప్పగించారు. - నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వని అధికారులు, సిబ్బందికి జరిమానా విధిస్తారు. అనుమతులు పొందిన రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల అనుమతి రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంటారు. -
ఆటోమొబైల్ రంగానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆటోమొబైల్ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకొంది. విడిభాగాలు, ఇతర ముడి పరికరాల దిగుమతిపై ఉన్న 14.5 వ్యాట్ను తగ్గించింది. జహీరాబాద్లోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ యాజమాన్యం ఇటీవల సీఎం కేసీఆర్ ఆ కంపెనీని సందర్శించినప్పుడు 14.5 శాతం పన్ను వల్ల నష్టం వస్తోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని పరిశ్రమలకు విక్రయించే ఆటో కాంపొనెంట్స్ మీద పన్నును 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 50ని జారీ చేసింది. మేడ్చల్లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామికవిధానంలో భాగం గా మేడ్చల్లో 200 ఎకరాల్లో ఆటోమొబైల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాలానగర్లోని ఎంఎల్ఆర్ కంపెనీ, రాప్టర్ మోటార్స్, కింగ్టాంగ్ అనే విదేశీ కంపెనీలు ఇక్కడ ప్లాంట్లు నెలకొల్పేం దుకు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాట్ తగ్గింపుతో ఆటోమొబైల్ పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. -
వడ్డీలో రాయితీ
రాష్ర్టంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకే... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు అందజేసే రుణాలకు వడ్డీలో రాయితీని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రుణాలకు వడ్డీలో 4శాతం రాయితీని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. అదే విధంగా కర్ణాటకలోనూ అమలు చేయడంపై ఉన్న సాధకబాధకాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు రూ.5కోట్ల వరకు రుణాలకు వడ్డీ రాయితీ అందజేస్తున్నామని, ఇదే విధంగా ఒబిసి వర్గానికి చెందిన వ్యాపార వేత్తలకు సైతం రుణాలను అందజేయాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను ఆయా ప్రాంతాల్లోని సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ....... రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నిర్మించతలపెట్టిన మేకెదాటు జలాశయ నిర్మాణం, మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన తదితర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు గాను నేడు(గురువారం) అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మేకెదాటు జలాశయ నిర్మాణం విషయంలో తమిళనాడు రాజకీయాలకు పాల్పడుతూ, జలాశయ నిర్మాణానికి అడ్డుపడుతోందని సిద్ధరామయ్య విమర్శించారు. అయితే తమిళనాడు ప్రభుత్వ వైఖరికి తామెంత మాత్రం భయపడబోమని తెలిపారు. న్యాయం కర్ణాటక వైపే ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి సైతం వివరిస్తామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
తెలంగాణలో పెట్టుబడులకు ప్రోత్సాహం
అమెరికాలో పారిశ్రామిక, విద్యావేత్తలతో ఎంపీ కవిత రాయికల్: అమెరికాలోని పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె గురువారం ప్రఖ్యాత 1871 వాణిజ్య కేంద్రాన్ని సందర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నూతన వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎంటర్ప్రెన్యూర్ ఇంక్యుబేషన్ సెంటర్ను సందర్శించారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఈ సెంటర్లో ఫార్చూన్ 500 కంపెనీలతోపాటు 2వేల మంది పారిశ్రామికవేత్తలు భాగంగా ఉన్నారని, ఇలాంటి సెంటర్ ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా 1871 కేంద్ర సీఈవో హోవర్డ్ తుల్మాన్, కో-ఆర్డినేటర్ లక్ష్మీసింగ్ను కోరారు. దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి త్వరలోనే వస్తామని కవితతో చెప్పినట్లు అక్కడి టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నాయకులు ‘సాక్షి’కి తెలిపారు. ఇదివరకే చికాగో స్టేట్ యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరి పిన కవిత తెలంగాణ యూనివర్సిటీ తర ఫున సంతకం చేశారు. చికాగో స్టేట్ యూని వర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ మధ్య ఒప్పందంతో రెండు యూనివర్సిటీల మేథోవనరులను, విద్యార్థులను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో భాగంగా రెండు యూనివర్సిటీల విద్యార్థులు, ప్రొఫెసర్లు, బోధనా పద్ధతులు, పరిశోధనలను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందంలో తెలంగాణ యూనివర్సిటీ తరఫున ఎంపీ కవితతోపాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ వాట్సన్, వైస్ ప్రెసిడెంట్ దేవ్ ఖలీఫ్ తదితరులు పాల్గొని సంతకాలు చేశారు. -
లాటరీ పేరిట కోటిన్నరకు టోకరా
అత్యాశకు పోయి రూ.1.48 కోట్లు పోగొట్టుకున్న పారిశ్రామికవేత్త లాటరీలో రూ. 9.5 కోట్లు గెలిచారంటూ మోసం సాక్షి, హైదరాబాద్: ‘‘మీరు కొన్న కారుకు లాటరీలో రూ. 9.5 కోట్లు దక్కింది’’ నగరంలోని ఓ పారిశ్రామికవేత్తకు వచ్చిన మెయిల్ ఇదీ. దీనిని నమ్మిన సదరు పారిశ్రామికవేత్త చీటింగ్ ముఠా ఉచ్చులో చిక్కుకుని వారం రోజుల్లో రూ. 1.48 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. బాలానగర్కు చెందిన సూర్యదేవర వెంకటేశ్వరరావుకు ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీ ఉంది. రెండు నెలల క్రితం వెంకటేశ్వరరావు ల్యాండ్రోవర్ కంపెనీ కారును కొన్నాడు. మార్చి 15న టాటా మోటర్స్ మల్టీపర్పస్ ప్రొడక్షన్ అండ్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీ(లండన్) పేరుతో వెంకటేశ్వరరావుకు ‘‘మా కంపెనీ పది లక్షల మంది వినియోగదారుల్లో లాటరీ తీయగా మీరు రెండు నెలల క్రితం కొన్న కారుకు రూ. 9.5 కోట్ల లాటరీ తగిలింది. డబ్బులు పంపడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. మీ పూర్తి వివరాలు పంపండి’’ అని మెయిల్ వచ్చింది. అది నిజమేనని నమ్మిన బాధితుడు తన వివరాలను వారికి పంపాడు. డబ్బులు అందుకునేందుకు వివిధ పన్నులు చెల్లించాలని చెప్పడంతో వారు చెప్పిన ప్రకారం బాధితుడు వారి అకౌంట్లలో మార్చి 20న కస్టమ్స్ క్లియరెన్స్ కోసం రూ.22 వేలు.. 22న మరో రూ.45 వేలు.. పౌండ్స్ను భారత కరెన్సీలోకి మార్చేందుకు ఫీజ్ కింద 21వ తేదీన రూ.1.48 లక్షలు. మనీ లాండరింగ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసమని 23వ తేదీన రూ. 4.72 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజ్ కోసమని రూ.5.80 లక్షలు, సీవోటీ కోడ్ రిలీజ్ కోసం నాలుగు దఫాలుగా రూ.28.56 లక్షలు, సీవోటీ కోడ్ యాక్టివేషన్ కోసమని రూ.17.82 లక్షలు, రిజర్వ్ బ్యాంకుకు 5.3 శాతం పన్నుల రూపంలో కట్టాలంటే 25వ తేదీన రూ. 49.38 లక్షలు, 26వ తేదీన యాక్టివేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ పేరుతో రూ.39.89 లక్షలు ఇలా మొత్తం రూ.1.48 కోట్లు లాటరీ ఫ్రాడ్ ముఠా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. మార్చి 27న రూ.9.5 కోట్లు చేతికి అందుతాయని వారు చెప్పినా ఆ డబ్బు చేరలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆకాశమే హద్దుగా.. ఆమె
