Janagama District
-
జనగాంలో భారీ అగ్ని ప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం (ఫొటోలు)
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్ను సాధించుకుందామన్నారు. -
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
భూమి రికార్డుల్లో నమోదు కాలేదని..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 76 సర్వే నంబర్లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు. అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో.. రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
పండించిన కూరగాయలను మార్కెట్ చేసుకోవడం సులభమే
-
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
వెయ్యేళ్ల లక్ష్మీదేవి ఆలయం
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులోని పురాతన నాగులమ్మ దేవాలయంలో దాదాపు వెయ్యేళ్లనాటి లక్ష్మీదేవి ఆలయం వెలుగుచూసింది. ఈ మేరకు తను గుర్తించిన పలు విషయాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి శుక్రవారం వివరించారు. ‘కాకతీయుల కాలంలో నిర్మించిన నాగులమ్మ గుడిలో ద్వికూటాలయానికి మరమ్మతులు చేస్తున్నారు. గుడిచుట్టూ మట్టిని తొలగిస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం బయటపడ్డాయి. ఆ శాసన పాఠం అచ్చుతీసి శాసన పరిష్కర్త కె.మునిరత్నంనాయుడు, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్కు పంపించగా పూర్తి వివరాలు తెలిశాయి. సుమారు ఐదడుగుల ఎత్తైన ఏకశిలపై రాసిన శాసనంలో.. కాకతీయుల కాలంలోని మహాప్రధాని లక్ష్మీదేవికి రంగ¿ోగాలకు భూమిని దానం చేసినట్లు తెలిసింది. ఆ శాసనంపై ‘తుసము, దునెనిమిదిసమ, గూతి శ్రీలక్ష్మీ, రంగ¿ోగలకు, విచ్చితి, మహాప్ర«దాని, క్రయమాత, ముక్య, నానకు’ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. ఇటుకల తయారీలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఇక్కడి ఇటుకల్లో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని, మట్టి, డంగు సున్నం లేకుండా తయారు చేశారని తెలిపారు. ఆలయం ముందున్న పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి రుబ్బు రోలు లభించిందని, అక్కడే కాకతీయుల కాలం నాటి శిథిల దేవాలయం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. -
శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం వస్తారా...
వరంగల్: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్ (30) బుధవారం తెల్లవారు జామున నెల్లుట్ల శివారు ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్కు పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన నందిని అలియాస్ అక్షరతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. శ్రీకాంత్కు నలుగురు అన్నదమ్ములు కావడంతో ఇల్లు సరిపోక కొద్ది రోజులు అద్దె ఇళ్లలో ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడడంతో అక్షర మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్ అంబర్పేటకు వెళ్లింది. అక్కడే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. 15 రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన అక్షర నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీలో భర్తతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త శ్రీకాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్షర అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, అన్నదమ్ములు అక్కడికి వెళ్లగా మంచం సమీపంలో నేలపై పడుకొని చనిపోయి ఉన్నాడు. ఉరి వేసుకున్నాడని చెబుతున్నప్పటికీ, మృతదేహం నేలమీద ఎందుకు ఉందని బంధువులు ప్రశ్నించగా నేనే ఉరితాడు కోసేశానని చెప్పుతూ ఇంట్లో టీవీ చూస్తూ పాటలు వింటుండడంతో మరింత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్య అక్షరను పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. అక్షర తల్లి, బంధువులు కారులో సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా పోలీసుస్టేషన్కు చేరుకోగానే అక్కడే ఉన్న బంధువులు.. శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం ఏడుగంటలకు తెలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు వస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో బంధువులతో వాగ్వాదం నెలకొంది. అప్పుడే పోలీసేస్టేషన్కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్ అందరిని స్టేషన్ బయటకు పంపించి మృతుడు శ్రీకాంత్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పాఠశాలల్లో కరోనా కలకలం
తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్/నాగర్కర్నూల్ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. నాగర్కర్నూల్లో నలుగురు విద్యార్థినులకు.. తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్గా తేలింది. మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్ చేశారు. -
పశువుల కొట్టంగా పాఠశాల
జనగామ: జనగామ జిల్లా నర్మెట మండలం ఏనెతండాలో పదేళ్ల క్రితం రాజీవ్ విద్యామిషన్ నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రస్తుతం పశువుల కొట్టంగా మారిపోయింది. విద్యార్థులు లేరనే సాకుతో అధికారులు పాఠశాలను మూసివేయడంతో నిర్మించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా ఈ బడి తెరుచుకోలేదు. దీంతో ఈ బడి కాస్తా పశువుల కొట్టంగా మారిపోయింది. దీనిపై మండల విద్యాధికారి (ఎంఈఓ) భగవాన్ ను వివరణ కోరగా..ఏనెతండాలో పిల్లలు, టీచర్లు లేకపోవడంతోనే బడి మూసి వేశారని తెలిపారు. -
లింగంపల్లిలో అరుదైన ఆత్మార్పణ శిల వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దేవుడికి తనను తాను నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ భక్తిని ఏమనాలి?.. గతంలో ఈ తరహా వీరభక్తి ఉండేదన్న గాథలు అడపాదడపా వింటూనే ఉన్నాం. భక్తితో దేవుడికి తనను తాను ఆత్మార్పణ ద్వారా సమర్పించుకున్న వారి శిల్పాలు అప్పట్లో వేయించారు. అలాంటి ఓ అరుదైన ఆత్మార్పణ శిల తాజాగా వెలుగుచూసింది. అది మహిళది కావడం మరో విశేషం. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో కొత్త తెలంగాణ బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ ‘ఆత్మార్పణ’శిల్పాన్ని గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో వీటిని సిడితల వీరగల్లుగా పేర్కొంటారని తెలిపారు. ఈ శిల్పంలోని దృశ్యం రెండంతస్తులుగా ఉంది. దిగువ భాగంలో.. ఓ మహిళ కూర్చుని ఆత్మత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో శివలింగం పట్టుకుని ఉంది. తల భాగాన్ని ఎదురు కర్రకు కట్టినట్టు ఉంది. ఓ వెదురుకర్రను వంచి చివరి భాగాన్ని తలకు జుట్టుకు కడతారు. ఆ తర్వాత కత్తితో మెడ నరుక్కోగానే, వెదురు కర్ర తలను వేరు చేస్తూ పైకి లేస్తుంది. ఈ మహిళ ఆ పద్ధతిలో ఆత్మత్యాగం చేసినట్టు శిల్ప దృశ్యం చెబుతోంది. పైఅంతస్తులో చనిపోయిన మహిళ ఆత్మను తోడుకుని ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు దేవలోకానికి వెళ్తున్న దృశ్యం చిత్రించి ఉంది. శిల్పశైలినిబట్టి కాకతీయుల కాలానంతరం చెక్కినట్లుగా ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. వీరశైవ భక్తులెక్కువగా ఇలా ఆత్మార్పణ చేసుకునేవారని పేర్కొన్నారు. ఈ శిల్పం ఓ పొలం వద్ద వెలుగుచూసినట్టు వెల్లడించారు. -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్ఘన్పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్పై స్టేషన్ఘన్పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్లు చూసిన రాజు హుటాహుటిన ఘన్పూర్కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
9 అడుగుల కేసీఆర్ విగ్రహం
జనగామ జిల్లా చిల్పూరు పల్లె ప్రకృతివనం లోని బర్రెంకల చెరువు కట్టపై గ్రామ సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార్ సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రూ.5 లక్షలు వెచ్చించి 9 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని బుధవారం ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజుతో కలిసి సర్పంచ్ ఆవిష్కరించారు. – చిల్పూరు ఇక్కడ చదవండి: సమస్యలపై కేటీఆర్కు ట్వీట్లు.. స్పందించిన మంత్రి -
యాదాద్రి: కరోనాతో భర్త.. గుండెపోటుతో భార్య
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన డి.యాదగిరిరెడ్డి (76) కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. అతని భార్య భారతమ్మ (66)కు గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో భర్త మరణించిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. దంపతులను కాటేసిన కరోనా హసన్పర్తి/పాలకుర్తి: రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనాతో మృత్యువాత పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హసనపర్తిలో గ్రామానికి చెందిన అట్ల కొమురమ్మ (58) కు కరోనా వైరస్ సోకింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఇంతలోనే కొమురమ్మ భర్త రాజయ్య (65)కు కూడా కరోనా సోకినట్లు తేలగా ఎంజీఎం ఆస్పత్రిలోనే చేరి్పంచారు. ఆయన కూడా బుధవారం తుది శ్వాస విడిచాడు. మూడు రోజుల వ్యవధిలో... జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భార్యాభర్తలు కరోనా కాటుకు బలయ్యారు. మండల కేంద్రానికి చెందిన నారసింహుల అన్నపూర్ణ కరోనా బారిన పడి మృతి చెందింది. అయితే, ఆమె భర్త దశరథం (70)కు కూడా కరోనా సోకినట్లు తేలగా.. ఆయన బుధవారం మృతి చెందారు. -
