Jerusalem
-
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్ను విడుదలకు దోహదపడే ఇనులిన్ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.కర్నాటకలోని మూడ్బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి!
హమాస్ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.గత అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. Israel claims to have killed Yahya Sinwar in the Gaza StripBut nothing has been confirmed yet, as soon as it is confirmed, we will inform you pic.twitter.com/5xWYZpWJ69— Mustafa Gujjar (@MGujjar94) September 22, 2024అయితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్ కూడా అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f— Israel Defense Forces (@IDF) February 13, 2024 #Breaking Reports that Israel is investigating whether Hamas chief Yahya Sinwar was killed in IDF strikes in Gaza. There is no clear intelligence to support the claim. Discussions are taking place as to whether Sinwar's communications have been cut off or he has been ki||ed. pic.twitter.com/Jkif0b9HmH— GLOBAL BREAKING NEWS (@tararnews) September 23, 2024ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యంత పురాతన 'పబ్'..సందర్శకులు మాత్రం దాన్ని..
ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మధుశాల. ఇంగ్లండ్లోని నాటింగ్హామ్లో ఎనిమిది శతాబ్దాల కాలానికి పైగా ఇది పనిచేస్తోంది. ‘ది ఓల్డె ట్రిప్ టు జెరూసలేం’ పేరుతో ఉన్న ఈ పబ్ 1189 సంవత్సరంలో ప్రారంభమైంది. జెరూసలేంపై క్రూసేడ్ కోసం బయలుదేరడానికి ముందు అప్పటి ఇంగ్లండ్ రాజు కింగ్ రిచర్డ్ ది లయన్ హార్ట్, ఆయన సహచరులు ఈ పబ్లోనే మందు విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారట! అప్పట్లో ఒక కొండను తొలిచి, ఈ పబ్ భవనాన్ని నిర్మించారు. ఇందులోని గదులు గుహల్లోనే ఉంటాయి. గుహల్లో కూర్చుని పార్టీ చేసుకోవాలనుకునే పర్యాటకులు ఇప్పటికీ ఇక్కడకు పనిగట్టుకుని మరీ వస్తుంటారు. ఈ పబ్లో గుహల్లోని బార్లు మాత్రమే కాకుండా, దీనిలో నేల దిగువన సొరంగం కూడా ఉంది. ఈ పబ్ ప్రాంగణంలో చక్కని కోట, లోపలి పురాతన వాతావరణం చూస్తే, మధ్యయుగాల్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. ఇది పబ్ మాత్రమే కాదు, మ్యూజియం కూడా అని ఇక్కడకు వచ్చే పలువురు సందర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కారు! చూస్తే చిన్నసైజు కొండలా..!) -
ఈ మార్పు మంచికేనా?
ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది. రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు. మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్ రాయబారి వెల్లడించడం గమనార్హం. ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి. నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది. అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన. ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది. పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం. జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు. -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు
జెరూసలేం: విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో ప్రయోగాత్మకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇజ్రాయెల్లో బెన్నెట్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించింది. రద్దు ప్రతిపాదనను గురువారం పార్లమెంటు ఆమోదించింది. దీంతో నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవి కోల్పోయారు. విదేశాంగ మంత్రి యాయెర్ ల్యాపిడ్ ఎన్నికల వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. 2021 మార్చిలో ఆఖరిసారిగా ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంటుకి నాలుగేళ్లలోనే నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. -
వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్
ఇజ్రాయెల్: బైజాంటైన్ యుగంనాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల వైన్ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్కి దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. (ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) క్రీస్తూ శకం 70లలో జెరుసలేం నాశనమైన తరనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్ కాంప్లెక్స్లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది. ఈ వైన్ని గాజా, అష్కెలోన్ వైన్ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వాకల్లో రెండు వేల ఏళ్లనాటి పర్షియన్ కాలపు వైన్లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు. (చదవండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!) -
2700 నాటి పురాతన టాయిలెట్.. ఎలా ఉందంటే?
జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్రూమ్లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే. చదవండి: Taliban: సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం -
తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల కోడిగుడ్డు లభ్యం
జెరూసలేం: ఇజ్రాయెల్లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజులకే చెడిపోతున్న తరుణంలో వేయి సంవత్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భద్రంగా ఉందో కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్బుక్లో ఒక వివరణాత్మక పోస్ట్ను షేర్ చేశారు. ఇజ్రాయెల్లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొరకడం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పురవాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. -
జెరూసలెంలో తిరిగి తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ ఓపెన్ అయింది. ఇజ్రాయెల్ పోలీసు పర్యవేక్షణలో నేడు 50 మంది యూదు సందర్శకులు టెంపుల్ మౌంట్ ను సందర్శించారు. ఇజ్రాయెల్- గాజాను పాలిస్తున్న హమాస్ సంస్థ మధ్య కాల్పుల విరమణ జరిగిన మూడు రోజుల తర్వాత మొదటి సారిగా వారు టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్లారు. మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య జరిగిన 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని ఇరు ప్రాంతాలకు పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యులు శనివారం ఒక ప్రకటనలో ‘హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం ప్రకటించారు. అలాగే, పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది. మే 10న గాజా స్ట్రిప్ను పాలిస్తున్న హమాస్ మొదటి సారి దాడి చేయడంతో ఇజ్రాయెల్ రక్షణ చర్యలలో భాగంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఇజ్రాయెల్ లో ఎక్కువ ప్రాణ ఐరన్ డోమ్ అనే క్షిపణి నిరోదక వ్యవస్థ రక్షించింది. చదవండి: రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్ -
జెరూసలేంలో రణరంగం: 20 మంది మృతి
జెరూసలేం: పవిత్ర నగరం జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంగణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్ పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరోవైపు 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు. ఏడుగురు ఇజ్రాయిల్ పౌరులు కూడా గాయాలపాలైనట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాల్లో అల్–అక్సా మసీద్ కూడా ఒకటి. రంజాన్ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనావాసులు వస్తుంటారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తూర్పు జెరూసలేం శివారులోని షేక్ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆగ్రహంతో రగిలిపోతు న్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థనల సందర్భంగా ఇజ్రాయిల్ పోలీసులపై విరుచుకుపడ్డారు. మసీదు బయట గస్తీ కాస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ప్రతిదాడికి దిగా రు. అల్–అక్సా ప్రాంగణం రణరంగాన్ని తలపిం చింది. పాలస్తీనా ప్రజల విషయంలో ఇజ్రాయిల్ తీరును అంతర్జాతీయ సమాజం తప్పుపడుతోంది. విమాన దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు అల్–అక్సా మసీదు కాంపౌండ్ నుంచి ఇజ్రాయిల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గాజాలోని హమాస్ మిలిటెండ్ సంస్థ డిమాండ్ చేసింది. అనంతరం జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు వినిపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఉత్తర గాజా స్ట్రిప్లో పేలుడు భారీ పేలుడుతో సోమవారం ఉత్తర గాజా స్ట్రిప్ వణికిపోయింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు ప్రకటించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా వైమానిక దాడులకు దిగామని ఇజ్రాయిల్ తెలిపింది. చదవండి: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి -
ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం
‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రకటించాడు. అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!! ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది. క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది. అది సమాప్తమే... కాని అంతం కాదు... శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది. శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే. ఆరున్నర అడుగుల ప్రభువు యూదుల అత్యున్నత చట్టసభ సన్ హెడ్రిన్లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41). ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్ పేర్కొంది. ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్ టూంబ్’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్ రాబిన్సన్ అనే అమెరికన్ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్ రీసెర్చ్ ఇన్ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్ టూంబ్’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది. ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సువార్త ప్రబోధకులు -
తెరిచిన సూళ్లను మళ్లీ మూసివేస్తున్నారు
జెరూసలెం : ఇజ్రాయెల్లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కాగా మే మొదటివారంలోనే ఇజ్రాయిల్లో పాఠశాలలు తెరిచారు. అయితే కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న చోట తెరిచిన స్కూళ్లను మళ్లీ మూసేస్తున్నారు. గురువారం ఇజ్రాయిల్లోని రెండు ప్రాంతాల్లో మరో 20 స్కూళ్లను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఒకే పాఠశాలలో 301 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారీన పడినట్లు తేలింది. వీరంతా వైరస్ బారిన పడటం వల్ల మరో 13,696 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. (వలస కార్మికులతో క్రైమ్ పెరుగుదల!) కాగా మూసివేసిన పాఠశాలల్లో టెల్ అవీవ్లో ప్రాంతం నుంచే రెండు ఉన్నాయి, ఇక్కడి పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు సహా అనేక మంది విద్యార్థులు కోవిడ్-19 పాజిటివ్గా నిర్థారింపబడ్డారు. కాగా సఫేద్ నగరంలోని స్కూల్ సిబ్బందిలో ఒకరితో పాటు వ్యాన్ డ్రైవర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్కూల్లోని దాదాపు 250 మంది విద్యార్థులతో పాటు సిబ్బందిని కూడా హోం క్వారంటైన్కు తరలించారు.దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్ధేశంతో పాఠశాలలు తెరవాలని నెల క్రితం అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రెండు నెలల తర్వాత తరగతులు ప్రారంభం కాగా ప్రతీ విద్యార్థితో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరగతి గదుల్లో కఠినమైన పరిశుభ్రత పద్దతులను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు(మే 3న) 60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రమంగా ఆ సంఖ్య ఫుంజుకున్నా క్రమేపీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలను మూసివేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్లో 17,495 కరోనా కేసులు నమోదవ్వగా 291 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2191గా ఉంది. (జూలై నెలాఖరుకు 1.5 లక్షల కేసుల నమోదు) -
దురాక్రమణకు ట్రంప్ వంతపాట
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన రెండేళ్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ప్రయోజనం కలిగించే మరో నిర్ణయం తీసుకున్నారు. వెస్ట్బ్యాంక్ను ఆక్రమించి అక్కడ ఇజ్రాయెల్ ఏర్పాటుచేసిన ఆవాసాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణ మైనవేనని గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మంగళవారం ప్రకటించారు. 1978లో వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ నిర్మాణాలు మొదలెట్టినప్పుడు ఆ చర్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతుందని, తక్షణం దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో హెచ్చరించాయి. అప్పట్లో ప్రపంచ ప్రజానీకం అభీష్టాన్ని మన్నించి ఆనాటి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జిమ్మీ కార్టర్ సైతం ఇజ్రాయెల్ చర్య చట్టవిరుద్ధమని ప్రకటించారు. అమె రికా–ఇజ్రాయెల్ దేశాలది జన్మజన్మల బంధం. డెమొక్రాట్ల ఏలుబడిలో ఉన్నా, రిపబ్లికన్లు అధికా రంలో ఉన్నా అది కొనసాగుతూనే ఉంటుంది. కానీ డెమొక్రాట్లతో పోలిస్తే రిపబ్లికన్లు ఇజ్రాయెల్తో అంటకాగడం అధికం. కార్టర్ అనంతరం అధికారంలోకొచ్చిన రిపబ్లికన్ రోనాల్డ్ రీగన్ కూడా కార్టర్ నిర్ణయాన్ని సవరించడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ఇజ్రాయెల్ చర్య ‘చట్టవిరుద్ధం’ అనడాన్ని వ్యతిరేకించి అది ‘అక్రమం’ మాత్రమేనని చెప్పారు. 2016లో బరాక్ ఒబామా మరో అడుగు ముందు కేసి ఇజ్రాయెల్ చట్టవిరుద్ధ ఆవాసాలకు స్వస్తి పలకాలని కోరే భద్రతామండలి తీర్మానాన్ని వీటో చేసే సంప్రదాయాన్ని సైతం మార్చారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విధానాన్ని ట్రంప్ అడ్డగోలుగా రద్దు చేశారు. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో ఉన్న యూదు ఆవాసాలపైనే ఇజ్రాయెల్, పాల స్తీనాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ చట్టవిరుద్ధ ఆవాసాల సమస్య ఆ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు... మొత్తంగా పశ్చిమాసియాలో కల్లోలం రేపుతోంది. ఈ విషయంలో రెండు దేశాలనూ చర్చలకు ఒప్పించి సుస్థిర శాంతి స్థాపించాలన్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మోకా లడ్డుతోంది. రెండేళ్లక్రితం బెంజిమిన్ నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా భూభాగంలోని వివాదాస్పద ఆవాసాలకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. తనకు సార్వభౌమాధికారం లేని ప్రాంతాలపై ఇలా ఇష్టానుసారం చట్టాలు చేయడం తగదని ఎందరు చెప్పినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. ఈ చర్యకు ట్రంప్ లోపాయికారీ మద్దతు ఉన్నదని ఆరో పణలొచ్చినా ఆయన స్పందించలేదు. ఇన్నాళ్ల తర్వాత అమెరికా వైఖరి మారిందంటూ ప్రకటించి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క ఇరు దేశాల మధ్యా సంధి కుదిర్చి, శాంతి స్థాపనకు పాటుపడతామని చెబుతూ వచ్చిన అమెరికా ఇలా ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని భగ్గున మండించే చర్యకు ఎందుకు దిగజారిందన్నది చూడాలి. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడం కోసం ట్రంప్ ఈ ఎత్తు వేశారు. అమెరికాలో ఉన్న యూదు ఓట్లు ఒక్క కలంపోటుతో సొంతం చేసుకోవచ్చునన్నది ఆయన ఎత్తుగడ సారాంశం. అదే సమయంలో ఇజ్రాయెల్లో జరిగిన రెండు వరస ఎన్నికల్లో మెజారిటీ దక్కక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నెతన్యాహును ఏదో మేరకు గట్టెక్కించడానికి ఇది తోడ్పడుతుందన్న అభిప్రాయం ట్రంప్కు ఉంది. ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని నెతన్యాహు పాకులాడుతున్నా ఇజ్రాయెల్లోని మరో ప్రధాన పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీ ససేమిరా అంటున్నది. మరోపక్క అవినీతి కేసులు నెతన్యాహును వెంటాడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం తన ప్రయత్నం పర్యవసానమేనని చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందాలని నెతన్యాహు చివరి ప్రయత్నం చేస్తున్నారు. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరుసలేం ప్రాంతాలు రెండింటినీ 1967నాటి పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించింది. దాదాపు 7 లక్షలమంది ఇజ్రాయెల్ పౌరులను అక్కడకు తరలించి ఆవా సాలు ఏర్పరుచుకోవడానికి సహకరించింది. అప్పట్లో ఆరురోజులపాటు సాగిన యుద్ధంలో పాల స్తీనాకు చెందిన ఈ రెండు ప్రాంతాలతోపాటు సిరియాలోని గోలన్హైట్స్, ఈజిప్టులో భాగంగా ఉన్న సినాయ్ ద్వీపకల్పం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈజిప్టుతో 1979లో ఒప్పందం కుదిరాక సినాయ్లో ఏర్పాటు చేసిన 18 ఆవాసాలనూ కూల్చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ నిష్క్ర మించింది. అలాగే గాజాలోని 21 సెటిల్మెంట్లను, వెస్ట్బ్యాంక్లోని నాలుగింటిని సైతం 2005లో వదులుకుంది. అయితే ఈ ప్రాంతాలను అంతర్జాతీయ అభిశంసనలకు జడిసి, లాంఛనంగా విలీనం చేసుకోలేదు. దురాక్రమించినవాటని ఖాళీ చేయాల్సిందేనని ఐక్యరాజ్యసమితి అనేకసార్లు ఇజ్రా యెల్కు తెలియజేసింది. 2004లో అంతర్జాతీయ న్యాయస్థానం సైతం తప్పుబట్టింది. అంతర్జాతీయ వేదికలు తరచు చెప్పే హితవచనాలను తలకెక్కించుకోని ఇజ్రాయెల్, తన దురాక్రమణకు వ్యతి రేకంగా ఉద్యమించిన పాలస్తీనా పౌరులపై బాంబుల వర్షం కురిపించి వందలమంది ఉసురు తీస్తోంది. ‘ఆత్మరక్షణ’ కోసమే ఈ దాడులని దబాయిస్తోంది. వేరొకరి భూభాగాన్ని కబ్జా చేయ డమేకాక... ప్రశ్నించినవారిని, బయటకు పోవాలన్నవారిని పొట్టనబెట్టుకోవడం ఇజ్రాయెల్ అనుస రిస్తున్న రాజనీతి. తమ ప్రాంతాలకు చొచ్చుకొచ్చి సైనికులను మొహరించి, రహదారులు మూసేసి, చెక్పోస్టులు ఏర్పరిచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై పాలస్తీనావాసులు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్జాతీయ అభిశంసనల పరంపర కారణంగా ఎంతో కొంత తగ్గి ఉన్న ఇజ్రాయెల్ ట్రంప్ తాజా చర్యతో మరింత పేట్రేగుతుంది. ఇదంతా సహజంగానే ఆ ప్రాంతాన్ని రణరంగంగా మారుస్తుంది. నిస్సహాయ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. తమకంటూ ఒక భూభాగం ఏర్పడి, స్వతంత్ర దేశంగా మనగలగాలన్నది పాలస్తీనీయుల చిరకాల స్వప్నం. ఇజ్రా యెల్తో చేతులు కలిపి దానికి భంగం కలిగిస్తున్న అమెరికా చర్యను ప్రపంచ ప్రజానీకం నిరసిం చకమానదు. -
హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది. -
జెరూసలేంలో జగన్ను కలిసిన ఆర్మూర్ వాసులు
సాక్షి, ఆర్మూర్ : జెరూసలెం పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇజ్రాయిల్ తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్కు చెందిన ఆర్మూర్ వాసులు శనివారం కలిసి తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో తన కొడుకుకు వైఎస్సార్ అని నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి వేటలో తాము ఇజ్రాయిల్ వచ్చినా ప్రతీ ఏటా తమ ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న తీరును జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జగన్ను కలిసిన వారిలో అంకాపూర్ తిరుపతిగౌడ్, ప్రశాంత్, కలిగోట్ చరణ్గౌడ్ తదితరులున్నారు. -
ఆగస్టు 1న జెరూసలేంకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్లోని జరూసలేం పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూవా పర్యటనలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇదివరకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చింది. -
పటాలను చూస్తే భయపడి పోతున్న ఇజ్రాయిల్
-
గాలిపటాలు వస్తాయి.. కాల్చి పడేస్తాయి
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే భయపడి పోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా పరిగెడుతున్నారు. గాలి పటాలు చక్కగా ఎగరేయాలి గానీ భయపడటం దేనికి? అనుకుంటున్నారా. అవి మామూలు గాలి పటాలు కాదు మరి.. అడవులను, ఊర్లను తగలపెట్టే నిప్పు పటాలు. అసలు సంగతేంటంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది. చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి ఎగరేసింది. అంతే అలా ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చిసింది. -
దేశాధ్యక్షుడు ‘చికెన్ డాన్స్’ స్టెప్పులు
-
ప్రధాని ‘చికెన్ డ్యాన్స్’.. వీడియో వైరల్
టెల్ అవీవ్, ఇజ్రాయెల్ : సంగీతానికి రాళ్లయినా కరగాల్సిందే..! అనే సామెత మనందరికి తెలుసు. మనసుని ఉర్రూతలూగించే పాటకు ఎవరి పాదమైనా కదలక మానదు. ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. యూరో విజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన నెటా బార్జీలాల్ పాటకు నెతన్యాహు స్టెప్పులు వేశారు. ఓ వైపు ప్రేక్షకుల్ని కట్టిపడేసే బార్జీ పాట.. మరోవైపు నెతాన్యాహు ‘చికెన్ డాన్స్’తో అక్కడున్న వారంతా గుక్క తిప్పుకోలేకపోయారు. బుధవారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన యూరో విజన్ పాటల పోటీ విజేత బార్జీలాల్ సన్మాన కార్యక్రమంలో ఈ విశేషం చోటు చేసుకుంది. ప్రధాని భార్య సారా కూడా పాల్గొన్న ఈ కార్యక్రమ విశేషాలను నెతన్యాహు ట్విటర్లో పంచుకున్నారు. ‘నిజంగా ఇది మర్చిపోలేని రోజు. మీతో ఆడి పాడడం గొప్ప అనుభూతి. దేశం ఖ్యాతి పెంచిన మీకు అభినందనలు’ అంటూ నెతన్యాహు ఆనందం వ్యక్తం చేశారు. యూరో విజన్ విజేత నెటా బార్జీలాల్పై ప్రశంసల వర్షం కురిపించారు. లిస్బన్లో శనివారం జరిగిన యూరోవిజన్ పోటీలో బార్జీలాల్ పాల్గొన్నారు. జపనీస్ వస్త్రధారణతో ఆడిపాడిన 25 ఏళ్ల బార్జీ తన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక పోటీలో విజేతగా అవతరించారు. ‘ఐ యామ్ నాట్ యువర్ టాయ్’అంటూ స్త్రీ సాధికారత ప్రధానంగా సాగిన బార్జీ పాటను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది వీక్షించారు. కాగా, వచ్చే ఏడు యూరో విజన్ పోటీలకు ఇజ్రాయెల్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
ఇజ్రాయిల్ పాలస్తీనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత.. 37మంది మృతి
-
‘డాలర్లతో జెరూసలేంను కొనలేరు’
రమల్లా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్పై పాలస్తీనా నేతలు ఘాటుగా స్పందించారు. ‘మీరు డాలర్లతో కొనడానికి.. జెరూసలేంను మేము అమ్మకానికి పెట్టలేద’ని పాలస్తీనా అధ్యక్షుడు హుమ్మద్ అబ్బాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బ్లాక్ మెయిలింగ్ చర్యలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటికి ప్రతి ఏడాది ఇచ్చే 300 మిలియన్ డాలర్ల నిధుల్లో కోత పెడతానంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిదే. ట్రంప్ హెచ్చరికలపై స్పందించిన ఆ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనూ జెరూసలేంను వదులుకోమని తెగేసి చెప్పింది. జెరూసలేంపై అమెరికా నిర్ణయంతోనే ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలు దెబ్బతిన్నాయని.. ఇప్పుడు కొత్తగా జరిగే నష్టమేమీ లేదని చెప్పడం గమనార్హం. జెరూసలేం అనేది.. పాలస్తీనా శాశ్వత రాజధాని. మా రాజధాని ప్రాంతాన్ని డాలర్లు లేదా బంగారంతో ఎవరూ కొనలేరని మహుమ్మద్ అబ్బాస్ అధికార ప్రతినిధి నబిల్ అబు రెహమాన్ ఘాటుగా సమాధానం చెప్పారు. బ్లాక్ మెయిలింగ్కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగమని పాలస్తీనా ఉన్నతాధికారణి హనమ్ ఆశ్రవి స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో అశాంతి, అల్లర్లు జరగడానికి ట్రంప్ చర్యలే కారణమని ఆమె ఆరోపించారు. ఇదిలావుండగా.. పాలస్తీనా అథారిటీకి నిధులు నిలిపేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ప్రభుత్వం స్వాగతించింది. అమెరికా చర్యలను నిరసించేవారు.. ఆ దేశ నిధులను కూడా వద్దనుకోవాలని ఇజ్రాయిల్ మంత్రి మిరి రెగేవ్ అన్నారు. -
మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ : ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస మంటలు పుట్టిస్తున్నారు. పాకిస్తాన్ను నిధులు నిలిపివేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్.. తాజాగా పాలస్తీనాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేను గుర్తించే విషయంపై ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. పాలస్తీనాకు నిధులు నిలిపేస్తామంటూ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వరుస ట్వీట్లతో ఆ దేశంపై విరుచుకుపడ్డారు. ప్రతి ఏడాది వందల మిలియన్ డాలర్ల సహాయాన్ని తీసుకుంటూ.. అమెరికాపై ఏ మాత్రం గౌరవం చూపడం లేదని అన్నారు. ఇజ్రాయిల్తో శాంతి చర్చలను కొనసాగించేందుకు సూతం పాలస్తీనా అథారిటీ ఆసక్తి చూపడం లేదన్నారు. పాలస్తీనా అథారిటీ శాంతిని కోరుకోవడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో వారికి సహాయ నిధులు అందించాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రరాజ్యం ప్రతి ఏడాది పాలస్తీనా అథారిటీకి 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది. అదే ఇజ్రాయిల్కు 3.1 బిలియన్ల సైనిక సహాయం చేస్తోంది. దీనిని వచ్చే ఏడాది నుంచి 3.8 బిలియన్ డాలర్లకు పెంచుతంది. ఇదిలావుండగా.. జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా అథారిటీ అగ్రరాజ్యం నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిపించింది. ...peace treaty with Israel. We have taken Jerusalem, the toughest part of the negotiation, off the table, but Israel, for that, would have had to pay more. But with the Palestinians no longer willing to talk peace, why should we make any of these massive future payments to them? — Donald J. Trump (@realDonaldTrump) January 2, 2018 -
ఇదే మంచి తరుణం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాతో ద్వైపాక్షి సంబంధాలను మరింత ధృఢతరం చేసుకోవడానికి భారత్కు ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్న కారణంతో అమెరికా ఆ దేశానికి నిధులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి లేదని ఆయన అన్నారు. భారత్ వెంటనే తన రాయబార కార్యలయాన్ని టెల్ అవైవ్ నుంచి జెరూలసలేంకు మార్చడం మంచిదని ఆయన మరోసారి సూచించారు. ఈ చర్యతో పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టడంతో పాటు.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మరింత దగ్గరకావొచ్చన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు 15 ఏళ్లుగా అమెరికా లక్షలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా.. ఆ దేశం తమకు అబద్దాలను చెప్పిందన్న ట్రంప్ ట్వీట్ను సుబ్రమణ్య స్వామి స్వాగతించారు. అమెరికా ఇప్పటికైనా నిజాలు గ్రహించిందని వ్యాఖ్యానించారు. -
‘మరో 10 దేశాలు టచ్లో ఉన్నాయి’
జెరూసలేం : పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా గుర్తించడంతో.. మరో పది దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖమంత్రి టిజిపి హోటెవెలి తెలిపారు. అందులో భాగంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేవిధంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఐరోపా సహా మరికొన్ని దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు. పిలిప్పీన్స్, రొమేనియా, దక్షిణ సూడాన్, హోండూరస్ సహా మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేసందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రారంభమేనని.. త్వరలో మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ఐక్యరాజ్య సమితికి అమెరికా షాక్
న్యూ యార్క్ : జెరుసలేం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోంది. జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. మొదటి షాక్ ఐక్యరాజ్య సమితికే ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు. ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచదేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా షాక్తింది. ఐక్యరాజ్య సమితి సమర్థత, ఆర్థిక అంశాలపై మాకు స్పష్టమైన అవగాహన వుంది.. మేం చేయాలనుకున్నది చేస్తామని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. అమెరికన్ల ప్రేమ, ఔదార్యాన్ని మిగిలిన దేశాలు కూడా ఏంతోకాలం పొందలేవని ఆమె చెప్పారు. ఇదిలావుండగా.. సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్ నిధులను నిలిపేస్తున్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు. ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతుల లభించింది. సర్వసభ్య సమావేశం తరువాత నిక్కీ హేలీ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు.. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అనంతరం నిధుల కోతపై నిక్కీ హేలీ రోజుల వ్యవధిలోనే ప్రకటించడం గమనార్హం. -
క్రిస్మస్ వేడుకలపై ట్రంప్ ప్రకటన ప్రభావం
బెత్లహాం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడాదీ డిసెంబరు 24 అర్ధరాత్రి క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు చేస్తారు. స్థానికులే కాకుండా పలు దేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. ట్రంప్ నిర్ణయంతో పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హింసకు భయపడే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడకు రాలేదని ఓ ఆర్చ్బిషప్ చెప్పారు. -
జెరూసలెం యాత్రకు సహకారం
-
జెరూసలెం యాత్రకు సహకారం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులతో, రంజాన్ సమయంలో ముస్లింలతో, బోనాలు, బతుకమ్మ సందర్భంగా హిందువులతో ఉత్సవాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని శుక్రవారం నిజాం కాలేజీ మైదానంలో క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి సభికులనుద్దేశించి మాట్లాడారు. ‘‘రాజధాని నగరంలో క్రైస్తవ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ భవన నిర్మాణం నా కల. వచ్చే క్రిస్మస్ కల్లా ఆ భవనాన్ని కచ్చితంగా నిర్మించి తీరుతాం. ఇక్కడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచిస్తున్నా. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై స్వయంగా పరిశీలిస్తా. క్రైస్తవులకు పవిత్ర స్థలమైన జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వాలని కొందరు క్రైస్తవ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు నన్ను చాలాసార్లు అడిగారు. తప్పకుండా వారి కోరిక తీరుస్తా. అతి త్వరలో ఈ పథకానికి సంబంధించిన పాలసీ ప్రకటిస్తా. చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు నా వద్ద వందకుపైగా ప్రతిపాదనలు తెచ్చారు. వాటిని పూర్తి చేయడానికి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. తప్పకుండా ఆ దరఖాస్తులను పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. అవేగాకుండా కొత్తగా వచ్చే దరఖాస్తులను సైతం వీలైనంత త్వరలో పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. గతంలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళన ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆందోళన లేదని, మూడేళ్లుగా ఎలాంటి దాడులు జరగడం లేదని చాలామంది పాస్టర్లు, బిషప్లు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’’అంటూ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వికృతంగా రాజకీయాలు రాష్ట్రంలో రాజకీయాలు వికృత రూపం దాల్చాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్ష పార్టీలంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొనడం బాధగా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులపై 196 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. క్రైస్తవ భవన్పైనా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. అయినా ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి వచ్చే పండుగకల్లా ప్రారంభిస్తాం. పండుగ పూట వస్త్రాలు, గిఫ్ట్ల పంపిణీని తక్కువగా చూడొద్దు. గిఫ్ట్ ప్యాక్లో ఉన్న కానుకను ఆర్థిక విలువతో చూడొద్దు. పేదవాడి కోణంలో చూడాలి. పండుగ పూట పేదవాడు సైతం ఆనందంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉందన్న భరోసా ఇవ్వడానికి వాటిని పంపిణీ చేస్తున్నాం’’అని అన్నారు. ‘‘జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ త్వరలో హైదరాబాద్కు రానున్నారు. పర్యాటక అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఆమె ఉదయమే ఫోన్లో మాట్లాడారు. ‘ముస్లిం ముఖ్యమంత్రినైన నేను మా రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహించలేదు. కానీ మీరు మాత్రం తెలంగాణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’అని ఆమె అన్నారు. ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల దేశమంతా ఇదే అభిప్రాయం ఉండాలని కోరుకున్నా’’అని సీఎం వివరించారు. రాష్ట్రంలోని 70 శాతం ప్రజలకు తాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని, ఈ సాయంత్రమే సమాచారం వచ్చిందని తెలిపారు. త్వరలో హరిత తెలంగాణను చూడనున్నారని, రాష్ట్ర ప్రజల కల సాకారం కానుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశిష్ట సేవలందించిన క్రైస్తవులు, సంస్థలకు సీఎం అవార్డులు అందించారు. -
ఏకాకి అమెరికా!
