love issue
-
చంపేస్తామని బెదిరింపులు.. మాకు రక్షణ కావాలి
-
సూర్యాపేటలో దారుణం.. బండరాళ్లతో దాడి
-
పెళ్లైన ఆటో డ్రైవర్తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్పేట సమీపంలోని జైహింద్నగర్ కాలనీలో నివసించే గౌస్ మొహినుద్దీన్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దుబాయ్లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్ మొహినుద్దీన్ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్లో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన అద్నాన్ హుస్సేన్ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్కు తిరిగివచ్చింది. గత నవంబర్ 14న అద్నాన్పై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్ మొహినుద్దీన్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్పై తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
‘నందిని మంచితనమే ఆమె పాలిట శాపంగా మారింది’
తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతి.. నందిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగ మార్పిడి(ట్రాన్స్ మెన్) ఆపరేషన్ కూడా చేసుకుంది. పాండి మహేశ్వరి కాస్తా వెట్రిమారన్గా పేరు మార్చుకుంది. చివరికి ఆమెనే నందినిని అత్యంత దారుణంగా హత్య చేయడం విస్మయానికి గురిచేస్తుంది. యువతి చేతులు, కాళ్లకు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చెన్నై శివారులోని పొన్మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసఙఃధఙ మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్గా మారి తన పేరును వెట్రిమారన్గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశాడు. నందిని అతని ప్రేమను నిరాకరించినప్పటికీ అతనితో సన్నిహతంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. నందిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి, అనాథాశ్రమానికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ పోసి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల ముందే హత్యకు పథకం రచించాడని పేర్కొన్నారు. తాజాగా నందినికి సంబంధించి పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు వెట్రిమారన్ ట్రాన్స్ మెన్గా మారిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబంధాలు తెంచుకున్నా.. నందిని మాత్రం అతనితో స్నిహితురాలుగానే ఉంది. అయితే ఆమె మంచితనమే నేను ఆమె ప్రాణాలు తీసిందని బాధితురాలి సోదరి అముద వాపోయింది. తన సోదరి హత్యకు గురైందన్న నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నందిని, వెట్రమారన్కు గల బంధాన్ని గుర్తు చేసుకుంది. మహేశ్వరి ట్రాన్స్ మెన్గా మారిన తర్వాత మిగతావారు అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. కానీ స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో సన్నిహితంగా ఉండటానికే ఇష్టపడిందని తెలిపింది. వెట్రిమారన్ ఎప్పుడు మధురై వచ్చినా వాళ్ల ఇంటికి వచ్చేవాడని తానే స్వయంగా తన చేతులతో తినిపించేదాన్నని పేర్కొంది. తన కుమార్తె వెట్రిమారన్తో మానవతా హృదయంతో తన స్నేహాన్ని కొనసాగించిందని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వెట్రిమారన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కానీ తన కూతురు చూసి తట్టుకోలేకపోతున్నట్లు వాపోయారు. మెట్రిమారన్ ఇంత క్రూరానికి పాల్పడతాడని ఊహించలేదని అన్నారు. ‘నా కూతుర్ని కాలిపోయిన శరీరంతో. చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టివేయడం చూశాము. ఇక వ్యక్తి ఇంత దారుణంగా చంపుతారా? ఆమె జీవితం ఇంత క్రూరమైన రీతిలో ముగిసిందనే విషయం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
పోలీసులతో ఆడుకున్న ఐటీ ఉద్యోగిని.. ప్రియుడి కోసం హైడ్రామా?
సాక్షి, చెన్నై: ప్రేమించిన ప్రియుడిని దక్కించుకునేందుకు ఓ యువతి రచించిన లైంగిక దాడి నాటకం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాత్రంతా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండాచేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లాపాలవాక్కం పరిధిలో శనివారం రాత్రి ఓ యువతి రక్తగాయాలైన స్థితిలో పరుగులు తీస్తూ ఓ ఇంట్లోకి చొరబడింది. తనపై నలుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడి చేసినట్లు ఆ యువతి పేర్కొనడంతో ఆ ఇంట్లో ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. చెంగల్పట్టు రైల్వే స్టేషన్ నుంచి తనను కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అడ్డంగా బుక్కైంది. ఆ యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చెంగల్పట్టు రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే సమయంలో యువతిపై సామూహిక లైంగిక దాడి సమాచారం మీడియాల్లో హల్చల్ కావడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రాత్రంతా గాలించారు. అడ్డంగా బుక్కైంది.. చెంగల్పట్టు రైల్వే స్టేషన్ నుంచి ఆ యువతి ఓ యువకుడితో మోటారు సైకిల్పై వెళ్తున్న దృశ్యం ఓ చోట సీసీ కెమెరాలో కనిపించింది. ఉత్తర మేరు వైపుగా వెళ్లడం, కాసేపటికి లైంగిక దాడి జరిగినట్లు పాలవాక్కంలో ఆమె పరుగులు తీయడం పోలీసుల్లో అనుమానాల్ని రెకెత్తించాయి. ఆ యువతి కొందరు యువకుల పేర్లను విచారణలో వెల్లడించడంతో వారి సెల్ నంబర్లను పోలీసులు ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకులు కన్యాకుమారి, మదురై, ఉత్తర చెన్నై పరిధిలో ఉండటంతో మరింత అనుమానాలు నెలకొన్నాయి. సంఘటన జరిగిన సమయం నుంచి ఆ యువకులు కన్యాకుమారి, మదురైకు వెళ్లాలంటే, కనీసం ఏడెనిమిది గంటలు పట్టే అవకాశం ఉంది. దీంతో మోటారు సైకిల్పై వెళ్లిన యువకుడు సలీంను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ యువతి రచించిన నాటకం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగిగా ఉన్న ఆ యువతి సలీం అనే యువకుడిని ప్రేమించింది. మూడు నెలలుగా ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నాయి. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సలీంపై ఆమె ఒత్తిడి పెంచింది. సలీం దాట వేస్తూ రావడంతో అతడిని దక్కించుకునేందుకు లైంగిక దాడి పేరిట, సలీంతో పాటు అతడి మిత్రులను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. ఆదివారం ఆమెను ఆసుపత్రి నుంచి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సలీంను కూడా ప్రశ్నిస్తున్నారు. కాంచీపురం ఎస్పీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఆ యువతి నాటకం గురించి వివరించారు. ఆ యువతి ఇచ్చిన ఆధారంగా నలుగురు యువకుల పోన్లను ట్రాప్ చేయగా, వారంతా వేరువేరు చోట్ల ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో అనుమానం వచ్చి విచారించడంతో యువతి నాటకం బయటపడిందని వెల్లడించారు. -
మరొకరిని పెళ్లి చేసుకుందని దారుణం.. ప్రియురాలిని 6 భాగాలుగా కోసి..
లక్నో: శ్రద్దా వాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తున్నా.. నిందితుడి అఫ్తాబ్ విచారణలో ఇంకా అనేక విషయాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ హత్య ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని కేసులు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. కారణాలేవైనా ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణంగా హత్యకు గురైన వార్తలు ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నాయి. జీవితాంతం కలిసి ఉంటామని నమ్మించిన వాడి చేతులోనే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం జరిగింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియురాలిని ప్రియుడు గొండు నులిమి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా కోసి బావిలో పడేశాడు. వివరాలు.. ప్రిన్స్ యాదవ్ అనే యువకుడు 20 ఏళ్ల వయసున్న ఆరాధనను ప్రేమించాడు. అయితే యువతి ఇతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అనంతరం కూడా యాదవ్తో వివాహేతర సంబంధం కొనసాగించింది. యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదవ్.. తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్, ఇతర బంధువులతో కలిసి ఆమెను అంతమొందించేందుకు ప్లాన్వేవాడు. మాట్లాడాలని చెప్పి నవంబర్ 9న ఆరాధనను బైక్పై గుడికి తీసుకెళ్లి సర్వేష్ సహాయంతో చెరకు తోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి కొంత దూరంలో బావిలో పడేశారు. నవంబర్ 15న పశ్చిమి గ్రామం శివారులో ఉన్న బావిలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువతిని ఆరాధనగా గుర్తించారు. ఆమె సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ప్రిన్స్ యాదవ్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేంఉదకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అ క్రమంలో యాదవ్ తప్పించుకునే ప్రయత్నంలో ఇంతకుముందే సదరు ప్రదేశంలో దాచిపెట్టిన పిస్టోల్తో పోలీసులపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్ గాయమైంది. ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్స్టేషన్కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
మరో విషాదం: రైలు కింద తోసేసి యువతి హత్య.. కూతురు మరణ వార్త తెలియడంతో
సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి కూతురు మృతిచెందిందన్న వార్త తెలియడంతో ఆమె తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మృతురాలి తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. ఆదంబాక్కంకు చెందిన మాణిక్యం కూతురు సత్య(20) టీనగర్లోని ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి సెయింట్ థామస్మౌంట్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అక్కడకు వచ్చిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సంబంధిత వార్త: ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్ కూతురు దారుణ హత్య తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా సేపు గొడవ పడ్డాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్లాట్ఫామ్ వైపు రైలు దూసుకొస్తుండగా యువకుడు ఉన్మాదిలా మారాడు. యువతిని ఒక్కసారిగా రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రైలు చక్రాల కింద పడి నలిగిన సత్య అక్కడిక్కడే మృత్యువాతపడింది. కూతురు మరణ వార్త విన్న సత్య తండ్రి మాణిక్యం గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె తల్లి ఆసుపత్రి పాలైంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ హాస్పిటక్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సత్యకు గత నెలలోనే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. కాగా కొంత కాలంగా రైల్వే స్టేషన్లో ప్రేమ పేరిట యువతులపై వేధింపుల ఘటనలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: లవర్తో భర్త షికార్లు.. షాపింగ్ మాల్లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య.. తర్వాత.. -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్కు చెందిన యువతి (20)తో దాదాపూర్కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో..
