Mission Bhageeratha
-
సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా?
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే తప్ప గవర్నర్ నుంచి బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. శాసనసభ ఓకే చేసిన బిల్లుల విషయంలో మంత్రులు, సీఎస్ వెళ్లి వివరాలు తెలిపినా, సందేహాలను తీర్చినా కూడా.. గవర్నర్ ఏడు నెలలు ఉద్దేశపూర్వకంగా ఆపారని ఆరోపించారు. సోమవారం హరీశ్రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ట్రయల్ రన్ నిర్వహించారు. హరీశ్రావు ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే.. ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి, ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపామని చెబుతున్నారు. మా పిల్లలకు ప్రొఫెసర్ చదువులు చెప్పొద్దా? పిల్లల భవిష్యత్ కంటే రాజకీయాలు ముఖ్యమా?’’అని ప్రశ్నించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను పాస్ చేయకుండా గవర్నర్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథకు నిధులేవి? ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు ప్రోత్సహకాలు ఇవ్వకుండా కేంద్రం పక్షపాతం చూపిస్తోందని హరీశ్రావు ఆరోపించారు. మిషన్ భగీరథకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కనీసం 13 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ పథకాలు అద్భుతమని తీయటి మాటలు చెప్తారు, అవార్డులు కూడా ఇస్తారు. కానీ నయా పైసా నిధులు మాత్రం ఇవ్వరు’’అని విమర్శించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పథకం చేపట్టామని, మల్లన్నసాగర్ నుంచి ఆరు జిల్లాల్లో 10 నియోజకవర్గాల పరిధిలోని 1,922 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. భవిష్యత్లో హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిధులు ఇవ్వకుండా మోసం: ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు డబ్బులిస్తూ.. తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. -
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో చిక్కుకున్న పెయింటర్లు
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో ఐదుగురు పెయింటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో ముందుగా ఇద్దరు పెయింటర్లను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కూడా ఉండటంతో తీవ్రంగా శ్రమించి వారిని కూడా సురక్షితంగా పోలీసులు బయటకు తీశారు. ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన పెయిటర్లు స్పృహ కోల్పోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పెయిటర్లు శనివారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో పెయింటింగ్ వేయడానికి అందులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే వారు పెయింట్ వేస్తూ అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం -
‘భగీరథ’కు ‘మల్లన్న’ నీరు
గజ్వేల్: త్వరలో పూర్తి కానున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ సాగునీటికే కాదు మిషన్ భగీరథ ద్వారా అందించే తాగు నీటికి కూడా ఆధారం కానుంది. ఇక్కడి నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరాకు మల్లన్నసాగరే ప్రధాన వనరు కానుంది. ప్రస్తుతం ఆ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లే లైన్ నుంచి వాడుకుంటున్నారు. ఈ లైన్పై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మిస్తున్నారు. రూ.674 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు సాగుతున్నాయి. జంట నగరాల్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని ఎనిమిదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలోని ఘనపూర్ వద్ద నిర్మించిన డబ్ల్యూటీపీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రతినిత్యం ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతోంది. ఈ లైన్పై కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ఘనపూర్ డబ్ల్యూటీపీ వద్ద నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు పంపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నీటి సరఫరా అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్లో మిషన్ భగీరథ స్ఫూర్తికి అవరోధం ఏర్పడే అవకాశముంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని నిర్ణయించారు. పూర్తయితే స్వయం ప్రతిపత్తే.. ఇందుకోసం రూ.674 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి.. టెండర్ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగునీటి కొరత తీర్చబోతున్నది. అంతేకాకుండా ఇందులో ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో డబ్ల్యూటీపీ పనులు ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి నీటిని ఇందులో శుద్ధిచేసి ఆయా జిల్లాలకు సరఫరా చేస్తారు. పనులు పూర్తి కాగానే గతంలో హైదరాబాద్ లైన్పై ఉన్న ట్యాపింగ్లను మూసివేస్తారు. అందువల్ల హైదరాబాద్ లైన్పై ఎలాంటి అవరోధం లేకుండా నీరు పంపిణీ అవుతుంది. అలాగే సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి ఏర్పడనుంది. కొత్తగా చేపడుతున్న పనుల వల్ల ఆయా జిల్లాల్లోని సిద్దిపేట, జనగామ, పాలకుర్తి, ఘనపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ తదితర నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 మున్సిపాలిటీలకు కూడా మేలు జరగనుంది. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా.. సిద్దిపేటతో పాటు నాలుగ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం మల్లన్నసాగర్ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచి ఆయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. దీని ద్వారా హైదరాబాద్ లైన్పై ఎలాంటి భారం ఉండదు. అంతేకాకుండా ఈ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి రానుంది. ఇందుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
ఫ్లోరైడ్ విముక్త ప్రాంతమదిగో...
సూడుసూడు నల్లగొండ... గుండెమీద ఫ్లోరైడ్ బండ... బొక్కలు వొంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా... దు:ఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..? – కేసీఆర్ (2005లో 25 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల బృందంతో మర్రిగూడ, నాంపల్లి మండలాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుక్కెడు నీళ్లు కరువైన జీవితాలపై దుఃఖంతో కేసీఆర్ రాసిన పాట) ప్రతి మనిషికి మంచినీళ్లు ప్రాథమికహక్కు. గంగా, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహించే చోట నేటికీ మంచినీళ్లకోసం అల్లాడుతున్న ప్రజల జీవన ముఖచిత్రం నా దేశ చిత్రపటంగా కనిపిస్తుంది. ఈ దుస్థితికి గతకాలాన్నే నేరస్తునిగా నిలబెట్టాలా? ప్రజలకోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణంచేసిన గతకాలపు పాలకులదే ఆ నేరం అందామా? ప్రజలకు మాత్రం దోసిళ్లలోకి శుద్ధ మంచినీళ్లు రావాలన్నదే కోరిక. మంచినీళ్లు పొందటం కోసం అల్లాడిన జనాన్ని గతకాలం చూసింది. మంచినీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలతో మోసుకొచ్చిన మన తల్లుల బొప్పికట్టిన మాడలు చెబుతాయి. కన్నీళ్ల గోసను, మంచినీటి కోసం పడ్డ వెతలను చెబుతాయి. చెప్పుల్లేని కాళ్లతో కోసులకొద్ది దూరం నడిచిన ఆ తల్లుల పాదాలు కాయలు కాసిన కాళ్లు చారిత్రక సత్యాలను చెబుతాయి. ఈ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం మా ఉమ్మడి నల్లగొండ జిల్లా. మంచినీళ్లు దొరకని కరుడుకట్టిన ఫ్లోరైడ్ జిల్లాగా దేశంలోనే పేరుపడ్డది. ఫ్లోరైడ్ అత్యధికంగావున్న జిల్లాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాతోపాటు మా నల్లగొండ జిల్లాకూడా ఉంది. నీళ్లందని భూములు, గొంతుతడవని నాలుకలు మొత్తంగా మంచినీళ్లకోసం అల్లాడిన గోసకు సజీవ తార్కాణం నా నల్లగొండ పోరునేల. ఈ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని గతకాలపు నాయకులంతా ప్రపంచ మానవహక్కుల కోర్టుల్లో నిలబడాల్సిందే. ఈ దుస్థితి మారాలని కన్నీళ్లను నీళ్లుగా తాగే ప్రజలు మంచినీళ్ల సాక్షిగా ఎన్ని ఉద్యమాలు చేసినా, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి సంఘజీవులు ఎంతెంత దుఃఖించి ఉద్యమించినా, సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్పేయి ఫ్లోరోసిస్ బాధితుల్ని కళ్లారా చూసి కరిగిపోయిన నల్లగొండ జిల్లా నీటివెతలు తీరలేదు. ఒక్క నల్లగొండ జిల్లానే కాదు ఆనాటి తెలుగు సమాజంలో నీళ్లందని వూళ్లెన్నెన్నో ఉన్నాయి. ఇది తీరని గోసగా ఉంది. ఇది గుండెల్ని పిండిచేసిన దృశ్యాలు తెలంగాణలోని ఎన్నెన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. పేర్లెందుకు, కాలపట్టికలెందుకు గానీ నల్లగొండ జిల్లాలో కొన్ని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల పిల్లలకు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలంటే కూడా జంకిన స్థితి ఆనాటి కాలదుస్థితి. చెలిమల నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న తరాన్ని నా తెలంగాణ చూసింది. నా తెలంగాణ నీళ్లందని దప్పిక తీరని కోట్లమంది కన్నీళ్లవానగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏ దినపత్రిక చూసిన ఎక్కడో ఒకచోట కోసులకొద్ది నీళ్లకోసం నడిచిన తల్లుల పాదముద్రలే కనిపిస్తాయి. నల్లగొండ జిల్లాలో ఉద్యమకాలంలో కేసీఆర్ పల్లెయాత్రలు చేసుకుంటూ వూరూరా తిరుగుతున్నప్పుడు నీళ్లకోసం మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్, ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకుని కవితలల్లి పాటలురాసి పాడారు. అవును, నీళ్లందని వూళ్లు, మంచినీళ్లకోసం అరిచిఅరిచి ఉద్యమించి ఈ నేలపై నీళ్లధారల్ని ప్రవహింపజేసి ఇక్కడ గంగమ్మను పారించే భగీరథుని కోసం తెలంగాణ ఎదురుచూసింది నిజం. ఈ నేలపై నీళ్లను పారించే ఉద్యమ ఋష్యశృంగుని రాకకోసం నా తెలంగాణ కలవరించింది సత్యం. దీన్ని ఏ చరిత్రా కాదనలేనిది. కేసీఆర్ అటు ఉద్యమంలో గెలిచాడు. తెలం గాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు కేసీఆర్నే గెలిపిం చారు. ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇపుడు తమ ఇంటిలోకి వచ్చిన స్వచ్ఛ జలాలను తమ దోసిళ్లలోకి తీసుకుని చూసుకున్నప్పుడు ఆ గంగమ్మలో కేసీఆర్ ముఖచిత్రం కనిపిస్తుంది. నీడనిచ్చిన చెట్టును, నీళ్లనిచ్చిన మనిషిని ఈ నేల మరువదు. ఇది ఒక కవి వర్ణనకాదు. ఇది ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల ప్రజల వర్ణించలేని పరమానంద పరవశమే. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో మంచి నీటి ఆశల జల పుట్టింది. ‘‘తెలంగాణ రాకముందు 967 గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తరించి ఉంది. మిషన్ భగీర«థతో ఆ గ్రామాల్లో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ టీమ్కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందేశం చదివాక అమితానందం అనిపిం చింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవటం తెలంగాణ ప్రభుత్వం కృషికి నిదర్శనం. కార్యసాధకుడైన కేసీఆర్ 2015 మార్చి 17న శాసనసభలో మాట్లాడుతూ ‘‘వాటర్ గ్రిడ్ను నాలుగు సంవత్సరాలలో పూర్తిచేస్తాము. ప్రతి గుడిసెకు, ఇంటికి ట్యాప్ ఇస్తాము. నాలుగున్నర సంవత్సరాల గడువు తరువాత తెలంగాణలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని మా ధ్యేయం. నాలుగున్నర సంవత్సరాల నాటికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వకుంటే, రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఓట్లు అడగదు’’ అని ధైర్యంగా ప్రకటించడం జరిగింది అన్నట్లుగానే మిషన్ భగీరథను పూర్తిచేశారు. ఫ్లోరోసిస్ భూతం ఈ నేలను వదిలివెళ్లటంతో పాలబుగ్గల పసినవ్వుల పళ్లవరుసలు పారే తెల్లటి జలపాతంలాగా మెరిసిపోతున్నాయి. మనిషి శరీరానికి పట్టిన ఫ్లోరోసిస్ తొలగించగలిగారు. ఇంటిం టికీ వచ్చిన మంచినీళ్లు ఇపుడు వొంకర్లు కొంకర్లు తిరిగిన గ్రామాలకు ఆయురారోగ్యాలనిస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన సమాజానికి మంచి పునాది. ఈ నేలమీద ఎగిసిన ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలన్నింటికి ఇంటింటికీ వచ్చిన నల్లా నీళ్లతో విముక్తి లభించినట్లయ్యింది. ఇపుడు మా నల్లగొండ దేశ పీఠం మీద ఆరోగ్యకొండగా నిలుస్తుంది. తెలం గాణ పునర్నిర్మాణంలో ఇది ఒక భగీర«థమైన అడుగు. ఇదొక మంచిముందడుగు. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
ఖమ్మంలో తాగునీటి పథకాన్ని మూసేశారు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు రావడం.. పొగడటం.. బీజేపీ లక్ష్మణ్ స్కామ్ అని తిట్టడం... మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని’ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదని..పాలన దారి తప్పిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు. కాళేశ్వరం, సీతారాముల ప్రాజెక్టులు పనులపై కూడా సీబీఐ విచారణ జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
‘ఓర్వలేకే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట: ఆర్థికమాంద్యం, బడ్జెట్ లోటు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా బెదరకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ ప్టటణంలో ఆడపడుచులకు హరీశ్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జేసీ పద్మాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని 3,65,225 మంది ఆడపడుచులకు బతుకమ్మచీరల పంపిచేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి చీరలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. గ్రామాలలో మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథతో ఆడపడుచుల కనీళ్లు తుడిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి కేసీఆర్ కిట్, కళ్యాల లక్ష్మి, ఆసరా పెన్షన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని హరీష్ రావు మండి పడ్డారు. -
రాష్ట్రానికి 3 జాతీయ జల మిషన్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో జాతీయ పురస్కారం దక్కింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకు మిషన్ భగీరథకు జాతీయ జల మిషన్ అవార్డు ప్రకటించింది. దీంతోపాటే సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కు (టీఎస్డబ్ల్యూఐఆర్ఎస్), భూగర్భజలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవానికి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు రాష్ట్ర భూగర్భజల విభాగానికి అవార్డులు దక్కాయి. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. -
బంగారు తెలంగాణను నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చా రు. ఈ మేరకు ఆదివారం ఓ లేఖ విడుదల చేశా రు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమై న పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను తన సందేశంలో ప్రస్తావించారు. గవర్నర్ సందేశం ఆమె మాటల్లో.. ‘తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా..! గణేశ్ ఉత్సవాల తోపాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగు తున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతని స్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గం గాజమునా తెహజీబ్ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోంది. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు, వ్యవసాయానికి గోదావరి జలాల తరలింపు సాధ్యమవుతుంది. సముద్రంలో వృథాగా కలిసే 575 టీఎంసీ ల నీటిని అదనంగా పొలాలకు మళ్లించడంతోపాటు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలు, పాలన రంగాల్లో ఐటీ, సాంకేతికతను వినియోగిస్తున్న తీరు బాగుంది. చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయం. గతంలో రూ.52 వేల కోట్ల మేర ఉన్న ఐటీ ఎగుమతులను రూ.1.10 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం బలమైన పునాదులు పవిత్రమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడంతోపాటు రాష్ట్ర పునర్మిర్మాణం, పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ ఈ రోజు దేశం ముంగిట ఒక నమూనా రాష్ట్రంగా సగర్వంగా తలెత్తి నిలబడింది. అన్ని రకాలైన రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి.. దృఢమైన దేశాన్ని నిర్మించడంలో భాగంగా దృఢమైన రాష్ట్రంగా నా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. జైహింద్.. జై తెలంగాణ’అంటూ గవర్నర్ తన సందేశాన్ని ముగించారు. సంస్కరణలో ప్రభుత్వ చొరవ భేష్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 14.84 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని సాధించడం ద్వారా రాష్ట్ర సంపదలో ఎంతో వృద్ధి కనిపించింది. 2014లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సం పద ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్న ట్లు తెలిసింది. సుపరిపాలనలో భాగంగా అధికా ర వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వపాలన, సంక్షేమ ఫలాలను గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజల ముంగిటకు చేరేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ విధమైన సంస్కరణలు దోహదం చే స్తాయి. గ్రామాల అభివృద్ధిలో 30 రోజుల ప్రణాళిక అమలే గీటురాయిగా నిలువబోతున్నది. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ ఉత్పత్తి, రైతుబం ధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీర థ వంటి విశిష్ట కార్యక్రమాలు అమలవుతున్నా యి. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశం లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. -
మిషన్ భగీరథలో సగం ఖర్చు కేంద్రం భరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మిషన్ భగీరథ’కు అయ్యే ఖర్చు లో 50 శాతం భరించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో ‘జల్ జీవన్ మిషన్’పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. తెలంగాణ తరపున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జల్జీవన్ మిషన్పై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. భగీరథలో 50 శాతం నిధులను కేంద్రం భరించాలని మరోసారి కోరాం’అని వివరించారు. అనంతరం షెకావత్కు ఎర్రబెల్లి, టీఆర్ఎస్ ఎంపీలు నామా, బండ ప్రకాష్ వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఆసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దానిపై కసరత్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
