KBC
-
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -16 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న
కౌన్ బనేగా కరోడ్పతి తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 26) క్రికెట్కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 50 లక్షల రూపాయల విలువైన ఈ ప్రశ్నను అభిషేక్ సంధు అనే కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. క్లిష్టమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సంధు గేమ్ను మధ్యలోనే వదిలేశాడు.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ ఎవరు..? ఈ ప్రశ్నకు కంప్యూటర్ మహాశయ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అవేంటంటే.. ఏ- ఆర్థర్ ష్రూస్బరీ, బి- డబ్ల్యూజీ గ్రేస్, సి- డౌగ్ ఇన్సోల్, డి- టామ్ మార్స్డెన్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.A cricket question in KBC for 50 Lakhs. pic.twitter.com/7bs0VkWsnK— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2024కాగా, ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు తరుచూ ఎదురవుతున్నాయి. కంటెస్టెంట్లు క్రికెట్ పరిజ్ఞానం కలిగిన వారైతే ఆ ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు చెప్పగలుగుతున్నారు. తాజాగా ఎదురైన క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే ఎంతటి లోతైన క్రికెట్ పరిజ్ఞానమున్నా జవాబుల చెప్పడం కష్టం. ఇంతకీ పైన అడిన ప్రశ్నకు సమాధానం ఏంటని అనుకుంటున్నారా..? ఆప్షన్-డి. టామ్ మార్స్డెన్టామ్ మార్స్డెన్ 1826లో తన డెబ్యూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ ఏడాది జులై 26న మార్స్డెన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో షెఫీల్డ్ అండ్ లీసెస్టర్కు ప్రాతినిథ్యం వహించిన మార్స్డెన్.. నాటింగ్హమ్తో జరిగిన మ్యాచ్లో 227 పరుగులు చేశాడు. చదవండి: బ్రాడ్మన్ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్ -
బిగ్బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్బీ కూడా చలించిపోయారు. చందర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్లైన్ని అనే లైఫ్లైన్ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
కౌన్ బనేగా కరోడ్పతిలో టీ20 వరల్డ్కప్నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్లో ఎవరూ టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
కౌన్ బనేగా కరోడ్పతి.. ఒక్క ఎపిసోడ్కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-16కు హౌస్ట్గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
'కౌన్ బనేగా కరోడ్పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్పతి భారతీయ టెలివిజన్లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సీజన్ లో కోల్కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్ను అమితాబ్తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్సీట్పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
KBC 15: రూ. 12.5 లక్షల ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలుసా..?
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్పతి భారతీయ టెలివిజన్లో అత్యంత పాపులర్ అయినదిగా గుర్తింపు ఉంది. బుల్లితెరపై వచ్చే చాలా షోస్లలో దీనిని ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుత సీజన్లో చాలా మంది కంటెస్టెంట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారు భారీ మొత్తంలో డబ్బును గెలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ షోలో కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ జాబితాలో జస్కరన్, జస్నిల్ పేర్లు ఉన్నాయి. చివరి ఎపిసోడ్లో, హోస్ట్ బీహార్కు చెందిన మండల్ కుమార్ అనే కంటెస్టెంట్తో గేమ్ ఆడారు అమితాబ్, దీనిని స్టూడియోలోని ప్రేక్షకులతో పాటు టీవీ వీక్షకులు కూడా ఆనందించారు. (ఇదీ చదవండి: బతికి ఉన్న ప్రముఖ నటికి అంత్యక్రియలు కూడా చేసేసిన యూట్యూబర్స్) రూ. 40,000 ప్రశ్నపై మూడు లైఫ్లైన్లను కోల్పోయిన తర్వాత అతను 'సూపర్ సందూక్' సహాయంతో తన ఆడియన్స్ పోల్ లైఫ్లైన్ని తీసుకున్నాడు. 10 ప్రశ్నలకు విజయవంతంగా సమాధానమిచ్చిన తర్వాత, మండల్ రూ. 6.4 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాత రూ.12.5 లక్షల ప్రశ్నకు ఆయన సరైన సమాదానం చెప్పలేక క్విట్ చేశాడు. దీంతో ఆయన కేవలం రూ.6.4 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రూ. 6.4 లక్షల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు ► రూ. 6.4 లక్షల ప్రశ్న: 'విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్' పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న హిందీ రచయిత ఎవరు? A. శరద్ జోషి, B.మోహన్ రాకేష్, C.బాబా నాగార్జున, D. హరిశంకర్ పర్సాయి ► రూ. 12.5 లక్షల ప్రశ్న: అంతరించిపోతున్న పక్షి నార్కొండమ్ హార్న్బిల్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక పక్షి? A.లడఖ్, B. అండమాన్, నికోబార్ దీవులు, C. నాగాలాండ్, D.కేరళ పై ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. -
కౌన్ బనేగా కరోడ్పతిలో మరో క్రికెట్ ప్రశ్న.. ఈసారి 3 లక్షల 20 వేలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో వరుసగా రెండో ఎపిసోడ్లో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. సెప్టెంబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ను భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లకు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనగా.. నిన్న (సెప్టెంబర్ 20) ప్రసారమైన ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నాడు. 19వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్లో కుంబ్లేకు సంబంధించిన ప్రశ్నకు ప్రైజ్మనీ 12 లక్షల 50 వేల రూపాయలు కాగా.. సెప్టెంబర్ 20న సెహ్వాగ్ గురించిన ప్రశ్నకు ప్రైజ్మనీ 3 లక్షల 20 వేల రూపాయలుగా ఉంది. ఇంతకీ ప్రశ్న ఏంటంటే..? వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీని ఏ స్టేడియంలో చేశాడు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా బారాబతి స్టేడియం, కటక్.. ఈడెన్ గార్డెన్స్ కోల్కతా.. హోల్కర్ స్టేడియం, ఇండోర్.. బ్రబోర్న్ స్టేడియం, ముంబైలను ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గత ఎడిసోడ్లోని ప్రశ్న ఏంటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (పాక్పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీ 2011లో వెస్టిండీస్పై చేశాడు. నాటి మ్యాచ్లో వీరూ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ (67), సురేశ్ రైనా (55) కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (పాక్పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్తో జరిగిన ఢిల్లీ టెస్ట్లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్లో ఏవీ జయప్రకాశ్ అంపైర్గా ఉన్నాడు. ఆ మ్యాచ్ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్ను డ్రా చేసుకుంది. టెస్ట్ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా కెరీర్ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
‘కౌన్ బనేగా కరోడ్పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్ని తెరిచారు. ఆమె జార్ఖండ్లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్లు తమ తల్లికి క్యాన్సర్కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్లోని హాజీపూర్కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
కోటి రూపాయలు గెలిచింది.. కానీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు!
బాలీవుడ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్పతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 14న కౌన్ బనేగా కరోడ్పతి 15వ సీజన్ ప్రారంభమైంది. ఈ సారి కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ఈ షోలో పాల్గొని చివరిదాకా నిలిచి కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ షోలో మొదట కోటీ రూపాయలు గెలుచుకున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలేంటి? అన్న సందేహం వస్తోంది కదా. అయితే అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?) రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి ప్రస్తుతం 15వ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మహిళ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలిచింది. 2010లో కేబీసీ -4 సీజన్లో అమితబ్ను మెప్పించిన మహిళ రహత్ తస్లీమ్ రూ.కోటి రూపాయలు ప్రైజ్మనీ సొంతం చేసుకుంది. జార్ఖండ్లోని గిరిదిహ్కు చెందిన 37 ఏళ్ల రహత్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రాహత్ పాల్గొన్న సమయంలో రూ. 3.20 లక్షల ప్రశ్న నుంచి రూ. 50 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్ లైన్లు వినియోగించుకోలేదు. ఆ తర్వాత నీపై ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందని బిగ్ బి ప్రశ్నించగా.. అది నా ఆత్మవిశ్వాసం నుంచే పుట్టింది.. నాకు అన్నీ తెలుసు.. అని సమాధానిచ్చినట్లు రాహత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే కేబీసీలో పాల్గొనేందుకు మేసేజ్ చేయడానికి తన మొబైల్ ఫోన్లో కేవలం రూ. 3 మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది. ఆ డబ్బులతోనే మేసేజ్ పంపినట్లు పేర్కొంది. ఆ తర్వాత తాను ఎంపికవ్వడంతో ముంబయిలో ఆడిషన్ కోసం పిలిచారని వెల్లడించింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరికీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని వివరించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) అయితే ఆడిషన్స్ ముగిశాక.. ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే నేను చేసిన మొదటి పని బ్యాంక్ ఖాతా తెరిచి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడమే అని ఆ రోజులను రాహత్ గుర్తుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం రాహత్ ఇప్పుడు గిరిదిహ్లోని పెద్ద మాల్లో దుస్తుల షోరూమ్ నిర్వహిస్తోంది. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆమె.. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ లేని స్థితి నుంచి ఏకంగా బిజినెస్ చేసే స్థాయికి చేరుకోవడమంటే గొప్ప విషయమే. కౌన్ బనేగా కరోడ్పతి వల్ల ఓ సామాన్యురాలు సైతం బిజినెస్ వుమెన్గా అవతరించింది. -
అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు
కేబీసీ కరోడ్పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన టాప్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్ సెన్సేషన్. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్పతి జూనియర్ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు. అంతేనా దయాగాడి దండయాత్ర అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్లో పోరుబందర్కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్ అబితాబ్ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) 2012 లో మెయిన్స్ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడే 2014లో, ఆల్ ఇండియా ర్యాంక్ 461తో అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్లో చేరానంటారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84 — SP Porbandar (@SP_Porbandar) June 13, 2023 మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
అనుమతి లేకుండా అమితాబ్ పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. -
తండ్రి బర్త్డేకు అభిషేక్ బచ్చన్ సర్ప్రైజ్ ప్లాన్, ఎమోషనల్ అయిన బిగ్ బి
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11 ఆయన బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, భారత సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్డే నేపథ్యంలో బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్ను సర్ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కేబీసీ షోలో అడుగుపెట్టాడు. చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి ఆయన షో నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ తర్వాత షో అయిపోయిందా? అని అందరు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడి రాకతో బిగ్ బి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం తండ్రిని హాట్ సీట్లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్లో తను కూర్చోని అమితాబ్ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బిగ్బి అభిషేక్కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న ఆయన సతీమణి జయ బచ్చన్ అమితాబ్ను తట్టి ఓదారుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. అనంతరం షోలోనే కేక్ కట్ చేయించి తండ్రికి ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించాడు అభిషేక్. చదవండి: బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ షేర్ చేశాడు. ‘దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా గోప్యంగా ఇది సరిగ్గా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇంత చేసిన ఆయనకు ఇది తక్కువే అనిపిస్తుంది. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్లో(కేబీసీ షో) జరుపడం సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది భావోద్వేగానికి గురి చేసింది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్పతి టీంకు నా కృతజ్ఞతలు’ అంటూ అభిషేక్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
KBC 14: కోటి గెలుచుకున్న కవిత.. కానీ, రూ. 7.5 కోట్ల ప్రశ్నకు మాత్రం!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్ షో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్ కేబీసీ సీజన్ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్గా వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ సీజన్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్ను ఆకట్టుకుంది. ఏంటి ఆ ప్రశ్న.. అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది. దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్మీడియా సెన్సేషన్గా మారింది. చదవండి: Samantha: స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే.. -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్ఫోన్లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్టాప్లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్స్క్రిప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
కౌన్ బనేగా కరోడ్పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ) అభిమానులకు గుడ్న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
KBC: అమితాబ్పై జయా బచ్చన్ ఫిర్యాదు!