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్లో స్టార్డమ్ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్సిరీస్ల పైన దృష్టి సారిస్తోంది. ఇటీవల తెలుగు ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్చరన్లతో ఐటెం సాంగ్ చేసింది. కాగా ఈమె సినీ జీవితం సాఫీగానే సాగుతున్నా, వ్యక్తిగత జీవితం మాత్రం సంతృప్తిగా సాగటం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా రెజీనా పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన రెజీనా ఓ భేటీలో పేర్కొంటూ తన ప్రేమ 2020లోనే ముగిసిందని చెప్పింది. దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటానికే తనకు ఇష్టం లేదని అంది. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకే తెలియదని అంది. ఎందుకంటే ఎదురువారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం అనే అంశాన్ని చిన్నతనంలోనే తన తల్లి తనకు నేర్పిందాని వెల్లడించింది. ఈనేపథ్యంలో జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలు కూడా ఇకపై ఆలోచించనని రెజీనా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో తలా మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. -
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..
కృష్ణా: తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్ నగర్కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు అరెస్టు పామర్రు: తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జోయల్ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచామని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిపై కూచిపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాద్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. మొవ్వ జేఎఫ్సీఎం, కోర్టు వారి వద్ద రిమాండ్ నిమిత్తం హాజరు పరిరామన్నారు. -
ఇన్స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి!
సాక్షి, కామారెడ్డి: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకునిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివారాలిలా ఉన్నాయి.. రాజంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతిని లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమించాడు. ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు బయట తిరిగారు. ఈ నెల 23న అనిల్ చెల్లి పెళ్లి ఉండడంతో సదరు యువతిని రాంపల్లికి పిలిపించి చెల్లి స్నేహితురాలుగా తల్లిదండ్రులకు చెప్పాడు. రెండు రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి కోరగా అనిల్ నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక..
సాక్షి, అమీర్పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడకు చెందిన తెన్నేటి భార్గవ్ హైటెక్ సిటీలోని ఐను ఆస్పత్రిలో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఉప్పలపాడుకు చెందిన 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సదరు యువతి వద్దకు తరచూ వెళ్లే వాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. రెండేళ్ల నుంచి వీరు ఇద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో భార్గవ్ ముఖం చాటేయడంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రియుడి ఇంట్లో ప్రియురాలు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపెట్ గ్రామానికి చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన చందల హరీష్కుమార్ తొమ్మిది ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ఇరువురు సమీప బంధువులే. రెండేళ్లుగా సుజాత పెళ్లి చేసుకోవాలని హరీష్పై ఒత్తిడి తీసుకువ్చంది. అప్పటి నుంచి హరీష్ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో సుజాత 2021, ఆగస్టులో కడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడంతో తన సమీప బంధువులతో మంగళవారం సాయంత్రం టీచర్స్కాలనీలో ప్రియుడి ఇంట్లో బైఠాయించింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా -
ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
సాక్షి, కామారెడ్డి క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోననే బెంగతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలని స్నేహపూరి కాలనీలో నివాసం ఉండే పోలబోయిన లలితకు అఖిల్ (20), నిఖిల్ అనే కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడైన అఖిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. చాలా రోజులుగా విద్యానగర్ కాలనీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపం చెందాడు. అనారోగ్య కారణాలతో తల్లి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయంఇంటికి వచ్చి చూడగా బెడ్రూంలో ఫ్యాన్కు అఖిల్ చున్నీతో ఉరివేసుకుని ఉన్నాడు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఫెయిల్ అయ్యానని యువతి ఆత్మహత్య కామారెడ్డి క్రైం: పరీక్షలో ఫెయిల్ కావడంతో నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో ఇటీవల జీఎన్ఎం పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు తప్పాయని ఆమెకు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్న పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
అక్క ప్రేమ వ్యవహారంలో చెల్లెలి జోక్యం.. అవమానంతో..
సాక్షి, నెక్కొండ(వరంగల్): అక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కూతురును తల్లిదండ్రులు నిలదీయడం.. అనంతరం జరిగిన గొడవతో అవమానం భరించలేక చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సీమాఫర్హీన్ తెలిపిన వివరాల ప్రకారం... నెక్కొండ రజక వాడకు చెందిన అమృత మండల కేంద్రానికి చెందిన జహీర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలోపడింది. ఈనెల 5న చెల్లెలు అంజలి(15)తో కలిసి జహీర్ ఇంటికి వెళ్లి ప్రేమ, పెళ్లి విషయమై అతడిని నిలదీశారు. జహీర్తోపాటు అతడి కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి, అవమానించి వెళ్లగొట్టారు. దీంతో అవమాన భారంతో ఇంటికి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు సైతం నిలదీశారు. శనివారం రాత్రి ఇది కాస్త గొడవకు దారి తీయడంతో అంజలి బహిర్భూమికి వెళ్తానంటూ బయటకు వచ్చి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. చదవండి: గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త! బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునబాలిక మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి తండ్రి రామానుజం(అంజి) ఫిర్యాదు మేరకు అక్క ప్రియుడు జహీర్తోపాటు అతడి తండ్రి జమాల్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: రెండేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు లేని లోకం వద్దని.. -
ఇద్దరు యువకులతో యువతి ప్రేమ.. ప్రసాద్ రావడంతోనే దూరం పెడుతోందని
సాక్షి, నిర్మల్: ఆ ముగ్గురు ఉపాధి కోసం పల్లెల నుంచి జిల్లా కేంద్రం వచ్చారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆ ముగ్గురి జీవితాల్లో ప్రేమచిచ్చు పెట్టింది. ఒకే రంగంలో ఉన్న యువతికి ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి ప్రేమ తనకే దక్కాలన్న అక్కసుతో ఓ యువకుడు మరో యువకుడి ప్రాణం తీశాడు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన మంద ప్రసాద్(24) నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్గా పనిచేస్తున్నాడు. దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానిక ఓ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతికి, ఆ యువకుడికి మధ్య కొంతకాలంగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇదే క్రమంలో ఆ యువతికి ప్రసాద్తో కూడా పరిచయమైంది. వీరి పరిచయం కూడా ప్రేమగా మారింది. ముందుగా పరిచయం అయిన యువకుడి తీరు నచ్చక సదరు యువతి ఇటీవల దూరం పెడుతూ వస్తోంది. తమ మధ్యలో ప్రసాద్ రావడంతోనే తనను దూరం పెడుతోందని భావించిన యువకుడు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పతకం ప్రకారం ఐదు రోజుల క్రితం కత్తిని కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. చదవండి: వైరల్: ‘పుష్ప’ స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. చివర్లో షాకిచ్చిన పోలీసులు సదరు యువతి అద్దెకు ఉంటున్న ప్రియదర్శినినగర్లోని రూమ్కి మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోవడంతో మాట్లాడేది ఉందంటూ ఫోన్ చేసి పిలిపించాడు. అనుమానంతో ప్రసాద్ కూడా యువతి ఉంటున్న గదికి వెళ్లాడు. దీంతో అప్పటికే అక్కడ ఉన్న సదరు యువకుడికి, ప్రసాద్కు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తి ఆ యువకుడు ప్రసాద్ గుండె భాగంలో పొడిచి పారిపోయాడు. ఒక్కసారిగా ప్రసాద్ కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న మిత్రులు వచ్చేసరికి రక్తపు మడుగులో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. సదరు యువతి, మిత్రులు కలిసి స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికే పరిస్థితి విషమించడంతో ప్రసాద్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలించగా జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో పట్టుబడ్డాడు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుడి పేరు వెల్లడించడం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన గొలాట రమేశ్ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్కు ఫోన్చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో.. -
ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా!
వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ సంతానం లేరు. తమకు జీవితాంతం తోడుగా ఉంటుందని పదిరోజుల పసిగుడ్డును దత్తత తెచ్చుకున్నారు. పెంచి పెద్దచేశారు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇంటర్ వరకు చదివించారు. ఎదిగిన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ.. ప్రేమికుడి చేతిలో హతమవడంతో తమకు దిక్కెవరని ఇద్దరు తల్లులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సాక్షి, కరీంనగర్: పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి పోశవ్వ, బోయిని రాజవ్వ అక్కాచెల్లెళ్లు. పది రోజుల వయసప్పుడే వరలక్ష్మి(19)ని దత్తత తీసుకొని ఇంటర్ వరకు చదివించారు. ఈనేపథ్యంలో అదే మండలం పొరండ్లకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ అఖిల్, వరలక్ష్మి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అభ్యంతరం తెలిపినా వీరి తీరు మారలేదు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన కూతురు కోసం 5వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మానకొండూర్ మండలం చెంజర్ల దేవునిగుట్ట వద్ద వరలక్ష్మిని అఖిల్ హత్య చేశాడని తెలియడంతో తల్లులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం కుళ్లి, ఎడమ చేయి, తల భాగాలను జంతువులు పీక్కుతినడం చూసి గుండెలు బాదుకున్నారు. అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్వో) శ్రీనివాస్, తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎస్సై ప్రమోద్రెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అఖిల్ తల్లీ నిందితురాలే..! ►ఈ నెల2న హత్య జరిగిన అనంతరం అఖిల్ నేరుగా వైన్షాపునకు వెళ్లాడు. ►వరలక్ష్మిని చంపిన తరువాత అతడిలో భయం మొదలైంది. ►ఆ భయాన్ని మర్చిపోవాలని వైన్షాపు వద్ద ఫుల్ బాటిల్ కొని ఒక్కడే తాగాడు. అయినా, అతడిలో భయం పోలేదు. ►వెంటనే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అఖిల్పై చేయిచేసుకున్నారు. ►ఆపై అఖిల్ కూడా వింతవింతగా ప్రవర్తించసాగాడు. ►బయటికి వచ్చి కంటికి కనిపించిన ప్లెక్సీలు చించడం, తోరణాలు తెంపేయడం, చేతికి దొరికిన వస్తువులు విసిరికొట్టడం చేశాడు. ►కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినలేదు. దీంతో కొందరు ఇరుగుపొరుగువారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ►వెంటనే తిమ్మాపూర్కు చెందిన ఇద్దరు బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ►ఇంతలో కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి పంపారే తప్ప.. హత్య విషయం వారికి చెప్పలేదు. ►ఈ విషయంలో నిజాన్ని దాచినందుకు పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కి తరలించారు. పోలీసుల ముందే నిలదీసి ఉంటే..? ఈ గొడవ జరుగుతుండగానే.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి అమ్మమ్మ అఖిల్ ఇంటికి చేరుకుంది. ఆమె అక్కడ పోలీసులను చూసింది. కానీ, నేరుగా అఖిల్ తల్లి వద్దకు వెళ్లి వరలక్ష్మి ఏది? అని నిలదీసింది. ‘తన కొడుకు అసలు ఉదయం నుంచి గడప దాటలేదు నీ మనవరాలు ఎక్కడుందో వెదుక్కో పో’ అని అఖిల్ తల్లి ఆమెను కసిరింది. ఆ మాటలు నమ్మిన వరలక్ష్మి అమ్మమ్మ తిరిగి ఇంటిముఖం పట్టింది. అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పి ఉంటే.. హత్య విషయం అదే రోజు వెలుగుచూసి ఉండేది. రెండ్రోజుల తర్వాత మృతదేహం వద్దకు.. రెండురోజులు గడిచినా అఖిల్లో భయం పోలేదు. వరలక్ష్మి బతికే ఉందా? చనిపోయిందా? అన్న విషయం నిర్ధారించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మరోసారి చెంజర్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే అక్కడే వరలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో ఊరి వదిలి పారిపోతే అనుమానం వస్తుందని, ఫోన్కాల్స్ పోలీసులు తీస్తే తాను దొరికిపోతానని అక్కడే తన సెల్ఫోన్ పగులగొట్టాడు. తర్వాత తల్లి సెల్ఫోన్ వాడుతున్నాడు. పోలీసులను కూడా పక్కదారి పటిద్దామనుకున్నా.. వరలక్ష్మికి అఖిల్ చేసిన సీడీఆర్ (కాల్ రికార్డ్స్ డేటా) ముందుంచి ప్రశ్నించడంతో అఖిల్ నోరువిప్పక తప్పలేదు. -
రెండేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి అతడి కుటుంబీకులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఖండాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై హరిబా బు తెలిపిన వివరాలు.. ఖండాల గ్రామానికి చెందిన చౌహాన్ సునీత (20), శ్రీనివాస్ గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో సునీత ఆదివారం ఇంట్లో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో శ్రీనివాస్తోపాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ
సాక్షి, అమీర్పేట: ఓ వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని నమ్మించి డబ్బులు ఖాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ సైట్–2లో ఉండే 25 ఏళ్ల జెరీనా బేగం వృత్తి రీత్యా బ్యూటీషియన్. 2019లో కరీంనగర్లోని ఖార్కానాగడ్డకు చెందిన మొహ్మద్ అబ్దుల్లా ఫైజల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ నగరానికి వచ్చి జరీనాను కలిసేవాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో వారికి కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బుల అవసరం వచ్చిందని చెప్పి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు తేవడంతో తప్పించుకుని తిరుగుతూ వస్తున్నాడు. ఇటీవల ఆమెతో మాట్లాడటం మానివేయడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు -
ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని..
సాక్షి, తాండూరు రూరల్: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు మండలం గుంతబాసుపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరన్కోట్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతబాసుపల్లికి చెందిన కుర్వ సందప్ప, దస్తమ్మ మొదటి కుమారుడు కుర్వ శాంతుకుమార్ (23) హైదరాబాద్లోని ఓ హోటల్లో మాస్టర్గా పని చేస్తున్నాడు. తాండూరులో ఉంటున్న వరుసకు మేనత్త అయిన దేవమ్మ కూతురును మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. శాంతుకుమార్ కుటుంబ సభ్యులు సైతం మీ కూతురును మా అబ్బాయికి ఇవ్వాలని తల్లి దేవమ్మను కోరారు. ఇందుకు దేవమ్మ ఒప్పుకోలేదు. దీంతో గత శనివారం హైదరాబాద్లోని ఓ దేవాలయంలో శాంతుకుమార్, సంధ్యలు వివాహం చేసుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో తల్లి దేవమ్మ తన కూతురు కనిపించడంలేదని, శాంతుకుమార్ కిడ్నాప్ చేశాడని తాండూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మాయిని తన తల్లి ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తన కూతురు కనిపించడంలేదని తల్లి, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేశ్లు సోమవారం ఉదయం శాంతుకుమార్ను ఇంటికి వెళ్లి బెదిరించారు. అమ్మాయి ఎటు వెళ్లిందో తనకు తెలియదని ఎంత చెప్పినా వారు వినలేదు. శాంతుకుమార్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు అమ్మాయి తల్లితోపాటు ఆమె సోదరులు తనను వేధిస్తున్నారంటూ వీడియో తీశాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. మృతుని తండ్రి సందప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే తన కుమారుడి మృతికి కారణమైన దేవమ్మ, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేష్లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య
సాక్షి, శామీర్పేట్: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది. ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు వివాహేతర సంబంధం.. యువకుడిపై హత్యాయత్నం ఘట్కేసర్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్నగర్ జవహర్నగర్కు చెందిన ఎడ్ల దేవ(30) కూలీ. చక్రిపురం కుషాయిగూడకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న వివాహిత సోదరుడు నవీన్ అతడిని చంపాలని రాంపల్లికి తీసుకొచ్చి మద్యం సేవించారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ అనంతరం ఘట్కేసర్–ఘనాపూర్ సర్వీస్ రోడ్డు చెట్లపొదల్లో మరొక వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోశారు. వెంటనే దేవ వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తగా ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్సత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్ పరిచయం.. ఐదేళ్ల ప్రేమ.. రెండుసార్లు అబార్షన్ చేయించి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో అయిదు సంవత్సరాలు శారీరకంగా వాడుకున్నాడు. ఈక్రమంలో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అయితే తీరా పెళ్లి చేసుకోమని పట్టుబడితే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే కులం ఒకటి కానందుకు మావాళ్ళు ఒప్పుకోవట్లేదని చేతులెత్తేశాడు. గత్యంతరం లేక బాధిత దళిత యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు ఎన్టీఆర్ నగర్కు చెందిన వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా యువకుడు మోసం చేసినా, తనకు అతనితోనే వివాహం చేయించమని బాధితురాలు పోలీసులకు వేడుకుంది. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి.. -
మదనపల్లి ప్రైవేట్ లాడ్జిలో యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ లాడ్జీలో బెంగళూరుకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల సఫియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మదనపల్లికి చెందిన అబీద్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ. 3 లక్షల వరకు నగదు తీసుకున్నాడు. అనంతరం యువకుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన యువతి మదనపల్లెకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయినప్పటికీ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి బెంగళూరు వెళ్లిపోయింది. మరోసారి మదనపల్లెకు వచ్చిన యువతి.. తనకు న్యాయం జరగడం లేదని భావించి ప్రైవేటు లాడ్జీకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన లాడ్జీ సిబ్బంది యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో..
సాక్షి, హైదరాబాద్: తనతో కలిసి పనిచేసే సహోద్యోగిని ప్రేమిస్తున్నానని వెంట తిరిగాడు. లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేశాడు. కానీ, యువతి ఒప్పుకోకపోవడంతో కక్షగట్టి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. సదరు అమ్మాయి రాచకొండ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ బీ.ప్రకాశ్ కేసు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన గంజి దిలీప్ కుమార్(27) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే కంపెనీలో బాధితురాలు కూడా పనిచేస్తోంది. ఉద్యోగంలో భాగంగా సన్నిహితంగా ఉండటం చూసి అపార్థం చేసుకున్న దిలీప్.. 2019లో ప్రేమిస్తున్నాను చెప్పాడు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి దిలీప్తో మాట్లాడటం లేదు. ఉద్యోగం కూడా మానేసింది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన దిలీప్ ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ఆమె అప్రతిష్టపాలు చేయాలని పథకం పన్నాడు. జూన్ నెలలో అమ్మాయి ఇన్స్ట్రాగామ్ ఐడీని హ్యాక్ చేసి, తన వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రికరీంచి, కామెంట్లతో నెట్లో అప్లోడ్ చేశాడు. తన ఇన్స్ట్రాగామ్ హ్యాక్ అయిందని గమనించిన బాధితురాలు సైబర్క్రైమ్కు ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. జ్యూడీషియల్ కస్టడీ కోసం కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుడి దగ్గర్నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: చెప్పులను పట్టుకోవాలని.. చెరువులోకి వెళ్లిన ఇద్దరు బాలురు నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్ గణేషుడు.. కారణం ఇదే! -
ఏడాది నుంచి లవ్: ప్రియురాలు దక్కడం లేదని..