డిసపాయింట్ చేస్తున్నందుకు సారీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిన్నటి కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది తెలంగాణ ‘రైతుబంధు’ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ యోజన’ ను తెచ్చింది.. ఇప్పుడేమో ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకొని.. ‘హర్ ఘర్ జల్ యోజన’ను తీసుకొస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మిషన్ భగీరథను బీజేపీ కాపీ చేసిందని కేటీఆర్ అంటున్నారని, కానీ, కేటీఆర్ గుజరాత్ సందర్శించి.. అక్కడి వాటర్ గ్రిడ్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. మిషన్ భగీరథను తీసుకొచ్చారని, కేసీఆర్ వీడియోలు యూట్యూబ్ డిలీట్ చేసినట్టు.. కేటీఆర్ గుజరాత్ పర్యటన ఫొటోలను గూగుల్ డిలీట్ చేసి ఉంటుందని ఆయన భావిస్తున్నారని, ఇది ఆయన అహంకారానికి చిహ్నమని సాగర్ అనే నెటిజన్ విమర్శలు చేశారు. ఈ విమర్శలను పట్టుకొని, బీజేపీ సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ ట్విటర్ కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘వాటర్ గ్రిడ్ సిస్టమ్ను అధ్యయనం చేసేందుకు మీరు గుజరాత్ సందర్శించిన విషయం వాస్తవం కాదా? వాటర్ గ్రిడ్ను, సబర్మతి నదిలోకి నీళ్లు ఎత్తిపోసే నర్మదా కాలువను మీరు ప్రశంసించలేదు? దాని ఆధారంగానే మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టలేదా? నిజాలను అంగీకరించండి’ అని పేర్కొన్నారు. పీవీఎస్ శర్మ ట్వీట్కు కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. ‘డియర్ శర్మ గారూ.. మిమ్మల్ని డిసపాయింట్ చేస్తున్నందుకు సారీ.. 1998లో (గుజరాత్కు 12 ఏళ్ల ముందు) సీఎం కేసీఆర్ సిద్దిపేటలో చేపట్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని మిషన్ భగీరథను రూపొందించాం. గుజరాత్ మోడల్ను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని ప్రధాని లేఖలో కోరితేనే.. ఆ రాష్ట్రాన్ని నేను సందర్శించాను’ అని బదులిచ్చారు. Dear Sarma Ji, Sorry to disappoint you but Mission Bhagiratha was inspired by a comprehensive drinking water project executed by our CM sir in Siddipet constituency in 1998 (12 years before Gujarat) Had visited Gujarat also as Hon'ble PM wrote to all states to study the model https://t.co/2owQZ4UH4w — KTR (@KTRTRS) July 6, 2019 -
‘ఈ ప్రాజెక్టులో కేంద్రం సగం ఖర్చును భరించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : మిషన్ భగీరథ ద్వారా వేసవికాలంలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ.. మంగళవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా- స్వచ్ఛ భారత్’ సదస్సును నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రం తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి చెప్పామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చుపెట్టిన కారణంగా అప్పు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగం ఖర్చును కేంద్రం భరించాలి లేదా పథకం నిర్వహణ ఖర్చునైనా భరించాలని కేంద్రానికి విన్నవించామని పేర్కొన్నారు. -
మిషన్ భగీరథకే శ్రీశైలం నిల్వలు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి మూడు టీఎంసీలు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ఇండెంట్పై తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్రావు కృష్ణాబోర్డుకు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ వాటా పోనూ మిగిలిన 4.60 టీఎంసీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు కావాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ వెంకటేశ్వరరావు బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. మిషన్ భగీరథకు నీరందదు.. ఈ ఏడాది మార్చిలో బోర్డు నీటి విడుదల ఉత్తర్వులిస్తూ తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయించిందని మురళీధర్రావు పేర్కొన్నారు. ఇందులో ఏపీ తన వాటాకు మించి నీటిని వాడుకోగా... తెలంగాణ ఇంకా 10.713 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని తెలిపారు. అయితే శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 805 అడుగుల నీటిమట్టం ఉందని, 1.582 టీఎంసీలు మాత్రమే ఉన్నందున ఈ నిల్వల్ని తెలంగాణ తాగునీటి అవసరాలకు నెలకు 0.50 టీఎంసీలు వాడుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీటిని కూడా సాగర్కు విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పైగా శ్రీశైలంలో రోజుకు వంద క్యూసెక్కుల చొప్పున ఆవిరవుతోందని అంచనా వేశారు. సాగర్లోనూ అదే విషమ పరిస్థితి నాగార్జునసాగర్లో ప్రస్తుతం 510 అడుగుల నీటి మట్టం ఉండగా.. 505 అడుగుల ఎగువన 10.383 టీఎంసీల నిల్వలు ఉన్నాయన్నారు. అయితే, రోజుకు సాగర్ జలాశయంలో 700 క్యూసెక్కుల చొప్పున నీరు ఆవిరి అవుతోందని, మే నెలలోనే ఈ నష్టం 1.50 టీఎంసీలుగా ఉంటుందన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి నీళ్లివ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. -
నీళ్ల యంత్రం.. పొదుపు మంత్రం
కమలాపూర్ (హుజూరాబాద్): వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన బీటెక్ విద్యార్థి మిట్టపెల్లి సందీప్ స్నేహితులతో కలసి వాటర్ మీటర్ను రూపొందించాడు. సందీప్ అనంతసాగర్లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. నీటి వృథాను అరికట్టడానికి స్నేహితులు శశిప్రీతమ్, శ్రీవిద్య, సాయితేజతో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ మీటర్ను రూపొందించి ఒక యాప్కు అనుసంధానం చేశారు. ఒక రోజు ఎన్ని నీళ్లు కావాలనేది ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే అన్ని నీళ్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థుల బృందం గతేడాది సెప్టెంబర్లో నిట్ వరంగల్లో జరిగిన సెమీ ఫైనల్స్లో వాటర్ మీటర్ను ప్రదర్శించి ఫైనల్స్కు చేరుకున్నారు. అక్టోబర్లో హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఫైనల్స్లోనూ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే ఈ ఏడాది మార్చి హైదరాబాద్లో జరిగిన టైగ్రాడ్ గ్లోబల్ ఈవెంట్లో సైతం పాల్గొని ఫైనల్స్కు చేరుకున్నారు. దీంతో టీఎస్ఐసీతో విద్యార్థుల బృందానికి సంబంధాలు పెరగడంతో పాటు ఎలవేటర్ పిచ్ వీడియోను ట్విట్టర్లో పెట్టారు. వీటన్నింటిని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రలో అప్లోడ్ చేసి వరంగల్ అర్బన్ కలెక్టర్తోపాటు కేటీఆర్, జేఎస్ రంజన్, జీహెచ్ఎంసీ అధికారులకు ట్యాగ్ చేశారు. స్టార్టప్ ఇండియా యాత్రను పూర్తిగా సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ వాటర్ మీటర్ను చూసి స్పందించి సందీప్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో రెండు, మూడు రోజుల పాటు డెమోకు రావాలని సందీప్ బృందాన్ని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆహ్వానించారు. కాగా ఈ వాటర్ మీటర్ను మిషన్ భగీరథకు పథకానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
అస్తవ్యస్తంగా పైప్లైన్..!
సాక్షి,నల్లగొండ : ఇంటింటికీ తాగునీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధి కారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో అ బాసుపాలవుతోంది. ఒకవైపు వేసవికాలం ప్రా రంభమై శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్న మిషన్ భగీరథ పైపులైన్లు, ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్న హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. అసంపూర్తి పైపులైన్లతో ఇబ్బందులు.. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు గ్రామాల్లో పైపులైన్ నిర్మాణాలు జరుగకపోవడంతో కృష్ణా జలాలలకు సంబంధించిన జీఎల్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న పైపులైన్లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మండలకేంద్రం నుంచి మండలంలోని శాలిలింగోటం, రామగిరి, అంబారిపేట, గురుజాల, తుడిమిడి, చిత్తలూరు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు వేసిన మెయిన్ పైపులైన్ను మండలకేంద్రంలోని బస్టాప్ వద్ద సుమారు 200 మీటర్ల మేర భూమిలో నుంచి వేయకుండా వదిలివేసి రోడ్డుపైనుంచే వేశారు. సుమారు సంవత్సర కాలంగా తాగునీటి మెయిన్ పైపులైన్ రోడ్డుమీదనుంచే ఉండటంతో పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెయిన్ పైపులైన్లలో ఏర్పడిన రంద్రాలు, లీకేజీలను సరిచేసి తాగునీటిని అందించాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
గడువులోగా ‘భగీరథ’ గగనమే
‘రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్ భగీరథ పథకం పనులు సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్ ద్వారా బెల్లంపల్లి పుర ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్ఎస్ఆర్, జీఎల్బీఆర్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా పైపులైన్ పనులు.. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు పైపులైన్ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పందించని అధికారులు.. మిషన్ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. -
జూన్ తర్వాత కార్యాచరణ
సాక్షి. హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జూన్ తర్వాత హామీలపై కార్యాచరణ ఉంటుందని ఆయన సోమవారం వెల్లడించారు. వరసగా వివిధ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. వివిధ చర్యలు చేపట్టే విషయంలో, అధికారిక ప్రకటనలు చేసే విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు. పీఆర్సీ, టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు జూన్ తర్వాత పరిష్కారం ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు సంబంధించి ఒక కటాఫ్ డేట్ నిర్ణయించాక అమలుచేస్తామని స్పష్టం చేశారు. మొత్తం దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో 42, 43% జీతాలు పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చురుకైన పాత్ర పోషించారని.. సమ్మెలో పాల్గొన్న రోజులను ఆన్డ్యూటీగా పరిగణించడంతో పాటు తెలంగాణ ఇన్సెంటివ్ అని ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. (కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా..) ఆచితూచి అప్పులు! ఎఫ్ఆర్బీఎం కింద 28% వరకు రుణాలు తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి, వెసులుబాటు ఉన్నా.. తాము 21.25% రుణాలు మాత్రమే తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాలు కూడా 26.27% వరకు అప్పులు తీసుకున్నాయని.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 29% అప్పులు తీసుకుందన్నారు. ఎఫ్ఆర్బీఎం కింద కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి రుణాలు తీసుకుంటే ఏదో తప్పు జరిగినట్టు, నిబంధనలు అతిక్రమించినట్టు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం సరికాదని కేసీఆర్ మండిపడ్డారు. ‘అప్పులు ఎట్లా తెస్తే మీకెందుకు? కార్పొరేషన్ల ద్వారా ఎందుకు ప్రభుత్వమే రుణాలు తీసుకోవచ్చుకదా అని విపక్షసభ్యులు అడుగుతున్నారు. అది ప్రభుత్వ వ్యూహం. దీనికి తోడు ప్రభుత్వం కూడా 30, 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్న విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు మరిచిపోతున్నారు. మేం ఎలాంటి కుట్రా చేయడం లేదు. భవిష్యత్ తరాలను బంగారం చేసేందుకే రుణాలు తీసుకుంటున్నాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికున్న రూ.1.25 లక్షల కోట్ల అప్పులు ఒక ఏడాది పండే పంట విలువకు సమానమని సీఎం చెప్పారు. సంప్రదాయ ఆలోచనస్థితి బద్ధలు కావాలని.. ఆ దిశలోనే మిషన్ భగీరథ, తదితర పథకాలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. (మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం) కందిళ్లు కనబడుతున్నాయా? కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు.. విపక్షాలు దీపం కందిళ్లు, ఎండిన వరి, మొక్కజొన్న కంకులు పట్టుకుని అసెంబ్లీలో ధర్నాలు చేయడం ఆనవాయితీగా ఉండేదని సీఎం అన్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కనిపించలేదన్నారు. ఇప్పుడు పచ్చజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలంటూ పనిగట్టుకుని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఈ పంటల ధరలు అంత హీనంగా ఏమీ లేదన్నారు. మరో ఏడాది వరకు మాత్రమే గిట్టుబాటుధరలు అంటూ ధర్నాలు చేసేందుకు అవకాశముందని. ఆ తర్వాత అది కూడా ఉండదన్నారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటివి ప్రధాన పంటలుగా ఉన్నాయన్నారు. పంట కాలనీలు నిర్ణయించి, రైతు సమన్వయ సమితుల ద్వారా చైతన్యం కలిగించి డిమాండ్ ఉన్న పంటలే పండించేలా చర్యలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. గిట్టుబాటుధరల కోసం రైతులు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా చూస్తామని సీఎం అన్నారు. (చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి) తాత కడితే మనవడు తాగాలా? జాతీయస్థాయిలో అందుబాటులోని నీటివనరుల నిర్వహణలో కాంగ్రెస్. బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎం విమర్శించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులోఉన్నా వాటిని సరిగ్గా వినియోగించుకోకపోతే అర్థం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా జలజగడాలు ఎదురైతే 2 దశాబ్దాలు గడిచినా ట్రిబ్యునళ్లు తీర్పునివ్వకపోవడం, సీడబ్ల్యూసీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడో తాత ప్రాజెక్టు కడితే మనవడు ఆ నీటిని తాగే పరిస్థితి ఎదురైతే ఎలాగని ›ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మొత్తం 1.350 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ట్రెంచింగ్పై అటవీ భూముల విషయంలో అటవీ అధికారులు ట్రెంచింగ్ల తవ్వకం నిలిపివేయాలని కాంగ్రెస్ నుంచి మంచి సూచన వచ్చిందని సీఎం అన్నారు. ప్రస్తుతానికి పోడుభూముల సమస్యపై స్పష్టత వచ్చే వరకు కందకాలు తవ్వడం నిలిపేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పోడు భూములే కాకుండా గిరిజన పట్టా భూముల చుట్టూ కూడా అటవీ అధికారులు కందకాలు తవ్వడంతో సమస్యలు వస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి ప్రస్తావించగా సీఎం పైవిధంగా స్పందించారు. కాగితాలపైనే ఇళ్లు స్టేషన్ ఘన్పూర్లోని ఒక గ్రామంలో 710 ఇళ్లు, వరికోలు అనే మరోగ్రామంలో 600 ఇళ్లు కట్టినట్టు కాగితాలపై ఉందని.. వాస్తవంగా వెళ్లి చూస్తే ఒక్క ఇంటిని కూడా కట్టలేదన్నారు. బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని పకడ్బందీగా అమలుచేస్తామన్నారు. గతంలో ఎవరెవరికి ఇచ్చారు. ఇప్పటికే ఎవరికి ఇళ్లున్నాయి. తదితర చర్యలు చేపడతామన్నారు. గ్రామ స్వరాజ్య సాధన దిశలో సర్పంచ్లపై తీవ్రమైన శిక్షలున్నాయని, అదే విధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా తమ విధులు, బాధ్యతలను కచ్చితంగా నిర్వహించేలా కొత్త చట్టంలోమార్పులు తెచ్చామన్నారు. కఠిన నిబంధనలు లేకపోతే ఫలితాలు రావన్నారు. పల్లెల్లో భగీరథ భారం ఉండదు మంచినీటి ఎద్దడి సమస్య ఏర్పడడం ఇకపై గత చరిత్రగా మారిపోతుందన్నారు. ప్రతీ హాబిటేషన్కు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరాచేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బాటిల్ నీటికి బదులు.. శుద్ధిచేసిన నీటిని వినియోగించాలనే అవగాహన పెరుగుతోందన్నారు. వచ్చే ఏప్రిల్ చివరకల్లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ.. తాగునీటిని సరఫరా చేసిన ఘనతను తమ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కలిపి మొత్తం 16వేల ఓవర్హెడ్ రిజర్వాయర్లు (ఓహెచ్ఆర్) కడితే.. తమ ప్రభుత్వం మరో 22 వేల ఓహెచ్ఆర్లు పూర్తిచేసిందని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ భారాన్ని గ్రామపంచాయతీలు. గ్రామాలపై వేయదలుచుకోలేదన్నారు. గ్రామాల్లోని ప్రతీ ఇంటిలో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున.. పట్టణాల్లో ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామన్నారు. గతంలోని ఆర్డబ్ల్యూఎస్కు మిషన్ భగీరథకు పొంతన లేదన్నారు. భవిష్యత్లో 24 గంటల పాటు నీటి సరఫరాకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నామన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ రెండూ ఒకే శాఖలో ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. గ్రామ, మండల, జిల్లా పరిషత్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా వివిధకార్యక్రమాలను సమగ్రంగా చేపట్టే చర్యలు చేపట్టనున్నట్టు సీఎం తెలియజేశారు. నిరక్షరాస్యత విషయంలో రాష్ట్రంపై ఒక నల్లని మచ్చ ఉందని. విద్యారంగంలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి. ఈ సమస్యను అధిగమించే చర్యలు తీసుకుంటామన్నారు. -
పగిలిన మిషన్ భగీరధ పైప్లైన్
-
భగీరథా’.. ఏమిటీ వృథా
తాడూరు: గంగమ్మ నింగికెగిసింది.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సమీపంలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్–కల్వకుర్తి ప్రధాన రహదారి వెంబడి మేడిపూర్ సమీపంలోని ఆదివారం సాయంత్రం భగీరథ పైప్లైన్కు లీకేజీ ఏర్పడటంతో నీరు పైకి ఎగజిమ్మింది. నీటి ఉధృతికి దాదాపు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న నీటిని చూసి కొంతమంది వాహనదారులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మేడిపూర్ వాసులు మిషన్ భగీరథ పర్యవేక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని ఎంగంపల్లి చౌరస్తాలోని గేట్వాల్వ్ వద్ద నీటిని నిలిపివేశారు. అయినా రెండు గంటల పాటు నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. -
పొలాలను ముంచిన మిషన్ భగీరథ
సాక్షి,చిగురుమామిడి: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊరచెరువు దగ్గర మిషన్భగీరథ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో కోతకు వచ్చిన పంట నీటితో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కోసే వరి నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్ర స్వామి, బింగి మల్లయ్య, బుర్ర శ్రీనివాస్లకు చెందిన పంటలు నీటమునిగాయని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇంకిపోయే వరకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన పైపులైన్ను మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
మహిళలకు నీటి కష్టాలు దూరం
కొడంగల్ (రంగారెడ్డి): మహిళల కన్నీటి కష్టాలను దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ శివారులోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను కొడంగల్కు రప్పించి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల కోట్లు, కొడంగల్కు రూ.267 కోట్లు ఖర్చుచేసి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలుచేయని విధంగా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లకుండా తమ ఇంట్లోనే ధీమాగా కుళాయి వద్ద నీళ్లను పట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 13న కొడంగల్ మురహరి ఫంక్షన్ హాల్లో రైతులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత రెండో విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 229 టీమ్లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మాజీ జెడ్పీటీసీలు ఏన్గుల భాస్కర్, కృష్ణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల రైతు సమాఖ్య అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, మధుయాదవ్, మోహన్రెడ్డి, ప్రహ్లాద్రావు, మహిపాల్ ఉన్నారు. -
పంద్రాగస్టుకు ఊళ్లకు.. దీపావళికి ఇళ్లకు..