ఆమె నిస్వార్థం పలువురికి బతుకు నిచ్చింది. తానొక మహిళగా.. మరికొందరి మహిళలకు చేతనైన సాయాన్ని అందించాలని తపన పడింది. ఆ తపనే... నేడు వందలాది మంది మహిళలను చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె... గంగలక్ష్మమ్మ. మహిళల ఆర్థికాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంఘ సంస్థలు పలు వేదికలపై సత్కరించాయి. - గౌరిబిదనూరు తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఇడగూరు చౌడయ్య కుమార్తె గంగలక్ష్మమ్మ. దేశ స్వాతంత్య్రం కోసం తన తండ్రి పడిన తపన ఆమెలోనూ జీర్ణించుకుపోయాయి. 1978లో కల్లూడికి చెందిన గంగప్పను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో గ్రామంలోని మహిళలు పడుతున్న కష్టాలను చూసిన ఆమె చలించిపోయారు. వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచాలని భావించారు. ఆ దిశలోనే 1988లో ఝాన్సీరాణి ఆదర్శ మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి, కుట్టు పనిపై శిక్షణ, వైర్లతో వివిధ రకాల అల్లికలు నేర్పారు. అప్పడాలు, సొండిగలు, పచ్చళ్లు, సాంబారు పొడి, చట్నీ పొడి తయారు చేసి విక్రయించడం వంటి కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించారు. మహిళల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసిన పలు రకాల వస్తువులకు బెంగళూరులోని జనతా బజారు తదితర ప్రదేశాలకు తరలించి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంలో గంగలక్ష్మమ్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం అయా కార్యక్రమాలను ఒక్కొక్కటిగా గ్రామీణ మహిళలకు అప్పగిస్తూ వారిని చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. 2009లో మహిళలే సభ్యులుగా మహిళలే ఉద్యోగులుగా ఉండేలా సమృద్ధి మహిళా సౌహార్ధ సహకార బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 567 మంది సభ్యులున్న ఈ బ్యాంక్ ఏడాదికి రూ. మూడు కోట్లకు పైగా లావాదేవీలను కొనసాగిస్తోంది. మహిళలకు రుణాలివ్వడమే కాకుండా, సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను రూపొందించారు. బ్యాంక్ లాభాలను డివిడెండ్ల రూపంలో సభ్యులందరికీ సమానంగా పంచారు. నేడు 1,300 జనాభా కలిగిన కల్లూడి గ్రామంలో ఉన్న సుమారు 610 కుటుంబాలలో 500కు పైగా కుటుంబాల వారు అప్పడాల తయారీ, వ్యాపారంలో నిమగ్న మైనారు. మహిళకు రుణాలివ్వడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువుల విక్రయాలకు బ్యాంక్ ప్రాంగణంలోనే కొద్దిపాటి స్థలాన్ని గంగలక్ష్మమ్మ కేటాయించారు. -
తెలంగాణాకు రండి
ఐటీ పెట్టుబడిదారులను ఆహ్వానించిన ఆ రాష్ర్ట మంత్రి కేటీఆర్ ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ తమ ప్రభుత్వ విధానమని ప్రకటన బెంగళూరు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి పారిశ్రామిక వేత్తకు అవసరమైన అన్ని విధాల అనుమతులు పొందే హక్కును తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) పేర్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ తరహాలో రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా బెంగళూరులోని ఐటీ సంస్థలను ఆహ్వానించేందుకు బుధవారమిక్కడ నిర్వహించిన ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఐటీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్ ఉందని అన్నారు. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్లో ఐటీని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే తమ వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్న ఐటీ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేతప్ప బెంగళూరులో ఉన్న సంస్థలను తరలించుకుపోవడం తన పర్యటన ఉద్దేశం కాదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలతోనూ తాము ఆరోగ్యకరమైన పోటీనే కోరుకుంటున్నామని తెలిపారు. భారత్లో తక్కువ ఖర్చులో మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు లభించే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుందని అందుకే హైదరాబాద్లో విరివిగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరుతున్నామని అన్నారు. ఇక గత కొంతకాలం వరకు తెలంగాణ ప్రాంతంలో కొరవడిన రాజకీయ సుస్థిరత, పటిష్టమైన నాయకత్వాలను ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంతేకాక యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు గాను ‘టి-హబ్’ పేరిట ప్రత్యేక కారిడార్ను సైతం ఏర్పాటు చేశామని, ఇందులో తెలంగాణ ప్రాంతం వారే కాక ఎవరైనా సరే తమ వినూత్న వ్యాపార ఆలోచనలను పంచుకోవచ్చని, తమ కలలను సాకారం చేసుకోవచ్చని అన్నారు. ఇక రాష్ట్రంలో కరెంటు సమస్య సైతం లేకుండా చేసేందుకు సైతం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించినట్లు వెల్లడించారు. -
ఇదీ... కోర్కెల చిట్టా
పారిశ్రామికవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు సహా ఆర్థిక రంగమంతా ఫిబ్రవరి 28వ తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్టే ఆ రోజు స్పెషల్. బడ్జెట్పై ఏ రంగం కోరికలు ఆ రంగానివి. ఎవరి విశ్లేషణ వారిది. వీటిలో ప్రముఖులు చెబుతున్న కొన్ని ముఖ్య అంశాలివీ... 80సీ పరిమితి పెంచాలి సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాలి. చాలా కాలం ఈ పరిమితి రూ. లక్ష వద్దే ఉంది. దీనివల్ల పెద్దగా పొదుపు లక్ష్యాలు నెరవేరలేదు, గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని మరో రూ.50 వేలు పెంచినా... ఆర్థిక సాధనాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం పొందడానికి ఈ మొత్తాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పీపీఎఫ్, ఈపీఎఫ్, న్యూ పెన్షన్ స్కీమ్, బీమా పాలసీలు, ఈక్విటీ అనుసంధాన పొదుపు పథ కాల్లో పెట్టుబడిపై రూ.1.50 లక్షల వరకూసెక్షన్ 80సీ కింద ఐటీ మినహాయింపు ఉంది. ఆర్థిక పొదుపులకు కూడా ఇది దోహదపడుతుంది కనక దీన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. 2008లో 36.9 శాతంగా ఉన్న భారత జాతీయ పొదుపు రేటు ఇపు 30 శాతానికి పడిపోవటాన్ని గుర్తించాలి. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ జీడీపీలో 6 శాతం విద్యపై వెచ్చించాలి విద్యపై వ్యయాలను గణనీయంగా పెంచాలి. మహిళలపై జరుగుతున్న నేరాలను సమర్థంగానిరోధించడానికి నిర్భయ ఫండ్ పరిధిని విస్తరించాలి. స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 6 శాతాన్ని విద్యపై ఖర్చుచేయాలి. దళితులు, ఆదీవాసీల ప్రయోజనాలకు ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. నీతి ఆయోగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించాలి. మధ్యాహ్నం భోజన పథకానికి తగిన నిధులు కేటాయించాలి. - ప్రదీప్ మెహతా, వినియోగదార్ల సొసైటీ ఎక్సయిజు రాయితీలుండాలి అధిక వడ్డీరేట్లు, బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల వాహనాల డిమాండ్ తక్కువగానే ఉంది. ఎక్సయిజ్ సుంకం రాయితీలను డిసెంబర్ తరువాత ఉపసంహరించడం వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. బడ్జెట్లో ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించకపోతే, వాహన పరిశ్రమ స్వల్పకాలంలో కోలుకునే సూచనలేమీ లేవు. మేక్ ఇన్ ఇండియాలో వాహన రంగం కీలకమైనది కనక ఈ రంగానికి సంబంధించి సంస్కరణలు బడ్జెట్లో ఉండాలి. వాహన విడిభాగాలపై ఎక్సయిజు సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించాలి. విద్యుత్ కొరత వల్ల ఉత్పత్తి దారులు డీజిల్ జనరేటర్లు ఉపయోగించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దీనిని నివారించడానికి డీజిల్పై ఇన్పుట్ క్రెడిట్ను ఇవ్వాలి. - వాహన రంగం స్టార్టప్, ఎస్ఎంఈలకు నిధులివ్వాలి... టెక్నాలజీ స్టార్టప్లు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. నియంత్రణ, పన్నుల పరంగా ఇబ్బందులను తొలగించాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, పరిశ్రమ పరస్పరం సహకరించుకోవాలి. స్టార్టప్స్, ఎస్ఎంఈలకు నిధులు అందుబాటులో ఉండటం, కార్యకలాపాల నిర్వహణకు ప్రోత్సాహం అవసరం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ట్యాక్సేషన్ విధానంలో అస్పష్టత తొలగించాలి. నిబంధనలు, పన్నులపరంగా ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించాలి. సేవా పన్ను చెల్లింపు విషయంలో వివాదాలుంటే ఆయా మొత్తాలపై విధించే పెనాల్టీ రేటును హేతుబద్ధీకరించాలి. ఈ-కామర్స్ను ప్రోత్సహించేలా డిజిటల్ లావాదేవీలపై తక్కువ పన్నులు వేయాలి. ఐటీని ఉపయోగించుకునే సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. - నాస్కామ్.. పన్ను పరిమితి రూ.5 లక్షలు చేయండి... ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) డిజిన్వెస్ట్మెంట్ను తక్షణమే నిలిపివేయాలి. ఖాయిలా పడినప్పటికీ మళ్లీ మెరుగుపడే అవకాశాలున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. ద్రవ్యోల్బణ కట్టడికి తగిన చర్యలతో పాటు కమోడిటీల్లో ఫార్వర్డ్ ట్రేడింగ్ను నిషేధించాలి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు.. సుంకాలను క్రమబద్ధీకరించాలి. రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి వ్యతిరేకం. - సాధారణ ఉద్యోగి పన్ను శ్లాబులు మార్చండి... ఐటీ రిఫండ్లను వేగంగా ఇవ్వాలి. రూ. 3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.6-12 లక్షల రేంజ్ ఆదాయంపై 20 శాతం, రూ.12 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం చొప్పున ఆదాయపు పన్ను విధించాలి. ప్రస్తుతం 32.45 శాతం(సర్చార్జీలు, ఇతర సెస్సులు కలుపుకొని)గా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతానికి, 18.5 శాతంగా ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను 10 శాతానికి తగ్గించాలి. గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. ఇక అసలు చెల్లింపులకు సంబంధించిన పరిమితిని ప్రస్తుతమున్న రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. లీవ్ ఎన్క్యాష్మెంట్ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. రెట్రోస్పెక్టివ్ సవరణను తొలగించాలి. ఫలితంగా వాణిజ్య, వ్యాపార పరిస్థితులు మెరుగవుతాయి. భారత్పై అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరుగుతుంది. - అసోచామ్ -