పాలస్తీనా విషయంలో ప్రపంచ ప్రజాభీష్టాన్నీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలనూ బేఖాతరు చేసిన అమెరికా చివరకు ఏకాకిగా మిగిలింది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా పరిగణించి, అక్కడకు తమ దౌత్య కార్యాలయాన్ని తరలించాలని ఈ నెల 6న ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి అత్యవసర సర్వసభ్య సమావేశం గురువారం వ్యతిరేకించింది. ఆ విషయంలో చాన్నాళ్లకిందట భద్రతా మండలి చేసిన తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. తీర్మానం నెగ్గకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇంతకుముందే భద్రతామండలి ముక్త కంఠంతో ఆ నిర్ణ యాన్ని వ్యతిరేకించగా, తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకుని అమెరికా దాన్నుంచి బయటపడింది. సమితిలో వీటో కుదరదు గనుక బెదిరింపులే మార్గ మనుకుంది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా రావడం వల్లే ఈ బెదిరింపుల సంస్కృతి మొదలైందని అనుకోనవసరం లేదు. తన మాటే నెగ్గాలనుకున్నప్పుడు ఒత్తిళ్లు తీసుకురావడం, బెదిరించడం, అవసరమైతే బలప్రయోగానికి పాల్పడటం అమెరికాకు కొత్త కాదు. దశాబ్దాలుగా సామ, దాన, భేద, దండోపాయాల్లో అది ఆరితేరింది. అయితే ఇప్పుడు కొత్తగా జరిగిందేమంటే... అమెరికా నిర్ణయాన్ని ఖండించే తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 128 దేశాల్లో దానికి అత్యంత విశ్వసనీయమైన దేశాలున్నాయి. ఆప్త దేశాలున్నాయి. ఆ దేశాలకు సైతం అమెరికా నిర్ణయం రుచించలేదంటే ప్రపంచ వేదికపై అదెంత ఏకాకిగా మిగిలిందో అర్ధం చేసుకోవచ్చు. ఓటింగ్ నుంచి గైర్హాజరైన 35 దేశాలు సైతం అమెరికాను సమ ర్ధించినట్టు కాదు. అందులో ఆస్ట్రేలియా, కెనడా మినహా మిగిలినవన్నీ దాదాపు చిన్న దేశాలు. చూస్తూ చూస్తూ అమెరికాను వ్యతిరేకించలేక, అలాగని దాని నిర్ణ యానికి వంతపాడే నైతిక ధైర్యాన్ని ప్రదర్శించలేక అవి గైర్హాజరు నిర్ణయం తీసు కున్నాయి. మరో 21 దేశాలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన లేదు. ఏతావాతా ఇజ్రా యెల్, మరో 8 దేశాలు మాత్రం అమెరికా పక్షాన చేతులెత్తాయి. అసలు తీర్మానాన్ని రూపొందిం చిన ఈజిప్టు, దాన్ని బలపరిచిన ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ), అరబ్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలే. అమెరికా తీసుకున్న అన్ని చర్యలకూ వెనకా ముందూ చూడకుండా మద్దతు పలికే బ్రిటన్ సైతం ఈసారి దాన్ని వ్యతిరేకించింది. మన దేశం సైతం పాలస్తీనా విషయంలో గత విధానాలనే కొనసాగించింది. అయితే సమితి చేసిన తీర్మానాన్ని చూస్తే దాని దయనీయ స్థితి అర్ధమవు తుంది. జెరూసలేంపై ఇటీవలి పరిణామాలకు అది ‘తీవ్ర విచారాన్ని’ వ్యక్తం చేసింది. ఆ పరిణామాలకు కారకులెవరో, వారి చర్య గతంలోని సమితి నిర్ణయా లకు, స్ఫూర్తికి ఎలా విరుద్ధమో చెప్పడానికి దానికి నోరు రాలేదు. ఈ పనే మరో దేశం చేసి ఉంటే దాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలిపేవారు. ఆంక్షలతో కష్ట పెట్టేవారు. సమితిలో తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందూ, తర్వాతా అమె రికా వ్యవహరించిన తీరు అనాగరికంగా ఉంది. ఈ ఓటింగ్ను ట్రంప్, అమెరికా కూడా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా పరిగణిస్తున్నట్టు్ట నిక్కీ హేలీ అన్ని దేశాలకూ లేఖలు రాశారు. ప్రతి ఒక్క ఓటునూ పరిశీలించి ఏ దేశం ఏం చేసిందో అధ్యక్షుడు తెలు సుకుంటారని, తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఓటింగ్ పూర్తయ్యాక సైతం ఆమె ఆ ధోరణి నుంచి బయటకు రాలేదు. ట్రంప్ తీరు గురించి చెప్ప నవసరమే లేదు. మాకు వ్యతిరేకంగా సమితి తీర్మానిస్తే అందువల్ల మా దేశానికి ‘చాలా మిగులుతుందం’టూ నర్మగర్భ వ్యాఖ్య చేశారు. సమితికిచ్చే నిధుల్ని ఆపే స్తామన్నది ఆయన హెచ్చరిక సారాంశం! నిక్కీ హేలీ మాటల్లోనూ ఈ మాదిరి బెది రింపే ఉంది. ‘మేమెంతో ఔదార్యంతో సమితికి నిధు లందిస్తున్నాం. మా సుహృ ద్భావాన్ని గుర్తించి గౌరవించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మా పెట్టుబడిని వేరేచోట వినియోగిస్తామ’ని ఆమె అల్టిమేటం జారీచేశారు. ట్రంప్, హేలీ బెదిరింపులు ఆచరణలోకొస్తే సమితికి, వివిధ దేశాలకు నిధుల కొరత ఏర్పడే మాట నిజం. నిరుటి గణాంకాల ప్రకారం సమితికోసం సభ్య దేశాల్లో అత్యధికంగా నిధులందిస్తున్నది అమెరికాయే. అది ఏటా 1,000 కోట్ల డాలర్లకు పైగా నిధులు ఇస్తోంది. సమితి బడ్జెట్లో ఇది అయిదోవంతు. ఇందులో 600 కోట్లు ఐచ్ఛికంగా... మిగిలిన మొత్తం సమితి పనితీరు మదింపు తర్వాత విడుదల చేయడం రివాజుగా వస్తోంది. ఇదిగాక సబ్ సహారా దేశాలకు ఆర్ధిక, సైనిక సాయం 1,300 కోట్ల డాలర్లుంటుంది. తూర్పు ఆసియా, మహాసముద్ర ప్రాంత దేశాలకు 160 కోట్ల డాలర్లు సహాయం అందిస్తుంది. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలకు 1,300 కోట్ల డాలర్లు... దక్షిణ, మధ్య ఆసియా దేశాలకు 670 కోట్ల డాలర్లు... యూరప్, యూరేసియా దేశాలకు 150 కోట్ల డాలర్లు, పశ్చిమార్ధ గోళ దేశాలకు 220 కోట్ల డాలర్లు అమెరికా సహా సంస్థ యూఎస్ ఎయిడ్ ద్వారా వెళ్తుంది. ఈ డబ్బంతా అది పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో అందిస్తున్నది కాదు. ఆయా దేశాల్లో తనకుండే ప్రయోజనాలేమిటో లెక్కచూసుకుని ఇస్తున్నదే. అమెరికా తాజా పోకడలతో ప్రపంచం ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధా నాలు తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. పాలస్తీనా చిక్కుముడి మరింత జటిలంగా మారింది. జెరూసలేం పశ్చిమ ప్రాంతానికి తమ దౌత్య కార్యాలయాన్ని తరలి స్తామన్న ట్రంప్ ప్రకటనకు పోటీగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తూర్పు జెరూస లేంలో ఇకపై తమ దౌత్య కార్యాలయం ఉంటుందని చెప్పారు. అదే బాటలో మరి కొన్ని దేశాలు వెళ్లినా ఆశ్చర్యం లేదు. పాలస్తీనా విషయంలో ఇక అమెరికాను మధ్య వర్తిగా పరిగణించబోమని 50 ముస్లిం దేశాలు ప్రకటించాయి. అమెరికా మరింత నగుబాటుపాలు కాకూడదనుకుంటే ఆ దేశ ప్రజానీకం తమ అధ్యక్షుడి చర్యల్ని నిలదీయాలి. తమ ప్రభుత్వం మెడలు వంచి వియత్నాం దురాక్రమణ యుద్ధాన్ని ఆపించిన వెనకటి తరం చేవను గుర్తుచేసుకోవాలి. -
ముస్లిం ప్రపంచం నుంచి ప్రతిఘటన తప్పదు
లాహోర్ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్.. అమెరికాపై మరోసారి విషంకక్కాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన హఫీజ్.. అమెరికాపై రాజకీయ వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా జెరూసలేంపై అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది పాలస్తీనా భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తుందని ధ్వజమెత్తాడు. జమాతే ఉద్ దవా, లష్కే తోయిబా ఉగ్రవాద సంస్థల వ్యవస్థాపకుడైన హఫీజ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై గతంలోనూ విరుచుకుపడ్డాడు. తాజాగా జెరూసలేంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆమెరికాను పాకిస్తాన్ సహా అన్ని ముస్లిం దేశాలకు శత్రువుగా పరిగణిస్తామని చెప్పాడు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించడం అనేది మధ్యప్రాచ్యం, మొత్తం ప్రపంచాన్ని అస్థిరతకు గురి చేస్తుందన్నాడు. ఈ క్రమంలో మొత్తం ముస్లిం ప్రపంచం పాలస్తీనాకు అండగా నిలుస్తాయని.. అవసరమైతే యుద్ధం చేసేందుకైనా సిద్ధమని హఫీజ్ అమెరికాను హెచ్చరించాడు. ఇజ్రాయిల్ అనేది ఒక క్యాన్సర్ వ్యాధి అని.. ఈ రోగం దాదాపు అర్ద శతాబ్దం నుంచి పాలస్తీనా ముస్లింలను పీడిస్తోందని అన్నాడు. ఒక్క ఇజ్రాయిల్ వల్ల మొత్తం ప్రపంచమంతా అస్థిరత్వంలో పడుతోందన్నాడు. పాలస్తీనా ముస్లింలపై ఇజ్రాయిల్ ప్రయోగించిన రసాయన ఆయుధాల గురించి ప్రపంచం మర్చిపోయిందని.. ముస్లిం ప్రపంచానికి ఇంకా ఆ విషయం గుర్తుందని హఫీజ్ సయీద్ చెప్పాడు. -
అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి. భారత్తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి. -
జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి. 50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవద్దని కోరింది. ఈ అంశంపై సోమవారం జరిగిన ఓటింగ్లో అమెరికా వీటో హక్కు ప్రయోగించడాన్ని ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ సమర్థించారు. తమ దౌత్య కార్యాలయం టెల్అవీవ్లోనే కొనసాగుతుందని బ్రిటన్ స్పష్టం చేసింది. -
ఉద్యమ నేత కాల్చివేత...
