Junk food
-
సమోసా, చిప్స్ తింటున్నారా!
సమోసా.. పకోడీ.. ఫ్రైడ్ చికెన్.. చిప్స్.. బిస్కెట్లు.. కేక్స్.. రెడీమేడ్ మీల్స్.. మయోనైజ్, గ్రిల్డ్ చికెన్.. డ్రై నట్స్.. వేయించిన వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు డయాబెటిస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలో వెల్లడైంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన తాజా క్లినికల్ ట్రయల్ రన్లోనూ మధుమేహం ముప్పునకు పైన పేర్కొన్న ఆహార పదార్థాలే కారణమని స్పష్టమైంది. – సాక్షి, అమరావతిఏజీఈ అధికంగా ఉండటం వల్లే..సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, నూడిల్స్, సూప్లు, ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలను పిల్లల నుంచి పెద్దలు ఇష్టంగా తింటున్నారు. ఈ తరహా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) దేశంలో మధుమేహం ముప్పును రోజురోజుకూ పెంచుతోంది. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానికి ఉండటానికి హానికరమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు రక్తంలో చక్కెరను పెంచుతున్నాయని తేలింది.అధునాతన గ్లైకేషన్ ముగింపు ఉత్పత్తులు (ఏజీఈ) హానికరమైన సమ్మేళనాలు. గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లు లేదా కొవ్వులు చక్కెరలతో సంకర్షణ చెందుతున్నప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు, అందులో ఏజీఈలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం ఊబకాయాన్ని పెంచుతోందని.. ఇది మధుమేహానికి ప్రధాన కారణమవుతోందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురించబడింది.ఆయుర్దాయంపై ప్రభావం టైప్–2 డయాబెటిస్ మనిషి ఆయుర్దాయంపైనా ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ వర్గానికి చెందిన 19 దేశాల్లో 15 లక్షల మంది జనాభా ఆరోగ్య రికార్డులపై అధ్యయనానికి సంబంధించిన అంశాలను ఇటీవల ది లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీలో ప్రచురించారు. 30 ఏళ్లలో టైప్–2 బారినపడిన వ్యక్తి సగటు ఆయుర్దాయం 14 ఏళ్లు క్షీణిస్తుందని, 40 ఏళ్ల వయసులో సమస్య తలెత్తితే పదేళ్లు, 50 ఏళ్లకు కనిష్టంగా ఆరేళ్ల చొప్పున ఆయుర్దాయం తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.38 మందిపై.. 12 వారాల పరీక్ష పరిశోధన నిమిత్తం ఎంపిక చేసిన 38 మందిపై 12 వారాలపాటు పరీక్షలు నిర్వహించారు. మధుమేహం లేనివారిని రెండు సమూహాలుగా విభజించారు. 12 వారాల పాటు ఒక సమూహానికి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్డ్స్ (ఏజీఈ) తక్కువగా ఉండే ఆహారం, మరో సమూహానికి ఏజీఈ అధికంగా ఉండే ఆహారాన్ని అందించారు. 12 వారాల అనంతరం పరిశీలిస్తే అధిక ఏజీఈ ఆహారం తిన్న సమూహంతో పోలిస్తే తక్కువ ఏజీఈ ఆహారం తిన్న సమూహంలోని వ్యక్తుల్లో టైప్–2 మధుమేహం ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. వీరిలో ఇన్సులిన్ నిరోధకతæ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. కేకులు, కుక్కీలు వంటి కాల్చిన ఆహారాల్లో ఏజీఈలు ఎక్కువగా ఉంటాయి.చిప్స్, సమోసాలు, పకోడీలు, వేయించిన చికెన్ వంటి వాటిలో పెద్ద పరిమాణంలో ఏజీఈ ఉంటోంది. అలాగే రెడీమేడ్ ఆహార పదార్థాల రూపంలో వచ్చే వనస్పతి, మయోనైస్ కూడా చక్కెరను పెంచుతాయి. కాల్చిన మాంసాలు, కాల్చిన గింజలలో ఏజీఈలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ స్థానంలో తక్కువ ఏజీఈ డైట్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఏమిటీ అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ఫ్రై, రోస్ట్ (బాగా వేడి) చేసిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) ఆహారాన్ని తిన్నప్పుడు కార్పొహైడ్రేట్స్ శరీరంలో నేరుగా ప్రొటీన్స్, కొవ్వులతో కలిసి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్(ఏజీఈ)లుగా రూపాంతరం చెందుతాయి. వీటివల్ల శరీరంలో హానికరమైన మాలిక్యుల్స్ తయారవుతాయి. ఇవి ఎక్కువ కావడంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది. శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్ను అందించడంలో ఇన్సులిన్ తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఏజీఈ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో తిన్న ఆహారంలోని చక్కెర పదార్థాలు కణాలకు అందకుండా రక్తంలోని ఉండిపోయి టైప్–2 మధుమేహానికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏజీఈ అధికంగా ఉండే బేకరీ, హోటల్స్లో తయారు చేసే కేక్స్, చిప్స్, ఐస్క్రీమ్స్, ఇంట్లో డీప్ ఫ్రై, ఫ్రై ఆహార పదార్థాలు తినడం తగ్గించాలని పరిశోధకులు స్పష్టం చేశారు.మిలమిలలాడే ఆహార పదార్థాలను వినియోగించొద్దు పూరీ్వకులు పాలిష్ చేయని దంపుడు బియ్యం, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, ఉప్పు ఇలా ప్రతీది తెల్లగా మిలమిలలాడేలా పాలిష్ చేస్తున్నారు. ఈ పాలిష్ ఆహార పదార్థాలను విడనాడాలి. – పి.శ్రీనివాసులు, హెచ్వోడీ ఎండోక్రినాలజీ విభాగం, కర్నూలు మెడికల్ కాలేజీ జీవన శైలిలో మార్పు రావాలి టైప్–2 మధుమేహం అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా వస్తుంది. దీనికి తోడు హానికరమైన ఆహారపు అలవాట్లు తోడై పిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయతి్నంచాలి. మధుమేహం అని తేలాక అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ వెంకట సందీప్, ఎండోక్రినాలజిస్ట్, గుంటూరు -
జంక్ ఫుడ్పై ఫ్యాట్ ట్యాక్స్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారమే ప్రధానం. అయితే, అటువంటి ఆహారమే ఆనారోగ్యాల బారిన పడేలా చేస్తుంటే.. అదనపు బరువుకు కారణమవుతుంటే...అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వచ్చిన ఆలోచనే ఫ్యాట్ ట్యాక్స్. నోరూరించేలా... మంచి రుచి, రంగుతో ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీసే జంక్ ఫుడ్పై ఫ్యాట్ ట్యాక్స్ పేరుతో ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫ్యాట్ ట్యాక్స్... మరికొన్ని దేశాల్లో షుగర్ ట్యాక్స్ ఇలా వేర్వేరు పేర్లతో దీన్ని అమలు చేస్తున్నాయి.అదనపు పన్ను విధించడం వల్ల జంక్ ఫుడ్ ధర పెరిగి... వాటిని తినడం తగ్గుతుందనేది ఆయా ప్రభుత్వాల ఆలోచన. డెన్మార్క్, హంగేరి, మెక్సికో, కొలంబియా, బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు స్విట్జర్లాండ్ వంటి దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కొన్ని దేశాల్లో మంచి ఫలితాలు ఇవ్వగా... మరికొన్ని దేశాల్లో పెద్దగా ప్రభావం చూపించడంలేదు. ఇక మన దేశంలో ఫ్యాట్ ట్యాక్స్ను మొదటిసారిగా కేరళ ప్రభుత్వం అమలు చేసింది. అయితే, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017 నుంచి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. కేరళ స్ఫూర్తితో గుజరాత్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ... జీఎస్టీ విధానం రాకతో అమలు కాకుండా ఆగిపోయింది. డెన్మార్క్తో షురూ...!ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, జంక్ ఫుడ్ వినియోగం తగ్గించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధించడం ప్రారంభించాయి. ముందుగా డెన్మార్క్ దీనికి పునాది వేసింది.శ్యాచురేటెడ్ ఫ్యాట్ (అనారోగ్య కొవ్వు) 2.3 శాతం కంటే ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్పై 2011 నుంచి అదనపు పన్ను విధిస్తూ డెన్మార్క్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు కొవ్వు ఉన్న పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాల వినియోగం తగ్గించి పండ్లు, పాలు వంటి ఆహారపదార్థాల వైపునకు మళ్లించాలనేది ఆ ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ విధానం అక్కడ సంతృప్తికర ఫలితాలేవీ ఇవ్వలేదన్నది ఆ తర్వాత కాలంలో తేలింది. ఇక హంగేరిలో అధిక మోతాదులో చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలపై అదనపు పన్ను విధించారు. నాలుగేళ్ల తర్వాత ఈ పన్ను విధానం ఫలితాలపై సర్వే కూడా చేసింది. సుమారు 73 శాతం మంది వినియోగదారులు జంక్ ఫుడ్ నుంచి ఇతర ఆరోగ్య ఆహారం... పండ్లు వగైరాలవైపు మళ్లినట్టు తేల్చింది. ‘‘బార్బడోస్ దేశంలో 2016 అక్టోబర్లో జంక్ ఫుడ్, శీతల పానీయాలపై అదనంగా 10 శాతం పన్నునువిధించారు. ఏడాది తర్వాత పరిశీలిస్తే... షుగర్ అధికంగా ఉండే శీతల పానీయాల వినియోగం 4.3 శాతం తగ్గగా... ఇతర ఫ్రూట్ జ్యూస్ల వినియోగం 5.2 శాతం పెరిగింది’అని పరిశోధన చేసిన రెడ్పాపజ్ అనే ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరోలినా పైనరోస్ ఓస్పియానా తెలిపారు.అదేవిధంగా అమెరికాలోని బెర్కెలీ నగరంలో కూడా ఈ అదనపు పన్ను విధింపుతో 9.6 శాతం మేర షుగర్ అధికంగా ఉండే పానీయాల కొనుగోలు తగ్గిందని ఆయన పేర్కొంటున్నారు. ‘కొలంబియాలో 56.4 శాతం మంది జనాభా అదనపు బరువుతో బాదపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జంక్ ఫుడ్ ట్యాక్స్ను తప్పకుండా విధించాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా 2022 డిసెంబర్లో కొలంబియా చట్టం తెచ్చి అమలు ప్రారంభించింది. ఈ పన్ను 10 శాతంతో ప్రారంభించి... 2025 నాటికి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.అయితే, దీనిని ఎన్జీవో సంస్థలు స్వాగతించగా... పలు వ్యాపార సంస్థలు కోర్టుకెక్కాయి. వ్యాపార సంస్థల పిటిషన్లను 2023 అక్టోబర్లో కోర్టు కొట్టేసింది. ఫ్రాన్స్లోనూ మొత్తం జనాభాలో 15 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ దేశం కూడా 20 శాతం అదనపు పన్ను వసూలు చేస్తోంది. స్విట్జర్లాండ్లో షుగర్ ట్యాక్స్ పేరుతో షుగర్ ఎక్కువగా ఉండే శీతల పానీయాలపై అదనపు పన్ను విధించారు. అంతేకాకుండా నార్వే, చీలి, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ అదనపు పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి.జీఎస్టీ రాకతో....!వాస్తవానికి భారతదేశంలో కూడా జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించాయి. ప్రధానంగా కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా 2016 ఆగస్టులో జంక్ఫుడ్పై 14.5 శాతం అదనపు పన్ను విధించింది. ప్రధానంగా పిజ్జాలు, బర్గర్లపై ఈ అదనపు పన్ను వసూలును ప్రారంభించింది. కేరళలో ఈ విధానం అమలును పరిశీలించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం కూడా 2017 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయిచింది. అయితే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017లో అమల్లోకి రావడంతో భారతదేశంలో ఫ్యాట్ ట్యాక్స్ అమలు కాస్తా కేరళలో నిలిచిపోయింది.ఆగస్టు 2016 నుంచి జూన్ 2017 వరకూ అంటే మొత్తం 11 నెలల పాటు ఈ అదనపు ఫ్యాట్ ట్యాక్స్ విధానం కేరళలో అమలుకాగా... 2017 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన గుజరాత్ కాస్తా జీఎస్టీ రాకతో అమలు చేయకుండానే వెనుదిరగాల్సి వచి్చంది. భారతదేశంలో తాజాగా 3 కోట్ల మంది యువత అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారని లాన్సెట్ సర్వే తెలియజేస్తోంది. మొత్తానికి ప్రపంచ జనాభాలో అధిక బరువు (స్థూలకాయం) ఉన్న వారి శాతం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో ఈ విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘మాయో’తో రోగాలు కొనితెచ్చుకోవద్దు..ఇవిగో ప్రత్యామ్నాయాలు
మయోన్నెస్ లేదా ‘మాయో’...క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి జంక్ఫుడ్ తినే వారికి, పిల్లలకు మాయో బాగా పరిచయం. అలాగే సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ మీద అలా వేసుకుని రెడీమేడ్గా తినేస్తారు మరికొంతమంది. అయితే ఇది రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మీకు తెలుసా? మయోన్నెస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. మాయోతో నష్టాలుమయోన్నెస్ రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నెస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్మాయోతో ఆరోగ్య ప్రయోజనాలు శూన్యం. పైగా అధిక వినియోగం అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యమ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. దోసకాయ ఆర్ద్రీకరణ, నిర్విషీకరణకు మంచిది. పెరుగు, పుదీనా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. పుదీనా ప్రకోప ప్రేగు సిండ్రోమ్తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. దోసకాయ , పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులో వెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్,రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి. అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని వాడవచ్చు. -
ఒత్తిడికి గురైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా?
సాధారణంగా దైనందిన జీవితం లేదా కెరీర్లో రకరకాల ఒత్తిడులను ఎదుర్కొనాల్సి వస్తుంటంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లకు లోనవ్వుతుంటాం. అవి మంచివి అయితే పర్లేదు. అదే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి అవి మనషులను ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారని వాటివల్ల వారి ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతుందో సవివరంగా వెల్లడించారు. అదెలాగో తెలుసుకుందామా..!బౌల్డర్లోని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం..ఒత్తిడికి గురైనప్పుడూ చాలామంది సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారట. ఇలా తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయే గానీ ప్రయోజనం ఉండదని పరిశోధనలో తేలింది. అందుకోసం జంతువులపై జరిపిన అధ్యయనంలో పల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో ఉన్నప్పుడూ అవి అధిక కొవ్వుతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో వాటి శరీరంలోని గట్ బ్యాక్టీరియాకి అంతరాయం కలిగించి వాటి ప్రవర్తనను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెదుడు రసాయనాలన ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధన పేర్కొంది కూడా. ఈ మేరకు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ మాట్లాడుతూ..అధిక కొవ్వు మెదుడులోని జన్యువుల వ్యక్తీకరణనే మార్చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని అన్నారు. అంతేగాదు తమ పరిశోధనలో ఈ అధిక కొవ్వు ఆహారం తప్పనిసరిగా మెదుడులో ఆందోళన స్థితి మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. పైగా ఇలా జంక్ఫడ్ ఎక్కువగా తీసుకున్న జంతువుల్లోని మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాని అంచనా వేయగా తక్కువ వైవిధ్యాన్ని చూపించాయని, పైగా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిపారు. అంతేగాదు ఈ అధిక కొవ్వుతో కూడిన ఆహారం కారణంగా మెదడులో న్యూరోట్రాన్స్మీటర్ సెరోటోనిన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్లో మూడు జన్యువులు అధిక వ్యక్తీకరణనను చూపించడం గుర్తించామన్నారు పరిశోధకులు. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచే సంకేతమని చెబుతున్నారు. ఇక్కడ ఈ సెరోటోనిన్న ఫీల్ గడ్ బ్రెయిన్ కెమికల్ అని పిలుస్తారు. అయితే పరిశోధనలో జంతువుల్లోని ఈ సెరోటోనిన్ న్యూరాన్లలోని కొన్ని ఉపసమితులను సక్రియం చేయండంతో ఆందోళన వంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంటే ? ఇక్కడ.. శరీరంలోని అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్(మనం తీసుకున్న ఆహారం)తో రాజీపడి శరీర ప్రసరణలో కలిసిపోతుంది. దీంతో జీర్ణశయాంతర ప్రేగు నుంచి మెదడుకు వెళ్లే వాగస్ నరాల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ అయ్యి ప్రవర్తనను లేదా మూడ్ని మారుస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం మనకు అనారోగ్యం కలిగించే విషయాలను గుర్తించి తద్వారా భవిష్యత్తులో వాటిని నివారించేలా చేసే మరిన్ని ప్రయోగాలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఇక్కడ అన్ని కొవ్వులు చెడ్డవికావని చేపలు ఆలివ్ నూనె వంటి మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: డిప్రెషన్తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
తళుకుల మాటున కల్తీమాయ!
ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్ఫాత్ బండ్ల నుంచి స్టార్హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వీటిలో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.కల్తీ ఇలా.. మచ్చుకు..– తేనె పేరిట గ్లూకోజ్వాటర్లో పంచదార పాకం, వార్నిష్, డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్.– ఓల్డ్సిటీలోని చావ్నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు. ఉప్పుగూడ, బహదూర్పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్ ,మైలార్దేవ్పల్లి, టాటానగర్ , మల్లాపూర్, జల్పల్లి, శంకర్నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.నిబంధనలకు నీళ్లు.. – ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.కాగితాల్లోనే యాప్.. – హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్లైన్ ఆర్డర్లపై, క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల టేక్అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. – ప్రతి హోటల్లోనూ ట్రేడ్ లైసెన్సు ఫుడ్ లైసెన్సు సర్టిఫికెట్లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు విధించాలి.పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా, కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో హెల్త్ చెకప్లు చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.పేరు గొప్ప.. తీరు దయనీయం..దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్స్టోన్, నేచురల్స్ ఐస్క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సీ, రోస్టరీ కాఫీ, హౌస్ రాయలసీమ, రుచుల షా, గౌస్ కామత్ హోటల్, 36 డౌన్టౌన్ బ్య్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఏయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జోయ్, ఖాన్సాబ్, సుఖ్సాగర్ రెస్టారెంట్, జంబోకింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, అట్లూరి ఫుడ్స్ ప్రై వేట్ లిమిటెడ్(చట్నీస్ కాఫీహౌస్ అండ్ వెజ్ రెస్టారెంట్),షాన్బాగ్ హోటల్ డీలక్స్, గౌరంగ్ డిజైన్స్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్, కృతుంగ పాలేగార్స్ క్విజి, హెడ్క్వార్టర్స్ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024. The Rameshwaram Cafe* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired Above items discarded on the spot.(1/4) pic.twitter.com/mVblmOuqZk— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024 ఆరోగ్యం ఖతం.. కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్ డయోరియల్ డిసీజెన్ వస్తాయని ఫీవర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.రంగంలోకి టాస్్కఫోర్స్..వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్్కఫోర్స్ టీమ్స్ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్రూమ్స్ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్పైర్డ్ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్జరిమానాలు ఇలా (రూపాయలో)..ట్రేడ్ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 తాగునీరు ఉచితంగా ఇవ్వకుంటే - 1000 వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 టాయ్లెట్లు శుభ్రంగా లేకుంటే - 5000 టాయ్లెట్లు లేకుంటే - 2000 మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వాడితే - 10,000 కోల్డ్ చాంబర్లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 5002023లో.. అందిన ఫిర్యాదులు : 2885 తనిఖీలు చేసినవి : 1685 జీహెచ్ఎంసీ పరిధిలో లేనివి : 1047 ఇతర కేటగిరీవి : 165 పెండింగ్ : 15 జీహెచ్ఎంసీలో ఉండాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 31 పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 23గత మూడేళ్లలో..లైసెన్సుల జారీ : 33251 వసూలైన ఫీజు : రూ.9,71,02,700 స్ట్రీట్ వెండర్స్ ‘రిజిస్ట్రేషన్లు : 36334 వచ్చిన ఫీజు : రూ.59,48,270 ఫేడ్సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 ఫిర్యాదు చేసేందుకు..జీహెచ్ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 దెబ్బతింటున్న కిడ్నీలు..పెచ్చుమీరుతున్న కల్తీ ఆహారంతో క్యాన్సర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా రా మెటీరియల్ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్ కలర్స్, కెమికల్స్ అన్నీ అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్ అయిన ఆయిల్తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. – హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్కఠిన చర్యలుండాలి!తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు. కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఉండాలి.– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్నిబంధనలు పాటించాలి..హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్ఎస్ఎస్ఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.– కె. బాలాజీరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్శిక్షణ ఉండాలి..ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్ ఉండాలి. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్లైన్పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.– తుమ్మల సంపత్ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
జంక్ఫుడ్.. 32 ఆరోగ్య సమస్యలు!
జంక్ ఫుడ్ తింటే అనారోగ్యం...!! ఊబకాయం వస్తుంది... గుండెజబ్బులకు.. మరెన్నో ఇతర వ్యాధులకూ కారణమవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ... మొత్తం ఎన్ని సమస్యలకు జంక్ ఫుడ్ కారణమవుతుందన్నది మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు. తాజా అధ్యయనం ఈ కొరతనూ తీర్చేసింది!జంక్ ఫుడ్తో అక్షరాలా... 30 రకాల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి అంటోంది ఈ అధ్యయనం. వివరాలేమిటో చూసేద్దామా...??? ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకూ జంక్ఫుడ్కు దూరంగా ఉండాలని, సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు, నిపుణుల చెబుతూంటారు. బాగా శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి అందించే తిండి పదార్థాలను జంక్ఫుడ్ అని పిలుస్తూంటాం మనం. బేకరీ పదార్థాలు, చిరుతిళ్లు, తీపి కలిగినవి, కార్బొనేటెడ్ పానీయాలు (కోలా డ్రింక్స్), చక్కెర కలిపిన కార్న్ఫ్లేక్స్ వంటివి, రెడీ టు ఈట్ పదార్థాలు.. ఇలా జంక్ ఫుడ్ జాబితా చాలా పొడవుగానే ఉంటుంది. సౌకర్యం కోసమో.. తీపిపై ఉండే ఆకర్శణ కారణంగానో కొన్ని దశాబ్దాలుగా మనిషి ఈ జంక్ఫుడ్కు బాగా దగ్గరయ్యాడు. ఆరోగ్య సమస్యలూ అంతే స్థాయిలో మనకు పెరుగుతూ పోయాయి. ఈ సమస్య గురించి చాలామందికి తెలిసినప్పటికీ పూర్తిస్థాయి అవగాహన తక్కువ మందికే ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొందరు జంక్ఫుడ్తో వచ్చే ఆరోగ్య సమస్యలను స్థూల స్థాయిలో అర్థం చేసుకునేందుకు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇప్పటికే జరిగిన దాదాపు 45 మెటా అనాలసిస్ (అధ్యయనాల) వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ మెటా అనాలసిస్లన్నీ గత మూడేళ్లలో ప్రఖ్యాత పరిశోధన జర్నళ్లలో ప్రచురితమైనవే. ఈ పద్ధతి కారణంగా దాదాపు కోటి మంది జంక్ఫుడ్ అలవాట్లు, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యల వివరాలు తెలిశాయి. జంక్ఫుడ్కు ఆరోగ్య సమస్యకు ఉన్న సంబంధానికి చూపిన సాక్ష్యాలను కూడా నిశితంగా విశ్లేషించారు. మూడు వర్గాలుగా విభజించారు. ఎక్కువ అవకాశం ఉండటం, ఓ మోస్తరు.. సాక్ష్యాలు లేకపోవడం అన్నమాట. మొత్తమ్మీద చూస్తే జంక్ఫుడ్ ఎంత ఎక్కువ తింటున్న వారికి రాగల ఆరోగ్య సమస్యలు కనీసం 32 వరకూ ఉన్నట్లు స్పష్టమైంది. కేన్సర్, మరణం, మానసిక, ఊపిరితిత్తుల, గుండె, జీర్ణకోశ, జీవక్రియల సంబంధిత ఆరోగ్య సమస్యలన్నింటికీ జంక్ఫుడ్కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇంకా... గుండెజబ్బులతో మరణించే అవకాశం 50 శాతం ఎక్కువ.-యాంగ్జైటీ తదితర మానసిక సమస్యలు వచ్చేందుకు 48 నుంచి 53 శాతం అవకాశం. టైప్-2 మధుమేహం బారిన పడేందుకు కనీసం 12 శాతం అవకాశం. ఏ కారణం చేతనైనా మరణం సంభవించేందుకు 21 శాతం వరకూ అధిక అవకాశాలు ఉన్నాయి. ఊబకాయం, నిద్రలేమి, గుండె జబ్బులతో మరణం వంటివాటికి 40 నుంచి 60 శాతం అవకాశాలున్నట్లు స్పష్టమైంది. ఉబ్బసం, జీర్ణకోశ సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, మంచి కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలకు జంక్ఫుడ్కు మధ్య సంబంధానికి సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. -
'జంక్ ఫుడ్' ఎంత ప్రమాదకరమో..! మాన్పించాలంటే ఇలా చేయండి!
పీజా, బర్గర్, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్స్కు అలవాటుపడిన పిల్లలు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు. రోజూ జంక్ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇది పట్టని పిల్లలు అదే కావాలని మొండికేస్తుంటారు. ఇటువంటి వారిని జంక్ఫుడ్ని దూరంగా ఉంచాలంటే ఇలా చేయండి చాలు.. ఇష్టమైనవి వండండి.. జంక్ఫుడ్ పూర్తిగా మాన్పించాలంటే.. ముందుగా పిల్లలు బాగా ఇష్టపడే వంటకాలను వండాలి. పిల్లలు ఏది తినడానికి ఆసక్తి చూపుతున్నారో అవి మాత్రమే వారికి చేసిపెట్టాలి. పెద్దలు తినేదే రోజు పెడితే అది నచ్చక బయట ఫుడ్కి అలవాటు పడతారు. ఇంట్లో ఫుడ్ మొహం మొత్తకుండా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఉపయోగించి బర్గర్స్, పిజ్జాలను ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి. అలవాట్లు.. వీలైనంత త్వరగా పిల్లల ఆహారపు అలవాట్లు మార్చాలి. అలవాట్లు మార్చుకోకపోతే జంక్ఫుడ్ మానరు. మీరు చేసే ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ, బుజ్జగిస్తూ చెబితే బయట తినే అలవాటును మానుకుంటారు. పోషకాల గురించి వివరించాలి.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లలకు పెట్టే రకరకాల డిష్లను వేటితో తయారు చేశారు, వాటిలో పోషకాలు ఏం ఉంటాయి? అవి శరీరానికి చేసే మేలుని చక్కగా వివరిస్తే ఇంటి ఫుడ్ని తినడానికి ఆసక్తి చూపి జంక్ ఫుడ్ని అస్సలు ముట్టరు. ఈ పద్ధతులను అనుసరిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా మారడం ఖాయం. ఇవి చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి.. -
ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!
పిల్లలకు చిరుతిండ్లు, జంక్ఫుడ్ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. పిల్లలే కాదు పెద్దల్లోనూ ఆ అలవాటు ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్ఐ) రిపోర్ట్ ప్రకారం జంక్ఫుడ్ సేల్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీల సేల్స్లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాటా పెరుగుతోంది. దేశంలో ప్రముఖ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారుచేస్తున్న 1,901 ప్రొడక్టుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. మొత్తం ఏడు కేటగిరీల్లో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్ఐ వెల్లడించింది. ప్రొడక్ట్ వివరాలు, గవర్నెన్స్, మార్కెటింగ్, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్ఐ కంపెనీలకు హెల్తీనెస్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఐటీసీ టాప్లో ఉందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్ పొందిన ప్రొడక్ట్లను హెల్తీ ప్రొడక్ట్లుగా ఏటీఎన్ఐ వర్గీకరించింది. ఇందులో పండ్లు, కూరగాయలు, ఫైబర్, కంట్రోలింగ్ స్థాయిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉన్నాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో చాలా వాటికి చెందిన ప్రొడక్ట్ల రేటింగ్ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్ఏ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్ల యావరేజ్ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్ల రేటింగ్ ఐదుకు 1.5గా ఉందని, కేవలం 12 శాతం ప్రొడక్ట్లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఎస్ గారెట్ అన్నారు. డైట్, న్యూట్రిషన్, హెల్త్ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక! ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉప్పు, షుగర్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వాటాను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్లను హిందుస్తాన్ యునిలీవర్, ఐటీసీలు తయారుచేస్తున్నాయి. కానీ అందులోనూ చాలా సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హెల్తీ ఫుడ్ అంటే ఏంటో తెలియజేయడానికి ప్రామాణిక నిర్వచనం ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ‘హెల్తీఫుడ్’ పేరుతో ఉత్పత్తులు తయారుచేస్తున్నాయని తెలిపింది. కానీ అవి అంతర్జాతీయ ప్రయాణాలకు తగినట్లు గుర్తింపు పొందడం లేదని చెప్పింది. -
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్..చిన్నారుల్లో సైతం ప్రబలుతున్న ఓ వ్యాధి. పిల్లల కాలేయాలను కమ్ముకుంటున్న ఫ్యాటీ లివర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తును చేజేతులా రోగాలకు అప్పగించినట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బొద్దుగా ముద్దుగా మెరిసిపోతూ మడత నలగని దుస్తుల్లో పాఠశాలలకెళ్లొచ్చే చిన్నారుల్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. పెద్దల్లోనే కాదు.. హైదరాబాద్కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ల బృందం నగరంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో అధ్యయనం నిర్వహించింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా పెద్దలే ఈ వ్యాధి బాధితులుగా ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం తప్పని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏమిటీ ఫ్యాటీ లివర్? కాలేయం (లివర్)లో అధిక మొత్తంలో కొవ్వు (ఫ్యాట్) పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ వ్యాధి (స్టీటోసిస్) చాలావరకు పెద్దల్లో ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన లివర్లోనూ స్వల్పంగా కొవ్వు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది. ఆహారం.. వ్యాధుల భారం సోడా, చాక్లెట్లు నూడుల్స్, బిస్కెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు వీరు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా యూరప్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడింది. పిల్లలు తినే జంక్ ఫుడ్ చాలావరకు దీనికి కారణమవుతోంది..‘అని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అధ్యయనం కూడా చిన్నారులతో సహా 30 శాతం మందిలో ఈ వ్యాధి విస్తృతి ఉన్నట్లు తాజాగా గుర్తించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇది తక్కువగా ఉన్నట్లు తేల్చింది. ‘ఆట స్థలాలు లేక పాఠశాలల పిల్లల్లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.రవాణా సౌకర్యాలు కూడా నడకను తగ్గించి వారిలో ఊబకాయానికి ఊతమిస్తున్నాయి..‘అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ అంటున్నారు. ‘సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాల్లో కనుగొన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇది తక్కువ..‘అని ఏఐజీ బృందంలోని ఓ వైద్యుడు చెప్పారు. జంక్ ఫుడ్పై అవగాహన పెంచాలి చిన్నపిల్లల ఆహారంలో చిప్స్, బర్గర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటివి భాగం కాకుండా చూడాలి. వీటివల్ల శరీరంలోని బాక్టీరియా మారిపోయి ఫ్యాటీ లివర్కు కారణమవుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ చేసే చేటుపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంచాలి. కూరగాయలు, పెరుగు మంచివనే చిన్న చిన్న విషయాలు తరచు చెబుతుండాలి. సన్నగా ఉండే చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ ఫుడ్ తినమని చెప్పకూడదు. – డా.నాగేశ్వర్రెడ్డి, చైర్మన్, ఏఐజీ ఆసుపత్రి -
జంక్ ఫుడ్నే జంకేలా..తినడం స్టాప్ చేద్దాం ఇలా!
బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చాట్ బండ్లు.. ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. అంతకంటే చిన్న పిల్లలకు స్వయంగా తల్లిదండ్రులే మురిపెంగా తీసుకువెళ్లి తినిపిస్తుంటారు. అయితే బర్గర్లు, పిజ్జాలు, చాట్లు, మిల్క్షేక్స్, ఐస్క్రీమ్లు వంటివి తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరుతుంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం లేక పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు. జంక్ఫుడ్కు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్తరుచుల్లో స్నాక్స్ తయారు చేయటం నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్ చేసి పెడితే ఫాస్ట్ ఫుడ్స్కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు. ఏ అలాగే ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్ ఫుడ్ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది. ఏ అల్పాహారంలో బ్రెడ్, శాండ్విచ్లకు బదులు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్, పెసరట్టు, రాగి, క్యారట్ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి. ఏ బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి. ఏ ఫ్రిజ్ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులు తాజా పండ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు, పళ్లరసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఉండాలి. ఏ పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఏ ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి కాబట్టి ఔట్ డోర్ గేమ్స్ ఆడే పిల్లలకు వీటిని శ్నాక్స్గా ఇస్తూ ఉండాలి. జంక్ ఫుడ్ నుంచి రక్షించుకోవాలంటే..? పెద్ద వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటూ, కాఫీలు, టీలు తాగేస్తుంటే వారిని చూస్తూ పెరిగే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. అందువల్ల అలాంటి వాటిని ముందు పెద్దలు మానేయాలి. పెద్దవాళ్ళు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే పిల్లలు కూడా అవే తింటారు. నిమ్మరసం, క్యారెట్ రసం, బీట్రూట్ రసం రోజూ తీసుకోండి. పిల్లలు కూడా అవే ఇష్టపడతారు. (చదవండి: డయాబెటిస్ పేషెంట్స్కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నారని అర్థం!) -
ఆరోగ్యంగా ఉండాలంటే, మన సౌత్ ఇండియా వంటకాలే తినాలి
-
మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ.. అంటే మురిసిపోకండి!