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్ సీట్లో కూర్చొని క్విజ్లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్ ఆహ్వానించారు. దీంతో పాటు అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్’ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్ చేశారు. ‘ఇంటర్నెట్ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు. స్వేతా బచ్చన్ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్ మారుస్తూ.. అమితాబ్ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
నా ప్రపంచం మారిపోయింది.. కన్నీళ్లతో అమితాబ్
Amitabh Bachchan Felt Emotional In KBC: ప్రముఖ హిందీ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి' గురించి తెలియనీ వారుండరు. దీని నుంచే ఎవరు మీలో కోటీశ్వరులు పోగ్రామ్ వచ్చిందని కూడా తెలిసిందే. బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎందరో సామాన్యులు వచ్చి కరోడ్పతులుగా మారి ప్రేక్షకులను అలరించారు. ఈ పోగ్రామ్ ఈ శుక్రవారం 1000వ ఎపిసోడ్ను పూర్తిచేసుకోనుంది. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో బిగ్బీ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నంద పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లోని ఉత్తమ క్షణాలను వీడియో రూపంలో విడుదల చేశారు. అది చూసిన బిగ్బీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలో 2000 సంవత్సరంలో భారీ మొత్తాన్ని గెలుచుకున్న హర్షవర్ధన్ నవతే ఉన్నాడు. అలాగే 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఉన్నాడు. ఇంకా ఆ వీడియోలో హాట్సీట్లో కూర్చున్న వారితో ఆనంద క్షణాలు పంచుకున్న బిగ్బీ ఉన్నారు. షోలో పాల్గొన్నవారి విజయాన్ని చూసి ఆనందించారు అమితాబ్. వీడియో క్లిప్ చూసిన శ్వేతా బచ్చన్, తండ్రి అమితాబ్ను ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది. అందుకు బిగ్బీ కన్నీళ్లు పెట్టుకుంటూ 'నా ప్రపంచం మొత్తం మారిపోయింది.' అని బదులిచ్చారు. 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి ఎపిసోడ్ను హోస్ట్ చేశారు బిగ్బీ అమితాబ్. అయితే మూడో సీజన్కి అమితాబ్ అనారోగ్యం కారణంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. దీంతో పాటు 21 ఏళ్లుగా షోలో స్థిరమైన హోస్ట్గా వ్యవహరించారు అమితాబ్ బచ్చన్. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) అంతకుముందు అమితాబ్ తన బ్లాగ్లో 'ఉదయం తెల్లవారుజామున లేవగానే 5000కుపైగా ఆలోచనలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అంతకుముందు రాత్రి ఆ మిగిలిపోయిన పనులు మనస్సును వెంటాడుతాయి. కానీ కౌన్ బనేగా కరోడ్పతి 1000వ ఎపిసోడ్ను పూర్తి చేశాం. అవును, 2000 సంవత్సరంలో టెలివిజన్ ప్రపంచానికి పరిచయం అయిన కేబీసీ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.'అని రాసుకొచ్చారు. -
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్కు టాప్ 20 ప్రోగ్రామ్స్లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్లో అసలు పాయింట్కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్లో బ్రహ్మానందం హోస్ట్గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్లో బ్రిటిష్ సైన్యంలో మేజర్గా ఉన్న చాల్స్ ఇన్గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్గ్రామ్ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్గా భోజ్పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
నాన్న సెక్యూరిటీ గార్డ్.. కొడుకు రూ. కోటి గెలిచాడు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్పతి షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్విళ్లురుతుంటారు. కొందరు ఏళ్లుగా ప్రయత్నిస్తుంటారు. అదృష్టం వరించి.. సెలక్ట్ అయిన వారు ఎంతో కొంత సొమ్ముతో షో నుంచి వెనుదిరుగుతారు. కొందరు ప్రతిభావంతులు మాత్రం కోటి రూపాయలు సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలిచిన రెండవ వ్యక్తిగా నిలిచాడు సాహిల్ ఆదిత్య(19). సెక్యూరిటీ గార్డు కుమారుడైన సాహిల్.. ప్రస్తుత కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు.. (చదవండి: కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!) మధ్యప్రదేశ్ ఛతర్పూర్ మున్సిపాలిటీకి చెందిన సాహిల్ ఆదిత్య అహిర్వార్ తండ్రి సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. సమయం వృధా చేయకుండా దాని కోసం కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో కేబీసీ 13వ సీజన్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు సాహిల్. ఎస్ఎమ్ఎస్లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదవ తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్. (చదవండి: కోటి రూపాయలను తలదన్నే కథ) ‘‘గత రెండేళ్లు నా జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అంతకు ముందు నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీకి బంక్ కొట్టి.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగేవాడిని. కానీ ఈ రెండేళ్లు నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ప్రస్తుతం నేను ర్యాంక్ హోల్డర్ని. రానున్న రోజుల్లో తప్పక ఐఏఎస్ అవుతాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సాహిల్. చదవండి: 900 కోట్ల రూపాయల అప్పు.. చీకటి రోజులవి: అమితాబ్ -
మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్కి తాప్సీ ఆఫర్
టాలీవుడ్లో స్టార్స్తో సినిమాలు చేసి తన కంటూ గుర్తింపు పొందింది నటి తాప్సీ పన్ను. అనంతరం ‘పింక్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టి అక్కడ కూడా మంచి పేరునే సంపాదించుకుంది ఈ బ్యూటీ. తర్వాత వరుస సినిమాలతో తన ప్రతిభని చాటుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే తాజాగా ఓ అభిమాని ఒకరికి సోషల్ మీడియాలో ఆఫర్ ఇచ్చింది ఈ బ్యూటీ. ‘కౌన్ బనేగా కరోడ్పతి-13’కి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో కంటెస్టెంట్గా సాహిల్ అహిర్వార్ అనే వ్యక్తి వచ్చాడు. షోలో బిగ్ బీ అతన్ని ‘మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?’ అని అడగగా.. తాప్సీ పన్ను అన్ని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె నా క్రష్, లవ్ అని తెలిపాడు. ‘పింక్’, ‘బాద్లా’ వంటి సినిమాల్లో అమితాబ్ కలిసి తాప్సీ స్క్రీన్ షేరు చేసుకుంది. దీంతో ఆ సాహిర్ సైతం ఆమె గురించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడిగాడు. ‘ఆమెకి ఇష్టమైన ఫుడ్ ఏది?’ అని కంటెస్టెంట్ అడగగా.. నాకు తెలియదు అని బిగ్ బీ తెలిపాడు. కాగా ఈ వీడియో చూసిన తాప్సీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది. ‘సాహిల్.. నాకు చోలే భాటురే అంటే ఎంతో ఇష్టం. ఒక వేళ మనం కలిస్తే అది తిద్దాం. ఏడు కోట్ల ప్రశ్నకు చేరినందుకు అభినందనలు’ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది తాప్సీ. ఫ్యాన్కి ఓ హీరోయిన్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో ఆ పోస్ట్ వైరల్గా మారింది. చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ Sahil mujhe chole bhature sabse zyada pasand hai, kabhi miloge toh zaroor saath khayenge! Filhaal 7 crore tak pohochne ke liye bohot mubarakbaad 🙏🏽👏🏾 https://t.co/NDLcZxSalz — taapsee pannu (@taapsee) October 20, 2021 -
అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు
బాలీవుడ్లో అందమైన కపుల్స్లో రితేష్ దేశ్ముఖ్, జెనీలియా డిసౌజా జంట ఒకటి. ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్న ఈ దంపతులు తాజాగా అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి 13’ షోకి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. అయితే తాజాగా కేబీసీ 13లో పాల్గొన్న ఈ దంపతులు కంటతడి పెట్టారు. కేబీసీ 13 కొత్త ఎపిసోడ్కి సంబంధించిన ఈ వీడియోని సోనీ టీవీ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది. మామూలుగా ఈ షోలో పాల్గొన్న సెలబ్రీటీలు గెలుచుకున్న మనీని క్యాన్సర్ బారిన పడిన పిల్లల వైద్యానికి ఉపయోగిస్తారు. దాని కోసం సహాయం చేయమని కోరుతూ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్, జెనీలియా దంపతులకు చూపించారు. అది చూసిన ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్ సైతం ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయమై ఇలాంటి మంచి పని కోసం కృషి చేస్తున్న అమితాబ్ని వారు ప్రశంసించారు. అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్లో దీపికా పదుకొనే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాప్, సునీల్ శెట్టి వంచి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు. షోలో వారు గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం ఇచ్చారు. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్ చేసిన అమితాబ్
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి 13’ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ షోకి సంబంధించి నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. అందులో కాలి వేళ్లకి గాయమైన అలాగే షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ తన బ్లాగ్లో ఫోటోస్ పోస్ట్ చేశాడు బిగ్బీ. ‘బేస్ వద్ద కాలి వేలు విరిగింది. నొప్పి విపరీతంగా ఉంది. దానికి ఇలాగే ట్రీట్మెంట్ చేయలేం. కానీ దాన్ని వేరొక వేలితో కలిపి కట్టడం ద్వారా 4 లేదా 5 వారాల్లో తగ్గే అవకాశం ఉంది. నొప్పిని ప్లాస్టర్తో కప్పిపుచ్చలేం’ అని ఈ లెజెండరీ యాక్టర్ తెలిపాడు. అయితే ప్రోగామ్లో గాయం కనిపించకుండా ఉండేందుకు గుంట లాంటి బూట్లు ధరించానని నటుడు చెప్పాడు. అయినప్పటికీ కెబీసీ షూటింగ్ని ఎంజాయ్ చేసినట్లు అమితాబ్ పేర్కొన్నాడు. అయితే ట్రెడీషనల్ లుక్లో ఉన్న బిగ్బీ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, అమితాబ్ ఈ సమయంలోనూ ఇమ్రాన్ హష్మీతో కలిసి సస్పెన్స్ థ్రిల్లర్ ‘చెహ్రే’, అలియా భట్, రణబీర్ కపూర్తో కలిసి ‘బ్రహ్మస్త్ర’, ప్రాజెక్ట్ కె, గుడ్బాయ్ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చదవండి: కాళ్లతో అమితాబ్ పెయింటింగ్ వేసిన అభిమాని.. నెటిజన్లు ఫిదా -
కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!