జెరూసలేం : పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వీల్ చైర్లో ఉన్న అబును ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాల్చటంపై పాలస్తీనీయులను మండిపడుతున్నారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే... పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే తిరిగి ఆందోళనలు మొదలయ్యాయి. చేపలు పట్టుకుని జీవించే తురాయా 2008లో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్చైర్కు పరిమితం అయ్యారు. అయినా కార్లు తుడుచుకుంటూ ఆయన హక్కుల పోరాటంలో పాల్గొనేవారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రతీ ప్రదర్శనలోనూ ఆయన ముందుంటారు. అప్పుడు కాళ్లు మాత్రమే కోల్పోయిన ఆయన.. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో ఏకంగా ప్రాణమే పొగొట్టుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రగులుతున్న పాలస్తీనా... తురాయ మరణ వార్త తెలుసుకోగానే మొత్తం పాలస్తీనీయులు భగ్గుమన్నారు. ఆయనను కాల్చి చంపిన వీడియోలు కొన్ని సోషల్ మీడియలో వైరల్ కావటంతో ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహణకు పెద్ద ఎత్తున్న ప్రజలు హాజరయ్యారు. రెండు రోజుల నుంచి రోడ్లపై ఆందోళన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన రెండు రోజుల ముందు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పాలస్తీనీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ‘‘ఇది(జెరూసలేం) మన భూమి.. వదిలే ప్రసక్తే లేదు. అమెరికా తన ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన మరణం ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించకపోవటం విశేషం. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదంలో మరో మలుపు -
'ట్రంప్ ఓ కుక్క.. ఇక మీపై బాంబుల వర్షమే..'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడంపై ఓ పక్క ముస్లిం దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుండగా ఏకంగా అమెరికాపై బాంబులు వేస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. అమెరికాపై వరుస దాడులకు పాల్పడతామంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ వివరాలు మాత్రం తెలియజేయలేదు. జెరూసలేంను ట్రంప్ ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయంపై అటు పాలస్తీనీయన్లతోపాటు ఇతర ముస్లిం దేశాల వాళ్లు యురోపియన్ దేశాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఓ టెలిగ్రాం విడుదల చేసింది. 'మాకోసం ఎదురు చూడండి. ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు మన్హట్టన్లో ఉంది' అంటూ అందులో పేర్కొంది. 'ఇరాక్, యెమెన్, లిబియా, సిరియా, అస్ఘనిస్థాన్లో మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అదే మేం చేయనున్నాం. కాస్త ఎదురుచూడండి. మీ కుక్క(డోనాల్డ్ ట్రంప్) జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాడు. అందుకే మీ రాజధానిపై బాంబులు కురిపించి మేం గుర్తింపునిస్తాం' అంటూ హెచ్చరించింది. -
జెరూసలేం పాలస్తీనాదే..!
ఇస్తాంబుల్: ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు ప్రపంచానికి పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్(ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొన్న ఆ డిక్లరేషన్లో ‘ ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరుతున్నాం’ అని అన్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, అది శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియలో అమెరికా పాత్రను ఇకపై తమ ప్రజలు అంగీకరించబోరని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను ఇకపై ఐక్యరాజ్య సమితి చేపట్టాలని, అమెరికా ఆ అర్హత కోల్పోయిందన్నారు. జెరూసలేంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ ఉగ్రదేశమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. -
మూడు మతాల పవిత్రం.. వందేళ్ల అగ్ని గుండం
జెరూసలేం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు రగుల్చుతున్న అంశమిది. మూడు మతాలకు అత్యంత పవిత్రమైన ఈ నగరం దాదాపు వందేళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పోరు సాగుతోంది. ఐక్యరాజ్యసమితి కల్పించుకున్నా తేలని ఈ వివాదాల తేనెతుట్టెను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కదిలించారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తామంటూ ఆయన ప్రకటించడంతో.. పశ్చిమాసియాలో అలజడి రేగింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి ఖండించింది. అసలు జెరూసలేం వివాదం ఏమిటి? ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలేమిటనే అంశాలపై ఈ వారం ‘ఫోకస్’.. ఆటోమన్ చక్రవర్తుల పాలనలో... ప్రస్తుత ఇజ్రాయెల్, వెస్ట్బ్యాంక్ల మధ్య సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం జెరూసలేం నగరం. 1517 నుంచి 1917 వరకు ‘ఆటోమన్’ ముస్లిం చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జుడాయిజం, ఇస్లాం మతాలకు సంబంధించి పవిత్రంగా భావించే కట్టడాలు, ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్లే ఈ నగరం ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై వందేళ్లుగా వివాదం రగులుతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఈ నగరాన్ని తమ రాజధానిగా చేయాలని కోరుకుంటున్నాయి. నగరాన్ని ఇరు దేశాల మధ్య పంచాలని భావించినా.. ఏ విధంగా విభజించాలనేది ప్రధాన సమస్యగా మారింది. వందేళ్ల క్రితం..: బ్రిటిష్ జనరల్ ఎడ్మండ్ అలెన్బీ వందేళ్ల క్రితం 1917 డిసెంబర్ నెలలోనే ఆటోమన్ తుర్కు పాలకుల నుంచి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1917–48 మధ్య ఈ ప్రాంతం జెరూసలేం రాజధానిగా బ్రిటిష్ పాలనలో ఉండిపోయింది. అప్పటి నుంచి జెరూసలేంపై పట్టు కోసం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రయత్నించారు. ఆ సమయంలోనే పెద్ద సంఖ్యలో యూదులు జెరూసలేం ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. చివరికి అక్కడే తమ రాజ్యాన్ని స్థాపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యూదుల వలసలను పాలస్తీనియన్లు వ్యతిరేకించడంతో ఉద్రిక్తత తలెత్తింది. 1947 యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి యూదులు, అరబ్లకు చెరో ప్రాంతాన్ని కేటాయిస్తూ.. జెరూసలేంను ‘ప్రత్యేక విదేశ పాలన’ కిందకు తీసుకొచ్చింది. అమెరికా దన్నుకు కారణాలెన్నో.. భారీగా చమురు నిల్వలున్న ధనిక దేశం సౌదీ అరేబియా సహా అనేక అరబ్ దేశాలతో అమెరికాకు సత్సంబంధాలున్నా.. పాలస్తీనా వివాదంలో ఇజ్రాయెల్కే మద్దతుగా నిలవడానికి పలు కారణాలున్నాయి. అమెరికా ప్రజల్లో ఈ యూదు రాజ్యమంటే సానుభూతి ఎక్కువ. ఇజ్రాయెల్లో కన్నా అమెరికాలోనే యూదు జనాభా ఎక్కువ. అక్కడి యూదు లాబీ పలుకుబడి ప్రభుత్వ విభాగాలన్నిటికీ విస్తరించింది. మరోవైపు పూర్వపు సోవియట్ యూనియన్తో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం పరిణామాలు కూడా అమెరికా ఇజ్రా యెల్ వైపు మొగ్గేలా చేశాయి. 1956లో సూయజ్ కాలువపై ఆధిపత్యం కోసం యుద్ధం జరిగిన సమయంలో.. ఇంగ్లండ్, ఫ్రాన్స్తో కలసి ఈజిప్ట్తో తలపడిన ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు లేదు. అయితే పశ్చిమాసియాలో సోవియట్ యూనియన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయడానికి ఇజ్రాయెల్ను సాధనంగా వాడుకోవాలన్న అమెరికా నిర్ణయం యూదు రాజ్యానికి కలిసొచ్చింది. 1973లో పొరుగు అరబ్ రాజ్యాలు చేసిన మెరుపుదాడి నుంచి ఇజ్రాయెల్ను కాపాడడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అప్పటి నుంచి అమెరికా–ఇజ్రాయెల్ బంధం బలపడింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రంతో.. 1948లో యూదులు ఆటోమన్ రాజ్యంలోని కొంత భాగంలో ఇజ్రాయెల్ పేరిట స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ విభజన ప్రణాళికను సూచించగా.. అరబ్బులు తిరస్కరించారు. ఇజ్రాయెల్పై దాడికి దిగి ఓటమి పాలయ్యారు. 1950లో ఇజ్రాయెల్ జెరూసలేం పశ్చిమ భాగాన్ని రాజధానిగా ప్రకటించుకుంది. పాతనగరంతో పాటు తూర్పు భాగం జోర్డాన్ అధీనంలోకి వెళ్లింది. అయితే ఐక్యరాజ్యసమితి, పాశ్చాత్య దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ తొలుత జెరూసలేంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఇక్కడి పవిత్ర స్థలాలపై ఎవరికీ నియంత్రణ లేకపోవడమే తమకు కలసి వస్తుందని భావించి ప్రత్యామ్నాయ రాజధానిపై దృష్టి నిలిపింది. చాలా దేశాలు టెల్ అవీవ్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే జెరూసలేంపై పట్టుకోసం 1967లో యుద్ధం జరగగా.. ఇజ్రాయెల్ మరోసారి అరబ్ సైన్యాన్ని ఓడించింది. గాజా స్ట్రిప్ను, ఈజిప్ట్ నుంచి సినాయ్ ద్వీపకల్పాన్ని, జోర్డాన్ నుంచి వెస్ట్బ్యాంకును, తూర్పు జెరూసలేంతోపాటు సిరియా నుంచి గోలన్ హైట్స్ను స్వాధీనం చేసుకుంది. తర్వాత చారిత్రక ప్రాధాన్యత రీత్యా జెరూసలేం వైపు మొగ్గి.. 1980లో ఆ నగరాన్ని తమ రాజధానిగా ప్రకటిస్తూ చట్టం చేసుకుంది. రెండు దేశాల విధానం! ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య సంఘర్షణకు పరిష్కారం కనుగొనే దిశలో గాజా, అధికశాతం వెస్ట్బ్యాంక్ ప్రాంతాలతో పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసి... మిగతా ప్రాంతాన్ని ఇజ్రాయెల్కు విడిచిపెట్టేలా ‘రెండు దేశాల’ విధానంపై 1974 ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. అయితే ఆచరణలో దీనిని ఏవిధంగా అమలు చేయాలన్న దానిపై రెండు వర్గాలుగా చీలిపోయాయి. ప్రత్యామ్నాయంగా మొత్తం ప్రాంతాన్ని ఇజ్రాయెల్ లేదా పాలస్తీనా పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను కొన్ని వర్గాలు తెచ్చినా... అది ఆచరణ సాధ్యం కాదని మెజారిటీ పరిశీలకులు తేల్చేశారు. సైద్ధాంతికమే కాదు.. ఆర్థిక బంధం కూడా.. పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్య దేశమైన ఇజ్రాయెల్తో అమెరికా బంధం సైద్ధాంతికమేగాక.. బలమైన ఆర్థిక బంధం కూడా. నిండా కోటి జనాభా లేని ఈ చిన్న దేశానికి అమెరికా సాయం 118 బిలియన్ డాలర్లు దాటిపోయింది. అంటే సగటున ఏటా మూడు బిలియన్ డాలర్ల (సుమారు రూ.19,000 కోట్లు) మేర అమెరికా నుంచి అందుతున్నాయి. అసలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా వీటో చేసిన తీర్మానాల్లో సగానికిపైగా ఇజ్రాయెల్ను అభిశంసిస్తూ చేసినవే. దీనిని బట్టి ఈ రెండు దేశాల మధ్య బంధం ఎంత గాఢమైనదో అంచనా వేయొచ్చు. అసలు అమెరికా తోడ్పాటు లేకుండా అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ ఉనికి సాధ్యమయ్యేది కాదు. బరాక్ ఒబామా హయాంలో అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాలస్తీనా భూభాగంలో యూదులకు స్థిర నివాసాల ఏర్పాటు, ఇరాన్ వంటి అంశాలపై ఒబామా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహూ మధ్య ప్రకటనల యుద్ధం సాగింది. మూడు మతాలకు పవిత్రస్థానం క్రైస్తవులు, యూదులు, ముస్లింలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన ప్రాంతాలు జెరూసలేం నగరంలోనే ఉన్నాయి. ఏసుక్రీస్తు మరణం, పునరుత్థానం ఇక్కడే జరిగింది. హిబ్రూ బైబిల్లో జెరూసలేం ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ఏసుక్రీస్తు నడయాడిన ఈ ప్రాంతాన్ని, 12వ శతాబ్దంలో నిర్మించిన హోలీ సెపల్క చర్చిని, టెంపుల్ ఆన్ ద మౌంట్ను ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా కింగ్ డేవిడ్ ఏర్పాటు చేశారని, ఈ నగరంలోనే అతని కుమారుడు సలొమన్ తండ్రి పేరిట దేవాలయాన్ని నిర్మించారని హిబ్రూ బైబిల్లో రాశారు. - ఇక మహ్మద్ ప్రవక్త సౌదీ అరేబియా మీదుగా జెరూసలేంకు వచ్చి ఇక్కడి అల్– అక్సా మసీదులో ప్రార్థనలు చేయడంతో.. ముస్లింలు ఈ ప్రాంతమంటే ఎంతో భక్తిభావంతో ఉంటా రు. ఖురాన్లో పొందుపరిచిన మేరకు మహ్మద్ ప్రవక్త స్వర్గలోక యాత్రకు ముందు చివరిసారిగా జెరూ సలేం సందర్శించారని, ఏడో శతాబ్దంలో దేవుడి తో సంభాషించాడని, మక్కా మీదుగా జెరూసలేం చేరుకున్నారని పేర్కొన్నారు. - జుడాయిజం (యూదుల మతం) మూల పురుషుడు అబ్రహం వేల ఏళ్ల క్రితమే దేవుడికి తన కుమారుడు ఐజాక్ను త్యాగం చేసేందుకు సిద్ధమైన ప్రాంతం జెరూసలేం అని చెబుతారు. తమ దేవుడు తన పేరిట జెరూసలేంను ఏర్పాటు చేసినట్లుగా అబ్రహం మనవడు జాకబ్ (తన పేరును ఇజ్రాయెల్గా మార్చుకున్నాడు) గుర్తించినట్లుగా డ్యుటెరొనోమి పుస్తకంలో పేర్కొన్నారు. ట్రంప్ రాకతో ఇజ్రాయెల్పై పెరిగిన అమెరికా ప్రేమ! కిందటేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తాను యూదు వ్యతిరేకి అన్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టారు. సనాతన అమెరికా యూదు కుటుంబంలో పుట్టిన పెద్దల్లుడు జారెడ్ కష్నర్, కుమార్తె ఇవాంకాల తోడ్పాటుతో యూదు ఓటర్లు, లాబీ మద్దతు కూడగట్టి విజయం సాధించారు. ట్రంప్ అధికారం చేపట్టాక వైట్హౌస్ సీనియర్ సలహాదారుగా నియమితుడైన కష్నర్ పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం దిశగా రాయబారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో సౌదీ యువరాజు సల్మాన్కు ట్రంప్ అల్లుడు దగ్గరయ్యారు. జెరూసలేంపై ట్రంప్ నిర్ణయం వెనుక అల్లుడి హస్తం ఉందనీ.. దీనిపై సౌదీ పాలకుల అభ్యంతరాల్లో నిజాయితీ లేదని కూడా దౌత్యవర్గాలు చెబుతున్నాయి. అరబ్ దేశాల నుంచి అమెరికాకు ఇబ్బందేమీ ఉండదా? ఎన్నికల హామీల్లో భాగంగానే జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించినట్టు అమెరికా చెబుతున్నా.. టెల్ అవీవ్ నుంచి ఎంబసీ తరలింపు ఇప్పట్లో జరగదని అర్థమౌతోంది. ఇంకా రెండేళ్లకుగానీ ఆ పని పూర్తవదని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్సన్ చెప్పారు. అదీగాక ప్రధాన అరబ్ దేశాలైన సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్లు స్థానిక ప్రయోజనాలు ఆశించి ఇజ్రాయెల్కు దగ్గరైన సమయంలో ట్రంప్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లోపాయికారీ అవగాహనతో నడుస్తున్నాయి. జెరూసలేంపై అమెరికా నిర్ణయం వాస్తవానికి అరబ్ దేశాలకు దిగులు పుట్టించే అంశమే కాదని పశ్చిమాసియా నిపుణులు తేల్చిచెబుతున్నారు. అమెరికా ఎంబసీ తరలింపు ఎప్పుడు జరిగినా ట్రంప్ ప్రకటనతో పశ్చిమా దేశాల నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని కూడా విశ్లేషిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.. వాళ్లే తేల్చుకోవాలి