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా దీపావళి(నవంబర్ 6) నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు భగీరథ నీటిని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంద్రాగస్టు నుంచే ఇంటింటికీ ‘భగీరథ’ద్వారా నీటి సరఫరా చేస్తామని గతంలో ప్రకటించినా.. పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని దీపావళికి మార్చారు. భగీరథ పనులపై మంగళవారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్ఎస్ఆర్, ఓహెచ్బీఆర్, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు అన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో భగీరథ వైస్ చైర్మన్, సెక్రటరీ, ఈఎన్సీ స్వయంగా పర్యటించాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం నేరుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జె.సంతోశ్ కుమార్ అధికారులు శాంత కుమారి, స్మితా సభర్వాల్, కృపాకర్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, మిషన్ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ యత్నమే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటింటికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా నీరు ఇస్తేనే ఓట్లడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15న అన్ని ప్రాంతాలకూ బల్క్వాటర్ ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేల కోట్లు వెచ్చిస్తున్నా.. పనుల నిర్వహణలో జాప్యం, లోపాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతర్గత పైపులైన్ల నిర్మాణం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి అందరికీ రక్షిత మంచినీరు అందించడం గగనమేనన్న చర్చ సాగుతోంది. నీటి కేటాయింపులు ఇలా.. కృష్ణా బేసిన్లో 15, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి భగీరథ కోసం పలు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్థాయిని కూడా ఖరారు చేశారు. 2018లో కృష్ణా బేసిన్లోని 15 రిజర్వాయర్ల నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి 32.58 టీఎంసీలు కేటాయించారు. 2048 నాటికి రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి 86.11 టీఎంసీల నీటి కేటాయింపులు ఖరారు చేశారు. ప్రాజెక్టు ప్రగతి ఇలా.. గజ్వేల్ సబ్సెగ్మెంట్ పనులను ప్రధాని నరేంద్రమోదీ 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. ప్రస్తుతం 7,229 గ్రామీణ ఆవాసాలు, 12 పట్టణ ప్రాంతాలకు బల్క్ వాటర్ అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ రికార్డు సష్టించింది. సూర్యాపేట సబ్సెగ్మెంట్లో 1,621 ఆవాసాలకు తాగునీటి సరఫరా మొదలైంది. ఆరు మండలాల పరిధిలోని 243 హ్యాబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా 1,595 ఆవాసాలకుగానూ 280లకు బల్క్వాటర్, 120లకు నల్లా నీరు ఇస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 3,411 ఆవాసాలకుగానూ 1,900లకు బల్క్వాటర్ సరఫరా చేసి 875లకు నల్లా నీరు అందిస్తున్నారు. ట్రయల్ రన్లో అపశ్రుతులు పైపులైన్ల నిర్మాణం పూర్తయి ట్రయల్ రన్ చేస్తున్న చోట్లా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పైపులైన్ల నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతలను పాటించకపోవడంతో ‘ట్రయల్రన్’దశలోనే ఎక్కడికక్కడ అవి పగిలిపోతున్నాయి. లీకేజీలు, పగుళ్లతో పైపులైన్ల నీరంతా పంటపొలాలు, ఇండ్లలోకి చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, వర్నిబోధన్ ప్రాంతాల్లో ట్రయల్ రన్లో భాగంగా పైపులైన్ల జాయింట్ ఉడి నీరు లీక్ అవుతోంది. అంతర్గత పైపులైన్లే అసలు సమస్య.. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో ఇంటింటికీ నల్లా కల్పించేందుకు రూ.338.62 కోట్లు మంజూరు చేశారు. 591 ఓవర్హెడ్ ట్యాంకులకు 225 నిర్మించారు. అంతర్గత పైపులైన్ల పొడవు 2,215 కి.మీ.లకు 819 కి.మీ.లే నిర్మించారు. 2,72,795 ఇండ్లకు నల్లాలు బిగించాల్సి ఉండగా 63,215 ఇండ్లకే బిగించారు. నిజామాబాద్ జిల్లాలో రూ.1,350 కోట్లతో 801 గ్రామాలకు ఉద్దేశించిన ఈ పథకంలో 1,884 కి.మీ. అంతర్గత పైపులైన్కుగానూ 1,350 కి.మీ. పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 576 ఉపరితల ట్యాంకులకు 202 పూర్తి కాగా, 2,97,218 నల్లా కనెక్షన్లకు 49,753 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు రూ.1,300 కోట్లు కేటాయించారు. 1,537 కి.మీ. అంతర్గత పైపులైన్కుగానూ 1,530 కి.మీ. పూర్తయ్యింది. 615 ఉపరితల ట్యాంకులకు 299 పూర్తి కాగా, 2,42,827 కనెక్షన్లకు 58,833 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.4,433 కోట్లతో 2016లో ఐదు దశల్లో పనులు చేపట్టారు. అధికారులు 70 శాతం పనులు పూర్తయినట్లు చెప్తున్నా.. 6,067 కి.మీ.కుగానూ 5,100 కి.మీ. పూర్తయినట్లు రికార్డులు చెప్తున్నాయి నగరాలు, పట్టణాల్లో మరీ దారుణం.. రాష్ట్రవ్యాప్తంగా 63 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్ కార్పొరేషన్తోపాటు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల పరిధిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నగర, పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 2033 నాటి జనాభాకు తగ్గట్లు రిజర్వాయర్లు, పైపులైన్లు వేసే పనులను 2017 మేలో ప్రారంభించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 60 శాతం పనులు కూడా దాటలేదు. మిషన్ భగీరథ ముఖ్యాంశాలివీ.. సెగ్మెంట్లు 26 నియోజకవర్గాలు 99 మండలాలు 437 కార్పొరేషన్లు/మున్సిపాల్టీలు/నగరపంచాయతీలు 63 అవాస ప్రాంతాలు 24,224 మొత్తం కవరయ్యే గృహాలు 65,29,770 గ్రామీణ ప్రాంతాల గృహాలు 52,47,225 పట్టణ ప్రాంత గృహాలు 12,82,545 పథకం కింద లబ్ధిదారులు 2.72 కోట్లు పథకం అంచనా వ్యయం రూ.43,791 కోట్లు పైపులైన్లతో ప్రాణభయం భగీరథ నీళ్లిచ్చుడేందో.. పైపులైన్లతో ప్రాణభయం పట్టుకుంది. నీళ్ల కోసం వేసిన పైపులైన్లు పగిలి ఇళ్లల్లోకి నీళ్లచ్చి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుస్తలేదు. రాత్రి పూట పైపులైన్ పగిలితే జల సమాధి అయితుంటిమి. – హరిసింగ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదు ఊర్ల నీళ్లు దిక్కు ల్లేవు. ఊరి బయట నీళ్లు ఇంటింటికీ వస్తాయన్న నమ్మకం లేదు. అడుగడుగునా పైపులైన్లు లీకవుతుండటంతో సింగూరు నుంచి శుద్ధజలాలు రావడం కష్టం. – సురేశ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా -
రెండేళ్లలో పుష్కలంగా సాగునీరు
మహబూబ్నగర్ రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకం అమలులో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ ద్వారా రాబోయే రెండేళ్లలో మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రస్తుతం కర్వెన రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి రిజర్వాయర్ నీటితో గ్రామాలలోని చెరువులను నింపుతామన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపూర్, కోటకదిర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సుమారు రూ.1.68 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ధర్మాపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనం, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, అదనపు తరగతి గదులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. కోటకదిర గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు అంగన్వాడీ భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నెల రోజుల్లో ఇంటింటికి శుద్ధ జలాలను అందిస్తామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇంటింటికి నల్లాల ద్వారా అందించేందుకు అవసరమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పనులన్ని నిర్ణీత సమయంలో కొనసాగడం వల్ల అనుకున్న సమయానికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం సొమ్ము పెంపుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరనప్పటికినీ తెలంగాణ ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉరకలేస్తుందని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, రైతుబంధు పథకం, రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యురాలు వై.శ్రీదేవి, వైస్ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, సర్పంచ్లు పసుల వసంత, మల్లు ప్రియాంక, ఎంపీటీసీలు నాగమణి, మల్లు దేవేందర్రెడ్డి, ఉప సర్పంచ్ టి.కురుమూర్తి, ఎంపీడీఓ మొగులప్ప, పీఆర్ ఏఈ శ్రీనివాస్గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, నాయకులు వై.శ్రీనివాసులు, వెంకటేష్యాదవ్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పసుల వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సమస్యలపై చర్చ పాలమూరు: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రోడ్డుపై బుధవారం హైదరాబాద్లోని లాల్మంజిల్ ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో జాతీయ రహదారుల సీఈ రవిప్రసాద్, ఎస్ఈ విజయ్కుమార్ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడు కలిశారు. అప్పన్నపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు పట్టణంలో వెళ్తున్న ప్రధాన రోడ్డు ఒక్కటే ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి ప్రధాన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరారు. -
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
పరిగి: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జాపర్పల్లిలో నిర్మించిన మెయిన్ గ్రిడ్ ట్రయల్ రన్ను ఆదివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాపర్పల్లి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ,1,100 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందని స్పష్టంచేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదని తెలిపారు. ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశ్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. మానవ హక్కుల సంఘం కృషి అభినందనీయం... తాండూరు: హక్కుల పరిరక్షణకు.. మానవ హక్కుల సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఫోరం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘం ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల సంఘాలు కాపాడతాయన్నారు. ప్రజలు సేవాభావాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంతర్జాతీయ పీస్ అంబాసిడర్ ఎం.ఎ.నజీబ్ మాట్లాడుతూ.. దేశంలో కులమతాలకతీతంగా మెలిగినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీత, అసోషియేషన్ చైర్మన్ ఎం.ఎ.ముజీబ్ పటేల్, హైకోర్టు న్యాయవాది కదర్ఉన్నీసా, వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు గులాం ముస్తఫా పటేల్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ జుబేర్లాల, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ముక్తర్ తదితరులు ఉన్నారు. -
మిషన్ భగీరథలో సాంకేతికత భేష్: ఆసిఫ్
సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మిషన్ భగీరథ పనులను సమర్థవంతంగా చేస్తున్నారని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ కార్యదర్శి ఆసిఫ్ కె.యూసుఫ్ అన్నారు. హైదరాబాద్లోని ఆర్డబ్ల్యూయస్ కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో గురువారం ఆయన సమావేశమయ్యారు. మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా పనుల పర్యవేక్షణను ఆసిఫ్ పరిశీలించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి çసరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వజల్ స్కీం పథకానికి మిషన్ భగీరథ తరహా పర్యవేక్షణ విధానాన్ని కేంద్రం అనుసరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథలో ఉపయోగిస్తున్న సాంకేతికతను తెలుసుకునేందుకు ఆయన హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఫొటోల రూపంలో అధి కారులు చూపించారు. డ్యాష్ బోర్డ్ సహాయంతో పనులను ఎలా పర్యవేక్షిస్తున్నది అధికారులను ఆసిఫ్ అడిగి తెలుసుకున్నారు. యాప్తో పైప్ లైన్ పనుల పురోగతిని తెలుసుకునే పద్ధతిని వివరించారు. -
ఆలస్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. పనుల జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టంచేశారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతోపాటు గ్రామాల్లో అంతర్గతంగా సరఫరా చేసే పనులను సమాంతరంగా చేయాలని చెప్పారు. కొన్నిచోట్ల ఓహెచ్ఎస్ఆర్(ట్యాంకుల) పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం కాలేదన్న నెపంతో గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం ఆపాల్సిన అవసరం లేదని, వాటి పనులను కొనసాగించాలని సూచించారు. పైపులు, నల్లాలు, ఇతర సామగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రేయింబవళ్లు కష్టపడుతూ, శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథలోనూ వేగం పెంచాలన్నారు. మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపీ బాల్క సుమన్, టీఎస్ఐఐడీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యతలో రాజీ వద్దు వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతిరోజు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేలా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నామని అసెంబ్లీలో మాటిచ్చినట్లు సీఎం ఈ సందర్భగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగంగా జరగాలన్నారు. ‘‘ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. మిగతా గ్రామాలకు ఆగస్టు చివరినాటికి పూర్తి కావాలి. అంతర్గత పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలి. అవసరమైతే టీంలను పెంచుకొని మూడు షిఫ్టులు పనిచేయాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి. మిషన్ భగీరథ తెలంగాణ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్దికాలం పాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు మొదటి నుంచీ దీనిపై శ్రద్ధ పెట్టాలి. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. పకడ్బందీగా పనులు చేయించాలి. విద్యుత్ సరఫరాలో జరిగే హెచ్చు తగ్గులను సమీక్షించేందుకు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలి’’అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ (ఎండీడీఎల్) నిర్వహించాలని, తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్ చేసిన తర్వాత సాగునీటికి విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. అగ్రిమెంట్లో పేర్కొన్న దాని కన్నా అదనంగా పడే జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. -
‘భగీరథ’పై శ్రద్ధ పెట్టండి
సిద్దిపేటటౌన్ : మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన తొలి జిల్లాగా సిద్దిపేటను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. బుధవారం మిషన్ భగీరథ పనుల పురోగతిపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద మిషన్ భగీరథ పైలాన్ను జూలై 15న ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. జూలై 10 లోపు జిల్లాలో మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంత్రి సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో పైప్లైన్లు లీకేజీ అవ్వకుండా వర్టికల్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా జరిగే మహిళా వీవోల సమావేశాలలో తాగునీరు, నల్లా బిగింపు తదితర చర్యలపై మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ప్రత్యేక ఎజెండా పెట్టి.. అవగాహన కల్పించాలని సూచించారు. నీటి వృథా చేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే విషయమై ఎంపీడీఓలకు సూచనలు చేశారు. ఈనెల 30వ తేదీన కలెక్టర్ సమక్షంలో మరోసారి మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికి పెండింగ్ పనుల నివేదికలతో రావాలని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులకు మంత్రి హరీశ్రావు సూచించారు. మున్సిపాలిటీపై సమీక్ష సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి సమీక్షిస్తూ.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలోని 7 వార్డులలో పూర్తిగా, మరో 4 వార్డులలో పాక్షికంగా జూలై ఆఖరు వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫలితాలు వస్తాయన్నారు. పట్టణంలోని చింతల్ చెరువు వద్ద చేపడుతున్న ఎస్టీపీ–సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో 90 కిలోమీటర్లకు 70 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పట్టణంలోని మొత్తం 324 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి గాను 94 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినట్టు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈఈ వీరప్రతాప్ మంత్రికి వివరించారు. -
స్కోచ్ అవార్డుల్లో తెలంగాణ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ అందజేసే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. రాష్ట్రంలోని పలు పురపాలక శాఖ, సంఘాలకు వివిధ విభాగాల్లో అవార్డుల పంట పండింది. రెండు రోజు శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు ఏకంగా 23 అవార్డులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, శక్తి పునరుత్పాదకత, వాణిజ్య పన్ను విభాగం, పురపాలక శాఖలకు మెరిట్ ఆప్ ఆర్ఢర్ అవార్డులు దక్కాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటి-6, జీహెచ్ఎంసీ-3, ఇతర విభాగాల్లో 6 దక్కించుకోగా, మరో 8 మంది గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ అవార్డులు అందుకున్నారు. -
