MLA tickets
-
టీడీపీలో టికెట్ల పంచాయితీ
-
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీట్లు
-
యూత్ కాంగ్రెస్ ‘నారాజ్’
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. నేడు ‘బుజ్జగింపు’ భేటీ? యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
రేవంత్కు శాపనార్థాలు.. గాంధీభవన్లో నిరసనలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ మైనార్టీ నేతలు నిరసనకు దిగారు. బహుదూర్పురాలో ఖిలీమ్ బాబా, చాంద్రాయణగుట్టలో షకీల్ దయానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని నిరసస వ్యక్తం చేస్తూ.. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాతబస్తీకి చెందిన టికెట్లు.. సంబంధం లేని వారికి ఇచ్చారని మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మరో వైపు, టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్ను భ్రష్టుపట్టించడానికి రేవంత్ వచ్చాడంటూ, ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వచ్చే లిస్ట్ సంబంధించిన వాళ్లది కూడా శాపనార్థాలు తగులుతాయంటూ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.. డబ్బులు ఇవ్వనందుకే ఉప్పల్ టికెట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. రేవంత్రెడ్డి ఫ్లెక్సీని కాల్చివేశారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు. చదవండి: 51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి? -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
అసెంబ్లీ టికెట్లు ఇవ్వండి
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న లాల్కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. -
రసవత్తర రాజకీయం.. సీఎం కేసీఆర్ నిర్ణయం సరైనదేనా?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, ప్రస్తుత సిట్టింగ్లకే మళ్లీ టికెట్లిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో సిట్టింగ్ల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా.. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కొంతకాలంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆశావహుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనే ఆశతో వివిధ నియోజకవర్గాల్లో ఎందరో నేతలు ఎదురుచూస్తున్నారు. సీఎం ప్రకటనతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. గులాబీ పార్టీలోనే కొనసాగడమా? లేక మరో దారి చూసుకోవడమా? అనే మీమాంసలో కొందరు నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయమే ఉత్తమమా..? అధికారంలోకి వచ్చాక.. వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని గులాబీ గూటికి వచ్చేలా చేసేందుకు కొందరికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తామనే హామీలున్నాయి. దాంతో వారు ఆయా నియోజకవర్గాలను నమ్ముకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత సైతం తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ.. ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం చేసిన ప్రకటనతో హతాశులైన వారిలో కొందరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీల వైపు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో.. - ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకు వస్తుందని భావించిన ఇదే పారీ్టకి చెందిన కార్పొరేటర్ విజయారెడ్డి.. తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి కాంగ్రెస్లో చేరారు. ఇటీవల బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన శ్రవణ్కుమార్.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే చేరినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మన్నె గోవర్ధన్రెడ్డి, మరికొందరు సైతం ఎంతో కాలం నుంచి ఇదే నియోజకవర్గంపై కన్నేసి ఉన్నారు. కానీ.. కేసీఆర్ ప్రకటనతో ఆశావహులకు ఏమీ పాలుపోవడం లేదు. - ముషీరాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేసి ఉన్న ఎమ్మెన్ శ్రీనివాస్ మంత్రి తలసాని అండదండలతో ఇక్కడి టికెట్ను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తదితరాలు తనకు కలిసి వస్తాయని ఆయన ఆశలు పెంచుకున్నారు. - అంబర్పేట నియోజకవర్గం నుంచి కాలేరు వెంకటేశ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనగసాగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి కిషన్రెడ్డి చేతిలో ఓటమిపాలైన ఎడ్ల సుధాకర్రెడ్డితో పాటు ఓ కార్పొరేటర్ భర్త తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మూడు కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కృషాంక్లు రాబోయే ఎన్నికల్లో టికెట్పై కన్నేసి ఉన్నారు. పొరుగు జిల్లాలో.. - ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సు«దీర్రెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన చేతిలో ఓటమి పాలైన ఎం.రామ్మోహన్గౌడ్ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్నారు. - ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపొందారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన క్యామ మల్లేష్ ఆ పారీ్టకి రాజీనామా చేసి, అధికార టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ అవకాశం కల్పించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత (సినీ నటుడు అల్లు అర్జున్ మామ) చంద్రశేఖర్రెడ్డి కూడా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. - గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలిచిన సబితారెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సహా మంత్రి సబిత తనయుడు కార్తీక్రెడ్డి భావించారు. ఆ మేరకు పావులు కూడా కదిపారు. - ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే టిక్కెట్ వస్తుందని ఆశించి ఇప్పటికీ ఈ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ బేతి సుభాష్రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సమయానుకూల నిర్ణయాలు.. సీఎం ప్రకటన చేసినప్పటికీ, సమయానుకూల నిర్ణయాలుంటాయని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితులు తదితరాలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఇప్పట్నుంచే టికెట్లు రావంటే పక్కచూపులు చూస్తారని కూడా అలా ప్రకటించి ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. -
నా కూతుర్నే పార్టీ మారమన్నారు
సాక్షి, హైదరాబాద్: ‘నా సొంత కూతురు, ఎమ్మెల్సీ కవితకు.. పార్టీ మారాలంటూ బీజేపీ నుంచి ప్రతిపాదనలు రావడం, దేశంలో ఆ పార్టీ చేస్తున్న వికృత రాజకీయాలకు అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటాన్ని ప్రారంభించి బీజేపీకి చరమగీతం పాడదాం. బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదను రూపుమాపాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది. ఉన్మాద రాజకీయాలు చేసే ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ‘ఫోన్లు చేసి ‘పార్టీ మారతారా?’ అని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామంటూ సమాధానం ఇవ్వాలి. మూడున్నర కోట్ల రాష్ట్ర నాభాలో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ మనదనే ధీమాతో ఉండాలి..’ అని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. బీజేపీ అప్రజాస్వామిక, వికృత చర్యలపై పోరాటం చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు గంటల పాటు సాగిన ఈ కీలక భేటీలో బీజేపీపై సాగించాల్సిన పోరు, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సన్నద్ధతపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్లా కొట్లాడాలి ‘బీజేపీపై ధర్మయుద్ధం చేస్తున్న మనం ఆ పార్టీపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను దేశానికి ఇవ్వాలి. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చీల్చే కుట్రలను బీజేపీ విజయవంతంగా చేసినా, తెలంగాణ మాత్రం ఈ కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టింది. బీజేపీ కుట్రలకు సంబంధించి 5 టెరాబైట్ల (దాదాపు 5లక్షల పేజీలకు సమానం) సమాచారం ఉంది. బీజేపీ నిజ స్వరూపానికి సంబంధించిన ఈ సమాచారాన్ని దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు, దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాం. బీజేపీపై పోరులో ప్రతి ఒక్కరూ కేసీఆర్లా నిలబడి కొట్లాడాలి..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. దాడులు, బెదిరింపులకు అవకాశం ‘రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ, ఎనిమిదేండ్లలో అనేక మందిపై ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు ఒక్కటీ నిరూపించలేక పోయింది. మంత్రి గంగుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. బీజేపీ దగ్గర రూ.2 లక్షల కోట్లు ఉన్నట్లు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో, దేని కోసం వాడుతున్నారో దేశానికి తెలియచేద్దాం. కొంతమంది ఎమ్మెల్యేలపై ఈడీ దాడులకు, బీజేపీ బెదిరింపులకు అవకాశముంది. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర సంస్థలు దాడులు చేస్తే తిరగబడండి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశముంది’ అని సీఎం చెప్పారు. 95 స్థానాల్లో అవలీలగా గెలుపు ‘రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తాం. 119 సీట్లకు గాను టీఆర్ఎస్ పార్టీ 95 స్థానాల్లో అవలీలగా గెలుస్తుంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పటినుంచే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి పార్టీ కేడర్తో ఎమ్మెల్యేలు సమావేశమై కష్ట సుఖాలు పంచుకోవాలి. వచ్చే 15 రోజుల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు పూర్తిచేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అవగాహన వస్తుంది. ఈ సమ్మేళనాలకు సంబంధిత జిల్లా మంత్రులు కూడా హాజరు కావాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డును తయారు చేసుకోవాలి. ప్రతి వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్లను పార్టీ కార్యాలయానికి పంపించాలి. ఈ ఇన్చార్జిలు.. వంద మంది ఓటర్లలో ఎవరు స్థానికంగా ఉంటున్నారు, ఇతర ప్రాంతాల్లో ఎందరు ఉంటున్నారు, వారి వివరాలు, ఫోన్ నంబర్లు తదితరాలు సేకరించాలి..’ అని సూచించారు. త్వరలో జిల్లా కలెక్టర్లతో భేటీ, కేబినెట్ సమావేశం ‘వచ్చే పది నెలల పాటు నియోజకవర్గాలపైనే ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. త్వరలో నేను కూడా జిల్లాల్లో పర్యటిస్తా. పార్టీ జిల్లా కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ధరణి ద్వారా 98 శాతం సమస్యలు పరిష్కారమైనా, మిగతావాటి పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివారికి రూ.3 లక్షలు చొప్పున అందిస్తాం. ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు పాలు పంచుకోవాలి. పోడు భూములు, ధరణి సమస్యలు తదితరాలపై త్వరలో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక భేటీ ఉంటుంది. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తా..’ అని కేసీఆర్ తెలిపారు. మునుగోడు తరహా వ్యూహంతో మళ్లీ అధికారంలోకి.. ‘రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో మునుగోడు ఉప ఎన్నిక అద్దం పట్టింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి, దాదాగిరి చేసినా ప్రజలు మనవైపే ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. ఒక గ్రామంలో కావాలని ఘర్షణకు దిగింది. మనకున్న బలంతో పోలిస్తే ఆ పార్టీకి ఉన్న బలం పిడికెడు. ఇకపై ఇలాంటి ఘటనలకు బీజేపీ ఎక్కడైనా పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాలి. మునుగోడు తరహా వ్యూహాన్ని రూపొందించుకుని మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ది ముగిసిన అధ్యాయం ‘దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్గాంధీ గుజరాత్లో ఎన్నికలు ఉన్నా వెళ్లడం లేదు. ఎవరు ఎంతగా పనిచేసినా కాంగ్రెస్ బతకదనే సంకేతాలు రాహుల్గాంధీ ఇస్తున్నారు. కాబట్టి దేశంలో కాంగ్రెస్ది ముగిసిన అధ్యాయమే..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదు.. ఎన్నికలకు సిద్ధమైపోండి: సీఎం కేసీఆర్ -
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) -
సై‘కిల్’: టీడీపీ నేతల పోరు.. తముళ్ల బేజారు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్చార్జ్ల తీరుతో కేడర్ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘పల్లె’.. మూటాముల్లె సర్దుకోవాల్సిందే! తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు. నాలుగు రోజుల క్రితం బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం మీడియా ముందుకు వచ్చి.. ‘పల్లె’కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిషార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయిలోని కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ‘పల్లె’ వెంట వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో పడ్డారు. ధర్మవరంలో పరిటాల వర్సెస్ వరదా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. ఒకవేళ ఆయన చేరాల్సి వస్తే తానే కండువా వేసి ఆహ్వానిస్తానని.. పార్టీ కోసం కష్టపడ్డాక పదవుల కోసం రెకమెండ్ చేస్తానని గతంలో పేర్కొన్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కదిరిలో అత్తార్ వర్సెస్ కందికుంట కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అన్ని మండలాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. కందికుంట అనుచరులు ఇటీవల అత్తార్ అనుచరుడిపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పెనుకొండలో తెరచుకోని టీడీపీ కార్యాలయం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తనకే అధిష్టానం చెక్ పెట్టేలా వ్యవహరిస్తుండడంతో నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవితమ్మతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. బీకే నాయకత్వంపై సోమందేపల్లి, పరిగి, పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ, బోయ సూరి, నాగలూరు నారాయణస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నారు. మడకశిరలో ఈరన్న వర్సెస్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్యో.. ఇటు చూడయ్యో.. హిందూపురంలో అయితే తెలుగు తమ్ముళ్లది కక్కలేని మింగలేని పరిస్థితి. ఎంతో నమ్మకంతో గెలిపించిన నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఇటు చూడడమే మానేశారు. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వస్తున్నా.. గృహ ప్రవేశాలు, వివాహాల ఫంక్షన్లకే పరిమితమవుతున్నారు. తను నమ్మి ఇక్కడ ఉంచిన పీఏనేమో అసాంఘిక కార్యకలాపాల్లో తలమునకలైన పరిస్థితి. దీంతో ఆ పార్టీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. -
బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి సామాజిక నేపథ్యం ఏమిటీ? వారు సమాజంలో ఏ వర్గానికి చెందిన వారు? తెలుసుకునేందుకు విజేతల కుల, మతాలు, ఆడ, మగ అంశాలపై ‘త్రివేది సెంటర్ ఆఫ్ పొలిటికల్ డాటా’ పరిశోధకులు వివరాలు సేకరించి ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ వద్ద నున్న డాటాతో విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40.7 శాతం మంది ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన వారు కాగా, అగ్రవర్ణాలకు చెందిన వారు 30 శాతం మంది, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16. 5 శాతం మంది ఉన్నారు. ముస్లిం మతానికి చెందిన వారు 8 శాతం మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారికన్నా ఇతర వెనక బడిన వర్గాల వారే ఎక్కువ మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన వారు బీజేపీ తరఫున 34 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 13 మంది జేడీయూ తరఫున పది మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు విజయం సాధించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వారు రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 39 మంది, బీజేపీ తరఫున 27 మంది, జేడీయూ తరఫున 22 గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున ఇద్దరంటే ఇద్దరే విజయం సాధించారు. (చదవండి: కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్) ఇక టిక్కెట్ల కేటాయింపు విషయానికొస్తే మొత్తం 110 అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకు 52 టిక్కెట్లు, ఇతర వెనకబడిన వర్గాలకు 39, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 15 టిక్కెట్లు, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఒక టిక్కెట్ కేటాయించింది. ముస్లిం వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో ఓబీసీలకు 69 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 18, ముస్లింలకు 19 టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన మరో 14 మంది అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఓబీసీలేనని అర్థం అవుతోంది. జేడీయూ విషయానికొస్తే ఓబీసీలకు 59 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23 టిక్కెట్లు, షెడ్యూల్డ్ కులాలకు 18, ముస్లింలకు 11, షెడ్యూల్డ్ తెగలకు ఒక టిక్కెట్ కేటాయించారు. ముగ్గురు అభ్యర్థుల వివరాలు తెలియరాలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల వారికే ఎక్కువ సీట్లను కేటాయించగా, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వెనకబడిన వర్గాల వారికే కేటాయించాయి. ఇక అగ్రవర్ణాల్లో ఏ సామాజిక వర్గానికి పార్టీలు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాయో పరిశీలిస్తే ఏ వర్గానికి ఆ పార్టీలు ప్రాధన్యత ఇచ్చాయో కూడా స్పష్టం అవుతుంది. బీజేపీ 24.5 శాతం టిక్కెట్లను రాజ్పుత్లకు, 11.8 శాతం టిక్కెట్లు బ్రాహ్మణులు, 7.3 శాతం టిక్కెట్లు భూమిహార్లు, బిహార్లో ఓబీసీలుగా పరిగణించే కొమట్లు కూడా వారి జనాభాతో పోల్చి చూస్తే ఎక్కువగానే ఇచ్చింది. ఇక ఓబీసీల్లో యాదవ్లకు 13.6 శాతం, ఇతర ఓబీసీలకు 22 శాతం టిక్కెట్లు కేటాయించింది. జనతాదళ్ యూ పార్టీ ఓబీసీల్లో కుర్మీలకు 14 శాతం, యాదవ్లకు 13 శాతం టిక్కెట్లను కేటాయించగా, యాదవ్లు, కుర్మీలు కాకుండా ఇతర ఓబీసీలకు 25 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ 31 శాతం టిక్కెట్లను యాదవ్లకు, మిగతా శాతం టిక్కెట్లను మిగతా అన్ని వర్గాలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల వారికి 40 శాతం టిక్కెట్లను, ముస్లింలకు 17 శాతం టిక్కెట్లను కేటాయించింది. బీజీపీ కారణంగా 2000 సంవత్సరం నుంచి బీహార్ ఎన్నికల్లో ఠాకూర్ల ప్రాబల్యం పెరగతూ వస్తోంది. అందుకనే ఆ రాష్ట్రంలో బీజేపీని రాజ్పుత్ల పార్టీగా వ్యవహరిస్తున్నారు. తగ్గిన మహిళల ప్రాతినిధ్యం గత అసెంబ్లీ కన్నా ఈసారి ఎన్నికల్లో పలు పార్టీల తరఫున ఎక్కువ మంది మహిళలు పోటీ చేసినప్పటికీ తక్కువ మంది విజయం సాధించడం గమనార్హం. 2015 ఎన్నికల్లో 273 మంది మహిళలు పోటీ చేయగా, ఈసారి 371 మంది పోటీ చేశారు. వారిలో మహా కూటమి తరఫున 62 మంది పోటీ చేయగా, ఏన్డీయే తరఫున 37 మంది పోటీ చేశారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి 26 మంది మాత్రమే విజయం సాధించారు. -