సాక్షి, మహబూబ్నగర్ : ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని లింగమయ్యకాలనీకి చెందిన కాట్రాజు పవన్కుమార్ (23), ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అదే అర్ధరాత్రి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పవన్కుమార్ తల్లిదండ్రులు సుమారు 12ఏళ్ల క్రితమే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడగా, ప్రస్తుతం సోదరి మాత్రమే ఉంది. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహంతో రాస్తారోకో యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ అంబేద్కర్కూడలిలో పవన్కుమార్ మృతదేహంతో బంధువులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులను శిక్షించి, బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలన్నారు. సీఐ బీషన్న చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
అమెజాన్లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే
సాక్షి, బంజారాహిల్స్: అమెజాన్లో కొనుగోలు చేసిన జాంబియా(కత్తి) తీసుకొని తన మాజీ ప్రియురాలి వద్దకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉండటంతో యువతి డయల్ 100కు ఫోన్ చేయగా హుటాహుటిన జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడితో పాటు ప్యాంట్లో పెట్టుకున్న జాంబియాను స్వాదీనం చే సుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కారి్మకనగర్ ఎన్ఎస్బీ నగర్లో నివసించే యువతి(23) గతంలో జూబ్లీహిల్స్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ జిమ్లో రిసెప్షనిస్ట్గా పని చేసేది. బోరబండ సమీపంలోని బంజారానగర్లో నివసించే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ బండారి శ్రీకాంత్(24) తరచూ ఆ హోటల్లో పబ్కు వెళ్లినప్పుడు యువతి తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమదాకా దారి తీసింది. ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో బాధితురాలు 2020 అక్టోబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేయగా శ్రీకాంత్ను ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఒకరి జోలికి ఒకరు రాకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో తన సోదరుడి కొడుకు బర్త్డే ఉండటంతో శ్రీకాంత్ అక్కడికి వచ్చి పీకలదాకా మద్యం సేవించాడు. పథకం ప్రకారం జాంబియాను జేబులో పెట్టుకొని మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తప్పతాగిన మైకంలో తూలుతూ ఇంట్లోకి వచి్చన శ్రీకాంత్ను చూసి బాధితురాలు, ఆమె సోద రి భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా అతడి వద్ద ఉన్న పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
ప్రియుడి 23 లక్షల బైక్ను తగలబెట్టేసిన ప్రియురాలు
బ్యాంకాక్: ప్రేమ.. మాటల్లో వర్ణించలేని గొప్ప ఫీలింగ్. ఒకరి మనుసు ఒకరు తెలుసుకొని జీవితాంతం తోడుగా నిలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించేవాళ్లు కొందరే. మనస్పర్థలు, నమ్మకం కోల్పోవడం వంటి కారణాలతో మధ్యలోనే విడిపోయే వారు కోకొల్లలు. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్ మరికొంతమంది సిల్లీ రీజన్స్తో విడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే థాయ్లాండ్కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్ వావన్ అనే యువతి తన లవర్కు లక్షల విలువైన బైక్ను గిఫ్ట్గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఓ ప్లాన్ వేసింది. బ్యాంకాక్లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్ను పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్ ధర ఒక మిలియన్ బాట్ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
నాలుగేళ్లుగా ప్రేమ, సహజీవనం, పెళ్లి ప్రస్తావన తేవడంతో!
సాక్షి, ఖమ్మం: నాలుగేళ్లుగా ప్రేమించానంటూ కలిసి తిరిగి, జల్సాలకు డబ్బులు వాడుకుని తీరా పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతలకు చెందిన వేణు(22) ఆదే మండలంలోని చిరునోములకు చెందిన సింధు(21) గత నాలుగేళ్గుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వేణు, సింధును వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా చేర్చి అక్కడే ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఆమెకొచ్చే జీతంతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం వేణు సింధుకు చెప్పకుండా స్వంత గ్రామానికి వచ్చాడు. సింధు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో శుక్రవారం సింధు రావినూతల వచ్చి ప్రియుడిని గట్టిగా నిలదీయగా పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పా డు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ కొండలరావు సంఘటనా స్థలానికి చేరకుని యువతితో మాట్లాడి న్యాయం చేస్తామని ఇరు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది. చదవండి: సాక్షి, ఎఫెక్ట్: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు -
యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి..
సాక్షి, మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి ఉప్పల్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్నగర్కు చెందిన నాగరాజు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్గా పని చేస్తాడు. ఇతని భార్య సౌజన్య(26) సోమవారం ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి సోదరుడు లింగ స్వామి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నాంపల్లికి చెందిన వారు. 22 రోజుల క్రితమె పెళ్లి జరిగినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు. చదవండి: నాంపల్లిలో బర్త్డే వేడుకపై ఆకతాయిల దాడి ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
‘మా అమ్మాయిని వేధించకు.. నీ కాళ్లు పట్టుకుంటాం’
సాక్షి, బంజారాహిల్స్: అసలే పదహారేళ్ల అమ్మాయి... ఇంకా మైనార్టీ తీరలేదు... ఇంకో రెండేళ్లు ఆగితే దగ్గరుండి మేమే పెళ్లి చేస్తాం.. అంత వరకు ఓపిక పట్టు.. మా అమ్మాయిని వేధించకు.. నీ కాళ్లు పట్టుకుంటాం.. మా జోలికి రావొద్దంటూ తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కాళ్లావేళ్లా పడ్డా వినిపించుకోలేదు ఆ మూర్ఖుడు. చుట్టుపక్కల వాళ్లు చూస్తున్నా... తండ్రి కాళ్లు పట్టుకుంటున్నా కనికరించలేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయకపోతే మీ అంతు చూస్తానంటూ కుటుంబ సభ్యులతో పాటు మైనార్టీ తీరని ఆ బాలికను బెదిరించి వెళ్లిపోయిన ఘటనలో తన తండ్రిని చంపుతాడేమోనని భయపడి ఆత్మహత్య చేసుకుంది తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన శ్యాంసన్ రెండో కూతురు కండ్రకోట దుర్గాభవానీ(16). ఈ ఘటనలో నిందితుడైన అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కళ్యాణ్(30)పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రేమలో పడి వెంటపడి వేధిస్తుండటంతో భయపడ్డ దుర్గాభవానీ కళ్యాణ్తో పాటు హైదరాబాద్కు చేరుకుంది. ఇక్కడికి వచ్చాక కూడా కళ్యాణ్ వేధింపులు ఆగలేదు. ఎప్పటికైనా కళ్యాణ్తో ముప్పేనని భావించి ఆత్మహత్యకు ఒడిగట్టింది. చదవండి: అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు! -
బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్కు యత్నించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చావ వినయ్ చౌదరి అనే యువకుడు కొంత కాలం క్రితం యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోన్ను పగలగొట్టాడు. అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. బలవంతంగా ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్కు యత్నించగా ఆమె అరుపులకు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు బయటికు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు యత్నించి బాధితురాలిని కాపాడారు. అదే సమయంలో వినయ్ చౌదరి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427,506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! -
పెళ్లయింది..కానీ మరో అమ్మాయితో ప్రేమ.. చివరికి
కోస్గి: ప్రేమ వ్యవహారంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తోగాపూర్లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోగాపూర్కి చెందిన యువకుడు సంపంగి రమేష్(20)కి 10 నెలల క్రితం గుండుమాల్కి చెందిన యువతితో వివాహం జరిగింది. కాగా అప్పటికే రమేష్కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నెల 5న తన బావ బాలకిష్టయ్యకు ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా.. ఈవిషయాన్ని బాలకిష్టయ్య అతని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు గాలించగా తమ వ్యవసాయ పొలం సమీపంలోని గుట్టల్లో పురుగుమందు తాగి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి దేవమ్మ ఆదివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. తాగుడుకు బానిసై మరో యువకుడు.. తాగుడుకు బానిసైన ఓ యువకుడు మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోస్గిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా..పట్టణంలోని వినాయక్ నగర్కు చెందిన హన్మంతు(28) హమాలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతడు తాగుడుకు బానిస కావడంతో అతని భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లి పోయింది. హన్మంతు గతకొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య -
ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా!