‘మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ’ అని ఎవరైనా అంటే వారి తల్లిదండ్రులు తెగ మురిసిపోతున్నారు. బాల్యంలోనే బొద్దుగా తయారవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను అసలు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వారు తినే ఆహారంలో పోషకాలు ఏ మాత్రం ఉంటున్నాయనే విషయంపై ఆలోచించే వారైతే చాలా అరుదే. పంజాబ్లోని బటిండా, ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. పిల్లలకు పెట్టే ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలపై తక్కువ అవగాహన ఉంటోందని గుర్తించారు. – సాక్షి, అమరావతి 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పాఠశాలల్లో చదివే 14–18 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు 722 మంది, వారి తల్లిదండ్రులను ఎయిమ్స్ బృందం అధ్యయనానికి ఎంచుకుంది. ఆ పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల బారినపడేలా చేస్తున్నాయని గుర్తించారు. పిల్లలు తినే ఆహారాల (ప్యాకేజీ ఫుడ్) తయారీలో 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటున్నాయని తేల్చారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోందని తేల్చారు. ప్రకటనలతో ప్రభావితం టీవీలు, డిజిటల్ మీడియాలలో వచ్చే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వైపు పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని 273 మంది తల్లిదండ్రులు (37.8 శాతం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 184 (25.5 శాతం) మంది ప్రచారం చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో పోషకాల నాణ్యతకు సంబంధించిన సమాచార కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. దాదాపు 45 శాతం మంది తల్లిదండ్రులు ప్రసిద్ధ వ్యక్తులు జంక్ ఫుడ్స్ను ప్రమోట్ చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. జంక్ ఫుడ్పై కంపెనీలు ఆఫర్లు ఇస్తుండటాన్ని 34 శాతం మంది తప్పుపట్టగా.. ప్రైమ్ టైమ్లో జంక్ ఫుడ్ ప్రకటనలు వేయకూడదని 40 శాతం మంది కోరారు. గడువు తేదీని చూడని వారే అధికం అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థుల్లో 352 మంది (48.8 శాతం) విద్యార్థులు తినే ఆహార ప్యాకెట్లపై కనీసం గడువు తీరే తేదీని (ఎక్స్పైరీ డేట్)పరిశీలించడం లేదు. 526 మంది (72.9 శాతం) కేవలం ధరలను పరిశీలిస్తుండగా.. 518 మంది (71.7 శాతం) విద్యార్థులు కొనుగోలు చేసే ముందు ఆ ఆహారం వెజ్, నాన్–వెజ్ అనేది మాత్రమే చూస్తున్నారు. మార్కెట్లో లభించే ఆహార ప్యాకెట్లపై తయారీకి వినియోగించిన పదార్థాలు, వాటిలో ఉండే పోషకాలకు సంబంధించిన లేబుల్స్పై సమాచారాన్ని కేవలం 50 మంది విద్యార్థులు (6.9 శాతం) మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. 356 మంది విద్యార్థులు (49.30 శాతం) లేబుల్ చూసి తాము ఆహార పదార్థాల వైపు ప్రభావితం అవలేదని, 424 మంది (58.7 శాతం) లేబుల్స్ కారణంగా తమ కొనుగోలు ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోలేదని నివేదించారు. ఇంట్లోనే చేసి పెట్టాలి పిల్లలకు ఇంటి ఆహారం అలవాటు చేయాలి. పూర్వం తల్లిదండ్రులు పిల్లల కోసం ఇంట్లోనే చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు వంటి ఆహార పదార్థాలు చేసేవారు. ఆ తరహా పద్ధతులను ఇప్పుడు కూడా పాటించాలి. వీలైనంత వరకూ కూరగాయలు, పళ్లు తినడాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చైల్డ్ ఒబెసిటీ వస్తుంది. దీనివల్ల ఆస్తమా, ఫ్యాటీ లివర్, టైప్–2 డయాబెటిస్ వంటి సమస్యల బారినపడతారు. ఈ ఆహారంలో కలిపే పదార్థాల కారణంగా త్వరగా పిల్లల్లో కౌమార దశ మొదలవుతుంది. – డాక్టర్ నాగచక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, విజయవాడ జీజీహెచ్ -
బయట ఫ్రైడ్ రైస్, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే..
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 46 మనదేశంలో ఉన్నాయి. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండటం, బిర్యానీ, మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏం చేయాలంటే! 1. బయట బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తినటం ఆపి వేస్తే సగం జబ్బులు పోతాయి. 2. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు. 3. ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావని చెప్పవచ్చు. 4. ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం కూడా హార్ట్ ఎటాక్లకు కారణం. 5. శరీరంలో అనవసరమైన, అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమవుతుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో అవధులు దాటి డిపాజిట్ అవడం వలన గుండెకి రక్తం పంపింగ్ కష్టం అయిపోతుంది. 6. అధిక బరువు వలన గుండె పనితీరులో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు, రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి. అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి? గుండెనొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. విపరీతమైన చమట పడుతుంది. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది. కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది. వాంతులు అవుతాయి. పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగిస్తే మంచిది. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది. గ్యాస్ నొప్పి వచ్చినపుడు.. గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంటగా ఉంటుంది. గుండె నొప్పికి గాస్ నొప్పికికి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Stress Relief: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి!
జంక్ ఫుడ్తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజీ ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఇలా గుర్తించడం విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే, జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశాన్ని చిరుధాన్యాల ఎగుమతి కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సిరి ధాన్యాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికీ మేలు చేసేవి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ పండించగలగడం ఇందుకు కారణం. నిజానికి చిరుధాన్యాలు వందల ఏళ్లుగా భారతీయ ఆహారంలో భాగంగానే ఉన్నాయి. జొన్న, సజ్జ, రాగి వంటివి 1960వ సంవత్సరం వరకూ నలుగురిలో ఒకరు తినేవారు. కానీ, హరిత విప్లవం తరువాత చిరుధాన్యాల వాడకం క్రమేపీ తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ చిరుధాన్యాలపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రమాదం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరు ధాన్యాలను మళ్లీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు కొంత కాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తగ్గుతున్న క్రమంలోనే దేశంలో ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్, ‘రెడీ టు ఈట్’ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించా రన్నది మరువరాదు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్యాకేజ్డ్ ఫుడ్ వాడకం మరింత ఎక్కువయ్యేందుకు కారణమైంది. 1991 తరువాత చక్కెర లతో నిండిన పానీయాలు దేశీ మార్కెట్లను ముంచెత్తాయి. అలాగే జంక్ ఫుడ్ అని ఇప్పుడు మనం పిలిచే రకరకాల ఆహార పదార్థాలూ అందుబాటులోకి వచ్చాయి. చక్కెరలు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్తా ఊబకాయం, అసాంక్ర మిక వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాలను మళ్లీ ప్రధాన ఆహారంగా మార్చడం పెద్ద సవాలే. ఒక పక్క రైతులు తమ పంటలు, పద్ధతులు మార్చుకునేందుకు తగిన ప్రోత్సాహాలు అందించడం... ఇంకోవైపు వినియోగదారులను చైతన్యపరచడం, వారి ఆహారపు అలవాట్లను మార్చడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భయం ఏమిటంటే... ఎక్కడ ఈ జంక్ ఫుడ్ పరిశ్రమ చిరుధాన్యాలపై ప్రస్తుతమున్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని! అసాంక్రమిక వ్యాధులు ప్రబలేందుకు జంక్ ఫుడ్ ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే స్పష్టం చేసిందో, వీటిని పిల్లలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల నియంత్రణకు సూచనలు జారీ చేసిందో... అప్పటినుంచీ జంక్ ఫుడ్ పరిశ్రమ తమ ఉత్పత్తులను ఆరోగ్య కరమైనవనీ, సహజమైనవనీ చెప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మల్టీ గ్రెయిన్ కుకీలు, చక్కెర తక్కువగా ఉన్న శీతల పానీయాలు, హృదయానికి దోస్తుల్లాటివని చెప్పే వంటనూనెలు, ‘పండ్ల’ రసాలు అని పేర్లు పెట్టి... ఇంట్లో వండుకునే ఆహారానికీ,పండ్లు, కాయగూరలకూ వీటిని ప్రత్యామ్నాయాలుగా చూపే ప్రయత్నం మొదలైంది. చిరుధాన్యాల ద్వారా కూడా ఈ మాయ చేసేందుకు కంపెనీలు కొన్ని ఇప్పటికే హైదరాబాద్లోని ఐసీఏఆర్ –నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వైపు పరుగులు పెడు తున్నాయి కూడా. జంక్ ఫుడ్ తయారీదారులు తమ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గొప్పగా చెప్పుకొంటూనే కీలక సమాచారాన్ని విని యోగదారుల కంటపడకుండా చూస్తాయి. ఆహారంలోని పదార్థాలు, హానికారక ‘అడిటివ్స్’(కలిపినవి) వివరాలు కనిపించకుండా చేస్తాయి. దేశ నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ ప్యాకెట్స్పై ‘పోషక సమా చారం’ తప్పనిసరిగా నిర్దిష్ట పద్ధతిలో ప్రచురించాలి. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలు ఎంత మోతాదుల్లో ఉన్నాయో తెలపాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి పుణ్యమా అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పుడు ‘ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబలింగ్’ను ప్రతిపాదించింది. సాధారణంగా ప్యాకెట్ వెనుకభాగంలో ఉండే సమాచారాన్ని ముందు కూడా ప్రచురించాలని ఈ ప్రతిపాదన ఉద్దేశం. దీనివల్ల వినియోగదారులకు మరింత సమాచారం అంది ఆరోగ్యకరమైన అల వాట్లు చేసుకుంటా రని అంచనా. శాకాహార, మాంసాహార ఉత్పత్తు లను వేరు చేసేందుకు వాడినట్లు ఇవి కూడా గుర్తుల రూపంలో ఉంటాయి. జంక్ ఫుడ్ కంపెనీలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ కావాలని కోరుకుంటున్న స్టార్ రేటింగ్ల విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంత ఆరోగ్యకరం కాదని సూచించేందుకు రెండు స్టార్లను ఇచ్చినప్పుడు కూడా వినియోగదారులు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపు తున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. పైగా ఈ స్టార్ రేటింగులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇచ్చేవి కాబట్టి వాటిని పరిశ్రమ వర్గాలు తమకు అనుకూలంగా మర్చుకునే అవకాశముందని అంచనా. వీటికి భిన్నంగా వార్నింగ్ లేబుల్స్(హెచ్చరికలు) మాత్రం అందులో ఉన్న పదార్థాల ఆధారంగా తయారవుతాయి. కుకీలు, పాస్తా, నూడుల్స్ వంటివాటిల్లో కొంత మోతాదులో జొన్నలు, సజ్జలు కలిపి నంత మాత్రాన వాటికి ఆరోగ్యకరమైనవన్న ట్యాగ్ తగిలించాల్సిన అవసరమేమీ లేదు కదా! మరి పోషకాలపై మనకున్న అవగాహన ఎంత? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అంచనా ప్రకారం అది చాలా తక్కువ. ఫుడ్ లేబుల్లోని సమాచారం అప్పు డప్పుడూ చదువుతాము కానీ... కొనుగోళ్ల సమయంలో ఎక్కువగా తయారీ, ఎక్స్పైరీ డేట్లనే చూస్తూంటామని ఎన్ ఐఎన్ నిర్వ హించిన ఒక అధ్యయనంలో అధికులు తెలపడం ఇక్కడ ప్రస్తావ నార్హం. ఇదే సమయంలో శాకాహార, మాంసాహారాలను వేరు చేసేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు వారు ఒప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అనారోగ్యతను సూచించేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల మాదిరి గుర్తులను వాడాలని కొంతమంది సూచి స్తున్నారు. కానీ కంపెనీలు మాత్రం ‘హెల్త్ స్టార్ రేటింగ్’ ఉంటే మేలు అంటున్నాయి. అయితే స్టార్ గుర్తు సానుకూలతను సూచిస్తుంది. ఒకట్రెండు అధ్యయనాల ప్రకారం కొందరు బాగా శుద్ధి చేసిన ఆహారం ప్యాకెట్లపై ఎర్రటి గుర్తు పెట్టడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ కూడా ప్యాకేజీల ముందువైపు సమాచారం ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే జంక్ఫుడ్తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజి ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ లేబలింగ్ విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Health: థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్) జిల్లాలో ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే.. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది. ఆర్థరైటిస్లో రకాలు... ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్ స్పాండైటిస్, గౌట్, జువైనల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. జీవనశైలిలో మార్పులే కారణం ►ఆర్థరైటిస్కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే. ►వ్యాయామం లేకపోవడం, జంక్ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. ►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. తీవ్రత తగ్గించేందుకు సూచనలు ►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ (డీఎంఏఆర్డీ), బయోలాజికల్ ఇంజెక్షన్ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు వీరిలో ఎక్కువ! ►థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్ సోకిందో తెలుసుకోవాలి. ►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్ఫుడ్తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్క్రీమ్లు, జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్లు, వాకింగ్కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా?
పిల్లల సక్రమ ఎదుగుదలకు సరైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం కంటే జంక్ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే కదా అని తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వదిలేస్తే పిల్లల ఆరోగ్యానికి అది చాలా హానికరం. అందువల్ల పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా నిరోధించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం. ముందుగా మనం ఒక విషయాన్ని నమ్మి తీరాలి. అదేమిటంటే మనం అంటే తల్లిదండ్రులు దేనిని ఆచరిస్తారో, పిల్లలు దానినే అనుసరిస్తారు. అంటే పెద్దవాళ్లు స్విగ్గీ, జొమాటోల్లో స్పైసీ ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుని వాళ్ల కళ్లముందే లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే ఆటోమేటిగ్గా పిల్లలు కూడా అదే బాట పడతారు. అందువల్ల ముందుగా పెద్దవాళ్లకు గనక బయటి తిండి తినే అలవాటుంటే దానిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం బెటర్. చక్కగా ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటే పిల్లలు కూడా ఇంట్లో అమ్మ చేతి వంట తినడానికే మొగ్గు చూపిస్తారు. ►భలే చెప్పారులే, అలా ఇంట్లోనే తింటూ ఉంటే లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ తయారు చేసే కంపెనీలు దివాలా తీయవా? అని అడగొచ్చు కానీ అంతకంటే ముందు మన బడ్జెట్టు బజ్జీ అవడం, ఆ తర్వాత ఒళ్లు గుల్ల అవడం ఖాయం. అందువల్ల అలాంటి వాటిని తినడాన్ని వారానికో, పదిరోజులకో ఒకసారికి పరిమితం చేయడం ఉత్తమం. ►ఒకవేళ పిల్లలు పిజ్జా బర్గర్లు, నూడుల్స్ తప్ప తినేది లేదని మారాం చేస్తుంటే మాత్రం వాటిలో కూరగాయలను మిక్స్ చేయడం ద్వారా వారికి ఇష్టమైన ఆహారాన్ని కూడా హెల్తీగా మార్చుకోవచ్చు. దీంతో పిల్లలు కూడా ఇంటి ఆహారాన్ని ఎంజాయ్ చేసి బయటివి తినడం తగ్గించుకుంటారు. ►పిల్లలు చాలా త్వరగా అందమైన, రంగురంగుల వస్తువుల వైపు ఆకర్షితులవుతారు. అటువంటి పరిస్థితులలో, చిరుతిండిలో కూడా మీరు పిల్లలకు వివిధ రంగుల పండ్లను అలంకరించవచ్చు. దీనితో పాటు ప్లేట్లో అందంగా అలంకరించిన రంగురంగుల ఫ్రూట్ చాట్ కూడా పిల్లలకు నచ్చుతుంది. ►ఆరోగ్యంగానే తినడాన్ని అలవాటు చేయండి పిల్లలకు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలు జంక్ ఫుడ్కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. అందువల్ల, 3–4 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లల ఆహారపుటలవాట్లను సరిచేయడం అవసరం. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉండటం వల్ల వారికి కడుపు నిండి జంక్ఫుడ్ తినాలని పట్టుబట్టరు. -
షుగర్ రావడానికి జంక్ ఫుడ్ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా!
కొంతమంది టైమ్ లేకపోవడంతో హడావుడిగా ఏదో ఒకటి తినేద్దామని జంక్ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు అందులో ఉపయోగించే మసాలాలకీ, ‘మోనో సోడియమ్ గ్లుటామేట్’ అని పిలిచే చైనా సాల్ట్ ‘ఉమామీ’ రుచికీ అలవాటు పడి జంక్ఫుడ్, పిజ్జా, బర్గర్లలాంటి ఫాస్ట్ఫుడ్ తింటుంటారు. కానీ ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, బేకరీ ఐటమ్స్ లాంటి ఆహారపదార్థాల్లో ఉండే హానికర రసాయనాలూ, కొవ్వుల కారణంగా డయాబెటిస్ (షుగర్) ముప్పు ఎక్కువ అని తెలిపే పరిశోధనలు గతంలోనూ ఉన్నాయి. Junk Food and Diabetes: Did You Know Eating Fast Food Can Cause Diabetes?: తాజాగా యూఎస్లోని న్యూయార్క్ యూనివర్సిటీ (ఎన్వైయూ) శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలోను ఇదే విషయం మళ్లీ నిజమని తేలింది. డయాబెటిస్ రావడానికి... పరిసరాల్లో లభ్యమయ్యే ఆహార వాతావరణానికీ మధ్య ఉన్న సంబంధాలపై ‘ఎన్వైయూ’ విస్తృతంగా పరిశోధనలు నిర్వహించింది. (ఈ పరిశోధన అంశం: నైబర్హుడ్ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఎఫెక్ట్ ఆన్ డయాబెటిస్). దీనికి అక్కడి ‘వెటరన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్’ విభాగం తన సహాయ, సహకారాలు అందించింది. చదవండి: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఇలా చుట్టుపక్కల అన్నీ ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్తో తయారైన ఆహార పదార్థాలు లభ్యమయ్యే వాతావరణం (నైబర్హుడ్ ఎన్విరాన్మెంట్)లో డయాబెటిస్ కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో రాగా... అలాంటి ‘ఆహారవాతావరణం’ (అంటే... ఫుడ్ ఎన్విరాన్మెంట్) పెద్దగా లేని పల్లెలూ, నగర వాతావరణానికి ఆవల ఉండే ప్రాంతాలలో డయాబెటిస్ కేసులు అంతగా లేకపోవడం ఆ అధ్యయనం ద్వారా పరిశోధకుల దృష్టికి వచ్చింది. యూనివర్శిటీలోని డివిజన్ ఆఫ్ ఎపిడిమియాలజీ డైరెక్టర్ అయిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ లోర్నా ఈ. థోర్ప్ ఆధ్వర్యంలో ఈ అధ్యయన ప్రణాళిక రూపొందింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ పరిశోధన కోసం లాక్షలాది మంది సాధారణ ప్రజలను ఎంపిక చేసి, వారిని చాలాకాలం పాటు పరీక్షించారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. ఈ అధ్యయనంలో తేలిన అంశాలను పరిశోధనల ఫలితాలను పొందుపరచిన సభ్యుల బృందంలోని ప్రధాన రచయిత్రి (మెయిన్ ఆథర్) అయిన రానియా కంచి, ఆమె సహచరులు సంయుక్తంగా ‘అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ఓపెన్ ట్రస్టెడ్ సోర్స్ జర్నల్’లో ఈ అధ్యయనం పూర్తి వివరాలను నమోదు చేశారు. గతంలోనూ చాలామంది నిపుణులూ, అనుభవజ్ఞుల అధ్యయనంలోను ఇదే విషయాలు తేటతెల్లమయ్యాయి. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం, దానికి తగినట్లుగా కనీసం తేలికపాటి వ్యాయామాలు కూడా లేకపోవడం వల్లనే డయాబెటిస్ లాంటి సమస్యలు వస్తున్నాయని మరోమారు నిరూపితమైంది. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. జంక్ ఫుడ్కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్లోని ఐసీఏఆర్ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్’ ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. విలాస్ ఎ తొనపి తెలిపారు. న్యూట్రిహబ్ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. దయాకర్రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్లో దూసుకెళ్తున్న స్టార్టప్లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్ మహిళల విజయగాథలు.. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది! వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్ నివాసి అయిన డాక్టర్మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్తో ప్రొటీన్ బార్, బ్రేక్ఫాస్ట్ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్ అవార్డును అందుకున్నారు. సిఎఫ్టిఆర్ఐ నుంచి తొలి బెస్ట్ స్టార్టప్ అవార్డును, ఇక్రిశాట్ నుంచి స్మార్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవార్డుతో పాటు ఐఎస్బి–యాక్షన్ ఫర్ ఇండియా బెస్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్లో ఎం.ఎస్.ఎం.ఈ. అసోసియేట్ గ్రోత్ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/ మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్ టీచర్. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్ మాంక్’ పేరిట స్టార్టప్ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు. సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/ చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! ఆరోగ్యకరమైన చిరుతిళ్లు పౌష్టిక విలువలు లేని జంక్ స్నాక్స్ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్లోని ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్ ఫ్లేక్స్ తయారీ కోసం ఐఐఎంఆర్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్ కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/ చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మిల్లెట్ మీల్ బాక్స్ హైదరాబాద్కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్ బాక్స్) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. స్విగ్గి, జొమాటో తదితర ఆన్లైన్ పార్టనర్స్ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్ నుంచి కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు అరుణ. vemulaaruna81@gmail.com చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! 6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. 95538 25532. 7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666. 60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. – డాక్టర్ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
Health Tips: జంక్ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా..