ఉపాధి పనికి ఆలయ అర్చకుడు
కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఆర్సీ ఫిట్మెంట్ 30% కల్పిస్తూ వేతనాలు పెంచిన తెలంగాణ సర్కారు అర్చకులను విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధి పనులకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల గౌరవవేతనంలో రూ. 2 వేల వరకు సామగ్రికి వెచ్చిస్తున్నామని, అదికూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాపన్న కోటను పునరుద్ధరించాలి
సాక్షి, రఘునాథపల్లి(జనగామ): శతాబ్దాల చరిత్ర కలిగిన సర్ధార్ సర్వాయి పాపన్న కోటలోని కొంత భాగం నేలకొరగడం విచారకరమని సినీ హీరో పంజాల జైహింద్గౌడ్ అన్నారు. బహుజనుల రాజ్యాన్ని స్థాపించి వీరోచిత పోరాటంతో మొగలుల ఆగడాలను ఎదిరించిన వీరుడైన పాపన్న కోటను పునరుద్ధరించి భావితరాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్లో సర్వాయి పాపన్న కోటలోని ఓ వైపు రాతి గోడ కుప్పకూలిన నేపథ్యంలో మంగళవారం ఆయన గౌడ సంఘం నేతలతో కలిసి కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా జైహింద్గౌడ్ మాట్లాడుతూ కోట పునర్నిర్మాణానికి సర్వాయి పాపన్న ట్రస్ట్ తరపున రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోట పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని పాపన్న కోటలో నిర్మిస్తామని తెలిపారు. కోట రాతి గోడ కూలడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్గౌడ్తో పాటు పరీదుల శ్రీను, మర్కాల వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
జనగామ నుంచే మొదటి యాత్ర
జనగామ: జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తూ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని భువనగిరి లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత శనివారం జనగామకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వేలాది మందికి ఉపాధిని కల్పించేందుకు ఐటీఐఆర్ ఇండస్ట్రీస్ను జనగామకు తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి మొదటి యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడవక ముందే కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా టీఆర్ఎస్ను ప్రజలు నమ్మలేదన్నారు. ఎలక్షన్లో యంత్రాలను మాయచేసి టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాయని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా గెలుపొందిన తర్వాత 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎంపీ ఎలక్షన్లో తాము ముగ్గురం గెలుపొందామన్నారు. నిజామాబాద్లో కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లు గెలుపొంది నెలలు గడిచిపోతున్నా వారికి చెక్పవర్ లేదని, వారం రోజుల్లో వారికి చెక్పవర్ ఇవ్వని పక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
జనగామ జిల్లాను అన్ని విధాలుగా అదుకుంటాం
-
వరంగలో ఓట్ల లెక్కింపు ఇలా..
సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపే మిగిలింది. ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకోసం ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థుల తరపున ఏజెంట్లను అనుమతిస్తారు. దీంతో ఆయా అభ్యర్థులు, వారు ఎంచుకున్న ఏజెంట్లకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. సూచనలు... కౌంటింగ్ ఏజెంట్లుగా అనుభవం ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. దాని వలన అభ్యర్థి ప్రయోజనాలు సరిగ్గా పరిరక్షించబడుతాయి. ఎన్నికల సంఘం శాశ్వత ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్లుగా అంగీకరించరు. ఎందుకంటే భద్రత సిబ్బందిని ఆయన వెంట లోనికి అనుమతించరు. భద్రత లేకుండా తాను వెళతానని లిఖిత పూర్వకంగా రాసిచ్చినా అంగీకరించరు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా పనిచేస్తే సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్ని లెక్కింపు టేబుళ్లు ఉంటే అంతమందిని గరిష్టంగా 15 మందిని ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. సాధారణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ ఏజెంటును ఫొటోలో ఉన్న అభ్యర్థి కానీ అతని ఎన్నికల ప్రతినిధి గానీ ఫారం 18లో వివరాలు అందజేసి, ఏజెంటు ఫొటోగ్రాఫ్, సంతకాలు చేసిన రెండు ఫారాలు రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. అభ్యర్థి తనకు సౌలభ్యంగా ఉంచేందుకు ఫారం 18లోనే తన తరుపు పాల్గొనే ఏజెంట్ల పేర్లు కూడా రాసి ఇవ్వొచ్చు. కౌంటింగ్కు మూడు రోజుల ముందుగా సాయంత్రం 5 గంటల లోగా ఏజెంట్ల జాబితా, ఫొటోలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తే వారు అనుమతి పత్రాలను జారీ చేస్తారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపునకు గంట ముందుగా కౌంటింగ్ హాలుకు అనుమతి పత్రంతో హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం.. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 17 సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి ( పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు). పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎం ల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా... వారికి పోలైన ఓట్లు వెలువడతాయి. అనివార్య కారణాల చేత నియమించిన వ్యక్తి నచ్చక పోయినా.. లేదా అతను హాజరు కాలేకపోయినా.. ఫారం 19 పూర్తి చేసి ఓట్ల లెక్కింపునకు ముందుగా మరో ఏజెంటును నియమించుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోను ఏజెంటును నియమించుకోవడానికి వీలు లేదు. ఏ టేబుల్ వద్ద నియమించిన ఏజెంటు అక్కడే ఉండాలి. అన్ని టేబుళ్ల వద్ద తిరగడానికి వీలు లేదు. హాలులో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి. నియమాలు పాటించక పోతే ఏ ఏజెంటునైనా బయటకు పంపించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు హాలు నుంచి ఏజెంటును బయటకు వెళ్లడానికి అనుమతించరు. కౌంటింగ్ హాలు దగ్గర తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. లెక్కింపు కేంద్రంలో దూమపానం నిషేధం. వరుస క్రమంలో లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి వరుసలో ఉన్న టేబుళ్లకు సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లకు కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి.. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది. -
వరంగల్: ఓట్ల గల్లంతు ఆవేదన
కొత్తగా ఓటు నమోదు, సవరణలు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే 20 ఏళ్లుగా ఓటు వేస్తున్న వారి ఓట్లు గల్లంతు కావడంతో నిరాశే ఎదురైంది. శుక్రవాం ఓటు స్లిప్పులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు అధికారుల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వెనుతిరిగారు. ఒకరి బదులు మరొకరు ఓటు వేసిన ఘటనలు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జరిగాయి. పరకాల: పట్టణంలోని 59, 60 పోలింగ్ బూత్ల్లో రెండువందలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి. ములుగు: నియోజకవర్గం గోవిందరావుపేటలో 200 మంది ఓట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండగా బతికున్న తమ పేర్లు తొలగించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొంగులూరి సంజీవ అనే వ్యక్తి ఓటు తొలగించి, చనిపోయిన ఆయన కుమారుడు విజయ్కుమార్ పేరు మాత్రం రావడంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి: మండలం రేపోణి గ్రామ 101, 102 బూత్ల్లో 40 మంది ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. అలాగే వేములపల్లి గ్రామ 100వ పోలింగ్ బూత్లో గుమ్మడవెల్లి వెంకన్న బదులు సమీప బంధువు అయిన అదే గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి వెంకన్న ఓటు వేశాడు. వారిద్దరి తండ్రుల పేరు కూడా వెంకటయ్య కావడం కొసమెరుపు. తనకు ఓటు లేకపోయినా గుమ్మడివెల్లి వెంకన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి పోగా, ఊళ్లో ఉన్న మరో వెంకన్న ఓటు వేయకపోవడంతో స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ఖిలావరంగల్: వరంగల్ 20వ డివిజన్ ఏకశిలనగర్ వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 115 బూత్లో కందిమల్ల ప్రభాకర్ ఓటును మరో వ్యక్తి వేశాడు. దీంతో తన ఓటు మరొకరు ఎలా వేస్తారని ఆందోళనకు దిగాడు. స్పందించి పోలింగ్ అధికారులు తనకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్కు అనుమతించారు. పొరపాట్లు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. స్టేషన్ఘన్పూర్:డివిజన్ కేంద్రంలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. దాదాపు 100 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో బాధితులు ఆవేదన చెందారు. బుడిగజంగాల కాలనీ, మాడల్ కాలనీ, ఎరుకలవాడ తదితర కాలనీలకు చెందిన వారు ఫొటో ఓటరు స్లిప్పులతో పోలింగ్ బూత్లకు వెళ్లగా ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. బాధితులు దేవరాజుల సమ్మయ్య, స్వరూప, మంగమ్మ, ప్రసాద్, నీరటి దయాకర్, కరుణాకర్ తదితరులు విలేకరులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ:జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ కళాశాల, పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల్లో ఓట్లు గల్లంతు చేశారని ఆరోపిస్తూ.. బాధిత ఓటర్లు ఆందోళనకు దిగారు. 