తాగునీటి కోసం ‘భగీరథ’ యత్నం!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా రిజర్వాయర్లలో నీటి లభ్యతపై దృష్టి పెట్టింది. ప్రధానంగా కృష్ణా బేసిన్ పరిధిలో నీటి లభ్యత తక్కువగా ఉండి, అవసరాలు ఎక్కువగా ఉన్న ఎల్లూర్ రిజర్వాయర్కు నీటిని తరలించేదిశగా కసరత్తు చేస్తోంది. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందించే ఎల్లూర్ రిజర్వాయర్లో నీటి మట్టాలు అత్యంత కనిష్టానికి చేరాయి. మరోవైపు శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ మరింతగా నీటిని తోడేస్తుండటంతో మట్టాలు తగ్గిపోయి నీటిని ఎల్లూర్కు తరలించేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఎల్లూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన శ్రీశైలం ఫోర్షోర్లో క్రాస్బండ్ నిర్మించి, 25 మోటార్లు పెట్టి ఎల్లూర్కు నీటిని తరలించాలని నిర్ణయించింది. తగ్గిన మట్టాలు.. తప్పని తిప్పలు.. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని తాగు అవసరాల కోసం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీశైలం జలాలపై ఆధారపడ్డ ఎల్లూర్ రిజర్వాయర్ నుంచి ఏటా 7.12 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. అంటే ప్రతి నెలా 0.70 టీఎంసీలు అవసరం. ఈ లెక్కన ఆగస్టు వరకు 2.1 టీఎంసీలు కావాలి. కానీ ఎల్లూర్ రిజర్వాయర్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 0.3 టీఎంసీలే. శ్రీశైలం నుంచి కల్వకుర్తి పంపుల ద్వారా ఈ రిజర్వాయర్కు నీటిని తరలించే అవకాశముంది. కానీ అందుకోసం శ్రీశైలం రిజర్వాయర్లో 802 అడుగుల మేర కనీస నీటి మట్టం ఉండాలి. కానీ ఏపీ తన అవసరాల కోసం నీటిని వాడేసుకోవడంతో శ్రీశైలంలో మట్టం 799.70 అడుగులకు తగ్గిపోయింది. దీంతో కల్వకుర్తి పంపుహౌజ్కు 4 కిలోమీటర్ల దూరంలో నీటి లభ్యత ఉంది. దీంతో అక్కడి నుంచి నీటిని తీసుకోవాలని నీటిపారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు నిర్ణయించాయి. శ్రీశైలం ఫోర్షోర్లోని కోతిగుండ వద్ద 815 అడుగుల లెవెల్లో 200 మీటర్ల పొడవున క్రాస్బండ్ను నిర్మించాలని.. అక్కడ 100 హెచ్పీ సామర్థ్యమున్న 25 మోటార్లను పెట్టి కల్వకుర్తి పంపుహౌజ్ వద్దకు, పంపుహౌజ్ నుంచి ఎల్లూర్ రిజర్వాయర్కు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 155 మీటర్ల క్రాస్బండ్ నిర్మాణం పూర్తయింది. త్వరలో మోటార్లు పెట్టనున్నారు. మొత్తంగా ఆగస్టు వరకు మూడు నెలల పాటు ఇదే పద్ధతిన నీటిని తోడనున్నారు. దీనికోసం 6.5 కిలోమీటర్ల మేర 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. -
స్వయంపాలనతో స్వర్ణయుగం
2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్వన్గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన సాగిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అందరి మన్ననలు అందుకున్నారు. అందుకే ఇప్పుడు యావత్ భారతదేశం తెలంగాణవైపు చూస్తోంది. స్వయం పాలనతో స్వర్ణయుగం / ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో / ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో / శరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి ఓడెనో / కల నిజమాయెనని నేల తనను తడుముకున్నదో / వేరువడ్డ తెలంగాణ పేరు మోగగా / ఎగసిపారే గోదావరి మురిపెమంపెనో / తనువార నీళ్లనిస్తనని అభయమొసగెనో / అణువణువున తరుమడుల సిరులు దొర్లనున్నయో /పరుగూల రాణి కృష్ణవేణి దారి మళ్లగా / కరువన్నదింక నిఘంటువుల దాగనున్నదో / ఐదేండ్లలో అటుఇటై ఇడుములొచ్చినా / పదేండ్లలో జపానోలే ప్రగతి విరుయునో.... ఇదీ ప్రజాకవి గోరటి వెంకన్న స్వరాష్ట్రంలో స్వయం పాలనపై రాసిన పాట. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ ఓ కథ ఉంటుంది. కానీ కొన్నింటికి మాత్రమే చరిత్రలో స్థానం దక్కుతుంది. దశాబ్దాల తరబడి పరాయిపాలనలో మగ్గి, శాంతియుత ఉద్యమంతో స్వరాష్ట్రాన్ని సాధించుకుని, అద్భుతరీతిలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ కథ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగినది. సవాళ్లను ఎదుర్కొంటూ, అవాంతరాలను అధిగమిస్తూ ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్తున్న ఆయన పాలనలో తమమార్కు చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 2014 జూన్ 2. తెలంగాణ చరిత్రలో మైలు రాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోసపడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి... నేటి రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కాబోతోంది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలకు కొదవ లేదు. వాటి గురించి రాస్తే రామాయణం చెబితే భారతం. పాలకుల శీతకన్ను తెలంగాణకు శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడింది. రైతులు కూలీలయ్యారు. కూలీలు రోడ్డున పడ్డారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 6 దశాబ్దాల సమైక్య పాలనలో అభివృద్ధి అందనంత దూరంలో నిలిచిన తెలంగాణ నాలుగేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం విడిపోతే తెలం గాణ అంధకారమవుతుంది. నీళ్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించిన వారి నోళ్లు మూయించింది. చిమ్మ చీకట్లు అలముకున్న దుస్థితి నుంచి నాలుగేళ్లలో వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. విద్యుత్ లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. ఇప్పుడు కరెంటు కోతలు లేవు. పవర్ హాలిడేలను నిరసిస్తూ పారిశ్రామికవేత్తల ఆందోళనలు లేవు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. పరాయి పాలనలో బీడువారిన భూములకు కృష్ణా, గోదావరి నీళ్లు పారించేందుకు కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు. ఆ నదుల్లో తెలంగాణ వాటా 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం, ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్లో ఎస్సారెస్పీకి నీళ్లు తరలించే బృహత్తర కార్యక్రమంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో నదీజలాల పంపిణీ విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాలు– కేరళ, తమిళనాడు మధ్య ముళ్ల పెరియార్ డ్యాం వివాదాలే ఇందుకు ఉదాహరణ. అయితే గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చూపిన చొరవతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య చారిత్రక ఒప్పందం సాధ్యమైంది. ఈ మహా ఒప్పందం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. దేశంలో ఇతరులకు ఆదర్శం. నీటి పారుదల శాఖకు ప్రతి సంవత్సరం దాదాపు 25వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ తపనను ప్రపంచం గమనిస్తోంది. మిషన్ కాకతీయ పేరుతో 46 వేల చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యాన్ని నాలుగు దశల్లో అమలుచేస్తోంది. చెరువులకు జీవం పోసే ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ పథకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ప్రశంసించారు. వ్యవసాయం దండగ కాదు పండగలా మార్చాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ సర్కారు రైతు సంక్షేమమే థ్యేయంగా పనిచేస్తోంది. దాదాపు 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసింది. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును అందిస్తోంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తోంది. దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించింది. మద్దతు ధర కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా 12 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ పథకం ద్వారా 58 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో బృహత్తర పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకు 5 లక్షల రూ‘‘ల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పిం చారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి దేశం అబ్బురపడుతోంది. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే కాదు కిసాన్ చంద్రశేఖర్ రావు అని యావత్ దేశం కీర్తిస్తోంది. 42,300 కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచినీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావించిన సర్కారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించేందుకు సమాయత్తమైంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సమాజంలో 91 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు– కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, భూపంపిణీ, ఆసరా పెన్షన్లు, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి చట్టం, రిజర్వేషన్ల పెంపుకై అసెంబ్లీ తీర్మానం, హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు (125 అడుగులు), గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, నవీన క్షౌరశాలలు, చేనేతలకు చేయూత లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ పాడుకున్న జనం ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో భ్రూణహత్యలు తగ్గాయి. జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లలో కొత్తగా 577 రెసిడెన్షియల్ పాఠశాలు ప్రారంభించిన ఘనత కేసీఆర్ సొంతం. ఆనాడు ఒక విద్యార్థిపై సం‘‘నికి 20వేలు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున అధికార వికేంద్రీకరణ జరగాలని కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలన తీసుకుపోయింది. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సహకారంతో భూరికార్డుల ప్రక్షాళన సహా అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తోంది. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. శాంతి భద్రతలు, సులభతరమైన అనుమతులు, వాతావరణ పరిస్థితులు, అవినీతిరహిత పారదర్శక పాలన కారణంగా సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తుండటంతో పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. బడా కంపెనీలు సైతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ పెరగడంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో అనేక ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక కావడంలో అద్భుతమైన విజన్, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న మంత్రి కేటీఆర్ పాత్ర ప్రశంసనీయం. నాలుగేళ్ల పాలనలో అందరి మన్ననలు అందుకునే రీతిలో పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్. అందుకే దేశంలో నంబర్వన్ సీఎం ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది. ఉద్యమనేతగా.. రాజకీయవేత్తగా.. పలు అంశాలపై పట్టున్న మేధావిగా... సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడిగా కేసీఆర్ సేవలు అనన్యసామాన్యం. కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రానికి తొలి సీఎంగా ఎన్నికైన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన చేస్తున్న ప్రయత్నం అమూల్యం. దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధితో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్ అంతర్జాతీయ యువనికపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్వరాష్ట్రంలో స్వర్ణయుగానికి బాటలు పరుస్తున్నారు. నిజంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ విప్లవం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ విప్లవం అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశ స్వరూపమే మారిపోతుంది. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. బాల్క సుమన్, వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు, పెద్దపల్లి, (జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా) -
‘మిషన్ భగీరథలో రూ.50 కోట్ల అవినీతి’
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరాక నాగం జనార్దన్ రెడ్డి తొలిసారి గాంధీభవన్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిని, కేసీఆర్ నియంతృత్వాన్ని ప్రశ్నించడానికే తాను కాంగ్రెస్లో చేరానన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగేళ్ల కాలంలో పంటలకు గిట్టుబాటు ధర, కరువు మండలాలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని నాగం సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ హామీతో కేసీఆర్ చాలా ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతు బంధు సాయం కౌలు రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థను ప్రభుత్వం సరిగా చేయటంలేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో పాలు అందర్నీ సంప్రదించి జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడనుంచి పోటీ అనేది అధిష్టానం నిర్ణయం రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తోందని నాగం పేర్కొన్నారు. తన రాకను వ్యతిరేకించిన దామోదర్ రెడ్డిని కలిసి మాట్లాడానన్నారు. ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని దామోదర్ను కోరినట్లు నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు. -
అప్పుల కుప్పలా తెలంగాణ: భట్టి విక్రమార్క
సాక్షి, అసిఫాబాద్ : మిషన్ భగీరథ పథకం పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. ఆయన బుధవారం అసిఫాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీళ్లు అందించాలనే సంకల్పంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాగునీటి పథకాలకు భగీరథ అనే పేరు మార్చి నిర్వీరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కమీషన్ల కోసమే రీడిజైన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం ప్రాణహిత-చేళ్లతో పాటు, రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను మొదలు పెట్టి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేకుండా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోవడం ఖాయమని భట్టి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపాలని ప్రజలకు భట్టి పిలుపు ఇచ్చారు. -
ఇంటికొక ఉద్యోగం ఇచ్చేవరకు పోరు
హైదరాబాద్: ఇటు తెలంగాణ ప్రభుత్వం.. అటు ఏపీ ప్రభుత్వం.. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కి, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని నినాదం ఇచ్చిన చంద్రబాబు తనకు, తన కుమారుడికి ఉద్యోగం తెచ్చుకుని నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. అలాగే కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీ విస్మరించి జనం అడగని మిషన్ భగీరథ పేరుతో ఇంటికో నల్లా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు పోరాటం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎన్బీకే హాల్లో నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేశ్, గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అ«ధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వకుండా 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. -
మూడు వారాల్లో ఇంటింటికీ తాగునీరు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల) : మిషన్భగీరథ ద్వారా మూడు వారాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్రావు అన్నారు. మండలంలోని డబ్బా గ్రామంలో వాటర్గ్రిడ్ వద్ద పంప్హౌస్లో భారీ విద్యుత్ మోటర్లను ఆన్ చేసి గుట్టపైన ఉన్న 30 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంకుకు నీళ్లు ఎక్కించి గ్రామాలకు వెళ్లే పైప్లైన్లకు నీటిని విడుదల చేశారు. గ్రిడ్నుంచి ఎక్కడా ఎలాంటి అవంతరాలు లేకుండా గుట్టపైకి నీళ్లు చేరడంతో ట్రయిల్రన్ విజయవంతం అయినట్లు ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతు పంప్హౌస్ నుంచి 644 హెచ్పీ సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటార్లను నడిపిస్తూ డబ్బాగుట్ట ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తున్నామని, ఈ ట్యాంకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మక్కపేట వద్ద గల 4 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకుకు ఎక్కించి నిరంతరం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల గ్రామాలతోపాటు మెట్పల్లిలోని ఐదు గ్రామాలకు ఇక్కడనుంచి పైప్లైన్ల ద్వారా నీళ్లు వెళ్తాయని వివరించారు. మరో పైప్లైన్ ద్వారా కోరుట్ల, జగిత్యాల ధర్మపురి వరకు వెళ్తాయని తెలిపారు. ప్రస్తుతం పైప్లైన్ల ద్వారా నీటిని విడుదల చేశామని ఎక్కడైన లీకేజీ ఉన్నాయో సిబ్బంది పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణాలు పూర్తికాగనే వాటికి కనెక్షన్ ఇచ్చి నీటిని సరాఫరా చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఈఈ జ్ఞాన్కుమార్, డీఈ శేఖర్రెడ్డి, ఏఈ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు. -
ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా కేసీఆర్
అమ్రాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా, మేనమామగా కుటుంబ బాధ్యత మోస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 18మంది మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతు పెట్టుబడి తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎమ్మార్ఐ కృష్ణాజీ, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మాటలు నీటి మూటలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక కష్టాలు ఎదర్కొంటున్నారు. రబీలో వేసిన పంటలు ఒక ఎకరం కూడా ఎండనివ్వనని కేసీఆర్ చెప్పారు. కానీ ఆయన మాటలు నీటి మూటలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాలోల తీవ్ర కరువు పరిస్థితలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4 నుంచి 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు చేరాయి’ అని తెలిపారు. తెలంగాణని ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కరువు సహాయం కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే ఇప్పటివరకు అవి ప్రజలకు అందలేదని ఆరోపించారు. సన్న బియ్యంతో అన్నం పెడతామని చెబుతున్నారు, కానీ ప్రజల కడుపు కాలే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందించడంపై లేదన్నారు. తాగునీరులేక ఉత్తర తెలంగాణలోని గిరిజనులు వలస పోతున్నారని ఆయన తెలిపారు. కేవలం జనగామ జిల్లాలోనే 20 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని కిషన్రెడ్డి అన్నారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రైతులకు ఇచ్చే 4వేల రూపాయలను సర్వరోగ నివారిణి లాగా చెప్తున్నారని, ప్రభుత్వం పుండు ఒకటి ఉంటే మందు మరోటి వేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు, శాసనసభలో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని సర్కార్ తీరుపై మండిపడ్డారు. -
ఎవరి కోసం ఈ నాలుగు వేలు
నిర్మల్అర్బన్ : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4వేలు ప్రకటించిందని ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మిషన్ భగీరథ పనులు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారాయని, జిల్లాలో మిషన్ భగీరథ పనులు కమిషన్ భగీరథగా మారాయని విమర్శించారు. దిలావార్పూర్ మండలంలో చోటుచేసుకున్న పైప్లైన్ లీకేజీయే దీనికి నిదర్శనమన్నారు. ట్రయల్ రన్లో ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు బయటపడుతుండడంతో పనులు ఎలా చేపట్టారో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లోనూ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. మంత్రి కుటుంబీకులే పనులు చేపడుతుండటంతో అధికారులు నోరుమెదపడం లేదని ఆరోపించారు. మంత్రి వైఫల్యంతోనే నిర్మల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మిషన్ భగీరథ, రోడ్ల విస్తరణ పనుల్లో చోటుచేసుకున్న అవినీతి, నిర్మల్లో అల్లర్లకు మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అయిర నారాయణరెడ్డి, పోశెట్టి, రమణారెడ్డి, తదితరులున్నారు. -