పారిశ్రామికవేత్తలకే ‘అచ్చాదిన్’: హజారే
రాలెగావ్ సిద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, పేదప్రజల్ని గాలికొదిలేసి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు పరిరక్షించడానికి కంకణం క ట్టుకున్నారని ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే విమర్శించారు. తన స్వగ్రామం రాలెగావ్ సిద్దిలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసిన ‘మంచిరోజులు’ కేవలం పారిశ్రామికవేత్తలకే వచ్చాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం అభివృద్ధి చెందదని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలతో కలిసి భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీలలో హజారే నిర శన దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. -
మోదీ ఆలోచనంతా బడా వ్యాపారుల కోసమే: హజారే
బడా పారిశ్రామికవేత్తల బాగోగుల కోసమే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని అవినీతి వ్యతిరేక ఉద్యకారుడు అన్నా హజారే ఆరోపించారు. ఆయన బడుగులను, రైతులను పక్కకు పెట్టి బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ సంఖ్యలో రైతులతో తరలి వెళ్లి ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. మంగళవారం తన సొంత గ్రామం రాలేగాం సిద్ధిలో మాట్లాడిన హజారే.. మోదీ హవా కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల సమయంలో దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని మోదీ చెప్పారని, ఆ రోజులు కేవలం పారిశ్రామిక వేత్తల కోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. మోదీ అనుసరిస్తున్న విధానాలవల్ల దేశానికున్న ఖ్యాతి తగ్గనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కొనియాడారు. ఢిల్లీని ఆదర్శ నగరంగా మార్చేందుకు కేజ్రీవాల్ చక్కని విధివిధానాలు రూపొందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమం కోరుకున్నారు కనుకే కేజ్రీవాల్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. -
అక్టోబర్లో రాష్ట్రానికి ‘చైనా పెట్టుబడిదారులు
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో రెడ్కార్పెట్ ‘హువాయి’ ఆర్ అండ్ డీ విభాగం ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్.వి.దేశ్పాండే బెంగళూరు: కర్ణాటకలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించే విధంగా ‘రెడ్ కార్పెట్’ స్వాగతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుకుతోందని రాష్ట్ర ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్.వి.దేశ్పాండే తెలిపారు. చైనాకు చెందిన ప్రముఖ ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) రంగ సంస్థ హువాయి నగరంలో మొత్తం 20 ఎకరాల్లో 170 మిలియన్ల యూఎస్ డాలర్లతో నిర్మించిన ‘హువాయి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాంపస్’ను ఆర్.వి.దేశ్పాండే గురువారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....చైనాకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి చర్చించిందని చెప్పారు. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సిద్ధరామయ్య ఆహ్వానించారని తెలిపారు. ఇందుకు స్పందించిన చైనా ప్రతినిధులు రానున్న అక్టోబర్లో తమ పారిశ్రామిక వేత్తల బృందంతో బెంగళూరు వస్తామని, అదే సమయంలో వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన, సమాచార శాఖ మంత్రి రోషన్బేగ్ మాట్లాడుతూ....దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైట్ఫీల్డ్లోని ఐటీపీఎల్ ప్రాంతానికి చేరుకోవడానికి ట్రాఫిక్ కారణంగా ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. అందువల్ల ఐటీపీఎల్ నుంచి హెబ్బాళ ఫ్లై ఓవర్ వరకు ఎక్స్ప్రెస్ వేను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్ల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వీటి ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ, హువాయి ఇండియా సీఓఓ విల్సన్ వాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ వ్యాపారులూ.. ఏపీకి రండి!
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలంతా ఏపీకి రావాలని పలువురు పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఫ్యాప్సీలో భాగంగా ఉన్న ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ విడిపోయి ఏపీ శాఖగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్లో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందిగా అక్కడి ఛాంబర్ నాయకులు కోరారు. అలాగే ఛాంబర్ పేరును కూడా.. అసోసియేషన్ బదులు ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్గా పేరు మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఫ్యాఫ్సీ పారిశ్రామికవేత్తలకు వేదికగా ఉండేది. విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి కూడా ఒక సంఘం ఉండాలని భావించి.. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఛాంబర్ను ఉత్తరాంధ్ర, సెంట్రల్, రాయలసీమ జోన్లుగా ఏర్పాటు చేసి వాటికి ముగ్గురు ఉపాధ్యక్షులను నియమించారు. తొలి అధ్యక్షుడిగా మండవ ప్రభాకరరావు ఈ కొత్త ఫెడరేషన్కు నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకరరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, సెంట్రల్ జోన్ ఉపాధ్యక్షులుగా జేఏ చౌదరి, జి సాంబశివరావు, చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా ఎన్నుకున్నారు. మరో 30 మంది బోర్డు ఆఫ్ డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. ఈ కార్యవర్గం శనివారం విజయవాడ మురళీఫార్చ్యూన్ హోటల్లో బాధ్యతలు స్వీకరించి సమావేశమైంది. ఆంధ్రా ఛాంబర్కు రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. -
క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పారిశ్రామిక వేత్తలకు క్షమాపణ చెప్పారు. వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక దుర్నిర్వహణకు తాను క్షమాపణ అడుగుతున్నానని అన్నారు. ఇకనైనా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 'గతంలో జరిగిన వాటిని మర్చిపోండి. గతంలో జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. అప్పుడు జరిగిన చెడును వదిలేద్దాం. ఈరోజు గురించి ఆలోచిద్దాం. రేపటి కోసం పనిచేద్దాం' అని మమతా అన్నారు. కోల్కతాలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఏపీవైపే పారిశ్రామికవేత్తల చూపు:చంద్రబాబు
తిరుపతి: పారిశ్రామికవేత్తల చూపు ఏపీవైపే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలతో ఆయన ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. 2050 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని వనరులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిబాటలో పయనిస్తామన్నారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏపీ అభివృద్ధి చెందిందని, ఆ తరువాత టీడీపీ పాలనలోనే అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఏడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి నీళ్లను కృష్ణానదికి తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇక్రిశాట్ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధిపరుస్తామని చెప్పారు. హంద్రీనివా, గాలేరు-నగరి, స్వర్ణముఖి, సోమశిలలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. ** -