విజయనగరం ఎన్నికల సభలో గందరగోళం
-
విజయనగరం టీడీపీలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, విజయనగరం: జిల్లాలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్లపై స్పష్టత రాకపోవడం.. మరికొన్ని చోట్ల టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి చెలరేగడం పార్టీకి తలనొప్పిగా మారింది. నెలిమర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో మరోసారి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేపట్టాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఆశావహులు తమ వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పత్తివాడ నారాయణ స్వామి నాయుడు, భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్న త్రిమూర్తులు రాజు.. చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ టికెట్ను ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. నాగర్జునకు టికెట్ కేటాయించడంపై కె త్రిమూర్తులు రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు త్రిమూర్తులు రాజు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గీతకు మొండిచేయి... విజయనగరం టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రూపంలో గట్టి షాక్ తగిలింది. ఈ స్థానానికి తొలుత గీత, అశోక్ కుమార్తె ఆదితి గజపతిరాజు మధ్య పోటీ నెలకొంది. అయితే అశోక్ గట్టిగా పట్టుపట్టడంతో ఈ స్థానాన్ని టీడీపీ అధిష్టానం ఆదితికి కేటాయించినట్టుగా ప్రచారం సాగుతోంది. సిట్టింగ్ను కాదని ఆదితికి టికెటు కేటాయించడంపై బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న గీత ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గజపతినగరంలో అసమ్మతి జ్వాలలు.. మరోవైపు గజపతినగరం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు మళ్లీ టికెట్ కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అప్పలనాయుడు సోదరుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావుకు టికెటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తనకు కేటాయించని పక్షంలో కొండలరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువాలని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండానే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. -
మహానేతను అనుసరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ఒకేసారి మొత్తం అసెంబ్లీ స్థానాలకు అభ్యుర్థుల్ని ప్రకటించి తండ్రి బాటను అనుసరించారు. 2009 ఎన్నికల సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 294 ఎమ్మెల్యే స్థానాలకు 282 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. కేవలం పాతబస్తీ సీట్లను మాత్రమే తర్వాత ప్రకటించారు.ఇక అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చాం. బీసీలకు 41 సీట్లు కేటాయించాం. చంద్రబాబు బీసీలను మోసం చేశారు. బలిజలకు ఇచ్చిన సీట్లను బీసీల కోటాలో చూపించారు. తద్వారా బీసీలకు టికెట్ల కోటా పెంచామని మోసం చేస్తున్నారు. ముస్లిం సోదరులకు 5 సీట్లు కేటాయించాం. గతంలో కన్నా ఒక సీటు పెంచాం. ప్రజాభిప్రాయ సేకరణ, సర్వేల మేరకు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్ కేటాయించలేదు. అందరికీ ధన్యవాదాలు’ అన్నారు. -
ఎన్ని కుట్రలు చేసినా టిక్కెట్ నాదే
తూర్పుగోదావరి, ఏలేశ్వరం, (ప్రత్తిపాడు): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని లింగంపర్తి గ్రామంలో తన ఇంటివద్ద మంగళవారం నియోజకవర్గ టీడీపీ, తనవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ డీసీసీబీ చైర్మన్, తన మనువడు వరుపుల రాజాకు ఇచ్చినట్టుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో రావడంతో ఎమ్మెల్యే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోపాటు 13 ఏళ్లుగా అనేక పదవులు చేసిన తనకు గానీ, గత 36 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్న పర్వత కుటుంబానికి గానీ అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా వేరే అభ్యర్థిని గెలిపించే ప్రశ్నేలేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వరుపుల రాజా తనను మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. టిక్కెట్ విషయంలో చంద్రబాబుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, గొంతిన సురేష్, రొంగల సూర్యారావు, వాసిరెడ్డి భాస్కరబాబు పాల్గొన్నారు. -
ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలకు టికెట్లు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి జవహర్కు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచీ పార్టీకి సేవలు చేసిన వారికి కాకుండా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. ఇప్పుడు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేకపోవడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలో సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన తనను అవమానిస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి ఎంపికలో తన పేరు లేకపోవడం పట్ల పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో నరసారావు పేట లోక్సభ స్థానం నుంచి మోదుగుల గెలుపొందిన విషయం తెలిసిందే. టీడీపీ మోదులకు టికెట్ ఇవ్వడం లేదా..! గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు చర్చించారు. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి.. ఆలపాటి రాజా, తాడికొండ.. తెనాలి శ్రవణ్కుమార్కు కేటాయించినట్టు సమాచారం. కాగా, గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, చందు సాంబశివరావు, గుంటూరు తూర్పు స్థానానికి మద్దాలి గిరి.. ముస్లిం వర్గానికి చెందిన ఇంకో ముఖ్యనేత పేరు పరిశీలనలో ఉన్నాయి. పత్తిపాడు నియోజకవర్గానికి రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంళగిరి స్థానానికి కాండ్రు కమల కుటుంబ సభ్యుల్లో ఒకరు, తిరువీధుల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. -
ఫిరాయింపు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. కొవ్వూరు, నిడదవోలు, పత్తిపాడు ఎమ్మెల్యే టికెట్లు సిట్టింగులకు కేటాయించొద్దని పార్టీ నేతలు అధిష్టాన్ని హెచ్చరించినట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానాల పరిధిలో శనివారం అభ్యర్థుల ఎంపిక సమావేశం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చ సందర్భంగా.. కొవ్వూరు స్థానం మంత్రి జవహర్కు కేటాయించొద్దని తమ్ముళ్లు పట్టుబట్టారు. జవహర్ మద్యం, ఇసుక మాఫియాలో కూరుకుపోయాడని పార్టీ నాయకులు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ మాటను లెక్కచేయక జవహర్కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. ఇక, కాకినాడ పార్లమెంటు పరిదిలోని పత్తిపాడు ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు చంద్రబాబు టికెట్ నిరాకరికంచిట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో వరుపుల రాజాకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. నిడదవోలు పరిస్థితి కూడా అంతే.. నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటు ఇవ్వొద్దని స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం ఎక్కువైందని, శేషారావు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరావుపై కూడా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థిని మార్చాలని నేతలు డిమాండ్ చేశారు. నేతల విభేదాలతో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యుర్థుల ఎంపిక వాయిదా పడింది. -
‘అందుకే గులాబీ కండువాను వదల్లేకపోతున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే.. నేను మాత్రం బాధపడుతున్నా’ అని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. గత నాలుగేళ్లుగా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించడం లేదని వాపోయారు. వనస్థలిపురంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బీసీ నేత అయినందునే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక అమరవీరుడి తల్లిగా తనను బాధపెట్టడం మంచిది కాదని చెప్పారు. ‘టికెట్ నిరాకరించి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో.. అన్యాయం చేస్తారో కేసీఆర్కే వదిలేస్తున్నాను. నా కొడుకు మెడలో వేసుకున్న గులాబీ కండువాను వదల్లేకపోతున్నా. ఇప్పటికీ కేసీఆర్ నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. వెయ్యి మంది అమరుల కుటుంబాలకు 2014లో ఒక సీటు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ నుంచి 40 మంది..
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూటిమిగా ఏర్పడి గళం విప్పారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ పేరుతో 40 మందిమి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, రవీందర్, బొడా జనార్ధన్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఆర్సీ కుంతియా ముగ్గురూ కూటమిగా ఏర్పడి మహాకూటమి పేరుతో మాయ చేశారని మండిపడ్డారు. రేపటి బీసీల బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ‘మా నలభై మంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే.. చివరి నిముషంలో కాంగ్రెస్లో చేరిన 19 మందికి సీట్లిచ్చారు. స్క్రీనింగ్ కమిటీ మమ్మల్ని ఎంత ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులున్నాయని అడిగింది. మరోసారి సమావేశమై అభ్యర్థుల్ని ప్రకటిస్తాం’ అని రెబల్స్ ఫ్రంట్ సభ్యులు తెలిపారు. పారాచూట్ నేతలకు సీట్లు లేవన్నారు.. పారచూట్ నేతలు, నాలుగు సార్లు ఓడిన నేతలకు టికెట్లిచ్చారని విజయరామారావు ధ్వజమెత్తారు. అయినా, పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని రాహుల్ గతంలో చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక రాహుల్ గాంధీ ప్రిన్సిపల్స్కు అనుగుణంగానే జరిగిందా అని ఆయన టీపీసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేనివారికి కూడా సీట్లెలా కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఉత్తమ్ అమ్ముకున్నారని విజయరామారావు ఆరోపించారు. కాంగ్రెస్, కూటమి నేతల తీరుతో మళ్లీ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని ముంచేందుకే ఉత్తమ్ ఉన్నాడు.. ధర్మపురి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత రవీందర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓడిన వారికి కూడా టికెట్లెలా ఇస్తారని నిప్పులు చెరిగారు. ‘మా ధర్మపురిలో నాలుగు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్ ఇచ్చారు. ప్రజల్లో సానుభూతి అంటే.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటుంది. అయిదో సారి కూడా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ముంచేలా ఉత్తమ్ వ్యవహరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీకి దిగుతానని రవీందర్ స్పష్టం చేశారు. కాగా, ధర్మపురి టికెట్ను కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్కుమార్కు కేటాయించినన సంగతి తెలిసిందే. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కూటమిలో కుంపట్లు
-
‘టవర్’ ఎక్కిన కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నిరసన వెళ్లగక్కారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా... మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నారు. తాజాగా.. టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మానుకొండ రాధకిశోర్ అనుచరులు, కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. బల్లేపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధార్యమని అన్నారు. ఈ నెల 19న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఖమ్మం స్థానానికి నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కష్టపడి పనిచేసేవారికి కాంగ్రెస్లో టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై దయాకర్ అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుమలగిరి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దయాకర్కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువయుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. దయాకర్కు టికెట్ కన్ఫామ్ అయ్యేంతరకు టవర్ దిగేది లేదని హెచ్చరిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కామారెడ్డిలో... నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్ను నల్లమడుగు సురేందర్కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్లో.. తనకు టిక్కెట్ రాకపోడంతో పార్టీ కార్యాలయంలో కార్తీక్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మను సుత్తితో కొట్టి ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు, జెండాలు చించివేశారు. రాజేంద్రనగర్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజీనామా చేస్తారని హెచ్చరించారు. టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు. -
కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు..!!
సాక్షి, నిర్మల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్దమయ్యారు. కొందరు ఆయా పార్టీలకు రాజీనామా చేయగా... మరికొందరు రెబెల్స్గా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేయగా.. తాజాగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో కూడా టికెట్ల లొల్లి మొదలైంది. ముధోల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్కు టికెట్ రాకపోవడంతో ఆయన గురువారం కాంగ్రెస్కు రాజీనామా చేశారు. జాతీయ పార్టీ ఎన్సీపీ నుంచి ఆయన ముధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం. అరుణతార కాంగ్రెస్కు రాంరాం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ తార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిచ్కుంద మండల కేంద్రం నుంచి గాంధీ భవన్కు ఆమె ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం శ్రమిస్తే పార్టీ పట్టించుకోలేదనీ, టికెట్ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్ను వీడుతున్నానని ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు మొదట టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని, అనంతరం మొండిచేయి చూపారని అరుణ వాపోయారు. మరో నాలుగు రోజుల్లో అభిమానులు, అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. -
జాబితా మళ్లీ వాయిదా..?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఇంకా ఊగిసలాట కొన సాగుతోంది. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న జాబితా ప్రకటన.. శనివారమైనా విడుదలౌతుందా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఖరారు చేసిన 74 స్థానాల అభ్యర్థులను శనివారం ఉదయం ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ప్రకటించినా.. కూటమికి కేటాయించే స్థానాలపై స్పష్టత లేకపోవడంతో ఈ వ్యవహారంలో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఖరారయ్యాయని చెబుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి పలు అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జాబితా ప్రకటన ఆదివారానికి వాయిదా పడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. సీట్లపై అస్పష్టత.. అభ్యంతరాలు.. కూటమిలోని టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడిగా కూటమి అభ్యర్థుల జాబితాపై ఈనెల 8న ప్రకటన చేస్తామని పేర్కొంది. అయితే అది సాధ్యం కాలేదు. కూటమి పక్షాలకు కేటాయించే స్థానాల సంఖ్యపై కొంత స్పష్టత ఇచ్చినా, ఏయే స్థానాలు కేటాయించారన్న దానిపై అస్పష్టత నెలకొనడంతో జాబితా ప్రకటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కసరత్తుల అనంతరం 74 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, తమ తొలి జాబితాను భాగస్వామ్య పార్టీల జాబితాలతో కలిపి ఈ నెల 10న ఉదయం విడుదల చేస్తామని కుంతియా ప్రకటించారు. అయితే టీడీపీ కోరుతున్న స్థానాల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఆ పార్టీ ఆశిస్తున్న శేరిలింగంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బలంగా కోరుతున్నారు. అలాగే ఎల్బీ నగర్ సీటును టీడీపీ కోరుతుండగా, అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్రెడ్డి బలంగా ఉండటం.. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్లోని ఆశావహుల మధ్యే పోటీ ఎక్కువగా ఉండటంతో ఎటూ తేలడంలేదు. లక్ష్మయ్యకు ఓకే అయితే, మరి కోదండరామ్..? పటాన్చెరు స్థానాన్ని కచ్చితంగా కాంగ్రెస్కే కేటాయించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని టీజేఎస్కు కట్టబెట్టడంపైనా జిల్లా నేతల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయనున్న జనగామను పొత్తుల్లో భాగంగా టీజేఎస్కు కేటాయిస్తారని, అక్కడి నుంచి ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరగడం గందరగోళానికి తావిచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి పొన్నాలే పోటీలో ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే కోదండరాంకు ఏ స్థానం కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీపీఐ.. ఊరుకుంటుందా..? ఇక వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. దీంతో ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇక కొత్తగూడెం విషయంలోనూ సీపీఐ, కాంగ్రెస్ మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని సీపీఐ కోరుతుండగా, ఇప్పటికే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావుకు టికెట్ ఖరారైందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం మొదలుపెట్టడంతో వివాదం ముదురుతోంది. వీటితో పాటే మరికొన్ని స్థానాలపై ఎటూ తేలకపోవడంతో శనివారం అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా లేదా అనేదానిపై అయోమయం నెలకొంది. -
మహాకూటమిలో కాంగ్రెస్ టిక్కెట్ల గోల
-
కాంగ్రెస్ స్క్రీనింగ్ జాబితాపై రేవంత్ బ్లాక్మెయిలింగ్
-
టికెట్ల వ్యవహారం: అలిగిన రేవంత్!
సాక్షి, న్యూఢిల్లీ : సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు హైకమాండ్తో బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్.. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్ టికెట్ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రేవంత్ కోరుతున్న సీట్లు: 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) 2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) 3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్) 6. ఇల్లందు (హరిప్రియ) 7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) 8. చెన్నూరు (బోడ జనార్దన్) -
అందుకేనా ఆ 20 స్థానాలు పెండింగ్లో..?
