member of parliament
-
శశి థరూర్ ఒడిలో వానరం..ఫొటోలు వైరల్
తన నివాసంలో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అనుకోని అధితి రూపంలో ఓ వానరం ఆయన్ను చుట్టుముట్టింది.పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరుగుతూ తెగ అల్లరి చేసింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్వర్క్లలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.ఇంతకి ఏం జరిగిందంటే?శశిథరూర్.. బుధవారం ఉదయం తన ఇంటి ఆవరణంలో పేపర్ చదువుతున్నారు. ఆ సమయంలో ఓ వానరం ఆయన దగ్గరకు వచ్చింది. పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరిగింది. అనంతరం థరూర్లో ఒడిలోకి కూర్చుంది.Had an extraordinary experience today. While i was sitting in the garden, reading my morning newspapers, a monkey wandered in, headed straight for me and parked himself on my lap. He hungrily ate a couple of bananas we offered him, hugged me and proceeded to rest his head on my… pic.twitter.com/MdEk2sGFRn— Shashi Tharoor (@ShashiTharoor) December 4, 2024 -
ఆడపిల్లల చదువుకు ఐదేళ్ల జీతం.. పెద్ద మనసు చాటుకున్న ఎంపీ
పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.బీహార్కు చెందిన లోక్సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్సభ నియోజకవర్గం సమస్తిపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
New Zealand: ఆమె మళ్లీ వచ్చింది.. దద్దరిల్లిన పార్లమెంట్!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది.న్యూజిలాండ్లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.తాజాగా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.🇳🇿 Māori MPs performing the Haka in New Zealand Parliament ripping apart a bill redefining the Treaty of Waitangi.The Treaty of Waitangi is a document of central importance to the history of New Zealand, its constitution, and its national mythos. pic.twitter.com/OeUZ0g1UMj— Lord Bebo (@MyLordBebo) November 14, 2024ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు. -
‘ఆప్’ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
న్యూఢిల్లీ:పంజాబ్కు చెందిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్సింగ్ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్ -
నృత్య ప్రపంచంలో ఆమె ఓ అద్భుత శిఖరం..! ఏకంగా రాజ్యసభ..
పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయి ప్రపంచ స్థాయిని అందుకున్న భరతనాట్య నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్ ఓ అద్భుత శిఖరం. ఆమె ఎనిమిది పదుల జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సోనాల్ మాన్ సింగ్ పేరు మాత్రమే కాదు ఆమె ధిక్కరణ, ధైర్యం, అభిరుచికి నిలువెత్తు చిహ్నం. చిన్న నాటి నుంచి ఆమె నృత్యం కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉండాలనుకోలేదు. నృత్యం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవాలనుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణం, సామాజిక నిబంధనలను సవాల్ చేయడానికి నృత్యం ఒక మార్గంగా భావించింది. ‘‘నాకు 15, 20, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ప్రదర్శనలు ఇస్తున్నాను అని చెప్పేదాన్ని. కానీ డ్యాన్స్ నాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది‘ అని 80 ఏళ్ల ఈ భారత శాస్త్రీయ నృత్యకారిణి, భరతనాట్యం, ఒడిస్సీ నృత్య గురువు సోనాల్ మాన్సింగ్ వివరిస్తారు. పద్మ భూషణ్ (1992), పద్మ విభూషణ్ (2003) గ్రహీత, పార్లమెంటు, రాజ్యసభ సభ్యురాలు కావడానికి నామినేట్ అయిన సోనాల్ ప్రతి నృత్య అడుగు మనకు ఓ పాఠంగా అవుతుంది.‘కృష్ణ’ ప్రదర్శన మాత్రమే కాదుడ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం. అందుకే డ్యాన్స్తోపాటు వృత్తిని కొనసాగించమని అడిగితే ఇంటి నుంచి పారిపోయి, బెంగళూరుకు వెళ్లి, అక్కడ నాట్య గురువుల ఇంట్లో ఆశ్రయం పొందాను. ప్రొఫెసర్ యు.ఎస్.కృష్ణారావు, చంద్రభాగ దేవిల వద్ద శిక్షణ పొందాను. ఇటీవల ఇండియా హాబిటాట్ సెంటర్లో ’కృష్ణ’ అనే నాట్య కథను ప్రదర్శించాను. దీని గురించి ఎందుకు చెబుతునాన్ననంటే ఈ ఆలోచన నా చిన్నప్పటి నుంచి ఉండేది. చదివిన సాహిత్యం.. ముఖ్యంగా మన పురాణాలు, మహాభారతం నుంచి వచ్చింది. ’కృష్ణ’ అన్నింటి మిశ్రమం.ప్రమాదం జరిగినా ఎదురీతే! చిన్ననాటిఋ నుంచి వేషం వేసుకుని దరువులకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదాన్ని. నాలుగేళ్ల వయసులో క్లాసికల్ మణిపురి డ్యాన్స్ కాస్ట్యూమ్ ధరించి డ్యాన్స్ చేశాను. భరతనాట్యం ప్రశాంతతను ఇచ్చేది. 1974లో జర్మనీలో కారు ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయి. ఇకపై డ్యాన్స్ చేయలేనని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ, పట్టువదలలేదు. ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత ఏడాదిలోనే ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్ నుంచి మాత్రమే శక్తిని పొందుతాను. నా జీవితంలో నేను ఎప్పుడూ డిప్రెషన్ గా భావించలేదు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.స్త్రీత్వం గురించి గర్వంఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి నృత్యాన్ని నమ్ముకొని, ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎవరూ నమ్మరు. క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ స్త్రీత్వానికి సంబంధించినది. పురుషులు ఎప్పుడూ ఉపాధ్యాయులు, మహిళలు నృత్యకారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తున్నారు. వారేం చేసినా నృత్యంలో స్త్రీలే రాజ్యమేలారు. అందుకే నా నృత్యాల్లో ‘పంచకన్య’, ’ద్రౌపది’, ’మీరా’. స్త్రీ శక్తికి సంబంధించినవి ఉంటాయి. ’ నృత్యం నేర్చుకోవాలని తపించేవారు ఎప్పుడూ వ్యక్తిగతంగానే గురువును వెతకాలని’ అంటూ నృత్య పాఠాలను వివరిస్తుంది సోనాలి మాన్సింగ్. (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! ) -
రేపు ప్రమాణం చేయనున్న అమృత్పాల్
చండీగఢ్/అమృత్సర్: విచారణ ఖైదీగా అస్సాం జైలులో గడుపుతున్న ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ జూలై ఐదో తేదీన పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణంచేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలిచారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో గెల్చిన విషయం తెల్సిందే. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్పాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణంచేసేనాటికి ఈయనకు పెరోల్ లభించలేదు. తాజాగా జూలై 5వ తేదీ నుంచి నాలుగురోజులపాటు పెరోల్ దొరికింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో ఈయనతో ఎంపీగా ప్రమాణంచేయిస్తారని ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా బుధవారం వెల్లడించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళే..
-
టీ కాంగ్రెస్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఉన్న 17 లోక్సభ స్థానాల కోసం.. మొత్తం 306 దరఖాస్తులు గాంధీభవన్కు వచ్చాయి. మహబూబాబాద్, నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాగా, హైదరాబాద్లో తక్కువగా వచ్చాయి. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 100కిపైగా అప్లికేషన్లు రాగా.. దరఖాస్తులు ఇచ్చిన వాళ్లలో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో.. వాళ్ల స్థానాల్లో పోటీకి బంధువులు, సన్నిహితులు ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బంధువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్, బంధువు చల్లూరి మురళీధర్ అప్లికేషన్లు సమర్పించారు. రేవంత్ సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. అలాగే.. రేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి, చామలచకిరణ్లు సైతం దరఖాస్తులు సమర్పించారు. ఇక నల్గొండ సీటు కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్ దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ సీటు కోసం తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు అప్లికేషన్ సమర్పించడం గమనార్హం. దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్కర్నూల్), ఎంఆర్జీ వినోద్రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరితో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్కర్నూల్ కోసం మొత్తంగా నాలుగు దరఖాస్తులు అందజేశారు. హాట్ సీటు ఏదంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున హాట్సీట్గా మారింది ఖమ్మం లోక్సభ స్థానం. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పలువురు దరఖాస్తులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీ హనుమంతరావులు సైతం అప్లికేషన్లు ఇచ్చారు. తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. హాట్ టాపిక్గా గడల ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా గడల శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్ డైరెక్టర్గా ఉండి.. అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసినా.. లాంగ్లీవ్లో ఉండి మరీ ఆయన సన్నిహితుల ద్వారా గాంధీభవన్కు దరఖాస్తు పంపించడం గమనార్హం. -
టార్గెట్ లోక్సభ ఎన్నికలు.. తెలంగాణ బీజెపీ అభ్యర్థుల జాబితా రెడీ?
సాక్షి, హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
లోక్సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు.. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శౠతం టీడీపీ ఖాళీ కాబోతోందని అన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. -
ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో ఎవరెవరంటే?
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది. తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న వారంత కీలకమైన నేతలే. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు వచ్చిన వారంత కీలక నేతలే కావడం విశేషం. డిప్యూటి సీఎం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీగా సీట్లు రావడం వెనుక సైతం ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇక, సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు ఎంపీ టికెట్ రేసులో ఉండటం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచర గణం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని మద్దతుదారులు చెబుతున్నారు. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, కేడర్కు పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటూ 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ప్రసాద్రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్రెడ్డి విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధి నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల పోటీ చేసినప్పుడల్లా యుగంధర్ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగేంధర్ కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ కొసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే పార్టీ కొంత వీక్ ఉన్న ప్రాంతంలోనే సొనియాను బరిలో నిలిపాలని భావిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ వంటి బలమైన నేతకు ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే పార్టీకి కొత్తగా లాభం చేకూరేదేమీ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు. #WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX — NewsMobile (@NewsMobileIndia) August 5, 2023 ఇది కూడా చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
ఢిల్లీ: మహారాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ సురేశ్ ‘బాలు’ ధానోర్కర్(47) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించగా.. ఇవాళ ఆయన కూడా మరణించడం ఆ కుటుంబంలో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నింపింది. సురేశ్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకునేందుకు మే 26న సురేశ్ ధానోర్కర్ నాగ్పూర్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. సురేష్ ధానోర్కర్ తండ్రి నారాయణ్ ధానోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో గత శనివారం మరణించారు. ఆస్పత్రిలో ఉండడంతో.. ఆదివారం జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరుకాలేకపోయారు. మహారాష్ట్ర నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ధానోర్కరే. బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ కెరీర్ను ప్రారంభించిన సురేశ్.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సురేశ్ భార్ పేరు ప్రతిభ. ఆమె 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. స్వస్థలం వారోరాలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Sad to learn that our @INCIndia parliamentary colleague, Suresh Narayan Dhanorkar (MP from Chandrapur constituency in Maharashtra) passed away overnight, the second demise of a Congress MP during the 17th Lok Sabha. He was only 47. My condolences to his loved ones. Om Shanti. pic.twitter.com/qwCQ8XamEc — Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2023 ఇదీ చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. అధికారికి షాక్ -
ఎంపీగా అనర్హత.. ట్విటర్ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో జైలు శిక్ష ఖరారు, ఎంపీ పదవికి ఎసరు రావడంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. కాషాయ దళం కావాలని తమ నాయకుడిని టార్గెట్ చేసిందని హస్తం పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ తన ట్విటర్ హ్యాండిల్ బయోను మార్చారు. అంతకుముందు ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ ఉన్నచోట ‘డిస్ 'క్వాలిఫైడ్ ఎంపీ’ (Dis'Qualified MP) అని అప్డేట్ చేశారు. కాగా, ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరునాడే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీగా ఉందని ప్రకటించింది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అప్పీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. అయినా లోక్సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! ఇదిలాఉండగా, పరువునష్టం కేసులో జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎగువ న్యాయస్థానాలను ఆశ్రయించనుంది. (చదవండి: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్వాలా) దేశవ్యాప్త ఆందోళనలు.. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు ఢిల్లీలోని రాజ్ ఘాట్లో ‘సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష’కు చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం రాహుల్ గాంధీ పనిచేస్తుంటే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. రాహుల్ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మాట్లాడితే కేసు గుజరాత్కు వెళ్లిందని విమర్శించారు. కర్ణాటకలోని బీజేపీ సర్కార్కు ఆ రాష్ట్రంలో కేసు వేసేంత దమ్ము లేదా? అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని బీజేపీ శ్రేణులు కావాలనే కించపరుస్తున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: Defamation Case: రాహుల్పై అనర్హత వేటు) -
రాహుల్ ముందు 2 మార్గాలు.. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లకపోవచ్చు!
