opportunities
-
డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు. సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. -
మోతీలాల్ ఓస్వాల్ ఇన్నోవేషన్ అపార్చూనిటీస్
వినూత్నమైన పెట్టుబడి అవకాశాలతో కూడిన నూతన మ్యూచువల్ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను మోతీలాల్ ఓస్వాల్ ప్రారంభించింది. మోతీలాల్ ఓస్వాల్ ఇన్నోవేషన్ అపార్చూనిటీస్ పేరుతో తీసుకొచి్చన ఈ ఎన్ఎఫ్వో ఈ నెల 12న ముగుస్తుంది. వినూత్నమైన వ్యాపార వ్యూహాలను (కొత్త ఉత్పత్తులు, సేవలు, టెక్నాలజీలపై దృష్టి పెట్టేవి) అమలు చేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీలకు 80 శాతం నుంచి 100 శాతం వరకు, డెట్కు 0–20 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. కనీస పెట్టుబడి రూ.500. రోజువారీ సిప్ అయితే రూ.100 నుంచి, వారం, నెలవారీ సిప్ అయితే రూ.500తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్కు లాభం
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.గతంలో ఇలా..గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.ఏయే వస్తువులకు గిరాకీఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్ల సరళీకరణఆర్డర్ల పెరుగుదలఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. -
National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?
స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు–ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు. బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా... ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.ఇవీ చదవండి: National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్! – డా‘‘ హెచ్. అఖ్తర్ బాను ‘ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, కర్నూలు(నేడు జాతీయ బాలికా దినోత్సవం) -
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
భారత్లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్లో ఆదాయాన్ని భారత్లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్ఫామ్లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రపంచ విమానయాన హబ్గా భారత్: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. భారత్ను ప్రపంచ విమానయాన హబ్గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. పౌర విమానయానంపై గురువారం ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా–పసిఫిక్ మినిస్టీరియల్ సదస్సులో మోదీ మాట్లాడారు. 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తీసుకొచి్చన ‘ఉడాన్’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు మోదీ సూచించారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయతి్నంచాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సర్క్యూట్ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని మోదీ స్పష్టంచేశారు. భారత్లో విమానయాన సంస్థల నెట్వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్ సెక్టార్లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు. -
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్రూమ్లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్ఫోన్ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్రూమ్లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
ServiceNow study: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ), ఆటోమేషన్పై దేశంలో 1.62 కోట్ల మందికి నైపుణ్యాల పెంపు, పునఃశిక్షణ అవసరం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ రెండు విభాగాల్లో 47 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలిసింది. సర్వీస్నౌ సంస్థ అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉపాధి ముఖచిత్రాన్ని ఏఐ మార్చేయనుందని, డిజిటల్నైపుణ్యాల పెంపుతోపాటు టెక్నాలజీలో లక్షలాది ఉపాధి అవకాశాలను తీసుకురానుందని ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. అప్లికేషన్ డెవలపర్లు అదనంగా 75,000 మంది అవసరమని పేర్కొంది. డేటా అనలిస్టులు 70,000 మంది, ప్లాట్ఫామ్ ఓనర్లు 65,000 మంది, ప్రొడక్ట్ ఓనర్లు 65,000 మంది, ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్లు 55,000 మంది 2027 నాటికి అవసరం ఉంటుందని వెల్లడించింది. టెక్నాలజీ కారణంగా తయారీలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని, 23 శాతం మంది ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఆ తర్వాత వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్లో 22 శాతం, హోల్సేల్, రిటైల్ వాణిజ్యంలో 11.6 శాతం, రవాణా, స్టోరేజ్లో 8 శాతం, నిర్మాణ రంగంలో 7.8 శాతం మంది కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. సర్వీస్నౌ సంస్థ నైపుణ్యాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తుంటుంది. ఇప్పటికే 13కు పైగా విద్యా సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. కీలకమైన వ్యాపార అవసరాలు, భవిష్యత్ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేసేందుకు వీలుగా నాస్కామ్కు చెందిన ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్తో