6, 7 వార్డులకు చెందిన సుమారు 150 మందికి పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఐడీ కార్డులతో పోలింగ్ బూత్ వద్దకు చేరు కున్నారు. ఓటరు జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. వరంగల్–హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ తరలివచ్చి ఓటర్లను నచ్చ చెప్పడంతో ఆవేనదతో వెనుదిరిగారు. నిరాశగా.. లింగాలఘనపురం: మండలంలోని పటేల్గూడెంకు చెందిన పెంతల గాలయ్య, పెండ్లి గోపాల్కు ఫొటో ఓటరు స్లిప్లు వచ్చినప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అదే విధంగా నెల్లుట్ల వడ్డెర కాలనీకి చెందిన కొమ్మరాజుల ఎల్లమ్మ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకు వచ్చి జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశతో వెళ్లిపోయింది. దొంగతనానికి గురైందని.. ములుగు: న ఓటును మరొకరు వేశారని ములుగు మండలకేంద్రానికి చెందిన గట్ల కోటిరెడ్డి గందరగోళానికి లోనుకావడంతో పాటు అధికారులను ప్రశ్నించారు. రికార్డుల ప్రకారం ఇప్పటికే ఓటు వేసినట్లు నమోదు అయిందని ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు చెప్పడంతో కోటిరెడ్డి షాక్ అయ్యాడు. చేసేదేమి లేక నిరాశక పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. -
జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు..
సాక్షి, జనగామ అర్బన్: జనగామ పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైల్లో నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామానికి చెందిన గంధారి లక్ష్మయ్య (70) హైదరాబాద్ మల్కాజ్గిరిలో కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో నవంబర్ 27న పోసాన్పల్లికి వచ్చిన లక్ష్మయ్య గురువారం రాత్రి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పెంబర్తి రైల్వేస్టేషన్ మాస్టర్ బి. గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించామని తెలిపారు. -
జనగామ: ఓటర్లకు కళాకారులతో చైతన్యం
సాక్షి, జనగామ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వినియోగంపై అధికారులు ఓటర్లకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మారిన ఓటింగ్ విధానంపై చైతన్యం చేస్తున్నారు. ఎవరికి ఓటేసినా ఒక్కరికే పడుతుందనే అపోహ తొలగించడంతో పాటు ఎవరికి ఓటేశామనే అంశాన్ని నిర్ధారించుకునే విధంగా ప్రింట్ కాపీని సైతం తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. తాజాగా అమలులోకి వచ్చిన ఓటింగ్ విధానాన్ని ఓటర్లకు తెలియపర్చడం కోసం విస్త్రత ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రం నుంచి బూత్లెవల్ వరకు.. నూతన ఓటింగ్ పద్ధతులపై జిల్లానుంచి గ్రామీణ ప్రాంతంలోని బూత్లెవల్ వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలుశాఖల అధికారులతో పాటు దివ్యాంగులకు, మహిళ సంఘాలకు, వివిధ వర్గాల ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలు, పంచాయతీలు, బూత్లెవల్ వరకు ఓటేసే విధానం, ఓటు వినియోగంపై సవివరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారులతో ప్రచారం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యవంతం చేస్తున్నారు. గణేష్ నేతృత్వంలోని సంజీవ, శంకర్, చిరంజీవి, కనుకరాజు, సోమయ్య బృందం జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో కళాకారులు నూతన ఓటింగ్ విధానం, సందేహాలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జనగామ మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డమ్మీ ఈవీఎం, వీవీప్యాట్లను ఏర్పాటుచేసి ఓటు వేయించి చూపిస్తున్నారు. ఇటు కళాకారులతో పాటు మరోవైపు ఓటింగ్ విధానం తెలియచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్లో ముఖ్యకూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాకారుల అవగాహన కార్యక్రమాలకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్లోకి ఓటరు ఎలా వెళ్లాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చైతన్యవంతం చేస్తున్నారు. సుద్దాల అశోక్తేజతో ఓటు విలువపై అవగాహన.. ఓటుహక్కు వినియోగంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుతూ అశోక్తేజతో ప్రచారం చేయిస్తున్నారు. విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు వినియోగంపై ప్రచారం సాగిస్తున్నారు. -
పొన్నాలకే జనగామ
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు. పోటీనుంచి తప్పుకున్న కోదండరాం.. జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది. నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు పాల్గొంటారని తెలిపారు. -
ఢీ.. రాజయ్య వర్సెస్ ప్రతాప్
టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యకు, అదే పార్టీకి చెందిన అసమ్మతి నేత రాజారపు ప్రతాప్ ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులుగానే ఉంటున్నారు. వీరిద్దరు కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు టికెట్ కోసం కుస్తీ పట్టేవారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాజయ్య దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడేళ్లకు టీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రాజయ్య, కాంగ్రెస్ నుంచి ప్రతాప్, టీడీపీ నుంచి కడియం పోటీ చేయగా రాజయ్య గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల్లో ప్రతాప్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటూనే రాజయ్యతో పోటీపడుతున్నారు. సాక్షి, జనగామ: వారిద్దరు నాడు.. నేడు కొనసాగింది ఒక జెండా కిందనే. నాడు కాంగ్రెస్లో ఉంటే.. నేడు కొనసాగుతుంది టీఆర్ఎస్లో. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడూ భిన్నధృవాలుగానే విడిపోతున్నారు. ప్రత్యర్థులుగానే కలబడుతున్నారు. సవాల్కు ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. వారే స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, రాజారపు ప్రతాప్. వీరి రాజకీయ కేంద్రమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రోజురోజుకు వర్గపోరు ముదురుతోంది. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నాయకులు పార్టీలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వర్గీయులు ఒక వర్గంగా విడిపోగా మరో అసమ్మతి నేత రా జారపు ప్రతాప్ వర్గీయులు మరో వర్గంగా విడిపోయారు. అయితే కడియం వర్గీయులు అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తుండగా ప్రతాప్ మాత్రం తానే బరిలోకి దిగుతానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఘన్పూర్లోని వర్గపోరు టీఆర్ఎస్ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బహిరంగ విమర్శలతో రాజకీయ వేడి.. ఒకే పార్టీలో కొనసాగుతున్న రాజయ్య, ప్రతాప్ బహిరంగ విమర్శలకు దిగుతుండడంతో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నెల 6న కేసీఆర్ శాసన సభను రద్దు చేసి అదే రోజు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్గా ఉన్న తాటికొండ రాజయ్యకు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే టికెట్ ఆశించి భంగపడిన ప్రతాప్ తాను రెబెల్గా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇటు పార్టీ అభ్యర్థి రాజయ్య ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రజలతో మమేకం అవుతుండగా అటు ప్రతాప్ సైతం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నెల 14న జనగామ జిల్లా కేంద్రం నుంచి స్టేషన్ ఘన్పూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రఘునాథపల్లి వద్ద డీజే సౌండ్స్కు అనుమతి లేదని పోలీసులు ర్యాలీని నిలిపివేశారు. దీంతో ప్రతాప్ పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అలాగే రాజయ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ప్రతాప్ అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా తన అనుచరుడి కోసం ప్రతాప్ ధర్నాకు దిగారు. అంతేగాక బహిరంగంగా రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తాను కేసీఆర్ బొమ్మతోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని శుక్రవారం జఫర్గఢ్లో జరిగిన ప్రచారంలో ప్రతా ప్ ప్రకటించారు. ఇద్దరి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూ పు తగాదాలతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. -
రోడ్ టెర్రర్..