జంక్ఫుడ్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, డయాబెటిక్, రక్తపోటు, చెడ్డ కొవ్వు పేరుకుపోవడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మనందరికీ తెలిసిందే! ఐతే జంక్ఫుడ్ జ్ఞాపకశక్తి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు మీకోసం.. అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారంలో ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాలుగు వారాలపాటు వృద్ధాప్య ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రేరేపిస్తుందట. ఐతే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలను జోడించిన జంక్ఫుడ్ ఇచ్చిన ఎలుకల్లో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ తగ్గడం కూడా వీరి పరిశోధనల్లో భాగంగా కనుగొన్నారు. అంతేకాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహారం వృద్ధుల్లో ఆకస్మికంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేసి.. అల్జీమర్స్కు దారితీసేలా చేస్తుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన సైకియాట్రి, బిహేవియరల్ హెల్త్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రూత్ బారియంటోస్ కూడా పేర్కొన్నారు. మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కూడా ఉందని, తరచుగా నిరాశకు లోనవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఏదేమైనా.. ఇటువంటి జంక్ఫుడ్ తీసుకున్న చిన్నవయసున్న ఎలుకల్లో ఎటువంటి కాగ్నిటివ్ సమస్యలు తలెత్తలేదని పరిశోధకులు వెల్లడించారు. జంక్ఫుడ్కు దూరంగా ఉండటం, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా? -
Hair loss causes: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర..
కేవలం ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తుల ద్వారా మాత్రమే అందమైన జుట్టు సొంతమౌతుందని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే ఆహార అలవాట్ల వల్ల జుట్టు రాలడం, బట్టతల.. వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని మీకు తెలుసా! శిరోజాలకు హానితలపెట్టే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. చక్కెర మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ బట్టతలకు కూడా కారణమవుతుందట. అవును.. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. చక్కెరలో, పిండిపదార్థాల్లో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లలలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా హానికలిగిస్తాయి. జీఐ (గ్లైసీమిక్ ఇండెక్స్) అధికంగా ఉండే ఆహారం జీఐ అధికంగా ఉండే ఆహారం కూడా ఇన్సులిన్ పెంచే గుణం కలిగి ఉంటుంది. శుద్ధిచేసిన (రిఫైండ్) పిండి, బ్రెడ్, చక్కెరలలో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతౌల్యానికి దారితీసేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడానికి కారణమయ్యే ఆండ్రొజెన్స్, ఇన్సులిన్ పెంపుకు కారణమౌతాయి. ఆల్కహాల్ కెరటీన్ అనే హార్మోన్ నుంచి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి. ఐతే ఆల్కహాల్ కెరటీన్పై దుష్ప్రభావాన్ని చూపి వెంట్రుకలు బలహీనపడేలా చేస్తుంది. ఆల్కహాల్ అధికమోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుంది. ఒక్కోసారి కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయి శాశ్వతంగా జుట్టు రాకుండా నిరోధిస్తుంది. డైట్ సోడా డైట్ సోడాలో ఎస్పర్టెమ్ అనే ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఇప్పటికే జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే డైట్ సోడాను పూర్తిగా మానెయ్యడం మంచిది. జంక్ ఫుడ్ మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు జంక్ ఫుడ్లో అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు, ఉబకాయానికి, జుట్టు రాలడానికి కారణమౌతాయి. నూనె పదార్ధాలు తీసుకుంటే వెంట్రుకల కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. గుడ్లులోని తెల్లసొన జుట్టు ఆరోగ్యానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. ఐతే గుడ్లులోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుంది. కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఇది. ఇది లోపిస్తే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేప మన శరీరంలో పాదరసం స్థాయిలు పెరిగితే హఠాత్తుగా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. వాతావరణ మార్పులు, అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారనంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. ఈ ఆహారల అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా? ఈ ఫ్రూట్ తిన్నారంటే.. -
కూల్డ్రింక్స్ తాగుతున్నారా..? జర జాగ్రత్త
కూల్డ్రింక్స్ తాగితే లావెక్కుతారని చాలా కాలంగా తెలుసు. అందుకే వాటిని జంక్ఫుడ్ జాబితాలో చేర్చారు. అయితే ఎందుకు అలా జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అమెరికాకు చెందిన వీల్ కార్నెల్ మెడిసన్ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని పూరించారు. కూల్డ్రింక్స్తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (హెచ్ఎఫ్సీఎస్) వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతోందని, ఇదే అనారోగ్య హేతువు అవుతోందని వారు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. హెచ్ఎఫ్సీఎస్లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులు జరిగేందుకు కారణమవుతోందని, ఫలితంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరి లావెక్కుతున్నారని వారు చెబుతున్నారు. చదవండి: సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు ఈ రకమైన చక్కెరలను అధికంగా తీసుకుంటే ఆహారంలోని కొవ్వును ఎక్కువగా శోషించుకునే పరిస్థితి వస్తుందని వివరించారు. 2019లో పేగు కేన్సర్పై జరిగిన ఒక పరిశోధన ఫ్రక్టోస్ కాస్తా కేన్సర్ కణితి పెరుగుదలకు దోహదపడుతుందని తేలడంతో దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునేందుకు తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగానే చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్ ప్రభావాన్ని పరిశీలించారు. చిన్నపేగుల్లో వెంట్రుకలను పోలినట్లు ఉండే కోట్లాది నిర్మాణాలైన ‘విల్లీ‘లు పోషకాలను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంటాయి. ఎలుకలకు హెచ్ఎఫ్సీఎస్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40 శాతం వరకూ పెరగడమే కాకుండా.. బరువు కూడా ఎక్కువైనట్లు తేలింది. కణాల్లో ఫ్రక్టోస్–1–ఫాస్పేట్ ఎక్కువగా పేరుకుపోతుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్యూల్ టేలర్ తెలిపారు. -
పెరుగుతున్న చమురు ధరలతో, తినడం మానేస్తున్నారు
ముంబై: పెరిగిపోతున్న ముడి చమురు ధరల భారం ప్రజల ఆలోచనా ధోరణిని మార్చేస్తోంది. విచక్షణారహిత వినియోగం కిందకు రాని, నిత్యావసరాలైన కిరాణ (గ్రోసరీ), జంక్ ఫుండ్ సంబంధ ఆహారం, యుటిలిటీ (విద్యుత్తు, టెలికం) తదితర ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు ఓ నివేదిక రూపంలో వెల్లడించారు. చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పన్నులను తగ్గించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రూ.100కు పైనే పలుకుతుండగా.. డీజిల్ సైతం రూ.100కు చేరువలో ఉంది. విక్రయ ధరలో రూ.40కు పైనే పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్రాలకు వెళుతోంది. వాస్తవానికి గతేడాది కరోనా వైరస్ భయంతో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆ సమయంలో అదనపు ఆదాయం కోసం కేంద్ర సర్కారు ఎక్సైజ్ సుంకాలను పెంచుకుంది. తిరిగి చమురు ధరలు గరిష్టాలకు చేరినా కానీ, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతోంది. వెంటనే పన్నులు తగ్గించాలి.. ‘‘వినియోగదారులు ఇంధనంపై ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎస్బీఐ కార్డులపై ఖర్చులను విశ్లేషించగా.. పెరిగిన చమురు భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు జంక్ఫుడ్పై ఖర్చులను వారు గణనీయంగా తగ్గించుకున్నారు. అంతేకాదు గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు కూడా తగ్గిపోయింది’’ అని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. చమురుపై అధిక వ్యయాలు ద్రవ్యోల్బణంపైనా ప్రభావం చూపిస్తాయని హెచ్చరించారు. చమురు ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై అర శాతం ప్రభావం పడుతుందన్నారు. కనుక వెంటనే పన్నులను తగ్గించి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం స్వల్పం గా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నా, ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉందని.. దీనికితోడు ఆర్థిక పొదుపులు తగ్గడం సవాలేననని ఈ నివేదిక తెలిపింది. -
ప్రశాంతమైన నిద్రకు ఈ ఐదు తినండి!
మీరు తీసుకున్న ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హైప్రోటీన్ డైట్ అయినా అది నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిద్రానిపుణులు. రాత్రి ఆహారానికి, నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుందంటున్నారు శామీ మార్గో అనే ప్రముఖ స్లీప్ ఎక్స్పర్ట్. ఆమె ఇటీవలే ‘ద గుడ్ స్లీప్ గైడ్’ అనే పుస్తకం రాశారు. రాత్రివేళల్లో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది నిద్రపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు శామీ మార్గో. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు... ఈ ఐదూ నిద్రను దూరం చేస్తాయనీ, అయితే... అరటిపండ్లు, బాదం (ఆల్మండ్స్), తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు... ఈ ఐదూ ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మంచి ఆహారాలని పేర్కొన్నారు శామీ. తగ్గుతున్న అడవులూ... పెరుగుతున్న దోమలూ, వ్యాధులు! ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. ఫలితంగా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వంటి దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులూ, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని బెంబేలెత్తుతున్నారు. ఇది డిసీజ్ బర్డెన్ పెంచడంతో పాటు పర్యావరణాన్నీ మరింతగా దెబ్బతీసి మరిన్ని ఉత్పాతాలకు కారణమవుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. -
జిడ్డు చర్మ సమస్యను అధిగమించాలంటే..
సాక్షి, హైదరాబాద్: మానవ జాతికి అందమనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అందాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అనేక క్రీమ్లు, లోషన్లు వాడుతుంటారు. ప్రస్తుత పోటీ యుగంలో విపరీతమైన ఒత్తిడి, శరీర తత్వానికి కావాల్సిన ఆహారం తినకపోవడం తదితర కారణాలతో ప్రజలు జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిడ్డు సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని పదార్థాలను తినకూడదని అపోలో టెలిహెల్త్ సీనియర్ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాధా గంగాతి సూచిస్తున్నారు. డాక్టర్ సూచిస్తున్న తినకూడని ఆహారాలు ఏవో చూద్దాం. డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం: జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని డాక్టర్ సూచిస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ కేలరీలతో లభించే సోయా పాలను తాగవచ్చని తెలిపింది. మరోవైపు జిడ్డు చర్మ సమస్యను జయించాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడం మేలని డాక్టర్ సూచిస్తున్నారు చాక్లెట్స్కు దూరంగా ఉండడం చాక్లెట్స్ తినడం ద్వారా జిడ్డు సమస్య వేదిస్తుంది. చాక్లెట్లో ఉండే చక్కెర శాతం చర్మం జిడ్డుగా మారడానికి ప్రేరేపిస్తుంది. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ గుడ్న్యూస్.. 15రోజులకు ఒకసారి డార్క్ చాక్లెట్ తిన్నట్లయితే అంత ఇబ్బంది ఉండదని డాక్టర్ సూచించింది జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ప్రస్తుత ప్రపంచంలో జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. కానీ జిడ్డు చర్మ సమస్యను నివారించాలనుకునేవారు జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని, డయిరీ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నూనె గ్రంథుల పరిణామం పెరిగి జిడ్డు, మొటిమల సమస్య తలెత్తుతుంది మాంసాహారానికి దూరంగా ఉండడం మీరు మాంసాహార ప్రియులా, అయితే నిత్యం మాంసాహారం భుజించడం వల్ల శరీరంలో చెడు కొవ్వు శాతం అధికమయి జిడ్డు సమస్య తెలెత్తుతుంది. కాగా ఆహార నియమాల అనేవి శరీర తత్వానికి అనుగుణంగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్ గంగాతి పేర్కొన్నారు -
జంక్ఫుడ్తో వీర్యకణాల తగ్గుదల!
జంక్ఫుడ్ కారణంగా ఎన్నో రకాల అనర్థాలు వస్తాయన్న సంగతి ఇప్పటికే చాలా పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. అయితే జంక్ఫుడ్ కారణంగా వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్కౌంట్) తగ్గుతుందని ఇటీవలి తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్(యూఎస్)లోని హార్వర్డ్ టీ.హెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన పరిశోధకులు దాదాపు 3,000 మందికి పైగా యువకుల్లో ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 19 ఏళ్లు పైబడిన యువకులను నాలుగు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూపునకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు. వారి ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పండ్లు, నట్స్, గుడ్లు, తృణధాన్యాలు ఉండేలా చూశారు. అలాగే మరో గ్రూపునకు ఒకింత తక్కువ ఆరోగ్యకరమైన ఆహారం సమకూర్చారు. ఇలా మొదటి గ్రూపు మినహా ప్రతి గ్రూపునకూ కొంత పోషకాహారాన్ని తగ్గిస్తూ, జంక్ఫుడ్ను పెంచుతూ పోయారు. ఈ నాలుగు గ్రూపుల వీర్యనమూనాలను సేకరించి పరీక్షించగా... జంక్ఫుడ్ను తీసుకున్న గ్రూపుతో పోలిస్తే... పూర్తిగా అన్ని పోషకాలు ఉన్న మంచి సమతుహారాన్ని తీసుకున్న గ్రూపులోని యువకులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు చాలా బాగున్నట్లు తేలింది. జంక్ఫుడ్ తీసుకున్న గ్రూపుతో పోలిస్తే, మంచి ఆహారం తీసుకున్న గ్రూపులోని యువకుల వీర్యంలో వీర్యకణాల సంఖ్య దాదాపు 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంటే... జంక్ఫుడ్ తీసుకోవడం అన్న అంశం సంతానలేమికి ఎంతో కొంత దోహదం చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ వైజ్ఞానిక జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. -
వామ్మో ‘జంకు’ ఫుడ్
సాక్షి, పెద్దపల్లికమాన్: చిన్నారులను జంకు ఫుడ్ అనారోగ్యంవైపు నడిపిస్తోంది. పాఠశాలల సమీపంలోని దుకాణాల్లో సురక్షితంకాని తినుబండారాలు విక్రయిస్తుండడం వాటికి ఆకర్శితులై అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. చిన్నారులకు అనారోగ్యం.. పాఠశాలలకు సమీపంలో విక్రయించే తినుబండారాలు చిన్నారులకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. చక్కెర, ఉప్పు, కొవ్వు అధిక మోతాదులో ఉండడంతో అవి తిన్న పిల్లలు ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో ఇలాంటివి విక్రయించరాదని గతంలో ఆహార నియంత్రణ సంస్థ, భారత ఆహారభద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ కఠిన నిబంధనలు రూపొందించాయి. 50 మీటర్ల దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయినా చాలాచోట్ల ఈ నిబంధనలు అమలు కావట్లేదు. దీనికితోడు పెద్దపల్లి జిల్లాకేంద్రంలో మూడు నాలుగు తినుబండారాల కంపెనీలు నాసిరకం నూనెతో, అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేసి జిల్లావ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఆహార భద్రతా మండలి సర్వే వాస్తవాలు ⇔ నాసిరకం ఆహార పదార్ధాల విక్రయాలు అరికట్టడంలో తెలంగాణలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చివరస్థానంలో ఉంది. ⇔ రాష్ట్రంలో పూర్తిస్ధాయిలో ఆహార భద్రతా నియంత్రణా«ధికారులు, సిబ్బంది లేరు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 మందే ఉన్నారు. ఆహార నమూనాలు ⇔ నియంత్రణాధికారులు లేకపోవడంతో పాఠశాలలకు సమీపంలో చిల్లర దుకాణాలు, రంగు రంగుల కొవ్వు ఆహార పదార్థాలు చిన్నారులు చూసి కొనుక్కుని రోగాలబారిన పడుతున్నారు. ⇔ నియంత్రణ, పర్యవేక్షణాధికారులు లేకపోవడంతో నాసిరకం నూనె,పిండితో తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. సిబ్బంది కొరతతో కొరవడిన తనిఖీలు పర్యవేక్షించాలి్సన అధికారులు, సిబ్బంది కొరతతో జిల్లాలోని ఆయా దుకాలు, కార్ఖానాల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఆహార తనిఖీ అ«ధికారులు జిల్లాకు ముగ్గురు చొప్పున ఉండాలి. కానీ రాష్ట్రంలోనే 10 మంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో రెండేళ్లక్రితం ఆహార తనిఖీ అధికారి రిటైరైతే ఇప్పటి వరకూ ఆ స్థానం ఖాళీగానే ఉంది. దీంతో కరీంనగర్ అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా చిన్నారులు కొవ్వు పదార్థాలు తీసుకుంటూ అనారోగ్యంబారిన పడుతున్నారు. నిబంధనలు బేఖాతర్ పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో తినుబండారాలు అమ్మకూడదనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. గతంలో ప్రచారాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ స్పష్టంగా కోరింది. అప్పట్లోనే కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడంతో కలిగే అనర్థాలపై కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, రెగ్యులేషన్ 2019 ముసాయిదాలో ఆ పదార్ధాలను ప్రచారం చేయరాదని, వీటితో ఊబకాయం, డయాబెటీస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. అయినా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే పంపాలి పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాల్లో కొనుగోలు చేసి తినే అలవాటున్న పిల్లలకు తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే తయారు చేసిన అల్పాహారాన్ని పంపాలి. ఇలా నిత్యం అలవాటు చేస్తే పిల్లలు వాటిజోలికి వెల్లరు. ఇందుకు తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు రంగు, రుచి కోసం, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వివిధ రసాయనాలు వాడతారు. కొవ్వు సంబంధించిన ఆహార పదార్ధాలు తీసుకోవడంతో అనేక అనర్థాలు వస్తాయి. వాటిలో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అల్సర్, కడుపునొప్పి, నిద్రలేమి తదితర ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పిల్లలు ఏ పని సరిగా చేయలేరు. చిరాకుతో నిరుత్సాహంగా ఉంటారు. పిల్లలు జంక్ ఫుఢ్ తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ప్రణీత్. పిల్లల వైద్య నిపుణులు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు నాసిరకంగా తయారు చేసిన తిను బండారాలతో పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇంటివద్ద నుంచి పాఠశాలకు అల్పాహారం, పండ్లు పంపినా గానీ పిల్లలు అప్పుడప్పుడు షాపుల్లోని తినుబండారాలు తింటున్నారు. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. నీరసంగా తయారవుతున్నారు. తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై మున్సిపల్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తరుచూ తనిఖీలు చేయాలి. పాఠశాలలకు సమీపంలోని దుకాణాలను పర్యవేక్షించాలి. – పుట్ట రవి, పెద్దపల్లి -
జంక్ఫుడ్తో రొమ్ముక్యాన్సర్ ముప్పు!