న్యూయార్క్ : జెరూసలేం భూభాగ పరిధి, స్థితిగతులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయెల్ వాసులు, పాలస్తీనీయన్లు మాత్రమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అన్నారు. తమ అధ్యక్షుడు కేవలం జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని మాత్రమే చెప్పారని, ఇక దాని పరిధి విషయం వారే తేల్చుకోవాలని అన్నారు. ప్యారిస్లో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ యెస్ లెడ్రియాన్తోపాటు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన (డోనాల్డ్ ట్రంప్) ఇజ్రాయెల్ ఫైనల్ స్టేటస్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. సరిహద్దులువంటి అంశాలను ఆయన ఇరువురి చర్చలకు వదిలేసినట్లు తెలిపారు. ఇద్దరు కలిసి చర్చంచుకొని ఒక నిర్ణయానికి రావొచ్చని అన్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామంటూ ట్రంప్ ఈ వారంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ విషయంలో ఉన్న అమెరికా పాలసీ విధానం మొత్తాన్ని మార్చేశారు.ట్రంప్ నిర్ణయం అరబ్ ముస్లి దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. యురోపియన్ ఖండంలోని కొన్ని దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. -
ఆరని ‘జెరూసలేం’ ఆగ్రహజ్వాలలు
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం వివిధ దేశాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పాలస్తీనాలోని గాజా, వెస్ట్బ్యాంక్లో భారీ సంఖ్యలో నిరసన కారులు రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ చిత్రాలను, ఇజ్రాయెల్, అమెరికా జాతీయ పతాకాలను దహనం చేయటం వంటి చర్యలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్బ్యాంక్లో ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఆందోళన కారులు భద్రతా దళాలతో తలపడ్డారు. ఇరాన్, ఇండోనేసియా, మలేసియా, పాక్, జోర్డాన్లలో ప్రదర్శనలు నిర్వ హించారు. అమెరికా ముస్లింలను అణచివేస్తోందంటూ తీవ్రవాద సంస్థ అల్కాయిదా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం చేయాలని ముస్లిం ప్రపంచానికి పిలుపునిచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ప్రజలను కోరింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, తీవ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా(జేయూడీ)నేత హఫీజ్ సయీద్ లాహోర్లో భారీ ర్యాలీ చేపట్టాడు. శ్రీనగర్తోపాటు కశ్మీర్వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. మధ్య ఆసియా ప్రాంతం మరింత అస్థిరతకు గురి కానుందని పలువురు యూరోపియన్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రక్రియకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని, ఈ ప్రాంత సుస్థిరతకు మరో సవాలుగా మారనుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్ తెలిపారు. వాస్తవాల ఆధారంగానే నిర్ణయం: వైట్హౌస్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించామని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం సబబేనని, మధ్య ఆసియాలో శాంతి స్థాపనకు అమెరికా కట్టుబడి ఉంటుందని తెలిపింది. కాగా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్బుష్ చేయలేకపోయిన పనిని తాను ధైర్యంగా చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జార్జ్బుష్, బిల్క్లింటన్లు చేసిన ఉపన్యాసాల వీడియోలను విడుదల చేశారు. ఒబామా ఇజ్రాయెల్ రాజధానిగా పలుమార్లు పేర్కొన్నారని ఉదహరించారు. -
జెరూసలెం ఇజ్రాయెల్దేనా..?
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న రాజధాని సమస్య విషయంలో ట్రంప్ నిర్ణయం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య సమస్యకు కారణాలు.. అమెరికా వైఖరి గురించిన కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.. చరిత్ర.. మధ్య ప్రాచ్య దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. దీనికి సమీపంలోనే పాలస్తీనా ఉంది. అయితే పాలస్తీనాకు స్వతంత్ర రాజ్యంగానే గుర్తింపు ఉంది. కానీ, పూర్తి స్థాయి దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించడం లేదు. ఇజ్రాయెల్లో 87 లక్షల వరకు జనాభా ఉంటారు. ఇక్కడ యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఆర్మేనియన్లు ఉన్నారు. ఎక్కువగా యూదుల ఆధిపత్యం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ రాజధానిగా టెల్ అవీవ్ ఉండేది. ఇక పాలస్తీనా, జెరూసలెంను రాజధానిగా భావిస్తోంది. అయితే ఇది ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. పాలస్తీనా జనాభా దాదాపు 45 లక్షలకు పైగానే ఉంటుంది. అతి ప్రాచీన నగరం.. ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో జెరూసలెం ఒకటి. ఈ నగరాన్ని క్రైస్తవులు, యూదులు, ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వారు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలో ని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. గాజా–వెస్ట్ బ్యాంక్ సమస్య.. పాలస్తీనా–ఇజ్రాయెల్ల మధ్య అనేక అంశాల్లో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య 1948, 1967ల్లో యుద్ధాలు కూడా జరిగాయి. 1967నాటి యుద్ధంలో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయెల్ సొంతమయ్యాయి. ప్రస్తుతం వెస్ట్బ్యాంక్ ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం విజయవంతంగా అణచివేస్తోంది. పైగా ఇక్కడ క్రమంగా యూదుల సంఖ్య పెరుగుతోంది. కాగా, గాజా మాత్రం హమాస్ అనే ఇస్లామిక్ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను దక్కించుకునేందుకు జ్రాయెల్, పాలస్తీనాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండూ దేనికి దక్కితే, అది పెద్ద దేశమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి కష్టంగానే మారింది. ఇజ్రాయెల్ దేశంగా మారడం వెనుక.. ప్రపంచంలోనే యూదులు ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. అయితే 20వ శతాబ్దంలోపు యూదు మతం దాదాపు అంతరించి పోయే స్థితికి చేరింది. యూదులు యూరప్ సహా అనేక దేశాల్లో స్వల్ప సంఖ్యలో ఉన్నారు. అయితే వీరంతా, తమకు ఓ ప్రత్యేక దేశం ఉండాలని భావించారు. తమ మతానికి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అలా యూదలందరి మదిలో మెదిలింది ఇజ్రాయెల్. పైగా అది వారి చారిత్రక నగరం. అయితే అప్పుడు అది పాలస్తీనాగా, బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండేది. 1896–1948 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదుల్లో 90 శాతం మంది ఇక్కడికి చేరారు. అప్పటికే అక్కడ అరబ్బులు అధికంగా ఉండేవారు. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు పాలస్తీనాలో ఉన్నారు. కానీ యూదుల రాకతో, వీరి మధ్య తీవ్ర సంక్షోభం తలెత్తింది. దీంతో ఐక్యరాజ్య సమితి దీన్ని రెండు రాజ్యాలుగా విడగొట్టాలనుకుంది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, పాలస్తీనియన్లు అంగీకరించలేదు. పాలస్తీనాకు అరబ్బు రాజ్యాలైన ఈజిప్టు, జోర్డాన్, ఇరాక్, సిరియాలు మద్దతు తెలిపి, ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపొందింది. దీంతో పాలస్తీనా ఆధీనంలోని 77 శాతం భూమి ఇజ్రాయెల్ పరమైంది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించాయి. ఇదే సమయంలో జెరూసలెం నగరం కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి మారిపోయింది. జెరూసలెం వివాదం ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటి ఆధీనంలో ఉంది. కాగా ఇప్పటికే టెల్ అవీవ్ పట్టణం ఇజ్రాయెల్ రాజధానిగా ఉండేది. పాలస్తీనా మాత్రం జెరూసలేంను రాజధానిగా భావించింది. అయితే ఈ నగరం రెండు దేశాల మధ్య ఉండడంతో, దీని విషయంలో వివాదం కొనసాగుతోంది. నగరంలోని ఎక్కువ ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండగా, కొంత భాగం జోర్డాన్ పరిధిలో ఉంది. జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించాలని ఇజ్రాయెల్ కొన్నేళ్ల నుంచి కోరుతోంది. దీనికి ఇప్పుడు అమెరికా అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సమస్యలు.. జెరూసలేం విషయంలో ట్రంప్ నిర్ణయంపై పాలస్తీనా, జెరూసలెంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని అరబ్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే తమ నిర్ణయం ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు దోహదం చేస్తుందని, ఈ విషయంలో అమెరికా సాయపడుతుందని ట్రంప్ అన్నారు. అలాగే పాలస్తీనాకు కొంత నష్ట పరిహారం అందించడం, లేదా ఇజ్రాయెల్లోని కొంత భాగాన్ని అప్పగించడం వంటివి చేసే అవకాశాలున్నాయని నిపుణుల మాట. గాజా–వెస్ట్ బ్యాంక్ – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ట్రంప్ దుస్సాహసం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు, తమ దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి అక్కడికి తరలిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం ఉన్న రాజ్యం. అది రాజధానిగా నిర్ణయించుకున్న నగరంలో దౌత్య కార్యాలయం పెట్టడంలో తప్పేముంద’న్న తర్కానికి దిగారు. తన నిర్ణయంలోని ప్రమాదకర పర్యవసానాల నుంచి జనం దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు అందరూ విస్మయపడ్డారు. అయితే అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థపై అంచంచల విశ్వాసం ఉన్నవారు దీన్నంతటినీ కొట్టిపారేశారు. అవన్నీ గెలవడానికి ఇచ్చే హామీలే తప్ప వాటి అమలు అమెరికాలాంటి దేశంలో అసాధ్యమన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? పేద వర్గాలకు చవగ్గా వైద్య సాయం లభించే ‘ఒబామా కేర్’కు మంగళం పాడారు. ఎందరో నిపుణులు శ్రమకోర్చి అమెరికా, మరో అయిదు అగ్రరాజ్యాలతో ఇరాన్ అణు ఒప్పందానికొచ్చేలా ఒప్పిస్తే... ట్రంప్ దాని పీకనొక్కే పని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ఆ ఒప్పం దాన్ని ధ్రువీకరించాల్సి ఉండగా దాన్ని నిలిపేశారు. ఆ పరంపరలో భాగంగానే బుధవారం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించారు. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో మరో చిచ్చు రగిల్చారు. రానున్న కాలంలో అది ఉగ్రరూపం దాల్చేందుకు బీజం నాటారు. ఈ ప్రమా దాన్ని పసిగట్టడం వల్లనే అరబ్ దేశాలు మాత్రమే కాదు... యూరప్ దేశాలు, చైనా, భారత్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ నాయకులంతా వివేకమూ, దూరదృష్టి ప్రదర్శించి ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ప్రవర్తించాలని పోప్ ఫ్రాన్సిస్ హితవు చెప్పారు. డోనాల్డ్ ట్రంప్పై అభిశంసన ప్రక్రియపై ప్రారంభించాలా వద్దా అన్న అంశంలో డెమొక్రాట్లు తర్జనభర్జన పడుతున్నారని గురువారం వార్తలొచ్చాయి. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వారి అంతర్గత విషయం. కానీ జెరూసలేం విషయంలో ట్రంప్ చర్య పర్యవసానంగా ఇవాళ మొత్తం అమెరికాయే ప్రపంచ అభిశంసనను ఎదుర్కొనే దుస్థితిలో పడింది. జెరూసలేం ప్రపంచంలోని క్రైస్తవ, ముస్లిం, యూదు మతానికి చెందిన కోట్లాదిమందికి సమానంగా ఆరాధనీయమైన పవిత్ర స్థలి. ఆ మూడు మతాలకు చెందిన పురాతన చిహ్నాలూ ఆ నగరంలో ఉంటాయి. ట్రంప్ అంటున్నట్టు అది ఇప్పటికైతే ఇజ్రాయెల్ రాజధానే. అక్కడ ఆ దేశ ప్రధాని నివాసం, దాని పార్లమెంటు భవనం ఉన్నాయి. అయితే అవి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయని మరువకూడదు. పశ్చిమ జెరూసలేం 1949 నుంచీ ఇజ్రాయెల్ అధీనంలో ఉంటున్న ప్రాంతం. ఆ నగరంలోని తూర్పు ప్రాంతంలోకి ఇజ్రా యెల్ 1967లో చొరబడి విలీనం చేసుకుంది. రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన విలయాన్ని చల్లార్చడానికి ఐక్యరాజ్యసమితి 1949లో నియమించిన ఆర్మిస్టిస్ కమిషన్ గీసిన విభజన రేఖ జెరూసలేంని కూడా తాకింది. అందులో పశ్చిమ భాగం ఇజ్రాయెల్ వైపుంటే, తూర్పు ప్రాంతం పాలస్తీనాలో ఉంది. ఆ వివాదంపై ఇరుపక్షాలూ కూర్చుని పరిష్కరించుకోవాలన్నది ఆర్మిస్టిస్ కమిషన్ నిర్ణయం. ఇజ్రాయెల్ జెరూసలేంను రాజధానిగా ప్రకటించుకున్నా సమితి సభ్య దేశాలన్నీ ఆర్మిస్టిస్ కమిషన్ నిర్ణయాన్ని గౌరవించి టెల్అవీవ్లో తమ దౌత్య కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షులు మాత్రం ‘గోడ మీద పిల్లివాటం’తీరున అప్పటినుంచీ టెల్అవీవ్లో దౌత్యకార్యాలయం కొనసాగడానికి వీలుగా ఆర్నెల్లకోసారి మినహాయింపునిచ్చే పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. 