సాక్షి, జనగాం జిల్లా : రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన రహదారి ప్రమాదాలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జనగాం మండలం పెంబర్తి గ్రామ శివార్లలో ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులను రామన్నగూడెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తీగల నర్సయ్య(56), తీగల కృష్ణ(28)గా గుర్తించారు. నర్సయ్య ప్రమాద అక్కడికక్కడే చనిపోగా, కృష్ణ జనగాం ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. మరో ఘటనలో.. పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హూటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకురావటం వల్ల ప్రమాదం తప్పింది. అధిక లోడు కారణంగానే ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాము కాటుకు రైతు మృతి బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో పాము కాటుకు పడాల నరేందర్ అనే రైతు మృతి చెందాడు. రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళుతుండగాదారిలో పాము కాటువేసింది. సకాలంలో వైద్యం అందకే మృతి చెందాడని కుటుంబ సభ్యులు విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
నిజాయితీ చాటుకున్న మహిళ
జనగామ : తాను అమ్ముకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో మంజూరు చేసిన పెట్టుబడి చెక్కును ఓ మహిళ అధికారులు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ లీలాకుమారి తనకున్న 7.10 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం అమ్ముకున్నారు. అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని, రెవెన్యూలో కన్వర్షన్ చేసుకోకపోవడంతో నేటికీ పట్టాదారు కాలంలో లీలాకుమారి పేరు ఉంది. అయితే భూ ప్రక్షాళన పూర్తి చేసుకుని, రైతు బంధు చెక్కులను సిద్ధం చేయగా, అందులో పెట్టుబ డి సాయం కింద లీలాకుమారికి రూ.32,700 చెక్కు మంజూరు చేశారు. కాగా, రెవెన్యూ అధికారులు ఆమెకు చెక్కు వచ్చిందని సమాచారం అందించగా, అమ్ముకున్న భూమికి పెట్టుబడి అవసరం లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తనలోని నిజాయితీని చాటుకుంటూ.. చెక్కును తహసీల్దార్ రమేష్కు అప్పగించారు. ఆమెను అధికారులతో పాటు జిల్లా ప్రజలు అభినందించారు. -
మినీ బస్సు, కారు ఢీ : ఇద్దరు మృతి
జనగామ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడారం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు రఘనాథపల్లిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. మినీ బస్సు బోల్తాపడటంతో అందులోని 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీపీ సుధీర్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వృద్ధి బాట పట్టినం: సీఎం కేసీఆర్
-
కుట్రలు ఛేదించినం
♦ వృద్ధి బాట పట్టినం: సీఎం కేసీఆర్ ♦ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలె ♦ బమ్మెర, రాఘవాపురాల్లో సీఎం పర్యటన సాక్షి, జనగామ: ‘‘తెలంగాణ ఏర్పడినంక రాజకీయ అస్థిరతను సృష్టించి తెలంగాణను దెబ్బ తీయాలని కొన్ని శక్తులు కుట్రలు చేసినై. నాలుగు రోజులకో, పది రోజులకో ఈ ప్రభుత్వం పడిపోతదంటూ తర చూ స్టేట్మెంట్లు వచ్చినై. మీరంతా చూసిండ్రు. ఆ కుట్రలను ఛేదించి ఇప్పుడు అభివృద్ధి బాట పట్టినం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఆదర్శ గ్రామ మైన రాఘవాపురం, సహజ కవి పోతన జన్మస్థల మైన బమ్మెర గ్రామాల్లో సీఎం శుక్రవారం పర్యటించా రు. రాఘవాపురంలో మిషన్ భగీరథ నల్లా నీటిని ప్రారంభించారు. 30డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బమ్మెరలో పోతన సమాధి, వ్యవసాయ బావులను పరిశీలించారు. రాఘవాపురం, బమ్మెరల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. పోతనను కూడా సొంతం చేసుకునేం దుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నించారని సీఎం దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ బిడ్డయిన పోతనది కడప జిల్లా ఒంటిమిట్ట అని చాలా దుర్మార్గంగా మాట్లాడిండ్రు. మహాకవి శ్రీనాథునికి, పోతనకు చుట్టరికముంది. అందుకే కాకతీయుల హయాంలో శ్రీనాథుడు ఇక్కడికి వచ్చిపోయిండంతే. ఇట్ల సమైక్య రాష్ట్రంలో ఏదీ మనది కాకుండా పోయింది. మనుషు లు మనుషులు కాకుండా పోయిండ్రు. కవులు కవులు కాలేదు. నీళ్లు నీళ్లు కాకుండా పోయినై. దేవుళ్లు దేవుళ్లు కాకుండా పోయిండ్రు. అన్నీ నిరాదరణకు గురైనై. అందుకే ఒక ఉప్పెనలా విప్లవం పొంగింది. పోతన వారసులం గనుకనే మనకా పౌరుషముంది’’ అన్నారు. ఇతర కవులంతా తమ రచనలను రాజుల కు అంకితమిచ్చి భోగభాగ్యాలు అనుభవిస్తే పోతన మాత్రం ‘నా కావ్య కన్యకను రాజులకిచ్చి పడుపు కూడు తినే దౌర్భాగ్యం వద్దు’అంటూ వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగించిన మహాకవి అని ప్రస్తుతించారు. ‘‘అలతి అలతి పదాలతో తేటతెలుగు కవిత్వాన్ని, మహాద్భుతంగా మహా భాగవతాన్ని తెలుగువారికి అందించిన పోతన వారసులం మన మంతా. అది మరిచిపోవద్దు’’అని సూచించారు. బమ్మెరను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. జనగామ జిల్లాలో చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి రూ.40 కోట్లు కేటా యిస్తున్నట్టు ప్రకటించారు. బమ్మెరకు రూ.7.5 కోట్లు, పెంబర్తికి రూ.5కోట్లు, వల్మీడికి రూ.5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, జఫర్గఢ్ కోటకు రూ.6 కోట్లు, ఖిలాషాపూర్ కోటకు రూ.4.5కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.2కోట్లు ప్రకటించారు. బమ్మెరకు బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి రూ.176కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పా రు. పాలకుర్తిలో మహిళా డిగ్రీ కళాశాలతో పాటు నియోజకవర్గానికి అదనంగా 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రక టించారు. రాఘ వాపురం చిన్న గ్రామమైనా అభివృద్ధిలో గంగదేవిపల్లి తో పోటీపడడం అభినంద నీయమన్నారు. దయాకర్ పదవి వద్దన్నడు... కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బాగుచేసు కోవడం కోసం టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్లోకి ఆహ్వానించానని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎర్రబెల్లిని పిలిపించి మాట్లాడిన. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తానొక్కడినే కాక అందరమూ వస్తమని చెప్పి దయాకర్ లీడ్ తీసుకుని వచ్చారు. అలా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. సీనియర్ నాయకుడైన దయాకర్రావుకు టీఆర్ఎస్లో కీలక పదవి ఇద్దా మనుకున్నం. ఆయన మాత్రం తనకు పదవి వద్దని, తన నియోజకవర్గానికి రూ.100 నుంచి రూ.150కోట్ల అభివృద్ధి పనులు కావాలని అడిగిం డ్రు. ఈ విషయాన్ని మీ నియోజకవర్గంలోనే చెప్పాలని నేనిక్కడికి వచ్చిన’’అని వివరించారు. సభలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు అజ్మీరా సీతారాం నాయక్, పసునూరి దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్లు శ్రీదేవసేన, ఆమ్రపాలి, ప్రీతి మీనా, ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఎప్పుడూ నాకే ఫస్ట్ ప్రైజు బమ్మెర సభలో ప్రసంగం సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజుల్లోకి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. ‘‘నాకు ఒక జ్ఞాపకం వస్తున్నది. మెదక్ జిల్లా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా గురువు పరాశరం గోపాలకృష్ణమూర్తి తెలుగు సాహిత్యంపై పోటీలు పెట్టెటోళ్లు. అప్పట్ల తెలుగు పద్యం గానీ, వ్యాసం గానీ, రచనల్లో గానీ నాకే ఫస్ట్ ప్రైజు వచ్చేది. నా సోదరులు, తోటోళ్లంతా ‘ఏందీ అన్యాయం సార్? ఎప్పుడూ చంద్రశేఖర్కే ఫస్ట్ ప్రైజా?’అంటే ఆయన ‘నాకు నచ్చిన గ్రంథం’ అంశంపై వ్యాసరచన పోటీ పెట్టిండ్రు. అయితే పోటీలున్న విషయం 45 నిమిషాల ముందే గుర్తుకు వచ్చింది. వెంటనే కాలేజీకి పోయిన. కానీ పెన్ను మరిచిపోయాను. మా దోస్తు వినోద దగ్గర పెన్ను అడుక్కున్న. పోతన కవిత్వంపై సి.నారాయణరెడ్డి రాసిన మందార మకరందం పుస్తకం సదివిన. 30 నిమిషాల్ల వ్యాసం రాసిచ్చిన. మళ్లా నాకే ఫస్ట్ ప్రైజొచ్చింది. దాంతో అంతా పంచాయతీ పెట్టిండ్రు. కాలేజీ ప్రిన్సిపాల్ రంగారెడ్డిని, తెలుగు హెడ్ను పిలి చిండ్రు. ‘మిగతా వాళ్లంతా నవలల గురించి రాస్తే చంద్రశేఖర్ మాత్రమే పోతన గురించి రాసిండు. అందుకే బహుమతి తనకిచ్చినం’అని సార్లు చెప్పిం డ్రు’’అంటూ సభికుల చప్పట్ల మధ్య సీఎం గుర్తు చేసుకున్నారు. ‘సత్కవుల్ హాలికులైన నేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై’, ‘ఇందుగలడందులేడను సందేహం వలదు.. ఎందెందు వెదికిచూసినా అందందే గలడు దానావాగ్రణి వింటె’అంటూ పోతన పద్యాలను స్వయంగా పాడి వినిపించి సభికులను అలరించారు. -