కౌన్ బనేగా కరోడ్పతి 5వ సీజన్ విజేత సుశీల్ కుమార్ గుర్తున్నాడా? ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే కేబీసీ 13వ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చాడు. 2011లో కేబీసీ విజేతగా నిలిచిన ఈ బిహారీ కామన్మేన్ నిజ జీవితంలో మాత్రం విఫల వ్యక్తిగా మిగిలాడు. రియాలిటీ క్విజ్ షోలో మొట్ట మొదటిసారిగా గెలిచిన 5 కోట్ల రూపాయలను ఇష్టారీతిని ఖర్చు చేసి చివరకు దివాళా తీశాడు. తన విఫలగాథను పేస్బుక్ పేజీలో గతేడాది ఏకరవు పెట్టాడు. 2011లో కేబీసీ 5వ సీజన్లో విజేతగా నిలిచి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్ అందుకున్నాడు సుశీల్ కుమార్. కానీ ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘2015-16 నా జీవితంలో అత్యంత సవాల్తో కూడిన సమయం. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ టైమ్లో నేను లోకల్ సెలబ్రిటీ అయిపోయాను. బిహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. క్షణం తీరిక లేకపోవడంతో చదువులకు దూరమయ్యాను. లోకల్ సెలబ్రిటీ హోదా రావడంతో మీడియా కూడా నా వెంట పడేది. జర్నలిస్టులు నా ఇంటర్వ్యూలు తీసుకునే వారు. నా గురించి గొప్పగా రాసేవారు. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏదేదో చెప్పేసేవాడిని. కాని కొన్నిరోజుల తర్వాత చూస్తే నా పరిస్థితి మొత్తం తలకిందులైంద’ని సుశీల్ రాసుకొచ్చాడు. ఎంతో మంది మోసం చేశారు కేబీసీలో ఐదు కోట్లు సంపాదించడంతో స్వచ్చంద సంస్థలు సుశీల్ కుమార్ వెంట పడ్డాయి. ముందు వెనుక చూడకుండా అతడు దానధర్మాలు చేసి మొత్తం ఊడ్చిపెట్టడంతో భార్యతో విభేదాలు తలెత్తాయి. ‘కేబీసీలో గెలిచాక మహా దాతగా మారిపోయాను. రహస్యంగా దానాలు చేయడం వ్యసనంగా మారిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని చాలా మంది నన్ను మోసం చేశారు. దానాలు చేసిన తర్వాతే ఈ విషయం నాకు బోధపడింది. ముందు వెనుక చూడకుండా దానాలు చేయొద్దని నా భార్య పోరు పెట్టేది. దీంతో నా భార్యతో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నెమ్మదిగా మద్యానికి, పొగ తాగడానికి అలవాటుపడ్డాను. నేను ఢిల్లీలో వారం రోజులు ఉన్నప్పుడు పలు రకాల వ్యక్తులతో కలిసి మద్యం, ధూమపానం చేసేవాడిని. అక్కడ వారి మాటలు నాకు బాగా నచ్చేవి. దీంతో మీడియాను తేలిగ్గా తీసుకోవడం ప్రారంభించాన’ని సుశీల్ కుమార్ వెల్లడించాడు. దావానలంలా దివాళా వార్త.. తాను దివాళా తీశానన్న వార్త బయటకు రావడంతో జనం తనను పట్టించుకోవడం మానేశారని, కార్యక్రమాలకు పిలవడం మానేశారని సుశీల్ చెప్పాడు. ‘నేను ఎలా దివాళా తీశాననే విషయం గురించి సినిమాటిక్గా చెబుతా. ఒకసారి ఇంగ్లీషు న్యూస్పేపర్ జర్నలిస్ట్ ఒకరు నాకు ఫోన్ చేసి విసిగించడంతో.. నా డబ్బు మొత్తం అయిపోయిందని, నా దగ్గర కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని.. పాలు అమ్ముకుని బతుకుతున్నానని చెప్పాను. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో నా వెంట పడటం మానేశార’ని చెప్పుకొచ్చాడు. సినిమా కల.. ముంబై వల భార్యతో విభేతాలు తలెత్తడంతో దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ముంబైకి మకాం మార్చాడు సుశీల్ కుమార్. ‘ముంబైలో నాకు సన్నిహితులైన గీత రచయితలతో రోజుల తరబడి మంతనాలు జరిపాను. రూమ్లో ఉంటూ రోజంతా సినిమాలు చూసేవాడిని. పుస్తకాలు చదివాను. ఇలా ఆరు నెలల కాలం గడిపేశాను. అప్పుడే రోజుకో ప్యాకెట్ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మూడు స్క్రిప్ట్లు రాశాను. ఒక ప్రొడక్షన్ హౌస్ నా స్క్రిప్ట్లకు 20 వేల రూపాయలు కూడా ఇచ్చింది. కొంత కాలం తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. దాంతో ముంబై నుంచి మా ఊరికి తిరిగి వచ్చి టీచర్గా ఉద్యోగం సంపాదించాన’ని తెలిపాడు. ఇప్పుడంతా హ్యాపీ! ‘ముంబైలో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఫిల్మ్ మేకర్ కావడానికి ముంబై రాలేదని.. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చానని అర్థమయింది. మనసుకు నచ్చిందే చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఊరికి తిరిగి వచ్చి టీచర్ ఉద్యోగానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మొత్తానికి జాబ్ సాధించాను. మందు, సిగరెట్ మానేశాను. పర్యావరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి రోజు నాకు పండగలా గడుస్తోంది. తిండికి లోటు లేకుండా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాను. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాన’ని సుశీల్ కుమార్ ముగించాడు. సో.. సొమ్ములు సంపాదించడమే కాదు.. సవ్యంగా ఖర్చు పెట్టడం తెలియాలని సుశీల్ లైఫ్ స్టోరీ కళ్లకు కడుతోంది! -
KBC 13: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబచ్చన్కి ఉన్న గొప్ప మనసు గురించి తెలిసిందే. ఆయన ఎంతోమందికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఓ చిన్నారికి సైతం ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాలు ఇలా.. కౌన్ బనేగా కరోడ్పతి షోకి బిగ్ బీ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి అతిథులుగా సెలబ్రీటీలను పిలవడం పరిపాటి. ఎవరు వచ్చినా గెలుచుకున్న ప్రైజ్మనీని ఏదో ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటారు. తాజాగా ఈ షోకి కొరియోగ్రాఫర్, దర్మకురాలు ఫరాఖాన్, హీరోయిన్ దిపికా పదుకొనే అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్కి చెందిన కొత్త ప్రోమోని సోనీటీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరిలాగే తాము గెలుచుకున్న మొత్తాన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న 17 నెలల చిన్నారి అయాన్ష్ సహాయార్థం ఇస్తామని ఫరాఖాన్ తెలిపింది. ఆ బాలుడికి రెండో ఏటా వేయాల్సిన ఒక ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లని, అందుకే చికిత్స కోసం సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపి ఎమోషనల్ అయింది. అమితాబ్ మాట్లాడుతూ.. ‘విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అయాన్ష్ కోసం ఫరా ఈ షోలో పాల్గొంటోంది. నాకు ఇక్కడ చెప్పాలో లేదో తెలియట్లేదు కానీ ఆ చిన్నారికి నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను’అని తెలిపాడు. కానీ ఎంత మొత్తం చేసేది మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా దీపికా తన ఫౌండేషన్ ‘లివ్ లవ్ లాఫ్’ గురించి షోలో మాట్లాడింది. 2014లో చాలా డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నానని భావోద్వేగానికి లోనైంది. అందుకే మానసికంగా బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్ నెలకొల్పినట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై
-
14 ఏళ్ల బుడతడు.. పాతిక లక్షలు గెలిచాడు
‘కౌన్ బనేగా కరోడ్పతి’ ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తోంది. కేబీసీలో ప్రస్తుతం స్టూడెంట్స్ స్పెషల్ నిర్వహిస్తున్నారు. అంటే కేవలం విద్యార్థులకే ఎంట్రీ అన్నమాట. పిల్లలు కదా అని వారిని తక్కువ అంచానా వేయడానికి లేదు. తెలివితేటల్లో పెద్దవారికి ఏ మాత్రం తీసి పోరు అని నిరూపించారు. ఇక నిన్నటి ఏపిసోడ్లో గుజరాత్కు చెందిన అన్మోల్ శాస్త్రి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్లో గెలిచి హాట్సీటులో కూర్చున్న తొలి కంటెస్టెంట్గా నిలిచాడు. అమితాబ్ ఎదురుగా.. హాట్సీటులో కూర్చున్న తర్వాత పెద్దవారే కాస్త ఆందోళన చెందుతారు. కానీ అన్మోల్ ఏ మాత్రం టెన్షన్ పడలేదు. పైగా అమితాబ్నే ప్రశ్నలు వేస్తూ ఆశ్చర్యపరిచాడు. ఇక అమితాబ్ను అంత దగ్గర నుంచి చూడగానే అన్మోల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక చిన్నారికి వాటర్ ఇచ్చి.. హాట్సీటులో కూర్చొపెట్టాడు అమితాబ్. ఆ తర్వాత అతడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక అన్మోల్ తన మూడు కోరికల గురించి వెల్లడించాడు. మొదటిది.. నోబెల్ ప్రైజ్ గెలవడం.. రెండవది ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవడం.. మూడవది ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఏపీజే అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ తనకు ఇష్టమైన శాస్త్రవేత్తలని తెలిపాడు. ఇక ఈ షోలో తాను గెలిచే డబ్బుతో ఓ టెలిస్కోప్ కొంటానన్నాడు చిన్నారి అన్మోల్. (చదవండి: కేబీసీ 12 రికార్డు.. కోటీశ్వరులైన ముగ్గురు స్త్రీలు) ఇక అన్మోల్ ముక్కుసూటితనానికి, చొరవకి అమితాబ్ ఫిదా అయ్యాడు. బుడతడికి ‘జిగ్యసు’ అని నిక్నేమ్ పెట్టాడు. ఇక ఈ షోలో అన్మోల్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. 14 ఏళ్ల బుడతడు ఇంత పెద్ద మొత్తం గెలవడం అంటే సాధారణ విషయం కాదు. ఇక 20 వేల రూపాయల ప్రశ్నకు అన్మోల్ ఏమాత్రం తడబాటు లేకుండా వెంటనే సమాధానం చెప్పడంతో బిగ్ బీ ఆశ్చర్యపోయాడు. ఇక ఆ ప్రశ్న ఏంటంటే.. కామిక్ బుక్స్ ప్రకారం ఓ టీనేజర్ని రేడియోయాక్టివ్ సాలీడు కుడుతుంది. దాంతో అతడికి మానవాతీత శక్తులు వచ్చి ఎత్తైన గోడల్ని అలవోకగా ఎక్కుతుంటాడు అని ప్రశ్నించాడు. ఇందుకు పీటర్ పార్కర్, బ్రూస్ వేనే, టోని స్టార్క్, స్టీవ్ రోజర్స్ అని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. వెంటనే అన్మోల్ కరెక్ట్ పీటర్ పార్కర్ అని కరెక్ట్ సమాధానం చెప్తాడు. అంతేకాక ఇక సూపర్హీరో పాత్రలు పోషించిన మిగతా హీరోల పేర్లు చెప్పడంతో అమితాబ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత భవిష్యత్తులో అన్మోల్ వల్ల తన హోస్ట్ జాబ్కి ప్రమాదం ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తాడు. ఇక రెండో ప్రశ్నకు 50-50 లైఫ్లైన్ వాడుకున్న అన్మోల్ మళ్లీ ఏడవ ప్రశ్నకు మూడవ లైఫ్లైన్ వాడుకున్నాడు. ఆ తర్వాత 25 లక్షల రూపాయల ప్రశ్నకు చివరి లైఫ్లైన్ వాడుకున్నాడు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..) ఇక 25 లక్షల రూపాయల ప్రశ్న ఏంటంటే టెలిస్కోప్ సాయంతో గుర్తించిన మొదటి గ్రహం ఏది అనే ప్రశ్నకు అన్మోల్ తన చివరి లైఫ్లైన్ వాడుకుని సరైన సమాధానం యూరెనస్ అని చెప్తాడు. ఆ తర్వాత 50 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్ అయ్యాడు. ఇక అన్మోల్ తనకు హౌ ఇట్ వర్క్స్ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ఉందని బిగ్ బీతో చెప్తాడు. దానిలో తాను ఫిజిక్స్, బయోలాజికి సంబంధించిన వీడియోలు పొస్ట చేస్తానని వెల్లడించాడు. దాంతో అమితాబ్ అన్మోల్ చానెల్ లింక్ని తనకు షేర్ చేయమని.. తన సోషల్ మీడియాలో అతడి చానెల్ని ప్రమోట్ చేస్తానని వెల్లడించాడు. దాని వల్ల అతడి చానెల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారన్నారు బిగ్ బీ. అంతేకాక తాను కూడా అన్మోల్ చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని వెల్లడిస్తాడు బిగ్ బీ. ఇక 25 లక్షల రూపాయల మొత్తంతో అన్మోల్ షో నుంచి క్విట్ అవుతాడు. -