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన కాంగ్రెస్ మిగిలిన 20 స్థానాల అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ స్థానాలకు కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే అక్కడున్న అసమ్మతి నేతలు రెబల్స్గా మారే అవకాశం ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. 74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది. కాంగ్రెస్ ఆపిన స్థానాలు ? 1. మునుగోడు 2. మేడ్చల్ 3. మంచిర్యాల 4. సూర్యాపేట 5. ఇల్లందు 6. కొత్తగూడెం 7. నకిరేకల్ 8. నాగర్కర్నూల్ 9. తుంగతుర్తి 10. సికింద్రాబాద్ 11. వికారాబాద్ 12. మహబూబ్నగర్ 13. దేవరకొండ 14. వరంగల్ ఈస్ట్ 15. ములుగు 16. మెదక్ 17. పాలకుర్తి 18. భద్రాచలం 19. ఇబ్రహీంపట్నం 20. నారాయణఖేడ్ -
అవసరమైతే సీనియర్ నాయకులు త్యాగాలు చేస్తారు
-
వీళ్లకు ఇబ్బందేనా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: సాధారణ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓడిపోయినా.. ప్రత్యర్థుల చేతిలో 30 వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైనా.. గత ఎన్నికల్లో 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా.. ఆయా అభ్యర్థులకు ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ స్వీయ మార్గదర్శకాలను రూపొందించుకుంటోంది. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాటైన తర్వాత నాలుగు రోజుల కిందట జరిగిన ప్రాథమిక భేటీలో పై అంశాలు చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కమిటీ మరిన్ని సార్లు సమావేశమై టికెట్ల ఖరారుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఆమోదించనుంది. ఇవే నిబంధనలు నూటికి నూరుపాళ్లు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టికెట్ల రేసులో ముందంజలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, డాక్టర్ రామచంద్రనాయక్తోపాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎర్రబెల్లి స్వర్ణకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పొన్నాల పరిస్థితి ఏంటో ..! గత ఎన్నికలల్లో జనగామ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో 32,695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుదీర్ఘకాలం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి రికార్డు సాధించిన ఆయన తపాసుపల్లి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ప్రజలు మద్దతు తెలపలేదు. 2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో మొత్తం 1,70,930 ఓట్లు పోల్ కాగా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి 84,074 ఓట్లు, పొన్నాల లక్ష్మయ్యకు 51,379 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే లక్ష్మయ్యకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన టీపీసీసీ ఎన్నికల కమిటీలోనూ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీలోనూ సభ్యుడిగా ఉండటంతో పాటు సుధీర్ఘకాలంగా మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో లక్ష్మయ్యకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 55 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ రేస్లో ముందున్న మాజీ మంత్రి విజయరామారావుకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇక్కడ తాటి కొండ రాజయ్య హ్యాట్రిక్ సాధించారు. రాజయ్య చేతిలో ఆయన 58,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గంలో మొత్తం 1,79,052 ఓట్లు పోల్ కాగా, తాటికొండ రాజయ్యకు అత్యధికంగా 1,03,662 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయరామారావు 44,833 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి స్వర్ణ మరోసారి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ చేతిలో 56,374 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,40,788 ఓట్లు పోల్ కాగా.. స్వర్ణకు కేవలం 27,188 ఓట్లు వచ్చాయి. డోర్నకల్లో డిపాజిట్ నిబంధన.. గత ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టీడీపీ–బీజేపీ కూటమి తరఫున డాక్టర్ రామచంద్రనాయక్ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన డోర్నకల్ టికెట్ రేసులో హాట్ ఫెవరేట్గా ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు 8,384 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ మొత్తం 1,64,352 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రెడ్యానాయక్కు అత్యధికంగా 84,170 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ స్వీయ నిబంధనలు రామచంద్రనాయక్కు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్కు.. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కొండేటి శ్రీధర్కు ఇబ్బందిక పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ చేతిలో 86,349 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,77,745 ఓట్లు పోల్ కాగా.. కొండేటి శ్రీధర్కు 30,905 ఓట్లు మాత్రమే వచ్చాయి. రమేష్కు అత్యధికంగా 1,17,254 ఓట్లు పోలయ్యాయి. తన కు మరో అవకాశం ఇవ్వాలని టీపీసీసీకి శ్రీధర్ దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ కూడా ఆయన అభ్యర్థనను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే 86 వేల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. గెలుపు గుర్రాల కోసం వడపోత.. టికెట్ల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఈ నెల 10, 11, 12, 13వ తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనుంది. గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టనుంది. టీ పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన 1:3 జాబితాను వడపోసిన అనంతరం 15వ తేదీలోపు ప్రతి నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరి పేర్లతో ఏకే ఆంటోనీ నేతృత్వంలోని జాతీయ ఎన్నికల కమిటీకి జాబితా ఇవ్వనుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుని 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. -
ఆ నిబంధన అమలైతే టికెట్ కష్టమే!
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సర్వే నివేదికలతో పాటు, కొత్త మార్గదర్శకాలు తెరపైకి వస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ మార్గదర్శకాలు అమలైతే ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలైన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్అలీ, సీనియర్ నాయకులు సౌదాగర్ గంగారాం, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లాంటి వారికే టికెట్ గండం పొంచి ఉంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యక్ష ఎన్నికల్లో మూడు పర్యాయాలు పరాజయం పాలైన నేతల కు టిక్కెట్ ఇవ్వకూడదని, 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి, 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా టిక్కెట్ ఇచ్చేది లేదనే మార్గదర్శ కాలు పక్కాగా అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలకే అసెంబ్లీ స్థానాలకు టికెట్ల ముప్పు పొంచిఉంది. షబ్బీర్కే..! నూతన మార్గదర్శకాలు అమలైతే కామారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన ఆ పార్టీ మండలి పక్ష నేత షబ్బీర్ అలీకే టిక్కెట్ ప్రశ్నార్థకం కానుంది. షబ్బీర్ ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతిలో పరాజయం చెందారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవి చూశారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి 2010లో ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరపున షబ్బీర్అలీ పోటీ చేయగా ఏనుగు రవీందర్రెడ్డి చేతిలో సుమారు 37 వేల పైచిలుకు ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారు. ఇలా మూడు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ షబ్బీర్ అలీ రాష్ట్ర అగ్రనేతల్లో ఒకరిగా ఉన్నారు. ఏకంగా మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన ఆ పార్టీలో ఎదురులేని నేతగా కొనసాగుతున్నా రు. మూడు పర్యాయాలు ఓటమి పాలైన నేతలకు టిక్కెట్ ఇవ్వద్దనే మార్గదర్శకాలు అమలైతే షబ్బీర్కు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారుకావడం, కేవలం అధికారికంగా ప్రకటించాల్సి ఉండటంతో షబ్బీర్అలీ ఇప్పటికే ఇక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సైతం రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో కామారెడ్డి ఒకటని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఈ తరుణంలో ఈ నిబంధనను కాంగ్రెస్ అధిష్టానం అమలు చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 30 వేల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి.. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో పరాజయం పాలైన నేతలకు కూడా ఈసారి టికెట్ కట్ చేయాలనే నిబంధన తెరపైకి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందాలంటే కనీసం 60 వేల ఓట్లు తెచ్చుకుంటే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది 30 వేల ఓట్లు ప్రత్యర్థి పార్టీ నుంచి తన వైపునకు తిప్పుకోవడం అనుకున్నంత సులభం కాదని భావిస్తున్న అధిష్టానం ఈ నిబంధనను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. ఈ నిబంధనలు అమలైన పక్షంలో జుక్కల్ టికెట్ రేసులో ఉన్న ఆ పార్టీ సీనియర్నేత సౌదాగర్ గంగారాంతో పాటు, ప్రభుత్వ మాజీ విప్, బాల్కొండ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఈరవత్రి అనిల్లకు కూడా టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఈ ఇద్దరు నేతలు ముందు వరుసలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాల్కొండ బరిలో దిగిన అనిల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఏకంగా 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అలాగే జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సౌదాగర్ గంగారాం కూడా 35 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ విజయం సాధించిన టీఆర్ఎస్ తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేతిలో పరాజయం పొందారు. 30 వేల ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి పాలైన వారికి టికెట్ ఇవ్వద్దనే నిబంధన అమలైతే గంగారాంతో పాటు, ఈరవత్రి అనిల్లకు అభ్యర్థిత్వాలు ప్రశ్నార్థకమే! కాగా నియోజకవర్గంలో గంగారాంకు ఇప్పటికీ గట్టి పట్టుంది. ఈసారి తనకు టికెట్ కేటాయించకపోతే.. తన అల్లుడికైనా ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన గంగారాం.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా నైనా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. అర్బన్ స్థానంలో బొటాబోటీగా.. నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బొమ్మ మహేష్కుమార్గౌడ్ పోటీ చేశారు. కేవలం 25,742 ఓట్లు సాధించిన మహేష్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్అలీ రెండో స్థానం లో నిలవగా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారా యణగుప్త మూడో స్థానంలో ఉన్నారు. కొత్త మా ర్గదర్శకాల ప్రకారం 25 వేల ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చిన నేతల పేర్లు టిక్కెట్ పరిశీలన జాబితాలో నుంచి తొలగించాలనే నిబంధనల తెరపైకి వచ్చింది. కానీ బొటాబోటీగా 25 వేల కంటే కేవలం 742 ఓట్లు మాత్రమే ఎక్కువ పొందగలిగిన మహేష్కుమార్గౌడ్కు ఈ మార్గదర్శకాలతో ముప్పులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలు పరిగణనలోకి.. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మహాకూటమి పొత్తులో సీట్ల పంపకాల విషయంలో గెలిచే పార్టీకే స్థానం కేటాయించాలని అన్ని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపుగుర్రాల వేటలో నిమగ్నమైంది. కాగా కొత్త మార్గదర్శకాలు తెరపైకి రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్గదర్శకాలతో పాటు, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించాలనే అంశం ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకొచ్చిందని జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. తెరపైకి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఆయా స్థానాల అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులకు చుక్కెదురవుతుందా.? లేక మార్గదర్శకాలను అసలు పరిగణనలోకి తీసుకోకుండా వదిలేస్తారా అనేది అభ్యర్థిత్వాల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. -
హస్తంలో వడపోత..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నిబంధనలు కొందరు నేతలకు శాపంగా.. మరికొందరికి వరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. వరుసగా మూడుసార్లు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు.. 25వేల ఓట్లకన్నా తక్కువ ఓట్లు లభించిన వారు.. 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వారిని గుర్తించి.. వారికి కాకుండా.. అక్కడి ఆశావహుల్లో పార్టీపై పట్టున్న నేతలకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు పదుల సంఖ్యలో ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడటం.. భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావిత పార్టీలుగా ఉండగా.. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఒక కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. మూడోసారి టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి పోటీ చేసేందుకు ప్రచారం సైతం ప్రారంభించారు. ఆయన మినహా కాంగ్రెస్లో వరుసగా రెండుసార్లు గెలిచి.. మూడోసారి టికెట్ ఆశిస్తున్న వారు జిల్లాలో లేకపోవడం విశేషం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ 2004 వరకు పాలేరు నుంచి పలుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంభాని ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు జనరల్ స్థానంగా మారింది. దీంతో 2009లో జనరల్ నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారిన సత్తుపల్లికి రాజకీయ వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంభాని మొదటిసారి పోటీ చేసినప్పుడు 65,483 ఓట్లు సాధించగా.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సంభానిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సండ్ర, కాంగ్రెస్ నుంచి సంభాని, వైఎస్సార్ సీపీ నుంచి మట్టా దయానంద్, టీఆర్ఎస్ నుంచి పిడమర్తి రవి పోటీ చేయగా.. సంభాని చంద్రశేఖర్ ఆ ఎన్నికల్లో 30,100 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే సంభాని కాంగ్రెస్ విధించిన నిబంధనలకు లోబడి మరోసారి టికెట్ పొందే అర్హత పొంది ఉన్నారని ఆయన వర్గీయులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రస్తుతం అదే కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు లేకపోవడంతో జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ టికెట్ల కేటాయింపునకు పార్టీ విధించిన నిబంధనలు అడ్డుపడే అవకాశం లేదని భావిస్తున్నారు. ‘వనమా’ ప్రయత్నాలు.. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వనమా వెంకటేశ్వరరావు 2004, 2009, 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించగా.. 2009 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెసేతర మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు 47,028 ఓట్లు సాధించి గెలుపొందగా.. వనమా 45,024 ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో అదే కొత్తగూడెం స్థానం నుంచి టికెట్ ఆశించిన వనమాకు సీపీఐ, కాంగ్రెస్ పొత్తు కారణంగా టికెట్ లభించలేదు. దీంతో అప్పుడు డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వనమా పార్టీ టికెట్ తనకు నిరాకరించడంతో వైఎస్సార్ సీపీలో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వనమా 34వేల ఓట్లు సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వనమా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి.. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అయితే వనమా 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. 2009లో 40వేలకు పైచిలుకు ఓట్లు సాధించడం, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకపోవడం వంటి కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మూడు నియమాలు ఆయనకు వర్తించే అవకాశం లేదని కాంగ్రెస్లోని ఆయన అనుచర వర్గం వాదిస్తోంది. వనమా సైతం ఈసారి కాంగ్రెస్ తరఫున తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త ముఖాలకే సీట్లు..! ఇక ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున 2004, 2009, 2014లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మంది ఇప్పటికే వివిధ పార్టీలకు వలస వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్కుమార్ టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఖమ్మం నియోజకవర్గంలో కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్రెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా.. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత మానుకొండ రాధాకిషోర్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే వీరికి కాంగ్రెస్ విధించిన మూడు నిబంధనలు వర్తించే అవకాశం లేకపోవడంతో ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాలేరు నియోజకవర్గంలోని అభ్యర్థులకు సైతం కాంగ్రెస్ విధించిన నిబంధన వర్తించే అవకాశం లేదు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులందరూ దాదాపు ఆ పార్టీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారే కావడంతో ఈ నిబంధనల వల్ల సీటు కోల్పోయే అవకాశం లేదు. 2009, 2014లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి 2015లో మరణించడంతో 2016లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరితారెడ్డి 49వేలకు పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో రాంరెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించినా.. వచ్చిన ఓట్ల ఆధారంగా అర్హత ఉన్నట్లేనని ఆయన అభిమానులు విశ్లేషిస్తున్నారు. అక్కడా లేనట్లే.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరం కనకయ్య 2009లో ఓటమి చెందగా.. 2014లో వి జయం సాధించి.. అనంతరం టీఆర్ఎస్ తీర్థం పు చ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న 15 మందిలో ఎవరూ వరుసగా మూడుసార్లు ఓడిపోయిన జాబితాలో లేకపోవ డం విశేషం. అయితే ఈసారి అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు వివిధ పార్టీల నుంచి అదే నియోజకవర్గం నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అనుభవం మాత్రం ఉండటంతో దానినే అదనపు అర్హతగా చూపిస్తూ టికెట్ కోసం అధిష్టానం వద్ద ప్రయత్నం చేసు ్తన్నారు. 2009లో పినపాక నియోజకవర్గం ఆవిర్భవించాక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాధించారు. 2014లో సీపీఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఆ సీ టును సీపీఐకి కేటాయించడంతో గత ఎన్నికల్లో రేగా పోటీ చేయలేదు. మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న రేగా కాంతారావు ఈసా రి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద భారీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే నియోజకవర్గం ను ంచి అజ్మీరా శాంతి టికెట్ ఆశిస్తున్నారు. వీరికి సై తం కాంగ్రెస్ రూపొందించిన మూడు నియమా లు వర్తించే అవకాశం లేదు. భద్రాచలంలో 2009 లో పోటీ చేసి విజయం సాధించిన కుంజా సత్యవతి.. 2014లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్యపై ఓటమి చెందారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామా ల నేపథ్యంలో సత్యవతి బీజేపీలో చేరారు. ఈసా రి ఆమె బీజేపీ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జ రుగుతోంది. ఇక భద్రాచలంలోనూ వరుసగా మూడుసార్లు ఓడిపోయిన అభ్యర్థులు లేకపోవడ ంతో అక్కడా కాంగ్రెస్ కొత్తవారికే అవకాశం ఇ చ్చే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తు న్నా యి. అశ్వారావుపేటలో 2009లో కాంగ్రెస్ తర ఫున పోటీ చేసిన వగ్గెల మిత్రసేన విజయం సాధి ంచగా.. 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఆయనే పోటీ చేసి ఓట్లపరంగా 3వ స్థానంలో నిలిచారు. అయితే అనారోగ్య కార ణంతో మిత్రసేన మరణించడంతో ఆ నియోజకవర్గంలోనూ కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన పరి స్థితి కాంగ్రెస్లో నెలకొంది. ఇక వైరాలో 2009లో కాంగ్రెస్ తరఫున డాక్టర్ రామచంద్రనాయక్ పోటీ చేయగా.. 2014లో సీపీఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల పొత్తు కారణంగా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్ పోటీ చేయలేదు. 2009లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రామచంద్రనాయక్ ఈసారి ఇల్లెందు నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వైరా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా మొదటిసారి పోటీ చేసినట్లే అవుతుంది. కాంగ్రెస్ రూపొందించిన మూడు నియమాల కారణంగా జిల్లాలో టికెట్ కోల్పోయే అవకాశం ఉన్న కాంగ్రెస్ నేతలు లేనట్లేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