మూడు కాళ్లతో శిశువు జననం!
-
మూడు కాళ్లతో శిశువు జననం!
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న భార్య శ్రీలత రెండవ సంతానంగా మంగళవారం మూడు కాళ్లతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శ్రీలత గర్భం దాల్చిన నాటి నుంచి జనగామలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నది. ఆరు నెలల సమయంలో స్కానింగ్ తీసిన సమయంలో వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కడుపులోని శిశువు కింది భాగంలో అదనంగా మరో అవయవం పెరుగుతుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రోజువారి కూలీకి వెళితేనే బతుకు బండి నడిచే పరిస్థితుల్లో కాన్పు అయ్యే వరకు దేవునిపై భారం వేసి ఎదురు చూశారు. ఈ నెల 20న రాత్రి పురిటి నొప్పులు రావడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కడుపులో ఉన్న శిశువు ఉమ్మ నీరు మింగడంతో వైద్యురాలు స్వప్న నేతృత్వంలో మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు. కడుపులోని బిడ్డకు మూడుకాళ్లు ఉండడంతో వైద్యులు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడు కాళ్లతో శిశువు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ మూడవ కాలు విషయమై పూర్తిగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మూడు కాళ్లతో జన్మించిన శిశువు ఆరోగ్య స్థితిగతులను నిలోఫర్ వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
ఈ–రిక్షా మేడిన్ జనగామ
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కాలుష్య రహిత ఈ–రిక్షాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ, వారణాసి తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ ఈ–రిక్షాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. జనగామకు చెందిన పెద్ది రవీందర్ పెంబర్తి రోడ్డులో ఈ–రిక్షా తయారీ కేంద్రాన్ని ప్రారంభిం చారు. చెనా, ఢిల్లీ, చైన్నై ప్రాంతాల నుంచి ముడిసరుకులను తీసుకువచ్చి ఇక్కడే ఈ– రిక్షాలను తయారు చేయిస్తున్నారు. ఫ్రేమ్స్, డూమ్లు, మోటార్లు, చార్జర్లు, కంట్రోల్ ప్యానెల్, బ్యాటరీ, వైరింగ్, ఎల్ఈడీ లైట్లను దిగుమతి చేసుకొని సొంతంగా తయారీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 ఈ–రిక్షాలను తయారు చేశారు. ప్యాసింజర్, గూడ్స్ రిక్షాలు.. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ–రిక్షాల్లో ప్రయాణికులను తరలించడానికి ఈ–రిక్షా, వస్తువులను రవాణా చేయడానికి ఈ–కార్ట్ రిక్షాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ప్యాసింజర్ రిక్షాలో ఐదుగురు కూర్చోవడా నికి వీలుగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ–కార్డ్ రిక్షాలో 4 క్వింటాళ్ల బరువు వరకు రవాణా చేయడం వీలవుతుంది. కాగా, ప్యాసింజర్ ఆటోను రూ. 1.10 లక్షలకు విక్రయిస్తే, గూడ్స్ ఆటోను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. 4 గంటలు చార్జింగ్.. ప్రయాణం 80 కిలోమీటర్లు.... ఈ–రిక్షాకు 4 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు ఉంటుంది. అంతేకాకుండా రేర్మిర్రర్, స్పీడో మీటర్, ఇండికేటర్, సౌండ్ సెట్టింగ్ వంటి సదుపాయాలన్నీ ఇందులో పొందుపరిచారు. అనుమతులు అక్కర్లేదు.. ఈ–రిక్షాలను నడపడం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. గేర్లు లేకుండానే వాహనం నడిపే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ కూడా లేదు. -
జిల్లాను నంబర్ వన్ చేస్తాం
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ : అభివృద్ధిలో రాష్ట్రంలోనే జనగామ జిల్లాను నంబర్ వన్ చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. దేవాదుల ద్వారా చెరువులకు నీటిని మళ్లించి 365 రోజులూ మత్తడి దుంకేలా చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా ఇచ్చేందుకు మొదటి నుంచే సుముఖంగా ఉండగా చేర్యాల, మద్దూరు, గుండాల, స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ మండలాల వారు కలువమంటున్నరు.. జనాభా సరిపోవడం లేదనేవారని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జేఏసీ నాయకులు జనగామ జిల్లా ఇవ్వాల్సిందేనని ఖరాకండిగా చెప్పడంతో మిగతా జిల్లాల సంగతి ఎలా? అని కేసీఆర్ ప్రశ్నించారని తెలిపారు. గతంలో జనగామను జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారని, మిగతా వాటిపై హామీ ఇవ్వలేదనడంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చారని వివరించారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకరించాలని కాంక్షించారు. ఉద్యమంలో కలిసి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, డాక్టర్లు లక్షి్మనారాయణనాయక్, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, మాశెట్టి వెంకన్న బొట్ల శ్రీనివాస్, ఆకుల సతీష్, బండ యాదగిరిరెడ్డి, కారింగుల రఘువీరారెడ్డి, మంగళ్లపల్లి రాజు, ఉడుగుల రమేష్, కొండా కిరణ్, బెడిదె మైసయ్య, కన్నారపు ఉపేందర్, పెట్లోజు సోమేశ్వరాచారి, విజయ్ ఉన్నారు. -
మున్సిపల్ భవనంలోనే జనగామ కలెక్టరేట్
సమీకృత బాలుర వసతి గృహంలో ఐదు శాఖలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ జనగామ : జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పురపాకల సంఘంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. దసరా పండుగ రోజున కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. ఈమేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించేందుకు కలెక్టర్ వాకాటి కరుణ గురువారం జనగామకు వచ్చారు. జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆర్డీవో వెంకట్రెడ్డితో కలిసి చంపక్హిల్స్లో నూతనం గా నిర్మిస్తున్న వంద పడకల ప్రసూతి ఆస్పత్రి, పెంబర్తి ప్రగతి ఫార్మసీ, వడ్లకొండ ఇరిగేషన్ క్వార్టర్లు, ఆర్డీవో క్వార్టర్లను కలెక్టర్ పరి శీలించారు. అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకంచలోని సమీకృత బాలుర వసతిగృహంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీతోపాటు మరోశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మూడు రోజుల్లో 19 శాఖలకు చెందిన భవనాలను గుర్తించి ఫర్నీచర్ పంపుతామని తెలిపారు. మున్సిపల్ భవనంతోపాటు సమీకృత వసతిగృహంలో టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్, ఎలక్టిక్రల్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వచ్చింది.. చాలా సంతోషంగా ఉందా.. జనగామ జిల్లా సాధించుకున్నారు.. చాలా సంతోషంగా ఉందా.. అంటూ కలెక్టర్ కరుణ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మేడమ్ జిల్లా సాధించుకున్నాం.. మీరే కలెక్టర్గా రావాలంటూ ఓ నాయకుడు అనడంతో చిరునవ్వుతో సమాధానం చెప్పారు. వారి వెంట జేఏసీ చైర్మన్ ఆర్టుల దశమంతరెడ్డి, కౌన్సిలర్లు కన్నారపు ఉపేందర్, ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ బాల్దె సిద్దులు, డాక్టర్ లక్షి్మనారాయణనాయక్, ఆకుల సతీష్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా ఉన్నారు. -
ప్రజల ఒత్తిడితోనే జనగామ జిల్లా ఏర్పాటు
అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోర్టు నుంచి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ జనగామ : ప్రజాస్వామ్య దేశంలో ఒత్తిడి ఓ ఆయుధమని, ప్రజలు పాలకులపై తిరగబడితే తప్ప పనులు కావని జనగామ జిల్లా ఏర్పాటుతో తేలిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాతీయ రహదారులను దిగ్బంధించిన ఘటనలో పొన్నాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగం గా బుధవారం పొన్నాల లక్ష్మయ్య జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల ప్రకటనతో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాబూజగ్జీవ¯ŒSరామ్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా..పాలకుర్తి సోమన్న, జీడికల్ సీతారాములు, కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధేశ్వరుడు, బెక్కల్ రామలింగేశ్వరస్వామి కరుణతో జనగామ జిల్లా ఏర్పడిందన్నారు. జనగామ జిల్లా కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఐదు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో ఇక్కడి ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించామని పేర్కొన్నా రు. గత ఐదు నెలల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా స్పందిం చడంలేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇతంటి దారుణ పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. పట్టణంలో 85 రోజుల పాటు 144 సెక్ష¯ŒS అమ లు చేసి సాగించిన నిర్భంధకాండను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు మద్దూరు, నర్మెట, చేర్యాల రిజర్వాయర్లను నిర్మిస్తే వాటిని సిద్దిపేటకు తరలించ డం బాధాకరమన్నారు. జిల్లాల పేరుతో జనగామను మూడు ముక్కలు చేస్తున్నారని మం డిపడ్డారు. జిల్లాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరె డ్డి, మున్సిపల్ మాజీ చైర్మ¯ŒS వెన్నెం వెంకటనర్సింమారెడ్డి, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, బుచ్చిరెడ్డి, అన్వర్, చిర్ర సత్యనారాయణరెడ్డి, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సు« దాకర్, బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్రెడ్డి, రాందయాకర్, మదార్ షరీఫ్, జమా ల్ షరీఫ్, రంగ రాజు ప్రవీణ్, మేకల రాంప్రసాద్, పన్నీరు రాధిక, వెన్నం శ్రీలత, వంగాళ కళ్యాణి మల్లారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జెడ్పీటీసీ నాచగోని పద్మ తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు
ఆలయ భూమి పరిశీలించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ : పట్టణ శివారు సూర్యాపేట హైవేలోని దేవాదాయ శాఖ భూమిలో జనగామ జిల్లా కార్యాలయాల నిర్మా ణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తెలిపారు. ఆర్డీవో వెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కనే దేశాదాయశాఖ పరిధిలో ఉన్న 25 ఎకరాల స్థలంలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట నిర్మించుకోవచ్చని తెలిపారు. దీని పక్కనే ఉన్న గార్లకుంటలో ఉన్న 15 ఎకరాలను పోలీసు పరేడ్ గ్రౌండ్ కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. దేవాదాయశాఖ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశీ లించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతామన్నారు. అలాగే, తాత్కాలికంగా ధర్మకంచలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల కోరిక మేరకు జనగామను జిల్లా చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, డాక్టర్ సుగుణాకర్రా జు, కారింగుల రఘువీరారెడ్డి, పసుల ఏబేలు, కే.ఉపేందర్, ఆర్ఐ రాజు, వీ ఆర్వో రాజయ్య, రావెల రవి ఉన్నారు. జిల్లా కార్యాలయాలకు భవనాల పరిశీలన జనగామను జిల్లా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సానుకూల ప్రకటన చేయగా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. దసరా పండగ రోజు నుంచే నూతన జిల్లా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్డీవో వెంకట్రెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భవనాలను పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. పురపాలకసంఘంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంతోపాటు ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్, ప్రగతి ఫార్మసి, వ్యవసాయ మార్కెట్లోని కాటన్ యార్డు, దేవాదుల క్వార్టర్స్, ఇండోర్ స్టేడియం గదులు, ధర్మకంచలోని బాలికల వసతిగృహం, 9 కమ్యూనిటీ హాళ్లను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించిన నూతన భవనాలను చూసేందుకు బుధవారం జనగామకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ రానున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఆర్ఐ రాజు, వీఆర్వో రాజయ్య, నాయకులు గజ్జెల నర్సిరెడ్డి, బొల్ శ్రీనివాస్, ఆకుల సతీష్ ఉన్నారు. -
కమిషనరేట్ పరిధిలోకి జనగామ జిల్లా
సీఎం నిర్ణయంతో పెరిగిన పరిధి కొత్తగా నాలుగు ఏసీపీ కార్యాలయాలు వరంగల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పెరిగింది. నూతనంగా ఏర్పడే జనగామ జిల్లాను కమిషనరేట్ పరిధిలో చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పోలీస్శాఖ అధికారులు తాజాగా కసర త్తు ప్రారంభించారు. కొత్తగా ఏర్పడే వరంగల్, వరంగల్ (రూరల్), జనగామ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని తాజాగా నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్స్టేన్ ఏ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమయ్యే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోని కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తు తం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మాము నూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్, జనగామలోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీసులుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, జనగామ ఏసీసీ పోస్టులు ఏర్పడుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీపీ పోస్టుగా, జనగామ డీఎస్పీ పోస్టు రద్దై ఏసీపీ పోస్టుగా మారనుంది. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్స్టేషన్, ఒక క్రైం పోలీస్స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, పాలకుర్తి, కొడకండ్ల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంట ఏర్పడే పోలీస్స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కాను న్న జనగామ జిల్లాలలోని పోలీస్స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే మొత్తం 55 పోలీస్స్టేషన్ల తో కమిషనరేట్ పరిధి భారీగా పెరగనుంది. వరంగల్ : మట్టెవాడ, మిల్స్కాలనీ, ఇంతె జార్గంజ్, లేబర్కాలనీ, ఏనుమాముల హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డెపల్లి, న్యూశాయంపేట కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్ నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ హుజూరాబాద్ : కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి కేయూసీ : కేయూసీ, హసన్పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల స్టేషన్ఘన్పూర్ : స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు జనగామ : జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాలఘనపూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, తరిగొప్పుల, గుండాల -
డీజీపీని కలసిన పీసీసీ మాజీ చీఫ్
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని జనగామలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డీజీపీ అనురాగ్ శర్మకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో అనురాగశర్మను పొన్నాల కలిశారు. జనగామ ప్రత్యేక జిల్లా కోసం పోరాడుతున్న వారిపై కేసులు ఉపసంహరించాలని ఈ సందర్భంగా అనురాగశర్మను పొన్నాల కోరారు. పొన్నాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అనురాగశర్మను కలిసినవారిలో ఉన్నారు. -