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అనర్హత వేటు నుంచి బయట పడి, ఎంపీగా కొనసాగడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాహుల్ ముందు రెండు మార్గాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పును పై కోర్టు కొట్టివేస్తే అనర్హత వేటూ రద్దవుతుంది. కనీసం జైలు శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా ఊరటే. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకు మించి జైలుశిక్ష పడితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. కనుక సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసేలా, రెండేళ్ల కంటే తగ్గించేలా పై కోర్టులో వాదించి నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే కనీసం శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నా ఎంపీ పదవిని కాపాడుకోవచ్చు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రాహుల్ అప్పీల్ను పై కోర్టు తిరస్కరిస్తే మాత్రం మరో ఎనిమిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది క్రిమినల్ కేసు కావడంతో నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవచ్చని తెలుస్తోంది. చదవండి: రాహుల్పై అనర్హత వేటు.. సెప్టెంబర్లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక? తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తారని, అక్కడ ఊరట దక్కకపోతే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 11న లక్షద్వీప్ కరవట్టిలోని సెషన్స్ కోర్టు ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్ను దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల శిక్ష విధించింది. జైలుశిక్ష పడిన రెండు రోజులకే లక్షదీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో లక్షద్వీప్ లోక్సభ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం జనవరి 18న నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇంతలో మొహమ్మద్ ఫైజల్కు విధించిన జైలు శిక్షపై కేరళ హైకోర్టు జనవరి 25న స్టే విధించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరోవైపు హైకోర్టు నిర్ణయంపై లక్షద్వీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ప్రస్తుతం సుప్రీంలో విచారణ నడుస్తోంది. చదవండి: ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్ గాంధీ -
రాహుల్పై అనర్హత వేటు.. సెప్టెంబర్లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడింది. ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంట్ సెక్రటేరియట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కాగా రాహుల్పై అనర్హత వేటు వేయడంతో లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్సభ వెబ్సైట్ పేర్కొంది. ప్రజాప్రాతినధ్య చట్టం 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం.. ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే 6 నెలల్లోపు ఉప ఎన్నికల నిర్వహించి ఆ స్ధానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాహుల్పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి నిబంధలన ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. దీనిపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. లోక్సభ సభ్యత్వం రద్దుపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా జనాందోళన్కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు. చదవండి: రాహుల్పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా?
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేటు రాజ్యాంగబద్ధమేనని కొందరు, లోక్సభ సెక్రటేరియట్ సరైన నిర్ణయం తీసుకోలేదని మరికొందరు అంటున్నారు. 2014 నాటి లిల్లీ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు వెంటనే అనర్హతకు గురవుతారని వెల్లడించింది. శిక్ష పడిన మర్నాడే రాహుల్పై వేటుకు ఈ తీర్పు దోహదపడినట్లు తెలుస్తోంది. అయితే 2018 నాటి లోక్ప్రహరీ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకటించింది. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధిపై అభియోగాలను పైకోర్టు కొట్టేస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. శిక్ష రద్దయితే వేటూ రద్దవుతుందని తెలియజేసింది. రాహుల్పై వేటు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ని లోక్సభ సెక్రటేరియట్ ఉదాహరించింది. వీటి ప్రకారం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన సభ్యులపై శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయవచ్చు. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం శిక్ష పడిన 3 నెలల తర్వాత మాత్రమే అనర్హత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఈలోగా శిక్షపడిన సభ్యుడు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. కింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. కానీ, రాహుల్పై వెంటనే వేటు వేయడం గమనార్హం. ఇలా శిక్ష పడిన మరుసటి రోజే సభ్యులపై అనర్హత వేటు వేసిన దాఖలాలు గతంలో లేవు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(4)ను లోక్సభ సెక్రటేరియట్ పట్టించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. లోక్ప్రహరీ కేసు ప్రకారం.. రాహుల్కు పడిన జైలుశిక్షను పై కోర్టు రద్దు చేస్తే ఆయనపై అనర్హత వేటు సైతం రద్దవుతుంది. -
Defamation Case: రాహుల్పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు! శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్కు అలవాటే. పార్లమెంట్కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్, ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు. వయనాడ్ ఖాళీ లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్సభ వెబ్సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్ రంజన్ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్చౌక్ వద్ద కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్ వర్గం, జేడీయూ, ఆప్ నేతలు పాల్గొని ‘వుయ్ డిమాండ్ జేపీసీ’, ‘సేవ్ ఎల్ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్ డేంజర్’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్ సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్’కు పిలుపునిచ్చింది. రాహుల్ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు. వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. స్పందనలు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు ‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’ – మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ‘‘మోదీ భారత్లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’ మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘రాహుల్పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్ఖాన్ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’ అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ‘‘రాహుల్గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’ శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘రాహుల్పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’ ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’ సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’ జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి ‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ పార్లమెంట్ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’ – ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు భారత్ గొంతుక కోసమే నా పోరాటం ‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ – రాహుల్ గాంధీ ట్వీట్ -
అనర్హత వేటు లేవనెత్తిన ప్రశ్నలు
చట్టం వేరు...ధర్మం వేరు. చట్టబద్ధమైన చర్యలన్నీ ధర్మబద్ధం కాకపోవచ్చు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటానికి దారితీసిన సూరత్ కోర్టు తీర్పు, అంతక్రితం రెండు వారాలుగా అధికార, విపక్షాలు సాగిస్తున్న ఆందోళనల పర్యవసానంగా పార్లమెంటు స్తంభించి పోవటం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తాయి. పౌరులు ఎలా మెలగాలో, పాటించాల్సిన స్వీయ నియంత్రణలేమిటో చట్టాలు చెబుతాయి. అధికారానికుండే పరిమితులేమిటో కూడా తేటతెల్లం చేస్తాయి. కానీ వాటి ఆచరణ సక్రమంగా లేని చోట ఆ చట్టాలు కొందరికి చుట్టాలవుతాయి. మరికొందరికి అవరోధాలవుతాయి. కర్ణాటకలోని కోలార్లో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన రాహుల్ అవినీతికి, అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీల పేర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జత చేసి ‘దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎందుకుంటుంది?’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. రాహుల్ వ్యాఖ్య ఆ ఇంటి పేరుగల సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా మారిందంటూ గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్పై కోర్టు తీర్పునిచ్చింది. రాహుల్ వ్యాఖ్యతో చాలామందికి ఏకీభావం లేకపోవచ్చు. ప్రత్యర్థులనుసరించే విధానాలను విమర్శించటంకాక వారిపై దూషణలకు దిగటం చాన్నాళ్లుగా రివాజుగా మారింది. ఇక భౌతికంగా నిర్మూలిస్తామని బెదిరింపులకు దిగటం, దౌర్జన్యాలకు పూనుకోవటం వంటివి చెప్పనవసరమే లేదు. అయితే ఈ ధోరణులను వ్యతిరేకించేవారు సైతం రాహుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను, దాని ఆధారంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటం సమర్థించలేకపోతున్నారు. గతంలో రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు రాహుల్ ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కు కున్నారు. ప్రధానినుద్దేశించి వ్యాఖ్య చేయబోయి సుప్రీంకోర్టును తప్పుబట్టేలా మాట్లాడటంతో సమస్య ఏర్పడింది. ఆ కేసులో రాహుల్ బేషరతు క్షమాపణ చెప్పడాన్ని అంగీకరించి సర్వోన్నత న్యాయస్థానం 2019లో కేసు మూసివేసింది. అయితే రాహుల్ వంటి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికింది. సూరత్ కోర్టు దాన్నే గుర్తుచేసింది. ఈ తీర్పుపైనా, అనర్హత వేటుపైనా ఎటూ కాంగ్రెస్ అప్పీల్కి వెళ్తుంది. అక్కడ ఏమవుతుందన్న సంగతి అటుంచి, సూరత్ కోర్టు తీర్పు లేవనెత్తిన అంశాలు ప్రధానమైనవి. పరువు నష్టం కలిగించటాన్ని నేరపూరిత చర్యగా పరిగణించి గరిష్టంగా రెండేళ్ల జైలు, జరిమానాకు వీలుకల్పించే భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 499, 500 సెక్షన్ల సహేతుకతపై ఎప్పటినుంచో అభ్యంతరాలున్నాయి. ఒకపక్క పరువునష్టంలో సివిల్ దావాకు వీలున్నప్పుడు జైలుశిక్ష, జరిమానాలెందుకని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్ వలస పాలన కాలంలో చేసిన ఈ చట్టం ఇప్పుడు బ్రిటన్లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఉనికిలో లేదు. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నది గనుక, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది గనుక రద్దు చేయాలని గతంలో సుప్రీంకోర్టుకెక్కిన వారున్నారు. అయితే పేరుప్రతిష్టలు కలిగివుండే హక్కు జీవించే హక్కులో భాగమని, దానికి భంగం కలిగించినవారు తగిన శిక్ష అనుభవించక తప్పదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సందర్భంలో ఈ అంశంలో తీర్పులు వెలువరించేటపుడు జాగురూకత వహించాలని కింది కోర్టులకు సలహా ఇచ్చింది. అయితే ఈ సలహాను కింది కోర్టులు పాటిస్తున్నాయా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక రచనపై వచ్చిన విమర్శను తట్టుకోలేకనో, ఒక నాటకాన్నీ లేదా సినిమాను అడ్డుకోవటానికో ఈ సెక్షన్లను యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. తమిళనాడులో జయ లలిత పాలనాకాలంలో ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో పరువునష్టం దావాలు వేసిన సంగతి ఎవరూ మరువలేరు. కోర్టులు సైతం యాంత్రికంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కింది కోర్టులను తప్పుబట్టవలసి వచ్చింది. నీరవ్ మోదీ, లలిత్ మోదీ తదితరులకు ప్రభుత్వ ప్రాపకం లభించిందని ఆరోపిస్తే రాహుల్కు బహుశా ఈ కేసు బెడద ఉండేదికాదు. తగిన ఆధారాలతో అటువంటి విమర్శలు చేస్తే దానివల్ల ప్రజలకు ఏదో మేరకు ప్రయోజనం కూడా కలుగుతుంది. రాహుల్ తన వ్యాఖ్యలద్వారా ఒక వెనుకబడిన వర్గాన్ని కించపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగా ఎదుర్కొనటం తప్పేమీ కాదు. అందుకు భిన్నంగా న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంత వరకూ సబబో, చట్టానికి అనుగుణంగానే అయినా ఆదరాబాదరాగా అనర్హత వేటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమేరకు ధర్మమో ఆలోచించుకోవాలి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఆజంఖాన్ తదితరుల కేసుల్లో వెనువెంటనే చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ ప్రక్రియ సందేహాస్పదం కారాదు. మెజారిటీ ఉంది కదా అని కక్షపూరితంగా చేశారన్న అపఖ్యాతి తెచ్చుకోకూడదు. దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చిన వారు నిక్షేపంలా కేంద్రమంత్రు లుగా కొనసాగుతుంటే విపక్ష నేత నోరుజారటం మాత్రం మహాపరాధం కావటం సాధారణ పౌరు లకు కొరుకుడుపడని అంశం. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యం రాహులేనని పార్లమెంటులోని పరిణామాలైనా, తాజా చర్య అయినా తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయ పక్షాలూ, వాటి వ్యూహాల మాటెలా వున్నా దేశంలో చట్టబద్ధ పాలనకూ, సమన్యాయానికీ విఘాతం కలగనీయకుండా చూడాలని సాధారణ పౌరులు కోరుకోవటం అత్యాశేమీ కాదు. -