మిషన్ లీకేజీ!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్రన్ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్వాల్వ్లు ఊడిపోతున్నాయి. మిషన్ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నిజాంసాగర్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్ౖ లెన్ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్రన్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్– సంగారెడ్డి, బోధన్– హైదరాబాద్, నిజాంసాగర్ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్లకు లీకేజీలు మిషన్ భగీరథ ట్రయల్రన్ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్ జాయింట్ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా మిషన్ భగీరథ నీటికి ట్రయల్రన్ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్వాల్ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్– హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్ కనెక్షన్ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్వాల్ ఆన్ఆఫ్ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘మిషన్’ పనుల్లో జాప్యం తగదు
సాక్షి, మైలార్దేవ్పల్లి : మిషన్ భగీరథ పనుల్లో జాప్యం తగదని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో రంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రఘునందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మహేందర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో అధికారులు అలసత్వం వహించరాదన్నారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన అధికారులు తమ ఇష్టానుసారం మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామనడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ముచర్ల ప్రాజెక్టుకు మార్చి 1 వరకు 70 ఎంఎల్డీ కెపాసిటీ గల ట్రీట్మెంట్ ప్లాంట్కు అందించేందుకు ప్రణాళికలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ముచర్ల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గాలకు నీరును అందించే ప్రయత్నం చేయాలన్నారు. మిషన్ భగీరథ పనులలో భాగంగా షాద్నగర్ ప్రాంతంలో భూసేకరణ చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకొని ముందుకు సాగాలన్నారు. మిషన్ భగీరథ పనులలో పైపులైన్ నిర్మాణాలలో ఎలాంటి ఆం దోళనలు జరగకుండా చూడాలన్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాష్గౌడ్, అంజయ్యయాదవ్, ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. మిషన్ భగీరథ పనులు చేపట్టిన పైపులైన్ నిర్మాణంతో పాటు జాయింట్ పనులను కూడా వెంటనే చేపట్టకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. లబ్ధిదారుడికి మేలుజాతి జీవాలను పంపిణీ చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యేలు పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రఘునందన్రావు మాట్లాడుతూ... రూ.1.11 లక్షల విలువ గల ఆరోగ్యకరమైన జీవాలను అందిస్తామని, గ్రామీణ ప్రాంతాలలో జీవాల పెంపకానికి అనుగుణంగా 4–5 ఎకరాలలో షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, నరేందర్రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ సమీక్ష అనంతరం బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్సిడీ రుణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి స్థానికంగా ఉన్న అన్ని జాతీయ బ్యాంకులు సకాలంలో రుణాలను అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు ఎల్డీఎం శాస్త్రీ, ఆర్బీఐ, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. -
తండ్లాట
సాక్షి, పెద్దపల్లి: ముత్తారం మండలం సీతంపేటలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బావులు ఎండిపోయాయి. ఫలితంగా గ్రామంలో తాగునీటి ఎద్దడి మొదలైంది. తప్పనిపరిస్థితుల్లో వ్యవసాయ బావులపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టమైనా కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. పారుపల్లి పంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లిలో నీటిసరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముత్తారం–కూనారం డబుల్ రోడ్ నిర్మాణ పనుల్లో పైప్లైన్ పగిలిపోవడంతో, నీటి సరఫరా నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలకు కొన్ని ఉదాహరణలివి. ఉన్న మంచినీటి పథకాల నిర్వహణలో లోపం, అంతా మిషన్ భగీరథపైనే ఆధారపడడం, తాత్కాలిక సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, షరామామూలుగానే అధికార యంత్రాంగం ముందుగా∙ మేల్కొనకపోవడం కారణంగా, వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే ప్రజానీకం తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటోంది. మార్చి మొదటివారంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లందిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మిషన్ భగీరథ పనుల్లో విపరీతమైన జాప్యం, అప్పుడే తాగునీటికి ఇబ్బందులు ఎదురవడంతో చూస్తుంటే, భవిష్యత్ జిల్లా ప్రజానీకాన్ని భయపెడుతోంది. అడుగంటిన జలాలు జిల్లాలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం తదితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీనితో తాగునీటి కోసం ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో తాగునీటి ప్రధాన పైప్లైన్లు పగిలిపోతున్నాయి. వాటిని సరిచేసే నాథుడే లేకపోవడంతో, సంబంధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి, రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో ట్యాంకులు నిర్మించినప్పటికీ తాగునీటి కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు. అంతర్గాం మండలం ముర్మూరు ఆర్అండ్ఆర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీ నిర్మించే సమయంలో పైపులైన్లు అమర్చినప్పటికీ ఆ తర్వాత ఇళ్లను చాలా ఎత్తులో నిర్మించడంతో ఆ పైపులు లోతుకు వెళ్లిపోయాయి. దీంతో కనెక్షన్లను ఇవ్వలేని స్థితి ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి నీళ్లను క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. రామగుండం పట్టణంలోని ఎస్టీ కాలనీకి మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఎన్టీసీపీ ఏరియాలోని ఇందిరమ్మకాలనీ, పీకే రామయ్య కాలనీల్లో ట్యాంకుల ద్వారా కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తోంది. అయినా అవి సరిపోకపోవడంతో చాలా మంది మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ మినరల్ వాటర్ప్లాంట్ వద్దకు వచ్చి క్యాన్లలో నీళ్లను తీసుకెళుతున్నారు. గోదావరిఖని మార్కండేయకాలనీలోని నగునూరి గడ్డ ప్రాంతానికి ఇప్పటికీ తాగునీటి వసతి లేకపోవడంతో సమీపంలో ఉన్న పైపులైన్ల వద్ద గల నల్లాల నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. భగీరథ జాప్యం ఇంటింటికి నల్లానీళ్లు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు జిల్లాలో ఆలస్యంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ పూర్తి చేయడానికి ఇంకా గడువు ఉన్నా.. ప్రధాన పైప్లైన్లు పూర్తిచేసి వచ్చే మార్చి మొదటి వారంలో గ్రామాలు, పట్టణాలకు బల్క్గా నీళ్లందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవసేన సైతం మార్చి మొదటి వారంలో నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పనుల ‘తీరు’ను పరిశీలిస్తే, మార్చి మొదటి వారంలో నీళ్లందించడం కష్టంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన పైప్లైన్ పూర్తికాలేదు. మరో 34 కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సి ఉంది. అలాగే ఇంట్రావిలేజ్ పనుల ప్రగతి చాలా దారుణంగా ఉంది. స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ కూడా గురువారం జరిగిన సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1664 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 292.84 కిలోమీటర్లు మాత్రమే వేశారు. అలాగే 292 ఓవర్ హెడ్ ట్యాంకులకు గాను, 195 ట్యాంక్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. రామగుండం, పెద్దపల్లి పట్టణాల్లో 180 కిలోమీటర్లకు గాను కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే పైప్లైన్ పూర్తయింది. మిషన్భగీరథ పనులు ఇలా ఉంటే, జిల్లాలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలైంది. రోడ్డెక్కుతున్న మహిళలు వేసవి కాలం మొదట్లోనే తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారు. నీళ్లు కావాలంటూ జిల్లాలో ఆందోళనలు సాగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ చోట భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి, మరో చోట పైప్లైన్లు పగిలిపోయి..కారణాలేవైనా మొత్తానికి నీళ్లకు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పరిస్థితి కనిపిస్తున్నా అధికారుల తీరులో మార్పు లేదు. వేసవికి ముందే మేల్కొనాల్సిన అధికారులు షరామామూలుగానే వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. గత వర్షాకాలం జిల్లాలో లోటు వర్షాపాతం నమోదు కావడం, ప్రస్తుతం భూగర్భజలాలు వేగంగా అడుగంటిపోతున్నా సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్థు చర్యలు లేవు. మిషన్ భగీరథ ద్వారానే నీళ్లు అందించేందుకు సిద్దమవుతున్నా, చాలా ప్రాంతాల్లో పైప్లైన్ వ్యవస్థ సరిగాలేదు. ట్యాంక్లు అందుబాటులో లేవు. సకాలంలో పనులుపూర్తవుతాయన్న నమ్మకమూ లేదు. ఇప్పటికప్పుడు ఎదురవుతున్న తాగునీటì ఎద్దడి నివారణకు ప్రత్యామ్నయ చర్యలు లేవు. తాగునీటి సరఫరా మెరుగు పరచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. నీటి ఎద్దడి నివారణకు చర్యలు నీటి ఎద్దడి నెలకొందన్న సమాచారం అందుకోవడంతోనే అక్కడ తాత్కాలికంగా చర్యలు తీసుకొంటున్నాం. గతంలో బావులు అద్దెకు తీసుకొని ట్రాకర్లు, పైప్ల ద్వారా నీటిని సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ గ్రిడ్ల నుంచే నీళ్లు పంపించాల్సి ఉంటుంది. మార్చి మొదటి వారం నాటికి నీళ్లు అందుతాయి. –తిరుపతిరావు, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ -
ముందు తాగుకు.. తర్వాతే సాగుకు!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు అవసరమయ్యే నీటిపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మార్చి రెండో వారం నుంచి భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ప్రాజెక్టు ల్లో అవసరమైన నీటి నిల్వలు ఉంచేలా చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టులో వర్షాలు కురిసే నాటికి కనిష్టంగా 35 టీఎంసీల నీటిని భగీరథ కోసం పక్కన పెడుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని 37 ప్రాజెక్టుల నుంచి భగీరథకు ఏటా 59.17 టీఎంసీలు తీసుకోవాలని ఇదివరకే నిర్ణయించారు. గోదావరి నుంచి 32.17, కృష్ణా బేసిన్ నుంచి 23.08 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళిక వేశారు. ఏప్రిల్ నుంచి సాగుకు బంద్ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క ఎస్సారెస్పీ కిందే 5.15 లక్షల ఎకరాలకు నీరందిస్తుండగా, నాగార్జున సాగర్ పరిధిలో 5 లక్షల ఎకరాల మేర నీరిస్తున్నారు. ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ సమీక్షించి భగీరథ అవసరాల దృష్ట్యా 4 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ కింద నీరివ్వాలని, మిగిలిన 6 టీఎంసీలు పక్కన పెట్టాలని సూచించారు. ఏప్రిల్ 16 నుంచి కాలువ మూసివేయాలని, మార్చి 20 నుంచి లోయర్ మానేరు డ్యామ్ కాల్వ మూసివేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఆగస్టు నాటికి 35 టీఎంసీల నిల్వ శ్రీశైలంలో 32 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. తెలంగాణ వాటా కింద 28 టీఎంసీల మేర దక్కే అవకాశముంది. సాగర్ ఆయకట్టు అవసరాలకే 16, భగీరథకు 12 టీఎంసీలు నిల్వ ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 5 నుంచి సాగర్ ఎడమ కాల్వ తూములను మూసివేయనున్నారు. పాలేరులో 4.70, వైరాలో 1.2, పెద్దదేవులపల్లిలో 0.12, ఉదయం సముద్రంలో 2.50, టెయిల్పాండ్లో 2 టీఎంసీల మేర నిల్వలుంచేలా అధికారులకు ఆదేశాలందాయి. ఆగస్టు నాటికి 35 టీఎంసీల మేర పక్కన పెట్టి సాగుకు నీరం దించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాగర్ లో భగీరథ, సాగు అవసరాలు పోగా హైదరాబాద్ తాగు అవసరాలకు మరో 15 టీఎంసీల మేర నీటి అవసరం ఏర్పడుతోంది. దీంతో హైదరాబాద్ అవసరాల కోసం సాగర్ కనీస మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే జల మండలికి సూచించింది. -
ప్రాజెక్టులు భేష్
సాక్షి,సిద్దిపేట/చిన్నకోడూరు/గజ్వేల్/కాళేశ్వరం (మంథని) రాష్ట్రంలో సాగు, తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా ప్రశంసించారు. దేశాభివృద్ధికి వ్యవసాయం కీలకమని, దీనికి ప్రాజెక్టులే మూలమని.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మిస్తోందని కితాబిచ్చారు. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ దేశమంతటికీ ఆదర్శనీయమని శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను ఆయన శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో కలసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ప్రాజెక్టుల వద్దకు చేరుకున్నారు. గజ్వేల్లోని కోమటిబండ గుట్టపై ఉన్న ‘భగీరథ’హెడ్ రెగ్యులరేటరీని, సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ను, ‘కాళేశ్వరం’లో భాగమైన అన్నారం బ్యారేజీని పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టుల వద్దే విలేకరులతో మాట్లాడారు. ఇది ఆరోగ్య ‘మిషన్’! ‘మిషన్ భగీరథ’పథకం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని అరవింద్ మెహతా ప్రశంసించారు. సురక్షిత నీరు అందితేనే ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. దీనిని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో రాబోయే ఐదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు కచ్చితంగా మెరుగవుతాయని చెప్పారు. 20 ఏళ్ల కింద కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి కావడం, తెలంగాణ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం బాగుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 98 శాతం నీటి సరఫరా గ్రావిటీ ద్వారానే జరుగుతుండడం ఆశ్చర్యకరమని, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారని కితాబిచ్చారు. సంతృప్తికరంగా ‘కాళేశ్వరం’పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అరవింద్ మెహతా పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు పనులు పురో గతి సాధించడం బాగుందని కితాబిచ్చారు. నాలుగైదు నెలల వ్యవధిలో 15వ ఆర్థిక సంఘం సభ్యులతో కలసి మళ్లీ రాష్ట్ర ప్రాజెక్టులను పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశానికే ఆదర్శం.. సాగు, తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ అభినందనీయమని, ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని అరవింద్ మెహతా ప్రశంసించారు. రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మంచి పథకాలను ప్రోత్సహించాలని ఆర్థిక సంఘం నిర్ణయిస్తే.. ఆ ప్రోత్సాహకాలన్నీ తెలంగాణకే దక్కుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి మంచి పనులకు 15వ ఆర్థిక సంఘం సహకారం ఉంటుందని.. మరిన్ని నిధులు కావాలంటే ప్రభుత్వం తరఫున మెమోరాండం అందించాలని సూచించారు. ఆర్థిక సహకారం అందించండి: ఎస్కే జోషి దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు రోల్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని.. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని అరవింద్ మెహతాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి విజ్ఞప్తి చేశారు. ప్రధాన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు 15 ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రతో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం జరిగిందని.. రాష్ట్రాలు తీసుకున్న అప్పులను ఏయే అభివృద్ధి పనులకు, ఎలా వెచ్చిస్తున్నది తెలుసుకోవడానికి అరవింద్ మెహతా పర్యటించారని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. -
మిషన్ భగీరథ అతిపెద్ద స్కాం: జీవన్రెడ్డి
-
మిషన్ భగీరథ అతిపెద్ద స్కాం: జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు మిషన్ భగీరథకు వెచ్చిస్తోందని, దీనివల్ల ఒక్కొక్కరిపై రూ.20 వేల భారం పడుతోందని అన్నారు. స్థానికంగా ఫిల్టర్లు, ఆక్వావాటర్, గృహాల్లో ఫిల్టర్లు, నీటి డబ్బాలను తాగునీటి కోసం ప్రజలు వాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వమందించే నీటిని రాబోయే రోజుల్లో బట్టలుతకడానికి, బాత్రూమ్, ఇంటి అవసరాలకు వాడుకుంటా రని చెప్పారు. మిషన్ భగీరథ నీటిని తాగడానికి వాడుకునే పరిస్థితులే ఉండవన్నారు. ఈ పథకం నీరు తాగడానికి ఉపయోగ పడకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పులభారాన్ని పెంచే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించకపోగా ఇప్పటికే ఉన్న నీటి సరఫరా వ్యవస్థ, గ్రామాల్లోని రోడ్లను ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల తో కుంటలు, చెరువులు నింపాలని, దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ ప్రచార ఆర్భాటం చేసి భగీరథ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులను ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదని జీవన్రెడ్డి ఆరోపించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వంపై, ఈ పథకంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
'పర్దాకే పీచే క్యా హై.. ప్రజలకు తెలియాలి'
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం పేరిట దేశంలోనే పెద్ద స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 'మిషన్ భగీరథ పర్దాకే పీచే క్యా హై.. ప్రజలకు తెలియాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. తాగునీరు పేరుతో తెలంగాణ ప్రభుత్వం రూ. 40వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. మిషన్ భగీరథ పైప్లైన్లు వేయడం కోసం గ్రామీణ రోడ్లను అడ్డుగోలుగా తవ్వేశారని మండిపడ్డారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండినప్పుడు ఇంకా భగీరథ పథకం అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. కమిషన్ల కోసమే ఆంధ్ర గుత్తేదారులకు భగీరథ పనులు అప్పగించారని అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల నిధులను మళ్లించి ఆ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. -