'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ'
ఫిరోజ్పూర్ జిక్రా, (హర్యానా): కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్ని అమెరికా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేశారని తెలిపారు. ఫలితంగా కేన్సర్ ఔషధం ధర రూ. 8 వేల నుంచి లక్షరూపాయలకు పెరిగిపోయిందని అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లేముందు నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మధుమేహం ఔషధం ధర కూడా పెరిగిందన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసమే దేశాన్ని నడిపే పరిస్థితి వస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
సామాన్యులపైనే
సామాన్యుల పట్ల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న విద్యుత్ శాఖాధికారులు బడా బాబుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వందల రూపాయల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు ఉంటే కనెక్షన్ పీకేసి అవసరమైతే ఆర్ఆర్ యూక్ట్ ప్రయోగించే అధికారులు పెద్దల విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ: పట్టణంలోని అశోక్నగర్లో నివసిస్తున్న కె.శ్రీనివాసరావుకు విద్యుత్ ఛార్జీల బిల్లు రూ.290 వచ్చింది. రిక్షా లాగుతూ జీవనం సాగించే ఆయన అధికారులు నిర్ధేశించిన సమయంలో బిల్లు చెల్లించకపోవటంతో సదరు సర్వీసుకు సంబంధించిన ఫీజులు పీకేశారు. ఇది సాధారణ, మధ్య తరగతి కుటుంబీకుల విషయంలో అధికారులు అవలంభించే సర్వసాధారణ విషయం. అయితే రూ.కోట్లలో బిల్లులు పేరుకుపోయిన బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ శాఖలపై కనీస చర్యలు తీసుకోవటంలో అధికారులు తమ దూకుడు చూపించకపోవటం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఇందుకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలే తార్కాణంగా నిలుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ.61.92 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయూయి ఇందులో హెచ్టీ విద్యుత్ సర్వీసుల నుంచి మొత్తం రూ.38.40 కోట్లు రావాల్సి ఉండగా.. ఇందులో కేవలం 17 సర్వీసుల నుంచి రూ2.74 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న సర్వీసుల నుంచి రూ.29.45 కోట్లు రావాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.1.53 కోట్లు, నిలిపి వేసిన సర్వీసుల నుంచి వసూలు చేయాల్సింది రూ.4.13 కోట్లు, వివిధ రక్షిత మంచి నీటి పథకాలకు సంబంధించిన సర్వీసుల నుంచి రూ.0.55 కోట్లు విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. ఎల్టీ విద్యుత్ సర్వీసులకు సంబంధించి బకాయిల మొత్తం రూ.23.52 కోట్లు ఉండగా.. అందులో నిలిపి వేసిన సర్వీసుల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం రూ.4.11 కోట్లు రావాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి రూ.1.76 కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి రూ.4.54 కోట్లు, మైనర్ పంచాయతీల నుంచి రూ.13 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న సర్వీసుల నుంచి రూ.0.11 కోట్లు రావాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారుల నుంచి బకాయిలు రావాల్సి ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరించే విద్యుత్ శాఖ అధికారులు సాధారణ , మధ్య తరగతి గృహ విద్యుత్ వినియోగదారులపై మాత్రం కొరడా ఝులిపిస్తుండటం పలు ఆరోపణలకు తావిస్తోంది. నోటీసులకు స్పందన కరువు: తమ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు ప్రభుత్వ శాఖలతో పాటు పెద్ద మొత్తంలో బకాయిల పడ్డ వినియోగదారులుకు నోటీసులు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. నోటీసులు మీద నోటీసులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి అనుమతి లేదంటూ లేకుంటే బడ్జెట్ లేదంటూనే ఆయా శాఖలు బకాయిలు చెల్లింపులకు చేతులు ఎత్తేస్తున్నాయి. జిల్లాలో వివిధ శాఖల నుంచి లక్షలాది రూపాయలు బిల్లుల రూపంలో రావాల్సి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తింది. బడా బాబులకు సంబంధించిన సర్వీసుల నుంచి ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. సామాన్యుల విషయంలో నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించని విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. అప్పటికీ చెల్లించకపోతే ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఆస్తుల జప్తునకు సన్నద్ధమవుతున్నారు. సాధారణ వినియోగదారుని బిల్లు బకాయిల విషయంలో ఒకలా... ప్రభుత్వ శాఖల బిల్లుల బకాయిల వసూళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి -
పెట్టుబడులతో తరలిరండి
-
పెట్టుబడులతో తరలిరండి
సింగపూర్ పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు. గురువారం సింగపూర్లో సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతికి తావు లేకుండా (జీరో కరప్షన్) పరిపాలిస్తాం. తెలంగాణలో ఐటీ రంగానికి మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల్లో అభివృద్ధి మా ప్రాధాన్యత. మా రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతారు. అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా దగ్గరుండి చూస్తారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందడం పరిశ్రమలకు ఒక హక్కుగా చేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ లోటు ఉంది. దానిని తీర్చే ప్రణాళికలు ఇప్పటికే తయారుచేశాం. రాబోయే ఐదారేళ్లల్లో ఏకంగా 8 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటన రెండో రోజైన గురువారం సీఎం బిజీబిజీగా గడిపారు. ఉదయం ఇక్కడి భారత హైకమిషనర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం సీఐఐ సదస్సులో ప్రసంగించారు. సమావేశం తర్వాత సింగపూర్ విదేశీ, న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగం, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎస్.ఈశ్వరన్తో భేటీ అయ్యారు. అనంతరం ప్రసిద్ధ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించారు. సాయంత్రం సింగపూర్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రికి సింగపూర్లో నివసిస్తున్న తెలంగాణవాసులతో కలిసి భోజనం చేశారు. నేడు సెమినార్లో ప్రసంగం! ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) పూర్వ విద్యార్థుల సెమినార్లో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి లీ సియాన్తోనూ సమావేశం కానున్నారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక వెబ్సైట్! విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవలి సమగ్ర సర్వేలో తమ వివరాలెలా నమోదుచేసుకోవాలోనని ప్రవాస తెలంగాణవాసులు ఆందోళన చెందారని, ఈ మేరకు వారికోసం ప్రత్యేక వెబ్సైట్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన తెలంగాణ సంబరాలు కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చిన్న దేశమైన సింగపూర్లో చాలా మంది తెలంగాణవాదులు పెట్టుబడులు పెట్టి ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అలాంటి పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో 30 వేల కోట్ల రూపాయలతో ఉక్కు కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నామని తెలిపారు. దాని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కలిగి.. దుబాయ్, మస్కట్ వంటి దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హైకమిషనర్ విజయ్ ఠాకూర్ సింగ్, సంఘం అధ్యక్షుడు బండ మాధవరెడ్డి, సభ్యులు అనుపురం శ్రీనివాస్, శివ, ప్రవీణ్, మహేందర్రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు: కేసీఆర్
హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా సులభమైన పద్దతుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తామని పారిశ్రామిక వేత్తలలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 21రోజుల్లోగా అనుమతులు ఇస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. ఒకట్రెండు అనుమతులకు తప్ప ఒకే రోజు అన్ని రకాల అనుమతులకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుసింది. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పదిశాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. చిన్న పరిశ్రమలకు జిల్లాల్లో అనుమతులిస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం
* వ్యాపారావకాశం ఉన్నచోటుకే విస్తరణ * పారిశ్రామికవాడల్లో అయితే పెట్టుబడికి సిద్ధం * ఒకే దరఖాస్తుతో అన్ని అనుమతులు ఇవ్వాలి * రెండు రాష్ట్రాలు సీఎస్టీ మినహాయించాలి * ఇవీ పారిశ్రామిక ప్రతినిధుల డిమాండ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార పరంగా మేం ఎదగాలి. అందుకు విస్తరణే ఎకైక మార్గం. నూతన వ్యాపార అవకాశాలు ఉన్నచోటే ప్లాంట్లు పెడతామని అంటున్నారు వివిధ పరిశ్రమల ప్రతినిధులు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్లాంట్లు అలాగే కొనసాగుతాయని వారు అంటున్నారు. ఇక్కడి ప్లాంట్లను మూసివేసి మరోచోటుకు తరలించే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త ప్లాంట్లు మాత్రం సీమాంధ్రతోసహా వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెబుతున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారంపై కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎస్టీ మినహాయిస్తే తెలంగాణ నుంచి ప్లాంట్లు తరలిపోవని మరీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై వివిధ అభిప్రాయాలను పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేశారు. అవి..పన్ను మినహాయిస్తే.. తెలంగాణ, సీమాంధ్ర మధ్య జరిగే వ్యాపారంపై 2 శాతం సీఎస్టీని వ్యాపారులు చెల్లించాల్సి వస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. 2-3 శాతం మార్జిన్లతో వ్యాపారాలు చేస్తున్నాం. అలాంటప్పుడు సీఎస్టీకే 2% పోతే ఎలా అని అంటున్నారు ఈటా బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న కిషోర్సన్స్ డిటర్జెంట్స్ ఎండీ గౌతమ్ చంద్ జైన్. ‘మా వ్యాపారంలో 80 శాతం వాటా సీమాంధ్ర నుంచే. ప్లాంటేమో తెలంగాణలో ఉంది. మాలాంటి కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫార్మా కంపెనీలు పన్ను ప్రయోజనాలు అందుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లకు వెళ్లాయి. ఇదే మాదిరిగా ఇప్పుడు సీమాంధ్రకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది’ అని గుర్తు చేశారు. 5 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాల మధ్య సీఎస్టీ లేకుండా చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ మాదిరిగా పన్ను ప్రయోజనాలు ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లింగ్ ప్లాంటు పెడతామని సెల్కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. పారిశ్రామికవాడలైతేనే...: విద్యాలయాలు, సేవా రంగంలో ఉన్న కంపెనీలు ఎంత ధరైనా స్థలానికి వెచ్చిస్తాయి. తయారీ కంపెనీలు అలా చేయలేవు. నిరంతరం ముడిపదార్థాలను కొనుగోలు చేయాలి. అటు పోటీ ఉంటుంది కాబట్టి లాభాలను కుదించుకుని తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించాలి. ఈ పరిస్థితుల్లో స్థలానికే అధిక వ్యయం చేయలేవని సుధాకర్ పైప్స్ ఎండీ ఎం.జయదేవ్ తెలిపారు. రాజధాని మా జిల్లాలో అంటే మా జిల్లాలో అంటూ ప్రచారం జరగడంతో సీమాంధ్రలో స్థలాల ధరలు ఊహించనంతగా ఆకాశాన్నంటాయని వివరించారు. పారిశ్రామిక వాడలే ఇందుకు పరిష్కారమని చెప్పారు. చిన్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో స్థలం కొనే అవకాశాలే లేవని తెలిపారు. ఇటువంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములను అద్దెకు ఇవ్వాలని కోరారు. అందుబాటు ధరలో స్థలం, ఒకే దరఖాస్తుకు అన్ని అనుమతులు, నిరంతర విద్యుత్, కార్మికులకు నివాస గృహాలు, మంచి రోడ్లు ఇవీ సగటు పారిశ్రామికవేత్తల డిమాండ్లని పేర్కొన్నారు. ఇక అమ్మకం పన్ను, విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ మొత్తాల విషయంలో రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసేయాలని, నేరుగా ప్రయాజనం కల్పించాలని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్, నయాస్ట్రాప్ ఎండీ వెన్నం అనిల్రెడ్డి కోరారు. వ్యాపారావకాశాలు.. ముడి పదార్థాల లభ్యత, మౌలిక వసతుల కల్పన, వ్యాపార అవకాశాలు.. ఈ మూడు అంశాలే పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రధానమైనవని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రుంగ్టా గ్లాస్ ఎండీ శివ్కుమార్ రుంగ్టా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు ప్రకటించబోయే పారిశ్రామిక విధానాల కోసం వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వెలుపల, ఇతర ప్రాంతాల్లో పారిశ్రామికవాడల ఏర్పాటు, అలాగే పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక సీమాంధ్రలో కొత్త వ్యాపార అవకాశాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి విస్తరణకు అక్కడికి వెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారని వివరించారు. రూ.2,500 కోట్ల పెట్టుబడి.. ప్లాస్టిక్ కంపెనీలు హైదరాబాద్ సమీపంలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లు శ్రమించాయి. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అన్ని వసతులతో సీమాంధ్రలో పార్కు ఏర్పాటైతే వెళ్లేందుకు దాదాపు 1,000 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. పార్కులో రెండేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడి ఖాయమని అసోసియేషన్ అంటోంది. కొత్త అవకాశాలు అందుకోవడానికైనా కంపెనీలు సీమాంధ్రలో విస్తరిస్తాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్రెడ్డి చెప్పారు. కాగా, సుధాకర్ పైప్స్ రూ.100 కోట్లతో 30 ఎకరాల్లో కేబుల్స్ తయారీ ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. గుజరాత్ లేదా సీమాంధ్రలో ఇది రానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభించనుంది. రుంగ్టా గ్లాస్ రూ.20 కోట్లతో నిర్మాణ రంగానికి అవసరమయ్యే గ్లాస్, ల్యామినేటెడ్ గ్లాస్ ఉత్పత్తుల తయారీ యూనిట్ పెట్టనుంది. కిషోర్సన్స్ రోజుకు 300 టన్నుల సామర్థ్యం గల తయారీ యూనిట్ ఏర్పాటుకు యోచిస్తోంది. రూ.10 కోట్లదాకా వ్యయం చేయనుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకై నయాస్ట్రాప్ రూ.10 కోట్లతో ప్లాంటు స్థాపించే పనిలో ఉంది. దాదాపు 60 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మొత్తం రూ.1,200 కోట్ల దాకా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. -
పారిశ్రామిక విధానాల్లో స్పష్టత కావాలి
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల ప్రతినిధుల సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పన్నులు, సింగిల్ విండో క్లియరెన్సులు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు తదితర అంశాల విషయంలో పారిశ్రామిక విధానాల్లో నూతన ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని పరిశ్రమ ఆశిస్తోంది. సోమవారం తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా పారిశ్రామికవేత్తలు పలు సూచనలు చేసారు ఎమ్మెన్సీ సంస్థలు ఆఫ్షోర్ పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల లభ్యత, తక్కువ వ్యయం, మౌలిక వసతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ స్నేహపూర్వక విధానం పరిగణలోకి తీసుకుంటాయి. ఈ అంశాలనుబట్టి చూస్తే కంపెనీలు ఎంపిక చేసుకునే నగరాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని కొనసాగిస్తుందని పెగా సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి తెలిపారు. వ్యవస్థాపకత, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానాలను నూతన ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న విశ్వాసం తమకుందని ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వెన్నుతట్టేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను విరివిగా స్థాపించాలని కోరారు. పరిశోధనను తదుపరి స్థాయికి చేర్చే రీసర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విన్నవించారు. హైదరాబాద్ వెలుపల మరిన్ని పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించాలని ఇట్స్ఏపీ ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు. స్టార్టప్లను ఉత్తేజ పరిచేలా ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు. -