కొంత మంది యువకుల మధ్య పలు రకాల పోటీలు పెట్టి విజేతతో వధువుకు వివాహం చేయడం పురాణాల్లోనూ, పురాతన కాలంలోనూ జరిగేదని విన్నాం. ఇలాంటి స్వయం వరమే.. కాకపోతే కొంచెం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించిన నలుగురు యువకుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వధువును కట్టబెట్టారు. ఈ సంఘటన ఇటీవల రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. అసలేమైందంటే.. అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు. ఆ నలుగురు కలసి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఎవర్నీ కాదనకుండా ఆ నలుగురినీ ప్రేమించింది. కొంతకాలం ఈ చతుర్ముఖ ప్రేమాయణం సాగిన తర్వాత.. ఆ నలుగురూ కలసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి పెట్టారు. రెండు రోజుల తర్వాత ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అమ్మాయి గ్రామానికి చేరింది. విషయం బయటపడ్డ తర్వాత ఆ లవర్లను బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యాడు. అయితే అతన్ని గ్రామస్తులు వారించారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. పెద్దలు ఆ అమ్మాయిని పిలిచి నలుగురిలో నీకెవరంటే ఇష్టం అని అడిగారు. ఆ అమ్మాయి.. తడుముకోకుండా నలుగురూ ఇష్టమే అని చెప్పింది. అమ్మాయి ఎటూ తేల్చకపోవడంతో.. తర్వాత అబ్బాయిలు నలుగురినీ పిలిచి.. మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీనిని నలుగురూ ఒప్పుకోలేదు. దీంతో పెద్దలు తల పట్టుకున్నారు. ఇలా మూడు రోజులు చర్చలతోనే గడిచిపోయాయి. ఇక నాలుగో రోజు ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని విశ్వసించారు. లవర్సు, పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పులై నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. చదవండి: మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి అతడి పరిచయంతో ఆమె జీవితం మారింది -
ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కాగా అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ దగ్గర అనూషను గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విష్ణువర్ధన్ లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే విద్యార్థినిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియజేయాల్సి ఉంది. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. విద్యార్ధిని హత్యను నిరసిస్తూ స్థానికులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు రోడ్డెక్కారు. మృతదేహంతో పల్నాడు బస్టాండ్ వద్ద బైఠాయించారు. కాలేజీపైనా రాళ్లు రువ్వడంతో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. రోడ్డుపై విద్యార్ధి సంఘాల నేతలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ -
చిత్తూరు యువకుడి విషాదాంతం
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): చిత్తూరులో పుట్టి, విశాఖలో ప్రేమాయణం నడిపి, చివరకు ఆదివారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి విషాదంతం ఇది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బత్తయ్య, హేమవతి ఏకైక కుమారుడు వలజపేట బాలాజీ (31) హోటల్ మేనేజ్మెంట్ చేసి తమిళనాడులో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చనిపోవడంతో తండ్రితో ఫోన్లోనే మాట్లాడుతూ ఇంటికి రాకుండా కాలం గడిపాడు. రెండున్నర సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బాలాజీ వైజాగ్లో ఓ హోటల్లో పనిచేస్తున్నప్పుడు తాడిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించి, ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కొద్ది రోజులకు ఆ బాలికను తీసుకుని విజయవాడ వచ్చేశాడు. విజయవాడ వచ్చినప్పటి నుంచి ఆ బాలికను అనుమానించేవాడు. పలుసార్లు బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్స్టేషన్లో ఒకసారి పంచాయితీ జరిగింది. విజయవాడ ఆటోనగర్ పోలీస్స్టేషన్లోనూ ఇదే పంచాయితీ జరిగింది. చివరకు ఆ బాలిక విసిగిపోయి అజిత్సింగ్నగర్లోని బంధువుల ఇంట్లో ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఆ బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని ఆ బాలికను పిలిచి విచారించగా, తనకు ఇష్టం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు సైతం తమకు కేసు ఏమీ వద్దని చెప్పారు. దీంతో బాలాజీని ఎటువంటి కేసు లేకుండా పోలీసులు వదిలేశారు. ఈ క్రమంలో బాలాజీ శనివారం రాత్రి తాడేపల్లి సమీపంలో ప్రకాశం బ్యారేజీ 10వ ఖానా వద్ద కృష్ణానదిలోకి దూకాడు. ఈ క్రమంలో గేటుపై పడటంతో తల వెనుక భాగం, ఎదుటి భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గేటు కింద మృతదేహం పడిపోయింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి బత్తయ్యకు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ నారాయణ తెలిపారు. -
‘నన్ను ఎందుకు వద్దంటున్నావో ఒక్కసారి చెప్పు’
సాక్షి, చిత్తూరు : తనను ప్రేమించడం లేదని చెప్పిందని యువతి(19)పై నగరానికి చెందిన సాయికుమార్(21) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు .. నగరంలోని పాత ప్రశాంత్నగర్కు చెందిన 19 ఏళ్ల యువతి ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ధర్మరాజులగుడివీధికి చెందిన సాయికుమార్తో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఇతను భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. రెండు నెలలుగా తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇతని గురించి ఆరాతీసిన యువతి.. తనను ప్రేమ పేరిట వేధించొద్దని, ఇష్టంలేదని స్పష్టంచేసింది. అయినా సరే వదలకుండా ఫోన్లు చేసేవాడు. (చదవండి: దారుణం: ప్రేమించి పెళ్లిచేసుకొని.. రెండు కత్తులతో ) సోమవారం రాత్రి యువతికి ఫోన్చేసి ‘నన్ను ఎందుకు వద్దంటున్నావో ఒక్కసారి నేరుగా చెప్పు.. దాని తరువాత నీజోలికి రాను’అని చెప్పడంతో తేనబండలోని ఓ భవనం వద్దకు యువతి వెళ్లింది. అక్కడ మాటలతో మొదలై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను తిరస్కరించిందని అతను ఆగ్రహించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి పారిపోయాడు. బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి యువతి నుంచి వాంగ్మూలం తీసుకున్న టూటౌన్ సీఐ యుగంధర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఒకరితో ప్రేమ.. మరొకరితో వివాహం
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం) : ఒక మహిళను ప్రేమించి.. మరో మహిళను పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చిక్కాలపాలెం మండలం చాగల్లు గ్రామానికి చెందిన కముజు బాలాజీ (30) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పరిధిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. ఈ సమయంలో పూసపాటిరేగ ప్రాంతానికి చెందిన ఒక మహిళ అదే కంపెనీలోని క్యాంటీన్లో పని చేసేది. రోజూ క్యాంటిన్కు రావడంతో బాలాజీకి ఆ మహిళతో పరిచయం పెరిగింది. దీంతో బాలాజీ ఆమె ఇంటికి కూడా తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ఇది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెదతాడివాడ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బాధితురాలితో బాలాజీ కొంతకాలం గడిపాడు. ఈ సమయంలో అరబిందో ఫార్మా కంపెనీ నుంచి విశాఖ జిల్లా పరవాడలో ఉన్న ఫోరస్ కంపెనీకి నిందితుడు మారిపోయాడు. అప్పటి నుంచి బాధితురాలిని దూరంగా ఉంచాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా... 20 రోజుల కిందట విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన వేరే మహిళను బాలాజీ వివాహం చేసుకున్నట్లు గుర్తించి వెంటనే డెంకాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ శ్రీధర్, డెంకాడ ఎస్సై ఎస్.భాస్కరరావు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. నమ్మించి మోసం.. బాడంగి: ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన నయవంచకుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బొబ్బిలి రూరల్ సీఐ బీఎండీ ప్రసాద్ శుక్రవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డొంకినవలస గ్రామానికి చెందిన సామిరెడ్డి పరశునాయుడు అదే గ్రామానికి చెందిన యువతిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు తాజాగా వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు బాడంగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ఎస్సై సురేంద్రనాయుడు కేసు నమోదు చేయగా.. బొబ్బిలి సీఐ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం శుక్రవారం నిందితుడ్ని అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించగా..న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
వరంగల్ హత్య కేసును చేధించిన పోలీసులు
సాక్షి, వరంగల్ : జిల్లాలో కలకలం రేపిన యువతి హత్యకేసును గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. వరంగల్లోని దీన్ దయాల్ నగర్కు చెందిన యువతి మానస బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లి హంటర్ రోడ్డులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషమం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వి. రవీందర్ మాట్లాడుతూ.. కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనగాం జిల్లా ఘన్పూర్ మండలం నెమలిగొండ్ల గ్రామానికి చెందిన పులి సాయిగౌడ్గా తెలిపారు. ‘నిందితుడు హంటర్రోడ్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గురైన మానస హంటర్రోడ్డులోని నీలమ్ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు’ సీపీ పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయిగౌడ్ తనను కలిసేందుకు రమ్మని చెప్పాడు. మానస భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి బయటకు వచ్చింది. సాయి సూచన మేరకు మానస కాజీపేట చేరుకోగా.. కారులో వచ్చిన సాయి తనను తీసుకొని వెళ్లి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే మానసపై హత్యాచారం చేసాడు. ఈ క్రమంలో మానస అక్కడికక్కడే మరణించడంతో ఆ హత్యా నేరం తనపై రాకుండా ఉండేందుకు తన మిత్రుల సహాయం కోరాడు. అనంతరం అక్కడికి చేరుకున్న నిందితుని మిత్రులు శవంగా పడి ఉన్న మానసను చూసి సాయికి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో కంగారు పడ్డ సాయి ఒంటరిగానే మానస మృతిదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు శివారు ప్రాంతంలో తిరిగాడు. అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు ఓ కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్ రోడ్లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్ వద్ద రక్త సిక్తమైన మృతురాలి బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. అక్కడి నుంచి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు తిరిగి ఇంటికి రాలేదని కంగారు పడ్డ మానస తల్లిదడ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మానస తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడు సాయిగౌడ్ను గురువారం మద్యాహ్నం తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక నిందితుడి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోని కోర్టులో హాజరు పరుచనున్నట్లు సీపీ తెలిపారు. -
ఆమెను నేను ప్రేమించా.. నువ్వెలా చేసుకుంటావ్?