‘కియారాపై క్రష్.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రజల్లో ఎంత పాపులరిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. ఎంతో మంది జీవితాలను మార్చేసిన ఈ షో ప్రస్తుతం 12 సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముగ్గురు కోటి రుపాయలు గెల్చుకోగా వారంతా మహిళలే కావడం విశేషం. కేబీసీలో ప్రస్తుతం విజయ్ పాల్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి హాట్ సీటుకు చేరుకుని ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్కి చెందిన విజయ్ది చాలా బీదరిక కుటుంబ నేపథ్యం. కొరియర్ బాయ్గా పనిచేస్తూ నెలకు 8 వేల రూపాయలను సంపాదిస్తున్నాడు. పోలీసు అధికారి కావాలనే లక్ష్యంతో కేబీసీలోకి అడుగుపెట్టాడు. చదవండి: ముగ్గురు కేబీసీ కోటీశ్వరులు ఇప్పటివరకు అడిగిన అన్ని ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు చెపుతూ, తక్కువ లైఫ్లైన్లు ఉపయోగించుకుంటూ, అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో నేడు(గురువారం) కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కోనున్నాడు. ఓ వైపు ఆటను విజయవంతంగా కొనసాగిస్తూనే మరోవైపు హీరోయిన్ కియారా అద్వానీపై విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు కియారా అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఆమె నటించిన అన్ని సినిమాలు చూసినట్లు పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన బిగ్బీ.. కియారాను అభిమానిస్తున్నవా అని అడిగాడు. కియారాపై చాలా కాలంగా క్రష్ ఉందని..ఆమెను ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయట పెట్టాడు. అంతేకాదు ఎపుడూ కియారా ఫోటోను తన వద్ద ఉంచుకుంటానంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం కూడా ఆమె ఫోటో ఉందని జేబులో నుంచి తీసి అమితాబ్కు చూపిస్తూ సిగ్గుల మొగ్గ అయ్యాడు. చదవండి: ‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’ -
ముగ్గురు కేబీసీ కోటీశ్వరులు
తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్మెంట్. ఆ ‘కోటి’ ఘనతను సాధించిన ముగ్గురూ మహిళలే కావడం విశేషం. కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) గేమ్ షోలో హోస్ట్ అమితాబ్ బచన్ ఎదురుగా ఉండే హాట్ సీట్ను టీవీలో మీరు చూసే ఉంటారు. ఆయన నింపాదిగా నవ్వుతూ కనిపిస్తుంటారు. హాట్ సీట్లో కూర్చున్నవాళ్లు చప్పుడు లేకుండా, ఆవిరి యంత్రం పనిచేస్తున్నట్లుగా ఉంటారు. కరెక్టు సమాధానాలు చెప్పుకుంటూ పోతుంటే ప్రైజ్మనీ పెరుగుతూ పోతోంది. ఒక్క తప్పు సమాధానం చెప్పినా అమౌంట్ డౌన్ అయిపోతోంది. ‘వచ్చిందే చాలులే’ అని, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాళ్లూ ఉంటారు. ఈ గేమ్ షోలో చివరి వరకు కరెక్టు సమాధానాలన్నీ చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ ఏడాది కేబీసీ సీజన్– 12 సెప్టెంబర్ చివరిలో మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభంలో స్టార్ టీవీ ప్రసారం చేసిన ఈ షోను 2010 నుంచీ సోనీ టీవీ ఇస్తోంది. ఇప్పుడీ తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్మెంట్. ఆ ఘనతను ఈ సీజన్లో తొలిసారి నవంబర్ పదకొండున 20 ఏళ్ల నజియా నసీం సాధించారు. కోటి సాధించిన తక్కిన ఇద్దరూ కూడా మహిళలే. మోహితా శర్మ నవంబర్ పద్దెనిమిదిన, నవంబర్ ఇరవై ఐదున అనుపాదాస్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. 42 ఏళ్ల అనుప స్కూల్ టీచర్. చత్తీస్గఢ్ నుంచి వచ్చారు. తల్లికి క్యాన్సర్ చికిత్స చేయించడం కోసం కొంతకాలంగా ఆమె ముంబైలో ఉంటున్నారు. 31 ఏళ్ల మోహితా శర్మ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెది ఢిల్లీ. జమ్ముకశ్మీర్లో ఉద్యోగం. తొలి కోటి విజేత నజియా నసీమ్ ఢిల్లీలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. కేబీసీ గేమ్ షోలో మొత్తం పదహారు ప్రశ్నలు ఉంటాయి. పదహారు ప్రశ్నలకూ కరెక్టుగా సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. కోటి రూపాయలు గెలుచుకోవడం కూడా తేలికేం కాదు. పదిహేనవ ప్రశ్న వరకు వెళ్లాలి. పదిహేనవ ప్రశ్నకు కరెక్టు జవాబు చెప్పాలి. అంటే.. కోటికీ, ఏడు కోట్లకు మధ్య ఉన్న తేడా ఒకే ఒక ప్రశ్న. సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ప్రకటించిన ప్రదేశం ఏమిటి? అన్నది తొలి కోటి విజేత నజియా నసీమ్కు ఎదురైన ఏడు కోట్ల ప్రశ్న. ఆప్షన్ ఎ) క్యాథీ సినిమా హాల్, బి) ఫోర్ట్ క్యానింగ్ పార్క్, సి) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, డి) నేషనల్ గ్యాలరీ ఆఫ్ సింగపూర్. (ఆన్సర్ క్యాథీ సినిమా హాల్). నజియాకు కరెక్టుగా తెలీదు. ఊగిసలాట ఎందుకని క్విట్ అయ్యారు. కోటి తీసుకుని గేమ్ నుంచి నిష్క్రమించారు. రెండో కోటి విజేత మోహితా శర్మకు పదహారవ ప్రశ్నగా ఇంకాస్త కఠినమైన పరీక్షే ఎదురైంది. ముంబైలోని వాడియా గ్రూపు 1817లో నిర్మించిన ఈ కింది నాలుగు బ్రిటిష్ వార్ షిప్లలో అతి పురాతనమైనది ఏది? అనేది ఆ ప్రశ్న. ఆప్షన్ ఎ) హెచ్ఎంఎస్ మిండెన్, బి) హెచ్ఎంఎస్ కార్న్వాలిస్, సి) హెచ్ఎంఎస్ ట్రింకోమలి, డి) హెచ్ఎంఎస్ మియానీ. (కరెక్ట్ ఆన్సర్ హెచ్ఎంఎస్ ట్రింకోమలి). ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం తెలియక మోహితా కూడా క్విట్ అయే అవకాశాన్నే ఎంచుకుని కోటీశ్వరిగా హాట్ చెయిర్ దిగారు. మూడో కోటి విజేత అనుపను కంప్యూటర్ అడిగిన ఏడు కోట్ల ప్రశ్న కూడా మరీ అంత సులభమైనదేమీ కాదు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ దేశపు జట్టుకు రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాన్వాలా ప్రాతినిధ్యం వహించారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఎ) కెన్యా, బి) యు.ఎ.ఇ., సి) కెనడా, డి) ఇరాన్. కరెక్ట్ ఆన్సర్ యు.ఎ.ఇ. అనుప యు.ఎ.ఇ. అనే చెబుదామనుకుని కూడా రిస్క్ ఎందుకని క్విట్ అయి కోటితో సరిపెట్టుకున్నారు. ఏమైనా ఈ ముగ్గురూ సాధించిన విజయం సాధారణమైనది ఏమీ కాదు. చూడాలి ఏడు కోట్ల రూపాయల విజేత కూడా ఒక మహిళే అవుతారేమో. -
కేబీసీ 12 రికార్డు.. కోటీశ్వరులైన ముగ్గురు స్త్రీలు
కౌన్ బనేగా కరోడ్పతి.. సింపుల్గా చెప్పాలంటే కేబీసీ.. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనా ఈ షో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ షోకు విపరీతమైన క్రేజ్. దాదాపు కొన్ని లక్షల మంది 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. కానీ కొందరు అదృష్టవంతులు మాత్రమే హాట్ సీటు వరకు చేరుకుంటారు. ఇక కేబీసీ సీజన్ 12 నెల రోజుల క్రితం ప్రారంభమయ్యింది. అయితే ఈ సీజన్కు, మిగతా సీజన్లకు మధ్య ఓ తేడా ఉంది. ఈ సీజన్ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలు కోటీశ్వరులుగా నిలిచారు. మరో విశేషం ఏంటంటే వీరంతా కేబీసీ ప్రారంభమైన నాటి నుంచి అంటే 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అవకాశం రావడం.. కోటీశ్వరులుగా మారడం నిజంగా గ్రేటే. ఇక ఈ సీజనల్లో ఇప్పటి వరకు కోటీశ్వరులుగా నిలిచిన ఆ ముగ్గురు మహిళలు ఎవరంటే నాజియా నజీమ్, రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ, మూడవ కోటీశ్వరురాలు అనుప దాస్. ఇక ఈ ముగ్గురు కోటీశ్వరుల గురించి క్లుప్తంగా ఓ సారి చూద్దాం. మొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్ కేజీబీ సీజన్ 12లో తొలి కోటీశ్వరురాలు నాజియా నసీమ్. ఢిల్లీకి చెందిన నాజియా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. కేబీసీలో పాల్గొన్న ఆమె ఈ నెల 11న సీజన్లో తొలి కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక ఆమె ఆట తీరును బిగ్ బీ సైతం ఎంతో ప్రశంసించారు. NAZIA NASIM is #KBC12’s first crorepati ! Watch this iconic moment in #KBC12 on 11th Nov 9 pm only on Sony @SrBachchan@SPNStudioNEXT pic.twitter.com/6qG8T3vmNc — sonytv (@SonyTV) November 5, 2020 రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ కేబీసీ సీజన్లో 12లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ రెండవ కోటీశ్వరురాలిగా నిలిచారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మోహితా కేబీసీ 12లో రెండో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మోహిత భర్త గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అదృష్టం ఆయన భార్యని వరించింది. (చదవండి: ‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’) మూడవ కోటీశ్వరురాలు అనుపదాస్ ఇక చత్తీస్గఢ్కు చెందిన స్కూల్ టీచర్ అనుపదాస్ ఈ సీజన్లో ఇప్పటివరకు కోటీ రూపాయలు గెలుచుకున్న మూడవ మహిళగా నిలిచారు. నిన్నటి ఎపిసోడ్లో అనుప దాస్ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యి కోటి రూపాయలతో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఈమె కూడా గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. చాలా బాగా ఆడారని మెచ్చుకున్నారు. వీరు ముగ్గురు ఈ సీజన్లో ఇప్పటి వరకు కోటి రూపాయలు గెలుచుకున్న మహిళలుగా నిలిచారు. కేబీసీలో తొలి కోటేశ్వరురాలు ఎవరంటే కేబీసీ 12 సీజన్లలో మొదటి సారి కోటీశ్వరురాలిగా నిలిచిన మహిళ ఎవరంటే రహత్ తస్లీమ్. 2010లో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కేబీసీలో అప్పటి వరకు ఏ మహిళ కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. రహత్ తస్లీమ్ మెడిసిన్ చదవాలని భావించారు. కానీ చిన్న వయసులోనే వివాహం కావడంతో ఆ కోరిక తీరలేదు. ఇక కేబీసీలో గెలిచిన సొమ్ముతో ఆమె తన కలను నేరవేర్చుకుంటానని తెలిపారు. (చదవండి: 7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?) రూ.5 కోట్లు గెలిచిన మహిళ ఎవరంటే.. సన్మిత్ కౌర్ కేబీసీ చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదు కోట్లు రూపాయలు గెలిచిన మహిళగా రికార్డు సృష్టించారు. ఆరవ సీజన్లో సన్మిత్ ఈ రికార్డు సృష్టించారు. ముంబైకి చెందిన సన్మిత్ తన కుమార్తె ప్రొత్సాహం వల్ల దీనిలో పాల్గొన్నానని తెలిపారు. కేబీసీలో కోటి గెలిచిన ఇతర మహిళలు ఎవరంటే.. ఫిరోజ్ ఫాతిమా: కేబీసీ సీజన్ 7 లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళా పోటీదారుగా ఫిరోజ్ ఫాతిమా నిలిచారు. ఫిరోజ్ తన తండ్రి చికిత్స కోసం ఆమె కుటుంబం తీసుకున్న రుణాన్ని చెల్లించడానికిగాను దీన్ని వినియోగిస్తానని తెలిపారు. అనామికా మజుందార్: జంషెడ్పూర్లో ఎన్జీఓను నిర్వహిస్తున్న ఒక సామాజిక కార్యకర్త, అనామికా కేబీసీ తొమ్మిదవ సీజన్లో కోటిశ్వరురాలు అయ్యారు. పోటీలో గెలిచేందుకు ఆమె తన కొడుకుతో కలిసి చదువుకునేదాన్నని తెలిపారు. (కేబీసీ : ఈ సీజన్లో ఇదే తొలిసారి) బినిత జైన్: జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన బినిత జైన్ తన పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వడానికి కేబీసీకి వచ్చినట్లు తెలిపారు. 10వ సీజన్లో ఆమె కోటి రూపాయలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఆమెని గొప్ప సింగిల్ పేరెంట్ అని ప్రశంసించారు. బబితా తడే: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన బబితా, కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 11 లో కోటీశ్వరురాలు అయ్యారు. వృత్తిరీత్యా మధ్యాహ్నం భోజనం వండే బబిత పాఠశాల విద్యార్థులకు కిచిడీ తయారు చేయడం ద్వారా నెలకు 1,500 రూపాయలు సంపాదించేవారు. ఆమె అంకితభావానికి హోస్ట్ అమితాబ్ బచ్చన్ ముచ్చటపడ్డారు -
‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షోని రక్తికట్టించడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ సీటులో కూర్చున్న వారిని నవ్విస్తూ.. టెన్షన్ పెడుతూ.. వారి జీవితం గురించి తెలుసుకుంటూ.. తన ప్రయాణం గురించి వారికి చెప్తూ షోపై ఆసక్తి పెంచుతారు. ఇక తాజా ఎపిసోడ్లో మహారాష్ట్రకు చెందిన రైతు యోగేష్ పాండే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో గెలిచి హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కేబీసీ టీం యోగేష్కు సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్ని ప్రసారం చేసింది. ఇక యోగేష్, బిగ్ బీల మధ్య జరిగిన సంభాషణ హాట్ సీటును కాస్త కూల్గా మార్చేసింది. ఇక గేమ్లో ముందుకు వెళ్తున్న కొద్ది యోగేష్ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని తెలిపాడు యోగేష్. అయితే కరోనా వ్యాప్తితో వివాహం పోస్ట్ పోన్ అయ్యిందని.. కానీ తామిద్దరూ ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని.. వీడియో కాల్ చేసుకుంటామని తెలిపాడు. ఈ విషయాలేవి ఇంట్లో వారికి తెలియదన్నాడు యోగేష్. ఇక ఈ లవ్ స్టోరిని అర్థం చేసుకోవడానికి బిగ్ బీ, యోగేష్ లవర్గా మారి పోయారు. కంటెస్టెంట్కి కాల్ చేసి అతడి లవర్గా మాట్లాడి సెట్లో నవ్వులు పూయించారు. (మళ్లీ వివాదం: అమితాబ్పై కేసు) ఇక ఎలాంటి లైఫ్లైన్ల సాయం లేకుండానే యోగేష్ గేమ్లో ముందుకు వెళ్లాడు. ఇక వివాహ జీవితం గురించి తనకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా యోగేష్, బిగ్ బీని కోరాడు. అలానే అమితాబ్ లవ్ స్టోరిని చెప్పమని అడగడమే కాక భార్య జయా బచ్చన్కి ఏవైనా లవ్ లెటర్స్ రాశారా అని ప్రశ్నిస్తాడు యోగేష్. దాంతో అమితాబ్ మరోసారి తన లవ్ స్టోరిని ప్రేక్షకులకు తెలిపారు. అంతేకాక ఇప్పటికి తన భార్య జయా బచ్చన్కి లవ్ లటర్స్ రాస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక బిగ్బీ తన లవ్ స్టోరిని గుర్తు చేసుకుంటూ.. ‘1973లో విడుదలైన జంజీర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. దాంతో స్నేహితులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లాలని భావించాను. నాతో పాటు జయా బచ్చన్ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాను. మా నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనుమతి కోరాను. దానికి ఆయన ముందు మీరిద్దరు వివాహం చేసుకొండి.. ఆ తర్వాత వెళ్లండి అన్నారు. దాంతో ఆ మరుసటి రోజే జయా బచ్చన్ని వివాహం చేసుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ షోటో యోగేష్ పాండే 12.50 లక్షల రూపాయల ప్రశ్నకి తప్పు సమాధానం చెప్పి.. 3,20,000 రూపాయలతో ఇంటికి వెళ్లాడు. -
కేబీసీ : రూ.కోటి గెలుచుకున్న ఐపీఎస్ అధికారి
ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) 12వ సీజన్ 12 కొనసాగుతోంది. ఈ సీజన్లో మొదటిసారిగా కోటి రూపాయల నగదును గెలుచుకున్న నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించింది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ కంటెస్టెంట్గా నిలిచారు. ఈ విషయాన్ని సోని ఎంటర్టైన్మెంట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్పాక్ ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయ్యింటుంది? నజియా సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం 17న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడాలి.ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ ప్రసారం చేసింది. (కోటి రూపాయలు గెలుచుకున్న ఢిల్లీ మహిళ) ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా నటి రత్నా ప్రతాక్ షా, స్వయం డైరెక్టర్, వ్యవస్థాపకురాలు కరమ్వీర్ అనురాధ కపూర్లు ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల గెలుచుకున్నారు. రూబి సింగ్ అనే మరో కంటెస్టెంట్ కూడా ఈ ఎపిసోడ్లోనే రూ. 25 లక్షలు గెలుచుకోవడం విశేషం. ఒకరి త్వరాత ఒకరూ హాట్సీట్కు వెళ్లిన వీరిద్దరూ 14వ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తప్పుకున్నారు. ('కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..) View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కేబీసీ: రూ.25 లక్షలు గెలుచుకున్నారు..
ముంబై: బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న పాపులర్ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రస్తుతం సీజన్ 12 కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రపంచానికి హీరోల్లాగా పరిచయమయ్యారు. అలాగే చాలామంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా మార్చడమే కాకుండా వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంది. అయితే ఇటీవల ఢిల్లీకి చెందిన కంటెస్టెంట్ రూ. కోటి ప్రశ్నకు సమాధానం వరకు చేరుకుని కేబీసీలో చరిత్రలోనే తొలి కంటెస్టెంట్ అయ్యారు. ఆ తర్వాత వరుస ఎపిసోడ్స్లో రూ. 25, రూ. 50 లక్షల ప్రశ్నలకు వరకు వెళ్లి ఈ సీజన్లో కంటెస్టెంట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో కూడా నటి రత్నా ప్రతాక్ షా, స్వయం డైరెక్టర్, వ్యవస్థాపకురాలు కరమ్వీర్ అనురాధ కపూర్లు ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల గెలుచుకున్నారు. రూబి సింగ్ అనే మరో కంటెస్టెంట్ కూడా ఈ ఎపిసోడ్లోనే రూ. 25 లక్షలు గెలుచుకోవడం విశేషం. నిన్నటి ఎపిసోడ్ కంటెస్టెంట్స్ రూబి సింగ్, కరమ్ వీర్ అనురాధ కపూర్లు రూ. 25 లక్షల గెలుచుకున్నారు. ఒకరి త్వరాత ఒకరూ హాట్సీట్కు వెళ్లిన వీరిద్దరూ 14వ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తప్పుకున్నారు. మొదట హాట్సీట్కు వచ్చిన రూబిసింగ్ 13 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రూ. 25 లక్షలు గెలుచుకున్న ఆమె 14వ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. అన్ని లైఫ్లైన్లు కూడా అయిపోవడంతో ఆమె గేమ్ నుంచి వైదొలగారు. అయితే రూబి సింగ్ సమాధానం ఇవ్వలేని రూ. 50 లక్షలు ప్రశ్నకు సమాధానం మీకు తెలుసోమో ఒకసారి చూడండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రచురించిన న్యూస్ పేపర్ ఎంటి? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే దీని సమాధానం బెంగాల్ గెజిట్ న్యూస్ పేపర్. Meet our #KBCKaramveer Anuradha Kapoor, founder of Swayam who has been working towards empowering women and help them break free from the shackles of domestic abuse. Tune into #KBC12 tonight at 9 pm only on Sony. @SrBachchan @SPNStudioNEXT @swayamkolkata #RatnaPathakShah pic.twitter.com/Vn5bkLATmE — sonytv (@SonyTV) November 6, 2020 ఇర రూబి సింగ్ తర్వాత బిగ్బీ అనురాధ కపూర్తో పాటు రత్నా ప్రతాక్ షాలను హాట్ సీట్కు స్వాగతించారు. వీరిద్దరూ కలిసి 13 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. వీరు కూడా 14వ కిస్సా-ఇ-సంజన్ ప్రకారం, గుజరాత్లోని పార్సీలకు ఏ రాజు ఆశ్రయం ఇచ్చాడు, అక్కడ వారు సంజన్ స్థావరాన్ని స్థాపించారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం జాడి రత్న. దీనికి నాలుగు ఆప్షన్లలో ‘ద్రోణసింహ, జాడి రత్నా, ములరాజా, నవగన’ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. వారికి సమాధానం తెలియకపోవడం, లైఫ్లైన్లు కూడా లేకపోవడంతో గేమ్ నుంచి తప్పుకున్నారు. -
కేబీసీ : ఈ సీజన్లో ఇదే తొలిసారి
సాక్షి, ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో మొదటిసారిగా కోటి రూపాయల నగదును గెలుచుకున్న నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించింది. ఈనెల 11న ప్రసారం కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్కు సంబంధించి సోనీ టీవీ తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఎంతో ఉత్కంఠ నడుమ అమితాబ్ లేచి (ఏక్ కరోడ్) కోటి రూపాయలు గెలుచుకున్నారు అంటూ హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన ప్రశ్న ఎదురైన ప్రతీసారి చాలా చక్కగా ఆలోచించి సమాధానం చెప్పావంటూ ఆమెను కొనియాడారు. దీంతో ఈ సీజన్లో మొదటి కరోడ్పతిగా ఢిల్లీకి చెందిన కమ్యూనికేషన్ మేనేజర్ నజీయా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. (రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా? ) అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్పాక్ ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయ్యింటుంది? నజియా సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం 11న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడాల్సిందే. ఇంతకుముందు సీజన్లో ఢిల్లీకి చెందిన ఛవికుమార్ అనే మహిళ కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక రూ.50 లక్షలు గెలుచుకొని కోటి రూపాయల షో నుంచి వైదొలిగారు. కాగా కేబీసీసీజన్ 12 సెప్టెంబర్ సెప్టెంబరు 28న ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా అనేక జాగ్రత్తల నడుమ ఈ షోను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఆన్లైన్లోనే ఆడిషన్స్ నిర్వహించారు. అంతేకాకుండా ఈసారి తొలిసారిగా ఆడియన్స్ పోల్ లైఫ్లైన్ను ఎత్తివేశారు. ('కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..) -
మళ్లీ వివాదం: అమితాబ్పై కేసు
న్యూఢిల్లీ : కౌన్ బనేగా కరోడ్ పతీ’ సీజన్ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్ బిగ్బీ అమితాబ్ బచ్చన్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత శుక్రవారపు కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీలను.. 6,40,000 ప్రశ్నను అడిగారు. ( రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?) డిసెంబర్ 25, 1927న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’’ ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి అయితే ప్రశ్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిగ్బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. -
రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?