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్సభ సెక్రటేరియెట్. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్సభ సెక్రటరీ జనరల్. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. Rahul Gandhi - Congress MP from Wayanad, Kerala - disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his 'Modi surname' remark. pic.twitter.com/SQ1xzRZAot — ANI (@ANI) March 24, 2023 ఏం జరిగిందంటే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్పై పరువు నష్టం దావా వేశారు. Watch this video, did Rahul Gandhi say something wrong ? Spread this. pic.twitter.com/EQlL9g03Za — Shantanu (@shaandelhite) March 23, 2023 ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది సూరత్ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్మెంట్ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్లో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు కూడా. రాహుల్ టార్గెట్ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ మాత్రం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్ గాంధీకి గురువారం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర ఎంపీ సుమలత
మాండ్య: మాజీ నటి, కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్(59).. ఊహించని స్టేట్మెంట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. నాలుగేళ్లుగా మాండ్య లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆమె హఠాత్తుగా తన మద్దతును కమలానికి ప్రకటించడం గమనార్హం. మోదీ నాయకత్వంలో భారత్కు లభించిన సుస్థిరత, దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘నాలుగేళ్లపాటు స్వతంత్రంగా వ్యవహరించాను. ఈ సమయంలో బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. వీటిని దృష్టిలో ఉంచుకునే మద్దతు అవసరమని భావించాను. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాను’అని ఆమె మీడియాతో అన్నారు. కన్నడ అగ్ర నటుడు దివంగత అంబరీష్ భార్య అయిన సుమలత బహు భాషా నటి. సుమారు 220కిపైగా సినిమాల్లో నటించారామె. 2019 మాండ్యా ఎన్నికలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. కిందటి నెలలో ఆమె బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తన మద్దతు ఉండబోదంటూ ప్రకటించడం గమనార్హం. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కవరాట్టి: హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకున్నదని ఫైజల్ ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్ని ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు నిలపగలిగారు. -
మెస్సీ అసోంలో పుట్టాడు..!
ఫిఫా వరల్డ్కప్-2022 విజేతగా అర్జెంటీనా ఆవిర్భవించిన క్షణం నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్బాల్ అభిమానులు మెస్సీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని సంబోధిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. ఫైనల్ మ్యాచ్ పూర్తై 24 గంటలు గడుస్తున్నా మెస్సీ నామస్మరణతో ప్రపంచ వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి హైరేటెడ్ సెలబ్రిటీల వరకు మెస్సీని అభినందనలతో (సోషల్మీడియా వేదికగా) ముంచెత్తుతున్నారు. ఎంతో మంది లాగే మన దేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ట్విటర్ వేదికగా మెస్సీని అభినందించాడు. అసోంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖలీక్ మెస్సీని అభినందిస్తూ.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నామంటూ పొంతన లేని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మెస్సీ ఏంటి.. అసోంతో సంబంధం ఏంటీ అంటూ సందిగ్ధంలో ఉండిపోయారు. సదరు ఎంపీ గారు చెప్పింది నిజమేనా అని ఓ సారి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఓ నెటిజన్ అయితే మెస్సీకి అసోంతో కనెక్షన్ నిజమేనా అని ఎంపీ గారిని ప్రశ్నించాడు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు. assam connection? — Aditya Sharma (@strangecrickkk) December 19, 2022 ఈ ట్వీట్లు కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చేసుకుని ఫేక్ న్యూస్ అని తేల్చేసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీని ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. ఎంపీ గారి అజ్ఞానాన్ని ఏకి పారేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో తప్పు తెలుసుకున్న సదరు ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అబ్దుల్ ఖలీక్ అసోంలోని బార్ పేట్ లోక్సభ స్థానానికి పాత్రినిధ్యం వహిస్తున్నాడు. కాగా, ఫిఫా వరల్డ్కప్లో భాగంగా నిన్న (డిసెంబర్ 18) ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో మెస్సీ 2 గోల్స్తో మాయాజాలం చేసి అర్జెంటీనాను జగజ్జేతగా నిలపడమే కాకుండా వరల్డ్కప్ గెలవాలన్న తన చిరకాల కోరికను సైతం నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి మూడోసారి (1978, 1986, 2022) జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. షూటౌట్లో మెస్సీ సేన 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ 2 గోల్స్కే పరిమితమై ఓటమిపాలైంది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్, ఏంజెల్ డి మారియ ఒక గోల్ సాధించగా.. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబపే హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టాడు. -
వైరల్ వీడియో: ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ
-
ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. ఎందుకో తెలుసా?
లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు బీజేపీ ఎంపీ. ప్రభుత్వ కార్యాలయంలో భూమికి సంబంధించిన పట్టాల విషయంలో ఓ రైతు వద్ద లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగిపై బీజేపీ ఎంపీ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని ప్రతాప్ఘడ్ జిల్లాలో బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్జోషి (సీపీ జోషి).. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి భూ పట్టాలకు సంబంధించి బదాయింపు విషయంలో ఓ రైతు నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేసినట్టు రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో సదురు ఉద్యోగిని పిలిపించిన ఎంపీ సీపీ జోషి.. ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. దీంతో, రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగిపై ఎంపీ చేయిచేసుకున్నారు. అయితే, డిపార్ట్మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
... ప్రభుత్వం మీద పడటం ఆపి... కాస్త పార్టీ మీద పడండీ!
... ప్రభుత్వం మీద పడటం ఆపి... కాస్త పార్టీ మీద పడండీ! -
75కోట్ల మంది బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేకపోవడం అన్యాయం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
-
చిన్నారి సమాధానంతో ప్రధాని మోదీ నవ్వులు
వైరల్: ప్రధాని నరేంద్ర మోదీ పెదాలపై చిరునవ్వులు పూయించింది ఓ చిన్నారి. ఎంపీ అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా? అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కండిషన్ పెట్టడం.. దానిని ఛాలెంజ్గా తీసుకుని వర్కవుట్లు చేసి బరువు తగ్గిన వ్యక్తి. ఉజ్జయిని(మధ్యప్రదేశ్) ఎంపీ అనిల్ ఫిరోజియా.. తన కుటుంబాన్ని తీసుకుని పార్లమెంట్కు వచ్చారు. ఆ సమయంలో ప్రధానిని కలిసింది ఆ కుటుంబం. అనిల్ కూతురు ఐదేళ్ల అహానా.. ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించింది. నేనెవరో తెలుసా? అని మోదీ ఆ చిన్నారిని ప్రశ్నించారు. అవును.. మీరు మోదీ. రోజూ మీరు టీవీలో కనిపిస్తారు అని చెప్పింది. నేనేం చేస్తానో తెలుసా? అని మోదీ మళ్లీ ప్రశ్నించగా.. మీరు లోక్ సభలో పని చేస్తారు అని సమాధానం ఇవ్వడంతో మోదీ నవ్వుల్లో మునిగిపోయారు. చివర్లో మోదీ, అహానాకు ఓ చాక్లెట్ కానుకగా ఇచ్చి పంపించారు. ఈ సరదా విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నారు ఎంపీ అనిల్. आज मेरी दोनों बालिकाएं छोटी बालिका अहाना और बड़ी बालिका प्रियांशी आदरणीय प्रधानमंत्री जी से प्रत्यक्ष मिल कर और उनका स्नेह पाकर बहुत आनंदित और अभीभूत है।@narendramodi @PMOIndia @BJP4India @BJP4MP pic.twitter.com/v5ULVP9KPU — Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022 ఇక యోగా, ఎక్సర్సైజులతో 21 కేజీల బరువు తగ్గిన అనిల్ ఫిరోజియా.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున 21 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని అనిల్ను అభినందిస్తూనే.. ఇంకాస్త బరువు తగ్గి ఫిట్గా ఉండడంటూ ప్రొత్సహించారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గాలంటూ ప్రధాని మోదీ ఈమధ్య ఇద్దరికి సూచించారు. रास्ते भी जिद्दी है मंजिलें भी जिद्दी है हौंसले भी जिद्दी है। pic.twitter.com/P0BMleuJus — Tejashwi Yadav (@yadavtejashwi) July 25, 2022 ఒకరు ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా, మరొకరు ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వి యాదవ్. 32 ఏళ్ల తేజస్వి.. ప్రధాని సూచన మేరకు రోజూ కష్టపడి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు కూడా. ఇదీ చదవండి: సీఎం షిండేకు షాకిచ్చిన చిన్నారి! -
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై సస్పెన్షన్ వేటు
-
Shocking Video: లంకలో హైటెన్షన్.. నిరసనకారుల దాడిలో ఎంపీ మృతి
Sri Lanka MP Amarakeerthi Athukorala.. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక అధ్యక్షుడు, ప్రధానిపై విపక్షనేతలు, లంకేయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లంక రాజధాని కొలంబోలో సోమవారం నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కొలంబోలో కర్ఫ్యూ విధించారు. ఇది కూడా చదవండి: విక్టరీ డే రోజున పుతిన్కు ఊహించని షాక్ -