ఆగస్ట్లో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి పరిశ్రమతో పనిచేస్తున్నాం. ఏఐని అర్థవంతమైన వ్యాపార మార్పుల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చన్నది తెలియజేస్తున్నాం. ఈ మార్పుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు నాణ్యమైన, సురక్షితమైన ఉపాధి అవకాశాలను అందించేలా చూస్తున్నాం’’అని సెక్యూర్నౌ వైస్ ప్రెసిడెంట్ కమోలికా గుప్తా పెరెస్ వివరించారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అప్నా పండుగలకు ముందు పెద్ద ఎత్తు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్, సెపె్టంబర్లో కొత్తగా 1.2 లక్షల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ వివరాలను జాబ్స్, ప్రొపెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అయిన ఆప్నా డాట్ కో విడుదల చేసింది. జూలై–సెపె్టంబర్ కాలంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యరి్థనుల సంఖ్య 61 శాతం పెరిగింది. ఇది మహిళా నిపుణుల కోసం వివిధ రంగాల్లో పెరిగిన డిమాండ్ను సూచిస్తున్నట్టు అప్నా నివేదిక తెలిపింది. ఈ కామర్స్, రిటైల్, ఆతిథ్య రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచినట్టు వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో బజాజ్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ కంపెనీలు ఎక్కువ నియామకాలకు ముందుకు వచి్చనట్టు తెలిపింది. మంచి ప్రతిభ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఆఫర్ చేయడంతోపాటు, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్లో ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యం ఇచి్చనట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెపె్టంబర్ వరకు తన ప్లాట్ఫామ్లో యాజమాన్యాల సంప్రదింపులు పెరిగాయని, 78,000 కొత్త సంస్థలు చేరినట్టు వెల్లడించింది. 2022 ఇదే కాలంలో 42,000 కొత్త సంస్థల చేరికతో పోల్చి చూస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,70,000 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల అయితే, అవి ఈ ఏడాది 2,13,000కు పెరిగినట్టు తెలిపింది. మహిళా దరఖాస్తు దారుల సంఖ్య పెరిగిందని, గతేడాదితో పోలిస్తే ఉద్యోగార్థుల ప్రాధాన్యతల్లోనూ మార్పు కనిపించినట్టు అప్నా సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
బ్యాటరీ టెక్నాలజీల్లో భారత్ మరింత ముందుకు
నోయిడా: బ్యాటరీ టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) మార్కెట్ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల మార్కెట్ 128 గిగావాట్–అవర్ (జీడబ్ల్యూహెచ్) స్థాయికి చేరవచ్చనే అంచనాలు ఉన్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోలో పాల్గొన్న సందర్భంగా ఇన్ఫర్మా మార్కెట్స్ ఆఫ్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిలకడైన రీసైక్లింగ్ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ విద్యుత్ డిమాండ్లో చైనా, భారత్ సారథ్యంలోని ఆసియాకి ప్రస్తుతం 60 శాతం వాటా ఉందని ఉడ్ మెకెంజీ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ విట్వర్త్ తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల్లో సాంకేతిక పురోగతి వల్ల పవన, సౌర విద్యుత్ సామర్థ్యాలు నాలుగింతలు పెరగనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఈ రంగంలో 3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. 700 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 900 పైగా బ్రాండ్లు ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. 40,000 మంది సందర్శకులు ఈ ఎక్స్పోను సందర్శించే అవకాశం ఉంది. -
మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ - తయారీలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: ఆసియా తయారీ సరఫరా వ్యవస్థలో వైవిధ్యానికి దారితీస్తున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల నుంచి భారత్ ప్రయోజనం పొందుతుందని ది ఎకనామిస్ట్ గ్రూప్ అంచనా వేసింది. భారత్ బలమైన వృద్ధి మార్గంలో ప్రయాణిస్తోందని ద ఎకనామిస్ట్ గ్రూప్ ఇండియా హెడ్ ఉపాసనా దత్ పేర్కొన్నారు. విధానపరమైన సంస్కరణలతో భారత్లో వ్యాపార నిర్వహణ సులభంగా మారుతోందన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ బలమైన పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన భారత్, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తెలిసిందే. పీఎల్ఐ సహా పలు పథకాల ద్వారా దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఎకనామిస్ట్ గ్రూపు ప్రస్తావించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ ఇంధన వనరులపై అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యావరణ అనుకూల విధానాలు ఇవన్నీ భారత్ వంటి దేశాలకు అవకాశాలను తీసుకొస్తాయని ఉపాసనా దత్ అభిప్రాయపడ్డారు. తయారీలో స్థానం బలోపేతం ‘‘భౌగోళిక రాజకీయ రిస్క్ల నేపథ్యంలో కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలపై పునరాలోచన చేస్తున్నాయి. చైనా మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించుకునే దిశగా అవి తీసుకునే నిర్ణయాలతో ఇతర మార్కెట్ల వాటా పెరగనుంది. చైనాకు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ అవుతుంది’’అని ఉపాసనా దత్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పన్నులు, వాణిజ్య నియంత్రణల పరంగా భారత్లో ఎంతో పురోగతి కనిపిస్తోందంటూ.. దేశంలో తయారీ పరంగా ఉన్న రిస్క్లను ఇది తగిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో వర్ధమాన, ముఖ్యంగా దక్షిణాసియా మార్కెట్ల నుంచి ఎదురయ్యే బలమైన పోటీ కారణంగా.. తయారీలో బలమైన శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను కొంత ఆలస్యం చేస్తుందన్నారు. -