ప్రస్తుతం దేశంలోనే ప్రఖ్యాత గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రపంచానికి హీరోలాగా పరిచమయ్యారు. ఎంతో మంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా మార్చడమే కాకుండా వారిని ఆర్థికంగా కూడా ఆదుకుంది. ఇక ఈ షో సీజన్ 12లో మొదటిసారి ఒక వ్యక్తి కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకుంది. ఢిల్లీకి చెందిన ఛవికుమార్ రూ.50 లక్షలు గెలుచుకొని కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి వైదొలిగారు. దీంతో ఆమె తాను గెలుచుకున్న రూ. 50లక్షలతో ఇంటికి వెళ్లారు. ఇక ఆమె సమాధానం చెప్పలేని కోటి రూపాయల ప్రశ్నకు మీకు సమాధానం తెలుసేమో ఒక సారి ప్రయత్నించండి. 2024లో చంద్రునిపైకి ఒక మహిళను, ఒక పురుషుడిని పంపించానికి అమెరికా చేపట్టిన ఒక స్పేస్ ప్రొగ్రామ్కు గ్రీక్ దేవత పేరు పెట్టారు. అది ఏమిటి? దీనికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. రియా, నెమెసిస్, ఆఫ్రొడైట్, ఆర్టెమిస్ అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఛవి కుమార్ తన లైఫ్లైన్స్ అన్నింటిని ఉపయోగించుకుంది. అయినప్పటికి సరైన సమాధానం తెలియకపోయేసరికి ఆట నుంచి తప్పుకుంది. తరువాత ఆమెను ఆన్సర్ గెస్ చేయమని అడగ్గా ఆమె రియా అని చెప్పింది. ఒక వేళ ఆమె ఆట నుంచి క్విట్ కాకుండా ఉండి ఉంటే ఆమె రూ. 50 లక్షల నుంచి రూ. 3.20లక్షలకు పడిపోయేది. ఎందుకంటే ఆప్రశ్నకు సరైన సమాధానం ఆర్టెమిస్. ఇక ఛవికుమార్ గురించి చెప్పాలంటే ఆమె ఢిల్లీకి చెందినది. ఆమె ఇంగ్లీష్ టీచర్గా పని చేసేది. ఆమె భర్త ఎయిర్ ఫోర్స్లో పని చేస్తున్నాడు. ఈ షోలో ఆమె ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ భార్యగా తాను పడిన కష్టాలను వివరించింది. 17 సంవత్సరాలలో 8 నగరాలను మారామని చెప్పింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లు పేర్కొంది. చదవండి: 'కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా.. -
'కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..
ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్బనేగా కరోడ్పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే హాట్ సీట్లోకి వెళ్లాలంటే మొదట ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడాల్సి ఉంటుంది. కానీ గురువారం నాటి ఎపిసోడ్లో మాత్రం మొదటిసారిగా ఓ కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడకుండానే డైరెక్ట్గా గేమ్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే ప్రతి 10 మందిలో 8 మంది మాత్రమే హాట్సీట్లోకి వెళ్తారు. కరోనా కారణంగా ఈ వారం కేవలం ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే హాజరైన నేపథ్యంలో చివరి అవకాశంగా కోల్కత్తాకి చెందిన రూనా షాహా అనే 43 ఏళ్ల మహిళకు ఈ అరుదైన అవకాశం వరించింది. దీంతో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడకుండానే హాట్సీట్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్గా నిలిచారు. (రూ. 50లక్షల ప్రశ్నకు సమాధానం తెలుసా?) 2001 నుంచి కేబీసీ షో కోసం ఆమె ప్రయత్నిస్తునే ఉన్నాననే ఇదే విషయమై తన భర్త సరదాగా ఆటపట్టించే వారని తెలిపింది. దీంతో ఈ సీజన్లో చివరి ఇంటర్వ్యూలు ముగిసే వరకు తన భర్తకు చెప్పలేదని పేర్కొంది. కోల్కతాలో చీరల వ్యాపారం చేస్తూ స్వశక్తిగా ఎదగాలని, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటానని తెలిపింది. అంతేకాకుండా తన భర్త అమితాబ్కు వీరాభిమాని అని, ఈ షోలో గెలిచిన డబ్బుతో తన భర్తకు ఆడి కారు కొని బహుమతిగా ఇస్తానని వెల్లడించింది. జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తాను కేబీసీ షోకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈరోజు షోలో రూనా ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారో తెలుస్తుంది. (25 లక్షల ప్రశ్న..ఎమోషనల్ అయిన బిగ్బి) Meet our contestant RUNA SAHA tonight at 9 pm in #KBC12 only on Sony TV. @SrBachchan @SPNStudioNEXT pic.twitter.com/4d2jxHhUyX — sonytv (@SonyTV) October 15, 2020 -
రూ. 50లక్షల ప్రశ్నకు సమాధానం తెలుసా?
కౌన్బనేగా కరోడ్పతి ఈ షోకు ఎంత ప్రముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సంవత్సరాలుగా సామాన్యులను బుల్లితెరపై చూపెడుతూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతోంది కౌన్బనేగా కరోడ్పతి షో. ప్రస్తుతం కౌన్బనేగా కరోడ్పతి సీజన్ 12 నడుస్తోంది. దీనిలో తాజా కంటెస్టెంట్ మృణాళిక దుబే ఈ సీజన్లో మొదటి సారి 50 లక్షల రూపాయల ప్రశ్నను ఎదుర్కొన్నారు. అయితే ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి తప్పుకున్నారు. ఇంతకీ ఆమెను అడిగిన ప్రశ్న ఏంటి? మీకు సమాధానం తెలుసేమో ఒక్కసారి చూడండి. View this post on Instagram Meet MRINALIKA DUBEY, our hotseat contestant. Watch her play tonight at 9 PM on #KBC12. @amitabhbachchan @spnstudionext A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Oct 9, 2020 at 2:15am PDT అసలు మృణాళిక ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. మృణాళిక నాసిక్కు చెందిన ఒక సాధారణ గృహిణి. ఆమె కథలు రాస్తూ ఉంటారు. ఆమెకు 17 లక్షల మంది రీడర్స్ కూడా ఉన్నారు. ఆమె మొదటి లైఫ్లైన్ రూ. 80,000 ప్రశ్న దగ్గర తీసుకుంది. తరువాత కూడా వరుసగా రెండు లైఫ్లైన్లను వాడుకుంది. 12వ ప్రశ్న రూ. 25 లక్షల ప్రశ్నకు సొంతంగా సమాధానం చెప్పింది. తరువాత రూ.50,00,000 ప్రశ్నకు సమాధానం చెప్పలేక, అప్పటికే లైఫ్లైన్స్ అన్ని అయిపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆమెను అడిగిన ప్రశ్న ఏంటంటే ఒలంపిక్స్లో ఇప్పటికి వరకు ఉమెన్ కేటగిరిలో ఎక్కువ మెడల్స్ పొందిన క్రీడాకారిణి ఎవరు? దానికి ఆపన్ష్లుగా బిర్గిట్ ఫిషర్, లారిసా లాటినినా, జెన్నీ థాంప్సన్, పోలినా అస్తాఖోవా ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లారిసా లాటినినా. గురువారం కావడంతో ఆమె తరువాత గెస్ట్ డాక్టర్ ష్రాఫ్, రితేష్దేశ్ ముఖ్ హాట్ సీట్లో కూర్చున్నారు. చదవండి: 25 లక్షల ప్రశ్న..ఎమోషనల్ అయిన బిగ్బి -
25 లక్షల ప్రశ్న..ఎమోషనల్ అయిన బిగ్బి
ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నాటి 8వ ఎపిసోడ్లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయడం కంటతడి పెట్టిస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అస్మితా మాధవ్ గోరే 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో 12.5లక్షల రూపాయలతో వెళ్లి పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అందరి మన్ననలు అందుకుంది. ఇక అస్మితా చెప్పలేకపోయిన 13వ ప్రశ్న ఏమిటంటే..1905లో బెంగాల్ విభజనకు నిరసనగా, ప్రజల్లో ఐక్యతను చాటిచెప్పేలా జరుపుకున్న పండుగ ఏది? ఇక ఆప్షన్స్ వచ్చి దసరా, రక్షా బంధన్, ఈద్ లేదా ఈస్టర్ ఆదివారం. సరైన సమాధానం రక్షా బంధన్. ఇక్కడితో అన్ని లైఫ్లైన్లు అయిపోయాయి. ఇక తరువాతి ప్రశ్నలకు అస్మితా సమాధానం చెప్పాలి. కరెక్ట్ అయితే ముందుకు వెళ్తుంది.. లేదంటే క్విట్ చెప్పాలి. 25 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్ చెప్పిసింది. దీంతో దాంతో 12.5లక్షల రూపాయలతో ఇంటికి వెళ్లింది. (కేబీసీ12 సీజన్ 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ చెప్పండి) తనకు వచ్చిన ఈ డబ్బుతో తన సోదరుడు, చెల్లి విద్యను పూర్తి చేయడానికి ఉపయోగిస్తానని అస్మితా వెల్లడించింది. ఆమె తండ్రి 100% అంధుడు కాగా, తల్లికి 40% దృష్టి లోపం ఉందని పేర్కొంది. చాలా చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలను ఆస్మిత చూసుకుంటుందని తల్లి చెప్పడంతో అమితాబ్ సహా టీవీ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన తండ్రికి చూపు లేనంత మాత్రానా తనకు ఎలాంటి లోటు తెలియకుండా చూసుకున్నారని, అందరితో ప్రమేగా మెలుగుతారని అస్మితా తెలిపింది. 25 లక్షలు గెలుచుకోలేకపోయిన ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారం అయ్యే ఈ షో లాక్డౌన్ అనంతరం చాలా గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 28 న ప్రారంభమైంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రదర్శన అన్ని చివరి సీజన్లకు భిన్నంగా ఉంది. ప్రదర్శనలో ప్రత్యక్ష ప్రేక్షకులు లేవడం ఇదే మొదటిసారి. (బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్) View this post on Instagram The Shravan Kumar to her parents, ASMITA GORE is here to fulfil her family's dreams. Watch her in #KBC12 Mon-Fri 9 PM only on Sony. @spnstudionext @amitabhbachchan A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Oct 5, 2020 at 11:33pm PDT -
రూ.25లక్షల ప్రశ్న.. మీకు ఆన్సర్ తెలుసా?
కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ) షోకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ కార్యక్రమం వస్తుంది. ఇక ఈ షో సక్సెస్కు ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. హాట్ సీట్లో కూర్చున్న కంటెస్టెంట్ని, ఇటు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తారు బిగ్ బీ. ఇక మన దగ్గర ఈ షోకు నాగార్జున, చిరంజీవి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కేబీసీ 12వ సీజన్ టెలికాస్ట్ అవుతంది. సోమ వారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారం అవుతుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో పాల్గొన్న కంటెస్టెంట్ 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో 12.5లక్షల రూపాయలతో వెళ్లి పోవాల్సి వచ్చింది. ఇక మరి నిన్నటి ఎపిసోడ్ కంటెస్టెంట్ ఎవరు.. లైఫ్లైన్స్ని ఏ ప్రశ్నలకు వాడుకుందో చూడండి. గురువారానికి పొడిగింపుగా జరగిన శుక్రవారం నాటి షోలో ఢిల్లీకి చెందిన ట్యాక్స్ ఆఫీసర్ తనీషా అగర్వల్ కంటెస్టెంట్గా కొనసాగారు. గురువారం నాటికే ఈమె 40వేల రూపాయలు సంపాదించారు. (చదవండి: కేబీసీ కరమ్వీర్లో అచ్యుత సామంత) ఇక నిన్నటి ఎపిసోడ్లో తనీషా తన మొదటి లైఫ్లైన్ 50-50ని 1.6లక్షల రుపాయల ప్రశ్న కోసం వాడుకున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే ‘మల్ గుజారీ అనేది ఏ రకమైనా ట్యాక్స్ ’.. ఇక ఆప్షన్స్ వచ్చి ఎక్సైజ్, ఇన్కమ్, ల్యాండ్ రెవిన్యూ, వెల్త్ ట్యాక్స్. కరెక్ట్ ఆన్సర్ ల్యాండ్ రెవిన్యూ. ఇక రెండో లైఫ్లైన్ ‘ఆస్క్ ద ఎక్స్పర్ట్’ని 10 ప్రశ్న కోసం వినియోగించుకున్నారు. ఈ ప్రశ్న విలువ 3.2లక్షల రూపాయలు. ‘హిందూ మత గ్రంథాల ప్రకారం, కృష్ణుని సన్నిహితుడు, బృందావన్కు తన దూతగా పంపబడినది ఎవరు?’ అనేది ప్రశ్న. సరైన సమాధానం: ఉద్ధవ్.. ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్ భూపేశ్, ఉద్దవ్, నవీన్, అశోక్. ఇక తరువాతి ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత 12వ ప్రశ్నకు చివరి లైఫ్ లైన్ ‘వీడియో ఏ ఫ్రెండ్’ని వినియోగించుకుంది. ఈ సారి తనీషా ఫ్రెండ్ ఆమెకు సాయం చేశారు. 12.5లక్షల రూపాయల విలువైన 12వ ప్రశ్న ఏంటంటే.. చిన్నతంలోనే పోలియో సోకినప్పటికి 1960 ఒలంపిక్స్లో మూడు బంగారు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన అథ్లెట్ ఎవరు?.. కరెక్ట్ సమాధానం విల్మా రుడాల్ఫ్. (చదవండి: ఆర్బీఐ ప్రచార కార్యక్రమాల్లో బిగ్బీ) ఇక్కడితో అన్ని లైఫ్లైన్లు అయిపోయాయి. ఇక తరువాతి ప్రశ్నలకు తనీషా సమాధానం చెప్పాలి. కరెక్ట్ అయితే ముందుకు వెళ్తుంది.. లేదంటే క్విట్ చెప్పాలి. తనీషా అగర్వాల్ 25 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్ చెప్పింది. దాంతో 12.5లక్షల రూపాయలతో ఇంటికి వెళ్లింది. ఇక 25లక్షల రూపాయల విలువ చేసే ఆ 13వ ప్రశ్న ఏంటంటే.. ‘ఈ స్వాతంత్ర్య సమరయోధులలో రెండు భాగాలుగా వచ్చిన పుస్తకం ‘ది ఇండియన్ స్ట్రగుల్ 1920-1942’ రచయిత ఎవరు?’ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఏంటంటే.. బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాస్ చంద్రబోస్, కెప్టెన్ లక్ష్మి సెహగల్. మీకు సమాధానం తెలుసా.. ట్రై చేయండి. తెలియదా.. సరైన సమాధానం: నేతాజీ సుభాస్ చంద్రబోస్. ఆన్సర్ తెలియకపోవడంతో తనీషా 12.5లక్షల రూపాయలతో గేమ్ నుంచి క్విట్ అయ్యింది. (చదవండి: బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్) ఇక తనీషా తరువాత హాట్ సీటులో కూర్చోబోయేది ఎవరు అంటే వలస కార్మికులతో కలిసి పనిచేసే లాభాపేక్షలేని సంస్థ అజీవికా బ్యూరో వ్యవస్థాపకులు రాజీవ్ ఖండేల్వాల్, కృష్ణవతార్ శర్మ. వీరిద్దరూ 2005 లో ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వలస కార్మికులతో కలిసి పనిచేశారు. -
త్వరలోనే కేబీసీ ప్రారంభం: బిగ్బి
ముంబై : పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబిసి) అతి త్వరలోనే మళ్లీ ప్రసారం కానుంది. బిగ్బి అమితాబ్ బచ్చన్ త్వరలోనే కేబీసీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్ కెబీసీ తర్వాతి సీజన్ కోసం అతి త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామని స్వయంగా అమితాబ్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో మీరు మళ్లీ షూటింగ్ చేయడం అవసరమా అంటూ వచ్చిన వ్యాఖ్యలపై అమితాబ్ ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటివి మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోతామా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో 2 రోజుల షెడ్యూల్ను ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్పై కనిపిస్తా’ అంటూ అమితాబ్ పేర్కొన్నారు. (సుశాంత్ ఇంటి పనిమనిషిని విచారిస్తున్న సీబీఐ) జయా బచ్చన్ మినహా అమితాబ్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య, అభిషేక్ బచ్చన్లకు గతనెలలోనే కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొంది పూర్తిగా కోవిడ్ నుంచి బయటపడ్డారు. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇంటికే పరిమితమైన అమితాబ్ ఆ సమయంలోనే కేబీసీ కార్యక్రమం ప్రమోషనల్ కాంటెంట్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉంటుందని భావించారు. (అమితాబ్, అభిషేక్లకు కరోనా) -
కేబీసీ కరమ్వీర్లో అచ్యుత సామంత
సాక్షి, న్యూఢిల్లీ : సోని టెలివిజన్ ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు ‘కరమ్వీర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇందులో వివిధ రంగాల్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖలను పరిచయం చేస్తారు. ఈసారి అతిథిగా కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్), కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటి) పేరిట సంస్థలను ఏర్పాటు చేసి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ ఆదర్శంగా నిలవడంతోపాటు, ఒడిశాలోని కందమహల్ నుంచి బీజేడీ ఎంపీగా విజయం సాధించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రముఖ సినీ నటి తాప్సీ పన్ను సహకరిస్తున్నారు. యథావిధిగా ఈ కార్యక్రమాన్ని అతిథేయిగా అమితాబ్ బచ్చన్ నిర్వహించారు. బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఉన్నత విద్యా సంస్థలు స్థాపించే వరకు తాను ఎదిగిన తీరు, దాతృత్వం, దయాగుణం తనకు అబ్బిన విధంతోపాటు ఇప్పుడు పాలనాదక్షుడిగా ఎదిగిన తీరును అచ్యుత సామంత ఇందులో వివరిస్తారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన ఆయన సోదరి ఇతి రాజ సామంత కూడా కార్యక్రమానికి వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కోసం అచ్యుత సామంత, ఒడిశాలో ప్రసిద్ధి చెందిన ‘చెన్న పొడ’ తిను పదార్థాన్ని, తన కిస్ సంస్థ విద్యార్థులు వేసిన పెయింటింగ్ను బహమతిగా తీసుకెళ్తున్నారు. ఆయన ఇంతకుముందు ఎన్డీటీవీలో అమితాబ్ నిర్వహించిన ‘బనేగా స్వచ్ఛ్ ఇండియా’ కార్యక్రమంలోనూ అతిథిగా పాల్గొన్నారు. -
‘ఈ ప్రశ్న విలువ రూ. 9 వేల కోట్లు’
న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయల ఎగవేతదారు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాను భారత్ నుంచి వెళ్లడానికంటే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపూ ప్రతిపక్షాలన్ని ఈ విషయం గురించి తీవ్రంగా విమర్శిస్తుండగా మరోవైపూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పజిల్ హల్చల్ చేస్తోంది. పాపులర్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షో గురించి తెలియని భారతీయుడు ఉండడు. ఇప్పటికే పలు భారతీయ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ కార్యక్రమంలో ఈసారి ఎదురయ్యే ప్రశ్న అంటూ ఓ వెరైటీ ప్రశ్నను, దానికి సంబంధించిన ఆప్షన్స్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఆ ప్రశ్న దేనికి సంబంధించిందో ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది కదా.. అవును విజయ్ మాల్యా, అరుణ్ జైట్లీల గురించి. ఇంతకు ప్రశ్న ఏంటంటే ‘విజయ్ మాల్యా భారత్ నుంచి తప్పించుకోవడానికి ఎవరూ సాయం చేశారు’ అనేది ప్రశ్న.. దానికి సమాధానాలుగా అరుణ్, జైట్లీ, అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ మంత్రి అనేవి ఆప్షన్స్గా ఇచ్చారు. అంతేకాక ‘ఇది చాలా కఠినమైన ప్రశ్న.. దీని విలువ 9000 కోట్ల రూపాయలు.. అందుకే మేము ఆడియన్స్ పోల్కి వెళ్తున్నాం’.. అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దీన్ని వేల మంది వీక్షించడమే కాక రకారకాల కామెంట్స్ కూడా చేశారు. అయితే కాంగ్రెస్ షేర్ చేసిన పజిల్కు పోటీగా అమిత్ అనే బీజేపీ అభిమాని ఒకరు మరో ప్రశ్నను పోస్ట్ చేశారు. అమిత్ పోస్ట్ చేసిన ఫోటోలో ‘దేశాన్ని దోచుకుంది ఎవరూ..?’ అనే ప్రశ్న ఇచ్చి దానికి ఆప్షన్స్గా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబ పార్టీ, నెహ్రూ పార్టీ, పైవన్ని అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పొలిటికల్ పజిల్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను అరుణ్ జైట్లీని కలిసినట్లు విజయ్మాల్యా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాక ‘జైట్లీపై ప్రధాని వెంటనే విచారణకు ఆదేశించాలి. తనపై విచారణ కొనసాగుతున్నంత కాలం ఆయన తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
మెగాస్టార్ అవుట్.. టాప్ హీరోయిన్కి చాన్స్..!