సాక్షి, బంజారాహిల్స్ : ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. అతని అడ్డు తొలగిస్తే తాను పెళ్లి చేసుకోవచ్చని మిత్రుడితో కలిసి అతనిపై దాడిచేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్లో నివసించే గోపాల్(22) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న యువతి(19) జూబ్లీహిల్స్లోని ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. కొంతకాలంగా గోపాల్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు. అయితే ఆ యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు. మరో నాలుగు నెలల్లో పెళ్లి జరపాలని తీర్మానించారు. దీనిని గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదని రోజూ ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాబోయే భర్తను బెదిరించి అడ్డు తొలగిస్తే యువతి దక్కుతుందని జూబ్లీహిల్స్ దుర్గాభవాని నగర్లో నివసించే ఫుడ్ డెలివరీ బాయ్ అయిన తన స్నేహితుడు జీవన్(22)తో పథకం వేశాడు. ఇందులో భాగంగా యువతికి కాబోయే భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి వద్దనే విధంగా హెచ్చరించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి మద్యం తాగిన గోపాల్ దుర్గాభవానినగర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేచివున్నాడు. పథకం ప్రకారం జీవన్ ఆ యువతికి కాబోయే భర్తను వెంటాడుతూ ఓ చోట లిఫ్ట్ కావాలని అడిగి నేరుగా తన స్నేహితుడు గోపాల్ ఉన్న చోటుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి అతనిని పిడిగుద్దులతో బాదారు. నా లవర్ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావంటూ దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి కాలర్ పట్టుకుని ఆమెను వదిలేయకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. వారి నుంచి తప్పించుకుని బాధితుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న గోపాల్, జీవన్లను అర్థరాత్రి అరెస్టు చేశారు. వీరిపై 70(సీ) కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం నాంపల్లి పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులు ఇద్దరికీ మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
సాక్షి, గుంటూరు : చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం..నిందితులను పట్టుకుని మాకు న్యాయం చేయండి అంటూ పలువురు బాధితులు పోలీస్ అధికారులను వేడుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీలు సీతారామయ్య, లక్ష్మీనారాయణ సుమారు 100 ఫిర్యాదులు పరిశీలించారు. ఎక్కువగా కుటుంబ ఆస్తి వివాదాలు, భార్యాభర్తల కలహాలపై ఫిర్యాదులు అందాయి. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని రూరల్ స్పందన కేంద్రంలో సోమవారం స్పందన జరిగింది. డీఎస్పీలు గోలి లక్ష్మయ్య, రవికృష్ణకుమార్ బాధితుల నుంచి 60కుపైగా దరఖాస్తులను స్వీకరించారు. పలువురు వివిధ ఘటనల్లో మోసపోయామని ఫిర్యాదు చేశారు. పలువురి సమస్యలు వారి మాటల్లోనే.. రూ.లక్షతో ఉడాయించింది వినుకొండ, నరసరావుపేట మున్సిపాల్టీలు, గుం టూరు కార్పొరేషన్లో సివిల్ కాంట్రాక్టు పనులు చేశా. బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత ఏప్రిల్లో కాకుమాను మండలం బోడుపాలెం గ్రామానికి చెంది మామిళ్లపల్లి దీప్తి సెక్రటేరియట్లో పరిచయమైంది. సీఎంవోలో పీఏ అని చెప్పింది. పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తానని నమ్మించింది. ఆమె అకౌంట్లో రూ.లక్ష వేశాను. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడంలేదు. ఆమెను పట్టుకుని న్యాయం చేయాలి. –మన్నవ వంశీకృష్ణ, గుంటూరు, కృష్ణనగర్ చీటీ డబ్బులతో పరారయ్యారు మెడబలిమి శ్యామ్కుమార్, శ్యామలాదేవి దంపతులు కాకానిలో షెర్లి బ్యూటీపార్లర్ నిర్వహించే వారు. ఐదేళ్ల నుంచి నమ్మకంగా చీటీలు వేశారు. రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.లక్ష చీటీలు వేసి 16, 18 నెలలు చెల్లించాం. ఏప్రిల్ నెలలో దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. –కె.రవికుమార్, త్రివేణి, అనురాధ తదితరులు, కాకాని ఉల్లిపాయల గ్రేడింగ్ పేరుతో మోసం నగరంపాలెంలో కింగ్ ఆనియన్స్ పేరుతో అనుపర్తి జోసఫ్రాజు కార్యాలయం ప్రారంభించాడు. ఉల్లిపాయలు గ్రేడింగ్ చేసి ఇస్తే రోజుకు 2,000 ఆదాయం వస్తుందని చెప్పాడు. ముందుగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 25 వేలు డిపాజిట్ తీసుకుని కొద్దిరోజులు మా నివాసాలకు ఉల్లిపాయలు పంపాడు. గ్రేడింగ్ చేసి ఇస్తే నమ్మకంగా మొదట్లో డబ్బులు చెల్లించాడు. చెక్కులు, నోట్లు ఇచ్చాడు. సరుకు పంపించడం ఆపేశాడు. కార్యాలయం మూసేశాడు. –అరుణ, నాగరాజు, దుర్గ, ధనలక్ష్మి, సుధారాణి డ్వాక్రా లీడర్ రూ.4.70 లక్షలతో పారిపోయింది స్వరాజ్య మహిళా స్వయం సహాయక సంఘం లీడర్ అయిన చౌత్రాకు చెందిన పాలూరి పుల్లమ్మ బ్యాంకులో మేము జమ చేసిన 4,70,000 నగదుతో ఇంటికి తాళం వేసి ఏప్రిల్ నెలలో పారిపోయింది. దీంతో పసుపు కుంకుమ డబ్బులు బ్యాంకు అధికారులు జమ చేసుకున్నారు. –ప్రభావతి, జేవీఎల్.మాధవిలత, సుజాత, ఆర్.లత ప్రేమించి మోసం చేశాడు బ్రాడీపేటకు చెందిన నాకు 2007లో సుధాకర్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత మా కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. సుధాకర్ కూడా అక్కడకు వచ్చాడు. ఇరు కుటుంబాలు మా ప్రేమను ఒప్పుకున్నాయి. మొదట ఉద్యోగం, తర్వాత చెల్లి పెళ్లి అని 12 సంవత్సరాలు గడిపాడు. వ్యాపారం పేరుతో సుధాకర్ నా తల్లిదండ్రుల వద్ద, నా వద్ద పలుమార్లుగా రూ.75 లక్షలు వరకు తీసుకున్నాడు. కాలక్రమంలో నా తల్లిదండ్రులు మరణించారు. ఇప్పుడు సుధాకర్, అతని తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు. నాకు న్యాయం చేయాలి. –బాధితురాలు, బ్రాడీపేట రైల్వే ఉద్యోగమని నమ్మించారు ఇంటి సమీపంలో నివసించే పద్మ అనే మహిళ కుతాడి నాగనాంచారయ్యను పరిచయం చేసింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. హైదరాబాదులో ఉండే కసిరెడ్డి దీపక్రెడ్డి అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడించాడు. అప్పు చేసి రూ.6 లక్షలు వరకు వారికి ఇచ్చాం. ఉద్యోగం రాకపోతే తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. మార్చిలో ట్రైనింగ్ అంటూ హైదరాబాద్ పిలిచారు. ఓ గదిలో నాతోపాటు మరికొంతమందికి రెండు నెలలు శిక్షణ ఇచ్చారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇంటికి పంపిస్తామని చెప్పి పంపివేశారు. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. డబ్బులు ఇవ్వలేదు. న్యాయం చేయాలి. –కుంటిగర్ల ప్రవీణ్, మంగళగిరి మండలం, ఎర్రబాలెం అర్బన్ కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరిస్తున్న డీఎస్పీ సీతారామయ్య; రూరల్ కార్యాలయంలో అర్జీలు పరిశీలిస్తున్న డీఎస్పీలు లక్ష్మయ్య,రవికృష్ణ -
మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న తమకు పెళ్లి చేయరని వేదనతో మిఠాయిల్లో క్రిమిసంహారక మందు కలుపుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను తండ్రి ప్రశ్నించడంతో చనిపోవడానికి వీరు సిద్ధపడ్డారు. ఈ ఘటన స్థానిక మేజర్ పంచాయతీ పరిధి జగతిమెట్ట కొండపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామానికి చెందిన పొట్నూరు షణ్ముఖరావు పలాసలోని మణప్పరం గోల్డ్లోన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయన టెక్కలి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో షణ్ముఖరావు ఆమె ఇంటికి వెళ్లి కొద్ది నెలల క్రితం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తర్వాత చెబుతానని ఆమె తండ్రి చెప్పి పంపించేశాడు. ఈ నేపథ్యంలో తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను ప్రశ్నించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన ప్రియుడితో చనిపోవడానికి సిద్ధపడింది. ఈ మేరకు ఇద్దరు కలసి స్వీట్స్ బాక్స్ పట్టుకుని స్థానిక జగతిమెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు, చీమల మందు కలుపుకుని వాటిని తినగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే ప్రియుడు ఈ విషయమై తన చిన్నాన్న టంకాల శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే శ్రీను హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయగా, ఇరువురికి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యురాలు జయలక్ష్మి తెలిపారు. ఈఘటనపై టెక్కలి ఎస్ఐ బీ గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న షణ్ముఖరావు -
పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి
సాక్షి, మదనపల్లె : ప్రేమ వ్యవహారంలో తలదూర్చారనే కారణంతో ఓ యువకుడు, అతని అన్న కలిసి పెద్దమనుషులపై కోడి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురువారం రాత్రి నిమ్మనపల్లె మండలం, ముస్టూరు పంచాయతీ, దిగువపల్లెలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముస్టూరు పంచాయతీ పారేసువారిపల్లెకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మన్న అలియాస్ లక్ష్మినారాయణ, మనోహర్ అలియాస్ మణికుమార్ అన్నదమ్ములు. మనోహర్ వారం రోజుల క్రితం అదే పంచాయతీ దిగువపల్లెకు చెందిన వివాహితను తీసుకెళ్లాడు. ఈ విషయమై ఆమె భర్త గ్రామ పెద్దలతో గురువారం రాత్రి ఊర్లో పంచాయితీ పెట్టించాడు. గ్రామపెద్దలు అందరూ కలసి అన్నదమ్ములు లక్ష్మన్న, మనోహర్ను దిగువపల్లెకు పిలిపించారు. పంచాయితీ చేస్తుండగా మాటమాటా పెరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దిగువపల్లెకు చెందిన పెద్దమనుషులు మేకల రాజన్న కుమారుడు చంద్రశేఖర్(28), మక్కినేని లక్ష్మన్న కుమారుడు రైతు చంద్ర(58), అజయ్(26), కిరణ్ సింగ్(32)పై లక్ష్మన్న, మనోహర్ కోడికత్తులతో దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో లక్ష్మన్న కూడా గాయపడ్డాడు. వీరిలో ఇద్దరిని కుటుంబసభ్యులు 108 వాహనంలో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అజయ్, మరో వ్యక్తిని నిమ్మనపల్లె పీహెచ్సీకి తరలించారు. మదనపల్లెలో క్షతగాత్రులను పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించిన అనంతరం మేకల చంద్రశేఖర్ను మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల సమాచారం మేరకు నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో దిగువపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ముదివేడు, నిమ్మనపల్లె పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గొడవలు పునరావృత్తం కాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
