Jailed
-
ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!
ఇటీవల చాలామంది ఎలాంటి నైపుణ్యాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లెర్నింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల కోర్సులు, స్కిల్స్కే వర్కౌట్ అవుతుంది. వైద్య విద్యలాంటి కోర్సులకు అస్సలు పనికిరాదు. ఇది ఓ రోగి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. చివరికి కటకటాలపాలవ్వుతాం. ఆన్లైన్ లెర్నింగ్లో వైద్య విధానం గురించి జస్ట్ అవగాహన తెచ్చుకోగలమే గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం అసాధ్యం. కానీ ఇక్కడొక మహిళ అలాంటి సాహసానికి ఓడిగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చివరికి జైటుపాలయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..ఆగ్నేయ చైనాలోని వాంగ్ అనే మహిళ ఆన్లైన్ వీడియోల ద్వారా ఆక్యుపంక్చర్ మొత్తం నేర్చుకుంది. ఈ నైపుణ్యంతో తాను నివశించే గ్రామంలోని ప్రజలకు చికిత్స చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి తేడా కొట్టలేదు కాబట్టి డాక్టర్ లైసెన్స్ లేకుండానే ధర్జాగా చేసేసింది. అయితే గతేడాది లీ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆ మహిళ వద్దకు వచ్చాడు. చికిత్స కోసం రూ. 5 వేలు చెల్లించాడుకూడా. ఆమె అతడికి చికిత్స అందించడమే గాక చివరి సెషన్లో భాగంగా చేసిన చికిత్స టైంలో లీ అసౌకర్యానికి గురయ్యాడు. కాసేపటి తర్వాత ఆమె అతడిని ఎంత తట్టి లేపిన లేవకపోవడంతో అతడిని హుటుహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ క్రమంలోనే పరిస్థితి విషమించిన చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపర్చారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. వాంగ్కు అధికారిక ఆక్యుపంక్చర్ శిక్షణ లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. ఆమె ఆన్లైన్ వీడియోలతో నేర్చుకుని తనపై, తన భర్తపై సాధన చేసిందే తప్ప క్లినికల్ అనుభవం లేదని తేలింది. ఇక్కడ బాధితుడు లీకి తీవ్రమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంది. అలాంటి వాళ్లకు ఆంక్యుపక్చర్ అనేది ప్రత్యేక నిపుణులు పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి క్లినికల్ శిక్షణలేని వాంగ్ అతడికి తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చేయడంతో వికటించి అతని మరణించాడని కోర్టు పేర్కొంటూ ఆ మహిళకు 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. (చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
కడుపుతో ఉన్నానంటూ ఓ మహిళ..ఏకంగా రూ. 98 లక్షలు..!
కొందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతలా కక్కుర్తిపడుతుంటారో తెలిసిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పనులైన చేస్తారు. కానీ మరీ ఇలా గర్భాల పేరుతో లక్షల్లో డబ్బు కొట్టేయడం చూసి ఉండరు. పోనీ ఒకటో రెండో ప్రశూతి ప్రయోజనాలు కాదు. ఏకంగా ఎన్నిసార్లు ఇలా బూటకపు గర్భాల గురించి అబద్ధాలు చెప్పిందో వింటే కంగుతింటారు. అలాగే ప్రశూతి ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు ఎంత మేర కొట్టేసిందో విన్నా వామ్మో! అంటారు. ఏం జరిగిందంటే.. ఇటలీలోని రోమ్కి చెందిన 50 ఏళ్ల బార్బరా నకిలీ గర్భాల పేరుతో దాదాపు రూ. 98 లక్షల దాక ప్రసూతి ప్రయోజనాలను కొట్టేసింది. నిజానికి ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన పిల్లల గురించి ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్లో ఉన్న క్లినిక్ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాను దొంగలించి అచ్చం అదే మాదిరిగా తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కలిగినట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. అంతేగాక తాజాగా ఇటీవల గత డిసెంబర్లో తాను మరో బిడ్డను ప్రసవించినట్లు పేర్కొంది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ గురించి గత తొమ్మిది నెలలుగా గట్టి నిఘా పెట్టారు. ఆ విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు వెల్లడయ్యింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్ పిజ్జినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా..తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసుల సదరు మహిళ లోయెల్, ఆమె భర్తపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరు ఇటాలియన్ హెల్త్ అసిస్టెన్స్నే మోసం చేశారంటూ మండిపడింది. ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారని చివాట్లు పెట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రశూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఫైర్ అయ్యింది. అలాగే తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాల సమర్పించడమే గాక దాన్నే కొనసాగించే య్నతం చేయడం మరింత నేరం అని స్పష్టం చేసింది. అందుకుగానూ లోయెల్కి ఒక ఏడాది ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఈ నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది. (చదవండి: 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!) -
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై
తిరువనంతపురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు శిశుపాలన్తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాలన్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈలైంగిక దాడి జరిగింది. అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన -
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్ గన్తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగర్జీ హోట్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్గన్ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది. దీంతో స్మిత్ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్ని విమల, స్నేహల్ పటేల్ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో తమ కూతరు మాయా పటేల్, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది. అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. (చదవండి: క్లాస్మేట్ను 114 సార్లు పొడిచాడు) -
కోర్టు తీర్పు.. మైడెన్ ఫార్మా ఫౌండర్ జైలుకి!
చాలా సంవత్సరాల క్రితం వియత్నాంకు నాసిరకం మందులను ఎగుమతి చేయడం వల్ల గాంబియాలో ఎంతో మంది పిల్లలు మరణించారు. పిల్లల మరణాలకు దగ్గు సిరప్లు కారణమని కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇటీవల వెల్లడైంది. 2022 అక్టోబర్లో మైడెన్ ఫార్మాస్యూటికల్స్లో తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి తయారైన నాలుగు దగ్గు సిరప్లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఉత్పత్తిని నిలిపివేసింది. (ఇదీ చదవండి: భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా) పిల్లల మరణాలకు గాంబియాలో తమ ఔషధాలే కారణం అనటాన్ని కంపెనీ కండించింది. అంతే కాకుండా గవర్నమెంట్స్ నిర్వహించిన టెస్ట్లో కూడా అందులో విషపదార్థాలు లేదని తేలింది. అయినప్పటికీ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. హర్యానా సోనిపట్లోని కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణను సముచితంగా రుజువు చేశారని హార్ట్బర్న్ ఔషధాన్ని వియత్నాంకు ఎగుమతి చేసినందుకు కంపెనీ వ్యవస్థాపకుడు నరేష్ కుమార్ గోయెల్, టెక్నికల్ డైరెక్టర్ ఎంకే శర్మలకు జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు 2023 మార్చి 23 వరకు గడువు ఇచ్చింది. రెనిటిడిన్ టాబ్లెట్స్ బిపి (మాంటెక్-150) మెడిసిన్ వియత్నాంకు ఎగుమతి చేసినందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించారు.అయితే గోయెల్ కాల్లకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఎంకే శర్మ సంప్రదింపు వివరాలను అందించడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. ఆరేళ్ల తర్వాత షాక్..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఏం జరిగిందంటే? ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే సోను, గోపాల్కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
కూతురిపై లైంగికదాడి కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు
చిత్తూరు అర్బన్/దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): కన్న కూతురిపైనే లైంగికదాడికి పాల్పడిన తండ్రికి, అతనికి సహకరించిన తల్లికి బతికి ఉన్నంతవరకు జైలు శిక్ష(జీవిత ఖైదు) విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కథనం మేరకు.. 2018, నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కుమార్తె(13 ఏళ్ల బాలిక) ఇంట్లో నిద్రిస్తోంది. చదవండి: ముంబై హోటల్లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ.. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇందుకు బాలిక తల్లి సహకరించింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి, ధనమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్ను ఆదేశించారు. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 ఏళ్లు జైలు కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు తీర్పు చెప్పిందని ఎస్ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. దేవీపట్నం మండలంలో తున్నూరు గ్రామానికి చెందిన ఎ.రాజేశ్వరరెడ్డి తన కూతురు (మైనర్)పై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం గమనించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ చోడి వీర్రాఘవ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఎల్. వెంకటేశ్వరరావు సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధించారని ఎస్ఐ తెలిపారు. -
జిన్పింగ్ కూతురి ఫొటో వల్లే ఈ కష్టాలు!