విశాఖే బెస్ట్
రాజధానిగా ఎంపిక చేయాలని పెరుగుతున్న డిమాండ్ ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్ అనుకూలాంశాలు శివరామకృష్ణన్ కమిటీకి నివేదించనున్న పారిశ్రామికవేత్తలు ఏకమవుతున్న సీఐఐ, వీడీసీ, ఇతర రంగాల ప్రముఖులు సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా ఈ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. రాజధాని ఎంపిక కోసం విశాఖ వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. శనివారం నగరంలో పర్యటించనున్న శివరామకృష్ణన్ బృందాన్ని కలవడానికి వీరంతా ఏర్పాట్లు చేసుకున్నారు. పారిశ్రామిక వైభవం జిల్లా పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తరఫున ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని సీఐఐలో సభ్యత్వం కలిగిన పలువురు పారిశ్రామికవేత్తలంతా దీనిపై సమీక్ష జరిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, కంటైనర్ టెర్మినల్స్ నగరాన్ని అన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందేలా చేశాయి. ఇదికాక రూ.800 కోట్లతో మరో కంటైనర్ టెర్మినల్ వస్తోంది. దీనిద్వారా పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరించడానికి అవకాశం ఉందని సభ్యులంతా తేల్చారు. అదికాకుండా విశాఖ నుంచి కాకినాడ వరకు ఇండస్ట్రియల్ కారిడార్తో అనుహ్య అభివృద్ధి సాధించడానికి వీలుందని చర్చించారు. నగరంలోకి కొన్ని వందల ఫార్మా, కెమికల్, మెకానికల్ పరిశ్రమల నుంచి వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయని, దీనికి కావలసిన ముడి దిగుమతుల సౌకర్యం కూడా ఇక్కడే ఉందని సభ్యులంతా తేల్చారని సీఐఐ చైర్మన్, పోర్టు డిప్యూటీ చైర్మన్ సత్యకుమార్ వివరించారు. అభివృద్ధికి ఆలవాలం విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) మరో నివేదిక తయారు చేసింది. సీమాంధ్రలో అతి పెద్ద నగరం విశాఖ మాత్రమే ఉందని, నగరం చుట్టూ 250 కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 కోట్ల జనాభా ఉందని, హైదరాబాద్ తర్వాత అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఇక్కడే ఉందని ఇవన్నీ విశాఖకు అనుకూలమని వీడీసీ కన్వీనర్ ఒ.నరేష్కుమార్ వివరించారు. దేశంలోని 70 రైల్వే డివిజన్లలో విశాఖ నాలుగో అతి పెద్ద డివిజన్ అని, రూ.15 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు విశాఖ నుంచి జరుగుతున్నాయని, ఇవన్నీ రాజధానికి పూర్తిగా అనుకూలంగా మారుతాయని వీడీసీ తరఫున ఇవ్వనున్న నివేదికలో పొందుపరిచారు. స్టీల్ప్లాంట్, షిప్యార్డ్, డాక్యార్డ్, జింక్, హెచ్పీసీఎల్, చమురు కంపెనీలు, పోర్టులు విశాఖను అంతర్జాతీయస్థాయిలో ఉన్నతంగా నిలబెట్టే ఆభరణాలని వివరించనున్నారు. విభజన కారణంగా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ దక్కడంతో ఈ ప్రాంతానికి భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఇది రాజధానికి మరింత అనుకూలిస్తుందని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఎండీ, మాజీ సీఐఐ చైర్మన్ సాంబశివరావు వివరించారు. ఈమేరకు పారిశ్రామికవేత్తల తరఫున తాము కూడా నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు. సీమాంధ్రలో విద్యాసంస్థలన్నీ ఉన్నాయని, ఇది రాజధానికి పూర్తిగా అనుకూలమని ఉత్తరాంధ్ర ఇంజనీరింగ్ విద్యాసంస్థల తరఫున మరికొందరు నివేదికలతో కలవనున్నారు. -
రాయబేరాలు
టీడీపీ ఇన్చార్జి సుజనాచౌదరి కొత్త వ్యూహాలు సాక్షి, విజయవాడ : తెలుగుదేశం ఎంపీ, జిల్లా ఇన్చార్జి సుజనాచౌదరి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు, వారు చేస్తున్న ఖర్చులను విశ్లేషించిన ఆయన విజయవాడలోని ఒక హోటల్లో తన సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, నగర ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఇందులో టీడీపీ నేతలను గెలిపించడమే ప్రధాన అంశంగా చర్చ జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పుష్కలంగా నిధులివ్వాలని.. జిల్లాలో ‘ఫ్యాను’ గాలి జోరుగా వీస్తుండడం సుజనాకు మింగుడుపడడం లేదు. గతంలో చంద్రబాబు పాదయాత్ర, బస్సుయాత్రలు చేసినప్పుడు, ఇటీవల మహిళాగర్జన సభ నిర్వహించినప్పుడు ఆ పార్టీ నేతలెవరూ భారీగా డబ్బు ఖర్చుపెట్టలేదు. దీంతో ఆ కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. చంద్రబాబు వివిధ కోణాల్లో పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ కొన్నిచోట్ల గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే సర్వేలు చేయించుకున్న కొంతమంది అభ్యర్థులు గెలుపుపై అనుమానం ఉన్నచోట్ల డబ్బు ఖర్చుచేయడానికి వెనుకాడుతున్నారు. అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఖర్చు ఇప్పటికే కోట్లు దాటడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఖర్చుపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే పోలింగ్ తేదీనాటికి అభ్యర్థులు ఆర్థికపరంగా కాడి కిందపారేస్తారేమోనన్న అనుమానం వచ్చిన సుజనా ఇప్పటినుంచే వారికి ఆర్థికంగా ఫీడింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆయన నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐల వద్ద చర్చించినట్లు సమాచారం. ఒక్కొక్క నియోజకవర్గంపై ఐదారుగురు ఎన్ఆర్ఐలు, ముఖ్యులు దృష్టిసారించాలని, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు అన్ని రకాలుగా సహకరించాలంటూ విజ్ఞప్తిచేశారు. పార్టీ ఫండ్ సమీకరణ.. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామో.. లేదోనన్న అనుమానం టీడీపీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. అందుకే ఇప్పట్నుంచే నిధుల సమీకరణకు తెరతీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లాలో జోరుగా సీట్ల విక్రయాలు జరిగాయి. ఇప్పుడు కూడా వివిధ రకాల సమావేశాలు నిర్వహించి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబడితే పార్టీకి రాబోయే రోజుల్లో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సుజనా పార్టీ అభ్యర్థులకు నిధులు ఇవ్వాలని కోరుతూనే.. ఆ వచ్చే సొమ్ములో కొంతభాగాన్ని పార్టీ ఫండ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నేరుగా విరాళాలు ఇవ్వాలని కూడా సూచించినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలిస్తే.. తమ సామాజికవర్గం వారంతా కష్టపడి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో చంద్రబాబు అందరికీ సహాయం అందిస్తారంటూ హామీలు గుప్పిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మోడీపై పారిశ్రామికవేత్తల ఆశలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు రవి శంకర్ ప్రసాద్ అన్నారు. బెంగళూరులోని పారిశ్రామికవేత్తలు సైతం మోడీతో అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన ‘పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తే పారిశ్రామిక అనుకూల వాతావరణం నెలకొంటుందని భరోసా ఇచ్చారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ వృద్ధి రేటు 4.8 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ వృద్ధి రేటు దిగజారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అన్నారు. యూపీఏ హయాంలో నెలకొన్న అవినీతి, పాలనా లోపాల వల్ల పరిశ్రమలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి, కుంభకోణాలకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు. వాజ్పేయి హయాంలో సైతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఎంతో వృద్ధి సాధించారని చెప్పారు. బెంగళూరులో ఎక్కువ స్థానాల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఉత్తమ పాలనకు అవకాశం కల్పించాలని కోరారు. పాలన తమకు కొత్తేమీ కాదని, ఉత్తమ పాలనను అందించిన అనుభవం ఉందని ఆయన తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీసీ. మోహన్, ఐటీ, బీటీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
క్రీడలపై క్రీనీడ!