మాకంటే మాకు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ను ప్రకటించడంతో మహాకూటమిలో టికెట్లు దక్కించుకునే వారి మధ్య పోటాపోటీ నెలకొంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచార పర్వం ప్రారంభించగా.. కాంగ్రెస్లోని ఆశావహులు టికెట్ల కోసం ఢిల్లీ స్థాయిలో తమవంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టుండడం.. కాంగ్రెస్, కూటమి పక్షాలు అనేక చోట్ల స్థానాలు కోరుతుండడంతో సీట్ల మధ్య మడతపేచీ నెలకొంది. టీడీపీ, సీపీఐ జిల్లాలో తమకు గల బలాబలాల ఆధారంగా సీట్లు కోరుతుండటం.. వాటిలోనే సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందన్న కారణంతో కాంగ్రెస్ గట్టిపట్టు పడుతుండడంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది. ఈనెల 20వ తేదీలోపు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా శనివారం ప్రకటించడంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ మూడు, టీడీపీ మరో మూడు స్థానాలను కోరుతుండగా.. కాంగ్రెస్కు కేవలం నాలుగు స్థానాలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క స్థానానికి మాత్రమే పోటీ లేని పరిస్థితి నెలకొంది. ఆయన ఇప్పటికే మధిరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. భారీగానే ఆశావహులు.. ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య 29 నుంచి 30కి చేరింది. తాజాగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఊకే అబ్బయ్య కాంగ్రెస్లో చేరడంతో ఆయన సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన హరిప్రియ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా.. భూక్యా దళ్సింగ్, డాక్టర్ రవి, 2009 ఎన్నికల్లో వైరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రనాయక్, కాంగ్రెస్ సీనియర్ నేత చీమల వెంకటేశ్వర్లు అధిష్టానం వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం స్థానాల కోసం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ తమకంటే తమకంటూ పట్టుపడుతున్నాయి. ఖమ్మం నుంచి మహాకూటమి తరఫున టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్ర, మానుకొండ రాధాకిషోర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తూ తమతమ స్థాయిల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున కందాల ఉపేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది ఈడా శేషగిరిరావు, మరో న్యాయవాది మద్ది శ్రీనివాస్రెడ్డి ప్రయత్నిస్తుండగా.. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు సైతం టికెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈడా శేషగిరిరావు నియోజకవర్గంలోని గాంధీ కుటుంబ సభ్యుల విగ్రహాలను ఆధునికీకరించే పనికి శ్రీకారం చుట్టారు. కందాల ఉపేందర్రెడ్డి ఎన్నికల కార్యాలయాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కూటమి పొత్తుల వల్ల సత్తుపల్లి సీటును సిట్టింగ్ అభ్యర్థి, టీడీపీకి చెందిన వెంకటవీరయ్యకు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ను పార్టీ ఏ విధంగా సర్దుబాటు చేస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెంపై ఉత్కంఠ కొత్తగూడెం సీటు విషయంలో భాగస్వామ్య పక్షాలన్నీ గట్టి పట్టు పడుతుండడంతో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తుండగా.. మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆశీస్సులతో కాంగ్రెస్ నాయకుడు ఎడవల్లి కృష్ణ సైతం తనకు సీటు ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కూనంనేని సాంబశివరావు.. 2014లోనూ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సైతం కూనంనేని పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కొత్తగూడెం స్థానం సీపీఐకే లభిస్తుందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు సత్యనారాయణ(చిన్ని) మహాకూటమి తరఫున తనకు అవకాశం ఇవ్వాలని పార్టీపరంగా ఒత్తిడి తేవడంతోపాటు సినీ నటుడు బాలకృష్ణ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అశ్వారావుపేట నుంచి కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ పోటీ చేసేందుకు తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావును మరోసారి పోటీ చేయించేందుకు టీడీపీ సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ నుంచి అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు సున్నం నాగమణి, కారం శ్రీరాములు, దంజునాయక్, కొడెం లక్ష్మీనారాయణ తదితరులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీటైన అభ్యర్థి కోసం ప్రయత్నం.. ఇక కీలకమైన భద్రాచలం నియోజకవర్గం నుంచి ఇప్పటికే టీఆర్ఎస్, బీఎల్ఎఫ్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ సైతం ఈ స్థానంలో విజయం సాధించడం కోసం ధీటైన అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో పీర్ల కృష్ణబాబు, కారం కృష్ణమోహన్తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఇక్కడి నుంచి పోటీ చేయించే అంశాన్ని సైతం కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు ప్రచారమవుతోంది. ఇక పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు టికెట్ దాదాపు ఖరారు అయినట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. ఇదే స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేసేందుకు సీపీఐ ఆసక్తి ప్రదర్శిస్తోంది. దీంతో సీట్ల సర్దుబాటులో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం కొంత ఉత్కంఠ రేపుతోంది. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ పోలీస్ అధికారి రాములునాయక్, టీడీపీ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన రాందాస్నాయక్, లకావత్ గిరిబాబునాయక్ తీవ్రస్థాయిలో టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే స్థానాన్ని మహాకూటమి తరఫున ఆశిస్తున్న సీపీఐ.. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి సతీమణిని పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ప్రకటనకు పట్టుమని పది రోజులైనా సమయం లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల ఆశావహులు తమతమ నేతల ద్వారా టికెట్ కోసం ఇటు హైదరాబాద్లోనూ.. అటు ఢిల్లీలోనూ మకాం వేసి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్లో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. -
తెలంగాణ బీజేపీలో టికెట్ల లొల్లి
-
పారని ‘తారక’ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, వరంగల్: అసమ్మతి నేతలు అదే పట్టు మీదున్నారు. బరిలో నిలబడి తీరుతాం అని తెగేసి చెప్పారు. ‘నిండా ముంచినాక ఇంకా అధిష్టానం ఏమిటి? మా కార్యకర్తల మాటే శిరోధార్యం’ అని కరాఖండీగా చెబుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, యువరాజు కేటీఆర్ మంగళవారం మరికొంత మంది వరంగల్ అసమ్మతి నేతలను ప్రగతి భవన్కు పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. స్టేషన్ ఘన్పూర్ తరహాలోనే సీన్ రిపీట్ అయ్యింది. కేటీఆర్ చేసిన సంప్రదింపులు అర్ధంతరంగానే ముగిసినట్లు తెలిసింది. భవిష్యత్లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న కేటీఆర్ విజ్ఞప్తిని అసమ్మతి నేతలు తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో మరోమారు కేసీఆర్తో కలిసి మాట్లాడుకుందామని కేటీఆర్ కోరినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అసమ్మతిని సర్దుబాటు చేసేందుకు కేటీఆర్ రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు తకెళ్లిపల్లి రవీందర్రావు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితను చర్చలకు ఆహ్వానించి.. వారితో వేర్వేరుగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్రావు పాలకుర్తి నియోజకర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్లోకి రావడంతో ఈసారి టికెట్ ఆయనకు కేటాయించారు. కేసీఆర్ నిర్ణయంతో తక్కెళ్లపల్లి విభేదించారు. పార్టీ అభ్యర్థిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనను రాజీకి పిలిచారు. దాదాపు 40 నిమిషాలపాటు కేటీఆర్తో మాట్లాడిన తక్కెళ్లపల్లి తన గోడు మొత్తం వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తనకు అన్యాయం చేసిందనిచెప్పినట్లు సమాచారం. ఆయన చెప్పింది అంతా విన్నా కేటీఆర్ భవిష్యత్లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సమ్మతించని రవీందర్రావు ఇండిపెండెంటుగానైనా పోటీచేయాలని కార్యకర్తలు తనపై ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ల మాట కాదనలేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో కేటీఆర్ కల్పించుకుని మీరు చెప్పిన అంశాలను నాన్నగారికి (కేసీఆర్) దృష్టికి తీసుకెళ్తాను, మరో రెండు రోజుల్లో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపినట్లు తెలిసింది. డోర్నకల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఆమెను చర్చలకు ఆహ్వానించారు. ప్రగతి భవన్లో దాదాపు గంట పాటు ఆమెతో చర్చించారు. టీడీపీని, పదవులను, ఆస్తులను త్యాగం చేసిన తనను పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ఆమె గట్టిగానే అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే మాకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేను ఇంతకాలం మౌనంగా ఉన్నాను, కానీ నా అనుచరులు, కార్యకర్తలు ఆగటం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ అధిష్టానం కంటే నా కార్యకర్తల మాటే నాకు శిరోధార్యం అని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది. సత్యవతిని కూడా రెండు రోజుల్లో కేసీఆర్తో కలిపిస్తామని చెప్పి పంపినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ టికెట్ను ఆశించిన మాలోతు కవితతో మాత్రం చర్చలు కొంతమేరకు సఫలమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీ పట్ల ఆమె కొంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత తన తండి రెడ్యా నాయక్తో కలిపి మరోమారు చర్చలకు కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
అర్బన్లో ఆరాటం.. టికెట్ కోసం పోటాపోటీ!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం టికెట్ కోసం ఆ పార్టీలో పోటాపోటీ ఉండగా, బాన్సువాడ, జుక్కల్ లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కేడర్ కలిగిన అర్బన్లో బీజేపీ అభ్యర్థిత్వం లభిస్తే గెలుపు దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్న నేతలు ఈ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్థానంలో ముగ్గురు ముఖ్యనేతల పేర్లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తమకే టికెట్ ఖరారవుతుందని ముగ్గురు నేతలు పేర్కొంటున్నారు. సూర్యనారాయణగుప్త గత ఎ న్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంఐఎం తర్వాత మూడో స్థానంలో నిలిచారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేసిన ఆయన తిరిగి తనకే అభ్యర్థిత్వం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నా రు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో సామాజిక సమీకరణల దృష్ట్యా తనకు టికెట్ కేటాయిం చాలని ఆయన పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన యెండల లక్ష్మినారాయణ కూడా టికెట్ రేసులో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. పలు చోట్ల భిన్నంగా పరిస్థితి.. అర్బన్లో టికెట్ కోసం అభ్యర్థులు పోటీపడుతుండగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఢీకొన గల సత్తా కలిగిన నేతలు కనిపించడం లేదు. దీంతో అధి నాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించిన నేతలను కమలదళంలో చేర్చుకోవడం ద్వారా ఆయా ని యోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని భావిస్తోంది. రెండు పార్టీల్లో టికెట్ దక్కని నేతలతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఎంపికకు జాతీయ బృందం.. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ జాతీయ బృం దం చేపడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బృందం త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలెవరైనా పార్టీలో ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆయా నియోజకవర్గాలో సత్తా ఉన్న నేత లేనిపక్షంలో ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన బలమైన నేతలకు కాషాయం కండువా కప్పి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్రిపురా వంటి రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. -
చాంతాడు
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్టును ఆశిస్తూ ఏకంగా 32 మంది అధిష్టానానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే ఆ పార్టీ ఆశావహుల జాబితా చాంతాడంత తయారైంది. తొమ్మిది స్థానాలకు ఏకంగా 32 మంది తమ పేర్లను పరిశీలించాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా డీసీసీ ద్వారా చేసుకున్న దరఖా స్తులే కాకుండా కొందరు నేతలు నేరుగా టీపీసీసీ కి అందజేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కు మార్రెడ్డి ప్రకటించారు. ఆశావహులు ఎవరైనా తమ దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ కమిటీకి అ ప్పగించాలని, ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుందని ఆ పార్టీ ప్రక టించింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం. టికెట్ల కోసం తమకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే తొలివిడతగా పీసీసీకి అందజేశామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తాహెర్బిన్ హందాన్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే.. మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డికి ఖరారు కానున్న బోధన్ స్థానానికి.. ఉప్పు సంతో ష్ కూడా తన దరఖాస్తును పీసీసీ కార్యాలయంలో చివరి రోజు అందజేశారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీకి ఖారారు కానున్న కామారెడ్డికి నల్లవెల్లి అశోక్ కూడా తన పేరును పరిశీలించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఆర్మూర్ స్థానానికి అకుల లలితతో పాటు, మార చంద్రమోహన్, ఏబీ శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డి, నగేష్రెడ్డి, భూమారెడ్డి దరఖాస్తులు డీసీసీకి అందాయి. తొమ్మిది స్థానాలకు 32 దరఖాస్తులు.. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల టికెట్ల కోసం ప్రస్తుతానికి 32 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. డీసీసీకి వచ్చిన వాటితో పాటు, కొందరు నేరుగా టీపీసీసీకి సైతం అందజేశారు. తమకు పరిచయం ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, రేవంత్రెడ్డి వంటి నేతలను ఆశ్రయించి దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి తెరపైకి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 32 కాగా, శనివారం ఈ సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఓ అప్లికేషన్ పెడితే పోలా..! ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులకు, మాజీ ఎమ్మెల్యేలకు అనుచరులుగా పనిచేసిన నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయానికి వచ్చే సరికి తమ నేతలతో సైతం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు సభ్యునికి కూడా పోటీ చేయని నేతలు ఒకరిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం కూడా ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే.. నిజామాబాద్ అర్బన్ స్థానానికి బి.మహేష్కుమార్గౌడ్, తాహెర్బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణులతో పాటు ఓ ఎన్ఆర్ఐ నుంచి కూడా దరఖాస్తు వచ్చింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే హరినారాయణ్ కుటుంబానికి చెందిన కళ్యాణ్ అనే ఎన్ఆర్ఐ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాల్కొండలో ఈరవత్రి అనిల్ దరఖాస్తుతో పాటు, పార్టీ కిసాన్కేత్ వైస్ చైర్మన్ అన్వేష్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మానాల మోహన్రెడ్డి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ స్థానానికి కాసుల బాల్రాజుతో పాటు, మల్యాద్రిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, మహిళా నేత సబితలతో పాటు, ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రొఫెసర్ విద్యాసాగర్రావు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, వడ్డేపల్లి సుభాష్రెడ్డి, జమునారాథోడ్, పైల కృష్ణారెడ్డిల దరఖాస్తులు డీసీసీకి అందాయి. జుక్కల్ (ఎస్సీ) స్థానానికి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, అరుణతార, గడుగు గంగాధర్, తుకారాంలు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని దరఖాస్తు పెట్టుకున్నారు. -
ఆజాద్ను చుట్టుముట్టిన ఆశావహులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీఆర్ఎస్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసరడంతో.. కాంగ్రెస్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. కానీ కాంగ్రెస్లో ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ను గురువారం గాంధీభవన్ వద్ద ఆశావహులు చుట్టుముట్టారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆజాద్.. టికెట్ల విషయం తర్వాత అని.. ముందు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇంత ముందుగా టికెట్లు ఇవ్వడం కుదరదని అన్నారు. టికెట్ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగటం కాదని.. నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. సీనియర్లు అయి, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తే.. పార్టీనే పనితీరు గుర్తించి టికెట్లు ఇస్తుందని తెలిపారు. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు పార్క్ హయత్లో బస చేసిన ఆజాద్తో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు భేటీ అయ్యారు. బుధవారం ప్రకటించిన ప్రచార కమిటీ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ వస్తుందని ఆశించానని వీహెచ్ తెలిపారు. 1989లో ప్రచార కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చిన సమర్ధుడినని అన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టులున్నారని.. తనకు పదవి ఇస్తే కేసీఆర్ను ఓడిస్తానని కోవర్టులు భయపడుతున్నారని ఆరోపించారు. కోవర్టులే తనకు పదవి రాకుండా చేశారని విమర్శించిన ఆయన.. త్వరలో వారి పేర్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్కు చెబుతానని అన్నారు. కాగా నిన్న ప్రకటించిన కమిటీల్లో.. పార్టీ వ్యూహరచన, ప్రణాళిక రూపకల్పన కమిటీ చైర్మన్ బాధ్యతలను వీహెచ్కు అప్పగించారు మరోవైపు టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి మహా కూటమిగా ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్న కాంగ్రెస్ పొత్తుల తర్వాతే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే కాంగ్రెస్లో టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు కూటమి వల్ల తమకు టికెట్ దక్కకుండా పోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టికెట్ల పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ రాజకీయం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఖరారుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలుమార్లు హస్తినకేగిన నేతలు తాజాగా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పొత్తులు ఖరారు కాకున్నా.. నేతలు టికెట్ల రేసులో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఉప్పల్, షాద్నగర్, కల్వకుర్తి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, పరిగి తదితర స్థానాల్లో ఆశావహులు ఒకరిద్దరే ఉన్నా మిగతా చోట్ల మాత్రం చాంతాడంతా జాబితా ఉండడం కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. కొత్త పంచాయతీ.. చేవెళ్ల నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరడంతో ఈ నియోజకవర్గం టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి ఈసారి తనకే టికెట్ ఖాయమని భావించిన తరుణంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే దరఖాస్తులివ్వండి.. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆశావహుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. శాసనసభ బరిలో దిగడానికి కదన కుతుహలాన్ని ప్రదర్శిస్తున్న నేతల బయోడేటాలను సేకరిస్తోంది. సమర్థత, సర్వేల ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని గతంలో స్పష్టం చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు తెరలేపడంతో ఆశావహులు గాంధీభవన్లో బారులుతీరారు. అక్టోబర్ రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్వీకరిస్తున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి షార్ట్ లిస్ట్ తయారు చేయాలని పీసీసీకి నిర్దేశించింది. ఈ మేరకు పీసీసీ నివేదించే జాబితాను పార్లమెంటు సభ్యుడు భక్తచరణ్దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. కాగా, టికెట్ కావాలనుకునేవారు విధిగా దరఖాస్తులు సమర్పించాల్సిందేనని కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టం చేయడంతో ఆశావహులు మంగళవారం గాంధీభవన్కు తరలివచ్చారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ను కలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, పడాల వెంకటస్వామి, రాచమల్ల సిద్ధేశ్వర్, నందికంటి శ్రీధర్, ఇటీవల పార్టీలో చేరిన రోహిత్రెడ్డి, ముంగి జైపాల్రెడ్డి తదితరులు తమ బయోడేటాలను అందజేశారు. పార్టీకి చేసిన సేవలు, సామాజికవర్గం, అర్థ, అంగబలం తదితర అంశాలను పొందుపరుస్తూ దరఖాస్తులను సమర్పించారు. బుధవారం వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని డీసీసీ సారథి మల్లేశ్ చెప్పారు. కేఎస్ రత్నం టీఆర్ఎస్కు రాజీనామా చేయడం.. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జరుగుతున్న ప్రచారం.. రేసుగుర్రాల ఆశలపై నీళ్లుజల్లుతోంది. ఈ సీటుపై కన్నేసిన శంషాబాద్ మాజీ సర్పంచ్ రాచమల్ల సిద్ధేశ్వర్ ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడితో టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘం నేత పోచయ్య కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. బస్తీమే సవాల్.. వికారాబాద్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రులు ప్రసాద్కుమార్, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ల నడుమ టికెట్ పోరు నడుస్తోంది. వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న ఈ మాజీ మంత్రులు టికెట్టు కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. ఒకవేళ టికెట్ లభించకపోతే ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచిస్తున్నారు. ఎవరికివారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నెరుపుతున్న ఈ ఇరువురిని సర్దుబాటు చేయడం అధిష్టానానికి చికాకుగా మారనుంది. మరోవైపు వికారాబాద్ అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్ఎస్ పెండింగ్లో పెట్టడం కూడా కాంగ్రెస్లో వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు గులాబీకి గూటికి చేరుతారనే సంకేతాల నేపథ్యంలోనే ఈ టికెట్టును పెండింగ్ పెట్టారనే ప్రచారంతో పీసీసీకి ఏమీ పాలుపోవడం లేదు. ఇద్దరూ వికారాబాదే కావాలని పంతాలకు దిగుతుండడం కూడా ఇరకాటంలో పడేసింది. తాండూరులోనూ ఇదే.. తాండూరులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో పోటీచేసిన రమేశ్ మరోసారి బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటుండగా తాజాగా రోహిత్రెడ్డి పార్టీలో చేరారు. టికెట్పై హామీ లభించిన తర్వాతే ఆయన పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రమేశ్ అభ్యర్థిత్వంపై మొదట్నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తాజా పరిణామాలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రయం మధ్య సయోధ్య కుదుర్చడం కాంగ్రెస్కు తలకుమించిన భారమే! పోటీ నామమాత్రమే.. కల్వకుర్తి, పరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వంశీచంద్రెడ్డి, రామ్మోహన్రెడ్డి టికెట్లకు ఢోకాలేకపోగా.. షాద్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రతాప్రెడ్డి, సుధీర్రెడ్డి అభ్యర్థిత్వాలపై పార్టీలో ఏకాభిప్రాయం ఉంది. మేడ్చల్ టికెట్టుపై మాత్రం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ పోటీకి విముఖత చూపుతుండడంతో ఎవరిని బరిలో దించుతారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జంగయ్యయాదవ్, నర్సింహారెడ్డి ఈ స్థానంపై కన్నేశారు. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లిలో కూడా పెద్దగా ఆశావహులు లేరు. మల్కాజిగిరిలో నందికంటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్.. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, దేప భాస్కరరెడ్డి, రాజేంద్రనగర్లో కార్తీక్రెడ్డి, జైపాల్రెడ్డి, కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలం టికెట్ల రేసులో ఉన్నారు. పట్నంలో పాత కథే.. ఇబ్రహీంపట్నంలో పాతకథే పునరావృతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఎవరికివారు టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. ఐదేళ్లుగా గ్రూపులుగా విడిపోయిన పార్టీకి ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ అండతో టికెట్టు కోసం మల్రెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు సాగిస్తుండగా.. రాజకీయ గురువు, కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య ఆశీస్సులతో మరోసారి టికెట్ లభిస్తుందని మల్లేశ్ భావిస్తున్నారు. -
మెత్తబడ్డ ఓదెలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు రంగులు మారుతోంది. పది మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మందికి సీట్లిచ్చిన పార్టీ అధ్యక్షుడు చెన్నూర్లో మాత్రమే నల్లాల ఓదెలును మార్చారు. ఇక్కడ నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్కు అవకాశం కల్పించడంతో వారం రోజుల పాటు సాగిన హైడ్రామాకు వినాయక చవితి రోజు ముగింపు లభించింది. ముఖ్య మంత్రి కేసీఆర్తో భేటీ అయిన తరువాత ఓదెలు తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో చెన్నూర్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ఓదెలు చెప్పారు. అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలి యని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నూర్ రాజకీయం రసకందాయంలో పడింది. బోథ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ బీఫారం పంపిణీ నాటికి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఖానా పూర్లో మాత్రం రమేష్ రాథోడ్ ఇప్పటికే రెబల్ అవతారం ఎత్తారు. ఇండిపెండెంట్గానైనా పోటీ ఖాయమని తేల్చేశారు. ఆయన కోసం కాంగ్రెస్ కూడా ఎదురుచూస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి టీకప్పులో తుపాను వంటిదేనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం రసంకందాయంలో పడింది. బోథ్లో టికెట్టుపై ఆశతో నగేష్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ సీటుపై ఇప్పటికీ ఆశతోనే ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకే సీటు లభించింది. అయితే ఎంపీ అయినప్పటికీ శాసనసభకే పోటీ చేయాలనే ఆలోచనతో బోథ్లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నగేష్ పార్టీ టికెట్ రాకపోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు ఈనెల 3వ తేదీన స్వయంగా పార్టీలోని ఓ కీలక నాయకుడు సీటుపై హామీ ఇవ్వగా, ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు. ఈ విషయమై ఇప్పటికే నగేష్ ముఖ్యమంత్రిని రెండుసార్లు కలిసినట్లు సమాచారం. శుక్రవారం ఇచ్చోడలో పార్టీ నాయకులతో సమావేశమైన నగేష్ సీటు విషయంలో ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సర్వేలను ప్రభావితం చేయడం, కొందరు నాయకులు తన పట్ల తప్పుగా అధిష్టానానికి నివేదికలు ఇవ్వడం వల్లనే బోథ్ అభ్యర్థిత్వం విషయంలో పరిగణలోకి తీసుకోలేదని ఆయన చెపుతున్నారు. తప్పనిసరిగా తనకు బోథ్ బీఫారం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ఖానాపూర్లో రెబల్ స్టార్గా రాథోడ్ ఖానాపూర్లో రేఖా నాయక్ను మార్చి తనకు సీటివ్వాల్సిందేనని ఇప్పటికే రాథోడ్ రమేష్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. సీటివ్వకపోతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖానాపూర్లో పోటీ చేయడం, గెలవడం ఇప్పటికే ఖరారైందని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఒకవేళ టికెట్లు మార్చే పరిస్థితి ఎదురైనా... టీఆర్ఎస్ మీద బాహాటంగా విమర్శలు చేసిన రాథోడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఏమాత్రం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు సంపాదించే విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం. చెన్నూర్లో కలిసి కాపురం సాధ్యమా..? చెన్నూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ఓదెలు స్థానంలో బాల్క సుమన్కు సీట్విడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సామాజిక సమీకరణాల్లో కూడా రెండు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో సమస్య తీవ్రమైంది. ఇందారంలో ఓదెలుకు మద్దతుగా పెట్రోలు బాటిల్తో హల్చల్ చేసి, చివరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రేగుంట గట్టయ్య కూడా సామాజికంగా ఓదెలు వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఓదెలు అంశాన్ని ఓ వర్గం రాష్ట్ర స్థాయి అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది కూడా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ఓదెలు తన అసంతృప్తిని అటకెక్కించినట్లు కనిపించినా... మనస్ఫూర్తిగా పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఓదెలుతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఒక్క చాన్స్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. నాకంటే నాకు టికెట్ కేటాయించాలంటూ రాజధాని స్థాయిలో నాయకులు బలప్రదర్శనకు దిగుతుండటం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వివిధ పార్టీలతో కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న మహాకూటమి వల్ల తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోకుండా చూసుకునేందుకు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరేందుకు హైదరాబాద్ బాట పట్టారు. అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో పలు పక్షాలు మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు తమ నియోజకవర్గంలో మరో పార్టీకి టికెట్ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానానికి మొరపెట్టుకునేందుకు బారులు తీరుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదుర్చుకుని.. జిల్లాలోని పది నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కె.నారాయణ పోటీ చేసి ఓటమి చెందగా.. మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి సీపీఐ మద్దతుతో మాజీ మంత్రి బలరాంనాయక్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ.. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసింది. మిగతా ఏడు నియోజకవర్గాల్లో సీపీఐ మద్దతుతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగి ఖమ్మం, పాలేరు, ఇల్లెందు, మధిర నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇదే పద్ధతిలో ఈసారి జరిగే ఎన్నికల్లో సైతం సీపీఐ, కాంగ్రెస్ ఎన్నికల మైత్రి కొనసాగుతుందని భావించినా.. రాష్ట్రస్థాయిలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో చేయి కలపడానికి ఇటు టీడీపీ, అటు తెలంగాణ జన సమితి సిద్ధం కావడంతో ఏ పార్టీ ఎక్కడి నుంచి టికెట్లు ఆశిస్తుందో.. తమకు పోటీ చేసే అవకాశం ఏ రకంగా కోల్పోవాల్సి వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ ఆశావహుల్లో పెల్లుబుకుతోంది. విన్నవించే పనిలో నాయకులు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, ఓట్లను ప్రామాణికంగా తీసుకుని ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించవద్దని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఏ పార్టీకి బలముంటే ఆ పార్టీకి టికెట్ కేటాయిస్తేనే కాంగ్రెస్కు జిల్లాలో పునరుజ్జీవం కలుగుతుందని కాంగ్రెస్ ఆశావహులు నియోజకవర్గాలవారీగా వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని, పలువురు రాష్ట్ర నేతలను కలిసి విన్నవించే పనిలో పడ్డారు. రెండు రోజులుగా అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సహా హైదరాబాద్ వెళ్లారు. తమ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించకుండా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించితే గెలిపించి తీసుకొస్తామని భరోసా ఇస్తుండడంతో పార్టీ నేతలు ఆశావహులకు ఎలా నచ్చజెప్పాలో పాలుపోక ఆయా అభ్యర్థులను పరిశీలిస్తామని చెబుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలను ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ కోరుతుండడం.. పొత్తు ఉండడంతో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు గల ఆదరణ, టీడీపీ బలహీనపడిన తీరును ఓట్ల లెక్కలతో సహా పార్టీ నేతల ముందు ఉంచడం విశేషం. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వాలని, పొత్తులో టీడీపీకి కేటాయించవద్దని కోరుతూ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు సున్నం నాగమణి, కారం శ్రీరాములు, దంజునాయక్ తదితరుల నేతృత్వంలో కార్యకర్తలు హైదరాబాద్కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడికి ఇక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. గతంతో పోలిస్తే టీడీపీ ఇక్కడ బలహీనపడిందని, ఎక్కువ మంది కార్యకర్తలు మాజీ మంత్రి తుమ్మలను అనుసరిస్తున్నారని, అక్కడ బలమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వారు తమ వాదనను వినిపించారు. వైరాపై పట్టు.. వైరా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేయగా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కే వైరా సీటు కేటాయించాలంటూ అక్కడి కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలతోపాటు పలువురు కార్యకర్తలు తమ మనోభావాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు వారం రోజుల క్రితం మాజీ పోలీస్ అధికారి, వైరా నుంచి టికెట్ ఆశిస్తున్న రాములునాయక్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద ఆందోళన నిర్వహించగా.. తాజాగా కాంగ్రెస్ నుంచి లకావత్ గిరిబాబు నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివెళ్లి.. కాంగ్రెస్ పోటీ చేస్తే వైరాలో విజయం సాధించడం ఖాయమంటూ వివరించారు. ఎన్నికల పొత్తులో కాంగ్రెస్ సీటు చేజార్చుకోవడం సబబు కాదని, గత ఎన్నికలకు ఇప్పటికి రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ బలాన్ని పరిశీలించి కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఉత్తమ్ ముందు తమ వాదన వినిపించారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మంగీలాల్ సైతం టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి కాంగ్రెస్కు గల సానుకూలతను వివరించారు. ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం సీటు ఇక ఉమ్మడి జిల్లాలో అత్యధిక రాజకీయ ప్రాధాన్యం కలిగిన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల పొత్తు ఎవరికి మోదం.. మరెవరికి ఖేదం కానుంది.. అనే అంశం రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఈసారి కొత్తగూడెం స్థానాన్ని తమకంటే తమకు కేటాయించాలని పట్టుపట్టడంతోపాటు తమకున్న రాజకీయ పరిచయాల ద్వారా పార్టీ నేతలపై ఒత్తిడి తేవడంతో ఈస్థానం నుంచి మిత్రపక్షాల అభ్యర్థి ఎవరు అవుతారన్న అంశం ఆసక్తి రేపుతోంది. కొత్త గూడెం అసెంబ్లీ స్థానాన్ని ఈ దఫా కాంగ్రెస్కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర, జెడ్పీటీసీ పరం జ్యోతి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లి కొత్తగూడెంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్కు టికెట్ లభిస్తే విజయం సునాయాసం అవడానికి గల అవకాశాలను వివరించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీల బలాబలా లను బేరీజు వేసుకుని కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలని, ఈసారి కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పోటీ చేయకపోతే పార్టీ శ్రేణులకు నిరాశ నిçస్పృహ కలగడంతోపాటు పనిచేసే వారికి గుర్తింపు లేదన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు వాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకుడు దళ్సింగ్ టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకు ఈసారి అవకాశం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ ఇల్లెందులో విజయం సాధించడానికి అనేక సానుకూల పరిస్థితులు దోహదం చేయనున్నాయని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో టీడీపీ, సీపీఐ కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్ నేతలు సైతం గట్టి పట్టుపట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం, వారిని విజయపథంలో నడిపించడం మహాకూటమికి కత్తిమీద సామేనన్న ప్రచారంజరుగుతోంది. -
త్యాగాలకు సిద్ధమే..!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని, అయితే పార్టీ కోసం పని చేసే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ బృందం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని శుక్రవారం కలిసింది. ఈ బృందంలో రాజేందర్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రతినిధిగా హాజరయ్యారు. వరంగల్, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుల బృందం తరఫున రాజేందర్రెడ్డి దాదాపు 10 నిమిషాలు రాహుల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని, కానీ క్రమశిక్షణ లేకనే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ల కోసం పార్టీలు మారుతున్న వాళ్లు.. గెలిచిన తర్వాత పార్టీని నట్టేట్లో ముంచి వెళ్లిపోతున్నారని, ఇలాంటి వాళ్లకు ఈ సారి టికెట్లు ఇవ్వొద్దని రాహుల్కు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాహుల్ కల్పించుకొని ‘మీరు ఎప్పుడైనా పోటీ చేశారా?’ అని అడుగగా తాను ఇప్పటి వరకు బీఫాం చూడలేదని బదులిచ్చారు. దీంతో ‘డోంట్ వర్రీ’ అని రాహుల్ భుజం తట్టినట్లు రాజేందర్రెడ్డి అనుచరులు వెల్లడించారు. గెలిచే సీట్లలో రాజీ వద్దు : రాహుల్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, రేవంత్రెడ్డి, సంపత్ తదితరులతో భేటీ అయిన రాహుల్ తెలంగాణ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపికపైనా చర్చిం చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా గెలిచే సీట్ల విషయంలో రాజీ పడొద్దని నేతలను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని పొత్తు, అభ్యర్థుల విషయంలో ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దని సూచించా రు. ఏమైనా సమస్యలుంటే ఇన్చార్జితోగానీ తనతోగానీ నేరుగా మాట్లా్లడొచ్చని రాహుల్ వారికి తెలిపారు. -
కమలోత్సాహం
సాక్షి, మెదక్: బీజేపీలో టికెట్ల పోరు మొదలైంది. దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. వారు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మద్దతు కూడగట్టేందుకు ఎవరికివారే పావులు కదుపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల వ్యూహా ప్రతివ్యూహాలతో బీజేపీలో అంతర్గత రాజకీయాలు వెడెక్కాయి. బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనుంది. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టేందుకు కోసం నియోజవర్గాల వారీగా సర్వేలు జరిపిస్తోంది. సర్వేలో బలమైన నాయకులుగా తేలితేనే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పలవురు నాయకులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ జాబితా వెలువరించిన తర్వాతే బీజేపీ వారి జాబితా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కని నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మహబూబ్నగర్ జిల్లా పర్యటన కోసం త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఆయన ఈ ఎన్నికలపై ముఖ్యనేతలతో చర్చించటంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ ఆశావహుల చూపు అమిత్షా పర్యటనపై నెలకొంది. కాగా కొందరు నేతలు తమకున్న పరిచయాల ద్వారా అమిత్షాను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురి మధ్య పోటీ! మెదక్ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు. ముందస్తు ఎన్నికల జరుగుతాయని తెలిసిన వెంటనే ఎవరికివారే ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు రామ్చరణ్యాదవ్, ఉపాధ్యక్షుడు కటికె శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తనకు టికెట్ ఇవ్వాలని రామ్చరణ్యాదవ్ కోరుతున్నాడు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటికె శ్రీనివాస్ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను కలిసి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా శ్రీనివాస్కు టికెట్ కేటాయింపు విషయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆనుకూలంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ తాను పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తున్నానని, ఈ మారు తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దల వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో ముగ్గురిలో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పక్క పార్టీ నేతల చూపు నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్పై బీజేపీ నేతలతోపాటు పక్క పార్టీల నేతలు సైతం ఆశపడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు గోపీ, రమేశ్గౌడ్తోపాటు ఇటీవల పార్టీలో చేరిన రఘువీరారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే రఘువీరారెడ్డి టికెట్ తనకే ఖాయమన్న విశ్వాసంతో ఉన్నారు. కాగా బీజేపీ లో చేరేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నట్ల సమాచారం. హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ కూడా ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మదన్రెడ్డి పేరు ప్రకటించటంతో ఆమె బీజేపీ టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే బీసీ మహిళా నేత సోమన్నగారి లక్ష్మి సైతం బీజేపీ టికెట్పై కన్నేసినట్లు తెలుస్తోంది. కమలోత్సాహం -