టీనేజీ పిల్లలు జంక్ఫుడ్ అదేపనిగా తింటుంటారు. వారి ఈ అలవాటుతో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే జంక్ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక కొన్ని అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్కు చెందిన అధ్యయనవేత్తలు వెల్లడించారు. అనేక మంది టీనేజీ పిల్లలపై అధ్యయనం చేస్తూ దాదాపు పదేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఆ వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు తోడుగా ఇక పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా జత అయితే రొమ్ముక్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుందని తేలింది. ఈ వివరాలన్నింటినీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో పేర్కొన్నారు. -
పండ్లు అలవాటైతే జంక్ని నెట్టేస్తారు
బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు ‘మంచి నీటి గంట’ను ప్రవేశపెడితే.. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం పాఠశాల క్యాంటీన్లలో జంక్ఫుడ్ అమ్మకాలపై నిషేధం విధించబోతోంది. అంతేకాదు, బడికి యాభై మీటర్ల పరిధిలో ఫాస్ట్ ఫుడ్ను విక్రయించకూడదని కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై జంక్ ఫుడ్ చూపే ప్రభావాలు, జంక్ని మాన్పించే మార్గాల గురించి తెలుసుకుందాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్ఫుడ్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ ఫుడ్ ప్రధానంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగాలపైన కూడా! ఫాస్ట్ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడితే భవిష్యత్తులో డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్తో బాధపడుతున్నారని బర్మింగ్హామ్ యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. పాఠశాల వయసులోనే! ప్రస్తుతం డిప్రెషన్కు గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005–2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. పరిశోధన జరిగిన తీరు ఫాస్ట్ఫుడ్ పిల్లలపై చూపే ప్రభావాల పరిశోధన కోసం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. వారిలోని సోడియం, పొటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసిన తర్వాత.. జంక్ఫుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పొటాషియం తగ్గుతుందని కనుగొన్నారు. ‘‘జంక్ఫుడ్లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవు’’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ సిల్వీ తన పరిశోధన తర్వాత వెల్లడించారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమాటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పొటాషియం శాతం తగ్గుతుందని కూడా సిల్వీ చెప్పారు. తినకుండా ఉండలేని వారు..! జంక్ ఫుడ్ని తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యంతో పాటు డిప్రెషన్కు లోనవుతున్నారు. అందుకని జంక్ ఫుడ్ని తినకుండా ఉండలేనివారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో మాత్రమే ఫాస్ట్ఫుడ్ తీసుకోవడం మంచిదని కూడా ఆహార నిపుణులు సూచిస్తున్నారు. – శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
ఇక స్కూళ్లలో ఆ ఆహారం బంద్..!
న్యూఢిల్లీ: చిప్స్, కూల్ డ్రింక్స్ తదితర జంక్ ఫుడ్స్ అమ్మకాలను, వాటి ప్రచారాన్ని పాఠశాల ప్రాంగణాల్లో, పరిసరాల్లో నిషేధించాలని ఆహార నియంత్రణ సంస్థ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదించింది. స్కూళ్లలో, వాటికి 50 మీటర్ల పరిధిలో వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వాటి ప్రచారాన్ని కూడా ఆయా ప్రాంతాల్లో నిషేధించాలని సూచించింది. తద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించవచ్చంది. ఈ ప్రతిపాదనలను ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్–2019’ ముసాయిదా లో పొందుపర్చారు. ‘ఉప్పు, కొవ్వు, చక్కెర శాతాలు ఎక్కువగా ఉన్న పదార్థాల ప్రచారం కూడా నిర్వహించకూడదు’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అతి తక్కువగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్, చక్కెర, ఉప్పు అత్యంత ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు, పానీయాలను జంక్ ఫుడ్గా పేర్కొంటారు. ఈ ఆహార పదార్థాలవల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్లు, గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. -
జంక్ ఫుడ్ తింటున్నారా.. బీ కేర్ఫుల్
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ఫుడ్స్’ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్లపై అధ్యయనం చేశారు. బయట దొరికే ఫుడ్లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్లో తయారు చేసే పాప్ కార్న్లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా ఇంటి వంటకాలే అన్ని విధాల శ్రేయస్కరమని పరిశోధకులు మరోసారి తేల్చారు. ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఇంటిలోని ‘నాన్ స్టిక్’ వంట పాత్రల్లో, వాటర్ ప్రూఫ్ ఫాబ్రిక్ కోటింగ్స్లో కూడా ఉంటాయని, వంటకాల కోసం వాటిని ఉపయోగించకూడదని కూడా పరిశోధకలు తెలిపారు. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే ఈ రసాయనాలను 1930 దశకంలో పలు రకాల వస్తువుల తయారీ కోసం శాస్త్రవేత్తలు సృష్టించారు. -
బర్గర్లు, చిప్స్ వద్దు.. సంప్రదాయ ఆహారమే మేలు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ వంటకాలతో పాటు, పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యసౌభాగ్యవంతులుగా తయారు చేయవచ్చని రాష్ట్రంలోని మాతృమూర్తులకు గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పిల్లల ఆధునిక జీవనశైలి కారణంగా 25%మంది ఊబకాయంతోపాటు, మరో 33 శాతం మంది పోషకాహార లేమితో బాధపడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి తాను ఆందోళనకు గురైనట్టు చెప్పారు.తాను డాక్టర్ను కూడా అయినందున పిల్లలకు బర్గర్లు, చిప్స్కు బదులు పోషక విలువలున్న సంప్రదాయ ఆహారాన్ని ఇవ్వాలని సూచిస్తున్నానన్నారు. గురువారం జలవిహార్లో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలన్ ’అలయ్ బలయ్’లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు సంప్రదాయబద్ధమైన ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, 15 ఏళ్లుగా దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని తమిళిసై పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన చిందు భాగవతం, యక్షగానం, గుస్సాడి, ఇతర సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. హిమాచల్, తెలంగాణల సహకారానికి కృషి : దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ను తెలంగాణతో అనుసంధానించి, పర్యాటకం, పరిశ్రమలు, తదితర రంగాల్లో పరస్పర సహకరించుకోడానికి ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు ఇక్కడ పర్యటించేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో తెలిపారు. అలయ్ బలయ్ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ అభినందనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అందరినీ ఒకచోటకు చేర్చేలా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, తెలుగు భాషను అభివృద్ధి చేసి సాంస్కృతిక విప్లవం తేవాలని మహారాష్ట్ర మాజీ గవ ర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. -
జంక్ ఫుడ్తో చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు
చేత్తో మనసారా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తే చాదస్తం అనుకుంటున్నారు. ఓ స్పూన్ చేత్తో పట్టుకుని నూడుల్స్ తింటే మావాడు ఎంత బాగా తింటున్నాడో అంటూ పిల్లల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇంట్లో చేసిన ఎంత కమ్మనిన వంటకమైనా మొహం తిప్పుకుంటారు. కానీ అష్టరోగాలు తెచ్చే జంక్ఫుడ్ను మాత్రం ఆవురావురుమంటూ తింటారు నేటి పిల్లలు. తిన్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే.. దాని అసలు పైత్యాన్ని చూపిస్తుంది. ఇందుకు ఈ ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యంగా నిలిచింది. జంక్ఫుడ్ తినే అలవాటుతో జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాలు.. లండన్ : ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో ఓ యువకుడు ఏడేళ్ల వయసు నుంచి జంక్ఫుడ్ మాత్రమే తీసుకునేవాడు. పండ్లు, కూరగాయలు అస్సలు ముట్టుకునేవాడు కాదు. స్కూలుకు వెళ్లేప్పుడు తల్లి లంచ్ బాక్స్లో రోజూ పండ్లు, ఇతర పోషకాహార పదార్ధాలు పెట్టినా వాటిని ముట్టుకోక సాయంత్రం లంచ్ బాక్సును అలాగే తెచ్చేవాడు. రోజూ ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణం నుంచి చిప్స్, సాసర్, వైట్ బ్రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారంలను మాత్రమే తీసుకొని తింటుండడంతో పంతొమ్మిదేళ్లు వచ్చేసరికి అంధత్వం వచ్చింది. దాంతో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇటీవల ఆ యువకుడు పై చదువుల నిమిత్తం ఐటీ కోర్సులో చేరాడు. కానీ చూపు లేకపోవడం, చెవుడు వంటి సమస్యలతో ఆ కోర్సు నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతనికి సోదరి, సోదరుడు ఉన్నా వారు మంచి పోషకాహారం తీసుకోవడంతో వారికి ఎలాంటి సమస్య లేదు. చిన్నప్పటి నుంచీ సదరు యువకుడు సన్నగా ఉండడంతో తల్లి అతని బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ యువకుడు చాలా సన్నగా, ఒక రేకులా కనిపిస్తున్నాడు. డాక్టర్లు అతనిని పరిశీలించి కౌన్సిలింగ్లో భాగంగా సమతుల ఆహారం, పండ్ల రసాలు, విటమిన్ ట్యాబ్లెట్టు ఇస్తే వాటిని కొన్నిరోజులు వాడి మళ్లీ యథావిధిగా జంక్ఫుడ్ తీసుకునేవాడు. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఆ యువకుడి వయస్సు ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే. -
‘జంకు’.. గొంకూ వద్దు!
సాక్షి, విజయనగరం: ప్రస్తుతం జీవనం యాంత్రికమైపోయింది. ఉద్యోగ బాధ్యతలతో వాయువేగంతో సాగిపోతోంది. ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్ అని.. ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మరికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపుటలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులు చేయడం.. వ్యాయామంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతత లభించడంతోపాటు.. తెలియకుండానే శారీరక శ్రమ పెరిగి రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాసేపు తోట పని చేస్తూ.. ఎవరి పనులే వారే చేసుకోవడం ఉత్తమం. ఇంటి తోటలో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయడం, బాగా పెరిగిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా కేలొరీలు తగ్గించుకోవచ్చు. చెట్లు, పచ్చదనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. లిఫ్ట్కు దూరంగా.. భవనాల్లో వారి ఇంటికో, కార్యాలయానికో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్ ఆశ్రయిస్తుంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులనైనా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తే సుమారు 200 కేలొరీల వరకు కొవ్వు కరుగుతుంది. సైకిల్ని వినియోగించడం సైకిల్ తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్క రోజైనా రోడ్లపై సైకిల్ తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్పై వెళ్తే మంచిది. రోజూ అర్ధగంటపాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలొరీలు తగ్గించుకున్నట్టే. నలభై నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలొరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని శుభ్రం చేయడంతో.. ఖాళీ సమయాల్లో బయటికెళ్లే పని లేకపోతే ఇంట్లోనే ఉండి దుమ్ము దులపడమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేస్తే ప్రయోజనం ఉంటుంది. రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే 128 కేలొరీల కొవ్వును కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేస్తే, ఇల్లు శుభ్రపడటంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. స్కిప్పింగ్తో.. ఇంటిలో ఉదయం పూట, వాకింగ్ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్ చేయండి. పది నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతుతూ స్కిప్పింగ్ చేస్తే వందకుపైగా కేలొరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నృత్యంతో.. సంగీతం వినిపిస్తే కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే మేలు. చెమట చిందించడంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. ఇరవై నిమిషాలపాటు నృత్యం చేస్తే 100 నుంచి 120 వరకు కేలొరీలు తగ్గించుకోవచ్చు. నాట్యం చేశామనే తృప్తి, ఆనందం మిగులుతుంది. -
మంచి ఆహారంతోనే ఆరోగ్యం
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : మన దేశంలో 45 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఓ సర్వే నివేదిక. ఇది నిజంగా అందరినీ కలవరపెట్టే సామాజిక సమస్య. ఇదే దేశంలోని కొద్దో, గొప్పో మంది పిల్లలు విపరీతమైన జంక్ఫుడ్స్కు అలవాటు పడి ఊబకాయులుగా తయారౌతున్న పరిస్థితి. ఈ రెండింటికీ చెందని మధ్యతరగతి పిల్లలది మరో ప్రత్యేక కేటగిరి. ఈ పిల్లల ఆహారపు అలవాట్లు ఇటీవల కాలంలో చిత్రంగా తయారవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలో అధికశాతం తల్లులు పిల్లలకు కేవలం తిండితినిపించడం పైనే శృతిమించిన శ్రద్ధ కనబరుస్తారని, అది బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చి పిల్లలు అసలు తినాలంటేనే మారాం చేసే మొండి ఘటాలుగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇష్టంగా తింటే ఒంటికి మంచిది... చందమామ రావే... జాబిల్లి రావే...కొండెక్కిరావే..గోగుపూలు తేవే... అంటూ చిన్నప్పుడు తల్లులు ఏంచక్కా పాటల పాడుకుంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడమనేది కాస్తా వెనుకటి తరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయి జీవితం యాంత్రికంగా తయారైపోయింది. ఆకలివేసినా, వేయకపోయినా పిల్లలను పట్టుకుని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలన్నట్లుగా తల్లులు బలవంతం చేయడం, పిల్లలు అందుకు ప్రతీకారంగా తినకుండా ముప్పతిప్పలు పెట్టడం, వాంతులు చేసుకోవడం, ఆ తరువాత తన్నులు, ఆపై బుజ్జిగింపులు వంటి సంఘటనలు ప్రతి ఇంటిలో నేడు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల వైద్యుల వద్దకు వచ్చే కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా తమ పిల్లలు సరిగ్గా తినడం లేదనే ఫిర్యాదులే ఉంటాయి. ఇష్టంగా తింటేనే పిల్లల ఒంటికి మంచిదన్నది వైద్యుల సూచన. అలవాట్లను మార్చాల్సిందే... దాగుడు మూతలు, గోళీకాయలాట, బొంగరాలు, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతో బిజీగా గడపడం.. సరదాగా చదువుకోవడం.. దశాబ్దం కిందటి చదువు సంద్యల చిత్రం. కంప్యూటర్లో, లేదంటే సెల్ఫోన్లలో టెంపుల్రన్, హేండీక్రష్ లాంటి గేమ్సు ఆడడం, టీవీల్లో కార్టూన్ షోలకి, క్రికెట్ షోలకి పరిమితమైపోవడం.. పొద్దస్తమానం హోంవర్కులు, ట్యూషన్లు, పరీక్షలు, ర్యాంకులు ఇవీ నేటి పిల్లల ఆటపాటలు. శారీరక వ్యాయామం లేకపోవడంతో చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే స్వీట్లు, ఐస్క్రీమ్సు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లైట్లు, కోక్ పానియాలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్ ఫుడ్స్కి పిల్లలు ఇటీవల కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలో శారీరక శ్రమ లేకపోవడం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలసి చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు ప్రవర్తనా పరమైన సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. పిల్లల ఆహారం, అలవాట్లలో మార్పు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
అమ్మా...కడుపునొప్పి!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో జీవితాలు అన్నింటిలోనూ బిజీ అయిపోయాయి. చదువులోను.. సంపాదనలోను.. ఆహార్యంలోను.. అవకాశాలు అందుకోవడంలోనూ అంతా బిజీనే. ఇంట్లో ఎడాది వయసున్న పిల్లలు ఉంటే అప్పుడే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి.. అక్కడ ఐఐటీ, అబాకస్ వంటి శిక్షణ ఇస్తున్నారా లేదా..! ఒలింపిక్స్కు శిక్షణనిస్తున్నా లేదా..!! ఇలాంటి విషయాలపై గంటల కొద్దీ ఆలోచించే తల్లిదండ్రులు పిల్లల ఆర్యోగం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనుకుంటూ వారిని సరిగా పట్టించుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు. దంపతులిద్దరూ వారివారి పనుల్లో బిజీగా ఉండి స్కూలుకు వెళ్లే తమ పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు.. వేళకు సరైన ఫౌష్టికాహారం పెట్టడం లేదు. ఉదయం అల్పాహారంలో భాగంగా నూటికి 80 శాతం మంది తల్లిదండ్రులు గ్లాసు పాలతో కడుపు నింపి స్కూలుకు పంపుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇంట్లో వంట చేసే సమయం లేక కొంతమంది.. ఓపిక లేక మరికొంత మంది తమ పిల్లలకు మార్కెట్లో రెడీమేడ్గా దొరికే ఫిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ప్యాకెట్లు, ఎగ్, వెజ్ఫఫ్లు, సాండ్విచ్లు స్నాక్స్, లంచ్బాక్స్లో పెట్టి పంపుతున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత ఉదయం ఫుల్మీల్కు బదులు.. గ్లాసు పాలతో సరిపెడుతుండటంతో తర్వాత కొద్దిసేపటికే కడుపు ఖాళీ కావడం గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తి కడుపు నొప్పికి కారణమవుతున్నట్టు చిన్నపిల్లల వైద్యుల వద్దకు ఇటీవల పెరిగిన కేసుల సంఖ్యే చెబుతోంది. ఇది పిల్లల శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు తమ దృష్టికి ఎక్కువగా వస్తున్నట్లు పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతముఖ్యమో.. వేళకు నిద్ర కూడా అంతే ముఖ్యమంటున్నారు. సమతులాహారం అవసరం నిజానికి ఏ వయసు పిల్లలకు ఎంత ఆహారం, ఎన్నిసార్లు అందించాలి వంటి అంశాలపై తల్లిదండ్రులకు కనీస అవగాహన ఉండడం లేదు. ఉదయాన్నే పిల్లలను నిద్రలేపడం, హడావుడిగా స్కూలుకి రెడీ చేయడం, అల్పాహారంలో గ్లాసు పాలు తాగించడం, స్నాక్స్, లంచ్ బాక్స్ల్లో బిస్కెట్లు పెట్టి పంపుతున్నారు. ఈ ఆహారంలో సరిపడ కార్పొహైడ్రేట్స్, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్ లేకపోవడంతో పిల్లల శారీక, మానసిక ఎదుగుదలపై పభావం పడుతోంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. బాగా చదువుకోవాలన్నా వారీకి వేళకు సమతుల ఆహారం పెట్టాలి. ఏది పడితే అది కాకుండా త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తక్కువ కెలరీలు ఉండేవి పెట్టాలి. పాలు, పెరుగుతో పాటు ఆకు కూరలు, సీజనల్గా దొరికే పండ్లు, పప్పులు, కోడిగుడ్లు, డ్రైఫూట్స్ను స్నాక్స్గా అందించాలి. తద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. – డాక్టర్ అశ్వినీసాగర్, పీడియాట్రిక్ న్యూట్రీషియన్ ఇలా అయితే భారీ మూల్యం తప్పదు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అసలే వర్షాకాలం తరచూ వర్షపు నీటిలో తడవడం, కలుషిత నీరు తాగడం, నిల్వ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జబ్బున పడే ప్రమాదం ఉంది. ఈ సీజన్లో పిల్లలు ఎక్కువగా దగ్గు, జలుబు, తలనొప్పి, టైఫాయిడ్, డెంగీ జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి రోగాలకు గురవుతుంటారు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల క్రానిక్ డిసీజ్గా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది. వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు హైజీన్ పెంచాలంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకునే సమయంలోనే కాదు.. తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడగడం వారికి అలవాటు చేయాలి. కాచి, చల్లార్చిన నీరును తాగించడం ద్వారా డయేరియా ముప్పు నుంచి బయపడొచ్చు. ఎదిగే పిల్లలకు వేళకు సరైన ఆహారం అందించకపోవడం వల్ల వారి మానసిక, శారీర క ఎదుగుదలపై ప్రభావం పడటంతో పాటు చదువులోనూ వెనుకబడటం ఖాయమంటున్నారు వైద్యులు. లేదంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
స్వాభావిక ఆహారాలతోనే మలబద్దకం వదిలించుకోవడం ఎలా?