సంపాదకీయం: క్రీడల విషయంలో ఈ దేశప్రజల గుండెల్లో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న అసంతృప్తిని సర్వోన్నత న్యాయస్థానం గురువారం తన వ్యాఖ్యల్లో ప్రతిబింబించింది. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు ‘ఆడిందే ఆట’గా సాగుతున్న క్రీడారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇలాంటి అవాంఛనీయ పరిణామాల కారణంగా క్రీడల్లో మన సత్తా నానాటికీ క్షీణిస్తుంటే, జోక్యంచేసుకుని చక్కదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతున్నదని దుయ్యబట్టింది. ఇండియన్ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్)కూ, హాకీ ఇండియా(ఐహెచ్)కూ మధ్య నెలకొన్న వివాదంపై తమ ముందుకొచ్చిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నదగినవి. క్రీడా సంఘాలనేవి వాస్తవానికి మట్టిలో మాణిక్యాలను వెతికిపట్టేవిగా ఉండాలి. మెరికల్ని గుర్తించి వారి ప్రతిభను సానబట్టే స్థాయిలో పనిచేయాలి. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహమిచ్చేవిగా రూపొందాలి. నిష్ణాతులైన క్రీడాకారుల్ని పంపి, విశ్వ క్రీడారంగంలో మన దేశ పతాకాన్ని సమున్నతంగా ఎగిరేలా చేయాలి. కానీ, అదేం ఖర్మమో...ఇలాంటి సంఘాలన్నీ కొందరికి ‘కులాసా క్లబ్బు’ల్లా తయారయ్యాయి. తమ తమ రంగాల్లో అలసి సొలసిపోతున్న వారికి ‘ఆటవిడుపు’ సంస్థలుగా మారాయి. ఇలాంటివారంతా పీఠాధిపతులుగా మారి, ముఠాలుకట్టి నిజమైన క్రీడాకారులను ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ప్రతిభతో పనిలేకుండా నచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారు. అందువల్లే అంతర్జాతీయ క్రీడా రంగస్థలిలో మనం నగుబాటు పాలవుతున్నాం. మనకు పతకాలు అందని ద్రాక్షలవుతున్నాయి. దేశంలో నలభైకి పైగా క్రీడా సమాఖ్యలున్నాయి. వీటన్నిటిలోనూ దశాబ్దాలుగా కొందరే అధికారం చలాయిస్తున్నారు. నిరుడు ఆగస్టులో లండన్లో జరిగిన ఒలింపిక్స్లో మన దేశం ఆరంటే ఆరే పతకాలు సాధించి తెల్లమొగం వేసింది. అంతకు నాలుగేళ్లముందు బీజింగ్ ఒలింపిక్స్లో ఒక్క స్వర్ణం సాధించుకోగా, లండన్లో అదీ లేకుండాపోయింది. అప్పుడున్న యాభయ్యో స్థానంనుంచి లండన్లో 55వ స్థానానికి పడిపోయాం. రూ.200 కోట్లకు పైగా వ్యయంతో తర్ఫీదునిచ్చి 81 మంది క్రీడాకారుల్ని పంపితే ఎవరూ సంతృప్తికరంగా ఆడలేక పోయారు. ఒకప్పుడు మనకు గర్వకారణంగా నిలిచిన హాకీ క్రీడలో దారుణంగా ఓడిపోయాం. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్నే ప్రస్తావించింది. క్రీడా సమాఖ్యల్లో పెత్తనం చలాయిస్తున్నవారిలో చాలామందికి ఆయా క్రీడలతో సంబంధమే లేని వైనాన్ని నిలదీసింది. ఈ దేశం తరఫున అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రాతినిధ్యం వహించడానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) గుర్తింపు తమకివ్వాలంటే తమకివ్వాలంటూ తగువులాడుకున్న రెండు సంస్థల తీరునూ దుయ్యబట్టింది. అసలు మీ సంఘాల నిర్వాహకుల్లో ఒలింపియన్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. అడగవలసిన ప్రశ్నే ఇది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారగణం తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇలాంటి సమాఖ్యల్లో తిష్టవేస్తున్నారు. క్రీడాకారులు, శిక్షకులు, టీం మేనేజర్ల ఎంపికంతా ఇష్టానుసారం చేస్తున్నారు. సమాఖ్యలన్నిటా ఆర్ధిక, నైతిక అరాచకత్వం, ఆశ్రీతపక్ష పాతం రాజ్యమేలుతున్నాయి. వేర్వేరు మార్గాల్లో ఆయా సమాఖ్యలకొచ్చే కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతుండగా, మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధింపులు సర్వసాధారణమయ్యాయి. మన ఒలింపిక్ అసోసియేషన్ అరాచకానికి విసిగి నిరుడు డిసెంబర్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంస్థ దాని గుర్తింపును రద్దుచేసింది. మన కేంద్ర క్రీడల మంత్రి వినతిమేరకు ఈమధ్యే నిషేధాన్ని తొలగించింది. ఈ దురదృష్టకర పరిస్థితులను సరిదిద్దడానికి రెండేళ్లక్రితం ఒక ప్రయత్నం జరిగింది. క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత తీసుకొచ్చి, వాటికి జవాబుదారీతనాన్ని అలవాటు చేయడం కోసమని జాతీయ క్రీడాభివృద్ధి బిల్లును రూపొందించారు. అయితే, కేంద్ర కేబినెట్లో ఉంటూ కొన్ని క్రీడా సంస్థల్లో పెత్తనం చేస్తున్న మంత్రులు దానికి గంటికొట్టారు. చివరకు ఆ బిల్లు అటకెక్కింది. దాని స్థానంలో మరో ముసాయిదా బిల్లు తయారైంది. రాజకీయనాయకుల, వ్యాపారవేత్తల పెత్తనాన్ని నిరోధించడానికి అనువైన అంశాలు ఇందులో లేకపోయినా... కార్యనిర్వాహక వర్గంలో ఉండేవారు 70 ఏళ్ల వయసు వచ్చేసరికి రిటైరయ్యేలా నిబంధన ఉంచారు. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వరసగా మూడేళ్లపాటు, కార్యనిర్వాహకవర్గంలో ఉండేవారు వరసగా రెండు దఫాలు మాత్రమే పోటీచేయడానికి అర్హులన్న నిబంధన పెట్టారు. ఏ క్రీడా సమాఖ్య అయినా సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండాల్సిందేనని నిర్దేశించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిధులు పొందే సంస్థలు ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాఖ్యల్లో 10 శాతం మంది మహిళలుండాలని నిబంధన విధించారు. క్రీడా సమాఖ్యల్లో పేరుకుపోయిన ముఠాతత్వానికి, అరాచకత్వానికి ఈ కొత్త బిల్లు ఎంతవరకూ అడ్డుకట్ట వేయగలదో అనుమానమే. క్రీడలతో సంబంధంలేని వ్యక్తుల బంధనాల నుంచి సమాఖ్యలను సంపూర్ణంగా విముక్తి చేస్తే తప్ప ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో కాస్తయినా మార్పువచ్చే అవకాశమేలేదు. సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యానాల వెలుగులో బిల్లును మరింత సానబట్టాలి. అట్టడుగు స్థాయినుంచి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా...ఔత్సాహిక క్రీడాకారుల నైపుణ్యానికి మెరుగులద్దేలా, క్రీడా సంఘాల అవ్యవస్థను చక్కదిద్దేలా బిల్లు సమగ్రంగా ఉండాలి. అలాగని సమాఖ్యలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లకూడదు. అవి స్వతంత్రంగా, పారదర్శకంగా, వృత్తిై నెపుణ్యంతో పనిచేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ గడ్డపై మళ్లీ క్రీడా సంస్కృతి వెల్లివిరుస్తుంది. విశ్వక్రీడా వేదికపై మనవాళ్ల ప్రతిభ కాంతులీనుతుంది. -
ఒకే వేదికపై 2,000 మంది పారిశ్రామికవేత్తలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడు దేశాలు. రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు. అందరిదీ ఒకే సంకల్పం. కొత్త ఆలోచనలు (ఐడియా) మొదలుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగడం. నూతన ఆలోచనలు, విస్తరణ, పెట్టుబడి, వ్యాపార అవకాశాలు. ఇవే వారి లక్ష్యాలు. లక్ష్య సాధనకు ఇప్పుడు ఒకే వేదికపైకి రానున్నారు. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్(టై) ఆధ్వర్యంలో ఇక్కడి హెచ్ఐసీసీలో డిసెంబర్ 18 నుంచి 20 వరకు టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్-2013 జరగనుంది. ఆసియాలో అతి పెద్దదైన ఈ సదస్సుకు తొలిసారి హైదరాబాద్ వేదికవుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్, నాసా వ్యోమగామి బెర్నార్డ్ ఆంటోని హ్యారిస్ జూనియర్ తదితరులు కార్యక్రమానికి రానున్నారు. మొత్తం 5,000 మంది సదస్సుకు హాజరవుతారని సదస్సు కో-చైర్ జె.ఏ.చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
బీజేపీకి కార్పొరేట్పైనే ప్రేమ: రాహుల్