అసమ్మతి మంటలు
గులాబీ రాజకీయం రచ్చకెక్కుతోంది. టికెట్ల ప్రకటనతో మొదలైన చిచ్చు.. రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటివరకు కేవలం ప్రకటనలకే పరిమితమైన అసమ్మతి కాస్తా.. ఆందోళనల వరకు వెళ్లింది. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా చేవెళ్లలో కేఎస్ రత్నం, ఆయన వర్గీయులు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. షాద్నగర్లో అంజయ్యయాదవ్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆశావహులు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో అసంతుష్ట నేతలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చలు జరుపుతోంది. టికెట్టు రాకపోవడంతో నిరాశకు గురైన కొందరు మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా.. మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలతో కల్వకుర్తి సెగ్మెంట్ అసమ్మతి నేతలు మెత్తబడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నేతలు గోలి శ్రీనివాస్రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డితో భేటీ అయిన ఆయన.. కలిసికట్టుగా పనిచేయాలని హితోపదేశం చేసినట్లు సమాచారం రత్నం రాజీనామా.. గత ఎన్నికల వేళ టీఆర్ఎస్ గూటికి చేరిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. భారీగా హాజరైన అనుచరుల మధ్య పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. సొంతపార్టీ నేతల కుట్రలు, టికెట్టు ఇవ్వకుండా అవమానాలు భరించలేకే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో తనపై ప్రత్యర్థిగా దిగి గెలిచిన కాలె యాదయ్యను పార్టీలో చేర్చుకోవడమేగాకుండా ఆయనకే తిరిగి టికెట్టు కట్టబెట్టడంతో రత్నం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్టు ఖరారు చేయాలని నిర్ణయించిన గులాబీ హైకమాండ్.. రత్నంకు వికారాబాద్ సీటును కేటాయించే అంశాన్ని పరిశీలించింది. దీనిపై కూడా స్పష్టతనివ్వకుండా నాన్చడంతో టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. అయితే, రత్నం పార్టీని వీడకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మధ్యవర్తిత్వం నెరిపినా ఫలితం లేకుండా పోయింది. షాద్నగర్లో బలప్రదర్శనలు షాద్నగర్ సీటును సిట్టింగ్ శాసనసభ్యుడు అంజయ్యయాదవ్కు ఖరారు చేయడంతో ఆయన వైరివర్గం రోడ్డెక్కింది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యతిరేకవర్గాలను ఏకం చేస్తోంది. సీనియర్ నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయగా బుధవారం అంజయ్య సొంత మండలమైన కేశంపేటలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సవాల్ విసిరింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ అధిష్టానం.. అసమ్మతి నేతల బుజ్జగింపునకు ఎంపీ జితేందర్రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డిని రంగంలోకి దించింది. ఈ మేరకు శంకర్, బాబయ్య ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపారు. అంజయ్యకు సహకరించాలని, అధికారంలోకి వచ్చినా తర్వాత అందరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు ససేమిరా అన్న ఇరువురి అనుచరవర్గం.. రెబల్గా బరిలో దిగుతామని స్పష్టం చేసింది. ‘పట్నం’లోనూ మంటలు ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ నిరంజన్రెడ్డి, శేఖర్గౌడ్ అసమ్మతిరాగం వినిపిస్తున్నారు. కిషన్రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే అబ్దుల్లాపూర్మెట్ మండలంలో కొందరు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శేఖర్గౌడ్ నేతృత్వంలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చంద్రశేఖర్రెడ్డి తీవ్ర అవమానభారంతో కుంగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచిన తనను పక్కనపెట్టడంతో నారాజ్ అయ్యారు. విలువలేని పార్టీలో కొనసాగడం కన్నా.. ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలని ఆయనపై మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. ఆగని నిరసనలు.. ఎల్బీనగర్లో రామ్మోహన్గౌడ్కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు జట్టు కట్టగా.. కూకట్పల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సీటు కేటాయించడంతో కార్పొరేటర్ పన్నాల కావ్య నిరసన దీక్షకు దిగారు. కుత్బుల్లాపూర్లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కొలను హన్మంతరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించగా.. రాజేంద్రనగర్లో సీనియర్ నేత తోకల శ్రీశైలంరెడ్డి భారీ అనుచరగణంతో ప్రకాశ్గౌడ్కు వ్యతిరేకంగా బలప్రదర్శన చేశారు. -
అమ్మా నాన్న.. ఓ ఎమ్మెల్యే టికెట్
ఇది అమ్మానాన్నల తండ్లాట.. పిల్లల రాజకీయ భవిష్యత్ కోసం తండ్లాట.. తమకు బలం ఉన్నప్పుడే బిడ్డలను నేతలుగా నిలబెట్టాలనే తపన.. తమ రాజకీయ జీవితాలను త్యాగం చేసైనా కొడుకు, కూతుళ్లను అధికారంలోకి తేవాలనే ఆరాటం.. కొండా దంపతులు తమ కూతురు కోసం తమ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడితే.. ములుగులో చందూలాల్ తన కొడుకు కోసం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రెడ్యానాయక్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయ బలం ఉపయోగించి కూతుళ్ల కోసం చక్రం తిప్పుతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలోపడ్డారు. తమకు ప్రజల్లో పేరు, ప్రతిష్టలు ఉన్నప్పుడే తమ వారసులను రాజకీయ రంగం మీద అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. తమకు టికెట్లు రాకపోయిన ఫరవాలేదు.. తమ పిల్లలను మాత్రం ఎమ్మెల్యేలుగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. కూతురు కోసం కొండా దంపతులు.. ఈ సారి కూతురు సుష్మితా పటేల్ను రాజకీయ అరంగేట్రం చేయించడానికి కొండా మురళి, సురేఖ దంపతులు గట్టి పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లను ఆశించారు. అవకాశం కలిసి వస్తే భూపాలపల్లి నుంచి సుష్మితను నిలబెట్టాలని ఆలోచించారు. రెండు సీట్లు రాకుంటే వరంగల్ తూర్పులో సురేఖ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి కూతురు భవిష్యత్కు పునాదులు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఆమె టికెట్ను పెండింగ్లో పెట్టింది. దీంతో వాళ్లు కారుతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కూతురు సుష్మితను పరకాల నుంచి, సురేఖ వరంగల్ తూర్పు నుంచి నిలబడేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఏకాభిప్రాయం కుదరకపోతే స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్గా అయితే పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నుంచి ముగ్గురు నిలబడే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. స్టేషన్ఘన్పూర్పై శ్రీహరి.. ఎమ్మెల్సీతో రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను రాజకీయ రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించేందుకు స్కెచ్ వేశారు. అయితే సిట్టింగుల కోటా కింద గులాబీ దళపతి కేసీఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయం కడియం శ్రీహరి వర్గాన్ని కలవరపరిచింది. నియోజకవర్గంలోని ఆయన అనుకూల వర్గం ప్రజాప్రనిధులు రోడ్డెక్కారు. సభలు పెట్టి రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక మహిళతో శృంగార పలుకులతో రాజయ్య స్వరాన్ని పోలిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ములుగులో.. ములుగు ఎమ్మెల్యే, ఆపద్ధర్మ మంత్రి చందూలాల్ ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి టికెట్ తన కుమారుడు, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్కు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ములుగు నియోజకవర్గంలో చందూలాల్కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రహ్లాద్ చక్కబెడుతున్నారు. అధికారులతో మాట్లాడడంతోపాటు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్యానాయక్కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారైంది. తన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్ను ఆశించి భంగపడ్డారు. దీంతో కూతురు టికెట్ విషయంపై ఆయన ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే కూతురు కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. -
పట్నం చేరిన ‘పంచాయితీ’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిరసన సెగ రాజధానికి తాకింది. టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చాలనే నిరసనలు ఇప్పటివరకు నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి. అయితే ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన నేతలతోపాటు అభ్యర్థుల వైఖరిని వ్యతిరేకిస్తున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం.. వారిపై ఉన్న అసం తృప్తిని పార్టీ అధినాయకత్వానికి చాటిచెప్పే ప్రయత్నాలను వేగవంతం చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతోపాటు కొత్తగూడెంలోనూ అభ్యర్థులను మార్చాలంటూ ఆందోళనలు చేపట్టడంతో ఇవి ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో గుబులు వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మట్టా దయానంద్ తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర నిర్వేదానికి గురై కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. తన రాజకీయ భవిష్యత్.. కార్యాచరణ రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు మోటారు సైకిళ్ల ప్రదర్శన, సత్తుపల్లిలో సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే వ్యక్తిగా.. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తిగా పార్టీ టికెట్ ఆశించానని, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ సత్తుపల్లి అభ్యర్థిత్వం విషయంలో పునఃపరిశీలించాలని కోరారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటానని స్పష్టం చేయడం, దయానంద్ నిర్వహించిన ర్యాలీకి లభించిన స్పందనపై ఇంటెలీజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ జిల్లాలోని పలువురు అభ్యర్థుల అభ్యర్థిత్వంపై వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు గౌరవం ఇచ్చి.. కార్యకర్తలకు అండగా ఉండే వారికి టికెట్లు ఇస్తే వారిని గెలిపించడానికి సిద్ధమంటూ వైరా నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం నాయకులు ఆయా మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి రాజకీయ సెగ అధినాయకత్వానికి తెలియాలన్న లక్ష్యంతో ఇద్దరు జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది. కొత్తగూడెంలో కూడా.. మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ.. అక్కడి టీఆర్ఎస్లోని అసమ్మతి వర్గం మంగళవారం ఆందోళనకు దిగడంతో జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై నిరసన సెగలు అలుముకున్న తీరును నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైరా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై తాజా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్కు వెళ్లి ఎంపీ, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావును, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిసి నియోజకవర్గ పరిస్థితులపై వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించి.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మట్టా దయానంద్ సైతం తనకు మద్దతు పలుకుతున్న కార్యకర్తలు, నాయకులతో కలిసి హైదరాబాద్కు వెళ్లి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉండాలని మంగళవారం జరిగిన సమావేశంలో దయానంద్ను పలువురు కోరడం, దానిపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమాలోచనలు జరిపి అనంతరం నియోజకవర్గ పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలియజేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారుపై నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్లోని పలు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించడానికి.. అసమ్మతి నేతలకు నచ్చజెప్పేందుకు పార్టీ అధినాయకత్వం జిల్లా మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరును పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈనెల 6న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈనెల 14న పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి హోదాలో తొలిసారిగా జిల్లాకు రానుండడంతో తన నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ పూర్తి చేసుకుని తర్వాత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎగసిపడుతున్న అసమ్మతిపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాలవారీగా అభ్యర్థులతోనూ.. అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తున్న నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
నిరసన సెగలు
టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. వైరాలో తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, సత్తుపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అభ్యర్థిత్వాలను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు సమావేశాలు నిర్వహిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిత్వాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. వైరాలో పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి.. ప్రతులను సీఎం కేసీఆర్కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. సత్తుపల్లిలో డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతున్న సభలోనే ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి: సీఎం కేసీఆర్ను చేతులు జోడించి అడుగుతున్నా.. గెలిచే వ్యక్తికి సీటు ఇవ్వండి.. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలనే ఉద్దేశం లేదు.. ఓడిపోయినా.. ప్రజల మధ్యనే ఉన్నా.. నిజాయితీగా రాజకీయాలు చేశా.. ప్రజల ఆకాంక్ష .. స్థానికుడికే సీటు ఇవ్వాలంటూ డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ స్థానికుడికే ఇవ్వాలంటూ మంగళవారం తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సత్తుపల్లిలోని ఎంఆర్ఆర్ గార్డెన్స్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒకసారి సత్తుపల్లి టికెట్ పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను.. పదవిలో లేకున్నా ప్రజల కోసమే పని చేస్తున్నా. ఉన్నదంతా ఖర్చుపెట్టుకున్నాను.. ఇప్పటికీ నా భార్య డాక్టర్ రాగమయి డబ్బుతోనే తిరుగుతున్నానంటూ భావోధ్వేగానికి లోనయ్యారు. కందుకూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్రావు పాల్గొన్న సమయంలో ‘దయానంద్ మా పార్టీలోకి రండి.. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇస్తాను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా చెప్పారు’.దయానంద్ సతీమణి డాక్టర్ రాగమయి మాట్లాడుతూ మా సంపాదనలో 90 శాతం ప్రజలకు ఖర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో లక్కినేని రఘు, ఏనుగు సత్యంబాబు, కోటగిరి శ్రీనివాసరావు, చెక్కిలాల మోహన్రావు, మలిరెడ్డి మురళీరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, వేమురెడ్డి కృష్ణారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఎండీ కమల్పాషా, నారాయణవరపు శ్రీనివాస్, మొరిశెట్టి సాంబ, ఫయాజ్ అలీ పాల్గొన్నారు. టికెట్ ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం సత్తుపల్లి: దయానంద్కు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్తో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామస్తుడు సాలి నాగరాజు, బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపుల్ల గీయబోతుండగా కొందరు అడ్డుకున్నారు. నీళ్లు తీసుకొచ్చి అతడిపై పోశారు. ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దంటూ నాగరాజును విజయ్కుమార్ కోరారు. వెంకటరావు టికెట్ రద్దు చేయాలని.. సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థిగా జలగం వెంకటరావుకు ఇచ్చిన టికెట్ను రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు పట్టణంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆందోళనకారులకు, పోలీసులకు వాగ్వావాదం జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు బండి రాజుగౌడ్, నాగబాబు, రషీద్, రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండాలని అన్నారు. గడిచిన నాలు గున్నర సంవత్సరాల కాలంలో కొత్తగూడెంలో వెంకటరావు కార్యకర్తలు, ప్రజలతో మమేకం కాలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ వద్దకు 50 బస్సుల్లో త్వరలో వెళ్లి జలగంకు టికెట్ను రద్దు చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్లు దుంపల అనురాధ, రాజేశ్వరి, ఎంపీటీసీ రుక్మిణి, మాజీ సర్పంచ్ గొగ్గెల లక్ష్మి, నాయకులు కనుకుంట్ల శ్రీనివాస్, హుస్సేన్, పప్పు సుబ్బారావు, రవిగౌడ్, లవకుమార్ పాల్గొన్నారు. మదన్లాల్ అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని సీఎంకు ఫ్యాక్స్ వైరా: వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్ మదన్లాల్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారు. వారిలో జెడ్పీటీసీ సభ్యులు బొర్రా ఉమాదేవి, తేజావత్ సోమ్లా నాయక్తో పాటుగా ఎంపీపీలు బాణోత్ మాధవి, బాణోత్ పద్మావతి, వైస్ ఎంపీపీలు తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఇమ్మడి రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు ముళ్లపాటి సీతారాములు, మడుపల్లి సాయమ్మ, శీలం ఆదినారాయణరెడ్డి, అలోత్ ఈశ్వరీబాయి, గుగులోత్ హీరాణి, బోడా కృష్ణవేణి, ఖాజా విజయరాణి, రూతమ్మ, బంకా లేయమ్మ, కేశగాని కృష్ణవేణి, వి.సుహాసిని, గుగులోత్ రాందాసు, భూక్యా అబ్రి, గరికపాడు సొసైటీ చైర్మన్ శీలం సురేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్లు ముక్తి వెంకటేశ్వర్లు, రాయల పుల్లయ్య రాజీనామా పత్రాలను సీఏం కేసీఆర్కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతిని ధులు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాణోత్ మదన్లాల్ ఉంటే పార్టీ గెలవటం అసాధ్యమని, అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ పార్టీ కోసం పనిచేసే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వే«ధింపులకు గురిచేశారని, ఆయన అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, సూత కాని జైపాల్, గుమ్మా రోశయ్య, కొప్పురావూరి వెంకటకృష్ణ, జాలాది రామకృష్ణ, మండేపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో టిక్కెట్ల రగడ
-