‘మిషన్’ స్లో
అశ్వాపురం : ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంతో ఆలస్యమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో గల 23 మండలాల్లోని 1826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2250 కోట్లతో మిషన్ భగీరథ పథకం పనులు చేపడుతున్నారు. అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఇన్టేక్ వెల్, అప్రోచ్బ్రిడ్జి, ఫిల్టర్బెడ్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సంప్, 900 కేఎల్, 3900 కేఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్లు, పైప్లైన్ పనులు చేస్తున్నారు. కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్టేక్వెల్, అప్రోచ్బ్రిడ్జి, ఫిల్టర్బెడ్, రథంగుట్ట వరకు పైప్లైన్ పనులు డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. కానీ జనవరి దాటినా ఇన్టేక్వెల్ పనులు పూర్తికాలేదు. ఇందులో 6 టర్బైన్లకు పంపింగ్ మోటార్లు, ప్యానల్బోర్డులు, ఎలక్ట్రానిక్ పనులు, అప్రోచ్ బ్రిడ్జి మీదుగా మిట్టగూడెం రథంగుట్ట వరకు ప్రధాన పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. రబీకి నీటి విడుదలతో... రబీ సీజన్ ప్రారంభం అవుతుండటంతో పాములపల్లి లిఫ్ట్ ద్వారా గోదావరి నీరు పొలాలకు వదులుతుండటంతో రథంగుట్ట వరకు ప్రధాన పైప్లైన్ పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో జరుగుతున్న అంతర్గత పైపులైన్లు, వాటర్ట్యాంక్ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. 752 వాటర్ట్యాంక్లకు ఇప్పటి వరకు సగం కూడా పూర్తి కాలేదు. ఈ పనులకు మార్చి వరకు గడువు ఉందని, ఆ లోపు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ట్రయల్ రన్కు సిద్ధం కాని పనులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రాధాన్యమైన దుమ్ముగూడెం ఇన్టేక్వెల్ పనులపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే పనులను పలుమార్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. అయినా పనుల్లో పురోగతి లేదు. కుమ్మరిగూడెం, మిట్టగూడెం రథంగుట్ట వద్ద జరుగుతున్న పనులను జనవరి 6న పరిశీలించిన వేముల ప్రశాంత్రెడ్డి, స్మితా సబర్వాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాప్యంపై అధికారులను మందలించారు. అంతేకాక అధికారులు, నిర్మాణ సంస్థతో మిట్టగూడెంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జనవరి నెలాఖరు నాటికి ఇన్టేక్వెల్ పనులు పూర్తి చేయాలని, టర్బైన్లకు మోటార్లు బిగించాలని, అప్రోచ్ బ్రిడ్జి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్లైన్ పనులు పూర్తి చేసి ట్రయల్రన్కు సిద్ధం చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని, కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. జనవరి 25 వరకు ఇన్టేక్ వెల్ పనులు పూర్తి చేస్తామని అధికారులు, నిర్మాణ సంస్థ చెప్పాయి. కానీ 25 రోజులు గడిచినా పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. ట్రయల్రన్కు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. అత్యంత ప్రాధాన్యంగా మిట్టగూడెం రథంగుట్ట కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్టేక్వెల్, రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రెండు రిజర్వాయర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇన్టేక్ వెల్ పూర్తయితే ఇక్కడి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్లైన్ ద్వారా గోదావరి నీటిని 900 కేఎల్, 3900 కేఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్లకు పంపిస్తారు. తద్వారా పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని 1826 గ్రామాలకు, మణుగూరు, పాల్వంచ , కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తాగునీరు అందించనున్నారు. 900 కేఎల్ రిజర్వాయర్ ద్వారా పినపాక నియోజకవర్గానికి, 3900 కేఎల్ రిజర్వాయర్ ద్వారా మిగిలిన నియోజకవర్గాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయనున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు తాగునీరు అందించేందుకు పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, వాజేడు, వెంకటాపురం మండలాలకు తాగునీరు అందించేందుకు పూసూరు వద్ద 9 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం పనులు వేగవంతం చేసి ఫిబ్రవరి నెలాఖరుకు మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం. ఇన్టేక్వెల్లో టర్బైన్లకు పంపింగ్, మోటార్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 10 నాటికి ఇన్టేక్వెల్లో మోటర్లు, ప్యానల్బోర్డులు అమర్చే ప్రక్రియ పూర్తి చేస్తాం. అప్రోచ్బ్రిడ్జి, ఫిల్టర్బెడ్, రథంగుట్ట వరకు ప్రధాన పైపులైన్ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి ట్రయల్రన్కు సిద్ధం చేస్తాం. – మహేందర్రెడ్డి, డీఈ, మిషన్ భగీరథ -
త్వరగా పూర్తి చేయకుంటే.. బ్లాక్లిస్టులో పెడతాం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకాన్ని త్వరగా ఎందుకు పూర్తి చేయడం లేదని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నిలదీశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు పనిచేయకుంటే బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. మార్చి 31 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సిందేనన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం సచివాలయంలో భగీరథ పనులు ఆశించనంత వేగంగా జరగని సూర్యాపేట, ఆదిలాబాద్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, జగన్మోహన్రెడ్డితో పాటు కాంట్రాక్టు సంస్థలు జీవీపీఆర్, మెగా ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భగీరథ పనులపై సమీక్షించిన ఆయన.. త్వరగా పనులు పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. భగీరథ పను లు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. -
నెలాఖరుకు ‘భగీరథ’ నీళ్లు
తిరుమలాయపాలెం: మిషన్ భగీరథ ద్వారా ఈ నెలాఖరుకు ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు ఆ పథకం వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మాదిరిపురం వద్ద శనివారం మిషన్ భగీరథ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ సురేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే సీఎం కేసీఆర్ ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని, ఈనెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి గ్రామాల్లోని ఓహెచ్ఆర్లకు నీటిని చేరవేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 21 మండలాలు, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి తాగునీరు అందించేందుకు రూ.1,700కోట్లతో భగీరథ పనులు చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు జాప్యం కావడంతో సీఎం ఆదేశాల మేరకు తాము పర్యటిస్తున్నామని చెప్పారు. కాగా.. ఇన్టేక్వెల్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు మోటార్ల బిగింపు, పైపులైన్ నిర్మాణాలు ఆలస్యం కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తే పనుల నుంచి తప్పుకోవాలని, అవసరమైతే తామే పనులు చేపడతామన్నారు. పనులు చేపట్టిన వివిధ శాఖల అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ఈ క్రమంలోనే సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ జోక్యం చేసుకుని పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు.. ఏ ప్రాంతంలో ఎంత మందితో పనులు చేయిస్తున్నారో సాయంత్రం నాటికి పూర్తి నివేదిక అందించాలని ఈఎన్సీ సురేందర్రెడ్డిని ఆదేశించారు. ఎన్ని సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తాగునీరు ఇవ్వకపోతే పోటీ చేయనని సీఎం కేసీఆర్ చెప్పిన రెండేళ్లలోనే పనులు వేగవంతం చేశారని అన్నారు. రూ.24వేల కోట్ల తో రాష్ట్రంలోని 24 వేల పైచిలుకు ఆవాసాలకు పరిశుద్ధమైన జలాలు అందించేందుకు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని.. గ్రామాల్లోని ఓహెచ్ఆర్లకు నీటిని తీసుకెళ్లే పనులు చివరి దశకు చేరాయన్నారు. కార్యక్రమంలో డోర్నకల్, వైరా ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, భానోతు మదన్లాల్, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్రెడ్డి, సీఈ నాగేశ్వర్, వరంగల్ సెగ్మెంట్ ఎస్ఈ కృష్ణయ్య, జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీడీఓ వెంకటపతిరాజు, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
4 వారాల్లో మిషన్ భగీరథ ట్రయల్రన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు వారాల్లో మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్లలో ట్రయల్రన్ ప్రారంభం కావాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పంపులు, మోటార్ ఎరక్షన్కు సుశిక్షితులైన నిపుణులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో పంపులు– మోటార్ల తయారీదారులు, మిషన్ భగీరథ వర్క్ ఏజెన్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పథకం కింద ఇప్పటిదాకా ఎన్ని పంపులు– మోటార్లు వచ్చాయనే అంశంపై ఆరా తీశారు. తెలంగాణలోని అన్ని ఆవాసాలకు రాబోయే రెండు నెలల్లో దశల వారీగా భగీరథ నీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పంపులు– మోటార్లను తమ యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా సరఫరా చేయాలని కోరారు. అవసరమైతే షిఫ్టులు, లేబర్ను పెంచి ఉత్పత్తి జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఈ ఎలక్ట్రో– మెకానికల్ పనుల్లో కీలకమైన హెచ్టీ ప్యానెల్ బోర్డులను త్వరగా అందించాలని కోరారు. ట్రీట్మెంట్ ప్లాంట్లలో పంపింగ్కు కావాల్సిన మిషనరీ వచ్చేలోపు, ఎరక్షన్కు కావాల్సిన క్రేన్లను సమకూర్చుకోవాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు. -
డిసెంబర్కు భగీరథ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు దశల వారీగా నీళ్లు అంది స్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన పంపులు, మోటార్లు త్వరలోనే వస్తున్నాయని, వాటిని బిగించేందుకు అన్ని పనులు పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించా మన్నారు. మిషన్ భగీరథ పనుల పురో గతిపై చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈ లతో బుధవారం ప్రశాంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురో గతిపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఇంటెక్వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పైప్లైన్ పనుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ సమా వేశంలో చీఫ్ ఇంజనీర్లు కృపాకర్రెడ్డి, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాగు తేలాకే సాగు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల కింద యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు సీఎం స్థాయిలో నిర్ణయం జరిగినా.. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, అనంతరం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలు తేలాకే ఆయకట్టు నీటిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలంటే 95 టీఎంసీల మేర అవసరం ఉండగా, లభ్యత జలాలు మాత్రం 56 టీఎంసీలే. ఇందులో 6 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టినా మిగతా నీటిని కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ల పరిధిలో ఎలా సర్దుబాటు చేస్తారన్నది పూర్తిస్థాయి సమీక్షల అనంతరమే తేల్చనున్నారు. 6.58 లక్షల ఎకరాలకు దాటని వైనం ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఆయకట్టుకు నీరందించేలా మూడు ప్రధాన కాల్వలను నిర్మించారు. కాకతీయ కాల్వ ఎల్ఎండీ ఎగువన 4,06,080 ఎకరాలు, కాకతీయ కాలువ ఎల్ఎండీ దిగువన 5,05,720 ఎకరాలు, లక్ష్మీ కాలువ కింద 21,870 ఎకరాలు, సరస్వతి కాలువ కింద 34,970 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులో కీలకమైన కాకతీయ కాల్వ ప్రవాహ సామర్థ్యం 8500 క్యూసెక్కులు. కానీ ఏనాడూ 3–4వేల క్యూసెక్కులకు మించి నీరు పారలేదు. దీంతో 2015–16 వరకు గడిచిన పదేళ్లలో సగటు ఆయకట్టు 6.58 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కాలువల అభివృద్ధి, మరమ్మతులు, లైనింగ్ సహా ఇతర పనులకు రూ.630 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా ఎల్ఎండీ ఎగువన కాల్వ ప్రవాహ సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు, దిగువన 5 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీ పరిధిలో గతేడాది ఖరీఫ్లో 4.97 లక్షలు, రబీలో 6.14 లక్షల ఎకరాల మేర పంటల సాగు జరిగింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. చెరువులు నింపేందుకు గరిష్టంగా 8 టీఎంసీల నీటిని, మిడ్మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గరిష్టంగా 95.. కనిష్టంగా 70 టీఎంసీలు ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీల నిల్వలకు గానూ 55.24 టీఎంసీల నిల్వలున్నాయి. 2 వేల క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండేందుకు మరో 35.07 టీఎంసీలు అవసరం. అయితే 9.68 లక్షల ఎకరాలకు నీరందించేందుకు గరిష్టంగా 95 టీఎంసీలు, కనిష్టంగా 70 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 54.96 టీఎంసీల్లో మిషన్ భగీరథ అవసరాలకు 6.5 టీఎంసీలు పోగా.. లభ్యతగా మరో 48 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. వాటితో 5 లక్షల ఎకరాలకు మించి సాగుకు ఇచ్చే అవకాశం ఉండదు. ఇందులో ఎల్ఎండీ ఎగువన ఎంత, దిగువన ఎంత అన్నది ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక సింగూరులో పూర్తిస్థాయిలో 29.5 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టినా, ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఘనపూర్ ఆయకట్టుకు కూడా 40 వేల ఎకరాలకు నీరివ్వవచ్చు. నిజాంసాగర్లో ప్రస్తుతం 17 టీఎంసీలకు గానూ 12.9 టీఎంసీల నిల్వలున్నాయి. దీని కింద ఆయకట్టు మాత్రం 2.3 లక్షల ఎకరాల మేర ఉంది. ప్రస్తుతం లభ్యత నీటితో 1.25 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఎంత నీటిని ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది పూర్తిస్థాయి సమీక్ష అనంతరం తేల్చనున్నారు. -
‘భగీరథ’ వివరాలు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సురేందర్ రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ నివేదికలను మాత్రమే ఇకపై ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. మరింత పారదర్శకత కోసమే భగీరథ పనులన్నింటినీ ఆన్లైన్ చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గుర్తించిన సంస్థల నుంచే ఎయిర్ వాల్వ్, ఫ్లో కంట్రోల్ వాల్వ్తో పాటు ఇతర పరికరాలు కొనుగోలు చేసేలా వర్క్ ఏజెన్సీలను పర్యవేక్షించాలన్నారు. డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీళ్లివ్వాలంటే ఇంతకు రెట్టింపు ఫలితాలను సాధించాలని ఆదేశించారు. -
తాగునీటి గండం గట్టెక్కినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు వస్తున్న ప్రవాహాలతో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో పూర్తిస్థాయి సాగు అవసరాలను తీర్చే అవకాశాలు లేకున్నా, తాగునీటి గండం నుంచి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అవసరాలకు పెద్దదిక్కుగా ఉన్న సాగర్లోకి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటం, ఎగువ శ్రీశైలానికి భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రాష్ట్రానికి ఉపశమనమిస్తోంది. మిషన్ భగీరథకు ఢోకాలేదు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, కడెం, సింగూరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు 727.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 438.9 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇందులో ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు దిగువన 168 టీఎంసీలు ఉండాల్సిందే. శ్రీశైలంలో ఏపీ వాటా మరో 100 టీఎంసీలు, ఆవిరి నష్టాలు మరో 20 టీఎంసీలను పక్కన పెట్టినా, గరిష్టంగా 150 టీఎంసీల రాష్ట్ర వాటా ఉన్నట్టే. ఇందులో ఇప్పటికే సాగు ప్రాజెక్టులకింద ఉన్న తాగునీటి కేటాయింపులు 40 నుంచి 50 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక మిషన్ భగీరథ కింద ఈ ఏడాది జనవరి నుంచి 60 టీఎంసీల అవసరాలు ఉండనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద వచ్చే జూలై వరకు మిషన్ భగీరథకు 16 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు మరో 16 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీల మేర అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్లో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 13 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అయితే ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలంలోకి 1.21లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 181 టీఎంసీలకు చేరింది. ఇక్కడ లభ్యతగా ఉన్న నీటిని అవసరానికి తగ్గట్టు ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ప్రవాహాలతో మరింత నిల్వలు పెరిగితే వాటా ప్రకారం సాగర్నుంచి గరిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల వాటా అయినా దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో వచ్చే ఏడాది వరకు తాగునీటి కష్టాలను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్ పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి, కడెంలు పూర్తి స్థాయి మట్టాలకు చేరుకున్నాయి. ఎస్సారెస్పీలో అనుకున్న మేర నీటి నిల్వలు చేరకున్నా, ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 37.38 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలకు ఢోకాలేదు. ఒక్క నిజాంసాగర్ ప్రాజెక్టు కింది తాగునీటి అవసరాలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సింగూరుకు మరిన్ని ప్రవాహాలు కొనసాగితే, అక్కడి నుంచి నిజాంసాగర్కు నీటి విడుదల జరిగే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇక్కడి అవసరాలు సైతం తీరుతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఎట్టకేలకు పట్నంలో భగీరథ !