దేశీయ వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలున్నాయి - సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే కొద్దీ ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. సీక్వెన్షియల్గా కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో భౌగోళికరాజకీయ పరిస్థితుల్లాంటి అంతర్జాతీయ అంశం ప్రధానమైనది కాగా వాతావరణ మార్పు రెండోదని ఆయన వివరించారు. అయితే, మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలని సంజీవ్ పురి తెలిపారు. మరోవైపు, హోటల్ వ్యాపారాన్ని విడగొట్టడం వల్ల ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం ప్రతికూల పనితీరు ప్రభావం కారణంగా జూన్ త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 18,639 కోట్లకు పరిమితం కాగా లాభం మాత్రం 16 శాతం పెరిగి రూ. 5,180 కోట్లకు చేరింది. దేశీయంగా వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని సంజీవ్ పురి చెప్పారు. ఉత్పాదకత, మార్కెట్ అనుసంధానతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
లక్ష యూనికార్న్లు.. 20 లక్షల స్టార్టప్లు సాధ్యమే: కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్ల స్థాయికి ఎదిగే సత్తా భారత్కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
ఏఐతో కొత్త అవకాశాలు.. ప్రైవసీకి సవాళ్లు
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. -
భారత్లో అవకాశాలు అపారం
సిడ్నీ: భారత్లో డిజిటల్ ఇన్ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, ఐటీ, ఫిన్టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈవో పౌల్ ష్రోడర్ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
International disabled day: దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనటానికి తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలే తార్కాణం. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న కృషి వారందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
ఐటీ హబ్గా విశాఖలో అపారమైన అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్కుమార్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు. చదవండి: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ ఎస్టీపీఐ డైరెక్టర్ సి.వి.డి.రామ్ప్రసాద్తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి డేటా సెంటర్ హబ్గా భారత్ అవతరించబోతోందన్నారు. అరవింద్కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఐటీ పాలసీ అద్భుతం ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ వంటి టైర్–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే. బీపీవోల ఓటు వైజాగ్కే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్కే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్లో ఎస్టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్ ఎస్టీపీఐ లక్ష్యం ప్రస్తుతం ఎస్టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవల మార్కెట్లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం. సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు ఇప్పటికే ఎస్టీపీఐ 20 సెంటర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల క్లస్టర్గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి. డేటా సెంటర్ హబ్గా భారత్ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో డేటా సెంటర్ హబ్గా భారత్ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్టెక్, హెల్త్కేర్, బ్లాక్చెయిన్ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఎన్నో ఆలోచనలు రేకెత్తించిన టెడ్–ఎక్స్!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో దివ్యాంగులకూ సమాన అవకాశాలు కల్పించడమెలా? కుక్కలు మనకు నేర్పే పాఠాలు ఏమిటి? మనలాంటి సామాన్యులు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఏం చేయాలి? పామాయిల్కూ మనకొస్తున్న జబ్బులకూ సంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నానికి ఆదివారం హైదరాబాద్లో జరిగిన టెడ్–ఎక్స్ కార్యక్రమం వేదికగా నిలిచింది. కొత్త ఆలోచనలను పంచుకునే వేదికగా దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ‘‘టెడ్ టాక్స్’’అనుబంధ కార్యక్రమమే ఈ టెడ్–ఎక్స్! హైదరాబాద్లోనూ చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా ఆదివారం 14 మంది వక్తలతో ఇది సందడిగా జరిగింది. ‘రైజింగ్’అన్న ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సవాళ్లను అధిగమించి.. విజయం సాధించిన వారు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు. ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన హైదరాబాదీ ఆర్.శ్రీధర్, ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ.. ఒక చెయ్యి కోల్పోయినా స్థైర్యం కోల్పోకుండా ఫిట్నెస్ ట్రెయినర్గా ఎదిగిన టింకేశ్ కౌశిక్ వంటి వారు ఈ కార్యక్రమంలో తాము పడ్డ కష్టాలు.. వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు. అంతేకాదు.. కుక్కలతో కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు నేర్పించే శిరీన్ మర్చంట్, కేదార్నాథ్ ఆలయం వద్ద ప్లాస్టిక్ చెత్త సమస్యను పరిహరించేందుకు వినూత్నమైన ఆలోచనతో ఓ ప్రయోగం చేసి సత్ఫలితం సాధించిన ‘రీసైకిల్’వ్యవస్థాపకుడు అభయ్ దేశ్పాండే, చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై స్క్వాడ్రన్ లీడర్ అభయ్ ప్రతాప్ సింగ్లు కూడా ప్రసంగించి ఆయా అంశాల్లో తాము చేసిన పనులను వివరించారు. చౌక పామాయిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి కలుగుతున్న హాని.. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వంటి అంశాలపై మాట్లాడిన న్యూయార్క్ జర్నలిస్ట్ జోసిలీన్ సి జుకర్మాన్ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విస్తరణపై ‘ప్రైవేట్’ దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు. కార్పొరేట్ సుపరిపాలన కారణంగా సీపీఎస్ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు. దీంతో వాటాదారులకు సీపీఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ), కంటెయినర్ కార్పొరేషన్(కంకార్), వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్గా ఉన్న బీమా రంగ పీఎస్యూ ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు. -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు. మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్రావు తెలిపారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్తో చిన్న సంస్థలకు భారీ అవకాశాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో చిన్న సంస్థలు, కొత్తగా ఇటువైపు అడుగుల వేసే కంపెనీలకు, స్టార్టప్లకు భారీ అవకాశాలు వచ్చిపడతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వాహన రంగంలో ఎలక్ట్రిఫికేషన్ (ఈవీకి మారడం) వేగం తీరు, పోటీ వాతావరణంపై అచ్చమైన ఈవీ కంపెనీల వ్యాల్యూషన్ ఆధారపడి ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్యాసింజర్ వాహనాల విభాగం వేగంగా ఈవీలకు మళ్లుతోందని కనుక.. అచ్చమైన ఈ–ప్యాసింజర్ కంపెనీలకు అధిక విలువ దక్కుతున్నట్టు విశ్లేషించింది. మధ్య తరహా, భారీ వాణిజ్య వాహన విభాగంలో ఎలక్ట్రిఫికేషన్ నిదానంగా ఉందని.. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఇది వేగంగా ఉన్నట్టు వివరించింది. 2026–27 నాటికి ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా 15 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. స్కూటర్ల విభాగంలో ఈవీల వాటా ఇప్పటికే 35 శాతానికి చేరినట్టు వివరించింది. 2020–21 నాటికి ద్విచక్ర ఈవీల వాటా 1శాతంగానే ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ చాలా నిదానంగా ఉందని, ఫేమ్–2 పథకం కింద సబ్సిడీల్లేకపోవడం (వ్యక్తిగత వినియోగానికి), చార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉండడం ఇందుకు కారణంగా తెలిపింది. ‘‘ఎలక్ట్రిఫికేషన్తో సంప్రదాయ స్కూటర్ల విభాగానికి ముప్పు ఎక్కువగా ఉంది. దేశీ త్రిచక్ర వాహన విభాగంలో ఈవీ వాటా 2026–27 నాటికి 19 శాతానికి చేరొచ్చు. వాణిజ్య వాహనాల వాటా 23 శాతానికి, చిన్న పాటి వాణిజ్య వాహనాలు 18 శాతానికి చేరుకోవచ్చు’’ అని వివరించింది. ఆరంభంలోనే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో భారత్ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఎలక్ట్రిఫికేషన్ రిస్క్ దృష్ట్యా ద్విచక్ర వాహన స్టాక్స్కు డీరేటింగ్ ముప్పు ఉన్నట్టు తెలిపింది. ఈవీ వ్యాపారానికి సంబంధించి నిధులు సమీకరించిన కంపెనీలకు ఇప్పటికే మార్కెట్ మెరుగైన వ్యాల్యూషన్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈవీల్లోకి అడుగుపెట్టిన ఓరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (ఓఈఎం) సంబంధించి విలువ ఇంకా వెలుగుచూడాల్సి ఉందని తెలిపింది. చదవండి: మరోసారి తెరపైకి టాటా - ఎయిరిండియా డీల్..! -
అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!
‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. కరోనా సమయంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ రాలేదు కాబట్టి మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’’ అని నటుడు రాజా రవీంద్ర అన్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకపోతేనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఓ పాయింట్ను వినోదాత్మకంగా చెప్పాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాజు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. యాభై ఏళ్లు దాటిన రాజుని మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోదు. ఆ సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయితో చాటింగ్ చేస్తాడు. ఓ చిన్న తప్పు కారణంగా ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేదే కథ. విలన్ పాత్రలు చేయడం ఈజీ. కానీ కామెడీ చాలా కష్టం.. సరైన టైమింగ్ ఉండాలి. చిరంజీవిగారి ‘ఆచార్య’లో మంచి పాత్ర చేశాను. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రోజ్ విల్లా’తో పాటు సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాను. నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోతే టీ, కాఫీలు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండిపోతా’’ అన్నారు. -