ఆయన ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన నేత. అమెరికా అంటే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటాడు. అలాంటోడు తన గారాల కూతురిని మాత్రం సురక్షితంగా శత్రుదేశంలోనే దాచిపెట్టాడు.. అక్కడే చదివించాడు కూడా. అదీ బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. ఆ కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా?.. 2019లో చైనాకు చెందిన నియూ టెంగ్యూ అనే వ్యక్తి.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. ఇంకేం అధ్యక్షుల వారికి మండిపోయింది. ఆ దెబ్బకు 22 ఏళ్ల ఆ యువకుడిని అరెస్ట్ చేసి.. కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అక్కడి చట్టాలేమో అతగాడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతగాడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. ఏకంగా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అధ్యక్షుడి కూతురి ఫొటో, ఐడెంటిటీ బయటపెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక నియూకి, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అంతేకాదు.. అతని తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదని, ఇప్పటిదాకా 14 మంది లాయర్లను నియమించుకున్నామని ఆమె చెబుతోంది. అంతేకాదు.. కొడుకును కలిసేందుకు ఎన్ని అర్జీలు పెట్టుకుంటున్నా గువాంగ్డోంగ్ న్యాయస్థానం వాటిని తిరస్కరిస్తోందని, పైగా ఆ అర్జీలు తమదాకా రావడం లేదని చెబుతోందని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉంటే.. చైనాలో జీ జిన్పింగ్ ఫ్యామిలీని కదిలించినా.. ఆయన ప్రభుత్వంపై సెటైరిక్గా పోస్టులు చేసినా శిక్షలు కఠినంగానే ఉంటాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఏకైక తనయ జీ మెంగ్జీ(30). తన రెండో భార్య పెంగ్ లియువాన్(ఫోక్ సింగర్)తో కలిగిన సంతానం. చైనా కమ్యూనిస్టు పార్టీ చట్టం ఆధారంగా అమెరికాలో కూతురు మెంగ్జీ ఉన్నత విద్యను అభ్యసించింది. ఆపై ఐదేళ్లపాటు చైనాలో ఉండి.. మళ్లీ అమెరికాకే వచ్చి రీసెర్చి విద్యార్థిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ ప్రతినిధి(మాజీ) విక్కీ హార్ట్జ్లర్ ఆమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఆ వెబ్సైట్, పత్రికల్లో ప్రచురితమైన ఐడెంటిటీ మెంగ్జీదేనా? అనేది మాత్రం ఇప్పటికీ అనుమానమే!. అలాగే ఆమెకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు. ఇదీ చదవండి: గన్ గురిపెట్టి చంపబోయాడు, కానీ.. -
Crime News: ఎంత పని చేశావ్ రమావతి!
భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ భర్తకు. భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని! ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో.. 2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది ఈమధ్యే. బంధువులతో పరుగున.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. -
మా నాన్నను విడిపించండి
న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ ఖమర్(62)ను యూపీలోని మీరట్లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన ఖమర్ అక్కడి పాస్పోర్టుతో భారత్కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్ ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్కు భారత్లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. -
భారత్పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్కు షాకిచ్చిన చైనా -
పోక్సో కేసులో 21 ఏళ్ల శిక్ష
కొత్తగూడెం రూరల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారితప్పాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతవర్ర గామ ప్రభుత్వ పాఠశాలలో దొడ్డ సునీల్కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన గత ఏడాది డిసెంబర్లో పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను పాఠశాలకు పిలిచేవాడు. ఆయన మాటలు నమ్మి వచ్చిన ఐదుగురు విద్యార్థినుల(మైనర్లు)పై సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సునీల్ను అరెస్టు చేశారు. ఈ కేసును ఐపీఎస్ అధికారి వినీత్ విచారణ జరిపారు. ఈ మేరకు కేసు కోర్టు విచారణకు రాగా, న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. అనంతరం నిందితుడు సునీల్కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఆరుగురు అధికారులకు 6 నెలల జైలు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమి సేకరణ విషయంలో ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను ఉల్లంఘించారంటూ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సునీత ఎం.భగవత్, డీఎఫ్వో జానకీరామ్, అడిషనల్ కలెక్టర్ ఎస్.తిరుపతిరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ.శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధించింది. రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇటీవల తీర్పునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్వే నంబర్ 222/1 నుంచి 222/20లో మహ్మద్ సిరాజుద్దీన్ తదితరులకు 383 ఎకరాల భూమి ఉంది. అటవీ అధికారులు ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలని నిర్ణయించి సేకరించాలని భావించారు. అయితే ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చడం సాధ్యం కాదంటూ అటవీశాఖ సెటిల్మెంట్ ఆఫీసర్ 2008లో కలెక్టర్కు లేఖ రాశారు. అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ భూమిసేకరణ ప్రక్రియపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆరేళ్లయినా అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆ భూమిని తమకు అప్పగించకపోవడాన్ని సవాల్చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు 2015లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
చైనా సంచలన నిర్ణయం: బిలియనీర్కు భారీ షాక్
బీజింగ్: బిలియనీర్, అగ్రికల్చరల్ టైకూన్ సన్ దావూకు (66) చైనా భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్పింగ్ ప్రభుత్వం తాజాగా సన్దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్ కోర్టు ప్రకటించింది. దీనిపై సన్ న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్ దావూ. ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై గొంతెత్తే సన్ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్ను అరెస్ట్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే 2021 మేలో సన్ను మరోసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
అత్యాచారం కేసు: 33 ఏళ్ల తర్వాత మహిళకు శిక్ష
శ్రావస్తి/లక్నో: 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు సాయం చేసిన మహిళకు శ్రావస్తి స్థానిక కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. అదనపు సెషన్స్ జడ్జి పరమేశ్వర్ ప్రసాద్ గురువారం నిందితురాలికి 15 వేల రూపాయల జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది కేపీ సింగ్ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరూ విచారణ సమయంలో మరణించారని ఆయన అన్నారు. కోర్టులో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పురాతన కేసుల్లో ఇది ఒకటి అని సింగ్ అన్నారు. కేసు వివరాలు.. 33 ఏళ్ల క్రితం అనగా 1988, జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన బాధితురాలు సమీప గ్రామంలో ఓ విహానికి హాజరయ్యింది. రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితురాలు రామ్వతి, ఆమె తల్లి ఫూల్మాత మైనర్ను ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. ఈ కేసులో ముక్కు, పుస్సు, లాహ్రీ, రామ్వతి, ఆమె తల్లి ఐదుగురిపై ఐపీసీ సంబంధిత విభాగాల కింద భింగా పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. 33 సంవత్సరాల తరువాత, 2021 ఏప్రిల్లో కోర్టు వారందరినీ దోషులుగా గుర్తించి తన తీర్పును రిజర్వు చేసింది. చదవండి: ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్.. -
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు ఎట్టకేలకు శిక్ష
-
పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు
మాంచెస్టర్: ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’ ‘మీలో కీలి బుర్లింగమ్ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్ టేలర్ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఏ చైల్డ్ అండర్ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే, పీటర్ టేలర్ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్ డ్రెస్ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్ గర్ల్స్ మీదకు పీటర్ టేలర్ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్ డ్రెస్లో చూడాలనుకున్న టేలర్కు, స్కూల్ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్లోని మిన్శుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు జడ్జీ మార్క్ సావిస్ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు. ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్లో గ్రేటర్ మాన్చెస్టర్లోని డుకిన్ఫీల్డ్కు చెందిన వారు. వారు 2016లో డేటింగ్ వెబ్సైట్ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది. అది కొద్ది కాలానికే పెడతోవలు పట్టింది. ముందుగా టేలర్ కామవాంఛ ఉద్దీపన కోసం ఇంటర్నెట్ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్లోడ్ చేసుకొని బుర్లింగమ్కు పంపించే నీచానికి దాగాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాక స్కూల్ డ్రెస్తో మొదలైన తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునే దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్టైమ్ బేబీ సిట్టర్గా పనిచేసిన బుర్లింగమ్ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్ఫోన్ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట. పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్ అరెస్ట్ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్ నెలలో టేలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్లలో నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు, షేర్ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది. (ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై..) -
జైలుకు పంపడానికి ట్రక్కును తెప్పించారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్లోని మొసుల్లో పట్టుబడిన ఐసిస్ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్ నిమను జైలుకు తరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. 130 కిలోలకు పైగా బరువున్న షిఫల్ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఐఎస్ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐసిస్ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్ నిమ జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్ పోలీసులు పేర్కొన్నారు. నిమ పట్టుబడటం ఐసిస్కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాగా. 2013లో పురుడు పోసుకున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద గ్రూపు తమ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాది హతమైనా ప్రపంచానికి పెనుముప్పుగానే పరిణమించింది. చదవండి : రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ -
అసాంజేకు 50 వారాల జైలు శిక్ష
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బుధవారం లండన్ న్యాయస్థానం 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలను ఆరోపించినందుకుగానూఈ శిక్షవిధిస్తూ సౌత్ వర్క్ క్రౌన్ కోర్డు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వికీలీక్స్ ఖండించింది. ఈ తీర్పుషాకింగ్, కుట్రపూరితమైందని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేపై గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్లో స్వీడన్లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే ఈక్వడేరియన్లో తలదాచుకున్న అసాంజేకు ఎంబసీ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది. ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం మినహా, అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. -
ఇడియట్ అన్నందుకు రూ. 4 లక్షల ఫైన్
అబు దాబి : కాబోయే భార్యను ఇడియట్ అని పిలిచినందుకు గాను ఓ వ్యక్తికి 20 వేల దీరామ్ల జరిమానతో పాటు 60 రోజుల జైలు శిక్ష విధించారు. వివరాలు.. ఖలీజ్ టైమ్స్ ప్రకారం ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను ఉద్దేశిస్తూ వాట్సాప్లో ‘ఇడియట్’ అని మెసేజ్ పెట్టాడు. కేవలం సరదాగా చేసిన ఈ పనికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇడియట్ అని పిలవడంతో ఆగ్రహించిన అతని ఫియాన్సి ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అతడు సరదాగా చేసిన పనికి గాను దాదాపు 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించడమే కాక ఆరు నెలల జైలు జీవితం గడపబోతున్నాడు. మన దగ్గర ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు కానీ.. అరబ్ దేశాల్లో మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలు పంపించారు. -
దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలికి 24 ఏళ్ల జైలు శిక్ష
-
ముంబైకి చేరుకున్న సల్మాన్ఖాన్
-
సల్మాన్కు బెయిల్
జోధ్పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్కు జోధ్పూర్ సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. సల్మాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారమే వాదనలు పూర్తి కాగా తీర్పును సెషన్స్ కోర్టు జడ్జి శనివారానికి వాయిదావేశారు. ఉదయం బెయిల్ పిటిషన్పై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 3 గంటల సమయంలో జడ్జి తీర్పు వెలువరిస్తూ.. బెయిల్ కోసం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని డిఫెన్స్ న్యాయవాదుల్ని ఆదేశించారు. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సల్మాన్ చెల్లెళ్లు అల్విరా, అర్పితలు కోర్టులోనే ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ పత్రాలు అందగానే జైలు అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో సల్మాన్ను విడుదల చేశారని.. అనంతరం పోలీసు పహారా మధ్య వ్యక్తిగత బాడీగార్డు షేరా వెంటరాగా జోధ్పూర్ ఎయిర్పోర్టుకు వెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. కొంతమంది అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను మే 7న విచారిస్తామని, అప్పుడు సల్మాన్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రవీంద్ర కుమార్ జోషి ఆదేశించారు. కాగా ఆయనను సిరోహి కోర్టుకు బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాజస్తాన్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు అందాయి. సాధారణ బదిలీల్లో భాగంగా మొత్తం 134 జడ్జీల్ని ట్రాన్స్ఫర్ చేయగా అందులో రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. 1998 అక్టోబర్లో ‘హమ్ సాథ్ సాథ్ ’హై సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకల్ని చంపిన నేరంపై గురువారం ట్రయల్ కోర్టు సల్మాన్ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెయిల్పై బాలీవుడ్లో హర్షం బెయిల్ మంజూరైన విషయం తెలియగానే సల్మాన్ స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘సల్మాన్కు బెయిల్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడుగా, మానవత్వమున్న వ్యక్తిగా సల్మాన్ను అభిమానిస్తా’ అని చెప్పారు. ఆ చిత్ర నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ.. ‘సల్మాన్ విడుదల కావడం మాకు చాలా ముఖ్యం. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. రేస్ 3 సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తయింది’ అని చెప్పారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటులు సోనూ సూద్, నీల్ నితిన్ ముకేశ్, దర్శకుడు అనీస్ బజ్మీ తదితరులు సల్మాన్కు బెయిల్ రావడాన్ని స్వాగతించారు. సల్మాన్ విడుదలతో అహ్మదాబాద్లో సంబరాలు చేసుకుంటున్న విద్యార్థినులు -
'నేను బతకాలంటే ఆయన రహస్యాలు నాతోనే..'