- 24 పట్టణాల్లో రూ.548 కోట్లతో పనులు - ఆన్యూటీ పద్ధతిలో పనులు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ - త్వరలో మరో 19 నగర పంచాయతీల్లో కూడా.. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఇంటింటికి రక్షిత నీటి సరఫరా పనుల కోసం యాన్యూటీ ( Annuity) పద్ధతిలో రూ.548 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. యాన్యూటీ విధానంలో తొలిసారి నిర్వహించిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం పలు సడలింపులతో రెండో సారి టెండర్లు నిర్వహించగా, మెగా ఇంజనీరింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థలు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ప్రాజెక్టు పనులు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసేందుకు సదరు కంపెనీతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పాల్వంచ, సత్తుపల్లి, ఎల్లెందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగాం, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ రూ.548 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఏడేళ్ల కాల వ్యవధిలో ఈ సంస్థకు ప్రభుత్వం వడ్డీతో సహా రూ.1,100 కోట్ల బిల్లులను తిరిగి చెల్లించనుంది. ఏడేళ్ల పాటు ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను నిర్మాణ సంస్థే పర్యవేక్షించనుంది. ఏడేళ్ల గడువు ముగిసిన తర్వాత ప్రాజెక్టులను ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. మరో 19 నగర పంచాయతీల్లో.. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని మరో 19 నగర పంచాయ తీల్లో నీటి సరఫరా పథకాల నిర్మాణం కోసం త్వరలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లను ఆహ్వానించనుంది. గత నాలుగేళ్ల కాలంలో గ్రామ పంచా యతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్గ్రేడ్ అయిన ఈ పురపాలికల్లో తాగునీటి సరఫరా పథకాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగర పంచాయతీలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు దాదాపు రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ఆన్యూటీ విధానంలోనే టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఆహ్వానిస్తామని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పనులను సైతం 18 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
మిషన్ భగీరథపై ప్రధాని ఆసక్తి
బ్యాంకర్లతో భేటీలో సీఎస్ ఎస్పీ సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం మోడల్గా పరిగణిస్తోందని, భగీరథ పనుల పురోగతిని ప్రధాని మోదీ వాకబు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యే రోజుకోసం కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి గ్రామాల్లో అంతర్గత పైప్లైన్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రాజెక్ట్లో కీలకమైన ఇంట్రావిలేజ్ పను లకు రుణసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భగీరథ అధ్యయనానికి ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వస్తున్నాయని, ప్రాజెక్టు సాధించిన ఈ ఘనతలో బ్యాంకర్లదే ప్రధాన పాత్ర అన్నారు. -
మిషన్భగీరథ భేష్
మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబూరావు లోనికర్ మండలంలో వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన మంత్రి మునిపల్లి: మహారాష్ట్రలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని పనులు చేపడతామని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబూరావు లోనికర్ అన్నారు. ఆదివారం బుస్సారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రితో పాటు అక్కడి చీఫ్ ఇంజనీర్లు పరిశీలించారు. మిషన్ భగీరథ పథకానికి తెలంగాణ ఇంజనీర్లు ఏ విధంగా రూపకల్పన చేశారో పూర్తి వివరాలను అడిగి తెలుసున్నారు. డిజైన్, పైపులైన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకెళ్తున్నారో స్వయంగా మ్యాపులను పరిశీలించారు. బుస్సారెడ్డిపల్లిలో మిషన్ భగీరథకు సంబంధించి ఏర్పాటు చేసిన మ్యాప్లను క్షుణ్ణంగా పరిశిలించారు. అనంతరం బుదేరా శివారు గుట్టపై ఏర్పాటు చేస్తున్న వాటర్ సప్లయి పంపులను పరిశీలించారు. గుట్టపై నూతనంగా నిర్మించిన దేవాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్రలో కూడా మిషన్ భగీరథ పథకం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించిన తర్వాత తప్పకుండా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటానమన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాబూరావు లోనికర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో గత ఏడు సంవత్సరాలుగా అక్కడి ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుమారు 600 గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టిందో స్వయంగా పరిశీలించామన్నారు. మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మకంగా నిలుస్తుందని కొనియాడారు. సాగు, తాగునీటి సౌక్యర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు బాగున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే మహారాష్ట్రలో కూడా మిషన్ భగీరథ పథకం ప్రారంభిస్తామన్నారు. మహారాష్ట్ర సీఎం దృష్టికి మిషన్ భగీరథ పథకం వివరాలను తెలియజేసి అక్కడ కూడా ఈ పథకం ప్రవేశ పెడతామన్నారు. ప్రస్తుతం 8 జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు. ముందు అక్కడ మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తామన్నారు. మహారాష్ట్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపి అందరికి అమోదయోగ్యంగా ఉండేవిధంగా చూస్తామన్నారు. మొదటి విడతగా రూ.15 వేల కోట్లతో మహారాష్ట్రలో మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తామన్నారు. -
రెండో పంట మన హక్కు
‘గోదావరి’తో కల నెరవేర్చుకుందాం భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన్: ‘60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. దీంతో రాష్ర్టం కరువుతో అల్లాడింది. గోదావరి జలాలను తరలించి మెతుకుసీమ కరువును శాశ్వతంగా పారతోలుదాం. ప్రస్తుత కరువులో వెయ్యి టీఎంసీల నీరు వృదాగా సముద్రంలో కలుస్తుంది. అలాంటి గోదావరి జలాలను ప్రాజెక్ట్ల ద్వారా రైతు ముంగిట్లోకి తీసుకోచ్చి రెండో పంట పండించే హక్కును సాధించుకుందా’మని రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మాటిండ్ల మదిర శేఖర్రావుపేటలో మిషన్ భగీరథ కింద తాగునీటి నల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రెండు పంటలు పండే పరిస్థితి మెదక్ జిల్లాలో రానుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం రైతులకు 12 గంటల విద్యుత్ను అందిస్తున్నప్పటికి ప్రకృతి సహకరించకపోవడంతో భూగర్భజలాలు అడుగంటయన్నారు. గోదావరి జలాలతో కరువ సమస్యకు పరిష్కారం దొరకనుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ర్ట ప్రభుత్వం ముందకుసాగుతుందన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. దసరా నాటికి మండలంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నీటిని అందిస్తామన్నారు. -
గజ్వేల్లో సుదర్శనయాగం
పాల్గొన్న భగీరథ పథకం వైస్ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ దంపతులు గజ్వేల్ రూరల్: మిషన్ భగీరథ పథకం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం గజ్వేల్ పట్టణంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సుదర్శన యాగాన్ని నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మణ్ గార్డెన్స్లో ఉదయం 8నుంచి 10:30 వరకు సుమారు రెండున్నర గంటలపాటు ఐదుగురు రుత్వికులు యాగాన్ని నిర్వహించారు.మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి దంపతులు ప్రారంభం నుంచి పాల్గొనగా పూర్ణాహుతికి ముందు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ‘మిషన్ భగీరథ’ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ ఆడబిడ్డ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డెక్క కూడదనే ఉద్దేశంతో చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టు పనులు గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తయి ఇంటింటికి నీళ్లు రానున్న నేపథ్యంలో అంతా శుభం జరగాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడాలని నాడు సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించినట్టుగానే, ఇప్పుడు అంతా శుభం జరగాలనే కాంక్షతో సుదర్శనయాగం చేపట్టడం జరిగిందన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ యాగానికి రాలేకపోయారని తెలిపారు. ఈ యాగ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్లకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ దంపతులతోపాటు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, వాటర్గ్రిడ్ ఈఈ రాజయ్య, నగర పంచాయతీ వైస్ చైర్మన్ దుంబాల అరుణ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ అంటే సంతోషాన్ని ఇచ్చేవారు
-
నేడు కోమటిబండకు మోదీ
-
'కేసీఆర్ ఒక్క గజ్వేల్కే ముఖ్యమంత్రా?'
హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించే పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ సుజల స్రవంతి పేరు మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరామని పొన్నం తెలిపారు. -
నేడు కోమటిబండకు మోదీ
‘మిషన్ భగీరథ’కు వేదికైన కోమటిబండ పంప్హౌస్ను ప్రారంభించనున్న ప్రధాని 243 గ్రామాలకు ఏకకాలంలో నీటి సరఫరా సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి అంతటా ఒకటే ఉత్కంఠ.. అందరిలోనూ ఆసక్తి.. పల్లె గొంతు తడిపే బృహత్తర ‘మిషన్భగీరథ’ స్వప్నం సాకారమయ్యే క్షణాలు సమీపించిన వేళ అందరి చూపూ గజ్వేల్ మండలంలోని కోమటిబండ వైపే.. గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడిన మహిళలు.. నేటి నుంచి ఇంటి చెంతనే గోదావరి నీటిని ఒడిసి పట్టుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ప్రధాని నరేంద్రమోది ఆదివారం ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంబంధించి సర్వం సిద్ధమైంది. గజ్వేల్: గజ్వేల్ మండలం కోమటిబండలో మోడీ సభకు సర్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలో చర్చనీయంశమయ్యేవిధంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ప్రధాని తొలి పర్యటన కావడం ఈ సభకు మరో విశేషం. 1998లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’గా పరిచయం చేస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి పథకానికి ఈ సభ వేదికవుతోంది. ప్రధాని పంప్హౌస్ను ప్రారంభించడంతో ఏకకాలంలో నియోజకవర్గంలోని 243 గ్రామాలకు నీటి సరఫరా జరగనుండడంతో... మహిళల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆదివారం నాటి సభపై అంతటా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం నియోజకవర్గంలోని 243 గ్రామాల్లో 67275 నల్లా కనెక్షన్లను దాదాపు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలంలోని 27 ఆవాసాల్లోని 38931 జనాభాకు, జగదేవ్పూర్ మండలంలోని 42 ఆవాసాల్లోని 47073 జనాభాకు, కొండపాక మండలంలోని 38 ఆవాసాల్లోని 46766 జనాభాకు, ములుగు మండలంలోని 42 ఆవాసాల్లోని 39821 జనాభాకు, తూప్రా¯ŒS మండలంలోని 53 ఆవాసాల్లోని 47287 జనాభాకు, వర్గల్ మండలంలోని 46 ఆవాసాల్లోని 43278 జనాభాకు నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిగాయి. దశాబ్ధాలుగా మంచినీటి కష్టాలతో తల్లడిల్లుతున్న జనం ఈ పథకంతో శాశ్వత పరిష్కారాన్ని పొందగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం మైలారం, నెంటూరు,, జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్, అంగడి కిష్టాపూర్ గ్రామాల్లో మహిళలను ‘సాక్షి పలుకరించగా ఏండ్ల సంది మంచినీటికి అరిగోస పడుతున్నం... కేసీఆర్ సారూ పుణ్యమా అని... ఇక మంచినీటి గోస పోతుంది అంటూ మురిసిపోయారు. ఈ మంచి పథకాన్ని ప్రారంభించేం దుకు ఢిల్లీకెళ్ళి మోడీ సాబు వస్తుండట.. మేమ్ కూడా సభకు పోతున్నం... ఆడ చెప్పిన ముచ్చ ట్లు ఇంటం.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తరలింపునకు ఏర్పాట్లు సభకు 2 లక్షల మందికిపైగా జనాన్ని తరలించడానికి ఇప్పటికే ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 4500 ఆర్టీసీ బస్సుల్లో జనం తరలివస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిబండ గుట్టపై హెడ్వర్కŠస్ ప్రాంతాన్ని ఎస్పీజీ బృందం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడికి ప్రధాని వచ్చే సందర్భంలో మీడియాకు కూడా ప్రవేశం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రధా ని హెలికాప్టర్లో కోమటిబండ సభాస్థలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత కేసీఆర్తో కలిసి కాన్వాయ్లో కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిష¯ŒS భగీరథ’ హెడ్వర్కŠస్పై పైలా¯ŒSను ఆవిష్కరిస్తారు. అలాగే, పంప్హౌస్, నల్లా నీటిని ప్రారంభిస్తారు. ఇదే ప్రదేశంలో తెలంగాణలోని ‘మిష¯ŒS భగీరథ’ 26 గ్రిడ్ల డిజై¯ŒSను సూచిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. ‘మిషన్ భగీరథ’పై వీడియో ప్రదర్శన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రధాని సభావేదిక వెనుక భాగంలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి, రామగుండం ఎరువులు కర్మాగారం పునఃరుద్ధరణ, వరంగల్ కాళోజి హెల్త్ అండ్ సైన్ యూనివర్సిటీ శిలాఫలకాల ఆవిష్కరణ, 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్స్టేన్ జాతికి అంకితం చేస్తారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలై¯ŒSకు శంకుస్థాపన చేస్తారు. వేదికపై పది మందే.. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం కేసీఆర్, గవర్నర్ నర్సింహ¯ŒSతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు, మరో 10 మంది మాత్రమే వేదికపై ఉంటారు. కుడివైపున ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేసే అవకాశముండగా... సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ వందన సమర్పణ చేస్తారు. ఇది పూర్తి కాగానే ప్రధాని హెలిపాడ్ గుండా సుమారు 4:15 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. సభా వేదిక వద్ద సేద తీరే ఏర్పాట్లు ప్రధాని మోదీ సేద తీరేందుకు మూడు ప్రత్యేకమైన రెయి¯ŒSప్రూఫ్ గదులను ఏర్పాటు చేశారు. సభావేదిక వద్ద ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం 1 గంటకు భోజన ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని హైదరాబాద్కు తిరిగి వెళ్లేందుకు.. నెంటూరు–చౌదర్పల్లి–వర్గల్ చౌరస్తా– రాజీవ్ రహదారి మార్గంలో జన సంచారాన్ని నిలిపివేశారు. శనివారం ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి హరీశ్రావు పరిశీలించారు. వీరు ప్రధాని గుట్టపై తిరిగే ప్రదేశాలు, సభావేదిక, హెలిపాడ్ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలా ఉంటే ‘మిష¯ŒS భగీరథ’ వైస్ చైర్మ¯ŒS వేముల ప్రశాంత్రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిష¯ŒS తదితరులు సైతం ఏర్పాట్లు పరిశీలించారు. -
దూప తీరినట్టే..