90వ దశకంలో ఓస్లో వేదికగా ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పుడు ఇతర అంశాలకు జెరూసలేం అడ్డు రాకూడదన్న భావనతో దాన్ని భవిష్యత్తు చర్చలకు వదిలిపెట్టారు. 2000 సంవత్సరంలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బారక్, ఆనాటి పాలస్తీనా అధినేత అరాఫత్లు ఆర్మిస్టిస్పై దాదాపు అవగాహనకొచ్చారు. కానీ ఆ నగరం అడుగునున్న సొరంగాల నియంత్రణపై విభేదాలొచ్చి ఒప్పందం నిలిచిపోయింది. ఇజ్రాయెల్ దురాక్రమణతో సర్వం కోల్పోయినా ఆర్మిస్టిస్ కమిషన్ విభజన రేఖను గౌరవించి తూర్పు జెరూసలేంతో సరిపెట్టుకోవడానికి పాలస్తీనావాసులు అంగీకరించారు. కానీ ఇజ్రాయెల్ మొండికేస్తూ వస్తోంది. పాలస్తీనాతో చర్చించడానికీ, ఒప్పందానికి రావడానికీ అంగీకరిస్తూనే... జెరూసలేంలో మాత్రం అంగుళం భూమిని కూడా వదిలేది లేదని పేచీ పెడుతోంది. ట్రంప్ కొత్తగా చెప్పిందేమీ లేదని వైట్హౌస్ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జెరూసలేంకున్న సరిహద్దుల్ని గుర్తించబోమని ఆయన అనలేదని వాదిస్తున్నారు. వైఖరి మారనట్టయితే జెరూసలేంలోని తూర్పు ప్రాంతంవైపు వెళ్లొద్దని ట్రంప్ ప్రకటనకు ముందు తన పౌరులకు అమెరికా ఎందుకు హెచ్చరికలు జారీ చేసినట్టు? ఆయన ప్రకటనతో అమెరికాపై ఆగ్రహజ్వాలలు రగలవచ్చునని వారెందుకనుకున్నారు? పైకి ఏం చెప్పినా ఇజ్రాయెల్కు తాను తిరుగులేని మద్దతుదారునని అమెరికా ఇప్పుడు ‘అధికారికంగా’ రుజువు చేసుకుంది. ఈ సమస్యలో మధ్యవర్తి పాత్రను అది కోల్పోయింది. తనకు తాను తీవ్రమైన నష్టం కలగజేసుకుంది. ట్రంప్ తాజా చర్యతో ఇప్పటికే గాజా స్ట్రిప్లోనూ, బీరూట్, లెబనాన్లోని పాలస్తీనా శరణార్ధి శిబిరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని తమకనుకూలంగా మలచుకోవడానికి ఐఎస్లాంటి ఉగ్రవాద సంస్థలు సహజంగానే ప్రయత్ని స్తాయి. ఆ విషయంలో అవి విజయం సాధిస్తే అమెరికా మతిమాలినతనం వల్ల పశ్చిమాసియాలో మరో పెద్ద ఉపద్రవం వచ్చిపడినట్టే లెక్క. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మీ వెంట మేముంటామని పాలస్తీనా పౌరులకు భరోసా కల్పించడం, అమెరికా ప్రజానీకం యావత్తూ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం తక్షణావసరం. అవి ఎంతో కొంత మేర నష్ట నివారణకు తోడ్పడతాయి. -
సైనికులతో పాలస్తీనా పౌరుల కొట్లాట
బీరట్, లెబనాన్ : వివాదాస్పద నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో పెను కల్లోలం రేపారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ బుధవారం రాత్రి ప్రకటించిన విషయం విదితమే. అక్కడితో ఆగని ట్రంప్ అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నగరం నుంచి జెరూసలేంకు మార్చుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలతో ఆందోళనలకు పాలస్తీనాలోని రామల్లా, బెత్లేహంలోని ప్రజలు ఇజ్రాయెల్ దళాలతో కొట్లాటకు దిగారు. ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాల్లో ఓ వైపు బహిరంగ సభలు కొనసాగుతుండగా.. మరో వైపు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ 1967 నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ - పాలస్తీనాలు ‘జెరూసలేం’కు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నాయో చూద్దాం. ‘జెరూసలేం’ ఓ ప్రాచీన పుడమి.. జెరూసలేం పుడమి ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ గడ్డపై క్రీస్తు నడయాడారని కూడా నమ్మకం. తొలిసారి 1948లో జెరూసలేం విషయమై అరబ్బులు, యూదుల మధ్య వివాదం రేగింది. దీంతో జెరూసలేంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్(యూదులు), తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు కైవసం చేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ఎడతెగని రక్తపాతానికి కారణమైంది. జెరూసలేంలోని తూర్పు ప్రాంతంలో జరిగే ఘోరాల్లో బయటకు రాని వాటి సంఖ్యకు లెక్కేలేదు. ఆ ప్రాంతంలో అశాంతి రాజ్యమేలుతోంది. దాదాపు మూడు వేల ఏళ్ల నాటి నుంచి జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా ఉంటోందననేది యూదుల వాదన. ఇదే సమయంలో జెరూసలేంలోని తూర్పు ప్రాంతం పాలస్తీనాకు రాజధాని కావాలనేది అరబ్బుల కల. చాలా మంది అరబ్బులు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓటు హక్కు ఇవ్వకున్నా.. తూర్పు జెరూసలేంలోనే ఏళ్లుగా నివసిస్తున్నారు. -
అప్పుడే వేలుపెట్టిన సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ రాజధాని వ్యవహారం ఓ పక్క వివాదంగా మారుతుండగా వెంటనే భారత్ తన దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గురువారం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన 'జెరూసలేం ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తింపు లభించడంతో ఆ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక భారత్ తన దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చాల్సిందే' అని అన్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పలు అరబ్ దేశాలతోపాటు యురోపియన్ యూనియన్లోని పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి విభాగం కూడా ట్రంప్ను విమర్శిస్తున్నారు. భారత్ కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈలోగా భారత ప్రభుత్వంలో భాగస్వామి అయిన సుబ్రహ్మణ్య స్వామి పై విధంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. -
అరబ్ దేశాల ఆగ్రహం... అమెరికాకు తీవ్ర హెచ్చరిక
తెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరూసలేం ప్రకటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉగ్రవాదులను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారంటూ చెప్పుకుంటున్న నేపథ్యంలోనే ఓ గట్టి వార్నింగ్ వచ్చి పడింది. ఇరాక్కు చెందిన అల్-నొజాబా అనే మిలిటెంట్ సంస్థ తమ దేశంలో మోహరించిన అమెరికా సైన్యంపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామని ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ అక్రమ్ అల్ కాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 1500 మంది సైన్యంతో ఐసిస్తో కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. సుమారు 6 వేల మంది అమెరికా సైనికులు మోహరించినట్లు పెంటగాన్ వెల్లడించగా.. ఆ సంఖ్య 9 వేల దాకా ఉండొచ్చన్న మరో అంచనా ఉంది. కాగా, ట్రంప్ వ్యాఖ్యలతో వారందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టెల్ అవివ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రంప్ చేసిన ప్రకటనను అరబ్ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. భారత్ తటస్థం... ? పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ భారత్ తరఫున ప్రకటన చేశారు. భారత్ తన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుందని, దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు. -
'అమెరికాకు చావే..'
బీరుట్ : 'అమెరికాకు చావే' అంటూ లెబనాన్కు చెందిన అల్ అక్బర్ అనే వార్త పత్రిక తన తొలి పేజీలో ప్రచురించింది. జెరూసలెంను తాము ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేసిన నేపథ్యంలో తొలిసారి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ దినపత్రిక తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. ఇజ్రాయెల్ రాజధానిగా టెల్ అవీవ్ స్థానంలో తాము జెరూసలెంను గుర్తిస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించారు. అక్కడే తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటుచేసి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మధ్య ప్రాచ్చ దేశాల్లో అశాంతిని రగిలించడమేనంటూ మండిపడ్డాయి. ఇది చట్ట వ్యతిరేకం అని, రెచ్చగొట్టే చర్య అని ఇరాన్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
ట్రంప్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే!
జెరూసలెం: జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పాలస్తీనా రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు మతయుద్ధాలకు పిలుపునివ్వవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ట్రంప్ చర్యతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతిచర్చల్లో మధ్యవర్తిగా ఉండే అర్హతను అమెరికా కోల్పోయిందని స్పష్టం చేశారు. 'ఉగ్రవాదులు మతయుద్ధాలకు దిగేందుకు సాయపడేలా ఈ చర్యలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా నష్టపోయే అవకాశముంది. ఇప్పటికే తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ ఎప్పటికీ ముగిసిపోని యుద్ధానికి ఇది దారితీయవచ్చు. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మేం ఇప్పటివరకు హెచ్చరిస్తూ వచ్చాం. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరాం' అని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మౌద్ అబ్బాస్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. ట్రంప్ తాజా చర్యతో ఇక శాంతిచర్చల్లో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించలేదని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పింది. రెండు రాజ్యాల ఏర్పాటు సాధ్యంకాని రీతిలో ట్రంప్ విధ్వంసక నిర్ణయం తీసుకున్నారని ఆ సంస్థ సెక్రటరీ జనరల్, పాలస్తీనా చర్చల ప్రధాన ప్రతినిధి సాహెబ్ ఎరెకత్ అన్నారు. ట్రంప్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదని ఆయన సీఎన్ఎన్తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరుపక్షాలను కూర్చోబెట్టి.. చర్చలు, సంప్రదింపులు జరపడం ద్వారా నిర్ణయం తీసుకోవడానికి బదులు ఏకపక్షంగా ట్రంప్ హుకుం జారీచేశారని, రెండు రాజ్యాల పరిష్కారాన్ని నాశనం చేసేలా ఇజ్రాయెల్ అధికారులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయంపై ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు దారితీస్తోంది. అమెరికా మిత్రపక్షమైన యూరప్తోపాటు ఐక్యరాజ్యసమితి, అరబ్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతిచర్చలకు తీవ్ర విఘాతం కలిగిందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం : అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖను ట్రంప్ ఆదేశించారు. ‘జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఇదే సమయమని నేను నిర్ణయించాను’ అని ట్రంప్ అన్నారు. ఈ పనిని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ‘ఏదైనా చేయాలని (ఇజ్రాయెల్ అంశంలో) గత అధ్యక్షులు చెప్పేవారు. కానీ వారు చేసిందేమీ లేదు. వాళ్లకు ధైర్యం లేకనో, మనసు మార్చుకోవడం వల్లనో నేను చెప్పలేను’ అని ట్రంప్ అన్నారు. తాజా నిర్ణయంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీని ట్రంప్ నెరవేర్చినట్లైంది. కాగా, ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ చర్యతో మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్యమం రావొచ్చని ఆ దేశాధినేతలు హెచ్చరించారు. ట్రంప్ మాట్లాడుతూ ‘జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం. గత ఏడు దశాబ్దాల్లో ఇజ్రాయెల్ ప్రజలు యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి జీవించే దేశాన్ని నిర్మించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా... ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు కూడా అమెరికా కట్టుబడి ఉంది’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముస్లింలను రెచ్చగొట్టే చర్య: సౌదీ సౌదీ రాజు సల్మాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సిసీలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను ట్రంప్ చర్య రెచ్చగొడుతుందనీ, ఇదొక అపాయకర చర్య అని సల్మాన్ అన్నారు. ట్రంప్ చర్య ‘తప్పు, చట్ట వ్యతిరేకం, అత్యంత ప్రమాదకరం, రెచ్చగొట్టేది’ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత.. ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల అధినేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంపైనా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జెరూసలేంపై నిర్ణయం తీసుకునే ముందు మధ్యప్రాచ్యంలోని దేశాధినేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్లతోపాటు జోర్డాన్, సౌదీ, ఈజిప్టు అధినేతలతోనూ చర్చించారు. జెరూసలెం.. మూడు మతాల పవిత్ర స్థలం జెరూసలెం మూడు మతాలకూ పవిత్ర స్థలం. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వా రు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలోని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే క్రీస్తుకు శిలువ వేశారని చెబుతారు. చర్చిలోని క్రీస్తు సమాధిని సందర్శించేందుకు లక్షలాది మంది క్రిస్టియన్లు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటారు. పాత నగరంలోని అల్ అక్సా మసీదు.. ముస్లింలకు మూడో పవిత్ర స్థలం. మక్కా నుంచి మహ్మద్ ప్రవక్త ఇక్కడకు వచ్చి అందరి ప్రవక్తల తరపున ప్రార్థనలు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. జెరూసెలంలోని వెస్ట్రన్ వాల్ యూదులకు పవిత్ర స్థలం. యూదులు ఉండే ప్రాంతంలో ఈ సున్నపురాయి గోడ ఉన్నది. భూగోళం ఇక్కడ నుంచే పుట్టిందని యూదులు భావిస్తారు. అబ్రహం కూడా తన కుమారుడు ఐజాక్ను త్యాగం చేయాలని చూసింది ఇక్కడేనట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు దీనిని దర్శించుకుంటారు. అమెరికా ప్రకటనకు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు -
అతని ప్రపంచం అరక్షణంలో మారిపోయింది!