న్యూయార్క్ : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే శృంగార పాఠాలు బోధిస్తూ అరెస్టు అయిన బెలరుసియన్ మహిళ అనస్టాషియా వాషుకెవిక్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలో తాజాగా ఓ బాంబు పేల్చింది. ట్రంప్ అధ్యక్షుడుగా మారేందుకు రష్యాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఆయన ప్రచారానికి రష్యా ఎలా సహకరించిందో పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. చిత్ర విచిత్రమైన అశ్లీల పోజులతో సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రమ్ పెట్టి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన అనస్టాషియాను.. విచ్చలవిడిగా శృంగార పాఠాలు బోధిస్తున్నారని, అది కూడా అనుమతి లేకుండా చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తన జీవితం గురించి భయం వేస్తోందని పేర్కొన్న ఆమె డోనాల్డ్ ట్రంప్తో రష్యా సంబంధాల గురించి తన వద్ద రహస్యాలు ఉన్నాయని, వాటిని తన భద్రతకు ఉపయోగించుకుంటానని చెప్పింది. అయితే, ఆ రహస్యాల్లో ఏది కూడా ప్రస్తుతానికి బయటపెట్టేందుకు ఆమె అంగీకరించలేదు. అయితే, ఆమె చెప్పే మాటలు ఎంతమేరకు నమ్మశక్యమైనవా కాదా.. అనే విషయం తేలాల్సి ఉంది. -
నకిలీ డాక్టర్లకు సంకెళ్లు
కల్లూరు/ఎమ్మిగనూరు రూరల్ : కర్నూలులోని సుఖీభవ ఆస్పత్రి, ఎమ్మిగనూరులోని శ్రీనరహరి క్లినిక్కు చెందిన నకిలీ డాక్టర్లను కటకటాల వెనక్కి పంపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఈ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి..నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసిన విషయం విదితమే. కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్స్లో ఉన్న సుఖీభవ ఆస్పత్రి ఎండీ నాగప్రకాష్ (ఎండీ), ఇందులో పనిచేసే యునాని డాక్టర్ రేష్మాబేగం అర్హతలు లేనప్పటికీ అల్లోపతి వైద్యం చేస్తుండడంతో విజిలెన్స్ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్కుమార్ బుధవారం అర్ధరాత్రే వారిని అదుపులోకి తీసుకుని.. నాల్గవ పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామయ్య నాయుడు తెలిపారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపరిచామన్నారు. అలాగే ఎమ్మిగనూరులో శ్రీ నరహరి క్లినిక్ నిర్వహిస్తూ విజిలెన్స్కు దొరికిపోయిన నకిలీ డాక్టర్ నరహరిరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డిలను గురువారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై చీటింగ్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్కు పంపుతూ మెజిస్ట్రేట్ వాసుదేవ్ ఆదేశాలిచ్చారన్నారు. -
కట్నం కోసం వేధించిన వారికి జైలు శిక్ష
జగిత్యాల జోన్ : కట్నం కోసం కోడల్ని వేధించిన కేసులో అత్తింటివారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మధు గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమరేందర్రావు కథనం ప్రకారం... జగిత్యాల పట్టణంలోని భీరయ్య గుడి ప్రాంతానికి చెందిన జ్యోత్స్నను చల్గల్ గ్రామానికి చెందిన మానాల మారుతికి ఇచ్చి 2008లో పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం ఇచ్చారు. ఏడాది పాటు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అప్పటి నుంచి భర్తతోపాటు మామ లక్ష్మీనారాయణ, అత్త ఈశ్వరమ్మ, బావ, ఆడబిడ్డలు మరో రూ.4 లక్షల కట్నం తేవాలని జ్యోత్స్నను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్రమంలో భార్యను పుట్టింటికి పంపించి, మారుతి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు వారిపై జగిత్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆడబిడ్డ, బావపై కేసు నిరూపణ కాకపోవడంతో వారిని కేసు నుంచి తొలగించి, కోర్టులో భర్త, మామ, అత్త, రెండోభార్యపై చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ఐపీసీ 498ఏ ప్రకారం వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఐదు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించారు. డీపీ యాక్ట్ 4లో భాగంగా అత్తింటివారికి ఆరు నెలల జైలు శిక్ష, మూడు వేల జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న రెండో భార్య లావణ్యపై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు. -
శశికళ జరిమానా కట్టకపోతే..