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా తనకు తిరుగులేదని కౌన్ బనేగా కరోడ్ పతి షోతో ప్రూవ్ చేసుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 90లలో ప్రారంభమైన ఈ టీవీ షోను 2014 వరకు నిరాటంకంగా కొనసాగించారు అమితాబ్. అంతేకాదు అమితాబ్ స్ఫూర్తితో చాలా మంది సౌత్ స్టార్స్ ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే త్వరలో మరో కొత్త సీజన్తో కేబీసీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్లో అమితాబ్ హోస్ట్గా కనిపించరని తెలుస్తోంది. గతంలోనూ కౌన్ బనేగా కరోడ్ పతి హోస్ట్గా రణబీర్ కపూర్ను తీసుకోవాలని భావించారు. అయితే ఎందుకో నిర్మాతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ స్థానంలో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నారట. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్లలో ఒకరిని కేబీసీ కొత్త సీరీస్కు వ్యాఖ్యతగా ఫైనల్ చేసే ప్లాన్లో ఉన్నారు. త్వరలోనే కొత్త సీజన్పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
రూ.7 కోట్ల విజేతలను ప్రశంసించిన అమితాబ్!
ముంబై: ‘కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ)’టీవీ షోలో రూ. 7 కోట్లను గెలుచుకున్న అచిన్ నరులా, సార్థక్ నరులాలను బిగ్ బి అమితాబ్ ప్రశంసించాడు. తొలిసారి ఈ అన్నదమ్ములిద్దరూ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకోవడంపై అమితాబ్ అభినందనలు తెలియజేశారు. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నకేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రై జ్ మనీని గెలుచుకుని ఈ నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. ఢిల్లీకి చెందిన అన్నదమ్ములిద్దరూ నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్ బీ అమితాబచ్చన్ తన బ్లాగ్, ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఇద్దరిలో అచిన్ మార్కెటింగ్ మేనేజర్ కాగా, సార్థక్ మాత్రం ఇంకా విద్యార్థి దశలోనే ఉండటం గమనార్హం. ఈ షోలో పాల్గొనడానికి గత 10 సంవత్సరాల నుంచి యత్నిస్తున్నట్లు విజేతల్లో ఒకరైన అచిన్ స్పష్టం చేశాడు. -
ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెబుతారా?
ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కథా చర్చలతోపాటు, ఇతర అంశాలపై దృష్టిపెట్టిన చిరంజీవి తన అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. అయితే వెండితెర మీద కంటే ముందుగా అక్కినేని నాగార్జున ప్రారంభించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి పచ్చ జెండా ఊపారు. ఇప్పటికే ఎందరో నటీనటులను కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా నాగార్జున అభిమానులకు దగ్గరకు చేర్చిన సంగతి తెలిసిందే. కోటీశ్వరుడు కార్యక్రమం 40 ఎపిసోడ్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. చిరంజీవితో 'కోటీశ్వరుడు' కార్యక్రమం గురువారం ఆగస్టు 7 తేదిన రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కార్యక్రమం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. కోటీశ్వరుడు కార్యక్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలకు చిరంజీవి ఎలా సమాధానాలిస్తారోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ప్రశ్నలు, చిరంజీవి సమాధానాలు అభిమానుల్లో ఏ రేంజ్ లో సంతోషాన్ని నింపుతాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే అనేది కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది. -
హాట్ సీటు మీద మెగాస్టార్ డౌటే..
సిల్వర్ స్క్రీన్ కు మెగాస్టార్ చిరంజీవి దూరమై సుమారు 7 సంవత్సరాలు కావోస్తోంది. 150వ చిత్రంపై ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. అయితే బుల్లితెరపై ఓ ఎపిసోడ్ లో మెగాస్టార్ కనిపిస్తున్నారనే వార్త అభిమానులకు కొంత ఊరట కలిగించింది. అయితే బుల్లితెరకు కూడా మెగాస్టార్ దూరమవుతున్నారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళితే...తెలుగు టెలివిజన్ రేటింగ్ చరిత్రలో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నాగార్జున ప్రజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత చిరంజీవి జన్మదినం ఆగస్టు 22 తేదిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కనిపించనున్నరంటూ వార్తలు వెలువడ్డాయి. కాని అదే సమయానికి సోని టెలివిజన్ లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎనిమిదో ఎడిషన్ ఆగస్టు 11వ తేది నుంచి ప్రారంభకానుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ చానెళ్లలో ప్రసారం కాకూడదనే నిబంధన ఉంది. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 11 తేది నుంచి తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై మెగాస్టార్ కనిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ ను ఎలాగైనా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గోనేలా ఆగస్టు 3 తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
ఆగస్టులో కేబీసీ 8 ప్రారంభం: అమితాబ్
అక్షరాలా కోటి రూపాయలను అందిస్తూ ఇప్పటివరకు ఏడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమ ప్రసారాలను ప్రారంభిస్తున్నట్టు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 'కౌన్ బనేగా కరోడ్పతి' కొత్త ముఖం ఆగస్టులో ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి సామాజిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతుంటారు. అలాగే ఈసారి కూడా ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మీడియాతోనే చెప్పారు. ''ఇది కేబీసీ కొత్త ఆకారం. కేబీసీ కొత్త ముఖం ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా జరిగాయి. ఒక్క సీజన్ మాత్రం షారుక్ఖాన్ చేశారు'' అని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తానెంత పెద్ద నటుడైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గేమ్షోకు వచ్చేవారిని ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించి, అనేకమందిని ఇప్పటికి కోటీశ్వరులను చేశారు. ''ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే కాదు.. హృదయాలు కూడా గెలచుకుంటారు. ప్రతి ఒక్క పోటీదారు నా హృదయాన్ని గెలుచుకుని వెళ్తుంటారు.. మీ అందరికీ ప్రేమతో'' అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. కేబీసీ స్ఫూర్తితోనే తెలుగులో నాగార్జున హోస్ట్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్షో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు అత్యధికంగా 12.50 లక్షలను మాత్రమే గెలుచుకోగలిగారు. -
కేబీసీలో డిగ్రీ విద్యార్థినికి కోటి రూపాయలు!
ప్రఖ్యాత రియాల్టీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) లో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఫిరోజ్ ఫాత్మా 2013లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఫాత్మా కోటి రూపాయలు సొంతం చేసుకున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. 2013లో చిట్టచివరి ఎపిసోడ్ లో ఉత్తర ప్రదేశ్ కు లోని సహరణ్ పూర్ కు చెందిన ఓ డిగ్రీ విద్యార్ణిని భారీ మొత్తాన్ని గెలుచుకోవడం విశేషం. ప్రేక్షకుల చప్పట్టు, అమితాబ్ కౌగిలించుకునేంత వరకు నమ్మకం కలుగలేదని ఫాత్మా తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యం పాలైన తన తండ్రి రుణాన్ని తీర్చడానికి కేబీసీని ఎంచుకున్నానని పాత్మా మీడియాతో అన్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడం గొప్ప అనుభూతి అని అన్నారు. దినపత్రికలు, న్యూస్ చానెల్స్ ను చూడటం వల్లే తనకు జనరల్ నాలెడ్జి పెరిగిందని అన్నారు. అప్పుల తన తండ్రిని రుణ విముక్తి చేయడానికి, భవిష్యత్ లో ఉన్నత చదువులకు భారీ మొత్తాన్ని వినియోగిస్తాను అని తెలిపారు. 2000 లో ప్రారంభమైన కేబీసీకి 'హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్' అనే కార్యక్రమం ఆధారం. గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. -
త్వరలో కేబీసీ ముగింపు.. అమితాబ్ కొత్త షో 'భూత్నాథ్ రిటర్న్స్'
కౌన్ బనేగా కరోడ్పతి.. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న అమితాబ్ బచ్చన్ను మళ్లీ తారాపథానికి తీసుకెళ్లిన షో. అలాంటి కేబీసీ ఇప్పుడు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే, ఖాళీగా ఉండటం అనేది అమితాబ్ నిఘంటువులో ఎప్పుడూ లేదు. అందుకే.. ఇప్పుడు కొత్తగా 'భూత్నాథ్ రిటర్న్స్' అనే మరో షో ఆయన చేయబోతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఒక్క మూడో సీజన్ మినహా కౌన్ బనేగా షోలన్నింటినీ అత్యంత విజయవంతం చేశారు. ఆ ఒక్క దాంట్లో మాత్రం షారుక్ ఖాన్ పాల్గొన్నారు. ''ఇప్పుడు కేబీసీ ప్రస్తుత సీజన్ ముగియడానికి మరో మూడు ఎపిసోడ్లు మాత్రమే మిగిలాయి. ఇన్ని నెలల పాటు నా మనసును, శరీరాన్ని కూడా పూర్తి బిజీగా ఉంచిన అలాంటి కార్యక్రమం చేయడం ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. దాని మధురస్మృతులు నన్ను వీడట్లేదు. కానీ సినిమా, టీవీ సీరియల్ పనులు ఎప్పటికీ అయిపోవు కాబట్టి, ఇప్పుడు 'భూత్నాథ్ రిటర్న్స్' షూటింగ్ మొదలైంది. ఇక ఇప్పుడంతా అదే పని ఉంటుంది'' అని తన వెబ్సైట్ srbachchan.tumblr.comలో అమితాబ్ పేర్కొన్నారు. ఆర్.బాల్కి, షూజిత్ సర్కార్, విధు వినోద్ చోప్రా, సుజోయ్ ఘోష్, అనురాగ్ కశ్యప్, విపుల్ షా, అబ్బాస్-మస్తాన్, ఇంకా మరింతమందితో సినిమాలు ప్రాథమిక చర్చల దశలో ఉన్నాయని, అవి మొదలయ్యేవరకు తాను ఈ పనిలో ఉంటానని కూడా తెలిపారు. డిసెంబర్ మొదటివారంతో కేబీసీ ఏడో సీజన్ ముగుస్తుంది. -
కేబీసీ 2013లో తొలి కోటీశ్వరుడు
ఉదయ్పూర్కు చెందిన తాజ్ మహ్మద్ రంగ్రేజ్ ఓ చరిత్ర ఉపాధ్యాయుడు కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. టీవీ చరిత్రలోనే అత్యంత సూపర్ హిట్ గేమ్ షోగా నిలిచిన కౌన్ బనేగా కరోడ్పతి ఏడో సీజన్లో తొలి కోటీశ్వరుడయ్యాడు. కోటి రూపాయలు గెలుచుకున్నానంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.. అయితే తనమీద తనకు మాత్రం నమ్మకం ఉందని చెప్పారు. ఆట మొదట్లోనే లైఫ్లైన్లన్నింటినీ అందుకే వాడుకోలేదని తెలిపారు. ఇప్పుడు తాను కోటి రూపాయలు గెలుచుకోవడంతో ముందుగా.. పాక్షికంగా అంధురాలైన తన ఏడేళ్ల కుమార్తెకు చికిత్స చేయించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలని, అలాగే చదువుకునే పరిస్థితి లేని ముగ్గురు విద్యార్థినులను చదివిస్తానని, ఇద్దరు అనాథలకు పెళ్లి చేయిస్తానని చెప్పారు.