జాతి సంపదను ప్రైవేట్పరం చేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 120 మంది ఎంపీలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాని కార్యాలయంలో అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేడీ, బీఎస్పీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఎం, ఐయూఎంల్, ఆర్ఎల్పీ తది తర పార్టీలకు చెందిన సభ్యులు దీనిపై సంతకాలు చేసినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలోనే ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇవీ... ► విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలు, వేల మంది త్యాగాలకు ప్రతిరూపం. 64 గ్రామాలకు చెందిన 16,500 కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. వేలమంది రైతులు 23 వేల ఎకరాల వ్యవసాయ భూములను కోల్పోయారు. ►మూడు టన్నుల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పరిశ్రమకు కేంద్రం రూ.4,900 కోట్లను దశలవారీగా ఇచ్చింది. సొంతంగా గనులు లేకుండా ఉక్కు ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఒక్కటే. ► ప్రస్తుతం 17,500 మంది రెగ్యులర్, అంతే సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. వీరితోపాటు సీఐఎస్ఎఫ్, హోంగార్డులకు సంస్థ వేతనాలు చెల్లిస్తోంది. సంస్థ కారణంగా నివాసాలు కోల్పోయిన కుటుంబాల్లో 8,500 మందికే ఉపాధి కల్పించారు. మిగతా వారు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ► విశాఖ ఉక్కు వచ్చిన తర్వాతే నగరం అభివృద్ధి చెంది మెట్రో సిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా నిధులిచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖ ఉక్కు పాలు పంచుకుంది. కరోనా వల్ల 150 మంది ఉద్యోగులు మృతి చెందినా 20 వేల టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసింది. ► ప్రభుత్వంపై ఆధార పడకుండా నెలకు రూ.200 కోట్లను రుణాల వాయిదా కింద చెల్లిస్తూ సంస్థ లాభాల బాట పట్టింది. ఉత్పత్తి ఖర్చులో 65 శాతం ముడి పదార్థాలకే వెచ్చించాల్సి వస్తోంది. క్యాప్టివ్ మైన్స్ను కేటాయిస్తే విశాఖ ఉక్కు అద్భుతమైన లాభాలు ఆర్జిస్తుంది. ► విశాఖ స్టీల్ ప్లాంట్ దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, మెట్రోలు, సర్దార్ పటేల్ విగ్రహం, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎక్స్ప్రెస్ హైవేలు, పోర్టుల నిర్మాణ పనులకు ఉక్కును అందజేసి జాతి సంపదగా నిలిచింది. ►కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4,900 కోట్లను దశలవారీగా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వెచ్చించగా రూ.45 వేల కోట్లను పన్నుల రూపంలో తిరిగి ఇచ్చింది. ► 2021–22 తొలి మూడు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రూ.19,403 కోట్ల రెవెన్యూ సాధించింది. పన్నులు చెల్లించిన తర్వాత రూ.790 కోట్ల లాభాల్లో ఉండగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు పార్లమెంటులోని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని పార్టీ ఎంపీలు సత్కరించారు. స్టీల్ ప్లాంట్పై టీడీపీ డ్రామాలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. విశాఖ ఉక్కుకు మద్దతుగా 120 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తే టీడీపీ ఎంపీలు మాత్రం అందుకు నిరాకరించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో చంద్రబాబు ఎరువుల కర్మాగారాలు, చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు తదితర 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారని గుర్తు చేశారు. చదవండి: సంతకం పెట్టని టీడీపీ -
తాను సైతం అంటూ... ఆయుధం చేత బట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!
Holding Kalashnikov: ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తాను సైతం యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పారు. మహిళలు పురుషులు అనే భేధం లేకుండా ఈ నేలని రక్షించుకుంటారని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను చాలా కోపంగా ఉన్నానని చెప్పారు. అయినా పుతిన్ ఉక్రెయిన్ ఉనికి హక్కును ఎలా తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదనగా పేర్కొన్నారు. తనని తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని అయినప్పటికీ తాను రాజధాని కైవ్లోనే ఉంటూ తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకుంటానని చెబుతున్నారు. ఉక్రెయిన్ స్వతంత్ర దేశం అని తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ధీమాగా చెప్పారు. తన తోటి శాసనసభ్యులతో సహా అనేక మంది ఉక్రేనియన్ మహిళలు రష్యా దళాలతో పోరాడేందుకు ఆయుధాలు తీసుకున్నారని ఉక్రెయిన్ ఎంపీ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఊహకు కూడా అందని విధంగా తాము ప్రతిఘటిస్తాం అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కాదు కదా మా గడ్డ మీద ప్రతి అంగుళాన్ని వారికి దక్కనివ్వకుండా మా దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్లోని ప్రతి స్త్రీ, పురుషుడు సిద్ధంగా ఉన్నారన్నారు. "మేము ఈ యుద్ధం ప్రారంభించలేదు, మేము మా దేశంలో మా జీవితాలను శాంతియుతంగా జీవిస్తున్నాము, మన దైనందిన జీవితాన్ని అగాధంలో పడేసేలా శత్రువు మా దేశంలోకి చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ కూర్చొం. దేశాన్ని రక్షించే క్రమంలో ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేని నాలాంటి వ్యక్తులు సైతం నిలబడి పోరాడతారు. పుతిన్ తమ బలగాలను వెనక్కి రప్పిస్తాడని ఆశిస్తున్న" అని ఉక్రెయిన్ ఎంపీ రుడిక్ అన్నారు. (చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం) -
కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు!
Side Effects of Covid- 19 vaccines ఫ్రాన్స్: కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఫ్రెంచ్ చట్ట సభ్యుడు జోస్ ఎవ్రార్డ్ (76) కరోనా సోకి మరణించినట్లు పార్లమెంట్ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. కాగా ఎవ్రార్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడమేకాకుండా, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించే నిరసనకారులకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు, అలాగే సహోద్యోగులు, సహచరులతో వాస్తవాలను పంచుకుంటానని నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడైన రిచర్డ్ ఫెర్రాండ్ ట్విటర్లో ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తర ఫ్రాన్స్లోని పాస్ డి కలైస్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు చట్టసభ్యుల్లో ఎవ్రార్డ్ ఒకరు. నికోలస్ డుపాంట్ ఐగ్నాన్ వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్తలకు వ్యవస్థాపకుడు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ తీర్మానంపై అక్టోబర్లో ఎవ్రార్డ్ సంతకం చేశాడు కూడా. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు! 30 కోట్లు దాటిన కేసులు! -
Kirron Kher: గ్రేట్ కమ్ బ్యాక్ గెలుపు కిరణం.. ‘ఆమె ఫైటర్. అంతే’!
Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్ ఠాకూర్ సింగ్ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్ ఖేర్’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్ఖేర్ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్ ఖేర్ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్ ఖేర్ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ లవ్’ ఎప్పటిలాగే చీర్ఫుల్ వాయిస్! చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చండీగఢ్కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సెట్లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు. ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్ ఖేర్ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్
చెన్నై: మందుబాబులు తప్ప తాగి.. తమ ఇంటికి బదులు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి.. గొడవ చేయడం.. ఆనక ఆ ఇంటి వారి చేతులో దెబ్బలు తినే సన్నివేశాలను ఎక్కువగా సినిమాలో చూస్తుంటా. రియాలిటీలో కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఒకరు తప్ప తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రచ్చ చేయడంతో ఆగ్రహించిన సదరు ఇంటి యాజమాని.. మాజీ ఎంపీని చికతబాదాడు. ఆ వివరాలు.. (చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’) ఈ సంఘటన దీపావళి పండుగ నాడు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్పేట్లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. వచ్చిన వ్యక్తి ఎంపీ అని వారికి తెలియదు. తాగిన మత్తులో వచ్చి ఉంటాడు అని భావించిన ఆ ఇంటి సభ్యులు బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. కానీ గోపాలకృష్ణన్ వారి మాట వినకుండా.. ఆ ఇంట్లో రచ్చ చేశాడు. తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆగ్రహించిన ఆ కుటుంబ యజమాని ఎంపీని చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. (చదవండి: మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ) ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్న పోలీసులు గోపాలకృష్ణన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ మంత్రి అని తెలిపారు. అనంతరం గోపాలకృష్ణన్ని కూనూర్ ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు -
సాక్షి కార్టూన్ 26-10-2021
-
పోచంపల్లి పట్టులో మెరిసిన బెంగాల్ ఎంపీ
హైదరాబాద్ : పార్లమెంటులో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా పోచంపల్లి పట్టులో మెరిసిపోయారు. భారతీయ హస్తకళలను ఆమె మెచ్చుకుంటూ మోస్ట్ బ్యూటిఫుల్ పోచంపల్లి కాటన్ శారీ అంటూ ప్రశంసలు అందించారు. తెలంగాణ బహుమతిగా మంత్రి కేటీఆర్ ఈ చీరను అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. Indian handlooms rock - wearing the most beautiful Pochampalli cotton saree from Telengana gifted to me on recent IT committe tour by @KTRTRS pic.twitter.com/jB30pxFeZN — Mahua Moitra (@MahuaMoitra) September 14, 2021 ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తోన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బ్రాండ్ ప్రమోషన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన హస్త కళలను ఆయన ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మోయిత్రా హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మెయిత్రాకి పోచంపల్లి పట్టు చీరను బహుకరించారు మంత్రి కేటీఆర్. ఆ చీరను మరింత ఆధునిక పద్దతిలో ధరించారు ఎంపీ మహువా మెయిత్రా. చదవండి : ‘వండర్ఫుల్ కేటీఆర్’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు -
వరకట్న వేధింపులు.. కటక్ ఎంపీపై కోడలు ఫిర్యాదు
భువనేశ్వర్: కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్కి వ్యతిరేకంగా ఆయన కోడలు ఫిర్యాదు చేసింది. ఎంపీతో పాటు ఆయన భార్య మహాశ్వేతా దేవి, కుమారుడు లోక్రంజన్ మెహతాబ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్లు భోపాల్ మహిళా పోలీస్ ఠాణాలో గురువారం ఫిర్యాదు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ కుటుంబ సభ్యులకు తాఖీదులు జారీ చేశారు. 2016 డిసెంబర్ 12న ఎంపీ కుమారుడు లోక్రంజన్ మెహతాబ్, భోపాల్కి చెందిన సాక్షితో వివాహం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక 2018లో సాక్షి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం న్యూఢిల్లీలోని ఇంట్లో ఉండేందుకు సాక్షిని అనుమతించాలని ప్రత్యర్థులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మెట్టినింటిలో ఉండేందుకు సాక్షి చేసిన ప్రయత్నాలు నిర్వీర్యం కావడంతో భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
Tanzania: ‘ఏంటో ఈ వింత’.. మహిళా ఎంపీ దుస్తులపై విమర్శలు
డోడోమా: సాధారణంగా పార్లమెంట్ సమావేశాల్లో పదే పదే ఆటంకం కలిగిస్తూ, గందరగోళం సృష్టిస్తే కొన్ని సమయాల్లో ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే తాజాగా టాంజానియీ దేశ పార్లమెంట్లో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ‘నువ్వేంటో నీ వింత బట్టలు ఏంటో? సభను గౌరవించి తక్షణమే భయటకు వెళ్లిపో’ అంటూ ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఓ మహిళ ఎంపీని సభ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం పార్లమెంట్లో చర్చనీయ అంశంగా మారింది. టాంజానియాలో ఓ మహిళా ఎంపీ నలుపు రంగు ప్యాంటు, పసుపు రంగు టాప్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆమె ధరించిన దుస్తులపై వివాదం తలెత్తింది. బిగుతైన దుస్తులు ధరించినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. మంచి దుస్తులు ధరించి సభలోకి రావాలని స్పీకర్ ఆమెకు తెలిపారు. ఈ విషయంపై స్పీకర్ సిచ్వాలే మాట్లాడుతూ.. ‘మా సోదరీమణులు కొందరు వింత బట్టలు ధరిస్తున్నారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. దేశంలో ఉన్నతమైన పార్లమెంట్ సభ, సాంప్రదయాల్ని అందరూ తప్పకుండా గౌరవించాలి. ముఖ్యంగా దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అటువంటి వాళ్లపై సభ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. స్పీకర్ వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. చదవండి: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్ బ్లాగరా అన్నారు -
జూమ్ మీటింగ్లో మళ్లీ చెండాలం!