రాజకీయ కుట్రతోనే జనగామకు అన్యాయం
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలు∙ పట్టణాలను వదిలి గ్రామాలను జిల్లా చేస్తారా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి రఘునాథపల్లి : జనగామ జిల్లా కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కుట్రతో అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. జిల్లా కోసం చేపట్టిన 8వ రోజు దీక్ష శిబిరాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జిల్లా కోసం ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్పై జిల్లా ఏర్పాటుకు ఒత్తి డి తెచ్చి ప్రజల పక్షాన ఉండాలన్నారు. శాస్త్రీయంగా భౌగోళికంగా జిల్లా కేంద్రం అయ్యేం దుకు అన్ని హంగులు జనగామకు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి విజయరామరావు మాట్లాడుతూ కొత్త జిల్లాల పునర్విభజన ఏకపక్షంగా అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యం లో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిం చారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, డీసీసీబీ వై స్ చైర్మన్ పుల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు నా గేష్, జేఏసీ గౌరవ అధ్యక్షుడు కైలాసం, జే ఏసీ నాయకులు యాదవరెడ్డి, జోగారెడ్డి, హ ర్యానాయక్, రవి, బాలస్వామి, చిన్న నగేష్, లిం గాజీ, రమేష్, జయరాములు, చందన, మూ డ్ధర్మ, అశోక్, శ్రీను, నర్సింహ పాల్గొన్నారు. -
చేర్యాల బంద్ సంపూర్ణం
చేర్యాల : జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జనగామ జిల్లా సాధన కోసం చేర్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు ఆహ్వానించిన నేపథ్యంలో చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చేర్యాల పరిరక్షణ సమితి కన్వీనర్ పందిళ్ల నర్సయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అ««దl్యక్షుడు ఉడుముల భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుర్మ వెంకట్రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని దుకాణాలు, పాఠశాలు, కళాశాలలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి సినిమా టాకీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కోదండరాంను చేర్యాలకు ఆహ్వానించి, సభ నిర్వహించాలనే ఆలోచనే సరికాదన్నారు. స్థానికుల మనోభావాలను అన్ని పార్టీలు గౌరవించాలన్నారు. చేర్యాలను సిద్ధిపేట జిల్లాలో కొనసాగించి, అక్కడి రెవెన్యూ డివిజన్లోనే కలపాలన్నారు. సర్పంచులు పెడతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము రవి, బొమ్మగోని రవిచందర్, ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, నాయకులు కందుకూరి సిద్దిలింగం, ఎండీ.మోయిన్, ఉప్పల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు లక్షల్లో పంపాలి
జనగామ జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జనగామ : యాదాద్రి జిల్లా వద్దు.. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో అభ్యంతరాలు పంపాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్, పూలే అధ్యయన కేంద్రంలో శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తుండటంతో ప్రతి ఒక్కరూ పంపాలని కోరారు. ఈ విషయంపై మండలాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బాధ్యులను నియమించినట్లు చెప్పారు. ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ఉచితంగా విజ్ఞప్తులు పంపేందుకు జేఏ సీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జనగామను జిల్లా చేయాలని లక్షలాది మంది ఉద్యమిస్తుంటే, హన్మకొండను జిల్లా చేయడం ప్రభుత్వ వివక్షకు నిదర్శనమన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును విరమించుకోవాలని అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడి జనగామకు సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. జనగామ జిల్లా ఉద్యమానికి మరింత ఊతమిచ్చేందుకు సీపీఎం ప్రత్యక్ష ఉద్యమంలోకి కలిసి రావడం శుభ పరిణామమన్నారు. లింగాలఘనపురానికి చెందిన సర్పంచ్, ఎంపీపీ ఏకగ్రీవ తీర్మాణాలతో ఎంపీపీ భర్త రాజు, చిట్ల ఉపేందర్రెడ్డి, సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు బయల్దేరే క్రమంలో జేఏసీ నేతలు కలిశారు. అభ్యతంరా ల స్వీకరణపై ఆయా గ్రామాల ఇంచార్జిలు మేడ శ్రీను (రఘునాథపల్లి), బాలలక్ష్మి (మద్దూరు), ధర్మపురి శ్రీను, ఆలేటి సిద్దిరాములు (బచ్చన్నపేట), రెడ్డి రత్నాకర్రెడ్డి (నర్మెట), జనగామ అర్బన్ (ఆకుల వేణుగోపాల్రావు, పిటట్ల సత్యం,జక్కుల వేణుమాధవ్, బూడిద గోపి), కళాశాలలు, విద్యాసంస్థలకు ఎండీ.మాజీద్, పిట్టల సురేష్, నరేందర్, కిరణ్ను నియమి స్తూ, సమన్వయకర్తగా మంగళ్లపల్లి రాజుకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనగామ జిల్లా కోసం బచ్చన్నపేటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొన్నె బాల్రాజుకు నివాళులర్పించారు. ఆమరణ దీక్ష చేసిన 12 మంది జేఏసీ నాయకులకు అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజిరెడ్డి, డాక్టర్ రాజమౌళి, లక్ష్మినారాయణనాయక్, పెద్దోజు జగదీష్, మాశెట్టి వెంకన్న, మోర్తాల ప్రభాకర్, బర్ల శ్రీరాములు, సత్యపాల్రెడ్డి, క్రిష్ణ ఉన్నారు. -
జనగామ జిల్లా కోసం పోరాడుతాం
జనగామ జేఏసీ నాయకుల ఆమరణ దీక్ష విరమింపజేసి అఖిలపక్ష నాయకులు ఎంజీఎం : హన్మకొండ జిల్లా ఏర్పాటును రద్దు చేసి, జనగామను జిల్లాగా ప్రకటించే వరకూ వరంగల్ పరిరక్షణ సమితి పోరాడుతుందని అఖిలపక్ష నాయకులు గురువారం రాత్రి జనగామ జేఏసీ నాయకులకు నిమ్మరసం అందిం చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వరంగల్ పరిరక్షణ సమితి కన్వీనర్ బైరపాక జయప్రకాశ్ మాట్లాడారు. జనగామ జిల్లా కోసం ఆరు నెలలుగా పోరాటం చేస్తున్న ప్రజ ల ఆకాంక్షను గౌరవించకుండా, ఎవరూ కోరని హన్మకొండను జిల్లాగా ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా బంద్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో బహిరంగ సభ నిర్వహించి, కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. చారిత్రాత్మక ఓరుగల్లును విడదీస్తూ హన్మకొండ జిల్లా ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్, ఈవీవీ శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, న్యూడెమోక్రసీ అధ్యక్షుడు అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా అమరేందర్రెడ్డి, అడ్వకేట్స్ జేఏసీ నాయకులు మద్దసాని సహోదర్, చిల్లా రాజేంద్రప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు పాల్గొన్నారు. -
‘జనగామ’ కోసం ఆమరణ దీక్ష
జనగామ : నూతన జిల్లాల ముసాయిదాలో ప్రభుత్వం జనగామకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ నాయకులు ఆమరణ దీక్షకు దిగారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తి జేఏసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్తో పాటు మరో పదిమంది దీక్షలో కూర్చున్నారు. తొలుత జేఏసీ నాయకులు జూబ్లీ ఫంక్షన్ హాల్ నుంచి మద్దతుదారులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, జేఏసీ సభ్యులు సీహెచ్. రాజారెడ్డి.. దశమంతరెడ్డి, లక్ష్మీనారాయణ నాయక్, ఆకుల దుర్గాప్రసాద్, జక్కుల వేణుమాదవ్, పూల సుధాకర్, మంతెన మణి, అనంతుల శ్రీనివాస్, ఊడ్గుల రమేష్, సత్యం, వెంకట్, సీతారాములు, పానుగంటి ప్రవీణ్కు పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి సంఘీభావం తెలిపారు. అన్ని వనరులున్న జనగామను జిల్లా చేయక పోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని ధర్మారావు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, నేడు స్వరాష్ట్రంలో జనగామకు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలుపుతూ కొమురవెల్లి మల్లన్న ఆదాయంతో పాటు నీళ్లు దోచుకునే ప్రయత్నంలో భాగంగానే జనగామ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా కోసం ఉద్యమిస్తున్న నాయకులు సన్నాసులని సంబోధించిన సీఎం కేసీఆర్.. నాడు ఈ ప్రాంత ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆత్మ బలిదానం చేసుకుంటారా?.. తన పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలసి ఉద్యమం చేస్తారా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మద్దూరు మండలంలో 15 గ్రామాలు జనగామ జిల్లా కోసం ఏకగ్రీవ తీర్మానం చేశాయన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధం : దశమంతరెడ్డి జనగామ ప్రజల ఆకాంక్ష కోసం ప్రాణాత్యాగానికైనా వెనుకాడే ప్రసక్తే లేదని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 11వ నూతన జిల్లా జనగామ అంటూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు మోపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు జనగామకు ఉన్నాయని సీసీఎల్ రేమండ్ పీటర్ సైతం ఒప్పుకున్నారని గుర్తు చేశారు. జిల్లావద్దంటూ గొడవ చేస్తున్న నిర్మల్, హన్మకొండలను చేసి, కావాలని ఎనిమిది నెలలుగా ఉద్యమిస్తుంటే తమను విస్మరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి ఒకరోజులోనే వేల సంఖ్యలో అభ్యంతరాలు పంపించామని, ఇంకా నెల రోజుల పాటు భారీ సంఖ్యలో పంపించాలని ప్రజలను కోరారు. భారీగా పోలీసుల మోహరింపు ఆమరణ దీక్ష నేపథ్యంలో జనగామలో భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో జనగామ, చేర్యాల సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. దీక్షా శిబిరం ఆవరణలో కొత్తగా టెంట్ వేయడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
జిల్లా కోసం బలిదానం
జనగామ జిల్లా కాదేమోనని మనస్తాపం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు బచ్చన్నపేటలో విషాదం బచ్చన్నపేట : జనగామ జిల్లా రాదేమోననే బెంగతో ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం జిల్లాల ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి మనో వేదనకు గురవుతున్న భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన కొన్నె కిష్టయ్య–ఎల్లమ్మ కుమారుడు బాల్రాజు(28) భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. పని కోసం నిత్యం జనగామకు వస్తూ.. జిల్లా కోసం జరిగే ఉద్యమాలు, ఆందోళనలో చురుకుగా పాల్గొంటున్నాడు. జనగామ జిల్లా కావడం లేదని కొద్ది రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జిల్లాల ముసాయిదాలో జనగామ పేరు లేకపోవడంతో పేపర్ చూసుకుంటూ కుమిలిపోయాడు. అన్నా.. జనగామ జిల్లా వస్తదంటవా.. ఆమరణ దీక్ష చేసే నాయకులు చనిపోతే ఎలా.. అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవాడని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పని కోసం జనగామకు వచ్చే బాలరాజు మంగళవారం జనగామకు రాలేదు. ఇంటి వద్దనే దిగాలుగా ఉన్నాడు. అతని భార్య రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలరాజు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు ఇంటికి రాగా బాలరాజు దూలానికి వేలాడుతూ కనిపించాడు. వారు బోరున విలపిస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు. అప్పటికే బాలరాజు మృతిచెందాడు. అన్నం తినరా బిడ్డా..అని ఎంత బతిమిలాడినా పేపరు చదువుతూ దిగాలు చెందాడని తండ్రి విలపించారు. ఒక్క కొడుకని గారాబంగా చూసుకున్నామన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా..రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలరాజు మృతితో వారు దిక్కులేని వారయ్యారు. మృతునికి ఏడాది వయస్సుగల కుమారుడు ఉన్నాడు. కాగా, బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం అందుకున్న జిల్లా ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు బచ్చన్నపేటకు వచ్చి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జనగామ జిల్లా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కోసం జనగామ పట్ణణంలో ఇప్పటి వరకు ముగ్గురు గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు బచ్చన్నపేటలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
జనగామలో ఉగ్రరూపం దాల్చిన ఆందోళన ఐదు గంటల పాటు హైవే దిగ్బంధం జేఏసీ, మహిళా, విద్యార్థి నాయకుల అరెస్టు జనగామ : జిల్లాల ప్రతిపాదనలో జనగామకు జరిగిన అన్యాయానికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపుతో వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు 144 సెక్షన్ విధించినా దానిని ఖాతరు చేయకుండా సకల జనులు రోడ్లపైకి చేరుకున్నారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్ల పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి గురువారం రాత్రి నుంచే జనగామను ఆధీనంలోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకే జేఏసీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని నిద్రలేపి అరెస్ట్ చేశారు. దీంతో జనగామ డివిజన్ అట్టుడికింది. పోలీసుల కళ్లు గప్పి.. ముందుగా టీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ తర్వాత జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి వందలాది మందితో కలిసి సిద్ధిపేట రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఇంతలోనే కుర్మవాడ నుంచి 200 మంది మహిళలు బోనాలతో జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడ మహిళా పోలీసులు ఇద్దరే ఉండడంతో అరెస్టు చేసేందుకు ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మరోవైపున జేఏసీ నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. దశమంతరెడ్డి కాలర్ పట్టుకుని లాగారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల కళింగరాజు, కౌన్సిలర్లు ఆకుల వేణు, బెడిదె మైసయ్య, జనార్దన్రెడ్డి, ఎజాజ్, విద్యార్థి సంఘ నాయకులు మాజీద్, మంగళ్లపల్లి రాజును బలవంతగా ఈడ్చుకెళ్లారు. మహిళలు, వృద్ధులను సైతం లాగి వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో జేఏసీ నాయకులు–పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎస్ఐ సంతోషం రవీందర్పై జేఏసీ నేతలు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ మహిళలు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. జనగామ జిల్లా తమ హక్కని, ఇవ్వకుంటే నాయకులను అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, స్టేషన్ లోపలికి తరలించే క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
జనగామ జిల్లా బహుమతిగా ఇవ్వాలి
ప్రతిపక్ష పార్టీ నేతలకు రాఖీ కట్టి కోరిన మహిళా ప్రజాప్రతినిధులు జనగామ : జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న నిర్వహించే ప్రజాప్రతినిధుల సమావేశంలో జనగామకు అనుకూలంగా వాణి వినిపించాలని కోరుతూ జేఏసీ నాయకులు హైదరాబాద్లో ప్రతిపక్ష పార్టీ నేతలను బుధవారం కలిశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, జిల్లా కోసం రాజీ నామా చేసిన 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజని, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, ప లువురు జేఏసీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్, అరవింద్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి జనగామ జిల్లా చేయాలని ఏకవాక్య తీర్మాణంతో సంపూర్ణ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. పలు పార్టీల నేతలకు మహిళా ప్రజాప్రతి నిధులు రాఖీ కట్టి జనగామ జిల్లా కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దశమంత్రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలకు చెందిన నేతలు జనగామ జిల్లాకు అనుకూలంగా పూర్తి సహకారం అందిస్తామన్నారని తెలిపారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్రావు, ఆలేటి సిద్దిరాములు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళంపల్లి రాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, తీగల సిద్దుగౌడ్, బెడిదె మైసయ్య ఉన్నారు.