మరో 13 నెలల జైలు శిక్ష ⇒ జైళ్ల సూపరింటెండెంట్ ప్రకటన ⇒ చిన్నమ్మ దర్శనానికి అనుమతి నో బొమ్మనహళ్లి/ బెంగళూరు/ సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్షకుగురైన అన్నాడీఎంకే నాయకురాలు శశికళ సుప్రీంకోర్టు తనకు విధించిన రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 13 నెలలు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ సూపరింటెండెంట్ కృష్ణకుమార్ మంగళ వారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెకు దిగువ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 సెప్టెంబర్లో దిగువ కోర్టు శిక్ష విధించిన తర్వాత 21 రోజుల పాటు ఇదే జైల్లో ఉన్నా రు. ఈ నేపథ్యం లో మామూలుగానే దాదాపు మూడేళ్ల 11 నెలలు శిక్ష అనుభవించాల్సి ఉంది. శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్లకు జైల్లో ఎలాంటి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించడం లేదని కృష్ణకుమార్ పేర్కొన్నారు. అందరితో పాటు టీవీ చూసేందుకు అనుమతిస్తున్నా మని తెలిపారు. ఇలావుండగా శశికళను కలవడానికి తమిళనాడు మంత్రులు, ప్రముఖ నాయకులు జైలుకు వచ్చారు. అయితే అధికారులు వారిని ములాఖత్కు అనుమతించలేదు. మంత్రులు సెంగో ట్టియన్, దిండిగల్ శ్రీనివాసన్, సెల్లూరు రాజు తమ అనుచరులతో తరలివచ్చారు. వీరితో పాటు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి, మాజీ మంత్రి గోకులేంద్ర, మరికొంతమందికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. మరోవైపు స్పీకర్ పి.ధనపాల్పై అవిశ్వాస తీర్మానం కోరుతూ విపక్ష డీఎంకే అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్కు లేఖ అందజేసింది. ఈ నెల 18న పళనిస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్ష సందర్భంగా స్పీకర్ అనుసరించిన వైఖరి నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్టాలిన్ తెలిపారు. -
మృగాడికి పదేళ్ల జైలు
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి కేసులో తీర్పు విశాఖ లీగల్ : మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేసి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమాన విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎ.వరప్రసాదరావు మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామ్మూర్తినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పెంటా లక్ష్మణ్ (30) విజయనగరం జిల్లా సీతానగరం మండలం పరిధిలోని రంగంపేట నివాసి. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో స్వధార్ షెల్టర్ హోంలో కాపాలాదారుడిగా పనిచేసేవాడు. ఈ గృహాన్ని విజయనగరం మహిళ శిశు సంక్షేమశాఖ నిర్వ హిస్తోంది. బాధితురాలు సావిత్రికి (28) మతిస్థితిమితం లోపించడంతో నగరంలోని ప్రభు త్వ మానసిక వైద్య కేంద్రంలో చికిత్స పొందా రు. 2009లో చికిత్స పూర్తయింది. ఆమెకు బంధువులు ఎవరూ లేకపోవడంతో అనాథగా గుర్తించిన అధికారులు విజయనగరం మహిళ శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇచ్చారు. ఆ శాఖ ఆదేశాల మేరకు 2009లో స్వధార్ షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. అక్కడ పనిచేస్తున్న లక్ష్మణ్ ఆమెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో గర్భం దాల్చింది. దీంతో సావిత్రిని అంతం చేయాలని లక్ష్మణ్ ప్రణాళిక రచించాడు. ఇదే అదునుగా వసతి గృహంలో అందుబాటులో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని అయోడిన్ తాగించే విధంగా ఆమెను ప్రేరేపించాడు. మతిస్థితిమితం లేకపోవడంతో అయోడిన్ తాగింది. అపస్మారక స్థితిలో ఉండడంతో వసతి గృహం సిబ్బంది కేజీహెచ్లో చేర్పించారు. చికిత్స పొందుతూ 2010 మార్చి 9న మృతిచెందింది. ఆమె మృతిపై పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భిణి కావడం, అయోడిన్ తాగడం వల్ల మృతిచెందినట్లు నిర్థారించారు. ఈ విషయంపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో నిందితుడు లక్ష్మణ్ కారణమని నిర్థారించారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి లైంగిక దాడికి పాల్పడినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు నేరాల్లో వెయ్యి రూపాయల వంతుల జరిమాన విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు జరగాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. -
కిడ్నీల్లో పొడవాలని ప్లాన్ చేశారు
సిడ్నీ: ఉగ్రవాద చర్యకు ప్లాన్ చేసిన ఇద్దరు యువకులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వేల్స్ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఒమర్ అల్ కుతోబి(25), మహమ్మద్ కియాద్(27)లు సిడ్నీలోని షియా ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడికి ప్లాన్ చేసి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. 2015 ఫిబ్రవరిలో ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన రోజే.. అప్రమత్తమైన పోలీసులు కుతోబి, కియాద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసాల్లో సోదాలు జరిపిన సందర్భంగా.. దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్న కత్తులు, ఇస్లామిక్ స్టేట్ జెండాతో పాటు వీడియోలు వెలుగు చూశాయని విచారణ అధికారులు వెల్లడించారు. ఈ వీడియోల్లో మనుషుల కిడ్నీలు, మెడపై దాడి చేసి చంపడానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నట్లు తెలిపారు. ఉగ్రకుట్రలో కుతోబి, కియాద్లు సమానంగా పాలుపంచుకున్నారని తీర్పు సందర్భంగా జస్టీస్ పీటర్ గార్లిండ్ పేర్కొన్నారు. -
కండక్టర్ చేతివేళ్లు కొరికినందుకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: టికెట్ కోసం జరిగిన గొడవలో కేఎస్ ఆర్టీసీ బస్సు కండక్టర్ చేతివేళ్లను కొరికిన ప్రయాణికుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మహాలింగాపుర తాలూకా కంగేరిమడ్డికి చెందిన నాగేష్ బసప్ప 2009లో తన కుమారుడితో కలిసి కోల్హాపురకు వెళ్లడానికి బాగల్కోటెలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అప్పట్లో కండక్టర్గా ఉన్న ముధోల్ డిపోకు చెందిన రాజీసాబ్ నబిసాబ.. నాగేష్ బసప్ప కుమారుడికి పది రూపాయల హాఫ్ టికెట్ తీసుకోవాలని సూచించాడు. చిన్న పిల్లవాడని, టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అతను వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో కోపోద్రిక్తుడై కండక్టర్ చూపుడు వేలును కొరికాడు. దీంతో కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు చార్జ్షీట్ సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా కండక్టర్ను గాయపరిచారని తేలడంతో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు నాగేష్ బసప్పకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. కాగా.. అప్పట్లో కేఎస్ ఆర్టీసీ కండక్టర్గా ఉన్న రాజీసాబ్ ప్రస్తుతం ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సంస్థలో పని చేస్తున్నారు. -
మహిళపై దాడి కేసులో ఇద్దరికి జైలు
చెన్నేకొత్తపల్లి: మహిళపై దాడి చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడింది. ఎస్ఐ మహమ్మద్రఫి తెలిపిన వివరాల మేరకు... న్యామద్దెలకు చెందిన లక్ష్మిదేవిని 2013లో గ్రామానికి చెందిన పూజారి నరసింహులు, పూజారి దాసప్పలు దాడి చేసి గాయపరిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం విచార ణ జరిగింది. నేరం రుజువు కావడంతో పూజారి నరసింహులుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా, పూజారి దాసప్పకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ స్పెషల్మెజిస్ట్రేట్పుల్లయ్య తీర్పునిచ్చారు. ఇద్దరినీ ధర్మవరం సబ్జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆదాయ పన్ను ఎగవేతదారులకు జైలు శిక్షలు
హైదరాబాద్: ఆదాయ పన్ను ఎగవేతలకు సంబంధించి వివిధ సంస్థల అధిపతులకు ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం ప్రత్యేక జడ్జి కఠిన కారాగార శిక్షలు, జరిమానాలు విధించారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయనందుకు, నోటీసుల ఉల్లంఘనకు గాను జెనరా అగ్రి కార్ప్ ఎండీ రాజేశ్ నాయుడు మునిరత్నం, డెరైక్టర్ కల్పనా రాజ్ మునిరత్నంలకు ఆర్నెల్ల దాకా కఠిన కారాగార శిక్ష, సంవత్సరానికి రూ. 1,000 చొప్పున ఆరు అసెస్మెంట్ ఇయర్స్కి పెనాల్టీ విధిం చారు. ఇక వసూలు చేసిన టీడీఎస్ను ఖజానాకు జమచేయనందుకు గాను సూపర్ బిల్డ్ ఇండియా ఎండీ మీర్ మజర్ అలీకి, నిర్దేశిత పన్ను చెల్లించనందుకు గాను శ్రీనివాస అండ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ పి. సుబ్బారావుకు రూ. 10,000 జరిమానా, ఆర్నెల్ల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ చెల్లించకపోవడం అభియోగాలపై విండ్సర్ మోటార్స్ ప్రొప్రైటర్ సయ్యద్ ఖలీల్కు రూ. 20,000 దాకా జరిమానా, ఆర్నెల్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. ఏపీ, తెలంగాణ ఆదాయ పన్ను విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా.. ఐటీ రిటర్నులకు సంబంధించి 26, పన్నుల ఎగవేతకు సంబంధించి 7 కేసులు దాఖలు చేసింది. -
చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలుశిక్ష
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... నాగోలు చెందిన కృష్ణాగౌడ్ బోడుప్పల్ ప్రాతానికి చెందిన అనితారెడ్డిలు పరిచయస్తులు. తన వ్వాపార అవసరాల నిమిత్తం 2014జూన్ 9న రూ.15 లక్షలను అప్పుగా కృష్ణాగౌడ్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ ఒప్పంద పత్రం రాయించి ఇచ్చింది. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని అనితారెడ్డిని కోరగా అందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకు ఉప్పల్కలాన్ బ్రాంచికి చెందిన రూ.15 లక్షల చెక్కును కృష్ణాగౌడ్ పేరిట జారీ చేసింది. సదరు చెక్కును ఎస్బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ అనితారెడ్డి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణాగౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
డ్రంకెన్ డ్రైవ్లో 19 మందికి జైలుశిక్ష
కాచిగూడ: డ్రంకన్ డ్రైవ్లో చేపట్టిన అకస్మిక తనిఖీల్లో 34మందిపై కేసులు నమోదు చేసి బుధవారం ఎర్రమంజిల్లోని 3వ ఎంఎం కోర్టులో హజరు పర్చినట్లు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. వీరిలో 19మందికి కోర్డు జైలు శిక్షతో పాటు రూ.2వేలు అపరాధ రుసుంను విధించిందని ఆయన తెలిపారు. 9మందికి రూ.2వేలు, 6మందికి రూ.2వేలుతో పాటు ఒక రోజు సోషల్ సర్వీస్ సేవ చేయాలని కోర్టు శిక్షలు విధించిందని తెలిపారు. -
డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ పోలీసుల చర్యలు
► వారం రోజుల్లో 358 మందిపై కేసులు, ► తొమ్మిది మందికి జైలు సాక్షి, సిటీబ్యూరో: తాగి వాహనం నడుపుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ల్లో 358 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 3,49,500ల జరిమానా వసూలు చేయగా, అతిగా మద్యం తాగి డ్రైవింగ్ చేసిన తొమ్మిది మందికి జైలు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 12,892 మందిపై కేసులు నమోదు కాగా, 537 మందికి జైలు శిక్ష పడింది. మరోవైపు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పెట్రోలింగ్ పోలీసులు కొరడా జుళిపించారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 638 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, రూ. 4,68,700 జరిమానా వసూలు చేశారు. -
బాలకార్మికులను పెట్టుకుంటే రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ : ఎలాంటి వృత్తిలోనైనా 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలను పనిలో పెట్టుకుంటే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘బాల కార్మికుల(నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించగా, మంగళవారం లోక్సభ ఆమోదించింది. గతంలో ఆరు నెలలున్న జైలు శిక్షను రెండేళ్లకు పెంచారు. రూ.10 వేలు-20 వేలుగా జరిమానాను రూ.20 వేలు- 50 వేలకు పెంచారు. -
కొలంబియా మోడల్ కు 15 ఏళ్ళ జైలు!