పెనుబల్లి: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుప్పెనకుంట్లకి చెందిన కావటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన బొల్లెద్దు నితిన్ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా (ఈసీఈ) చదువుతూ ప్రేమలో పడ్డారు. తేజస్విని ఫైనలియర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుకుంటోంది. నితిన్ ఖమ్మంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. తేజస్విని వారి బంధువుల అబ్బాయితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఫోన్లో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో నితిన్ కుప్పెనకుంట్లకు ఆదివారం రాత్రి బైక్పై వెళ్లాడు. మాట్లాడేందుకు బయటకు రావాలని తేజస్వినికి ఫోన్లో మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె అతడి బైక్పై వెళ్లింది. కుక్కలగుట్ట వద్దకు చేరుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై గొడవ జరిగింది. నితిన్ తన వద్ద ఉన్న కర్చీఫ్ను తేజస్విని మెడకు బిగించి హత్య చేశాడు. ఆమెను పెట్రోల్ పోసి కాల్చి వేయాలని భావించాడు. అయితే, సంఘటనా స్థలం రాష్ట్రీయ రహదారికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం.. లారీలు, బస్సులు తిరుగుతుండటంతో భయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. కాగా.. తమ కూతురు కనిపించడం లేదని తేజస్విని తండ్రి సత్యనారాయణ వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నితిన్ను మంగళవారం ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. -
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
-
మందలించారని ఏకంగా ఇంటికే నిప్పంటిచాడు
సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఓ ప్రేమోన్మాది అరాచకానికి పాల్పడ్డాడు. మందలించారన్న కోపంతో యువతి స్నేహితురాలి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి... ప్రేమోన్మాదిని అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థి వంశీ తన సహచర విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన స్నేహితురాలికి చెప్పింది. వంశీ కుటుంబంతో యువతి స్నేహితురాలి కుటుంబానికి పరిచయం ఉండటంతో ఆమె అమ్మమ్మ కమలకుమారి.. వంశీని మందలించారు. దీంతో ఆగ్రహించిన వంశీ.. వారం క్రితం కమలకుమారి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మేడ మీద వున్న కమలకుమారి కుటుంబసభ్యులు.. దీన్ని షార్ట్ సర్క్యూట్గా భావించారు. కానీ నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో వంశీ పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేశారు. -
ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగానాయక్ సమాచారం మేరకు... వైజాగ్ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్లోని సిన సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్ ఆల్విన్కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
-
ఇద్దరు యువతులను బలిగొన్న ప్రేమ వ్యవహారం
సాక్షి, భద్రాద్రి : ప్రేమ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు యువతుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీకి చెందిన మడివి జానకి, విజయ కాలనీకి చెందిన శ్యామల సంగీత అనే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ వ్యవహారంలో వివాదం నెలకొంది. దీంతో బుధవారం వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషమ పరిస్థితిలో ఉన్న వారిని చర్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. ఆత్మహత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. -
ఇద్దరి ప్రాణం తీసిన ‘ప్రేమ’
జహీరాబాద్: ఓ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమికుల ప్రేమను ఇరుకుటుంబాలు ఆంగీకరించక పొవడంతో గొడవలు నెలకున్నాయి. తమ పరువు పొయిందని అవమానంగా భావించిన ప్రియుడి తండ్రి ప్రియురాలి అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పపడ్డారు. ఝరాసంగం ఎస్ఐ. ఏడుకొండలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మేదపల్లికి చెందిన నాగమణి, మహేశ్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. నాగమణికి గత రెండు నెలల క్రితం మొగుడంపల్లి మండలంలోని గొటిగార్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న నాగమణి ప్రియుడు సదరు యువకుడికి తన ప్రేమ వ్యవహారాన్ని తెలిపాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయమై ఇరుకుటుంబాలు శుక్రవారం రాత్రి వివాదానికి దిగాయి. తమ పరువు పొయిందని భావించిన మహేశ్ తండ్రి అంజన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న నాగమణి అన్న జగదీశ్వర్ సైతం పురుగుల మందు తాగాడు. అనంతరం ఆమె సైతం పురుగుల మందు తాగాడు. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమికుడి తండ్రి అంజన్న, ప్రేమికురాలి అన్న జగదీశ్వర్(25) మృతి చెందారు. నాగమణి చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకుంది. ఈ మేరకు ఎస్ఐ. ఏడుకొండలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లిం యువతిని చెట్టుకు కట్టేసి..
పట్నా : వేరే మతస్తుడ్ని ప్రేమించడం నేరమంటూ ఓ గ్రామ పంచాయతీ తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం ప్రేమికుల జంటపై పంచాయతీ తీర్పుతో సొంత కూతురిపై తల్లిదండ్రులు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. జగియా మారన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఫరీద్ అన్సారీ కూతురు (18) పొరుగూరుకు చెందిన రూపేష్ కుమార్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. యువతి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే తిరస్కరించారు. దాంతో గత నెల 30వ తేదీన ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రూపేష్ ఇంటికి చేరుకుంది. కూతురు ఆచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను గ్రామ పంచాయతీలో నిలబెట్టారు. హిందూ మతస్తుడే కాకుండా మరో గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో యువతి తమ ఊరు పరువు తీసిందంటూ గ్రామ పంచాయతీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతికి బుద్ధి చెప్పాలని ఆమె కుటుంబాన్ని ఆదేశించిందని పోలీసులు తెలిపారు. యువతిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెడుతున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని కాపాడారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కావొద్దని గ్రామ పంచాయతీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. -
అమ్మాయి విషయం : స్నేహితుణ్నే మట్టుబెట్టారు?
కర్నూలు నంద్యాల: ఓ అమ్మాయి విషయంలో తోటి స్నేహితుడినే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తగులబెట్టి, ఆ తర్వాత పూడ్చివేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన ఖలీల్, సమీర కుమారుడు సద్దాంహుసేన్. ఇతను పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది జూలై 17న అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు నంద్యాల టూటౌన్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సద్దాంహుస్సేన్ను దారుణంగా హత్య చేశారన్న విషయం పోలీసు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తోటి స్నేహితులే పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి తీసుకెళ్లి.. అక్కడే చంపి, పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టిన అనంతరం పూడ్చి పెట్టినట్లు సమాచారం. ఓ అమ్మాయి కోసమే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై టూటౌన్ సీఐ రామకృష్ణారెడ్డిని అడగ్గా.. పాణ్యం మండలం పిన్నాపురంలో కొంత మంది కలిసి హత్య చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి తహసీల్దార్, విద్యార్థి తల్లిదండ్రులను తీసుకొని వెళతామని చెప్పారు. మృతదేహాన్ని చూసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి, పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామన్నారు. -
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
-
యువతిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికేశాడు
-
దారుణం: నడిరోడ్డుపై భార్యను నరికిన భర్త
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక మహిళని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా రాజపాలెంలో గత నెల 20న ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే తన భార్యపై దాడి చేశాడు. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతంగా నరికాడు. ఆ మహిళ ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు. అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరిణించింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డవడం ద్వారా వెలుగులోకి వచ్చింది. -
కూతురి ప్రేమ విషయం దాచిందని దారుణం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, మనుబోలు: కూతురి ప్రేమ, పెళ్లి విషయం తనకు చెప్పలేదనే అక్కసుతో భార్యపై భర్త ఇనుపరాడ్తో దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అక్కంపేటకు చెందిన రాపూరు శ్రీనివాసులు, వెంకటరమణమ్మ (39) దంపతులు కొంత కా లంగా మనుబోలు కోదండరామపురంలో నివాసముంటున్నారు. శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, కొడుకు చెంచుకృష్ణయ్య స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద న్యూడిల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. నెల క్రితం శ్రీనివాసులు కూతురు వనజాక్షి గూడూరుకు చెందిన ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ విషయం భార్య వెంకరమణమ్మకు తెలిసిన్పటికీ భర్తకు తెలియకుండా దాచింది. క్రమంలో ఆదివారం రాత్రి కూతురు నెల్లూరులో కాపురం ఉందని తెలుసుకుని చూచి వద్దామని ఆటోలో వెళ్లారు. నెల్లూరులో కూతురు, అల్లుడిని కలిసి తర్వాత శ్రీనివాసులు ఆగ్రహంతో వారిపై గొడవకు దిగాడు. కూతురిని తనతో రావాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. భార్య సర్ది చెప్పడంతో మనుబోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిపొడుగునా కూతురి ప్రేమ విషయం తెలిసినా తన వద్ద దాచిందని గొడవ పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆటో పీడీఆర్ గార్డెన్ వద్దకు వచ్చే సరికి పం క్చర్ అయిందని ఆపాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. మాటామాటా పెరిగి శ్రీనివాసులు ఇనుప రాడ్తో భార్య తలపై కొట్ట డంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు ఉదయం వీఆర్వో సాయంతో పోలీ సుల వద్ద లొంగిపోయాడు. తల్లి హత్యకు గురైన విషయం తెలిసి కొడుకు చెంచుకృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించాడు. గూడూరు సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దోషులను కఠినంగా శిక్షించాలి గూడూరు: తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని హతురాలి బంధువులు డిమాండ్ చేశారు. సోమవారం ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కంపేటకు చెందిన శ్రీనివాసులు తన భార్య వెంకటరమణమ్మను ఆదివారం రాత్రి అతికిరాతకంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేపథ్యంలో ఆమె బంధువులు మాట్లాడుతూ శ్రీనివాసులు ఒక్కడే హత్య చేయలేదని, అతని బంధువుల ప్రమేయం కూడా ఉంటుందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు. -
ప్రేమ వ్యవహారంలో హెచ్చరించాడనే...