జూమ్ మీటింగ్లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి నగ్నంగా దర్శనమిచ్చిన కెనడా ఎంపీ విలియం ఆమోస్ గుర్తున్నాడా? ఈ పనితో అతను వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అయితే పనిలో పనిగా ప్రభుత్వం నుంచి వార్నింగ్ కూడా అందుకున్నాడు. కానీ, అతని బుద్ధి మారినట్లు లేదు. ఈసారి అంతకుమించిన పనితో మరోసారి వార్తల్లోకెక్కాడు. జూమ్ మీటింగ్ అది కూడా అధికారిక సమావేశం అనే సోయి లేకుండా కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు. ఒట్టావా: కెనడా ఎంపీ విలియమ్ ఆమోస్ మరో వివాదంలో ఇరుకున్నాడు. వర్చువల్ పార్లమెంట్ సెషన్ జరుగుతున్న టైంలో కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు. దీంతో లైవ్లో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. విమర్శలు రావడంతో విలియమ్ను పక్కనపెట్టాలని, చర్యలు తీసుకోవాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే తాను బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమోస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. చదవండి: బట్టల్లేకుండా ఎంపీ కాగా, ఉద్దేశపూర్వకంగా తాను ఆ పని చేయలేని విలియమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఘటనపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని పేర్కొన్నాడు. అది వీడియో కాల్ అనే విషయం మరిచిపోయానని, అందరూ చూస్తారనే విషయం తనకు తట్టలేదని విలియమ్ చెప్పాడు. కాగా, కెనడాలోని కొందరు ఎంపీలు లైంగిక వేధింపుల విమర్శలను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో విలియమ్ను పక్కనపెట్టడమే మంచిదని ట్రూడోకి సహచరులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. Please see my statement. Veuillez lire ma déclaration. pic.twitter.com/ICc8WjqNZi — William Amos (@WillAAmos) May 28, 2021 ఇక ఈ రెండు సంఘటనలు యాదృచ్చికమని, ఇప్పుడు ఎంతో చింతిస్తున్నానని ఆమోస్ అంటున్నాడు. అంతేకాదు తన చర్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని తన ట్విట్టర్లో కోరాడు. లిబరల్ పార్టీలో కీలక సభ్యుడైన విలియం ఆమోస్.. పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతల నుంచి కొంతకాలం తప్పుకుంటానని తెలిపాడు. పోయిన నెలలో జూమ్ మీటింగ్లో విలియమ్ పూర్తి నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది. ఆ సమయంలో క్షమాపణలు చెబుతూ.. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు విలియమ్ ఆమోస్. విలియమ్ మానసిక స్థితి పలు సందేహాలున్నాయని తోటి సభ్యులు చెప్తుండడం విశేషం. -
రాణిగారి ఆస్థానం.. స్కాట్లాండ్ ఎంపీగా తొలి భారత మహిళ
ఇటీవలే మే 6 న స్కాట్లాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. బ్రిటన్లో భాగమైన స్వతంత్ర దేశం స్కాట్లాండ్. ప్రధాని ఉంటారు. పైన క్వీన్ ఎలిజబెత్ ఉంటారు. దేశంలో మూడు పార్టీలు ఉన్నాయి. స్కాటిష్ నేషనల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ లీడర్ నికోలా స్టర్జన్. ఆమే ఇప్పుడు ప్రధాని. అయితే ఆమె గురించి కాదు మన స్టోరీ. ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ నుంచి పామ్ గోసల్ (49) అనే అభ్యర్థి విజయం సాధించారు. రాణిగారి ఆస్థానంలో చోటు సంపాదించారు. గోసల్ భారత సంతతి మహిళ. అంతేకాదు, స్కాట్లాండ్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన తొలి భారతీయురాలు! పామ్ గోసల్ ఈ నెల 13న స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఆ దేశంలో వచ్చిన కొత్త చట్టంతో 1999 నుంచి ఐదేళ్లకోసారి పార్లమెంటు ఎన్నికలు జరగడం మొదలయ్యాక ఒక భారత సంతతి మహిళ స్కాట్లాండ్ ఎంపీ కావడం ఇదే ప్రథమం. మొన్న జరిగినవి ఆరో పార్లమెంటు ఎన్నికలు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి పామ్ గోసల్ గెలుపొందారు. ఆ ముందు నుంచే ఆమె స్కాట్లాండ్ ‘కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్’ (సి.డబ్లు్య.ఓ) కు డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు. సి.డబ్లు్య.ఓ. అన్నది నూట రెండేళ్లుగా ఉన్న సంస్థ. ఇంగ్లండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్లలోని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మహిళలంతా ఇందులో సభ్యులుగా ఉంటారు. స్కాట్లాండ్ కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్.. సి.డబ్లు్య.ఓ.కు అనుబంధంగా ఉంటుంది. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో గోసల్ సభ్యురాలు అవడంతో.. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె విజయానికి సహజంగానే ప్రాధాన్యం లభించింది. ఇక భారత సంతతి మహిళగా ఆమె విజయం మన దేశానికి కూడా గర్వకారణమే. స్కాట్లాండ్ పార్లమెంటు భవనం ముందు పామ్ గోసల్ పామ్ గోసల్ పూర్వికులది పంజాబ్లోని భటిండా. సిక్కుల కుటుంబం. స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్ నగరంలో ఆమె జన్మించారు. డిగ్రీ చదివారు. కన్జూమర్ ‘లా’ లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం పిహెచ్.డి చేస్తున్నారు. స్లాట్లాండ్ కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న భారతీయ సభ్యులతో ఆమెకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. స్కాట్లాండ్లోని కన్జర్వేటివ్ పార్టీకి, బ్రిటన్ సంతతి భారతీయులకు మధ్య ఆమె ఒక వారధి అయ్యారు. వాళ్లంతా ఎంపీగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతిచ్చి, ఆమె విజయానికి సహకరించారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందువరకు కూడా గోసల్ తన కుటుంబ వ్యాపారం లో తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నారు. ‘‘భారతీయ నేపథ్యంతో స్కాట్లాండ్ తొలి పార్లమెంటు మహిళా సభ్యురాలిగా ఎన్నికవడం నాకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలతో కలిసి పని చేసేందుకు త్వరపడుతున్నాను’’ అని గోసల్ ట్వీట్ చేశారు. ఆమె తన ప్రమాణ స్వీకారాన్ని ఇంగ్లిష్లోను, పంజాబీలోనూ చేశారు. ప్రమాణ స్వీకారం పార్లమెంటు సంప్రదాయం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ పేరిట మొదలై, భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించేలా సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథంలోని పంక్తులతో పూర్తయింది. -
పార్లమెంట్లోని బార్లలో పొంగుతున్న బీర్లు
రోజు రోజుకు విజంభిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం శనివారం నుంచి మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా ఇంగ్లండ్లోని అన్ని పబ్లను, బార్లను, రెస్టారెంట్లను రాత్రి పది గంటలకల్లా కచ్చితంగా మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పబ్లో, బార్లలో కూడా ఒక చోట ఎనిమిది మందికి మించి గుమికూడరాదంటూ, విధిగా మాస్కులు ధరించాలంటూ, పబ్లు, బార్లకు వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్లు, చిరునామాలను నిర్వాహకులు తీసుకోవాలంటూ కూడా నిబంధనలు విధించింది. అయితే కొంత మంది ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ ఆంక్షల నుంచి ఇంగ్లండ్ పార్లమెంట్లోని బార్లను ‘వర్కింగ్ ప్లేస్ క్యాంటీన్’ కేటగిరీ కింద మినహాయించింది. పార్లమెంట్ ఆవరణలో మొత్తం 30 బార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని గెస్ట్లను అనుమతించే బార్లు ఉండగా, జర్నలిస్టులను అనుమతించే బార్లు కొన్ని ఉన్నాయి. కొన్ని బార్లలో ఎంపీలకు మాత్రమే అనుమతి ఉంది. ది లార్డ్స్ బార్, ది బిషప్స్ బార్, దీ పీర్స్ డైనింగ్ రూమ్, ది పీర్స్ గెస్ట్ రూమ్, ది పూజిన్ రూమ్, ది టెర్రేస్ పెవీలియన్, ది స్ట్రేంజర్స్ బార్, ది టెర్రేస్ కాఫెటేరియా, ది థేమ్స్ పెవీలియన్, ది స్పీకర్స్ స్టేట్ రూమ్స్, ది రివర్ రెస్టారెంట్, బెల్లమీస్, ది డిబేట్, ది జూబ్లీ రూమ్, ది అడ్జెర్న్మెంట్, ది మెంబర్స్ డైనింగ్ రూమ్, ది స్ట్రేంజర్స్ డైనింగ్ రూమ్, ది స్పోర్ట్స్ అండ్ సోషల్ బార్, ది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ రూమ్, ది చర్చిల్ రూమ్, ది కోల్మాండ్లే రూమ్, ది బెర్రీ రూమ్, ది హోం రూమ్, జూబ్లీ కేఫ్, ది అట్లీ రూమ్, మిల్బ్యాంక్ హౌజ్ కేఫ్టేరియా, ది రివర్ డైనింగ్ రూమ్స్, మాన్క్రీఫ్స్లలో బార్లు ఉన్నాయి. వీటిలో మాన్క్రీఫ్స్ జర్నలిస్టులకు ప్రత్యేకం. ఇవి ఎప్పటిలాగే రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తాయి. (చదవండి: ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్ పరిశోధకులు) వీటిలో మూడు డాలర్లకు ఒక్క బీరు చొప్పున సబ్సిడీపై అందజేస్తున్నారు. ఫలితంగా ఏటా 8 మిలియన్ డాలర్ల సబ్సిడీ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతోంది. 1980లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ఎంపీల్లో ఎక్కువ మంది తాగే వారు ఉండగా, వారిలో పది శాతం మంది ఎక్కువ తాగడమే కాకుండా చికిత్స కోసం రీహాబిలిటేషన్ సెంటర్లకు వెళతారట. దివంగత లిబరల్ డెమోక్రటిక్ నాయకుడు చార్లెస్ కెన్నడీ ఓ సారి బాగా తాగి బడ్జెట్ సెషన్కు వెళ్లి ప్యాంట్లో మూత్రం పోసుకున్నారట. అప్పుడు ఆయన్ని పార్లమెంట్ భద్రతా సిబ్బంది తీసుకెళ్లి ఆయన కార్యాలయంలో నిర్బంధించి, బయటి నుంచి తాళం వేశారట. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తాగి, తాగి చనిపోయారట. 2013లో లేబర్ ఎంపీ ఎరిక్ జాయిస్ను పార్లమెంట్ బారుల్లోకి అనుమతించకుండా నిషేధం విధించారు. తాగి పార్లమెంట్ సెషన్కు వెళ్లి తనతో విభేదించిన ఎంపీలను తలతో ‘డిచ్’ కొట్టడమే అందుకు కారణమట. అలా ఆయన ఆరుగురు ఎంపీల తలలు పగులగొట్టారట. పార్లమెంట్లో ఇన్ని బార్లు ఎందుకు అనే అంశం పలు సార్లు చర్చకు వచ్చినప్పటికీ పాత బార్లు మూతపడకపోగా కొత్త బార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఆంక్షల నుంచి పార్లమెంట్ బార్లకు మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కోవిడ్-19 : కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత్కుమార్ (70) శుక్రవారం మరణించారు. కోవిడ్-19కు చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. వసంత్కుమార్కు ఎక్మో పరికరంతో అపోలో వైద్యులు చికిత్స అందించారు. కోవిడ్-19 లక్షణాలు తీవ్రం కావడంతో ఈనెల 10న ఆయనను ఆస్పత్రికి తరలించారు. మూడు వారాల పాటు కరోనా వైరస్తో పోరాడిన వసంత్కుమార్ శుక్రవారం సాయంత్రం 6.56 గంటలకు మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో అతిపెద్ద గృహోపకరణాల రిటైల్ చైన్ వసంత్ అండ్ కోను ఆయన స్ధాపించారు. వసంత్కుమార్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ కుమారి అనంతన్ సోదరుడు కాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆయన సమీప బంధువు. 2006లో వసంత్కుమార్ తొలిసారిగా నంగునెరి నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కన్యాకుమారి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, అప్పటి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్పై ఘనవిజయం సాధించారు. వసంత్కుమార్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత, ఎంపీ హెచ్ వసంత్కుమార్ మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన మద్దతుదారులు, అభిమానులకు తీరనిలోటని పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. చదవండి : తమిళనాడులో తెరపైకి రెండో రాజధాని -
బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి కరోనా
కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కరోనా వైరస్ బారినపడినట్టు శుక్రవారం ఆమె స్వయంగా వెల్లడించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ గత వారం రోజులుగా తాను స్వీయ నియంత్రణలో ఉన్నానని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, అన్ని వివరాలు మీతో పంచుకుంటానని ఆమె ట్వీట్ చేశారు. మహిళా అంశాలపై క్షేత్రస్ధాయిలో చురుగ్గా స్పందించే నేతగా పేరొందిన లాకెట్ ఛటర్జీని బీజేపీ అధినాయకత్వం ఇటీవల బెంగాల్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. కాగా బీర్భం జిల్లాలో జూన్ 19న అమర జవాన్ రాజేష్ ఓరంగ్ అంత్యక్రియల్లో బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్తో కలిసి ఆమె పాల్గొన్నారు. వీర జవాన్కు వీడ్కోలు పలికేందుకు వందలాదిగా ప్రజలు అంత్యక్రియలకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి సైతం పాల్గొన్నారు. మరోవైపు తన కుమార్తెను లైంగిక వేధింపుల నుంచి కాపాడే క్రమంలో ఓ మహిళ మరణించిన ఘటనపై హౌరాలోని బగ్నాం ప్రాంతంలో బీజేపీ మద్దతుదారులతో కలిసి జూన్ 24న రహదారి ముట్టడి కార్యక్రమానికీ లాకెట్ ఛటర్జీ హాజరయ్యారు. కాగా ఆమెకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఛటర్జీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : ‘టిక్టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’ -
రోజు పది నిమిషాలు సంస్కృత వార్తలు
-
విశాఖ రైల్వే జోన్ ని వేగంగా పూర్తిచేయండి
-
రాష్ట్ర అభివృధ్దిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు
-
ఈమె పిలిస్తే నెమళ్లు వస్తాయి
ఒరిస్సాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న గంజాం జిల్లాలో ప్రమీలా బిసోయిని ‘దేవ మాత’ అని పిలుస్తారు. దానికి కారణం ఆమెకు మహిమలు ఉండటం కాదు. మహిమల కంటే ఎక్కువ అనదగ్గ పర్యావరణ స్పృహ ఉండటం. 71 ఏళ్ల ప్రమీలా బిసోయి గంజాం జిల్లాలో ‘పాకిడి’ గిరిశ్రేణుల్లోని విస్తారమైన అటవీ సంపదకు చౌకీదారు. గత పద్దెనిమిదేళ్లుగా ఒరిస్సా ప్రభుత్వం అక్కడి స్త్రీల స్వయం సమృద్ధికి మొదలెట్టిన ‘స్త్రీశక్తి’ అనే కార్యక్రమంలో ఉత్సాహంగా దూకిన బిసోయి నెమ్మదిగా ఆ స్త్రీలను తరలిపోయిన అడవిని తిరిగి పిలవడానికి ఉద్యుక్త పరిచింది. ‘నేను ఈ ప్రాంతానికి నవవధువుగా వచ్చినప్పుడు అడవి ఎంతో పచ్చగా ఉండేది. ఝరులు సంవత్సరం మొత్తం పారేవి. పక్షులు కిలకిలలాడేవి. దాదాపు ముప్పై నలభై ఏళ్ల కాలంలో చెట్లు నరికేయడం వల్ల అంతా పోయింది. మళ్లీ ఆ అడవిని చూడాలని నిశ్చయించున్నాను’ అంటుంది ప్రమీలా. మొత్తం 1970 హెక్టార్లలో అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ అడవిలో బిసోయి చేసిన మొదటి పని స్త్రీశక్తి పథకంలో ఉన్న స్త్రీలను చాలామందిని అడవిని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పడం. వీరు ఎప్పుడైతే కాపలాకు నిలిచారో కలప దొంగలు ఆ వైపు చూడటానికి భయపడసాగారు. ఇక ఈ స్త్రీలే రంగంలో దిగి తిరిగి చెట్లు నాటారు. రాళ్లను తవ్వుకొని పోవడంతో ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. డొంకల్లో పూడికలు తీశారు. కొద్ది సంవత్సరాల్లోనే అడవి పెరిగింది. అప్పుడు వచ్చిన తొలి అతిథే– నెమలి. అడవి తరగడంతో మాయమైపోయిన నెమలి ఎప్పుడైతే అడవి పెరిగిందో తిరిగి వచ్చింది. ఆడనెమళ్లు సాధారణంగా వెదురుపొదల్లో గుడ్లు పెడతాయి. అందుకని బిసోయి అడవిలో విస్తారంగా వెదురు నాటించింది. ఆ వెదురు ఇంత నుంచి అంత పెరిగింది. ఒక నెమలి రెండు నెమళ్ల నుంచి ఇవాళ పాకిడి అడవిలో రెండు వేల నెమళ్లు తమ తావు ఏర్పరుచుకున్నాయి. భారతదేశంలో ఇంత పెద్ద నెమళ్ల శాంక్చరీ మరొకటి లేదు. ‘నెమళ్ల వల్ల ఒక్కోసారి పంటలు దెబ్బ తింటాయి. అయినా మేము వాటిని ఏమీ అనం. అవి మాలో భాగం అనుకుంటాము’ అంటుంది బిసోయి. బిసోయి చేసిన ఈ కృషి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు తెలిసింది. ఆయన ఏకంగా ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ‘అస్కా’ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆమె ఘనవిజయం సాధించి ఎం.పి అయ్యింది. తను ఎలా ఉందో అలాగే ఆ గిరిజన ఆహార్యంలోనే పార్లమెంట్కు హాజరయ్యింది. ఒరిస్సా భాషలో అక్కడ మాట్లాడి కరతాళధ్వనులు అందుకుంది. ఇటువంటి స్త్రీలు ఒక వందమంది ఉంటే చాలు ఈ దేశం వనసందోహం తప్పక అయి తీరుతుంది. -
మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఎన్నికలైనా పేదరిక నిర్మూలనే తమ అజెండా అని ఊదరగొట్టే నేతలు, ఓట్ల వేటలో పేదలను కౌగిలింతల్లో ముంచెత్తడం, వారి ఇంట్లో భోజనం చేయడం వంటి చర్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలపై నినాదాలు వల్లెవేసే ఎంపీల్లో అసలు పేదలను ప్రతిబింబించే నేతలు ఉన్నారా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. దేశ ప్రజల సగటు ఆదాయంతో లోక్సభ ఎంపీల సగటు రాబడితో పోలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మన ఎంపీలు మన ప్రజల కంటే 1400 రెట్లు అధిక రాబడిని ఆర్జిస్తున్నారని ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషించింది. 2004 నుంచి 2019 వరకూ ఎన్నికైన ఎంపీల నికర ఆస్తులను లెక్కగట్టడం ద్వారా ఈ గణాంకాలను వెలువరించింది. ఎంపీల సగటు ఆదాయం 2004-09లో కేవలం రూ 1.9 కోట్లు కాగా తర్వాతి కాలంలో రూ 5.06 కోట్లకు ఎగబాకగా 2014-19లో రూ 13 కోట్లకు ఎగిసింది. ఇక ప్రస్తుత 17వ లోక్సభ(2019-24)లో ఎంపీల సగటు ఆదాయం ఏకంగా రూ 16 కోట్లకు ఎగబాకింది. ఎంపీల సగటు ఆదాయం సామాన్య ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే ఇంత భారీ వ్యత్యాసం ఉండటానికి కారణం 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు నిధుల కోసం స్వయంగా భారీగా వెచ్చించే అభ్యర్ధుల వైపు మొగ్గుచూపడంతో వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారని ఇది పేదలు, చట్టసభ సభ్యుల రాబడిలో తీవ్ర అసమానతలు పెరిగే స్దాయికి దారితీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వాల్లో పట్టుపెంచుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసిన ఎంపీ
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్పై 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా లేఖను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ ద్వారా నగరపాలక సంస్థ కమీషనర్ భద్రయ్యకు పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన బండి సంజయ్కు సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. అయితే తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది బండి సంజయ్కే కావడం విశేషం. -
అప్పుడు వాళ్లే..ఇప్పుడు వాళ్లే
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు లోక్సభ బరిలోకి దిగి మరోసారి తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరుపు నుంచి పోటీ పడుతున్న రాథోడ్ రమేష్ ఖానాపూర్ అసెంబ్లీకి, బీజేపీ నుంచి ఎంపీ బరిలో దిగిన సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి లోక్సభ బరిలోనూ టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వెంకటేష్ నేతకాని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నుంచి పోటీ పడి ఓటమి చెందిన వారే. వీరితోపాటు మరో ఐదుగురు ఇతర అభ్యర్థులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన వారుండటం గమనార్హం! మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీరిని వెక్కిరించిన అదృష్టం.. ఈ లోక్సభ ఎన్నికల్లోనైనా వరిస్తుందో లేదో వేచిచూడాలి. ఖానాపూర్ నుంచి రాథోడ్ రమేష్.. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,49,380 ఓట్లు పోలవగా, రాథోడ్ రమేష్కు 46,428 వచ్చాయి. రేఖానాయక్కు 67,138 ఓట్లు వచ్చాయి. 20,710 ఓట్ల తేడాతో రమేష్ రాథోడ్ ఓటమి చెందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభకు టీడీపీ నుంచి పోటీ చేయగా, 1.84 లక్షల ఓట్లు రావడంతో రమేష్ రాథోడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈయనకు 3.72 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో అప్పుడు ఎంపీ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బోథ్ నుంచి సోయం బాపూరావు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 1.54 లక్షల ఓట్లు పోలవగా, సోయం బాపూరావుకు 54,639 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రాథోడ్ బాపూరావుకు 61,125 ఓట్లు రావడంతో ఆ ఎన్నికల్లో సోయం బాపూరావు 6,486 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాపూరావు 35,218 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నూర్ నుంచి వెంకటేష్ నేతకాని.. చెన్నూర్ అసెంబ్లీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన వెంకటేష్ నేతకాని టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వెంకటేష్ నేతకానికి 43,848 ఓట్లు వచ్చాయి. చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్కు 71,980 ఓట్లు రావడంతో 28,132 ఓట్ల తేడాతో వెంకటేష్ నేతకాని ఓటమి పాలయ్యారు. తద్వారా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానంలోకి వచ్చి లోక్సభకు పోటీపడుతుండటం విశేషం. ఇతరులు కూడా.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సిర్పూర్ నుంచి పోటీ చేసిన గంట పెంటన్నకు అప్పుడు 595 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్సభ బరిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన సబ్బని క్రిష్ణకు ఆ ఎన్నికల్లో 1812 ఓట్లు వచ్చాయి. అదే నియోజకవర్గానికి అసెంబ్లీ బరిలో నిలిచిన అంబాల మహేందర్కు 706 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రామగుండం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఇరికిల్ల రాజేష్కు ఆ ఎన్నికల్లో 299 ఓట్లు వచ్చాయి. ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేసిన కుంటాల నర్సయ్యకు 13,114 ఓట్లు వచ్చాయి. వీరు నలుగురు ప్రస్తుతం పెద్దపల్లి లోక్సభ బరిలో ఉన్నారు. -
ఆమె ఒక్కరే...