బీజింగ్ః మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా కేసులో ఓ మోడల్ కు 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోందన్న ఆరోపణలతో గతేడాది కాలంగా ఆమెపై విచారణ జరుగుతోండగా.. చివరికి ఆమె దోషిగా తేలడంతో శిక్షను విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది. చైనా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన 22 ఏళ్ళ కొలంబియన్ మోడల్ కు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జులియానా లోపేజ్ గతంలో స్వంతగా ఓ బొటిక్ ను నడిపించేది. అంతేకాక ఓ టీవీ షోలో కూడా ఆమె ఓ సొంత కార్యక్రమాన్ని చేసేది. అలాగే ప్రొ ఫుట్ బాలర్ గా కూడా ఆమె అందరికీ తెలుసు. అయితే తన ల్యాప్ తో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తోందన్న అనుమానంతో గతేడాది ఆమెను చైనా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన బొటిక్ కోసం వస్తువులు కొనేందుకు కుటుంబ సభ్యులతో కలసి గాంగ్జూ వెళ్ళిన జూలియానా... అక్కడ వారినుంచీ తప్పిపోవడంతో అంతా ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో జూలియానాను చైనా పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారుకూడా. నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పెద్ద మొత్తంలో ఆమెవద్ద గుర్తించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అప్పట్నుంచీ విచారణ ఎదుర్కొంటున్న జూలియానా దోషిగా తేలడంతో 15 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఆమె జైలు శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను చైనా నుంచి బహిష్కరించాలని కూడా గంగ్వ్సూ పీపుల్స్ ఇంటర్మీడియల్ కోర్టు ఆదేశించింది. గతేడాది జూలై 18న గాంగ్జూ వెళ్ళిన జూలియానా.. బైయున్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో 610 గ్రాముల కొకైన్ ను లాప్ టాప్ లో కనిపించకుండా దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబియాలో మిస్ యాంటియోక్వియా బ్యూటీ కాంటెస్ట్ లో విన్నర్ అయిన జూలియానా అనంతరం మిస్ వరల్డ్ కొలంబియాలోనూ గెలిచి, మిస్ వరల్డ్ చైనాగా నిలవాలనుకుంది. అదే సమయంలో ఆమె చైనాలో తప్పిపోయిందని, మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులో విచారణ ఎదుర్కొంటోందని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. తనకు ఓ వ్యక్తి స్మగ్లింగ్ లో హెల్స్ చేస్తే 2,500 డాలర్లు ఇస్తానన్నాడని, లేదంటే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడని అందుకే తాను స్మగ్లింగ్ కు పాల్పడినట్లు కోర్టు ముందు ఒప్పుకుంది. అయితే జూలియానా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను తనతో తీసుకువెళ్ళడాన్ని కోర్టు తప్పుబట్టింది. భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు శిక్ష విధించింది. -
మాజీ ప్రధాని కుమారుడికి జైలు శిక్ష!
ఢాకాః బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడికి జైలు శిక్ష పడింది. మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన తరిక్ రెహెమాన్ కు ఏడు సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. నగదు బదిలీ విషయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నేషనల్ పార్టీ అధినేత్రి ఖలేదా జియా కుమారుడు.. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్.. తరిక్ రెహెమాన్ కు హైకోర్డు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 20.14 కోట్ల టాకాల మనీ లాండరింగ్ కేసు విషయంలో ట్రయల్ కోర్టు విచారణను తోచిపుచ్చిన హైకోర్టు.. విచారణ చేపట్టి రెహమాన్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 200 మిలియన్ల టాకాల జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పడమటూరు గ్రామానికి చెందిన ఒక యువకుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బోయ రాములు కుమార్తె సన్నిహితంగా ఉంటోంది. ఇది నచ్చని రాములు మనోహర్ను చంపేందుకు పథకం పన్నాడు. ఈ మేరకు 2013లో మార్చి 2వ తేదీన అతడిని పొలం వద్దకు పిలిపించాడు. రాములుతోపాటు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, విజయ్ కలిసి మనోహర్ను విపరీతంగా కొట్టి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని నేరం రుజువు కావటంతో నిందితులు ముగ్గురికీ యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు. -
అలా అరిచినందుకే.. శిక్షపడింది..!
లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది. షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్ 777 విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ 'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి అరుస్తూనే ఉండటంతో కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు 10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు. -
రూ. 12 వేల కోట్లతో60 వేల టెలికం టవర్లు
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్కు మరిన్ని అధికారాలు అప్పగించడంతోనే కాల్ డ్రాప్ సమస్యకు అంతిమ పరిష్కారం లభించదని టెలికం కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. టెల్కోలపై రూ.10 కోట్ల వరకు జరిమానా, వాటి ఎగ్జిక్యూటివ్లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధింపు వంటి తదితర అంశాలకు సంబంధించి అధికారాలను అప్పగించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దీపక్ దీనిపై స్పందిస్తూ.. అధికారాల అప్పగింతే సమస్యకు అంతిమ పరిష్కారం కాదని చెప్పారు. మొబైల్ ఆపరేటర్స్ 60,000 టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఒక్కో టవర్కు రూ.20 లక్షల చొప్పున మొత్తం టవర్ల ఏర్పాటుకు రూ.12,000 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. -
'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం'
బీజింగ్: చైనాలో ఓ వార్తా పత్రికకు సంబంధించిన ఐదుగురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడి కోర్టు పన్నేండేళ్లపాటు శిక్షను విధిస్తూ వారిని కటకటాల్లోకి పంపించింది. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసే ప్రయత్నాలు చేసినందుకు వారికి ఈ శిక్ష వేశారు. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ లోని మోడరలన్ కంజ్యూమర్ న్యూస్ చానెల్ లో జాంగ్ హునిరి అనే ఉపాధ్యక్షుడు, మరో నలుగురు సహ ఉద్యోగులు ఉన్నారు. వారు ఓ పన్నెండు మంది ప్రభుత్వ ఉద్యోగులను దాదాపు లక్షా పాతికవేల డాలర్లు ఇవ్వాలని లేదంటే వారికి సంబంధించి వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఆరోపణల కిందట అరెస్టు చేసిన పోలీసులు వారని కోర్టులో ప్రవేశ పెట్టగా పన్నేండేళ్ల జైలు శిక్ష పడింది. -
పబ్ యజమానులకు జైలు శిక్ష
అర్థరాత్రి దాటినా పబ్ నడిపినందుకు జూబ్లీ హిల్స్ ఎయిర్ పబ్ యజమానులకు కోర్టు జైలు శిక్ష విధించింది. పబ్ నిర్వాహకులు అనిరుధ్ అగర్వాల్, మయాంక్ అగర్వాల్ లకు కోర్టు 6 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. గతంలో 3 సార్లు కేసులు నమోదు చేసినా తీరు మార్చుకోక పోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
జైలుకెళ్లొచ్చినా మళ్లీ అదే బాట
హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ.. కార్లనూ దొంగిలిస్తున్న ఓ పాత నేరస్థుడిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన గాలంకి రాంబాబు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కారు డ్రైవర్గా పనిచేస్తూ రాయిగర్ హరిజనబస్తీలో నివాసం ఉంటున్నారు. విలాసాలకు అలవాటు పడిన రాంబాబుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. తిరిగి పాత జీవితాన్నే ప్రారంభించాడు. బంజారాహిల్స్, కూకట్పల్లి, హయత్నగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలతో పాటు ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లను దొంగతనం చేశారు. 5 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని శనివారం వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, జూబ్లీహిల్స్ అదనపు ఇన్స్పెక్టర్ ముత్తులు అదుపులోకి తీసుకుని అతని వద్ద 7.2తులాల బంగారు ఆబరణాలను రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన ద్విచక్రవాహనాలే... అమీర్పేట: బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్తుడితోపాటు దొంగిలించిన వాహనాలకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానంపేటకు చెందిన దుప్పటి కృష్ణ బల్కంపేట బీకేగూడ శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నాడు. పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. ఆ వాహనాలను నీలోఫర్ ఆస్పత్రిలో అంటెండర్గా పనిచేస్తున్న సనత్నగర్ నివాసి పశుల రాజేష్ తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. గతంలో ఎస్ఆర్నగర్ స్టేషన్ పరిధిలో ఓ వాహనం దొంగిలించి పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లి వచ్చి తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాజాగా బీకేగూడలోని విజేత బాయ్స్ హాస్టల్లో ల్యాప్టాప్ను దొంగిలించగా అది సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పాత నేరస్తుడు కృష్ణగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం కృష్ణను, ద్విచక్రవాహనాలు విక్రయించిన రాజేష్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్, డీఐ సతీష్, ఎస్సై సునీల్రెడ్డి, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
‘పొంజీ’ ఆపరేటర్లపై ఇక ఉక్కుపాదం!