చాలా మందికి రోజు ప్రారంభం కావడం చాలా ఇబ్బందిగా జరుగుతుంది. చాలామందిలో పొద్దున్నే సాఫీగా జరగాల్సిన మలవిసర్జన అనే ప్రక్రియ నరకప్రాయంగా జరుగుతుంది. ఉదయమే ఆ పనికాస్తా సజావుగానూ, సాఫీగానూ జరిగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ పొద్దున్నే మలవిసర్జన ప్రక్రియ హాయిగా జరగకపోతే ఆ ఇబ్బంది రోజంతా కొనసాగుతూనే ఉంటుంది. కారణాలేమిటి? ఇటీవల మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, మన ఆహారపు అలవాట్లు మలబద్దకానికి కారణమవుతున్నాయి. గతంలో మనం తీసుకునే ఆహారంతో పీచుపదార్థాలు తగినంతగా అంది మలవిసర్జన సాఫీగా జరిగేది కానీ ఇటీవల ప్రతివారూ తమ ఆహారంలో జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత ఎక్కువ చేస్తున్నాయి. పీచుపదార్థాల పరిమాణం ఎంత ఉండాలి? నిజానికి మనం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధికగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళకు అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. పీచుపదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? మన మలం పలచగా ఉండి, సాఫీగా జారాలంటే పెద్దపేగులో తగినంత నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే... సదరు ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో ఉంటే పేగుల్లో ఉన్న నీటినంతటినీ పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ కనీసం 20 – 35 గ్రాముల పీచు ఉండాలి. అప్పుడు చాలా తేలికగా మల విసర్జన సాధ్యమవుతుంది. ఇక కనిష్టంగా 10 గ్రాముల పీచుకు తక్కువ కాకుండా ఉంటే, మల విసర్జన కొంతవరకు తేలిగ్గా జరుగుతుంది. స్వాభావికంగానే పీచు లభ్యమయ్యే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. మలవిసర్జన తేలిగ్గా జరిగేలా చూసుకోండి. పై ఐదు పదార్థాలూ రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మలబద్దకం ఇక మీ దరిచేరదు. అలాగే మీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం కూడా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. -
జంక్ ఫుడ్.. ఆరోగ్యం ఫట్
సాక్షి, బెంగళూరు: నేటి ఆధునిక జీవనశైలితో పా టు జంక్ఫుడ్ కూడా ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది. వద్దు వద్దని వైద్యులు ఎంత హెచ్చరిస్తున్నా ఎంతో మంది వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జంక్ ఫుడ్ వల్ల అనారోగ్యం బారిన పడేవారిలో పెద్దలే కాకుండా చిన్నపిల్లలూ ఉంటున్నారు. జంక్ఫుడ్ వల్ల బాలల్లో ఎనీమియా (రక్తహీనత), ఐరన్ లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 40 శాతం మందికి ఎనీమియా నగరానికి చెందిన ప్రైవేటు ఆరోగ్యసంస్థ నిర్వహించిన సర్వేలో కూడా జంక్ ఫుడ్ వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు తేలింది. పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, చిప్స్, డోనట్స్ తదితరాలు ఎక్కువగా తినే చిన్నపిల్లల్లోని రక్త నమూనాలను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. బెంగళూరులోని సుమారు 0– 20 ఏళ్లలోపు వ యసున్న వారిలో దాదాపు 40 శాతం మందిని ఎనీమియా పీడిస్తోంది. 0–10 ఏళ్ల లోపు చిన్నారుల్లో 35 శాతం మందికి, 10–20 ఏళ్ల లోపు పిల్లల్లో 41 శాతం మందికి రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం చాలా తక్కువస్థాయిలో ఉంది. తింటే.. ఐరన్ లోపమే ఎక్కువమంది పిల్లల్లో ఐరన్ లోపం వల్ల, మరికొందరిలో జన్యుపరంగా ఎనీమియా వస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. అలాగే అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలను ఎముక మజ్జ ఉత్పత్తి చేయకపోవడం ఇతర ముఖ్య కారణం. వీటన్నింటికి జంక్/ ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడడమే కారణమని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సర్వేలో మొత్తం 5,124 మంది చిన్నారుల రక్త నమూనాలను సేకరించగా 2,063 మంది హిమోగ్లోబిన్ స్థాయిలు అసాధారణంగా ఉన్నట్లు తేలింది. జంక్ ఫుడ్లో అధికంగా వాడే ఉప్పు, చక్కెర, నూనెలు, కొవ్వుల వల్ల కేవలం ఎనీమియా మాత్రమే కాకుండా ఊబకాయం, స్థూలకాయం కూడా సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. -
కొవ్వుపై వద్దు లవ్వు
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం కోసం కొవ్వు పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొవ్వు పన్ను విధించడంపై రాష్ట్రాలూ ఈ మేరకు ఆలోచనలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించింది. అయితే దేశంలో మొదటిసారిగా కొవ్వు పన్ను విధించిన రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం తన బడ్జెట్లో కొవ్వు పన్ను 14.5 శాతం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రాండెడ్ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్లలో బర్గర్లు, పిజ్జాలు తదితర జంక్ ఫుడ్లపై కొవ్వు పన్ను విధిస్తారు. దీనివల్ల కొవ్వు సంబంధిత పదార్థాలు, షుగర్తో తయారయ్యే స్వీట్లపైనా పన్ను పడుతుందన్న మాట. కొవ్వు పన్ను వేయడం వల్ల అనారోగ్యకరమైన ఆయా పదార్థాలను వినియోగదారులు తగ్గిస్తారన్నది సర్కారు ఆలోచన. అయితే ఇందులో సర్కారు ఉద్దేశం ఆదాయాన్ని సమకూర్చు కోవడమన్న ఆలోచన కూడా అంతర్లీనంగా ఉందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే కొవ్వు పన్ను ద్వారా కేరళ అదనంగా రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కొవ్వు పన్ను విధింపుపై ఇతర రాష్ట్రాలూ తర్జనభర్జన పడుతున్నాయి. కొంప ముంచుతోంది స్థూలకాయమే ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది పెద్దవాళ్లు డయాబెటిక్కు గురవుతుంటే, ఆ సంఖ్య భారత్లో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్ వ్యాధి దరి చేరుతుంది. 1990లో మన దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 కోట్ల మంది డయాబెటిక్ రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం విస్మయం కలిగిస్తుంది. అంటే తెలంగాణ జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులన్నమాట. ఈ స్థూలకాయమే కొంప ముంచుతుంది. 25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్ రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్, గుండె, కేన్సర్ తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందుకే కొవ్వును తగ్గించాల్సిన అవసరాన్ని అనేక దేశాలు గుర్తించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్లోని కొన్ని రాష్ట్రాలు కొవ్వు పన్ను విధించాయి. కొవ్వు పన్ను ప్రధాన లక్ష్యం స్థూలకాయం, తద్వారా సంభవించే డయాబెటిక్, గుండె వ్యాధులను తగ్గించడమేనని కేంద్రం ప్రకటించింది. ప్రభావం ఉంటుందా? కొవ్వు పన్ను వల్ల ఆ ప్రభావం వినియోగదారులపై ఉంటుందా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కొవ్వు పన్నును నిర్ధారించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, దానివల్ల ప్రజలకు అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు, పన్ను వల్ల జేబుకు పడే చిల్లును కూడా వివరించాలనేది తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే కొవ్వు పన్ను వల్ల లక్ష్యం నెరవేరుతుందా? ప్రజలు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారా అన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. ధనిక వర్గాలకు చెందిన పిల్లలు,వారి తల్లిదండ్రులు మెక్డోనాల్డ్, కేఎఫ్సీ వంటి వాటికి పంపించకుండా ఉంటారా అన్నది అనుమానమే. కేవలం పన్నుతో తమ అలవాటును మానుకునే పరిస్థితి ఉండదంటున్నారు. అయితే ఇది దిగువ మధ్యతరగతి ప్రజలపై మాత్రం కొంతమేర ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే స్వీట్లనేవి ధనిక, అత్యధిక ఆదాయ వర్గాల్లో తమ హోదాను చూపించుకునే ఒక రకమైన అంశం. కాబట్టి వారు ఏ మేరకు దాన్ని తగ్గించుకుంటారో చెప్పలేమని అంటున్నారు. -
కాలేజీల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్ ఫుడ్ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు. అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్ఫుడ్ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్ఫుడ్ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. -
జంక్ఫుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త
వాషింగ్టన్ : జంక్ఫుడ్ తినటం వల్ల బరువు పెరిగి.. తద్వారా గుండె సంబందిత జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని అందరికి తెలిసే ఉంటుంది. జంక్ఫుడ్ తినటం వల్ల గుండె సంబంధ జబ్బులే కాకుండా ఆస్థమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికాకు చెందిన గాంగ్ వాంగ్ అనే పరిశోధకుడు హ్యమ్బర్గర్, ఫాస్ట్ఫుడ్ వంటి పదార్థాల వల్ల పోలెన్ ఫీవర్, ఎక్సేమా, రైనో కంజెక్టివిటీస్ వంటి అలర్జీ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫాస్ట్ఫుడ్ తినటం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఇతర రోగాలకు దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు. పిల్లలపై ప్రభావం.. పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్ఫుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్ఫుడ్ తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్ఫుడ్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెద్దలపై ప్రభావం.. జంక్ఫుడ్ తీసుకోవటం అన్నది పెద్దల విషయంలో ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి. -
ఇంత చిన్న వయసులో అంత బరువా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 60 కిలోలు. అయితే గత కొంతకాలంగా వాడి బరువు 60 కిలోల నుంచి క్రమంగా పెరుగుతూ 70 కిలోలకు చేరింది. ఇలా బరువు పెరిగిపోతూ ఉండటంతో మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. – విహారి, విశాఖపట్నం ఇటీవల పిల్లలు జంక్ఫుడ్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో టీనేజ్లో ఉన్న పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా చూడండి. అతడికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ∙స్వీట్లు, సాఫ్ట్డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్డ్రింక్స్లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్డ్రింక్స్కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది. ∙వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. ∙పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. ∙తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. ∙పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలనా, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. ∙పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. పాపకు నోట్లో, గొంతులో పుండ్లు.. ఎందుకిలా? మా పాప వయసు ఆరేళ్లు. ఇటీవల తన గొంతులో నొప్పిగా ఉందని అంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినమాదిరి ఎర్రబారినట్లుగా డాక్టర్ చెప్పారు. మందులిచ్చినా తగ్గలేదు ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి ఇలా ఏడ్వటం మాకు వేదన కలిగిస్తోంది. మా పాప సమస్య తగ్గేదెలా? – నిహారిక, నరసరావుపేట మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో మీ పాప సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
జంక్ఫుడ్ ఎందుకు మానలేమో తెలిసిపోయింది..
బెర్లిన్: కడుపు నిండినప్పటికీ కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే జంక్ఫుడ్ను ఎందుకు మానలేకపోతున్నామో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సహజంగా తల్లిపాలల్లో కార్బొహైడేట్లు, కొవ్వు పదార్థాలు అధికస్థాయిలో ఉంటాయి. అదే మోతాదులో బంగాళాదుంపలు, తృణధాన్యాల్లో ఉండటం వల్ల వాటితో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, కేండీ బార్ వంటివి ఎక్కువగా తింటున్నట్లు చెబుతున్నారు. ఈ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మెదడు వ్యవస్థను తీవ్రంగా ప్రభావితంగా చేస్తాయంటున్నారు. ‘పిండి పదార్థాలపై మనం ఆసక్తి పెంచుకోవడానికి కారణం బహుశా తల్లిపాలు కావొచ్చు. ఇది కీలకమైనందువల్ల బ్రెయిన్ రివార్డింగ్ సిస్టమ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ సంస్థ పరిశోధన విభాగానికి చెందిన మార్క్ టిట్జెమెయర్ చెప్పారు. దీన్ని నిర్ధారించడానికి కంప్యూటర్ గేమ్స్ ఎక్కువగా ఆడే కొంతమంది వాలంటీర్లపై ప్రయోగం చేశారు. అత్యధిక కార్బొహైడ్రేట్లు, కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను వారికి ఇచ్చారు. ఈ పదార్థాలను తిన్న తర్వాత కంప్యూటర్ గేమ్ ఆడే సమయంలో ఇతరులతో పోలిస్తే వీరి బ్రెయిన్ రివార్డింగ్ వ్యవస్థ చురుగ్గా పనిచేయడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే జంక్ఫుడ్ మానలేని బలహీనతకు కారణం వీరు కనుగొన్నారు. -
ఒక్క ఎంజైమ్ లేకుంటే.. ఎంత తిన్నా... స్లిమ్ అండ్ ట్రిమ్!