మ్యూచువల్ ఫండ్లకు అపార అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మ్యుచువల్ ఫండ్లు ఇంకా సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరలేదని, ఈ నేపథ్యంలో ఫండ్స్ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా తెలిపారు. పెట్టుబడి సాధనంగా ఫండ్స్పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా 2018–19 జూన్లో రూ. 7,554 కోట్ల పెట్టుబడులు రాగా, 2020–21 జూన్లో రూ. 9,156 కోట్లు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి బుల్ మార్కెట్ తరహాలోనే ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ధోరణులు కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యురోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో తెలిపారు. అయితే, మార్కెట్లు బులిష్గా ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండని ఇన్వెస్టర్లు ఆ తర్వాత రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చరిత్ర చెబుతోందన్నారు. సరైన పెట్టుబడి సాధనాలకు తగు పాళ్ళలో నిధులను కేటాయించడం ముఖ్యమని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయాన్ని తీసుకోవాలని షా సూచించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత మార్కెట్లు.. అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు విడుదల చేసిన నిధుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగాను, దేశీయంగాను స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలకు పరుగులు తీస్తున్నాయి. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్నాయి. నిధుల లభ్యతతో పాటు దాదాపు సున్నా స్థాయి వడ్డీపై రుణాలు మొదలైన అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. వ్యాపార పరిస్థితుల వలయాన్ని బట్టి చూస్తే భారత బిజినెస్ సైకిల్ ఆకర్షణీయంగానే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వృద్ధి రికవరీ కాస్త మందగించినట్లుగా ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు, ప్రభుత్వ విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఉదారవాద చర్యలు తదితర అంశాలు వల్ల సరైన దిశలోనే సాగుతోందని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహం.. అంతర్జాతీయంగా ఈక్విటీలు, కమోడిటీలు సహా రిస్కులతో కూడుకున్న అన్ని పెట్టుబడి సాధనాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వ్యాపారాలు కోలుకునే క్రమంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల బిజినెస్ సైకిల్ ఆధారిత ఫండ్ను ప్రవేశపెట్టాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈక్విటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మహమ్మారి పరిణామాలు, అంతర్జాతీయంగా వృద్ధి రికవరీ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా డైనమిక్ అసెట్ అలోకేషన్ కేటగిరీకి చెందిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇలాంటి ఫండ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్విటీల్లో పెట్టుబడుల వ్యూహాలను సరిచేసుకుంటూ ఉంటాయి. అటు మార్కెట్ క్యాప్లపరంగా వివిధ కేటగిరీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ను కూడా పరిశీలించవచ్చు. వేల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా సైతం మంచి రాబడులను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పలు రంగాల్లో సంస్థలు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో లభిస్తున్నాయి. వీటిలో చాలా మటుకు విభాగాలు 2008 తర్వాత పెద్దగా రాణించలేకపోయాయి. ఈక్విటీలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు .. వేల్యూ ఇన్వెస్టింగ్ విధానం పాటించవచ్చు. అయితే, రికార్డు స్థాయిలో నిధులు వస్తుండటంతో ప్రస్తుతం ధరలు.. వాస్తవిక స్థాయిలో లేవు. సెంట్రల్ బ్యాంకుల చర్యల ప్రభావాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి ప్రతీ పెట్టుబడి సాధనానికి ఎంతో కొంత రిస్కు ఉంటుందన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం.. డెట్ సంక్షోభం.. గతేడాది తొలినాళ్లలో డెట్ మార్కెట్లో సంక్షోభమనేది ఒక కంపెనీకి మాత్రమే పరిమితమైన సంఘటన తప్ప వ్యవస్థాగతంగా ఎలాంటి రిస్కులూ తలెత్తలేదు. మా విషయానికొస్తే గత 23 ఏళ్లలో ఎన్నడూ ఏ స్కీములోనూ డిఫాల్ట్ గానీ చెల్లింపుల్లో జాప్యం గానీ జరగలేదు. -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్వర్క్నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్తో వడాపావ్లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?