యెరూషలేము మందిరం దగ్గరలో బెతెస్థ అనే కోనేరుంది. ఒక దేవదూత కొన్నిసార్లు వచ్చి ఆ నీటిని కదిలించినపుడు ముందుగా ఎవరు దిగుతారో వారు ఎలాంటి రోగమున్నా బాగుపడతారని నమ్మేవారు. అలా బాగుపడేందుకు రకరకాల రోగులు, వికలాంగులు వందల సంఖ్యలో అక్కడ పడి ఉన్నారు. ఒక వ్యాధి వల్ల 38 ఏళ్లుగా పడకకంటుకుపోయిన ఒక వ్యక్తి కూడా వారిలో ఉన్నాడు. ఒకరోజు యేసు అక్కడికొచ్చి ‘స్వస్థతపడాలనుకొంటున్నావా?’ అనడిగాడు. దేవదూత నీటిని కదిలించినప్పుడు తనను ముందు నీళ్లలోకి దించేవారు లేక తానింకా రోగిగా ఉన్నానన్నాడా వ్యక్తి. సాక్షాత్తూ దేవుడే వచ్చి తన ఎదుట నిలబడి మాట్లాడుతుంటే, ఆయనకు ఒక దేవదూత సంగతి చెబుతున్నాడా అవివేకి. యేసు ఎవరు? అక్కడి దేవాలయంలో ఆరాధనలు పొందుతున్న దేవుడు. ఆయనే స్వయంగా తన వద్దకొస్తే, తనను ముందుగా నీళ్లలోకి దించలేకపోతున్న లోకాన్నే ఇంకా పట్టుకు వేలాడుతున్న దౌర్భాగ్యం అతనిది. కొందరంతే, ఆశీర్వాదం తమను వెదుక్కుంటూ వచ్చినా, శాపానికే పట్టం కడతారు! అయితే అతని 38 ఏళ్ల దుర్భర జీవితానికి, నిరాశకు యేసు అరక్షణంలో ముగింపు పలుకుతూ, ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని ఆజ్ఞాపించగా, అతడు అత్యానందంతో నడుస్తూ వెళ్లిపోయాడు (యోహాను 5:2–9). దేవునికన్నా కోనేటి నీటికే శక్తి ఎక్కువ అని నమ్మే అతని అంధ విశ్వాసానికైతే అంతం వచ్చింది కాని లోకంలో దేవుని పిల్లలుగా చలామణి అయ్యే చాలామంది అనేకానేక అంధవిశ్వాసాలకు ఇంకా బానిసలుగానే బతుకుతున్నారు. అవి మందిర సేవకు వాడే నీళ్లు గనుక, అవి కూడా పవిత్రమైనవేనని ఎవరో కథలు చెబితే నమ్మి దేవుణ్ణి, దేవాలయాన్ని వదిలేసి కోనేటి నీటి దగ్గర అంధవిశ్వాసంతో మగ్గుతున్నారు వందలాది రోగులు. అందుకు తమను తాము కుటుంబాల నుండి బహిష్కరించుకొని ఆ దేవదూత దిగొచ్చే వేళకోసం అక్కడే జీవితకాలమంతా అనాథలుగా బతుకుతున్నారు వాళ్లంతా! అంధవిశ్వాసానికి, అవిశ్వాసానికి పెద్దగా తేడా లేదు, రెండూ ఒకటే! మనిషి రాకెట్ వేగంతో అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నాడు. కాని మానసికంగా, భావనల పరంగా రకరకాల సంకెళ్లు అంధ విశ్వాసాల రూపంలో తగిలించుకొని బానిసవుతున్నాడు. లోకమంతటినీ ‘ఒక్కటి చేసిన ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా కొందరు నిరుపేదల్ని కులం పేరుతో ‘సంఘబహిష్కరణ’ చేసే వారి అమానవీయతకు అసలు వివరణ ఏది? అయినా దేవుడి బిడ్డలూ! దేవుడే మీతో ఉంటే దేవదూతలు, కోనేటి నీళ్ళతో మీకేం పని?! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
జెరూసలేంలో ఉగ్రదాడి : నలుగురు మృతి
-
జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(రాజ్విహార్): జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అంజాద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి రూ.40వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్ 98488 64449, 08518 277153 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
జెరూసలెం: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి ఈ పవిత్ర చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే, తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీనిని తెరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'క్రీస్తును ఉంచి సమాధి పైభాగాన్ని కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం' అని చెప్పారు. 'చాలా సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణ అనంతరం క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలకు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దీని కిందే క్రీస్తును ఉంచారు' అని కూడా ఆయన తెలిపారు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఒక చిన్న నిర్మాణం ఉంది. దీనిని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరంగా నిర్మించిన ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో 1808, 1810 మధ్య పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ పరిశోధకులు ఆ పనులు పూర్తి చేశారు. కాగా, తాజాగా మరోసారి పునరుద్ధరించనున్నారు. -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
-
అత్యంత శక్తిమంతమైన సాధనం క్షమాపణ!!
యెరూషలేము రాజధానిగా దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి అనూహ్యమైన సంక్షోభాన్నెదుర్కొన్నాడు. దావీదు మీద అతని కుమారుడైన అబ్రాహామే తిరుగుబాటు చేసి తనను రాజుగా ప్రకటించుకున్నాడు. కాకలు తీరిన శత్రురాజులనెందరినో ఓడించిన దావీదు ఒక తండ్రిగా తన మీద యుద్ధం చేయడన్న ధీమా అబ్షొలాముది. అతడనుకున్నట్టుగానే దావీదు నిస్సహాయుడై ఉన్నట్టుండి కృంగిపోయాడు. నిజమే, పగవారిని శత్రువులెదుర్కొన్నట్టు ఉన్నట్టుండి పగవారుగా మారిన సొంతవారిని ఎదుర్కోవడం మనసున్న వారికెవరికైనా కష్టమైన విషయమే! తాను యుద్ధం ప్రకటిస్తే అందులో అబ్షోలాము చనిపోతాడేమోనన్న భయం దావీదుది. అందువల్ల దావీదు రాత్రికి రాత్రి తన పరివారంతో, తన వారనుకున్న సైన్యంతో రాజధాని, రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో పారిపోయాడు. సింహాసనం మీద కూర్చున్న రాజుకు అంతా భయపడతారు కానీ పారిపోయే రాజు అందరికీ అలుసవుతాడు. అంతకాలం మనసులో పగ ఉన్నా పైకి ప్రేమ నటించిన షిమీ అనే బెన్యామీనీయుడు రాజుగా దావీదు రోజులు ముగిశాయని భావించి దావీదును తరమడం ఆరంభించాడు. నిజమే, మనం పచ్చగా ఉన్నంత కాలం అంతా మనతో బాగానే ఉంటారు కానీ బలహీనపడ్డ మరుక్షణం ముందుగా సొంతోళ్లే శత్రువులకన్నా హీనంగా మాట్లాడతారు. షిమీ ఇప్పుడు తన అక్కసునంతా వెళ్లగక్కుతూ ‘నరహంతకుడా, దుర్మార్గుడా’ అంటూ భయంకరమైన ఆరోపణలు, శాపనార్థాలన్నీ వింటున్న దేవుడు వాటన్నింటినీ ఆశీర్వాదాలుగా మార్చుతాడని, పైగా కన్నకొడుకే తనను కించపర్చగా పరాయివాడైన షిమీ తనను కించపర్చడంలో వింతేమున్నదని దావీదు అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అబ్షాలోము చనిపోగా, దావీదు మళ్లీ యెరూషలేముకొచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పుడు షిమీ అందరికన్నా ముందుగా వచ్చి దావీదుకు సాగిలపడి క్షమాపణ వేడుకున్నాడు. కొందరంతే, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు!! ఎవరిని క్షమించినా క్షమించకున్నా షిమీని మాత్రం చంపితీరాలని సైన్యాధిపతియైన అబిషై దావీదుతో అన్నాడు. కాని దావీదు షిమీని క్షమించి వదిలేశాడు. అదే దావీదు గొప్పతనం. తాను బలహీనుడిగా ఉన్నప్పుడూ క్షమించాడు. తిరిగి బలం పుంజుకున్న తర్వాత కూడా క్షమించాడు. అబ్షాలోము తిరుగుబాబు దావీదుకు మేలు చేసింది. నిజంగా తన వారెవరో, తన వారెవరు కాదో తెలిసొచ్చింది. కష్టకాలంలో షిమీలాంటివారు పలికిన ప్రతిశాపవచనాన్ని దావీదు విశ్వాసం మేరకు దేవుడు నిజంగానే ఆశీర్వాదాలుగా మార్చడంతో ఆయన మరింత వైభవం పొందాడు. క్షమించడంలో దేవుడెంతో శక్తిని, ఆశీర్వాదాన్ని దాచాడు. అయితే క్షమించడంలోనూ దేవుడెంతో ఆనందాన్ని దాచాడు. అందుకే క్షమాపణ కోరిన ఎంతటి శత్రువునైనా క్షమించడం దైవికం, మానవత్వం, నైతికం మాత్రమే కాదు, ఎంతో ఆశీర్వాదకరం కూడా!! - రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం: పవిత్ర జెరూసలెం యాత్రకు వెళ్లే జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలు ఆర్థిక సహాయం కోసం ఏపీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు కె.నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్ర మొత్తానికి రూ.89వేలు ఖర్చు అవుతుందని అంచనా కాగా, ప్రభుత్వం తరఫున రూ.20వేలు అందజేస్తామని చెప్పారు. దరఖాస్తులకు అన్ని పత్రాలు జతచేసి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి పంపించాలన్నారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1068, 040–23392243, 040–2391068, శ్రీ రాఘవేంద్ర 73962 84529, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 9849901160/08922–230250 లను సంప్రదించాలని సూచించారు. -
యుద్ధం
-
తన ప్రేమను పంచేవారికోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు!
సువార్త బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు తన పరాక్రమంతో బబులోను సామ్రాజ్యాన్ని విస్తరించి, స్థిరపర్చి ఖ్యాతినార్జించాడు. ఎంతో కిరాతకుడు, పాలనాదక్షుడుగా చెప్పుకునే నెబుకద్నెజరు యూదురాజ్యాన్ని కూడా ఆక్రమించి, అక్కడి దేవుని ప్రజలైన యూదులను చెరబట్టి బబులోనుకు బానిసలుగా తీసుకెళ్లాడు. యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి అందులోని బంగారు, వెండినంతా కొల్లగొట్టాడు. అయితే దేవుని ప్రజలైన యూదులు అతని చెరలో ఉన్న కారణంగా దేవుడతనికి కలల ద్వారా హెచ్చరికలు జారీ చేయగా, అతని వద్ద బానిసల్లో ఒకరైన దానియేలు వాటిని ఆయనకు విడమర్చి చెప్పవలసి వచ్చేది. అంతటి మహాచక్రవర్తి కూడా ఒక బానిస తెలివితేటల మీద ఆధారపడేవిధంగా దేవుడు తన శక్తిని నిరూపించాడు. చివరికతను పిచ్చివాడై రాజధాని వదిలి అరణ్యంలో జంతువులతో సమానంగా తిరుగుతూ గడ్డితింటూ గడిపే పరిస్థితి ఏర్పడింది (దానియేలు 4:1-33). మనిషికి అహంకారమే గొప్ప శత్రువు. ఈరోజున్న వైభవమే శాశ్వతమన్న భ్రమను ఆ శత్రువు కల్పిస్తాడు. పొద్దున వికసించి సాయంత్రానికి వాడిపోయే పూవులాంటి వైభవాన్ని నమ్ముకొని నన్ను మించినవారు లేరని విర్రవీగేవారి జీవితం, క్షణాల్లో పెకైగసి, వెలుగులు విరజిమ్మి బూడిదకుప్పగా ఎక్కడో కూలిపోయే తారాజువ్వలాంటిదేనన్నది చరిత్ర చెప్పే వాస్తవం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, జనాకర్షక విధానాలు పునాదిగా నిర్మించబడిన జీవితాలు, పరిచర్యలు, చర్చిలు కొద్దిరోజులు కనబడి ఆ తర్వాత అంతర్థానమై పోవడం వెనక రహస్యం ఇదే! విశ్వాసులను, దేవుణ్ణి కూడా సొంతలాభం కోసం వాడుకునే స్థాయికి దిగజారితే, దేవుని రాజ్య నిర్మాణం జరగదు సరికదా, అలా నిర్మించుకున్న సొంత సామ్రాజ్యాల పునాదులు కూడా కదిలిపోయి అవి కుప్పకూలిపోవడం తప్పదు. అయినా ఎంతో ఐశ్వర్యవంతుడు, సర్వాధిపతి, సర్వసృష్టికర్తగా, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తే అన్నీ వదిలేసి రిక్తుడుగా, పేదగా, దాసుడుగా ఈ లోకానికి వేంచేస్తే ఆ దేవుని పరిచారకులమని చెప్పుకునే వారు అన్నీ సంపాదించుకోవడానికే తెగిస్తున్నారంటే, యేసుక్రీస్తు ఎవరో ఆయన ఆశయమేమిటో వారికింకా అర్థం కానట్టే!! యేసుప్రభువు అడుగుజాడల్లో నడిచిన ఆదిమ విశ్వాసులు, అపొస్తలులు కూడా అన్నీ వదులుకొని సేవ చేసి తరించినవారే. కాగా వారి వారసులైన ఈనాటి తరం పరిచర్య ముసుగులో అన్నీ సంపాదించుకోవడానికే ఆరాటపడటం బాధ కలిగించే విషయం. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత తప్పనిసరిగా నిర్మించబడవలసిన దేవుని రాజ్యాన్ని, స్వార్థం, కుట్రలు, డబ్బుతో కంపుకొడుతున్న సొంత సామ్రాజ్యాల స్థాపన కోసం నిర్లక్ష్యం చేసినందుకు ఒకరోజున మూల్యం చెల్లించవలసి వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప చర్చిలకోసం కాదు, తన ప్రేమను వెదజల్లే మంచి కార్యాలు, మంచి చర్చిలకోసం చూస్తున్నాడు. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
మేనేజ్మెంట్ పాఠాలు