చిత్తోర్గఢ్/బికనీర్: బీజేపీకి కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడంలో ఉన్న ఆసక్తి పేద ప్రజలపై ఉండదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కొంతమంది కోసమే ప్రభుత్వం ఉందని వారు నమ్ముతారన్నారు. రాజస్థాన్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మంగళవారం జరిగిన సభల్లో పాల్గొన్న ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శించారు. బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య పూర్తి స్థాయిలో వైరుధ్యం ఉందన్నారు. ఈ దేశం పేదలు, సంపన్నులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పనివారు లాంటి అందరిదీ అని కాంగ్రెస్ భావిస్తుందని, బీజేపీకి మాత్రం కొద్ది మందిపైనే ధ్యాస ఉంటుందని చెప్పారు. బీజేపీ నాయకుల ప్రసంగాలు వింటే అది అర్థమవుతుందని, వాళ్లెపుడు ఎయిర్పోర్టులు, మౌలికసదుపాయాలు, రోడ్ల గురించే మాట్లాడతారే తప్ప పేద ప్రజల గురించి కాదని వివరించారు. తాము కూడా వాటిని నిర్మించాలనే చెబుతామని అయితే అదే సమయంలో పేదలకు సాయం చేయాలని యత్నిస్తామన్నారు. తద్వారా వాళ్లు కూడా ఒక రోజు విమానాల్లో తిరగగలుగుతారని చెప్పారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టులను తమ హయాంలోనే నిర్మించామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ప్రజల్లో చీలిక తెచ్చి గెలవాలని బీజేపీ యత్నిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోంది తప్ప.. దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కాదని చెప్పారు. ఈ సభల్లో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సీపీ జోషి, సీఎం గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్న... అందరి దేవుడు
తిరుమల ఆలయంలో సామాన్యుల సంఖ్యతో సమానంగా... అందరూ అసామాన్యంగా భావించే చలనచిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వేత్తల సందడి రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ భారతదేశానికే చెందిన వారే కాకుండా యావత్ భారతదేశం నుంచి సెలెబ్రిటీ భక్తులు తరలి వస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శంకర్దయాళ్శర్మ తిరుమల వచ్చిన ప్రతిసారీ తలనీలాలు సమర్పించేవారు. ఎందరో నేతలు గుండు చేయించుకుని మొక్కు చెల్లించుకుంటారు. రజనీకాంత్, కేంద్ర మంత్రి పళ్లంరాజు అయితే తలనీలాలివ్వటంతో పాటు తులాభారం తూగుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలయిన రతన్టాటా, అంబానీ సోదరులు, హెచ్సీఎల్ కంప్యూటర్స్ అధినేత శివనాడార్, సుబ్రమణ్యం రాజా తదితరులు తర చూ తిరుమలను సందర్శిస్తుంటారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచార్య శ్రీకాంత్, రవిశాస్త్రి, సెహ్వాగ్, శ్రీశాంత్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు తరచూ తిరుమలకు వస్తుంటారు. ఇస్రో, షార్ వంటి వైజ్ఞానిక సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం స్వామివారి కృపా కటాక్షాల కోసం క్యూ కడుతున్నారు. కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు అంతరిక్ష శాస్త్రవేత్తలు నమూనా ఉపగ్రహాన్ని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి, పూజలు చేసిన తర్వాతే తమ పని ప్రారంభిస్తారు. టీ 20 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యే ముందు, విజయ్మాల్యా ముందుగా తిరుమలేశుని దర్శించుకుని, తమ జట్టును గెలిపించమంటూ పూజలు చేసి ఆశీస్సులందుకుంటారు. మరోవైపు ప్రధానమంత్రి నుంచి కేంద్రమంత్రుల వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సాధారణ మంత్రుల వరకు అందరూ ఏడుకొండలవాడి భక్తులే. తొలి ప్రధాని నెహ్రూ, ఆయన వారసులంతా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నవారే. రాష్ర్టపతులు బాబూ రాజేంద్రప్రసాద్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్సింగ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, కలాం, ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీ తిరుమలకు వచ్చినవారే. పీవీ నరసింహారావు, వాజ్పేయి మన్మోహన్సింగ్ వంటి ప్రధానులు... నీలం సంజీవరెడ్డి, అంజయ్య, ఎన్టీయార్, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, వైఎస్సార్, కిరణ్కుమార్రెడ్డి వంటి ముఖ్యమంత్రులంతా స్వామివారి ఆశీర్వచనాలు ముఖ్యమనుకున్నవారే. చివరకు తమిళనాడు సీఎం జయలలిత, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాదేవి, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజే సింధియా, అమర్సింగ్, కర్ణాటక , మహారాష్ట్ర, గోవా, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా నేతలు కూడా తిరుమలకు వస్తున్నారంటే... స్వామివారి పట్ల వీఐపీ భక్తుల విశ్వాసం ఎంతటితో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు కూడా స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మాజీ ఎన్నికల కమిషనర్లు టీఎన్ శేషన్, లింగ్డో, సంపత్ తదితరులు స్వామి దర్శనానికి వచ్చినవారే. అయితే ఎందరు ప్రముఖులు వచ్చినా, సినిమావాళ్ల సందడే వేరు. దివంగత నటుడు దేవానంద్కి ఏడుకొండలవాడంటే అమితమైన భక్తి. అలాగే అమితాబ్, రిషీకపూర్, శ్రీదేవి, శిల్పాశెట్టి, దీపికా పదుకొనే, హేమమాలిని, రామానాయుడు, దాసరి నారాయణరావు, నాగార్జున, బాలకృష్ణ, మోహన్బాబు, పవన్కల్యాణ్, మహేష్బాబు, జూనియర్ ఎన్టీయార్, రామ్చరణ్, అల్లుఅర్జున్, శ్రీయ... స్వామిని వెతుక్కుంటూ వచ్చే సినిమావాళ్ల లిస్టుకు అంతమే లేదు. అందరూ సమానులే! నడకదారుల్లో సామాన్య భక్తులు మాత్రమే వెళతారని అనుకుంటారంతా. కానీ అది నిజం కాదు. కోట్లకు పడగలెత్తిన ధనవంతులు, నేతలు, సినీ తారలు కూడా కాలినడకన స్వామిని దర్శించుకుంటారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు నడిచి వచ్చి తన పాదయాత్రను పరిపూర్ణం చేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్, కార్పొరేట్ దిగ్గజమైన అనిల్ అంబానీ, అందాల భామలు ఐశ్వర్యరాయ్, శిల్పాశెట్టి, నటుడు పవన్కల్యాణ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, గాలి జనార్దన్రెడ్డి వంటి వారంతా నడిచి వచ్చి శ్రీవారికి మొక్కులు చెల్లించినవారే. ఇక జయప్రద కుటుంబంతో సహా వచ్చి తిరుమలలో పుట్టినరోజును జరుపుకుంటారు. తారల పెళ్లి వేదిక! తిరుమల క్షేత్రంలో అనేకమంది సినీ తారలు, ప్రముఖుల వివాహాలు జరిగాయి. జమున-రమణరావు, బాలకృష్ణ-వసుంధర, శ్రీకాంత్-ఊహ, శ్రీహరి-శాంతి, కృష్ణ కుమార్తె మంజుల-సంజయ్ స్వరూప్, మహేశ్వరి-జయకృష్ణ, మీనా-విద్యాసాగర్, రంభ-ఇంద్రకుమార్ వంటి వారందరికీ వెంకన్న సన్నిధే పెళ్లి వేదిక అయ్యింది. ఇక జూనియర్ ఎన్టీయార్-లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, చరణ్-ఉపాసన, బాలకృష్ణ పెద్దకుమార్తె బ్రహ్మణీ-నారా లోకేష్, చిన్నకుమార్తె తేజశ్వి-శ్రీభరత్ల పెళ్లిళ్లు హైదరాబాద్లో జరిగినా... వేడుకలు ముగియగానే తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. రజనీకాంత్ కూడా కుమార్తె ఐశ్వర్యతో తమిళ హీరో ధనుష్, మరో కుమార్తె సౌందర్యతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశ్విన్ వివాహం జరిగిన తర్వాత తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి ఆశీస్సులందుకున్నారు. అభిషేక్ వివాహం ఐశ్వర్యరాయ్తో జరిగిన తర్వాత వారిని స్వామి సన్నిధికి తీసుకువచ్చారు బిగ్బీ. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు కూడా వివాహం జరిగాక తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. సెలెబ్రిటీలు వస్తే సందడిగానే ఉంటుంది. అయితే వారిని చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు ఎగబడే అభిమానులను నియంత్రించటం తిరుమల పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. అందుకే అతి ముఖ్యమైన వీఐపీలు, సినీ లెజెండ్స్, క్రీడాకారులు వేకువజామున 2.30 గంటలకు సుప్రభాత సేవలో స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతుంటారు. మరో విశేషమేమిటంటే... తిరుమలకు వచ్చే సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడాకారులు, అధికారులు, న్యాయ నిపుణుల్ని భక్తుల సేవలో కూడా భాగస్వాముల్ని చేస్తోంది దేవస్థానం. దర్శనం తర్వాత నిత్యాన్నప్రసాద భవనంలో భక్తులకు భోజనం వడ్డించటం, భుజించిన విస్తర్లు ఎత్తటం వంటి దైవ సేవా కార్యక్రమాలు చేస్తూ సెలెబ్రిటీలు ఇతర భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు! -
పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కొంతమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ, హిందూస్తాన్ యూనిలీవర్ మాజీ సీఈవో నితిన్ పరాంజపే తదితరులతో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్ తన నివాసంలో పారిశ్రామికవేత్తలను కలుసుకోవడం బహుశా ఇది మొదటిసారని సంబంధిత వర్గాలంటున్నాయి.