జంక్ ఫుడ్ తింటే లావెక్కుతారు... వైద్యులతోపాటు దాదాపు అందరూ అంగీకరించే విషయం ఇది. అయితే కోపెన్హేగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన దీనికి భిన్నమైన ఫలితాలిచ్చింది. ఎలుకల కణజాలం నుంచి ఎన్ఏఎంపీటీ అనే ఎంజైమ్ను తొలగించినప్పుడు అవి ఎంతటి కొవ్వు పదార్థాలు తిన్నా నాజుకుగానే ఉండిపోయాయని ఈ పరిశోధన చెబుతోంది. పిజ్జా బర్గర్లతో నిత్యం కడుపు నింపుకునే రకం ఆహారమిచ్చినా ఆ ఎలుకలు పిసరంత కూడా లావు కాలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కారెన్ ఎన్గార్డ్ నీల్సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. రక్తంలో, కడుపు ప్రాంతంలోని కొవ్వులో ఎన్ఏఎంపీటీ ఎంజైమ్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఊబకాయంతో బాధపడుతున్నట్లు గతంలోనే గుర్తించినా రెండింటి మధ్య సంబంధం మాత్రం ఈ ప్రయోగం ద్వారా తెలిసిందని చెప్పారు. ఎన్ఏఎంపీటీ ఎంజైమ్లేని ఎలుకల రక్తంలో చక్కెర మోతాదులు కూడా చక్కగా ఉన్నాయని వివరించారు. అయితే ఎంజైమ్ ఒకప్పుడు అంటే ఆహారం తక్కువ అందుబాటులో ఉన్న కాలంలో కొవ్వు శరీరంలో నిల్వ ఉండేందుకు ఉపయోగపడిందని అయితే ప్రస్తుతం కొవ్వు అధికంగా ఉన్న ఈకాలంలో దీని పాత్ర ఏమిటన్నది మరింత నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉందని నీల్సన్ వివరించారు. -
పరి పరిశోధన
జంక్ ఫుడ్తో ఆరోగ్యం పాడవుతుందని మనందరికీ తెలుసు. చాలాకాలంగా వింటున్న ఈ విషయాన్ని ఇంకోసారి రూఢి చేసుకోవాలని అనుకున్నారో ఏమోగానీ.. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని పల్లె ప్రాంత ప్రజలపై ఓ ప్రయోగం చేశారు. అమెరికాలో ఉండే కొంతమంది ఆఫ్రికా పల్లె తిండి తినేలా.. అదే సమయంలో ఆఫ్రికా గ్రామీణ ప్రజలు కొందరు అమెరికన్ ఫాస్ట్ఫుడ్ తినేలా చేశారు. రెండు వారాల తరువాత పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పీచుపదార్థం ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉండే గ్రామీణ తిండితో కేన్సర్ ముప్పు తగ్గినట్లు గుర్తించారు. దీన్నిబట్టి కేవలం ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా పేగు కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని తెలుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ ఓ కీఫీ అంటున్నారు. ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ రకమైన కేన్సర్ ఎక్కువగా ఉందని.. అదే సమయంలో ఆఫ్రికాలోని గ్రామీణులకు ఈ ముప్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో తాము ఈ పరిశోధన చేపట్టామని కీఫీ వివరించారు. అమెరికన్ తిండిలో పీచుపదార్థం తక్కువగా, కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తోందని, ఇందుకు భిన్నమైన ఆహారం తీసుకోవడం ద్వారా కేవలం రెండు వారాల్లోగానే కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చునని తమ పరిశోధన చెబుతున్నట్లు కీఫీ వివరించారు. ఈ పూతతో...కాయగూరల తాజాదనం నాలుగింతలు! కాయగూరలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్రిజ్లో లేదంటే శీతలీకరణ గిడ్డంగుల్లో ఉంచాలి. ఈ రెండూ లేకపోతే? ఇక అంతే సంగతులు. అవి కాస్తా తొందరగా పాడైపోతాయి. అటు రైతుకు, ఇటు మార్కెటింగ్ చేసే వారికీ నష్టాలు మిగులుస్తాయి. ఈ పరిస్థితిని మార్చేస్తామంటోంది అమెరికా కంపెనీ అపీల్ సైన్సెస్. మొక్కల నుంచి సేకరించిన ఓ ద్రావణంతోనే రిఫ్రిజిరేషన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం పండ్లు, కాయగూరలను తాజాగా ఉంచవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎడిపీల్ అని పిలుస్తున్న ఈ ద్రావణం ప్రతి పండు, కాయగూర చుట్టూ ఒక సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తుందని, తద్వారా ఇది ఎక్కువ కాలం పాడవకుండా చూస్తుందని కంపెనీ సీఈవో జేమ్స్ రోజర్స్ తెలిపారు. ఆక్సిడేషన్, ద్రవాలు కోల్పోవడం వల్ల... పండ్లు, కాయగూరలు తొందరగా పాడవుతాయని గుర్తించిన రోజర్స్... ఈ సమస్యలకు పరిష్కారంగా ఎడిపీల్ను తయారు చేశారు. మొక్కల నుంచి సేకరించిన రసాయనాలతోనే దీనిని తయారుచేశారు. ఎడిపీల్... పండ్లు, కాయగూరలపై ఒక పొరలా ఏర్పడి ఆక్సిజన్ లోపలకు రాకుండా, నీరు బయటికి పోకుండా అడ్డుకుంటుందని రోజర్స్ వివరిస్తున్నారు. పండ్లు, కాయగూరల రకాలను బట్టి ఎడిపీల్ మిశ్రమం మారిపోతుంది. -
జంక్ ఫుడ్ ప్రకటనల నిషేధ యోచన లేదు
న్యూఢిల్లీ: టీవీల్లో జంక్ ఫుడ్కు సంబంధించి వ్యాపార ప్రకటనలు నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను కట్టడి చేయాలని ఫుడ్ అండ్ బేవరేజెస్ అలయన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్బీఐఏ) స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్వర్ధన్ సింగ్ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రభావం చూపుతోందని అనుబంధ ప్రశ్నల్లో ఎంపీలు ప్రశ్నించగా ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ.. ‘సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియమించింది. కొవ్వులు, చక్కెర, ఉప్పు గల ఆహార పదార్థాలను పిల్లల ఛానళ్లల్లో ప్రసారం చేయకుండా నిషేధించాలని ఆ బృందం నివేదికలో సూచించింది. -
జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం
సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడ కేలరీలు లేని ఆహారపదార్థాలు జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. చిన్నపిల్లలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న ఈ జంక్ ఫుడ్స్ను నిర్మూలించడానికి ప్రభుత్వం, కార్టూన్ ఛానల్స్లో ప్రసారమవుతున్న వీటి ప్రకటనలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ప్రకటనలను నిషేధించడానికి తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర సమాచార, టెక్నాలజీ జూనియర్ మంత్రి రాజ్యవర్థన్ రాథోర్ నేడు పార్లమెంట్కు తెలిపారు. దీనిపై త్వరలోనే కార్టూన్ ఛానల్స్కు ఆదేశాలను జారీచేస్తామన్నారు. అనారోగ్యకరమైన ఈ ఫుడ్ ఉత్పత్తులను పిల్లలు తీసుకోకుండా ఉండేందుకు ఈ ఐడియా పనిచేస్తుందన్నారు. అనారోగ్యకరమైన ఫుడ్లపై చిన్న పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, ఇది వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ పేర్కొంది. ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్నారు. పిల్లలని టార్గెట్ చేసి వీటి ప్రకటనలను కూడా ఎక్కువగా కార్టూన్ ఛానల్స్లోనే ప్రదర్శిస్తున్నారు. పోగో, నికెలోడియాన్ వంటి పిల్లల టెలివిజన్ ఛానల్స్లో ప్రసారమయ్యే ఈ ప్రకటనలకు రెవెన్యూలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో కార్టూన్ ఛానల్స్లో ఈ ప్రకటనలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అంగట్లో మృత్యువు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నాలుగేళ్ల బాలుడు నిరీక్షణ డైమండ్ కంపెనీ తయారు చేసిన రింగ్స్(చెగోడీలు) ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అందులో ఉచితంగా ఉంచిన బొమ్మను తినబోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్. ఇది రాయదుర్గంలోని ఓ జంక్ ఫుడ్ తయారీ యంత్రం. ఏడాది కాలంగా ఎలాంటి అనుమతి లేకపోయినా యథేచ్ఛగా తయారీ కొనసాగిస్తున్నారు. బొరుగుల మిక్చర్.. చిప్స్.. ఇతరత్రాలను వివిధ రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళ గుట్టుగా సాగుతున్న ఈ తయారీ వ్యవహారం అధికారులకు తెలియనిది కాదు. అయినప్పటికీ మౌనం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజారోగ్యం పట్ల వీరికున్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అనధికార యంత్రాలతో నాసిరకం తినుబండారాలు తయారుచేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. టేస్టీ స్నాక్స్...చెటక్పటక్...క్రేజీ క్రాక్స్...చాకో...కుర్కురే.. ఒక్కోదానిపై ఒక్కోపేరు...అందమైన ప్యాకింగ్...అతి తక్కువ ధర...ఆపై హోరెత్తించే ప్రచారం.. అందువల్లే ఇపుడు ఏ చిన్నారి చేతిలో చూసినా ఈ నాసిరకం చిరుతిళ్లే కనిపిస్తున్నాయి. ధర తక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు కూడా వాటినే కొనుగోలు చేసి బిడ్డలకు తినిపిస్తున్నారు. కానీ ఈ రంగురంగుల ప్యాకెట్లలో విషం దాగుందనీ, అది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎవరూ గ్రహించలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వ్యాపారం జోరుగా సాగుతుండగా... ఈ నాసిరకం చిరుతిళ్ల ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. చిన్నారులు తరచూ అనారోగ్యానికి గురికావడం...ఊబకాయంతో బాధపడడం... మూత్రపిండాల సమస్య...ఆకలి మందగించడం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్న చిన్నారులు ఎక్కువవుతున్నారు. ఆహారపదార్థాల పేరుతో విషతుల్యమవుతున్న ఇలాంటి వాటిని బహిరంగంగా విక్రయిస్తున్నా.. ఆహార తనిఖీ శాఖ అధికారులు ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం తల్లిదండ్రులైనా బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాసిరకం చిరుతిళ్లకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ కళ్లు తెరవకపోతే మాత్రం రంగురంగుల ప్యాకెట్లలోని బూతం మీ ఇంటి దీపాన్ని మింగేయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా అమ్మకాలు మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, అగళి, రొళ్ళ, గుడిబండ, అమరాపురం మండలాల్లోని కళాశాలలు, పాఠశాలల వద్ద రోడ్లపైనే తినుబండారాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటుంది. రోడ్ల పక్కనే తోపుడు బళ్లను ఏర్పాటు చేసుకుని తినుబండారాల వ్యాపారం చేస్తుండడంతో దుమ్ము, ధూళి వీటిపై పడి నాణ్యత లోపిస్తోంది. వీటిని తింటున్న విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ కనీస తనిఖీలు నిర్వహించడం లేదు. ఈ విషయం తమ పరిధిలో కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ నాసిరకం చిరుతిళ్లను తింటున్న చాలామంది విద్యార్థులు రోగాలతో ఆస్పత్రులకు తిరుగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి అవసరం ఉంది. ఉరవకొండ: ఇక్కడ కనిపిస్తున్నది ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన దుకాణం. దుకాణం నిండా నాసిరకం చిరుతిళ్ల ప్యాకెట్లను నింపేశారు. ధర తక్కువగా ఉండడంతో చిన్నారులంతా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల ఎదుట ఇలాంటి దుకాణాల్లో ఈ నాసిరకం చిరుతిళ్లు విక్రయిస్తున్నారు. ఇక తోపుడు బండ్లపై క్రిమ్ బిస్కెట్లు, నాసిరకంగా తయారు చేసిన అరిసెలు కూడా విక్రయిస్తున్నారు. వీటిని తింటున్న చిన్నారులు రోగాలబారిన పడుతున్నారు. ఆరోగ్యానికి ముప్పు కళ్యాణదుర్గం: చిరుతిళ్లు చిన్నారులను ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా తయారు చేస్తున్న వీటిని తింటున్న ఎంతో మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో కేసీజీహెచ్, బాలికల ఉన్నత పాఠశాల, నార్తు హైస్కూల్, జూనియర్ కళాశాల, వివేకానంద ప్రైవేట్ విద్యాసంస్థల ఎదుట తినుబండారాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కుళ్లిపోయిన పండ్లు, పురుగులు పడ్డ తినుబండారాలను విద్యార్థులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. పైగా వీటిపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ఉంటోంది. వీటిని తింటున్న వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక వివిధ రకాల ప్యాకెట్లలో...వివిధ కంపెనీల పేరుతో విక్రయిస్తున్న చెగోడీలు, చిప్స్ మరీ నాసిరకంగా ఉంటున్నాయి. అందువల్లే వివిధ ఆరోగ్య సమస్యలతో కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అనంతపురం అర్బన్: చిన్నారులంతా ‘జంక్’ వలకు చిక్కి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మార్కెట్లో విక్రయిస్తున్న చిరుతిళ్లలో కనీస నాణ్యతాప్రమాణాలు లేకపోవడంతో వాటిని తిన్నవారంతా ఆరోగ్య సమస్యలతో బాధçపడుతున్నారు. రంగులతోనే రోగాలు పిల్లలు కోసం తయారు చేస్తున్న చిప్స్, చాక్లెట్లు, ఐస్ క్యాండీలు, సొంగలు(గోల్డెన్ ఫింగర్స్) తదితర వాటిలో రోగ కారకాలైన నిషేధిత రంగులు వినియోగిస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా లాభాపేక్షతో ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని తినడం వల్ల పిల్లలకు గవద గడ్డలు ఏర్పడతాయి. రంగుల కారణంగా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చక్కెర బదులుగా చాక్రిన్ తీపి పదార్థాల్లో చక్కెర లేదా బెల్లం వినియోగించాలి. అయితే చాలా మంది పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాల్సిన చాక్రిన్ వాడుతున్నారు. ఇది ధర తక్కువగా ఉండడంతో పాటు చక్కెర, బెల్లం కంటే 50 శాతం అధిక తీపిని కలిగి ఉంటుంది. అందువల్లే కొందరు వ్యాపారులు చాక్రిన్ ఉపయోగించి చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. చాక్రిన్తో తయారైన పదార్థాలు తినడం వల్ల ప్రాణాంతక కేన్సర్, అల్సర్, కాలేయ, శ్వాస కోస వ్యాధులు సంక్రమిస్తామని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి ప్యాకెట్ జంక్ ఫుడ్ హైదరాబాద్ నుంచి భారీ స్థాయిలో జిల్లాకు దిగుమతి అవుతోంది. వీటి తయారీకి కనీసం రూ.40 లక్షలు పెట్టుబడి అవుతుండడంతో జిల్లాలోని వ్యాపారులంతా హైదరాబాద్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా దుకాణదారులకు విక్రయిస్తున్నారు. -
కాలేజీ క్యాంటీన్లలో జంక్ ఫుడ్ నిషిద్ధం
వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కాలేజీల్లో జంక్ ఫుడ్ను నిషేధించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. జంక్ఫుడ్ తినడం వల్ల విద్యార్థులు ఒబెసిటీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, అందుకే కాలేజీ క్యాంటీన్లలో, ఆవరణలో జంక్ ఫుడ్ను విక్రయించడానికి, వండటానికి వీల్లేదని పేర్కొంది. ఈ నిబంధనను తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్ కాలేజీ యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని వెల్లడించింది. కాలేజీల ఆవరణలో విక్రయించే ఆహార పదార్థాలను ఆయా యాజమాన్యాలే నియంత్రించాలని, విద్యార్థులు వాటిని తినకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల కాలేజీల్లో ఈ నిబంధనల అమలుకు యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. దీనిని రాష్ట్రంలో 500కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, నర్సింగ్ కాలేజీ యాజమాన్యాలు అన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధం విద్యాలయాల ఆవరణలో సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు కాలేజీల ఆవరణలో ఉండటానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. వాటిని వినియోగించకుండా విద్యా ర్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లోని ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ల నేతృత్వంలో విస్తృత అవగాహన , ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది. -
హెల్త్టిప్స్
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణకోశాన్ని శుభ్రపరచడంతోపాటు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతిమంతమవుతుంది. క్రమంతప్పకుండా నెల రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మకాంతి పెరగాలని కోరుకునే వాళ్లు జంక్ఫుడ్, రోస్టెడ్ ఫుడ్ను పూర్తిగా మర్చిపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, తాగడంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక క్రమపద్ధతి పాటించాలంటారు నిపుణులు. దీర్ఘంగా అంటే లంగ్స్ నిండేలా శ్వాసించాలి. ప్రతి భోజనంలోనూ తప్పని సరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండడానికి దోహదం చేస్తాయి. -
తిండిని బట్టే నిద్ర!