యశవంతపుర: బీబీఎంపీ ఛలవాదిపాళ్యం బీజేపీ కార్పొరేటర్ రేఖ భర్త కదిరేశ్ (49) హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ ప్రేమ విషయంలో తల దూర్చినందుకే సినీ ఫక్కీలో హత్య చేసినట్లు ప్రచా రం జరుగుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన హత్య కేసుకు సంబంధించి... దగ్గర సంబంధం యువతితో నిందితుడు నవీన్ కొద్ది కాలంగా ప్రేమ వ్యవహా రం నడుపుతున్నాడు. యువతిని దొంగపెళ్లి చేసుకో వాలని భావించాడు. విషయం తెలుసుకున్న కదిరేశన్ ఇటీవల నవీన్తోపాటు అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని తనదైన శైలిలో హెచ్చరించి పంపాడు. ఇది కదిరేశ్, నవీన్ల మధ్య ఘర్షణకు దారితీసింది. దీని వెనుక పాతరౌడీ పీటర్ హస్తం ఉన్నట్లు సమాచారం. జై లు నుండి స్కెచ్ వేసి కదిరేశ్ను హతమార్చినట్లు తెలు స్తోంది. తన స్నేహితుడు వినయ్ను తీసుకొచ్చి ఒక్కసారిగా గొంతుపై చాకుతో పొడిచి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. బుధవారం రాత్రి మృతదేహనికి విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. హంతకుల అరెస్టుకు నాలుగు బృందాలు: హోంమంత్రి రామలింగారెడ్డి బీజేపీ నాయకుడు కదిరేశ్ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చామరాజపేటలో కదిరేశ్ ఇంటి వద్దనే హత్య జరిగిందని ఇందులో నవీన్, వినయ్లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. కదిరేశ్ హత్య కేసు నిందితులను త్వరగా అరెస్టు చేస్తామని పశ్చిమ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ బీకే సింగ్ తెలిపారు. -
మావోయిస్టు ప్రేమజంట లొంగుబాటు
మల్కన్గిరి: దళంలో ఉంటూ ప్రేమించుకున్న మావోయిస్టు జంట మల్కన్గిరి ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా ఎదుట శుక్రవారం లొంగిపోయింది. సోనా ఓర్మి, బిజాల కాడిమేలు అనే వ్యక్తులు 2009లో గంగుళూర్ దళంలో చేరారు. 2010లో మల్కన్గిరి జల్లాకు వచ్చి అప్పటినుంచి పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. గోవిందపల్లి ఔట్పోస్ట్ పేల్చివేత, దమన్జోడి ఎటాక్, శ్రీరాంపూర్లో పోలీస్ వాహనంపై దాడి, 2010లో 76మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో ఈ మావోయిస్టు జంట ముఖ్య పాత్ర పోషించింది. వీరిద్దరూ దళంలో ఉంటూనే ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ విషయాన్ని దళంలోని అగ్రనేతలకు తీసుకువెళ్లగా దళంలో ప్రేమ వ్యవహారాలు కుదరవంటూ మండిపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన వారు జనజీవన స్రవంతిలో కలిసిపోదామని నిర్ణయించుకుని లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు మావోయిస్టుల నుంచి రక్షణ లేదు. దళంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. అందుచేతనే జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలకు, గిరిజనులకు సేవ చేద్దామని భావించి లొంగిపోయామని తెలియజేశారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందజేసే పథకాలను త్వరలోనే వీరికి అందజేస్తామని చెప్పారు. వీరిద్దరిది జాజ్పూర్ జిల్లా. వీరిలో ఒక్కొక్కరిపై రూ.రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. వీరి లాగానే మిగిలిన సభ్యులు కూడా దళాన్ని వీడి వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. -
కుమార్తె ప్రేమ వ్యవహారం.. తల్లి ఆత్మహత్య
మర్లపాలెం(గన్నవరం): కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్ బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, లావణ్యకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. రెండు వారాల క్రితం జయబాబు డ్యూటీ నిమిత్తం వెళ్లగా ఇంటి వద్ద శ్రీదేవి, కుమారై మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం లావణ్య పుట్టిన రోజు కావడంతో ఆమెను తెనాలి తీసుకువెళ్లేందుకు ధర్మసాయి ఇంటికి వచ్చాడు. దీనికి శ్రీదేవి నిరాకరించింది. ధర్మసాయి ఆమెతో గొడవపడి బలవంతంగా లావణ్యను తీసుకువెళ్లాడు. అయితే మేనల్లుడితో కుమారై ప్రేమ వ్యవహారాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న భర్త జయబాబుకు ఈ విషయం తెలిస్తే మందలిస్తాడనే భయాందోళనకు శ్రీదేవి గురైంది. దీనికితోడు కుమారైకు చెప్పినప్పటికి వినకుండా మేనల్లుడితో వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో సీలింగ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి మనుమరాలు జన్మదినం కోసం వీరపనేనిగూడెం వచ్చిన శ్రీదేవి తల్లి ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి నిశ్చేష్టురాలైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సీఐ కె. శ్రీధర్కుమార్ నేతృత్వంలో సిబ్బంది విచారణ చేపట్టారు. మృతురాలు చేతిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన ప్రేమ వివాదం
గుమ్మలక్ష్మీపురం : ప్రేమ వివాహానికి సంబంధించి తాడికొండ గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో నిమ్మల సారంగి(68) బీపీకి గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎల్విన్పేట ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాలు...తాడికొండ గ్రామానికి చెందిన పాలక మహేంద్ర అనే యువకుడు అదే గ్రామానికి చెందిననిమ్మక దివ్యను ప్రేమ పేరిట మూడు నెలల కిందట గ్రామం నుంచి తీసుకుపోయాడు. అప్పట్లో దివ్య తల్లిదండ్రులు మహేంద్ర తల్లిదండ్రులను నిలదీశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం నెలకొంది. ఈ క్రమంలో మహేంద్ర తల్లిదండ్రులు పాలక రామా రావు, సులోచనలు దివ్యను తీసుకువస్తామని చెప్పి మూడు నెలల కిందట గ్రామం నుంచి వెళ్లారు. తరువాత శుక్రవారం మహేంద్ర తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు వారింటికి వెళ్లి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుని కేకలు వేసుకున్నారు. ఈ దశలో దివ్య పెద్దనాన్న నిమ్మల సారంగి(60) పెద్దగా కేకలు వేయడంతో రక్తపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్పందించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
న్యాయం చేయాలని ప్రియురాలి దీక్ష
ముమ్మిడివరం: ప్రేమ వివాహం చేసుకుని, తల్లిదండ్రులు నిరాకరించడంతో ప్రియురాలిని వదిలించుకోవాలనుకున్న యువకుడి ఇంటి ముందు ఓ యువతి నిరసర దీక్ష చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయ పురం మండలం పేరవరానికి చెందిన వేముల దుర్గ తన అమ్మమ్మ స్వగ్రామమైన ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు చిట్టి చెరువులో కొంతకాలంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన శెనగల కృపాపాల్ ఏడాదిగా ఆమెతో ప్రేమ వ్యవహారం సాగించాడు. నెల రోజుల క్రితం ఆమె పేరవరంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం కృపాపాల్ అక్కడకు వెళ్లి, దుర్గను వెంట తీసుకొచ్చాడు. స్థానిక మహిపాల చెరువు వద్ద కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కృపాపాల్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతడి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పి, దుర్గను కోడలిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కృపాపాల్ ఆమెను కాట్రేనికోనలో వదిలిపెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, గుడిలో వివాహం చేసుకున్న కృపాపాల్ తనతో కాపురం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి నుంచి అతని ఇంటి ఎదుట దుర్గ నిరసన దీక్ష చేపట్టింది. ముమ్మిడివరం ట్రైనీ ఎస్సై ఎస్.రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, ఆమె వద్ద నుంచి వివరాల సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..