♦ పదేళ్ల వరకూ జైలు శిక్ష... ♦ రూ. 50 కోట్ల జరిమానా కూడా... ♦ కొత్త బిల్లులో ప్రతిపాదించిన కేంద్రం న్యూఢిల్లీ: పొంజీ స్కీమ్ ఆపరేటర్లపై కొరడా ఝలిపించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం-డిపాజిటర్ల మనోభావాల పరిరక్షణ’ ముసాయిదా బిల్లు ప్రకారం.. అక్రమ సొమ్ము డిపాజిట్ పథకాలను నడిపిస్తున్న (పొంజీ ఆపరేటర్లు) వారు రూ.50 కోట్లు జరిమానా చెల్లించడం సహా పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అన్ని అనియంత్రిత డిపాజిట్ పథకాలన్నీ కూడా డ్రాఫ్ట్ బిల్లు పరిధిలోకి వస్తాయి. నిందితుడు ఒక ఏడాది తక్కువ కాకుండా జైలు శిక్ష (ఇది ఐదేళ్ల వరకు పొడిగించొచ్చు)తోపాటు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక వ్యక్తి పదే పదే అక్రమాలకు పాల్పడితే అతను కనీసం ఐదేళ్లు (పదేళ్లకు పొడిగించొచ్చు) జైలు శిక్ష అనుభవించడంతోపాటు రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ బిల్లుపై ఏప్రిల్ 30 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించనున్నది. -
లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డుసెక్కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు. -
కటకటాల వెనక్కి జైలు అధికారి
పాట్నా: బిహార్ జైలు అధికారి ప్రవర్తనా తీరు... కంచె చేను మేసిన చందంగా తయారైంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కీచకుడుగా మారిన ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఓ వీడియో సదరు అధికారిని కటకటాల వెనక్కు పంపింది. బిహార్ జైలు సూపరింటిండెంట్ కృపా శంకర్ పాండే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. కిషన్ గంజ్ ఐజీ ఆనంద్ కిషోర్ ఉత్తర్వుల మేరకు బిహార్ కిషన్ గంజ్ జైల్ సూరరింటిండెంట్ కృపా శంకర్ పాండేను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా విధుల్లో ఉన్న సమయంలో జైలు ప్రాంగణంలోనే ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృష్టికి వెళ్లడంతో... పాండేను విధులనుంచి సస్సెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఓ వీడియో ఆధారంగా జైల్ సూపరింటిండెంట్ పాండే.. బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా నిర్థారణ అయింది. కాగా గతంలో కూడా పాండేపై అనేక అభియోగాలు ఉన్నాయి. జైల్లో ఉన్న మహిళలు తనతో సెక్స్ కు సహకరించాలని బలవంతం చేసినట్లుగా గతేడాది అతడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళలపట్ల పాండే అసభ్యంగా ప్రవర్తిస్తాడని, కించపరిచేలా వ్యవహరిస్తాడని, అతడ్ని నిరాకరిస్తే వారిని కొట్టేందుకు కూడా వెనుకాడడని పలువురు ఖైదీలు సైతం ఆరోపించారు. -
వసూలు కాని పన్ను మొత్తం రూ.7 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వసూలు కాని పన్ను మొత్తాలు 2015 మార్చి నాటికి రూ. 7 లక్షల కోట్లకు పెరిగాయి. 2014 ఇదే నెల నాటికి ఈ మొత్తం రూ.5.75 లక్షల కోట్లు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. పన్ను బకాయిదారుల స్థిర, చర ఆస్తుల జప్తు, అమ్మకం, సంబంధింత ఆస్తుల నిర్వహణకు రిసీవర్ నియామకం, జైలుశిక్ష వంటి ఎన్నో మార్గాల ద్వారా చట్ట ప్రకారం వసూళ్లకు అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిమాణం పెరుగుతున్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. స్వాధీనానికి తగిన ఆస్తులు లేకపోవడం, బకాయిదారుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోవడం, పలు కేసులు న్యాయ, అధికార పరిధుల్లో పెండింగులో ఉండడం వంటి అంశాలు పన్ను డిమాండ్లు నెరవేరకపోవడానికి కారణాలని తెలిపింది. 2013-14తో పోల్చితే 2014-15లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం మేర (రూ.57,196 కోట్లు) పెరిగినట్లు పేర్కొంది. అయితే స్థూలంగా పన్ను వసూళ్లలో వీటి వాటా మాత్రం 56.1 శాతం నుంచి 55.9 శాతానికి తగ్గినట్లు వివరించింది. -
ఐఫోన్ కోసం నెలల పాపను..
ఖరీదైన సెల్ఫోన్, బైక్ కోసం రోజుల పసికందును అమ్ముకున్నాడో ప్రబుద్ధుడు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ రాష్ట్రానికి చెందిన డ్యూన్ (19) తన 18 రోజులు ఆడబిడ్డను సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టాడు. సుమారు రూ. 2.34 లక్షలకు అమ్మేశాడు. ఈ విషయం అధికారుల చెవిన పడటంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. డ్యూన్ స్థానిక ఇంటర్నెట్ సెంటర్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య అనుకోకుండా గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చింది. పాపను అమ్మి ఐ ఫోన్, బైక్ కొనుక్కోవాలని ప్లాన్ వేశాడు. అతడి బేరంతో.. పాపను కొనుక్కొన్న వ్యక్తి డబ్బులు చెల్లించాక ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కానీ వ్యవహారం ఎలాగో పోలీసులకు చేరింది. విచారణ జరిపిన పోలీసులు యువ దంపతులిద్దర్నీ జైలుకు పంపించారు. కోర్టులో ప్రవేశపెట్టగా తల్లికి రెండున్నర సంవత్సరాలు, తండ్రి డ్యూన్కి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా విషయం తెలుసుకున్న తర్వాత పాపను కొనుక్కున్న వ్యక్తి పోలీసులు ముందు హాజరయ్యి, బిడ్డను వారికి స్వాధీనం చేశాడు. అయితే బిడ్డను అమ్మడం నేరమని తనకు తెలియదని తల్లి జియావో మెయి (18) పోలీసులకు చెప్పింది. ఆర్థికపరిస్థితి బాగోలేని కారణంగా ఇలా చేసినట్టు తెలిపింది. తాను కూడా పెంపకానికి వెళ్లానని, తన చుట్టుపక్కల బిడ్డలను వేరేచోటికి పంపిన వాళ్లను చాలా మందిని చూశానని చెప్పింది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు రెండు రోజుల జైలు
మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడింది. నాచారానికి చెందిన హనుమంత్కు మల్కాజ్గిరి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు 3గంటల ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. దీనిలో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను ముగించుకున్న అనంతరం ఈసీఐఎల్ చౌరస్తాలో హనుమంత్ గురువారం విధులు నిర్వహించాడు. -
ఇంటి పని చేయని మహిళకు జైలు శిక్ష!
ఇంటి పని సరిగా చేయడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీకి చెందిన మహిళ దోషిగా తేలితే గరిష్టంగా ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లాజియో రీజియన్లోని సోన్నినో ప్రాంతానికి చెందిన ఓ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో 40 ఏళ్ల సదరు మహిళపై కోర్టులో విచారించనున్నారు. ఇంటిపనులు కూడా ఆమె సరిగా చేయకపోవడంతో కుటంబ కష్టాలు తీవ్రమయ్యాయని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడంతో పరిశుభ్రతలేని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ఆఖరికి ఆహారాన్ని కూడా ఎప్పుడో ఒకసారి వండుతుందన్నాడు. గత రెండేళ్లుగా ఇలానే కొనసాగుతుందని తెలిపాడు. వచ్చే అక్టోబర్లో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆమె దోషిగా తేలితే 2 నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, 2014, మార్చిలో గృహహింస నియంత్రించడానికి ఇంట్లో పని చేస్తున్న మహిళలకు కూడా జీతాలు ఇవ్వాలని ఇటలీలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఆ ప్రతిపాదనకు అన్ని వర్గాలనుంచి మద్దతు కరువైంది. ఇంట్లోనే మహిళలకు జీతాలిస్తే ఉద్యోగాల కోసం వేచిచూసే ధోరణి తగ్గుతుందని టరిన్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ప్రొఫెసర్ డానియల్ డెల్ బోకా తెలిపారు. -
ఇంగ్లాండ్ లో 'ఇండియన్' దొంగలు
వర్కింగ్ టైమ్: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ప్లేస్: అత్యంత రద్దీగా ఉండే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లు టార్గెట్: బిజీబిజీగా తమపని తాము చూసుకునేవాళ్లు సంపాదన: రోజుకు 10 వేల పౌండ్లు ఇప్పటివరకు పోగేసింది: 5 మిలియన్ పౌండ్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 50 కోట్లు) ఇలా ఒక్కో పాయింట్ చెప్పుకుంటూపోతే ఇంగ్లాండ్ లో ఓ భారతీయ సంతతి బృందం సాధించిన 'ఘనత' ఆ దేశ చరిత్రలో నిలిచేస్థాయికి చేరింది. ఇంతకీ ఈ గ్యాంగ్ చేసిన గొప్పపనేమంటారా? పిక్ పాకెటింగ్. మన భాషలో జేబులు కొట్టేయటం. లండన్ లోని అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లలోని ప్రయాణికులే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డ 11 మంది భారత సంతతి వ్యక్తులు ఒక్కొక్కరికి 30 ఏళ్ల జైలు శిక్ష ఖరారుచేస్తూ లండన్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పక్కా ఆధారాలతో ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు రెండేళ్లు కష్టపడాల్సి వచ్చిందని, సీసీటీవీ కెమెరాలు, బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు.. అన్నింటిని క్రోడీకరించిన మీదట దొంగలను గుర్తించగలిగామని, ఆ 11 మంది ఇళ్లపై ఒకేసారి జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, భారీగా నగదు లభ్యమయిందని బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్ (బీటీపీ) అధికారులు తెలిపారు. అయితే వీళ్లు చిన్న చేపలు మాత్రమేనని, ఈ గ్యాంగ్ వెనుక భారీ తిమింగలాలు కూడా ఉన్నాయని, త్వరలోనే వాళ్లను కూడా ఆధారాలతో సహా పట్టుకుంటామని బీపీటీ చీఫ్ ఇన్స్ పెక్టర్ జాన్ జస్టిస్ చెప్పారు. రెండు దఫాలుగా సాగిన విచారణ మంగళవారం ముగియడంతో 11 మందికి శిక్షల ఖరారయ్యాయి. కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన భారత సంతతి వ్యక్తుల్లో నవీద్ మొష్ఫిక్(గ్యాంగ్ లీడర్), ఓలిచా మొష్ఫిక్, పరమ్ జిత్ సింగ్ కల్రా, హర్మీత్ భాటియా, ప్రీత్ బాల్ భాటియా, నిర్మోహన్ భాటియా, రంజిత్ బంగార్, ముబారఖ్ ఖురేషి, అహ్మద్ రాజా, అరిజి సింగ్, నిర్మోహన్ సింగ్ లు ఉన్నారు. -
టీచర్ ను మోసగించిన విద్యార్థినికి జైలు!