బైబిల్ కేవలం మత గ్రంథమే కాదు, నాయకత్వ లక్షణాలను తెలియజెప్పే మేనేజ్మెంట్ బుక్ కూడా. వ్యాపార విజయాలు, నిర్వహణాసూత్రాల గురించి అద్భుత రచనలు చేసిన జాన్ సి మ్యాక్స్వెల్కూ స్ఫూర్తి బైబిలే. అలాంటి కొన్ని ఉదాహరణలు మీకోసం.. బైబిల్ పాఠం - 1 ప్రణాళిక.. ప్రాతినిథ్యం.. సమష్టి కృషి! క్రీస్తు పూర్వం 444 సంవత్సరంలో ఇజ్రాయెల్ పరాయి రాజుల పరమైంది. జెరూసలేమ్కు రక్షణగా ఉన్న శివారు గోడ ధ్వంసమైంది. యూదులు చాలామంది వలస వెళ్లిపోయారు. అలా మరికొంత మంది పర్షియాకు వెళ్లారు. వాళ్లలో ఒకడే నెహెమ్యా. పర్షియా రాజు ఆకేజక్సీస్కు సేవకుడిగా చేరాడు. అయితే జెరూస లేమ్లోనే ఉండిపోయిన ఇంకొంతమంది యూదులు పట్టణ గోడ కూలడం వల్ల అభద్రతకు లోనై భయపడ్డం మొదలు పెట్టారు. అది నెహెమ్యాకు తెలిసింది. ఎలాగైనా ఆ గోడను మళ్లీ కట్టించాలి అను కున్నాడు. జెరూసలేమ్ స్థితిగతులు, అక్కడి యూదుల బలాబలాలు వంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించాడు. గోడ కట్టడానికి ఎలాంటి సరుకు, సామాగ్రి కావాలో నిర్ధా రించుకున్నాడు. నిర్మాణానికి పట్టే సమ యాన్నీ అంచనా వేసుకున్నాడు. దేవుడిని ప్రార్థించి, ఆనక రాజుగారి ప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. జెరూసలేమ్లోని పరి స్థితిని, తన ప్రణాళికను వివరించి సహా యాన్ని అర్థించాడు. సహాయం అందిస్తే కేవలం 52 రోజుల్లో ఆ గోడ పని పూర్తి చేయగలనని స్పష్టం చేశాడు. తాను చేయా లనుకున్న టాస్క్కు బాస్ని ఎలా ఒప్పిం చాలి అనేదానికి ఇది ఓ మంచి మేనేజ్ మెంట్ పాఠం. తన వాళ్లకోసం రక్షణ గోడ కట్టడానికి శత్రురాజు మద్దతు కూడగట్టు కున్నాడు. అసలు రాజుగారిని నెహెమ్యా నేరుగా సంప్రదించే అవకాశాన్నిచ్చింది ఆయన వ్యక్తిత్వమే. నిబద్ధత, అంకిత భావం, నమ్మకం, నిజాయితీలతో రాజుని ముగ్ధుణ్ని చేసి... ఆ శత్రు రాజ్యం లోంచే జెరూసలేం గోడకు అవసరమైన సరుకు, వస్తుసామాగ్రిని కూడా తీసుకొని జెరూసలేం బయలుదేరాడు నెహెమ్యా. అక్కడికి వెళ్లేసరికి యూదులంతా నిరాశ, నిస్సృహలతో కనిపించారు నెహెమ్యాకి. అంతా ఐకమత్యంగా కాక ఎవరికి వారే అన్నచందంగా ఉన్నారు. వాళ్లందరినీ కూడగట్టి, ఒక్క తాటిమీదకు తెచ్చి జెరూసలేం గోడ కట్టించడం అతని వల ్లకాలేదు. అప్పుడు సమష్టి కృషిపై కాకుండా వ్యక్తి సామర్థ్యం మీద దృష్టి పెట్టాడు. పనిని వ్యక్తికింత చొప్పున విభ జించాడు. ప్రతి యూదుడి దగ్గరకు వెళ్లి ఎంత గోడ కట్టాలో వివరించాడు. ఇంటి దగ్గర్నుంచే గోడ కట్టడం మొదలుపెట్టమని సూచించాడు. దానికి అవసరమైన సరుకు, వస్తుసామాగ్రిని అందించాడు. అలా అందరికీ పనిని అప్పగించాడు. నెహెమ్యా అంచనా తప్పు కాలేదు. ఆయన ఊహించి నట్టే వాళ్లంతా ఆ పనిలో పడ్డారు. నెహెమ్యా అనుకున్నట్టే గోడను 52 రోజుల్లో పూర్తి చేశారు. టీమ్వర్క్ సాధ్యం కాక పోతే స్వతంత్ర వ్యక్తులుగా భాగ స్వామ్యం ఇచ్చి కూడా అనుకున్న సమయంలో పని పూర్తి చేయొచ్చని నిరూపించాడు నెహెమ్యా! బైబిల్ పాఠం - 2 : సర్వెంట్ లీడర్షిప్ మేనేజ్మెంట్ ప్రిన్సిపుల్స్లో సర్వెంట్ లీడర్షిప్ సూత్రాన్ని అనుసరించి ఎందరో నాయకులు అద్భుతమైన ఫలితాలను అందుకున్నారు. దీనికి ఆధారం మళ్లీ బైబిలే. సంప్రదాయ నాయకత్వం అధి కారాన్ని అనుభవిస్తుంది. కానీ సర్వెంట్ లీడర్షిప్ అధికారాన్ని విభజిస్తుంది. పెత్తనం చేయకుండా తన జట్టులోని సభ్యులకు సహకారం అందిస్తుంది. ఇందులో అధికారి కన్నా కిందున్న వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అధికారి అప్పగించిన పనిని వాళ్లు సకాలంలో పూర్తి చేయడానికి కావల్సిన సౌకర్యాలు, సహాయసహకారాలు అందిస్తూ ఉంటాడు. క్రీస్తు ఈ విషయం మీదే దృష్టిపెట్టాడు. ‘అధికారం కావాలనుకున్నవాడు ముందు సేవకుడిగా మారాలి’ అన్నాడు. చేసి చూపించాడు. శిష్యుల కాళ్లు కడిగాడు. 5 వేల మందికి భోజనం ఏర్పాటు చేశాడు. అంటరాని వాళ్లుగా ముద్రపడ్డ కుష్టులను ప్రేమించాడు. నాయకత్వానికి, వ్యాపార నిర్వ హణకు బైబిల్ అందించిన రెండు చక్కటి ఉదాహరణలివి. ఈ లక్షణాలున్న నాయకుడు వ్యక్తిగా, జట్టుగా చాలా ప్రభా వాన్ని చూపిస్తాడు. గాంధీ, మండేలా, లింకన్, మదర్థెరిసా వంటివారు ఆ సత్యాన్ని నిరూపించారు కూడా. - పీటర్ పాల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బోర్డ్ అధ్యక్షులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ -
క్రీస్తు నడయాడిన ముఖ్య ప్రదేశాలు...
1. బెత్లెహేమ్ ఇది క్రీస్తు పుట్టిన ఊరు. ‘హోలీల్యాండ్’గా, ‘బైబిల్ల్యాండ్’గా ప్రసిద్ధి పొందింది. ఇజ్రాయెల్లో ఉంది. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటైన ఇజ్రాయెల్ ముస్లింలకు, యూదులకు కూడా పవిత్ర దేశమే. ఇది 1948లో స్వాతంత్య్రం పొందింది. అంతకు ముందు పాలస్తీనాలో అంతర్భాగంగా ఉండేది. బెత్లెహేమ్లో క్రీస్తు పుట్టిన ప్రదేశం పాలస్తీనా భూభాగంలో ఉంది. ఆ ప్రదేశంలో నిర్మించిన ‘చర్చ్ ఆఫ్ నేటివిటీ’ అత్యంత పురాతనమైన చర్చిలలో ఒకటి. ఇక్కడే ఉన్న ‘సెయింట్ క్యాథరీన్ చర్చ్’లో ఏటా డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగే క్రిస్మస్ ఆరాధనను ప్రముఖ టీవీ చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇక్కడకు కొద్ది దూరంలోనే ‘షెపర్డ్స్ ఫీల్డ్’ ఉంది. క్రీస్తు జనన వార్తను దేవదూత గొర్రెల కాపరులకు వెల్లడించిన పవిత్ర స్థలం ఇదే. 2. నజరేత్ యేసు పుట్టిన తర్వాత తల్లి మరియ, తండ్రి యోసేపు బిడ్డను తీసుకుని ఈజిప్టు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్కు ఉత్తరాన ఉన్న ‘గలిలయ’ ప్రాంతం లోని తమ పూర్వీకుల ప్రాంతమైన నజరేత్కు చేరుకున్నారు. యేసు బాల్యం గడిచింది ఇక్కడే. నజరేత్లో యేసు తల్లి మరియ, తండ్రి యోసేపుల ఇళ్లు ఉన్నాయి. 3. కానా నజరేత్కు చేరువలోనే కానా పట్టణం ఉంది. ఇక్కడే ‘గలిలయ’ సరస్సు ఉంది. ఇది జోర్డాన్ నదికి చెందిన జలాశయం. ఈ సరస్సు దగ్గరే యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యేసు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే సంచరించేవాడు. ఆయన శిష్యులు కూడా ఈ పరిసరాలకు చెందినవారే. 4. జోర్డాన్ నది యేసు తన ముప్ఫయ్యవ ఏట జోర్డాన్ నదిలోనే బాప్టిజం పొందాడని, తర్వాత అక్కడి అరణ్యంలోనే నలభై రోజులు ఉపవాస దీక్ష చేశాడని చెబుతారు. అందుకే, చాలామంది జోర్డాను నదిలో బాప్టిజం తీసుకోవాలనుకుంటారు. ఈ నది కలిసే మృతసముద్రం ప్రపంచం లోనే అత్యంత లోతైనది. దీనిలోని నీరు చర్మరోగాలను నయం చేయగలదనే నమ్మకం కూడా ఉంది. 5. తక్బా గలిలయ ప్రాంతం లోని కపెర్నామ్ వద్ద ఉంది‘తక్బా’. ఇది యేసుక్రీస్తు ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదువేల మంది ఆకలి తీర్చిన స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడే ఉన్న ‘మౌంట్ టాబర్’ను క్రీస్తు పునరుత్థానం చెందిన ప్రదేశంగా చెబుతారు. 6. జెరికో జెరికో పట్టణం పాలస్తీనాలో ఉంది. ఇది క్రీస్తు నడయాడిన ప్రదేశాల్లో ఒకటి. ఈ పట్టణంలోనే ఒక అంధునికి యేసు తన స్పర్శ ద్వారా చూపు నిచ్చినట్లు చెబుతారు. ఈ పట్టణాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పట్టణంగా భావిస్తారు. దాదాపు క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల కిందటే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు పురాతత్వ ఆధారాలు దొరికాయి. 7. జెరూసలెం బెత్లెహేమ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందిది. ఇక్కడే యేసును శిలువ వేసిన గొల్గొతా కొండ, ఆయనను సమాధి చేసిన స్థలం ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రార్థన చేసిన ఒలీవల కొండ, శిష్యులతో కలసి ఆయన చివరి విందు ఆరగించిన మేడ గది, దావీదు సమాధి, రాచభటులు ఆయనను బంధించిన గెత్సెమనె తోట, మరియమ్మ సమాధి వంటి పలు పవిత్ర స్థలాలు జెరూసలెంలోనే ఉన్నాయి. ఇక్కడ సొలొమోను రాజు నిర్మించిన ఆలయ ప్రహరీగోడ క్రైస్తవులకు, యూదులకు కూడా పవిత్ర స్థలం. దీనినే ‘ప్రలాపాల ప్రాకారం’ అంటారు. అక్కడ చేసే ప్రార్థనలను దేవుడు తప్పక ఆలకించి, అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. -
జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేం వెళ్లేందుకు వైఎస్ జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. -
జెరుసలేంలో మళ్లీ ఉద్రిక్తత
పాలస్తీనా:మళ్లీ ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేం ఉద్రిక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురువారం జెరుసలేంలో పోలీసులు పాలస్తీనా వ్యక్తిని కాల్చిచంపడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జెరుసలేంలోని పవిత్ర స్థలానికి అత్యంత సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఒక్కసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పాలస్తీనా దేశీయున్ని ఇజ్రాయిల్ పోలీసులు కావాలనే కాల్చి చంపారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమపై దాడి చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హమ్మయ్య! ఎంత ప్రశాంతత!
గాజా/జెరూసలేం: తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న గాజా ప్రాంతంలో సోమవారం ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. ఇరవై రోజులపాటు తుపాకులు, రాకెట్ దాడులతో దద్దరిల్లిన ప్రాంతంలో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు తగ్గడం, హమాస్ రాకెట్ దాడులు గణనీయంగా తగ్గడంతో గత 20 రోజులతో పోల్చితే గాజా ప్రశాంతంగా కనిపించింది. మరో వైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు అంతం పలుకుతూ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చాయి. మానవతా దక్పథంతో కూడిన బేషరతు కాల్పుల విరమణ ఒప్పందం ఉభయపక్షాల మధ్య తక్షణం కుదరాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం రాత్రి పిలుపునిచ్చింది. రంజూన్(ఈద్) పర్వదినం తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగించాలని, ఘర్షణలో దెబ్బతిన్న గాజా ప్రాంత బాధితులకు అత్యవసర సహాయం అందేలా సహకరించాలని కోరింది. శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 20 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. -
గాజాపై భూతల దాడులు
ఇజ్రాయెల్ దాడులకు ఇళ్ల నుంచి పారిపోయిన వేలాది పాలస్తీనియన్లు జెరూసలెం: పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేసింది. ఆదివారం తొలిసారి భూతల దాడులకు దిగింది. దీంతో వేలాది పాలస్తీనియన్లు ఇళ్లు వదలి పారిపోయారు. హమాస్ రాకెట్ దాడులను అరికట్టేందుకు ఇజ్రాయెల్ నౌకాదళ కమాండోలు అరగంటపాటు గాజాలోకి చొచ్చుకె ళ్లి ఓ క్షిపణి ప్రయోగ కేంద్రంపై దాడి చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తమ నలుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని, గాజాలోకి వెళ్లిన తమ సైనికులందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో పౌరులు చనిపోవడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విచారం వ్యక్తం చేశారు. హమాస్ పాలస్తీనియన్లను మానవ కవచాలుగా వాడుకుంటోందని, దాని రాకెట్ దాడులను అరికట్టేందుకు భారీగా దాడులు చేస్తామని హెచ్చరించారు. -
ఇజ్రాయిల్ మాజీ ప్రధాని ఏరియల్ షారోన్ మృతి
జెరూసలెం: ఇజ్రాయిల్ మాజీ ప్రధాని ఏరియల్ షారోన్(85) మృతి చెందారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కోమాలో ఉన్న షారోన్ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. రోమాన్ గేన్ నగరంలోని షేబా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రాణాలు కోల్పోయారు. షారోన్ మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో రెండు వారాల క్రితం ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షారోన్ మృతి చెందే సమయంలో ఆయన కుమారులు అతనితో పాటే ఉన్నారు. ఆయన అంత్యక్రియ ఏర్పాట్లును ప్రభుత్వ హోదాలో నిర్వహించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
జెరూసలెంలో జగన్ కోసం ప్రార్థనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ఇక్కడే కాదు.. క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువాళ్లు జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడినుంచి వెళ్లిన జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా వెళ్లి.. జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.