బుజ్జగిస్తూ.. భరోసా ఇస్తూ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కొందరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగానే.. వీరిలో అసంతృప్తి మొదలైంది. దానిని తొలగించేందుకు పార్టీ నేతలు నడుం బిగించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. వారిని బుజ్జగిస్తూ.. రాజకీయ భవిష్యత్కు భరోసా ఇచ్చేందుకు ముఖ్య నేతలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. టికెట్ల ఖరారు పూర్తి కావడంతో ఇక నియోజకవర్గాల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు, సొంత పార్టీలో అసమ్మతి స్వరాలను బుజ్జగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నేతలు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులపై టీఆర్ఎస్ నేతల్లో రగులుతున్న అంతర్గత అసంతృప్తులు ప్రకంపనలు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్కుమార్, బానోత్ మదన్లాల్కు టికెట్ ఖాయమని ముందు నుంచే ప్రచారమైంది. ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు సైతం లేకపోవడంతో టీఆర్ఎస్ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించినా.. వీరికి టికెట్లు ఖాయమని పార్టీ వర్గాలు విశ్వసించాయి. అనుకున్నట్లుగానే ఈ ముగ్గురికి టికెట్లు లభించినా.. సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సంబంధించి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. పార్టీ సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, లింగాల కమల్రాజ్ పేర్లను ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి ప్రకంపనలు రేపుతుండగా.. అదుపు చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు నడుం బిగించినట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ నేత డాక్టర్ మట్టా దయానంద్ టికెట్ తనకే లభిస్తుందన్న విశ్వాసంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా.. జిల్లా దిశ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పిడమర్తి రవికి కేసీఆర్ మరోసారి సత్తుపల్లి నుంచి అవకాశం ఇవ్వడంతో మట్టా దయానంద్ వర్గీయుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. అయితే స్థానికుడిగా ఉన్న దయానంద్కు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ పార్టీ వర్గాలు ప్రశ్నించడమే కాకుండా.. ఆందోళనకు సైతం పూనుకోవడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సత్తుపల్లి టీఆర్ఎస్ టికెట్ను స్థానికులకే ఇవ్వాలంటూ దయానంద్ అభిమానులు సత్తుపల్లి పట్టణంలోనూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఈ తరహా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించిన టీఆర్ఎస్ నేతలు.. దయానంద్కు రాజకీయ పరిస్థితులను వివరించడం ద్వారా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నచ్చజెప్పే ప్రయత్నాలు.. ఇక మధిర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మెర రామ్మూర్తి సైతం తనకు టికెట్ లభిస్తుందని ఆశించారు. ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన మరికొందరు ఈ టికెట్పై ఆశ పెట్టుకుని.. ఇటీవల పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మధిర నియోజకవర్గం టికెట్ కోసం జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత సైతం తొలుత ప్రయత్నాలు చేశారని, అవకాశం వస్తే పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇక బొమ్మెర రామ్మూర్తి వర్గీయులు కొంత అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. ఆయనను అనునయించడానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగి.. ఆయన రాజకీయ భవిష్యత్కు సంబంధించి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి నుంచి టికెట్ ఆశించిన మట్టా దయానంద్ రాజకీయ భవిష్యత్కు సైతం పార్టీ ముఖ్య నేతలు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి చిన్న అంశాన్ని ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తూ.. పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే అంశంపై దృష్టి సారించారు. గ్రామాలు.. పట్టణ ప్రాంతాల్లోనూ పట్టుండి రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్న టీఆర్ఎస్ ఉద్యమ నేతలను, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవడం ద్వారా రాజకీయ పరిస్థితులను వివరించి.. పార్టీ విజయానికి కృషి చేయాల్సిన పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ దూకుడు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అదే దూకుడును కొనసాగించడానికి సమాయత్తమవుతున్నారు.ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అభ్యర్థుల ప్రకటనను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని నిర్ణయిం చుకున్నారు. అభ్యర్థులను ముందు గానే ప్రకటిస్తామని బహిరంగం గానే చెప్పిన కేసీఆర్... ఆ ప్రక్రియను వచ్చే నెల్లోనే దాదాపుగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. దీనికి సెప్టెంబర్ రెండో పక్షంలోనే ముహూర్తాన్ని నిర్ణయించు కున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని 119 శాసనసభ, 19 లోక్సభ నియోజకవర్గాల్లో సగానికిపైగా అభ్యర్థులను వచ్చే నెల్లోనే ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్కు ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారు 25 మంది దాకా ఉన్నారు. ప్రస్తుత శాసనసభ్యులందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. అయితే వారిలో ఐదారుగురు మినహా మిగిలిన అందరి పేర్లను సెప్టెంబర్లోనే కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైనా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపైనా ఇప్పటికే కసరత్తు చేసినట్టు తెలిసింది. తొలిదశలో మంత్రులు... ముఖ్యుల పేర్లు వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభలోనే ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఆ సభతో వచ్చిన ఊపును కొనసాగించే విధంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నారు. ఆ సభ జరిగిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత కేబినెట్ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అందులోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం తీసుకున్న ఐదారు రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. దీని ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీకి కొంచెం అటుఇటుగా అభ్యర్థుల ప్రకటన ప్రారంభం కానుంది. తొలిదశలో మంత్రులు, తీవ్ర సమస్యలు లేని నియోజకవర్గాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ టీఆర్ఎస్ అధినేత టికెట్లు ఖరారు చేసినట్టు తెలిసింది. మెదక్ జిల్లాలో ఆందోల్ మినహా అన్ని స్థానాలకూ అభ్యర్థులు వారే ఉంటారని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరుపై కొంత తకరారు ఉన్నట్టుగా చెబుతున్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఒకటి మినహా మిగిలిన ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టుగానే తెలుస్తోంది, గద్వాల, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తి వంటి వాటిపైనా కేసీఆర్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా అందరికీ టికెట్లు దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనూ వ్యతిరేక నిర్ణయం ఏమీ లేకపోయినా, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఆధారపడి మార్పుచేర్పులకు అవకాశముందని విశ్వసనీయ సమాచారం. పనిచేసుకోవాలంటూ నేరుగా ఫోన్లు... టికెట్లు రావని, టికెట్లు వచ్చినా గెలిచే పరిస్థితి లేదని కొందరు ఎమ్మెల్యేలపై విరివిగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోనూ కొందరికి టికెట్లు రావనే ప్రచారం జరిగింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరికి, కొత్తగా పార్టీలో చేరిన మరికొందరికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేశారని విశ్వసనీయ సమాచారం. టికెట్లు మీకే వస్తాయని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని వారికి చెప్పినట్టుగా తెలిసింది. మరికొందరు స్వయంగా కలిసినప్పుడు టికెట్లపై భరోసా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే బహిరంగ ప్రకటన చేసే దాకా ఓపికతో పనిచేసుకోవాలని గులాబీ బాస్ ఆదేశించినట్టుగా సమాచారం. పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను సెప్టెంబర్లోనే సాధ్యమైనంత వరకూ పూర్తిచేసి ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో టికెట్ల కేటాయింపు సందర్భంగా తలెత్తిన సమస్యలు, ఎదురైన చేదు అనుభవాలను పునరావృతం కాకుండా చేయడానికే ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. -
ఉమ్మడి జిల్లాలో రసవత్తర రాజకీయం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ లో కొత్త పోరు మొదలవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు అధికార పార్టీ ముఖ్యు లు.. తమ కుటుంబాల్లో తమతోపాటు మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు టికెట్కు సంబం ధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు పెరగడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండే సి చొప్పున టికెట్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలతో పలు నియోజకవర్గాల్లో రాజకీయాలు వేడెక్కాయి. టికెట్లు ఆశిస్తున్న నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు కుటుంబాలు టీఆర్ఎస్లో రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒక కుటుంబంలో ఒకటికి మించి రాజకీయ పదవులు ఆశిస్తున్న నేతలతో అధికార పార్టీ అధిష్టానానికి కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కడియం రాజకీయ ప్రస్థానమంతా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కేంద్రంగానే జరిగింది. 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం స్టేషన్ఘన్పూర్లో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాజకీయంగా బలం ఉన్న స్టేషన్ఘన్పూర్ నుంచి తన కూతురు కడియం కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కడియం శ్రీహరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్లో మళ్లీ పోటీ రాజకీయాలు పెరిగాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. ఆమె భర్త కొండా మురళీధర్రావు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. వీరి కూతురు కొండా సుస్మితాపటేల్ను తమతోపాటు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దింపేందుకు వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కొన్ని నెలలుగా భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. సుస్మితాపటేల్ భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారని కొండా సురేఖ ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. భూపాలపల్లిలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారి ఉన్నారు. శాసనసభ స్పీకర్గా మధుసూదనాచారి టీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గరగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నిక ల్లోనూ తనకే అవకాశం వస్తుందని ధీమాతో ఉన్నారు. మరో వైపు టీడీపీలో కీలకనేతగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు కొన్ని నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్పై హామీతోనే తాను టీఆర్ఎస్లో చేరానని గండ్ర సత్యనారాయణరావు చెబుతున్నారు. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్రకు ప్రత్యేకంగా బలం ఉంది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మధుసూదనాచారి, గండ్ర వర్గాలుగా విడిపోయి ఉన్నాయి. కొండా సురేఖ ప్రకటనతో తాజాగా భూపాలపల్లి టీఆర్ఎస్ మూడు వర్గాలుగా విడిపోయిందని పలువురు వాపోతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారించారు. ప్రదీప్రావు 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఈ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో వరంగల్ తూర్పు టికెట్ తనకే వస్తుందని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్, ఆయన కూతురు మాలోతు కవిత మానుకోట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అనంతరం వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరారు. అయితే సిట్టింగులకు సీటు గ్యారంటీ అంటూ సీఎం కేసీఆర్ ఇటీవల ఇచ్చిన హామీ ప్రకారం రెడ్యానాయక్కు డోర్నకల్ సీటుకు ఢోకా లేదని భావించవచ్చు. కాగా, మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సొంత వర్గంతో ఆమె అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టికెట్ కోసం ఇద్దరు ప్రయత్నిస్తుండడంతో మహబూబాబాద్ టీఆర్ఎస్లో ఇప్పుడిప్పుడే వర్గపోరు పెరుగుతోంది. -
టీడీపీలో వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
-
టీడీపీలో వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
సాక్షి, జమ్మలమడుగు : అధికార టీడీపీలో వివాదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్దం చోటుచేసుకంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. -
కాంగ్రెస్ లిస్ట్పై సిద్దరామయ్య ముద్ర!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం కాంగ్రెస్ ప్రకటించిన 218 అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుకుబడి, శక్తిసామర్ధ్యాలకు అద్దంపడుతోంది. మొదట రెండు సీట్ల నుంచి పోటీచేయాలనుకున్న ముఖ్యమంత్రికి ఒక్క చాముండేశ్వరి స్థానం నుంచే పోరుకు అవకాశం కల్పించినా అత్యధిక సంఖ్యలో తన అనుచరులకు ఆయన టికెట్లు సాధించారు. జేడీఎస్, బీజేపీ, ఓ చిన్న పార్టీ నుంచి ఫిరాయించిన పదిమందికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేలా అధిష్టానాన్ని ఆయన ఒప్పించగలిగారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 112 మందికి మళ్లీ పోటీచేసే అవకాశం లభించగా, కేవలం పది మందికే టికెట్ నిరాకరించారు. టికెట్లు దక్కని కాంగ్రెస్ నేతలు అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సీఎంతో పాటు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కీలక మంత్రి డీకే శివకుమార్, పీసీసీ నేత జి.పరమేశ్వర కూడా తమ మద్దతుదారులకు కాంగ్రెస్ జాబితాలో తగినన్ని సీట్లు సంపాదించారు. కిందటిసారి పది మంది మహిళలకు కాంగ్రెస్ టికెట్ల లభించగా ఈసారి వారికి రికార్డు సంఖ్యలో 15 సీట్లు దక్కాయి. మొత్తం 224 సీట్లలో దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే బలమైన సామాజికవర్గమైన లింగాయతులకు ఎప్పటిలా పెద్ద సంఖ్యలో స్థానం కల్పించారు. నలుగురు నేతల కుటుంబసభ్యులకు టికెట్లు కిందటేడాది పంజాబ్ ఎన్నికల్లో అనుసరించిన ‘ఒక కుటుంబానికి ఒక టికెట్’ అనే సూత్రానికి కర్ణాటకలో కనీసం నాలుగు చోట్ల మినహాయింపు ఇచ్చి నేతల కుటుంబసభ్యులకు పోటీచేసే అవకాశం కల్పించారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు వరుణ టికెట్ లభించింది. రాష్ట్ర హోం మంత్రి ఆర్. రామలింగారెడ్డి(పాత సీటు బీటీఎం లేఅవుట్ నుంచి) కుమార్తె సౌమ్యారెడ్డికి బెంగళూరు నగరంలోని జయనగర్ టికెట్ కేటాయించారు. న్యాయశాఖా మంత్రి టీబీ జయచంద్ర, ఆయన కొడుకు సంతోష్కు వరుసగా సీరా, సికనాయకనహళ్లి(తుమకూరు జిల్లా) నుంచి పోటీచేస్తారు. గృహనిర్మాణ మంత్రి ఎం.కృష్ణప్ప(గోవిందరాజనగర్) కుమారుడు ప్రియాకృష్ణకు కూడా విజయ్నగర్ సీటు కేటాయించారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ కేహెచ్ మునియప్ప కూతురు రూపా శశిధర్కు కోలార్ నుంచి పోటీచేసే అవశం ఇచ్చారు. ఇంకా మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్కు మళ్లీ గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ టికెట్ కేటాయించారు. కిందటేడాది మరణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖమరుల్ ఇస్లాం, మహదేవ ప్రసాద్ భార్యలకు వారి భర్తల సీట్ల నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. కొన్ని నెలల క్రితం మరణించిన ఎమ్మెల్యే రుద్రేశ్ గౌడ కూతురు కీర్తనకు కూడా కాంగ్రెస్ టికెట్ (బేలూరు) ఇచ్చారు. లింగాయతులకు 40, ముస్లింలకు 15 ప్రత్యేక మతంగా గుర్తింపు కోసం పోరాడి సాధించిన బలమైన సామాజికవర్గం లింగాయతులకు 40, ఒక్కళిగలకు దాదాపు 25, ముస్లింలకు 15, ఐదుగురు బ్రాహ్మణ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బీసీలకు 50కు పైగా సీట్లు, స్వల్ప జనాభా ఉన్న అగ్రకులాలు కొడవ, బంట్, వైశ్యులకు ఐదు టికెట్లు కేటాయించారు. ఒక జైన సభ్యునితోపాటు ఇద్దరు ప్రస్తుత క్రైస్తవ ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ పోటీచేసే అవకాశం దక్కింది. షెడ్యూల్డ్ కులాలలోని దళిత వర్గాలు రెండింటికీ సమాన ప్రాధాన్యం కల్పించారు. ఏడుగురు జేడీఎస్ ఫిరాయింపుదారులకు అవకాశం! కాంగ్రెస్లో చేరిన ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ కర్ణాటక మక్కల్ పక్షపై కిందటి ఎన్నికల్లో గెలిచిన వివాదాస్పద వ్యాపారి అశోక్ ఖేనీ(బీదర్ దక్షిణ)కు కూడా కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బళ్లారి ప్రాంతంలో ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలైన వివాదాస్పద వ్యాపారులు ఆనంద్ సింగ్, బి.నాగేంద్ర కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప 2013లో స్థాపించిన కేజేపీ టికెట్పై గతంలోగెలిచిన బీఆర్ పాటిల్కు కూడా హస్తం గుర్తుపై పోటీచేసే అవకాశం లభించింది. బీజేపీ కొత్త అభ్యర్థులపై కాంగ్రెస్ హేమీహేమీలు కోస్తా జిల్లా దక్షిణ కన్నడలోని ఏడు స్థానాల్లో బీజేపీ చాలా వరకు ఎన్నికల రాజకీయాలకు కొత్త అయిన అభ్యర్థులే కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకులతో తలపడాల్పిన పరిస్థితి. కాంగ్రెస్ ఏడుగురు సిటింగ్ సభ్యులందరికీ మళ్లీ సీట్లిచ్చింది. జిల్లాలోని 8 స్థానాల్లో ఏడింటిని కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఏడుగురిలో ఇద్దరు బి.రామనాథ్రాయ్(బంట్వాల్), యూటీ ఖాదర్(మంగళూరు), అభయచంద్ర జైన్(మూడబిద్రి) ఒకటి రెండు సందర్భాల్లో మంత్రులుగా పనిచేసినవారే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాదర్ ఓటమి ఎరగని నేత. జైన్ ఈసారి పోటీకి సుముఖుంగా లేకున్నా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మతవిద్వేషాలు తలెత్తే ఈ జిల్లాలో ఆరెసెస్కు గట్టి పునాదులున్నప్పటికీ, బీజేపీకి పేరున్న నేతలు లేని కారణంగా ఏడు సీట్లకు అందరూ కొత్తవారే పోటీపపడాల్సిన పరిస్థితి. మొదటి 72 మంది జాబితాలో ఈ ఏడు సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. బెంగళూరు మేయర్కు టికెట్ బెంగళూరు కాంగ్రెస్ మేయర్ ఆర్.సంపత్రాజ్కు నగరంలోని సీవీ రామన్ నగర ఎస్సీ రిజర్వ్డ్ సీటు కేటాయించారు. ఆయనకు ముందు మేయర్గా పనిచేసిన పద్మావతికి దక్షిణ బెంగళూరులోని రాజాజీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కల్పించారు. ఆమెపై ఇక్కడ బీజేపీ సీనియర్ నేత ఎస్.సురేష్ కుమార్ పోటీకి దిగుతున్నారు. నగరంలోని సంపన్న ప్రాంతం జయనగర్లో హోం మంత్రి కూతురు సౌమ్యారెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించగా, బీజేపీ అభ్యర్థిత్వం బీఎన్ విజయ్కుమార్కు దక్కింది. బళ్లారి సిటీలో సోమశేఖర్రెడ్డిపై అనిల్ హెచ్ లాడ్ పోటీ బళ్లారి సిటీ కాంగ్రెస్ టికెట్ మైనింగ్ వ్యాపారి అనిల్ హెచ్ లాడ్కు దక్కగా, ఆయనపై పోటీకి గాలి జనార్దన్రెడ్డి సోదరుడు జి.సోమశేఖర్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారు. సోమవారం బీజేపీ ప్రకటించిన రెండో జాబితా(82)లో సోమశేఖర్ అభ్యర్థిత్వంవెల్లడించారు. గాలి కుటుంబానికి సన్నిహితుడైన సన్నా ఫకీరప్పకు బళ్లారి(ఎస్టీ) టికెట్ కేటాయించగా, ఆయనపై కాంగ్రెస్ తరఫున బి.నాగేంద్ర పోటీచేస్తారు. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హైదరాబాద్లో సీమాంధ్రులకు టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో సెటిలైన సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, ఈ సారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ‘‘హైదరాబాద్లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నాం. కొన్ని చోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తాం. అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పింది. కాంగ్రెస్పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ మావైపే ఉంటారు. పాతబస్తీలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థులను నిలబెడతాం. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయి. కాబట్టే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ మా విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని ఉత్తమ్ తెలిపారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు..: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయబోతున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నేటి విలేకరుల భేటీలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవును. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా! హైదరాబాద్లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారీ టికెట్ ఇచ్చినవాడు యుద్ధం చేసేందుకు రెడీగా ఉండాలి. ఉత్తమ్ మనిషనో, ఇంకొకరి మనిషనో టికెట్లు ఇవ్వరు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల పాదయాత్రల ఫలితాలు హైకమాండ్ విశ్లేషిస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. రాహుల్ అలా అనలేదు: దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి క్లియర్గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. క్లిష్టమైన స్థానాల్లో హైకమాండ్దే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు చాలా సహజం. అయితే ఎన్నికల్లో అందరం ఒక్కటిగా పనిచేస్తాం’’ అని ఉత్తమ్ వివరించారు. -
టీఆర్ఎస్లో మొదలైన కొత్త చర్చ
-
నామినేటెడ్ పదవి కావాలంటే సమర్పించాల్సిందే!