స్వలాభం కోసం ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలినే టార్గెట్ చేసింది. అనారోగ్యం, బాధలు, కష్టాలు వంటి అనేక అసత్యాలతో నమ్మించి మోసంచేసింది. కార్న్ వాల్ కు చెందిన 22 ఏళ్ళ ఎలిసా బియాంకో.. తన ఉపాధ్యాయురాలు... 49 ఏళ్ళ సాలీ రెట్టాలక్ దయాగుణాన్నిగ్రహించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నకిలీ ప్రేమను చూపించి, విషాదగాధను వినిపించి మైండ్ గేమ్ ఆడుకుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించి వారి జీవితాలను నాశనం చేసి, చివరికి జైలుపాలయ్యింది. ఎవరో తన వెంట పడుతున్నారని, తల్లిదండ్రులు సరిగా చూడటం లేదని, క్యాన్సర్ వల్ల కేవలం మూడు నెలలే బతుకుతానని ఎన్నో అబద్ధాలు చెప్పి, రెట్టాలక్ చూపించిన జాలినే ఆయుధంగా చేసుకొని, ఏకంగా ఆమె ఇంటికే మకాం మార్చేసింది. క్యాన్సర్ చికిత్స పేరున ప్రతిరోజూ ఆస్పత్రికి దింపుతున్న రెట్టాలక్ కళ్ళుగప్పి ఓ కేఫ్ లో కూర్చొని నకిలీ బ్యాండేజ్ లు వేసుకుంటూ కాలం గడిపింది. బియాంకో వేసిన నాటకాలకు రెట్టాలక్ పడిపోయింది. అంతేకాదు ఆమె ఖర్చులకు కష్టం అవుతుందని పని కూడ ఇప్పించింది. అయితే అన్నం పెట్టిన చేతినే నరికిన చందాన.. మరో అడుగు ముందుకేసిన బియాంకో... ఓ కన్సల్టెంట్ ఫిజీషియన్ జాన్ పేరున తప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తో మెయిల్స్ ఇస్తూ.. గొంతు మార్చి ఫోన్లు చేస్తూ వారిద్దరూ దగ్గరయ్యేలా చేసింది. రకరకాల నాటకాలాడుతూ బియాంకో.. రెట్టాలక్ కాపురంలో నిప్పులు పోసింది. వారి కుటుంబం విచ్ఛిన్నం అయ్యేలా చేసింది. డాక్టర్ క్యారెక్టర్ ద్వారా తన క్యాన్సర్ ముదిరినట్లు చెప్పింది. తనపై జాలి మరింత పెరిగేలా చేసుకొంది. 2013 లో తనకు రోగం ముదిరిపోయిందని, ఇదే తన ఆఖరి పుట్టిన రోజని చెప్పి... పార్టీకోసం రెట్టాలక్ దగ్గర డబ్బు కూడ గుంజింది. దీంతో బియాంకో బాధను చూడలేని రెట్టాలక్ డాక్టర్ (లవర్ జాన్) ను కలసి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడదామని ప్రయాణమైంది. తీరా డాక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించడంతో కారు ప్రయాణంలో ఆ క్యారెక్టరే లేదని నిజం చెప్పిన బియాంకో... ఏకంగా రెట్టాలక్ ను కారునుంచి బయటకు గెంటి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో అసలు బండారం బయట పడింది. రెట్టాలక్ కోర్టుకు జరిగిన కథ వివరించడంతో బియాంకోకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష వేశారు. ఎలీసా బియాంకో అవసరానికో అబద్ధం చెబుతూ సాలీ రెట్టాలక్ జీవితాన్నే నాశనం చేసింది. 16 ఏళ్ళ వయసులో కార్న్ వాల్ లోని సెయింట్ ఆస్టెల్ కాలేజ్ లో ఆరోగ్య, సామాజిక సంరక్షణ కోర్సులో చేరిన బియాంకో.. 2009 లో ట్యూటర్ గా వచ్చిన సాలీ రెట్టాలక్ తో పరిచయం పెంచుకుంది. నిజానికి ఇటువంటి వింత, భయంకరమైన కేసులను ఎప్పుడూ తమ జీవితంలో చూడలేదని క్లిస్టఫర్ హార్వే క్లార్క్ సహా పలువురు న్యాయమూర్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. -
కుక్కను అవమానించినందుకు 37 ఏళ్ళ జైలు
విశ్వాసానికి మారుపేరుగా శునకాలను చెప్తాం. అంతటి ప్రేమను చూపించే పెంపుడు జంతువులను యజమానులూ ప్రాణప్రదంగా సాకడం కళ్ళారా చూస్తున్నాం. కానీ అదే శునకాన్ని అవమానించిన కారణంగా ఏళ్ళ తరబడి జైలు శిక్షపడటం ఎక్కడైనా చూశారా? ఇప్పుడు థాయిలాండ్ లో అదే జరిగింది. రాజుగారిని దేవుడి అవతారంగా, అత్యంత గౌరవంగా చూసే ఓ సాధారణ వ్యక్తి... ఆయనగారి శునకాన్ని అవమానించాడట.. ఇంకేముందీ అతగాడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. థాయ్ చట్టప్రకారం జరిగిన విషయం... సామాజిక మాధ్యమాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... అన్నికష్టాలు కూడా ఉన్నాయనడానికి థాయ్ సంఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. అందుబాటులో ఉందికాదాని సోషల్ మీడియాను ఎడా పెడా వాడేస్తే.. ఏమౌతుందో ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. ఓ సాధారణ వ్యక్తి సోషల్ మీడియాలో రాజుగారి కుక్కపై చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అతడి తలకు చుట్టుకున్నాయ్. థాయిలాండ్ చట్టాల ప్రకారం సైనిక న్యాయస్థానాలు అతడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్షను విధించాయి. సుమారు 2002 సంవత్సరంలో కింగ్ భూమిబోలో అతడి పెంపుడు శునకం టాంగ్ డేంగ్ పై ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తితో ఆ తర్వాత 'ఖూన్ టాంగ్ డేంగ్' పేరిట ఓ యానిమేటెడ్ చిత్రం కూడా రూపొందింది. టాంగ్ డేంగ్ అన్న పేరున్న ఆ సైనిక శునకాన్ని నిజంగా ఆ వ్యక్తి ఏమని దూషించాడో కచ్చితంగా చెప్పలేదు కానీ.. రాచరిక పాలనలో ఉన్నకఠిన చట్టాలను ఉల్లంఘించినందుకే అతడికి శిక్ష విధించి, గతవారం అరెస్టు చేసినట్లు మాత్రం తెలుస్తోంది. -
ప్రేమ పేరుతో మోసగించిన ఒకరికి ఆర్నెళ్ల జైలు
నర్సంపేట : నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు కొత్తగూడ ఎస్సై అరాఫత్ బుధవారం తెలిపారు. కొత్తగూడ వుండలం గాంధీనగర్కు చెందిన వుల్లెల కళావతిని నెల్లికుదురుకు చెందిన ఎర్రబోరుున మురళి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో సదరు మహిళ అప్పటి ఎస్సై సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయుగా 2012లో 417, 406, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అప్పటి ఎస్సై నర్సంపేట కోర్టులో చార్జిషీటు వేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టు కానిస్టేబుల్ స్వామినాయుక్ సకాలంలో ప్రవేశపెట్టగా పిటిషనర్ తరఫున ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న జడ్జి శ్రీదేవి వుురళీకి ఆరు నెలల జైలు శిక్ష లేదా 5 వేల జరివూనా విధించినట్లు తెలిపారు. -
భార్యను హత్య చేసి జీవిత ఖైదు
వెల్లింగ్టన్: భార్యను హత్య చేసిన ఓ భారతీయ సంతతికి వ్యక్తి జీవితాంతం కటకటాలపాలయ్యాడు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ హై కోర్టు ఈ జీవిత కారాగార శిక్షను విధించింది. గత ఏడాది మందీప్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి ఆక్లాండ్లోని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ స్కూల్ వద్ద మే 22న తన భార్య పర్మితా రాణి(22)ని హత్య చేయడంతోపాటు పర్మిందర్ సందు అనే మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుపై గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టిన కోర్టు చివరకు జీవిత ఖైదు విధించింది. సందుతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అతడు తన భార్యను హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్య చేస్తున్న సమయంలో సందు అడ్డు పడగా అతడిని కూడా కత్తితో పొడవడంతో ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. -
బాబ్ హెవిట్కు ఆరేళ్ల జైలు
- రేప్ కేసులో కోర్టు తీర్పు ప్రిటోరియా: కెరీర్లో 15 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన టెన్నిస్ దిగ్గజం బాబ్ హెవిట్ (75)కు రేప్ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష పడింది. 1980-1990 మధ్య కాలంలో తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు మైనర్ అమ్మాయిలపై హెవిట్ అత్యాచారం జరిపినట్లు వచ్చిన ఆరోపణను నిర్ధారిస్తూ దక్షిణాఫ్రికా కోర్టు సోమవారం ఈ తీర్పు చెప్పింది. ఆస్ట్రేలియాకు చెందిన హెవిట్, ఆరంభంలో స్వదేశం తరఫున ఆడినా... 1967లో దక్షిణాఫ్రికా వలస వెళ్లారు. మొత్తం 9 గ్రాండ్స్లామ్ డబుల్స్, 6 గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెవిట్, దక్షిణాఫ్రికా ఏకైక డేవిస్ కప్ (1974) విజయంలో కూడా సభ్యుడు. 1992లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆయనకు చోటు దక్కింది. అయితే రేప్ ఆరోపణల అనంతరం 2012లో ఆయన పేరును తప్పించారు. వృద్ధాప్యంలో తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షనుంచి తప్పించాలని హెవిట్తోపాటు ఆయన భార్య చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని కల్పించింది. -