పిల్లలు మెడిసిన్ చదువుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. సమాజంలో అదో ప్రత్యేక గుర్తింపు. డాక్టర్ అయిపోతారు కాబట్టి ఇక జీవితానికి ఢోకా లేదనే అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం మరోలా ఉంది. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంబీబీఎస్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. నర్సులే వీరికంటే నయం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ డాక్టర్లకు రూ. 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ జీతాలు ఉండటం లేదు. పీజీ సీటు రాక... ఇటు ఎంబీబీఎస్తో ఏమీచేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఆ విద్యార్థి పేరు సాగర్ (పేరు మార్చాం). అతని తండ్రి ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్. ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలన్న కోరికతో ఉన్న సాగర్, చివరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. 12 ఏళ్ల క్రితం బీ కేటగిరీ సీటు కోసం కొంత బ్యాంకు రుణం తీసుకున్నారు. కష్టపడి చదివి 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టులో మెడికల్ ఆఫీసర్గా పనిచేశాడు. కానీ పీజీ చదవకపోతే ప్రయోజనం లేదనుకున్నాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్కు ప్రిపేరవుతున్నాడు. కానీ బ్యాంకులో తీసుకున్న అప్పు రూ. 10 లక్షలు అలాగే ఉంది. అది చెల్లించేందుకు నానాయాతన పడాల్సి వస్తోంది. రమేష్కుమార్... హైదరాబాద్లో ఉంటారు. చిరు వ్యాపారి. దిగువ మధ్య తరగతి కుటుం బం. కొడుకు యోగేంద్ర (ఇద్దరి పేర్లు మార్చాం) తెలివైన విద్యార్థి. 2012లో ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చింది. అతని ప్రతిభను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంతో ఆనందపడ్డారు. ఎంబీ బీఎస్ పూర్తయ్యాక పీజీ సీటు కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు పెళ్లి సంబంధాలు కూడా రాలేదు. డాక్టర్గా మంచి పొజిషన్లో స్థిరపడలేకపోయాననే వేదన, ఇంకోవైపు తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి తట్టుకోలేక అవమానభారంతో 2019లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఒంటిపై తెల్లకోటు... మెడలో స్టెతస్కోప్... రోగులకు వైద్య సేవలు చేస్తూ జీవితంలో స్థిరపడాలనేది అనేకమంది యువతీ యువకుల అందమైన కల. అందుకు రేయింబవళ్లు కష్టపడి ఎంబీబీఎస్ సాధిస్తారు. త ర్వాత అంతే శ్రద్ధతో చదివి ఎంబీబీఎస్ పూర్తిచేశాక అనేకమందికి మిగిలేది బ్యాంకు అప్పులే. ఆ తర్వాత పీజీ కోసం ఎన్నాళ్లు ప్రయత్నించినా రాకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తే 15 నుంచి 20 వేల రూపాయల జీతమే ఇస్తుండటం తో అనేకమంది యువ వైద్యులు ఎందుకు ఎంబీబీఎస్ చదివామా అని ఆవేదన చెందుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. జీవితంలో స్థిరపడక పోవడం, పెళ్లిళ్లు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంబీబీఎస్ కోసం అప్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తే సరేసరి. లేకుంటే బీ, సీ కేటగిరీలో సీటు పొందితే ఫీజులకు అప్పులే దిక్కు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు. అంటే ఐదేళ్లకు రూ. 57.75 లక్షలు అవుతుంది. ఇక సీ కేటగిరీలో ఏడాదికి రూ. 23 లక్షల వరకు ఉంది. ఐదేళ్లకు రూ. 1.15 కోట్లు చెల్లించాలి. ఇది సాధారణ మధ్య తరగతికి తలకుమించిన భారమే. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఈ ఫీజులను చెల్లిస్తున్నారు. కానీ ఇంత ఖర్చు చేసి చదివాక కేవలం ఎంబీబీఎస్ కోర్సుతో స్థిరపడే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత పీజీ రావడం గగనంగా మారింది. దీంతో ఎంబీబీఎస్ డాక్టర్ల జీవితం త్రిశంకుస్వర్గంలో ఉన్నట్లుగా మారింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రైవేట్లో కొద్దిపాటి జీతాలకు పనిచేస్తూ, స్థిరపడని వారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. (చదవండి: ఏం పర్లేదు.. శంకర్దాదా ఎంబీబీఎస్ ఇక్కడ!) మెడికల్ పీజీ సీట్లు చాలా తక్కువ... ఎంబీబీఎస్ చదివాక మెడికల్ పీజీ, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయకుంటే ఇప్పుడు వైద్య రంగంలో భవిష్యత్తు లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులతో పాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. ఎంబీబీఎస్తో స్థిరపడే పరిస్థితి లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్ప... ప్రైవేట్ ఆసుపత్రుల్లో జీతాలు దారుణంగా ఉంటున్నాయి. అయితే పీజీ సాధించడం అంత సులువుగా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 5,140 ఎంబీబీఎస్ సీట్లుంటే, 1,996 పీజీ సీట్లున్నాయి. అందులో నాన్ క్లినికల్ పీజీ సీట్లు 455 ఉన్నాయి. నాన్ క్లినికల్ సీట్లలో చాలామంది చేరడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాటితో సొంత ప్రాక్టీస్ చేయడానికి కానీ, ఆసుపత్రుల్లో వైద్యునిగా సేవలు చేయడానికి కానీ ఉపయోగపడవు. కేవలం అధ్యాపకులుగా పనిచేయడానికే ఉపయోగపడతాయి. అందుకే 2020–21లో ఏకంగా 170 నాన్ క్లినికల్ సీట్లు ఎవరూ చేరక మిగిలిపోయాయి. అంటే 1,541 క్లినికల్ పీజీ సీట్ల కోసమే ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడతారు. పైగా ప్రతీ ఏడాది పీజీ కోసం పోటీ పడే ఎంబీబీఎస్ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో పీజీ రావడం కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. విదేశాల్లో చదివి ఎఫ్ఎంజీఈ పాసయ్యేది 14 శాతమే దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 7 వేల మంది వరకు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. అందులో 650 మంది తెలంగాణ నుంచి వెళ్లి చదువుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు తప్పనిసరిగా ఎఫ్ఎంజీఈ పరీక్షలో పాసవ్వాలి. అప్పుడే మన దేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ ఉంటేనే సొంత ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఎక్కడైనా పనిచేయడానికి అర్హులవుతారు. అయితే, ఇందులో పాసయ్యేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. 