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది సామెత. అయితే అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అనే విధంగా అధికార పార్టీ నేతలు సామెతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అచ్చంగా ఈ సామెతను జిల్లా టీడీపీలో కీలక నేత ఒకరు బాగా వంటబట్టించుకున్నారు. ఎన్నికలకు ముందు కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు ఎంపీపీ పదవులిప్పిస్తామంటూ వసూళ్లకు తెగబడ్డారు. ఇప్పుడేమో నామినేటేడ్ పదవులిప్పిస్తామంటూ మరోసారి రంగంలోకి దిగారు. జిల్లా టీడీపీలో ఇప్పుడీ చర్చ జోరుగా నడుస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నికలకు ముందు జిల్లా టీడీపీలో ఆ నేత చక్రం తిప్పారు. తనకున్న పార్టీ పదవిని అ డ్డం పెట్టుకుని చెలరేగిపోయారు. పోటీకి ఆసక్తి చూపిన నాయకుల్ని క్యాష్ చేసుకున్నారు. ఎం పీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులుగా నిలబెడతామంటూ ఆశ చూపి పెద్ద ఎ త్తున డబ్బులు వసూలు చేశారు. జిల్లాలోని ఒక డివిజన్కు చెందిన వారే ఈ నేత ట్రాప్లో ఎక్కువగా పడిపోయారు.పెద్ద ఎత్తున సమర్పించుకున్నారు. అప్పట్లో ఆ నేతపై విపరీతమైన ఆరోపణలొచ్చాయి. పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. కొందరు నాయకులైతే బాహాటంగానే విమర్శలు గుప్పించారు. సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టిక్కెట్కు ఆశపడి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక నాయకుడి దగ్గర రూ.30లక్షల వరకు లాగేసినట్టు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. చివరికి అధిష్ఠానం వేరొకరికి సీటు ఖరారు చేయ డంతో కంగుతిన్న ఆ కాంగ్రెస్ నాయకుడు పెద్దఎత్తున తిట్టుకుని తిరిగి తన సొంత గూటికెళ్లిపోయారు. టిక్కెట్ ఇస్తామని డబ్బులు తీసుకున్న టీడీపీ నేతతో సన్నిహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పి ఆ నాయకుడు బాధపడ్డాడు. అలాగే, వైఎస్సార్సీపీ టిక్కెట్ రాదని పసిగట్టిన మరో నాయకురాలు కూడా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తామం టూ ఆమె దగ్గరి నుంచి రూ.లక్షలు గుంజేసిన ట్టు తెలిసింది. కాకపోతే, ఆ నాయకురాలు కక్కలేక, మింగలేక మౌనంగా ఉండిపోయారు. అయినా ఆ నేత త న వైఖరిని మార్చుకున్న దాఖ లాల్లేవు. తాజాగా ఏఎంసీ చైర్మన్, వైస్చైర్మన్, డెరైక్టర్ పదవులకని, గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇతర డెరైక్టర్ల పదవులకంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రంథాలయ సంస్థ పదవి గానీ, ఏఎంసీ చైర్మన్ పదవి గానీ ఇస్తామంటూ ఒక నాయకుడ్ని విమాన టిక్కెట్లు, హైదరాబాద్లో రూమ్లకని వాడుకున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదిత జాబితాను పట్టుకుని చెలరేగిపోతున్నట్టు సమాచారం. విసృ్తతంగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్న పార్టీ పదవి కూడా పోయే ప్రమాదం ఉందని, ఈలోపే లక్ష్యాన్ని దాటిపోవాలన్న ఉద్దేశంతో వసూళ్ల దందా పెంచారని పార్టీలోని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఆ నేత పరిస్థితి పార్టీలో బాగోలేదు. కీలక పదవి పోతుందనే భయంతోనే ఏమో గానీ..నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి అడిగినట్టు తెలిసింది. అందుకు జిల్లాలోని పార్టీ నేతల మద్దతు కూడగట్టి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ ఇన్చార్జ్ పదవి కూడా ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇప్పుడా కీలక నేత జిల్లా టీడీపీలో హాట్టాఫిక్ అయ్యారు. -
23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల
సీమాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అయిదవ జాబితాను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది. సీమాంధ్రలోని 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే గత నాలుగు జాబితాలలో కాకపోయిన అయిదోవ జాబితాలో అయిన తన పేరు ఉంటుందని నందమూరి హరికృష్ణ ఆశించారు. ఆ జాబితాలో కూడా హరికృష్ణ పేరు దక్కలేదు. కురుపాం : జనార్ధన్ థాట్రాజ్ చీపురుపల్లి : కిమిడి మృణాళిని అనపర్తి : ఎన్.రామకృష్ణారెడ్డి రాజోలు : జి.సూర్యారావు కోవూరు : ఏకే జవహర్ పాలకొల్లు : నిమ్మల రామానాయుడు నర్సాపురం : బండారు మహదేవనాయుడు ఉండి : శివరామరాజు చింతలపూడి : పీతల సుజాత నూజివీడు : ఎం.వెంకటేశ్వరరావు విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్రావు పీలేరు-ఇక్భాల్ మంగళగిరి-తులసి రామచంద్రప్రభు ప్రత్తిపాడు-కిషోర్బాబు గుంటూరు ఈస్ట్-మద్దాల గిరి మాచర్ల-శ్రీనివాస్యాదవ్ కొండెపి-వీరాంజనేయస్వామి గిద్దలూరు-అన్నె రాంబాబు గూడూరు-బత్తుల జ్యోత్స్నలత సూళ్లూరుపేట-వెంకటరత్నం ప్రొద్దుటూరు-వరదరాజులురెడ్డి తిరుపతి-వెంకటరమణ సత్యవేడు-తల్లారి ఆదిత్య -
అన్నా.. నిన్ను ఎమ్మెల్సీ చేస్తనే!!
అన్నా... నీకే టికె ట్టు ఇద్దామనుకున్నా... నీకు తెలుసు కదన్నా... రకరకాల ఈక్వేషన్స్... ఇవ్వలేకపోయినా... నువ్వేమీ ఫికర్ చేయకు... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా... సర్... టికె ట్టు ఇవ్వడం ఈజీయే... కానీ ఎన్నికల్లో పోటీపడటం అంత ఈజీ కాదు... నా మాట విను... నన్ను నమ్ము... బాగా డబ్బులు ఖర్చవుతాయ్... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా... మీ కులపోళ్లందరూ చెప్పారు... నీకిస్తే వాళ్లే గెలిపిస్తమన్నారు... కానీ పోటీ ఎక్కువై వర్కవుట్ కావడం లేదు... నిన్ను ఎమ్మెల్సీగా తీసుకుంటా... ఫస్ట్ పేరు నీదే... నాదీ పూచీ... మంచాల శ్రీనివాసరావు: తెలంగాణలోని ఏ పార్టీ శిబిరంలో చూసినా ఇలాంటి సంభాషణలే! టికెట్ల ఆశావహులకు, టికెట్లు ఆశించిన భంగపడిన వారికి, రెబల్స్గా రంగంలోకి దిగుతున్నవారికీ, అసంతృప్తి వీడి తిరిగి పార్టీ పనిచేయటానికి వీలుగా పార్టీల ముఖ్యులు ఇలా నాయకుల చెవుల్లో ఎమ్మెల్సీ పూలు పెడుతున్నారు. పార్టీలో చేర్చుకోవటానికి, పార్టీని వీడిపోకుండా ఉండటానికి, పార్టీకి మరింతగా పనిచేయటానికి, అసంతృప్త నేతలకు సర్దిచెప్పటానికి పార్టీల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థా యి నేతలకు ఇలా హామీ లు ఇస్తున్నారు... ప్రధాన పార్టీల్లో ఇలా ఎమ్మెల్సీ పదవులపై హామీలు పొం దిన నాయకుల సంఖ్య ఇప్పటికే 150 దాకా ఉం టుందని అంచనా. ప్రత్యేకించి టీఆర్ఎస్, కాంగ్రెస్ శిబిరాల్లో ఈ తతంగం ఎక్కువగా ఉంది... అందరికీ ఎమ్మెల్యే టికెట్లే కావాలి! నిజానికి ఎమ్మెల్యే టికెట్లు ఆశించే పార్టీ నాయకులను బుజ్జగించటానికి రకరకాల కార్పొరేషన్ పదవులు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్ని ఎరవేయడం పరిపాటిగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర విభజనలో నిమగ్నమైన అధికారగణం నిష్కర్షగా సగం మేరకు కార్పొరేషన్లను, పనికిరాని ప్రభుత్వ సంస్థలను రద్దు చేసే పనిలో పడింది. నీకు ఫలానా కార్పొరేషన్ ఇస్తా, నిన్ను ఫలానా సంస్థకు అధ్యక్షుడిని చేస్తా అనే పాతరకం హామీలను ప్రస్తుతం నాయకులే నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులను ఎరవేస్తున్నారు! ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ స్థితిలో ఈ రెండు శిబిరాల్లోనే ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ పదవుల హామీలు వినిపిస్తున్నాయి. ఒక్కో స్థానంలో ఇద్దరేసి, ముగ్గురేసి అభ్యర్థులు పార్టీ కోసం పనిచేస్తుండటం, తెలంగాణ పోరాటంలో పనిచేశామని చెబుతూ టికెట్లు అడిగేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కొన్ని సీట్లు పొత్తుల్లో కేటాయించడం వల్ల కొందరు ఆశలు గల్లంతు కావడం వంటి కారణాలతో పార్టీల్లోని చాలా మంది నేతల్ని బుజ్జగించాల్సి వస్తోంది. నిజంగా ఇవ్వగలిగేది ఎన్ని? - తెలంగాణ శాసనమండలిలో ఉండేదే 40 సీట్లు - దీనిలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, మరో మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు వీటికి పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే. - 14 స్థానాలకు శాసనసభ్యులు ఓట్లేసి ఎన్నుకుంటారు. ఇప్పుడు వాటిల్లో ఖాళీలే లేవు. ఏ రెండేళ్ల తరువాతో మూడో వంతు ఖాళీలు కొన్ని ఏర్పడినా... అప్పుడు పార్టీల వారీగా ఉండబోయే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్కో పార్టీ ఒకరికో, ఇద్దరికో మాత్రమే అవకాశం కల్పించగలవు. - 14 స్థానాలకు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోవాలి. ప్రస్తుత ఖాళీలు 5. వీటికీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే - 6 స్థానాలకు గవర్నర్ ద్వారా నామినేట్ చేయించవచ్చు. వీటిల్లో మూడు ఖాళీలున్నాయి. ఈ లెక్కను బట్టి ఒక పార్టీ ఎందరు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగలదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు! జన తెలంగాణ అందరికీ రాజకీయావకాశాలు.. - కొత్త రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించాలి. పేదలందరికీ కూడు, గూడు, విద్య అవకాశాలు లభించేలా చూడాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. అన్ని వర్గాల వారికి రాజకీయావకాశాలు కల్పించాలి. చేతి వృత్తుల వారికి రుణాలివ్వాలి. - మురహరి శ్రీధర్ నాయి, దూల్పేట, హైదరాబాద్. ఉద్యోగులే కీలకం నవ తెలంగాణ నిర్మాణం కలగా మిగలకూడదు. భౌగోళిక తెలంగాణగా మిగలకూడదు. బంగారు తెలంగాణగా ఏర్పడాలంటే ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి. కొన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వానికి సహకరించాలి. అవసరమైతే ఎక్కువ సమయం పని చేయడానికి కూడా సిద్ధం కావాలి. కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత మేధావుల సూచనలు, సలహాలను తీసుకోవాలి. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. - ఎం. రవళి, ఆదర్శ పాఠశాల, చిన్న కోడూరు, మెదక్ జిల్లా ఉపాధి చూపేలా విద్య... ఆర్థిక అసమానతలు లేని తెలంగాణ కావాలి. మూతపడిన అన్ని పరిశ్రమలను తెరిపించాలి. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలి. మండలానికో పశువైద్యశాల ఉండాలి. ఉపాధి మార్గం చూపే విద్యావిధానాన్ని రూపొందించాలి. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాలి. సాగునీటివసతులను పెంపొం దించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పించాలి. - చింతపంటి కమలాకర్ , గాంధీనగర్, వేములవాడ -
వసూల్ రాజా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక పార్టీ జిల్లా అధ్యక్షుడు. సంపాదన కోసం పరితపిస్తున్నారు. సొమ్ము చేసుకోవడానికి సరైన అధికారిక పదవి దక్కలేదని ఏళ్ల తరబడి అసంతృప్తిగా ఉన్న ఆయనకు అనూహ్యంగా లభించిన జిల్లా పార్టీ పదవిని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బీ-ఫారాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే అప్రతిష్టను మూటగట్టుకున్నారు... తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని, చైర్పర్సన్ పదవికి లైన్ క్లియర్ చేస్తానని ఆశావహుల నుంచి డబ్బు గుంజుతున్నారు. దీంతో సొమ్ముతో పాటు వసూలు రాజాగా బాగా పేరు గడించారు. అప్పుడప్పుడు పోటీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్ప విజయం దరిచేరడం లేదు. దీంతో ఎన్నాళ్లైనా ఇలాగే ఉండిపోతున్నాన్న ఆవేదన ఒక పక్క, కూడబెట్టుకోవడానికి అవకాశం దక్కడం లేదన్న బాధ మరో పక్క ఆయన్ను పీడించాయి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఎన్నికల రాక ముందు నమ్మకంగానే పనిచేశారు. అధినేతల అడుగుజాడలో నడుస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టి గురుభక్తి చాటుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు రావడమే తరువాయి చెలరేగిపోవడం మొదలు పెట్టారు. తొలుత మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ. లక్షలు తీసుకున్నారు. దీనిపై పార్టీలో కూడా వివాదం చోటు చేసుకుంది. గొడవ పడేవరకూ కార్యకర్తలు వచ్చారు. ఇదే విషయమై అధినేతలు సంజాయిషీ కోరినట్టు తెలిసింది. అయినా ఆయన మారలేదు. ఎంపీటీసీ బీ-ఫారాలు ఇచ్చేందుకు కూడా సొమ్ము వసూలు చేశారు.ఇదొక వైపు జరుగుతూనే మరోవైపు జెడ్పీ పదవులకు అడ్డు రాకుం డా ఉంటానని, తనవంతు సహకారమందిస్తానని చెప్పి ఆశావహుల నుం చి పెద్ద ఎత్తున వసూలు చేశారు. అలాగే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని కూడా కొంతమంది నుంచి రూ.20లక్షల నుంచి రూ.40లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడాయన ఆ పార్టీలో హాట్ టాపి క్ అయ్యారు. అధికారంలో లేనప్పుడే ఇంత దందా చేస్తుంటే చేతిలోకి అధికారం వస్తే ఇంకెంత రెచ్చిపోతారోనన్న చర్చ మొదలైంది. అంతా అధికారం కోసం పాకులాడుతుంటే పార్టీ పదవితో డబ్బులు కోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన గురిం చి ఆ పార్టీలోని నాయకులను కదిపితే ఆయనకిదేమీ కొత్తకాదని, కాకపోతే ఇప్పుడు మరింత ఎక్కువగా గడిస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి ఆయ న తీరుతో పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.