‘మిషన్ భగీరథ’పై మహిళల సంబురం వర్గల్: మిషన్ భగీరథ పథకాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇక తమకు దూప తీరినట్టేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నీటికోసం కొట్లాటలు జరిగేవని, గుక్కెడు నీటికీ ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు చెబుతున్నారు. పనులు మానేసి బోర్ల వద్దకు పరుగులు తీశామంటున్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లొస్తయంటే తమ బాధలు తీరినట్టేనని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తిప్పలు తప్పుతయ్ నిన్న మొన్నటి దాక ఊళ్లె నీళ్ల కోసం మస్తు గోసగోస ఉండె. దూరంగా బోర్ల దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. సీఎం సారు ఓట్ల సమయంల ప్రతి ఇంటికి తాగు నీళ్లు ఇస్తమన్నడు. ఇయ్యాల ఆ మాట నిజం చేసుకున్నడు. మాకు ఇగ నీళ్ల బాధ తప్పినట్టే. - చిందం లక్ష్మి, మైలారం, మం: వర్గల్ శాన సవులత్ అయితది నీళ్ల కోసం పనులు బందు పెట్టే కాలం. బోర్లు మర్ల పడి నీళ్లకు శాన తిప్పలైతున్నది. గీసొంటి టైంలా సర్కారు ఇంటింటికి నీళ్లు వచ్చెటట్టు చేసింది. బోరు నీళ్లు తాగితె రోగాలు వస్తయంట. గిపుడు నల్లాల నుంచి శుభ్రమైన నీళ్లు వస్తున్నయ్. రోగాల భయం పోయింది. - గుర్రాల పోచమ్మ, మైలారం, మం: వర్గల్ కేసీఆర్ సారు సల్లంగుండాలె మాకు ఆ పొద్దటి నుంచి బోర్ల నీళ్లే దిక్కు. అవి తాగితె రోగాలొస్తయో, రొప్పులొస్తయో మా కైతే తెల్వది. బోరు కాడ తిప్పలు పడాలె. నీళ్లు మోసుకోవాలె. ఇపుడు సర్కార్ మాకు నీళ్ల కష్టాలు లేకుండ చేసింది. దూప తీర్చుతున్న కేసీఆర్ సారు సల్లంగుండాలె. - మాసాన్పల్లి కిష్టమ్మ, నెంటూరు, మం: వర్గల్ బిందెలతో ఉరుకెటోళ్లం కరువు కాలంల ఊళ్లె నీళ్ల బోర్లు, బావుల కాడ పొలానికి నీళ్లు పారపెట్టె బోర్లు మర్లపడ్డయ్. తాగెటందుకు నీళ్లు తెచ్చుకోవాలంటె ఓ పొంటె కూలీ పని బంద్ పెట్టుకోవాలె. నీళ్లు ఉన్న బోర్ల కాడికి బిందెలతోని ఉరుకాలె. ఆడికెల్లి నీళ్లు మోసుకోవాలె. కూలీ పని చేసే ప్యాదోళ్లకు శాన కష్టమయ్యేది. ఇపుడు చంద్రశేఖర్ సారు ఇండ్లకు నీళ్లు ఇచ్చుడుతోని మాకు బాధలు లేకుండ అయింది. ఆయన దేవుని లాంటి మనిషి. - ఎర్రోల్ల లక్ష్మి, నెంటూరు, మం: వర్గల్ -
వాహనశ్రేణితో ట్రయల్స్
హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు పలుమార్లు భారీగా మోహరించిన పోలీసు బలగాలు వర్గల్: ప్రధాని నరేంద్రమోదీ మరికొద్ది గంటల్లో కాలు మోపనుండడంతో నెంటూరులోని హెలిప్యాడ్ సముదాయం వద్ద హడావిడి పెరిగింది. శనివారం వాహన శ్రేణితో పలుమార్లు హెలిప్యాడ్ నుంచి ప్రారంభోత్సవ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. చౌదరిపల్లి క్రాస్రోడ్డు నుంచి నెంటూరు హెలిప్యాడ్ మార్గం వరకు పటాన్చెరు సీఐ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. నెంటూరు నుంచి హెలిప్యాడ్ వైపు వెళ్లే మార్గంలో ఒక ఎస్ఐతో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ వందలాది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు, 108 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఎస్పీజీ అధికారులు సమీక్షించుకుంటూ తగు సూచనలిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా రైతుల క్షేత్రాల్లో బందోబస్తులో ఉన్న పోలీసులు కన్పిస్తున్నారు. -
మోదీ పర్యటనలో సిద్దిపేట మార్క్
సిద్దిపేట నీటిపథకం స్ఫూర్తిగా మిషన్ భగీరథకు రూపకల్పన సాకారం కానున్న సిద్దిపేట రైల్వే మార్గం ఈ రెండింటికీ సిద్దిపేటతో బంధం సిద్దిపేట జోన్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాటి గజ్వేల్ మండలం కోమటిబండ పర్యటనలో సిద్దిపేట మార్క్ కన్పిస్తోంది. జిల్లాకు చెందిన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మార్గానికి శంకుస్థాపనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సిద్దిపేటకు దగ్గరి సంబంధం ఉంది. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చేపట్టిన గ్రామీణ శాశ్వత మంచి నీటి పథకాన్ని చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు గత మూడు దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రైల్వేలైన్. మార్గానికి మోదీ శంకుస్థాపన చేయడం ద్వారా మరింత మోక్షం లభించనుంది. రైల్వేలైన్ మూడు దశాబ్దాల కల సిద్దిపేట రైల్వేలైన్ ఈ ప్రాంత వాసుల మూడు దశాబ్దాల నాటి కల. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్లో బలంగా నాటుకున్న రైల్వేలైన్ ఆశలకు ఆదివారం నాటి ప్రధాని పర్యటనతో కొంత బలం చేకూరిందనే చెప్పాలి. హైదరాబాద్, కరీంనగర్లకు అనుసంధానంగా తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి సిద్దిపేట మీదుగా రైల్వేమార్గాన్ని అనుసంధానం చేస్తూ 1999లో కేంద్ర ప్రభుత్వానికి రూ.328 కోట్లతో 151 కిలోమీటర్ల ప్రతిపాదనలతో నూతన మార్గానికి ఓ అడుగు పడింది. ఈ క్రమంలోనే 2005లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి అంకురార్పణ జరిగింది. సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సిద్దిపేట రైల్వేలైన్ మార్గం భవిష్యత్తులో మరింత వేగవంతంగా ముందుకు సాగి సిద్దిపేట వాసుల మూడు వసంతాల కలకు మార్గం మరింత సుగమమైందనే చెప్పాలి. సిద్దిపేట పథకం రాష్ట్రానికే ఆదర్శం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చింది మానేరు మంచినీటి పథకం. ఈ పథకం నుంచే మిషన్ భగీరథకు రూపకల్పన జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి వ్యయప్రయాసాలకోర్చి 58 కిలో మీటర్ల దూరంలోని ఎల్ఎండీ ద్వారా నియోజకవర్గంలోని 144 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసి పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు సమీపంలోని దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలకు, సిద్దిపేట మున్సిపల్కు నిత్యం మానేరు నీటిని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సత్ఫలితాలను అందిస్తున్న సిద్దిపేట మానేరు నీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిలో నీటిని అందించేందుకు మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. అందులో తొలి ప్రయోగంగా గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథను అమలుకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటకు గర్వకారణం నాడు సిద్దిపేట ముద్దబిడ్డగా కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తాగునీటి పథకం నేడు రాష్ట్రానికి మిషన్ భగీరథ రూపంలో ముందుకు రావడం గర్వకారణం. తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యం ఎంతో గొప్పది. అదే విధంగా సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మార్గానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం శుభసూచకం. రైల్వేమార్గం పనులు వేగవంతానికి ప్రధాని పర్యటన దోహదపడనుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన రెండు మహత్తర కార్యక్రమాలకు చోటు లభించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనందం. - హరీశ్రావు, రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి -
'మోదీ పర్యటన మైలురాయిగా నిలుస్తుంది'
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారమిక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.17వేల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణలో మోదీ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 2020 నాటికి దేశంలో అందరికీ విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పిస్తామన్నారు. కాగా ప్రధాని తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.20గంటలకు ఆయన బేగంటపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2.50 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. మూడు గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ గజ్వేల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.25 గంటలకు గజ్వేల్ నుంచి బేగంపేటకు తిరుగు పయనం అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట నుంచి ఎల్బీ స్టేడియానికి బయల్దేరతారు. 5.15 నుంచి 6.15గంటలకు వరకు బీజేపీ కార్యకర్తల సమ్మేళన్కు హాజరు అవుతారు. సాయంత్రం 6.40గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళతారు. -
మంచినీటి సమస్యకు ‘మిషన్ భగీరథ’
కొండపాక: మిషన్ భగీరథతో నియోజక వర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాన మంత్రి మోదీచే ప్రారంభించే మిషన్ భగీరథ పథక సమావేశానికి జన సమీకరణ కోసం మండలంలోని దుద్దెడలో బుదవారం సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజక వర్గంలో అన్ని కుటుంబాలకు నల్లాల ద్వారా గోదావరి నదీ జలాలను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం నియోజక వర్గ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమన్నారు. కేవలం 6 నెలల కాలంలో కొండపాక, గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, తూప్రాన్, ములుగు మండలాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, జెడ్పీటీసీ మాధూరి, ఎంపీపీ అనంతుల పద్మ, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు దోమల ఎల్లం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏర్పుల యాదయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఖమ్మంపల్లి మల్శేశం, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాదాకిషన్రెడ్డి, డీబీఎస్ రాష్ట అధ్యక్షులు దేవి రవీందర్, సర్పంచ్లు, మాజీ ఎంపీపీ బొద్దుల కనుకయ్య, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు. -
మాదాపూర్లో ‘మిషన్ భగీరథ’ ట్రయల్రన్
తుర్కపల్లి : ఆలేరు నియోజకవర్గానికి తాగునీరు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గురువారం మండలంలోని మాదాపూర్లో వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ) పథకం ద్వారా గోదావరి జలాల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ మహిళ మంచినీటి సమస్యతో రోడ్ల మీద బిందెలతో కనపడకూడదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రారంభించార న్నారు. ఆ పథకం ద్వారా మొదటి ఫేజ్లోనే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. డిసెంబర్ వరకు ఈ వాటర్గ్రిడ్ పథకం పనులు పూర్తవుతాయని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు. -
'ఆ రోజు మోదీని ఆకట్టుకునేలా ఉండాలి'
హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రారంభం రోజున తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేయాలని మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అన్నారు. వచ్చే నెల (ఆగస్టు) 7న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధానిని ఆకర్షించేలా ఏర్పాట్లు ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి సూచించారు. -
సీఎం రాక.. అధికారుల్లో కాక
గోదారమ్మ కోసం పనులు బిరబిరా గౌరారంలో పుంజుకున్న పనులు ట్యాంకులకు కనెక్షన్లు పైప్లైన్లకు అతుకులు పనులు పరిశీలించిన గడా అధికారి హన్మంతరావు వర్గల్: మీ ఊరికి గోదావరి నీళ్లు వస్తున్నయా.. సీఎం కేసీఆర్ ప్రశ్న? రావట్లేదు సార్.. స్థానికుని సమాధానం.. భగీరథ పనుల తీరు తెలుసుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వర్గల్ మండలం గౌరారం వద్ద శనివారం సాయంత్రం ఆగారు. తన ఫామ్హౌస్ మార్గంలో రాజీవ్ రహదారిపై ఉన్న గ్రామంలో గోదారమ్మ ఇంకా తలుపు తట్టలేదని తెలిసి మౌనంగా ముందుకు సాగిపోయారు. ఆ వెంటనే అధికారుల హడావిడి మొదలైంది. సీఎం ఆగ్రహానికి గురికావలసి వస్తుందని భావించారో ఏమో ఒక్కసారిగా ఆర్డబ్ల్యూఎస్, భగీరథ అధికారులు గోదారి రాకకు అడ్డంకులు గుర్తించారు. గ్రామానికి నీరు సరఫరా చేసే 1,40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ఓవర్హెడ్ ట్యాంకులకు గోదావరి జలాలు వచ్చేందుకు పైప్లై కనెక్షన్లు ఇచ్చారు. రాజీవ్ రహదారి పక్కన గృహాలకు గోదావరి నీరందేలా సీఎం ఫామ్హౌస్ మార్గంలోని రోడ్డును రాత్రికి రాత్రే తవ్వి పైప్లై వేసి పూడ్చేశారు. వర్గల్–గౌరారం మార్గంలో చౌదరిపల్లి మలుపు వద్ద దెబ్బతిన్న ప్రధాన పైప్లై కు మరమ్మతులు చేపట్టారు. గోదావరి జలాల సరఫరా సమయంలో నీటి ఒత్తిడికి పైపులు దెబ్బతినకుండా అక్కడ ప్లాస్టిక్పైప్ తొలగించి ఇనుప(స్టీల్) పైపులు బిగించేపనులు తుదిదశకు చేరాయి. కాగా గౌరారంలో పనుల తీరును గడా అధికారి హన్మంతరావు పరిశీలించారు. నిర్లక్ష్యం తగదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. కాగా గౌరారం వద్ద, చౌదరిపల్లి మలుపు వద్ద పనులను భగీరథ డిప్యూటీ ఈఈ కమలాకర్, మండల ఇంఛార్జి స్పెషల్ ఈఈ రఘువీర్లు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వరకు గ్రామంలోని అన్ని ట్యాంకులలోకి గోదావరి జలాలు చేరవేస్తామని డిప్యూటీ ఈఈ కమలాకర్ స్పష్టం చేశారు. మాకు ఇళ్లకు నీల్లొచ్చెటట్టు.. సీఎం ఫామ్హౌస్ రోడ్డుకు రెండో వైపు మా ఇళ్లు ఉంటయ్. పైపులై రోడ్డు దాటితెనే ఇంటింటికి నల్లా కనెక్షన్లు వస్తయి. రోడ్డును తవ్వితేనే ఇది సాధ్యమైతది. నిన్న సీఎం సారు మా ఊరిలో ఆగిండు. గోదావరి నీళ్ల గురించి అడిగిండు. ఒక్క ప్రశ్నతోని మా నీళ్ల కనెక్షన్ల బాధ పోయింది. అధికారులు దగ్గరుండి రాత్రికి రాత్రే రోడ్డును తవ్వించి, పైప్ వేయించిండ్రు. ఇళ్లకు గోదావరి నీళ్లు వచ్చెటట్టు కనెక్షన్లు ఇచ్చిండ్రు. – శ్రీనివాస్గౌడ్, గౌరారం సమస్యకు పరిష్కారం దొరికింది ఊరికి నీళ్లు సరఫరా చేసెటందుకు మూడు ట్యాంకులు ఉన్నయ్. చౌదరిపల్లి మలుపు కాడ గోదావరి పైప్లై సరిగలేకపోవడంతో మా ట్యాంకులకు గోదావరి నీళ్లు వస్తలేవు. దీంతోని బోర్ల నీళ్లతోనే సగబెట్టుకుంటున్నం. మొన్న మీటింగ్ల కలెక్టర్ రోనాల్డ్రోస్ సారుకు కూడా సమస్య చెప్పి, ఊరికి గోదావరి నీళ్లు వచ్చెటట్టు చూడాలె అని కోరిన. అనుకోకుండ సీఎం సారు మా ఊళ్లె ఆగి, గోదావరి నీళ్లు వస్తున్నయా అని అడగడంతో అధికారులు చర్యలు చేపట్టిండ్రు. సారు ఆగడం వల్ల మా సమస్య పరిష్కారమైతున్నది. – బి.నర్సింహరెడ్డి, సర్పంచ్, గౌరారం సీఎం సారు పిలవడంతో భయపడిన గౌరారంలో రోడ్డు పక్క కూల్డ్రింక్ దుకాణం ఉన్నది. ఒక్కసారిగా సీఎం సారు కారు దుకాణం ముందు ఆగడంతో గాబరాకు గురైన. చేయితో సైగ చేస్తూ కారు దగ్గరకు పిలవడంతో మరింత భయపడ్డ. దగ్గరకు పోయిన. గోదావరి నీళ్లు వస్తున్నయా అని సారు అడిగిండు. వస్తలేవని చెప్పిన. ములుగుల వస్తున్నయ్, మీ కెందుకు వస్తలేవు అని అడిగితే పైప్లైన్లు పూర్తి కాలేదన్న. – ఎండీ రఫి, గౌరారం -
‘త్వరలో 400 గ్రామాలకు మంచినీరు’
యాదగిరిగుట్ట: వచ్చే ఆగస్టు 15 కల్లా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లోని 400 గ్రామాలకు మంచినీరు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునీత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె యాదగిరిగుట్టలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చేస్తామని విప్ చెప్పారు. -
'మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా'
చందంపేట (నల్లగొండ) : వచ్చే వేసవినాటికి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేసి మంచి నీళ్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తన సొంతూరు నేరడుగొమ్ములో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథను పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీటి కుళాయిని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతంలో కృష్ణా పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే పుష్కరఘాట్లు ఏర్పాటు చేసి మౌలికవసతులు కల్పిస్తోందన్నారు. -
'మిషన్ భగీరథతో మంచినీళ్లిస్తాం'
హైదరాబాద్: మరో రెండేళ్లలో మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన కేవీ రంగారెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేవీ రంగారెడ్డి పుస్తకాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. కేవీ రంగారెడ్డి సూచించిన బాటలో తామంతా నడుస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రూ.20 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారని, కచ్చితంగా 100శాతం బంగారు తెలంగాణ సాధిస్తామని తెలిపారు.