బర్గర్లో బేకన్ లేదంటూ మహిళ కాల్పులు
వాషింగ్టన్: బర్గర్లో స్టఫింగ్ సరిగా లేదంటూ కాల్పులు జరిపిన ఓ మహిళ చివరకు కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే మిచిగన్కి చెందిన శనేకా మోనిక్యూ టొర్రెస్ 2014 ఫిబ్రవరి10 రాత్రి తన స్నేహితురాలితో కలసి మెక్డొనాల్డ్స్ కి వెళ్లింది. మీల్తో పాటూ బేకన్ చీస్ బర్గర్ ఆర్డర్ చేసింది. మీల్ వచ్చినా బెకన్ సర్వ్ చేయలేక పోవడంతో మేనేజర్ ..శనేకాకు క్షమాపణ చెప్పి మీల్ని ఉచితంగా ఇస్తానని చెప్పాడు. అదే రోజు కొన్ని గంటల తర్వాత శనేకా తిరిగి మెక్డొనాల్డ్స్కి వచ్చింది. అయితే ఆమె బర్గర్ ఆర్డర్ చేసినా అప్పుడు కూడా బేకన్ లేకుండానే మీల్ ఇవ్వడంతో ఆగ్రహం పట్టలేని శనేకా మోనిక్యూ టొర్రెస్ తన వెంట తెచ్చుకున్న గన్తో ఎడాపెడా కాల్చేసింది. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు. దాంతో అమ్మడిపై మెక్డొనాల్డ్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా... కాల్పులు అనుకోకుండా జరిగిన సంఘటనగా పరిగణించాలని శనేకా మోనిక్యూ తరపు న్యాయవాది కోరినా లాభం లేకుండా పోయింది. శనేకా మోనిక్యూకు న్యాయస్థానం మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష విధించిది. -
లైంగిక రుగ్మతతో జైలుపాలైన భారతీయ బ్యాంకర్
చిన్నవయసులోనే ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ భారతీయ బ్యాంకు అధికారి.. ఓ అవలక్షణం కారణంగా దేశంకాని దేశంలో జైలపాలయ్యాడు. అతని పేరు.. మహా విగ్నేశ్ వెలిప్పన్. వయసు..32 ఏళ్లు. గతంలో నిర్వహించిన పదవి.. సింగపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్. సహోద్యోగులు, పక్కింటి వాళ్లు.. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడటం.. వారి శరీర భాగాల్ని రహస్యంగా ఫొటోలు తీయడం విగ్నేశ్ అలవాటు! అతగాడి స్మార్ట్ ఫోన్లో అలాంటివి 596 వీడియోలున్నాయి! 2011లో విగ్నేశ్ బాధితురాలైన ఓ సహోద్యోగిని ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టు రట్టైంది. మొత్తం 75 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదయింది. మూడేళ్లపాటు విచారణ జరిపిన సింగపూర్ కోర్టు మంగళవారం అతనికి ఎనిమిదివారాల కఠిన కారాగార శిక్షను ఖరారుచేసింది. కాగా తన కక్షిదారుడు వాయొరిజం (విపరీత మానసిక లైంగిక రుగ్మత)తో బాధపడుతున్నాడని, ఆ వ్యాధి లక్షణాలవల్లే అతడలా రహస్య ఫొటోలు తీశాడని, పైగా అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్తో గొడవపడి ఒంటరిగా ఉడేవాడని విగ్నేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. దీంతో విగ్నేశ్కు భారీ శిక్ష తప్పినట్లయింది. -
బంగ్లాదేశీయులకు 5 నెలల జైలు శిక్ష
తిరుపతి: 19 మంది బంగ్లాదేశీయులకు తిరుపతి అయిదవ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం అయిదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న వెంటనే వారిని భారత్లోని బంగ్లాదేశ్ రాయబారికి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సరైన పత్రాలు, వీసాలు లేకుండా ఉన్న 19 మంది బంగ్లాదేశీయులను గతంలో చిత్తూరు జిల్లా రేణుగుంటలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా... రిమాండ్ విధించింది. కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించింది. -
మహిళను మభ్యపెట్టి.. లైంగిక దాడి
నేరస్తుడిగా ధ్రువీకరించిన కోర్టు వచ్చేవారం జైలు శిక్ష ఖరారు న్యూఢిల్లీ : ఓ మహిళను పెళ్లి చేసుకొంటానని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన వివాహితుడిని కోర్టు నేరస్తుడిగా పరిగణిస్తూ, జైలు శిక్షను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు చంద్రహాస్ యాదవ్ను నేరస్తుడిగా ప్రకటిస్తూ బుధవారం అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ తీర్పు చెప్పారు. ‘యాదవ్.. బ్రహ్మచారినని పరిచయం చేసుకొని మహిళ పట్ల లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విజయవంతమైందని’ జడ్జి అన్నారు. ఇదే సమయంలో ‘ బ్రహ్మచారినని.. పెళ్లి చేసుకొంటానని నిందితుడు మభ్యపెట్టాడు. ఈ కారణంగానే బాధితులు నిందితుడితో శారీరక సంబంధాలకు అంగీకరించినట్లు పరిశీలనలో వెల్లడైంది. అంతేకాదు.. నిందితుడి పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి, మోసగించాలనే దురుద్దేశంతోనే బాధితురాలిని నమ్మించినట్లు కోర్టు విశ్వసించదని’ పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి ఐదు సంవత్సారాలుగా నిందితుడు యాదవ్తో పరిచయం ఉన్నది. ఈ క్రమంలోనే బ్రహ్మచారినని చెప్పి.. మొదటి సారిగా.. ఫిబ్రవరి 14వ తేదీ 2008లో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు... నవంబర్, 2013లో పెళ్లి అయిన నిజాన్ని వెల్లడించి, ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయాన్ని బాధితురాలు పశ్చిమ ఢిల్లీలోని దాబ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 29వ తేదీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు నిందితుడు నేరం చేసినట్లుగా ప్రకటి స్తూ వచ్చే వారం జైలు శిక్ష వివరాలను వెల్లడించనున్నట్లు ప్రకటించింది. -
ఆర్టీవీ బస్సు డ్రైవర్కు జైలు
న్యూఢిల్లీ: అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన మహ్మద్ షఫీక్కు అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శరద్ గుప్తా ఈ మేరకు జైలు శిక్షను ఖరారు చేశారు. అదే విధంగా బాధితుడు అర్జున్కు నష్టపరిహారం అందజేయాలని సూచించింది. ఈ పరిహారాన్ని నిందితుడు అందజేసే స్థితిలో లేకుంటే ఢిల్లీ న్యాయ సేవా సంస్థ చెల్లించాలని సూచించింది. పోలీసులు తెలిపిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్ 2, 2002న షఫీక్ అనే డ్రైవర్ ఆర్టీవీ బస్సును అతివేగంగా నడుపుతూ యమున పుస్త రోడ్డును క్రాస్ చేస్తున్న అర్జున్ ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు మృతి చెందాడు. ఈ మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి షఫీని అరెస్టు చేశారు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలపై స్థానిక కోర్టు తన సామాజిక బాధ్యతను విస్మరించకూడదని స్పష్టం చేసింది. -
ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
నెవార్క్: విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్పై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సింగ్కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఎన్నారై దేవేందర్ సింగ్ ల్యూసియానాలో నివసిస్తున్నాడు. -
హోస్నీ ముబారక్కు మూడేళ్ల జైలు
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్(86)కు భారీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఇక్కడి క్రిమినల్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన ఇద్దరు తనయులు అలా, గమాల్ను కూడా దోషులుగా తేల్చి నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది. అధ్యక్ష భవన నవీకరణకు ఉద్దేశించిన 1.79 కోట్ల డాలర్లను వీరు కాజేశారని నిర్ధారించిన కోర్టు 1.76 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. 29 లక్షల డాలర్లను ప్రభుత్వ ఖజనాకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.