మహిళలకు ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు అని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా పార్లమెంట్లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం టి కల్పనాదేవి ఒక్కరు మాత్రమే ఎంపీ గెలుపొందారు. వరంగల్, మహబూబాబాద్ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలు అతివలకు అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. సాక్షి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ఎంపీ మాత్రమే ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ టి కల్పనాదేవి 1984లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె కూడా పరాజయం పాలయ్యారు. వరంగల్, మానుకోట రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే 26,657 మంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు మహిళలు టికెట్ ఆశిస్తుండగా టికెట్ వచ్చేనే లేదో చూడాలి. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో అతివలకు అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు చిన్న చూపుచూస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో పురుషులతో సమానంగా అవకాశాలు దక్కుతున్నా చట్ట సభలకు వచ్చే సరికి అంతంతమాత్రంగానే ఉంటుంది. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 15,18,907, మహిళా ఓటర్లు 15,45,564, ఇతరులు 223 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువ ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనైనా మహిళలకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అభ్యర్థిత్వం ఆశించే మహిళలు ఉంటున్నా గెలుపోటములను బేరీజు వేసుకుంటూ రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటుండటంతో టికెట్లు దక్కడం లేదు. గెలిచి.. ఓడిన కల్పనాదేవి వరంగల్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. 1984లో హన్మకొండకు చెందిన డాక్టర్ టి.కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ నుంచి వరంగల్ లోక్సభ సభ్యురాలిగా గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి కమాలోద్దిన్ అహ్మద్పై 8,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరంగల్ లోకసభ ఏర్పాటైనప్పటి నుంచి ఏకైక మహిళా ఎంపీగా చరిత్రలో నిలిచారు. ప్రముఖ వైద్యురాలుగా పనిచేస్తూ టీడీపీ పార్టీలో చేరారు. 1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ ఉపాధ్యక్షురాలుగా, ఏఐసీసీ సభ్యురాలుగా పనిచేశారు. 2016 మే 29న గుండెపోటుతో మరణించారు. ప్రస్తుత ఆశావహులు.. వరంగల్ ఎంపీ టికెట్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్లో పోటీచేసి ఓటమి చెందారు. మానుకోట అభ్యర్థిత్వం విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత మానుకోట టికెట్ను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో...గెలుపొంది చట్టసభల్లో ఎవరు అడుగుపెడతారో వేచి చూడాలి. -
చందాలిచ్చి గెలిపించారు!
సాక్షి, హన్మకొండ : గతంలో పార్టీ సిద్దాంతాలు, వ్యక్తుల గుణగణాలు చూసి నాయకులుగా ఎన్నుకునే వారు. డబ్బులు ఆశించే వారు కాదు. ప్రస్తుతం ఓటర్లు విలువైన ఓటును అమ్ముకోవడం బాధాకరం. నాయకులు కూడా కోట్లు కుమ్మరించి ఓట్లు కొంటున్నారు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ పార్లమెంట్ సభ్యుడు చందుపట్ల జంగా రెడ్డి. రాజకీయాలు ఇంతగా భ్రష్టుపట్టని కాలంలో పలుమార్లు పోటీ చేసి గెలుపోటములను చవిచూసిన ఆయన సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. చందాలు పోగు చేసి తొలిసారి పోటీ.. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశాను. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి, ప్రజలకు సేవ చేసేందుకు‡1965లో రాజకీయాల్లోకి వచ్చి 1967లో మొదటి సారి జనసంఘ్ పార్టీ తరçఫున పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచా. ఆ ఎన్నికల్లో నాకు రూ.5,300 ఖర్చయ్యాయి. అది కూడా స్నేహితులు, ప్రజలు చందాలిచ్చారు. అప్పట్లో కూడా ఎన్నికల ఖర్చు కొద్ది కొద్దిగా పెరిగింది కానీ... ఇంతలా పెరగడం లేదు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు రూ.9 వేలు ఖర్చు అయింది. మూడోసారి పోటీ చేసినప్పుడు రూ.19 వేలు ఖర్చయింది. ఇలా నేను పోటీ చేసిన రోజుల్లో ఖర్చు అంతా నామమాత్రంగానే ఉండేది. కర్త–కర్మ–క్రియ... కార్యకర్తలే.. అప్పట్లో కార్యకర్తలు నిష్టతో, త్యాగంతో, కార్యదీక్షతో,సేవాభావంతో, పార్టీ కోసం పని చేసే వాళ్లు. పోలింగ్ రోజు నాడు కూడా కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు ఇచ్చే వారం కాదు. ఆ రోజుల్లో నాలుగు చక్రాల వాహనాలు తక్కువ. ఎక్కువగా సైకిల్, ఎడ్ల బండ్లపైనే ప్రచారం సాగేది. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే నాటికి నాలుగు చక్రాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు జీపులు, అంబాసిడర్ కారులో తిరిగి ఓటర్లను కలిసేవాళ్లం. మొదట్లో పార్టీ జిల్లాకు ఒక జీపు ఇచ్చేది. ఆ క్రమంలో వారంలో ఒకటి, రెండు రోజులు అభ్యర్ధికి వచ్చేది. జీపు రాగానే నియోజకవర్గానికి దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లే వాళ్లం. బుర్రకధలు.. గ్రామపెద్దలు నేడు ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడంతా నోటి మాట ద్వారానే ప్రచారం సాగేది. సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖ్యంగా బుర్ర కథల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేవాళ్లం. నాలుగైదు గ్రామాలు కలిపి ఎన్నికల సభలు నిర్వహించేవాళ్లం. చుట్టు పక్కల గ్రామాల్లోని గ్రామ పెద్దలను, ప్రముఖులను కలిసి భవిష్యత్తు అభివృధ్ధి ప«థకాలు, ఆలోచనల గురించి చెబితే వారు గ్రామంలోని ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పి ఓట్లు వేయించేవారు. ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బులు కీలకం. టికెట్లు ఇచ్చే ముందే అభ్యర్థి డబ్బులు ఖర్చు పెడతారా లేదా అని పార్టీలు, నాయకులు చూస్తున్నారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తూ విచ్చల విడిగా ఖర్చు పెట్టి.. గెలిచాక ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇది మాబోటి వారికి ఆందోళన కలిగిస్తోంది. -
అకాలీదళ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కు రాజీనామా చేసిన పంజాబ్ ఎంపీ షేర్ సింగ్ గుభయా మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఫిరోజ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే గుభయా సోమవారం ఎస్ఏడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుభయాను తాము ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించామని అకాలీదళ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షేర్ సింగ్ గుభయా పార్టీ మారడం గమనార్హం. -
కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ లోక్సభ ఎంపీ
సాక్షి, చెన్నై : ఏఐఏడీఎంకే లోక్సభ ఎంపీ కె.కామరాజ్ కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఆయనకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సేలం జిల్లాలోని వలప్పాడిలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ కారును అతని డ్రైవర్ నడుపుతున్నాడు. అతివేగం కారణంగా అతను వాహనంపై పట్టుకోల్పోడంతో అదుపుతప్పి వలప్పాడిలోని మిన్నంపల్లి వద్ద పల్టీలు కొట్టింది. ఘటనలో ఎంపీ చేతికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్, ఎంపీ సహాయకుడు కూడా స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, శనివారం జరిగిన మరో కారు ప్రమాదంలో ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. (అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ మృతి) -
ఎంపీ జితేందర్రెడ్డికి నిరసన సెగ
సాక్షి, ఆత్మకూర్: మహబూబ్నగర్ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డికి టీఆర్ఎస్ శ్రే ణుల నుంచి నిరసన ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ అసమ్మతి వర్గానికి సహకరించారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ‘ఎంపీ.. గో బ్యాక్’అంటూ నినాదాలు చేశారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్లో జరిగిన టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో జితేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు. జితేందర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డిని ఓడించేందుకు అసమ్మతి కుంపటిని రగిల్చారని ఆరోపిస్తూ మక్తల్, నర్వ మండలాల నేతలు నినాదాలు చేశారు. జితేందర్రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాన ని, పార్లమెంటు సెగ్మెంట్లోని అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశానన్నారు. -
బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు
-
బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ వ్యాఖ్యలు కాకరేపాయి. పుల్వామా ఎన్కౌంటర్ అంశంపై స్పందిస్తూ జవాన్లపై ఆయన చేసిన కామెంట్లు తీవ్ర విమర్శకు దారితీశాయి. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా... మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అంటూ నేపాల్ సింగ్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, రాంపూర్(యూపీ) ఎంపీ అయిన 77 ఏళ్ల నేపాల్ సింగ్ మాటలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అయి ఉండి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నేతలూ విమర్శించారు. దీంతో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని.. ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు అని తెలియజేశారు. సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. -
చల్లగా జారుకున్నాడు
మీకు మాకు పోటీ ఎందుకులే...మీకు బలం ఉన్న మూడు చోట్ల మీకే మద్దతు ఇస్తే పోయేదేముందంటూ సీనియర్ కాంగ్రెస్ నేత చెవిలో ఎంచక్కా పూవు పెట్టాడో పార్లమెంట్ సభ్యుడు. టీఆర్ఎస్ వ్యవహారాల్లో అధినేత కేసీఆర్ తన మాటకు గౌరవం ఇస్తారని చెప్పుకునే సదరు నేత ఈ మధ్య కాంగ్రెస్ ముఖ్య నేత ఒకాయనతో ప్రైవేట్ విందులో కలిసి పాల్గొన్నారు. సహజంగానే స్థానిక సంస్థల నుంచి జరగనున్న ఎన్నికల వ్యవహారం అక్కడ చర్చకు వచ్చింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారని, తేలిగ్గా నాలుగు గెలుచుకుంటామని కాంగ్రెస్ ముఖ్య నేత ధీమాగా చెప్పారు. అబ్బే వరంగల్లో ఏమైందో చూశారుగా...ఇప్పుడు కూడా అంతే...అందువల్ల మీరో మూడు సీట్లు తీసుకోండి...మిగిలిన చోట్ల మేము పోటీ చేస్తాం...తేలిగ్గా అయిపోతుందన్నాడు. దీనిపై కేసీఆర్తో చర్చిస్తానని కూడా నమ్మబలికాడు. మూడు సీట్లలో తేలిగ్గా గెలవొచ్చుకదా... ఇదేదో బాగుందని సదరు కాంగ్రెస్ ముఖ్యనేత విషయాన్ని పార్టీ సీనియర్ల చెవిలో పడేశారు. ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. అంతే అధికారపక్షంతో పొత్తా... ఇంకేమైనా ఉందా అంటూ ఈ వ్యవహారం మింగుడుపడని సీనియర్లు గగ్గోలు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇష్యూ ఢిల్లీ దాకా వెళ్లింది...కానీ, కేసీఆర్ మాత్రం కాంగ్రెస్కు మెజారిటీ ఉన్న నల్లగొండలోనే తొలి అభ్యర్థిని ప్రకటించేసరికి ముందు ప్రతిపాదించిన ఎంపీ గారు ఇప్పుడు ఫోన్ కూడా తీయడం లేదట. -
సీపీఎంవాళ్ల గొంతులు కోయండి!