ఫుడ్ అండ్ స్లీప్ మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధం ఉంటే చాలా సందర్భాల్లో పరోక్షంగా నిద్రపై దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువగా టీ, కాఫీలు తాగని వారు సాయంత్రం వేళల్లో లేదా రాత్రి వేళలో వాటిని తాగితే నిద్రపట్టకపోవడం జరుగుతాయి. అలాగే... చాలా రకాల ఆహారాలు నేరుగా ప్రభావం చూపకపోయినా... పరోక్షంగా ఆరోగ్యాన్నీ, తద్వారా నిద్రనూ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వారిలో వారికి జంక్ఫుడ్లోని చిప్స్ వంటి సరిపడని ఆహారమో, సాఫ్ట్ డ్రింక్ వంటి పానీయమో, తీపి పదార్థమో తీసుకున్న తర్వాత మెల్లగా శ్వాస మీద ప్రభావితం చూపుతాయి. దాంతో రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వస్తుంది. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం... పాలు : దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా ఉండే గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు. ఇది స్వాభావికమైన స్లీపింగ్ పిల్. సింపుల్ కార్బోహైడ్రేట్స్: భోజనం తర్వాత కాస్త మగతగానూ, నిద్రపడుతున్నట్లుగానూ అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే సింపుల్ ఓట్ మీల్, వరి లాంటి మిగతా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది. ఇందులోని మెలటోనిన్ అనే పదార్థం కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే రసాయనాన్ని ప్రేరేపించడమే దీనికి కారణం. దీంతో పాటు, విటమిన్ ‘సి’ పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలగజేస్తాయి. అలాగే, సెలేనియవ్ు ఎక్కువగా ఉండే చేపలు, బాదాం లాంటి నట్స్ ఆరోగ్యకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్రను దూరం చేసే పదార్థాలు జంక్ ఫుడ్: మన ఆహారంలో త్వరగా లభ్యమై, మార్కెట్లో తేలికగా దొరికే జంక్ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తప్పనిసరిగా చెడు అలవాటు. ఇందులో ఉండే రిఫైన్డ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక సమస్యలు రావచ్చు. దీని వల్ల కలిగే ఎలర్జీల కారణంగా నిద్ర దూరం కావచ్చు. కాబట్టి ఇది మంచి అలవాటు కానే కాదు. టీ : థయానిన్ అనే అమైనో ఆసిడ్ అనేది మెదడుకు ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అన్ని రకాల టీలలోనూ ఇది ఉంటుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన టీ అయినా తాగకపోవడం మేలు. కాఫీ : ఇందులోని కెఫిన్ అనే పదార్థం మెదడును ఉత్తేజపరుస్తుంది. దాంతో, నిద్ర దూరమవుతుంది. కాబట్టి, నిద్ర పోవడానికి ముందు కాఫీ తాగకుండా ఉండడమే మేలు. సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాద్ -
పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం
ఛండీగఢ్: పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక కమిటీల నివేదికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. జంకు ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మానసిక సమస్యలు వస్తున్నాయని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని కాలియా తెలిపారు. -
కేరళలో జంక్ ఫుడ్పై ఫ్యాట్ ట్యాక్స్
తిరువనంతపురం: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు కనీవిని ఎరుగని సరికొత్త పన్నును కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం విధించింది. బ్రాండెడ్ రెస్టారెంట్లలో విక్రయించే పిజ్జా, బర్గర్, శాండివిచ్, డాగ్నట్స్, పాస్ట, టాకూస్, బర్గర్ ప్యాటీ, బ్రెడ్ ఫిల్లింగ్ లాంటి జంక్ ఫుడ్పై 14.5 శాతం ఫ్యాట్ టాక్స్ (కొవ్వు పన్ను)ను విధించింది. మెక్డొనాల్డ్, డొమినోస్, పిజ్జా హట్, సబ్ వే లాంటి బ్రాండెడ్ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లకు ఈ పన్ను వర్తిస్తుంది. కేరళ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఎల్డీఎఫ్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ను సమర్పిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ కొత్త పన్నును విధించడం ద్వారా పది కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని ప్రకటించిన ఆయన ఎందుకు ఈ పన్నును విధించారో మాత్రం వివరించలేదు. స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు డెన్మార్క్, హంగరీ లాంటి దేశాల్లో ఫ్యాట్ పన్ను అమల్లో ఉంది. కేరళ విద్యార్థుల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్యను దృష్టిలు పెట్టుకొని ఈ పన్నును విధించారా అన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. కేరళ పాఠశాల విద్యార్థుల్లో స్థూలకాయ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన రెండు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సిటీ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న తిరువనంతపురం హైస్కూల్ విద్యార్థుల్లో 12 శాతం మంది అధిక బరువు ఉన్నారని, వారిలో 6.3 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. అల్లపూజ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులో స్థూలకాయ సమస్య ఎక్కువుందని కూడా తేలింది. పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు జంక్ ఫుడ్పై ఫ్యాట్ టాక్స్ను విధించాలనే అంశంపై పలు దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న పౌరులు ఎప్పుడోగానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్లరని, అలాంటి వారిపైనా ఈ పన్ను భారం పడుతుందన్నది వ్యతిరేకుల వాదన. ప్యాక్ చేసిన గోధుమ, మైదా, రవ్వ ఉత్పత్తులపై కూడా కేరళ ఆర్థిక మంత్రి ఐదు శాతం పన్ను విధించారు. కేరళ వంటల్లో విశేషంగా వాడే కొబ్బరి నూనెపై కూడా ఐదు శాతం పన్ను విధించారు. -
సీ లయన్స్కు తప్పని అతిపెద్ద ముప్పు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో అనూహ్యంగా భారీ సంఖ్యలో సీల్ చేపలు పెరిగిపోయాయి. ఎంతగా అంటే 1970లో వాటి సంఖ్య 50 వేలు ఉండగా.. ప్రస్తుతం అవి 3,40,000కు చేరుకున్నాయి. ఈ పెరుగుదల రేటు గతంలోని రికార్డులన్నింటిని దాటేసినా వాటి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అయ్యో పాపం అనిపించక మానదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జీవరాశికి ఓ ముప్పు వచ్చి పడింది. సీల్ పిల్లలు పౌష్టికాహార లోపంతో తిండిలేక ఆకలి సమస్యతో బాధపడుతున్నాయి. ఇప్పటివరకు మనుషులనే వేధిస్తున్న జంక్ ఫుడ్ సమస్య ప్రస్తుతం ఈ జీవరాశిని కూడా వెంటాడడమే ఇందుకు ఓ కారణం. వీటి తల్లులు జంక్ ఫుడ్ ను అమితంగా తీసుకోవడం వల్లే ప్రస్తుతం అవి ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఆసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సీల్ జీవరాశిపై పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది. 2004 నుంచి 2014 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మధ్యకాలంలో సీలు చేప పిల్లల ఆరోగ్య స్థితిని అంచనా వేశారు. ఇందులో అవి అనూహ్యంగా బరువు తగ్గిపోతున్నట్లు, పౌష్టికాహార లోపంతో బాధపడిపోతున్నట్లు గుర్తించారు. వాటిలో ఉండే కేలరీల స్థాయి కూడా పడిపోతుందని, అత్యధిక స్థాయి నుంచి అతి తక్కువ స్థాయికి వాటి పోషక విలువలు పడిపోతున్నట్లు వారు చెప్తున్నారు. సముద్రపు నీరు వేడెక్కడం కూడా అవి బలహీనంగా తయారవడానికి మరోకారణం అని వారు భావిస్తున్నారు. సముద్ర జలాల్లో జంక్ ఫుడ్లాంటి పదార్థాలు ఎక్కువవడం వాటిని అవి తినడం వల్ల ప్రస్తుతం ఈ జాతి పిల్లలు పెను ప్రమాదాన్ని చవిచూస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. -
స్కూళ్లలో ఇక పిజ్జా, బర్గర్లు బంద్!
న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మడం, అందుబాటులో ఉంచడం నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ముసాయిదా మార్గదర్శకాలను జారీచేసింది. పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలోనూ అత్యధిక కొవ్వు, సాల్ట్, షుగర్ విలువలున్న ఆహార పదార్థాలు అమ్మకుండా నియంత్రించాలని ఆదేశించింది. చిప్స్, రెడీ టు ఇట్ న్యూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, షూగర్ స్వీటెన్డ్ కార్బొనేటెడ్లు, శీతల పానీయాలు, నాన్- కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆలూ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలు స్కూల్ ప్రాంగణాల్లో అమ్మకుడదని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాల ప్రాంగణాల్లో క్యాంటీన్ పాలసీని, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను ఏర్పాటుచేసి.. అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల తలెత్తే దుష్ర్పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఎస్ఎస్ఐ సూచించింది. -
స్కూల్స్ దగ్గర్లో జంక్ ఫుడ్ అమ్మొద్దు!
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య పరిష్కారానికి కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ నియమించిన కమిటీ సిఫారసులు చేసింది. పాఠశాలల్లోని క్యాంటీన్లలో, స్కూళ్లకు 200 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని సూచించింది. జంక్ ఫుడ్ పదార్ధాలను స్కూల్ సమయాల్లో, స్కూల్స్ దగ్గరలో వీటిని అమ్మకుండా చూడాలని పేర్కొంది. -
బ్యాన్ ఆన్ జంక్
జంక్ఫుడ్ తయారీదార్లను జంకేలా చేస్తేనే బెటర్ ఇప్పుడు దేశవిదేశాలలో పొంచి ఉన్న భయం స్థూలకాయం. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు చేరడం, గుండెపోటు, పక్షవాతం, కీళ్లనొప్పులు, స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతున్న స్థూలకాయాని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు నడుం కట్టాయి. ఉదాహరణకు... బ్రిటన్ : ఈ దేశంలో 26 శాతం జనాభా స్థూలకాయులవుతున్నందున స్కూళ్లలో జంక్ఫుడ్ తినడంపై 2005 నుంచి నిషేధం విధించారు. అంతేకాదు 2008 నుంచి జంక్ఫుడ్ యాడ్స్ను సైతం నిషేధించారు. అమెరికా : అమెరికాలోని స్కూళ్లలో జంక్ఫుడ్ తినడంపై నిషేధాన్ని గత ఏడాది జులై నుంచి విధించారు. కొవ్వుపాళ్లు 35% మించిన ఆహారాలను నిషేధించారు. మనదేశంలోని పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి చర్యలే తీసుకుంటే రేపటి మన యువత ఆరో గ్యకరంగా ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం. -
సుఖంగా తెల్లవారాలంటే...
కొందరికి ప్రతిరోజూ ఉదయమే మలవిసర్జన నరకప్రాయంగా అనిపిస్తుంటుంది. ఆ పనికాస్తా సాఫీగా సాగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారంలో జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత పెంచుతున్నాయి. కేవలం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళ అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. మన మలం పలచగా ఉండాలంటే పెద్దపేగులో నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే గనక, ఆ ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో... ఉన్న నీరంతా పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కనీసం ప్రతిరోజూ 20 - 35 గ్రాముల పీచు ఉండాలి. దానికోసం స్వాభావికంగా పీచు లభ్యమయ్యే ఈ ఐదు ఆహార పదార్థాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. -
మధుమేహగ్రస్తులకు డిలైట్ మెడ్లి ప్రో
చిరు ధాన్యాలతో జావ యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న నగర వాసులకు ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన ఆహారం లభించడం లేదు. ఉరుకులు, పరుగుల జీవితం...ఇంటిలో సరైన సమయానికి ఫుడ్ అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో నగర వాసులు ఎక్కువగా బయట దొరికే ఆహారంపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆకలి వేసినపుడు ఏది అందుబాటులో ఉంటే దాన్నే తినేస్తున్నారు. ఇందులో జంక్ ఫుడ్ను లాగిస్తున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. పని ఒత్తిడికి తోడు విటమిన్లు లోపించిన ఆహారాన్ని తినడం వల్ల చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. ఈ మధుమేహగ్రస్తులకు అవసరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నాచారంలోని శ్రీ కళ్యాణి ట్రేడింగ్ కంపెనీ ద్వారా ‘అమ్మే’ అనే పేరుతో ‘డిలైట్ మెడ్లీ ప్రొ’ అనే ప్రొడక్ట్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్ డయాబెటిక్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. తొమ్మిది రకాల నాణ్యమైన చిరుధాన్యాలతో దీన్ని తయారు చేశారు. ఇందులో శనగలు, పెసలు, బార్లీ, రాగులు, సజ్జలు, సోయా, మెంతులు, ఉసిరికాయ, అలసంద (ఛిౌఠీఞజ్ఛీ) వంటి ధాన్యాలతో పౌడర్గా తయారు చేశారు. ఈ పౌడర్ను గ్లాసు నీటిలో రెండు నిమిషాలు మరుగబెట్టి జావలాగా తయారు కాగానే దాన్ని తాగాలి. మధుమేహగ్రస్తులు గంట గంటకు ఏదో ఒకటి తినాలి... ఆ తినే స్థానంలోనే జావను తాగాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, కొలెస్ట్రాల్ లేని పౌడర్ ఇది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అమ్మ చేతి నుంచి తయారైన వంట ఎంత రుచిగా ఉంటుందో.. అంత శ్రేష్టమైనది ఈ పౌడర్. అందుకే దీనికి ‘అమ్మే’ అని పేరు పెట్టామని సంస్థ డెరైక్టర్ జయశ్రీ శ్రీధర్ చెప్పారు. సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో, నాణ్యమైన చిరుధాన్యాలతో తయారు చేయడం జరిగిందని వివరించారు. ADDRESS Sri Kalyani Trading Company Customer Care No 8008188288 / 04027034609 -
ఒబేసిటి (స్థూలకాయం)
నేటి సమాజంలో స్థూలకాయం అన్నది ఒక ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలలో కూడా ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతి పదిమందిలో, ముగ్గురు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఆయుర్వేదంలో దీనిని స్థౌల్యం అని చెప్పబడింది. స్థూలకాయం అన్నది ఒక వ్యాధి కాకున్నా అనేక వ్యాధులకు దారి తీయడానికి మార్గంగా చెప్పబడింది. కారణాలు: అధికంగా ఆహారం తీసుకోవడం. జంక్ ఫుడ్ లాంటిది ఎక్కువ తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం స్త్రీలలో హార్మోనల్ సమతుల్యత దెబ్బతినడం హైపో థైరాయిడిజమ్ కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం వంశపారంపర్యంగా కూడా స్థూలకాయం రావడానికి అవకాశాలున్నాయి. ప్రతికూలతలు: స్థూలకాయంను నిర్లక్ష్యం చేయడం వల్ల అది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచడంతో పాటు గుండె సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. మధుమేహం వచ్చే అవకాశముంది. స్థూలకాయం వల్ల ఆర్థరైటీస్, శ్వాస సంబంధ వ్యాధులు రావచ్చు. నిర్ధారణ: ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నాడని నిర్ధారించడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బి.యం.ఐ) సూచికగా పనిసొస్తుంది. ఆ.M.I= Wt in Kgs Ht in M2 బి.యం.ఐ సూచికలో పురుషులలో 17-27, స్త్రీలలో 17-25 (నార్మల్ అని చెప్పబడింది). 27-32---------అధిక బరువు 32 కన్న ఎక్కువ ------ స్థూలకాయం 17 కన్న తక్కువ ----- కృశత్వం చికిత్స: ఆయుర్వేదంలో స్థూలకాయాన్ని మేదోరోగంగా పరిగణించడం జరిగింది. దీనికి శోధన, శమన అని రెండు రకాల చికిత్స చెప్పడం జరిగింది. శోధన చికిత్సలో కషాయవస్తి (నిరూహవస్తి) ప్రధాన చికిత్సగా చెప్పబడింది. దీనితో పాటు ఉద్వర్తనం, స్వేదనం లాంటి చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక శమన చికిత్సలో నాల్గవ ధాతువైన మేదోధాతువును కరిగించుటకు కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే ప్రతి వ్యక్తి కూడా వారి వ్యాయామ శక్తిని అనుసరించి శారీరక వ్యాయామం, జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం వల్ల స్థూలకాయం రాకుండా కాపాడుకోగల్గుతారు. -
స్కూల్ క్యాంటిన్లలో చిరుతిళ్లు నిషేధించే యోచన
న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల క్యాంటిన్లలో అనారోగ్యమైన లేదా చిరుతిళ్లను నిషేధించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ యోచిస్తున్నారు. పిల్లలకు ఈ విషయంపై అవగాహన కల్పించడంతో పాటు క్యాంటిన్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలతో మేనకా గాంధీ ఈ విషయంపై చర్చించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుంది. -
నాలుగో నెల గర్భిణిని...దంతచికిత్స చేయించుకోకూడదా?
నా వయసు 26. నేను నాలుగు నెలల గర్భవతిని. నా దవడ పళ్లు పుచ్చిపోయి, విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. చిగుళ్లు కూడా వాచాయి. డెంటిస్ట్ను కలిస్తే ఇప్పుడు చికిత్స కష్టం అన్నారు. డెలివరీ అవడానికి ఇంకా అయిదు నెలలకు పైగా సమయం ఉంది. నొప్పి, బాధ అంతకాలమూ భరించక తప్పదంటారా? సలహా ఇవ్వండి. - పి. వసంత, ఆదిలాబాద్ గర్భంతో ఉండటం అనేది ఒక ప్రత్యేక సందర్భం. ఈ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలోని ఎన్నో అవయవాలు రకరకాల ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వీటి ప్రభావం నోటి ఆరోగ్యం పైన కూడా పడుతుంది. దానికితోడు గర్భిణులు జంక్ఫుడ్ లేదా పంటికి అతుక్కుపోయే ఆహారం తీసుకోవడం వల్ల పళ్లు పుచ్చిపోతాయి. దాంతో చిగుళ్లు వాచి, బ్రష్ చేసినప్పుడు, చిగుళ్ల నుంచి రక్తం రావటం లేదా చెడురక్తం చిగుళ్లమీద బుడిపెలుగా చేరటం, నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా సహజంగానే కనిపిస్తుంటాయి. ఇక్కడున్న మరొక సమస్య ... గర్భంతో ఉన్నప్పుడు మామూలు వ్యక్తులకులా చికిత్స చేయించుకోలేకపోవటం. గర్భిణులు దంత చికిత్సలకు వచ్చినప్పుడు ఎక్స్రేలు తీసే విషయంలో కూడా డాక్టర్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. లెడ్ ఏప్రాన్ని కప్పడం ద్వారా ఎక్స్రేలు శరీరంలోకి పోకుండా జాగ్రత్త పడతారు. అయితే వీరికి దంతచికిత్స చేయడం కొంచెం కష్టమే. గర్భిణులు 4, 5, 6 నెలల్లో మాత్రమే సురక్షితంగా చేయించుకునే అవకాశం ఉంది. కాని, మీరు విపరీతమైన నొప్పి, బాధతో ఉన్నప్పుడు డెలివరీ అయ్యే దాకా బాధ భరించమని చెప్పడం భావ్యం కాదు. పంటి నొప్పి ఎంతో భయంకరమైనది. కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు భరించడం కూడా కష్టమే. అందుకే డెంటిస్ట్ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని పిప్పి పళ్లలో ఉన్న ఇన్ఫెక్షన్ని సాధ్యమైతే రూట్ కెనాల్ చికిత్స ద్వారా నయం చేస్తారు. అందుకే గర్భం దాల్చే అవకాశాలు ఉన్నప్పుడు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది. పళ్లలో చిన్న చిన్న రంధ్రాలుంటే, ఫిల్లింగ్ చేయించుకోవటం, తప్పనిసరిగా మూడవ నెలలో ఒకసారి, 6 లేదా 7వ నెలలో ఒకసారి పళ్లను శుభ్రపరిచే స్కేలింగ్ ప్రక్రియ చేయించుకోవడం ద్వారా డెలివరీ తర్వాత చాలా మందికి ఎదురయ్యే చిగుళ్ల జబ్బులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం, నోటి దుర్వాసన, పళ్ల మధ్య సందులు ఏర్పడటం, పళ్లు ఎత్తుగా రావటం లాంటి ఎన్నో సమస్యలు రాకుండా నివారింవచ్చు. మంచి స్పెషలిస్టును కలిసి, మీ సమస్యను పరిష్కరించుకోండి. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్