తృణమూల్ ఎంపీ తపస్ పాల్ మరో వివాదాస్పద వ్యాఖ్య ‘రేప్’ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన రోజే మరో వీడియో బహిర్గతం అరెస్టుకు సీపీఎం, బీజేపీ డిమాండ్ కోల్కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చే యిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటుడు తపస్ పాల్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ‘రేప్’ వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడం, దీనిపై ఆయన మంగళవారం బేషరతు క్షమాపణ చెప్పిన కొంతసేపటికే ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యల వీడియో బహిర్గతమైంది. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తల గొంతులు కోయాలంటూ నాదియా జిల్లాలోని ఓ గ్రామంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను బెంగాలీ చానళ్లు మంగళవారం ప్రసారం చేశాయి. ‘‘ప్రజలను చంపేవారు మనుషులే కాదు. నేను మీతో ఉన్నంత వరకూ ఏ సీపీఎం కార్యకర్తను వదిలిపెట్టొద్దు. ఇదే విషయాన్ని మహిళలకూ చెబుతున్నా. ఇంట్లో కూరలు కోసే కత్తులతో వారి గొంతులు కోయండి’’ అంటూ ఆ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. రేప్ వ్యాఖ్యలు చేసిన రోజే తపస్ ఈ వ్యాఖ్యలు కూడా చేసినట్లు చానళ్లు పేర్కొన్నాయి. అంతకుముందు తపస్ పాల్ తన ‘రేప్’ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ చెప్పారు. తపస్ వ్యాఖ్యలపై కలత చెందిన పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఆయన్ను బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించడంతో పాల్ ఈ మేరకు పార్టీకి, మీడియాకు లేఖ రాశారు. ఎన్నికల ప్రచార వేడిలో చేసిన వ్యాఖ్యల ద్వారా బెంగాల్వాసులను, నియోజకవర్గ ప్రజలను, కుటుంబాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేశానన్నారు. ఇందుకుగానూ సమాజంలోని ప్రతిఒక్కరికీ ప్రత్యేకించి మహిళలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. కాగా, ఈ వివాదంపై భర్త తరఫున క్షమాపణ చెబుతున్నట్లు తపస్ భార్య అంతకుముందు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి.. సీపీఎం: తమ పార్టీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తపస్ పాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. మరోవైపు తపస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడంతోపాటు దీనిపై సీఎం మమత వివరణ ఇవ్వాలంటూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ బెంగాల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం వాకౌట్ చేశారు. తపస్ను అరెస్టు చేయాలంటూ బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం కోల్కతాలో తపస్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇంట్లోకి చొరబడితే నరికేయండి.. పేట్రేగిన మరో తృణమూల్ నేత తపస్ వ్యవహారం సద్దుమణగక ముందే మరో తృణమూల్ నేత సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోకి అపరిచితులు చొరబడితే నరికి చంపి బలి ఇవ్వాలంటూ బంకూరా జిల్లా తృణమూల్ చీఫ్ అరూప్ చక్రవర్తి పార్టీ కార్యకర్తలకు మంగళవారం సూచించారు. ‘‘మీ ఇంట్లోకి ఒకవేళ బయటి వ్యక్తులు చొరబడితే నరికి పారేయండి. బలివ్వండి. దీనిపై మీరు ఆందోళన చెందనక్కర్లేదు. ఆ సంగతి నేను చూసుకుంటా’’ అంటూ బంకూరాలో పేర్కొన్నారు. ఇంకేం చేయమంటారు.. చంపనా?: మమత తపస్ పాల్ అనుచిత వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఇందుకుగానూ ఆయన్ను పార్టీ మందలించిందని మంగళవారం కోల్కతాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పాల్ పంపిన క్షమాపణ లేఖ సరిపోదని...ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించిగా మమత మండిపడ్డారు. ‘‘నన్ను ఇంకేం చేయమంటారు..ఆయన్ను చంపమంటారా?’’ అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. -
కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డి దంపతులు గురువారం తిరుమల శ్రీవారికి కాలినడక మొక్కు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. ప్రస్తుతం శబరిమలై యాత్ర ముగించుకున్న వైవీ సుబ్బారెడ్డి తిరుమలేశునికి కాలినడక, తలనీలాల మొక్కులు చెల్లించేందుకు సతీసమేతంగా శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమల చేరుకున్నారు. ఆ తర్వాత అతిథిగృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, స్వర్ణలతారెడ్డి మూడు కత్తెర్లతో తలనీలాల మొక్కు చెల్లించారు. వీరు శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుంటారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఆయన శబరిమలై నడకతోపాటు తిరుమల కాలిబాటలో నిటారైన సుమారు 3 వేలకుపైగా మెట్లు ఎక్కి తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించి యాత్రను పరిపూర్ణం చేసుకోవడం గమనార్హం. -
'సభ్యుల ఆందోళనలతో 15వ లోక్సభ వృధా అయింది'
15వ లోక్సభలో సభ్యుల ఆందోళనలతో అత్యధిక సభా సమయం వృధా అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభకు ఎన్నికైన వారు సభలో హుందాగా ప్రవర్తించాలని ఆయన సభ్యులకు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు విశ్వాసం కోల్పోతే ఎవరు బాధ్యులంటూ ఆయన లోక్సభ సభ్యులను ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆందోళన చెందారు. ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం ఉంచేలా నడుచుకునే బాధ్యత పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులందరిపై ఉందని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. గురువారం ట్విట్టర్లో దిగ్విజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. 2009లో యూపీఏ -2 పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. దాంతో ఇటు స్వపక్షం, అటు విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అందులోభాగంగా లోక్సభ సభ్యులు సభలో ఆందోళనలకు దిగడం, నిరసనలు తెలపడం, సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్సభ సభ్యులు యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో ఆ ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ సస్పెన్షన్ సదురు ఎంపీలు స్వాగతించారు. అంతేకాకుండా బుధవారం లోక్సభ వెల్లోకి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు, కేంద్ర మంత్రులు వెల్లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సోనియా మాటలను కూడా బేఖాతర్ చేసి అందరు లోక్సభలో ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గురువారం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీంతో లోక్సభలో తమ నిరసనలు మరింత ఉదృతం చేసేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులు సమాయత్తమైయ్యారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. -
ఎంపీ మాగుంట కార్యాలయం ముట్టడి
ఒంగోలు కార్పొరేషన్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 156 శాఖల ఉద్యోగులు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయాన్ని ఉద్యోగులు గురువారం ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట కూర్చుని 48 గంటలపాటు ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించకుండా కాంగ్రెస్ అధిష్టానంపై ఎంపీ ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్బషీర్ మాట్లాడుతూ విభజన వల్ల వివిధ వర్గాలు, ప్రాంతాల ప్రజలకు వచ్చే కష్టనష్టాలపై ఎటువంటి చర్చ జరగకుండా టీ నోట్పై క్షణానికో ప్రకటన చేస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలను కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 వరకు రాష్ట్ర విభజన సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన వారికే భవిష్యత్తులో ఉద్యోగుల మద్దతు ఉంటుందని బషీర్ స్పష్టం చేశారు. ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 25 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సొమ్ము, శ్రమ ఉందని పేర్కొన్నారు. విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు ఒక్క చుక్క కూడా నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. 64 రోజులుగా ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో భాగమే ప్రత్యేక తెలంగాణ అంశమని శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగులు ఎంపీ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. భోజనాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాసర్ మస్తాన్వలి, రెవెన్యూ సంఘం నాయకుడు కేఎల్ నరసింహా రావు, శరత్బాబు, రాజ్యలక్ష్మి, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ సంఘం నాయకులు నాగేశ్వరరావు, వీరనారాయణ, రమణమూర్తి, అన్నపూర్ణమ్మ, విద్యాసాగర్రెడ్డి, గృహనిర్మాణశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, వైద్యుల సంఘ నాయకుడు డాక్టర్ ఎం.వెంకయ్య, వ్యవసాయశాఖ జేఏసీ నాయకులు కిషోర్, మున్సిపల్ జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్, శేఖర్బాబు, ప్రసాదరావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.