2014–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 74,202 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాస్తే, అందులో 10,400 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. అంటే కేవలం 14.01 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. పెళ్లిళ్లు ఎందుకు కావడం లేదు? డాక్టరంటే ఎవరైనా అమ్మాయిని ఇస్తారని అనుకుంటారు. కానీ ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల పిల్లను ఇవ్వడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఒక డాక్టర్ మరో డాక్టర్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఎక్కడైనా ఆసుపత్రి పెట్టుకొని నడిపించుకోవచ్చని, ఒకరు ఎక్కడికైనా వెళ్లినా మరొకరు దాన్ని చూసుకోవచ్చన్న భావన ఉంటుంది. కానీ ఎంబీబీఎస్ చదువుతో మాత్రమే ఆసుపత్రి పెట్టుకొని జీవితంలో స్థిరపడే పరిస్థితులు లేనందున పెళ్లి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేకాదు వేరే వృత్తుల్లో స్థిరపడిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా సంపాదన లేని ఎంబీబీఎస్ డాక్టర్లంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు కొందరు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. ఇలా అనేక కారణాలతో ఎంబీబీఎస్ పూర్తయిన వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదని అంటున్నారు. ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్ అయిపోయింది ఎంబీబీఎస్ 2015లో అయిపోయింది. అప్పటి నుంచి పీజీకి చదువుతున్నాను. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండటంతో పీజీకి చదవడం వీలుపడలేదు. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి ప్రిపేర్ అవుతున్నాను. రూ. 40 వేలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నాను. అయితే పీజీ సీట్లు తక్కువగా ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తయిన వారికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు ఇస్తే చాలామంది స్థిరపడతారు. పల్లెలకు వెళ్లి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ అరుణ్, హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో యువ వైద్యులు అప్పులు చేసి ఎంబీబీఎస్ చదివిన వారు తర్వాత పీజీ రాక తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన వారికి కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వడం లేదు. సొంతంగా క్లినిక్ పెట్టుకునే పరిస్థితి లేదు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను నింపితే అనేకమందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ఎంబీబీఎస్ వైద్యులు కేవలం కేర్టేకర్ల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. గత్యంతరం లేక పనిచేయాల్సి వస్తోంది. – డా.విజయేందర్, కన్వీనర్, తెలంగాణ డాక్టర్స్ ఫోరం ఏళ్ల తరబడి చదివినా స్థిరపడలేదు ఎంబీబీఎస్ పూర్తయ్యాక నేను అనెస్థీషియా లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పులు చేసి ఫీజులు కడుతున్నాను. 29 ఏళ్లు వచ్చినా స్థిరపడలేదు. పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. నాలాంటి వాళ్లు ఏళ్ల తరబడి వైద్య విద్య చదివి, స్థిరపడకుండా, పెళ్లి కాకుండా ఉన్నారు. నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే సంపాదిస్తున్నారు. మా నాన్న నా చదువులకు రూ.12 లక్షలు అప్పు చేశారు. – డా.రణధీర్ కుమార్, పీజీ విద్యార్థి, హైదరాబాద్ (చదవండి: పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు) -
మహిళకు.. వెల్కమ్!
న్యూఢిల్లీ: పనివేళలు సౌకర్యంగా లేకపోవడం.. ఇంటి నుంచి పని చేసే అవకాశాలు తక్కువగా ఉండడం.. ఇటువంటి సమస్యలు ఇంతకాలం ఉద్యోగ రంగంలో మహిళల పాత్రను పరిమితం చేశాయి. కానీ, ఇప్పుడు కరోనాతో ఇది మారిపోనుంది. దీని కారణంగా పలు రంగాల్లో.. ముఖ్యంగా ఐటీ రంగంలో 75–90 శాతం మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే కార్యాలయ పని).. విధానంలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులతో మరింత మంది మహిళలు కెరీర్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘ప్రతిభావంతులైన ఎంతో మంది మహిళలు, ఎన్నో నైపుణ్యాలు ఉండి కూడా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వారు తిరిగి ఐటీ రంగంలోకి బలంగా వచ్చే అవకాశం ఉంది’’ అని ఎస్సార్ గ్రూపు హెచ్ఆర్ ప్రెసిడెంట్ కౌస్తుభ్ సోనాల్కర్ పేర్కొన్నారు. ఇంటి నుంచే పని విధానంతో మహిళలు తిరిగి ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు, పార్ట్టైమ్ (పరిమిత సమయం) ఉద్యోగాలు చేసుకునేందుకు చక్కని అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలకు ప్రాధాన్యం.. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేసే సేల్స్ఫోర్స్ కంపెనీకి భారత్లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మంది మహిళలను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. తద్వారా ఉద్యోగుల విషయంలో మరింత సమతుల్యతను తీసుకురానున్నట్టు తెలిపింది. ‘‘ఉద్యోగులు ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసేందుకు మరిన్ని కంపెనీలు అనుమతించనున్నాయి. ఇది మహిళలకు అనుకూలమైన పరిస్థితులను, అవకాశాలను కల్పించనుంది. వ్యక్తిగత బాధ్యతలను నెరవేరుస్తూనే వారు తమ కెరీర్ను తిరిగి ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా డైరెక్టర్ నిధి అరోరా అభిప్రాయపడ్డారు. ‘‘భారత్లో భద్రతా కారణాల రీత్యా రాత్రి షిఫ్ట్లకు మహిళలను అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కరోనా కారణంగా భిన్నమైన ధోరణులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలకు వారు అర్హులే. మరింత మంది మహిళలు ఉపాధి అవకాశాలను సొంతం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘వర్కింగ్ మదర్ మీడియా’ ప్రెసిడెంట్ సుభ వి బ్యారీ తెలిపారు. ‘బ్యాలెన్స్’ అవకాశం పనిచేసే చోట సాధారణంగా స్త్రీ/పురుష ఉద్యోగుల విషయంలో సంఖ్యా పరంగా ఎంతో అంతరం కనిపిస్తుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పుడు ఈ అంతరాన్ని సరిచేసే అవకాశం కానుందా..? అన్నదానికి ఏడీపీ ఇండియా హెచ్ఆర్ హెడ్ విపుల్సింగ్ స్పందిస్తూ.. ‘‘కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఇవ్వనందుకే మహిళలు ఉద్యోగాల నుంచి తప్పుకోవడం లేదు. సామాజికంగా, మానసికంగా, వ్యక్తిగత అవసరాల కోసం వారి జీవితంలో కొంత వ్యవధి కావాలి. అందుకే వారు ఉద్యోగాల విషయంలో రాజీపడాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అన్నింటిని సమతుల్యం చేసుకోగలరు’’ అంటూ భవిష్యత్తు ధోరణి గురించి వివరించారు. గత రెండేళ్లలో మహిళా ఉద్యోగుల శాతం 35% నుంచి 25%కి పడిపోయిందని.. ఇప్పుడు మళ్లీ పుంజుకోనుందని యాక్సెంట్ హెచ్ఆర్ సీఈవో సుబ్రమణ్యమ్ చెప్పారు. వేతనాల్లో అం తరం ఉండడం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు సానుకూలించే అంశంగా పేర్కొన్నారు. వేతనాలదీ కీలకపాత్రే... ‘‘పని పరంగా పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకపోయినా.. పారితోషికాల విషయంలో మహిళలకు 20% తక్కువే చెల్లిస్తున్నాయి కంపెనీలు. ఇది మహిళలకు ప్రతికూలమే అయినా, పరిశ్రమకు లాభదాయకం. సౌకర్యమైన పనివేళలు లేదా ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల దిశగా పరిశ్రమలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే మహిళలకు ఉపాధి పరంగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్టే. ఎందుకంటే ఈ విషయంలో పరిశ్రమలకు కనీస వేతనాల తలనొప్పి కూడా ఉండదు’’ అని సుబ్రమణ్యమ్ వివరించారు. రెండో విడత కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళలకు వర్క్ హోమ్ హోమ్తో భారీ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. -
‘మహాబలి‘ సినిమాలో స్థానికులకు అవకాశాలు : డైరెక్టర్ రోహిత్
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కాలేజ్ సీటు కోసం సత్యాగ్రహం
శాస్త్రీయ విజ్ఞానాన్ని వినువీధిలో విహరింపజేయాలనే అభిలాషతో నిరంతరం శ్రమించి.. ఆ క్రమంలో లైంగిక వివక్షకు గురై అనేక అవమానాలు,అడ్డంకులు దాటుకుని గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన మహిళ కమలా సోహాని.బ్రిటీష్ కాలంలోనే నాటి లింగ వివక్షను ఆత్మస్థయిర్యంతో ఒంటరిగాఎదుర్కొని శాస్త్రీయ విజ్ఞాన శాస్త్రంలో వినూత్న పరిశోధనలతో రాణించిన ఆ ధీశాలిని ఈ ‘సైన్స్ డే’రోజు తప్పక స్మరించుకోవాలి. మహిళల ఉన్నతవిద్యకు అవకాశాలు అంతంత మాత్రం కూడా లేని కాలంలో 1912 సెప్టెంబర్ 14న మధ్యప్రదేశ్ని ఇండోర్లో జన్మించారు కమలా సోహాని. ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన కమల చదువులో ముందునుంచి విశేష ప్రతిభ కనబరిచారు. ఆమె తండ్రి నారాయణ, బంధువు మాధవరావ్ భగవత్ ఇద్దరూ కూడా బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో రసాయన శాస్త్రంలో పట్టాపొందినవారే. వారిని ఆదర్శంగా తీసుకున్న కమల.. జీవ రసాయన శాస్త్రంలో రాణించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల విద్య అనంతరం బాంబే ప్రెసిడెన్సీ కాలే జీలో బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) డిగ్రీ చదివారు. డిగ్రీలో తన సహచరుల కంటే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. సీవీ రామన్ అభ్యంతరం! మాస్టర్స్ డిగ్రీ చేయాలని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) లో సీటు కోసం కమల ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ఐఐఎస్సీ సంస్థ డైరెక్టర్గా ఉన్నారు. తన ప్రవేశాన్ని ఆయన నిరాకరించడంతో కమల దిగ్భ్రాంతికి గురయ్యారు. డిగ్రీలో మంచి ] ూర్కులు సంపాదించినప్పటికీ, కేవలం మహిళ అనే కారణంగా ఆమె సీటు సంపాదించుకోలేక పోయింది! కమల తండ్రి, బంధువు సీవీ రామన్ దగ్గరకు వెళ్లి ప్రవేశం కల్పించాలని అభ్యర్థించినా కూడా ఆయన నిరాకరించారు. బాలికలకు ఐఐఎస్సీలో ప్రవేశంలేదని, మహిళలు పరిశోధనలలో పురుషులతో సమానంగా పోటీపడలేరని తేల్చి చెప్పారు. కమల పట్టు వదలక ఎలాగైనా ఐఐఎస్సీలో చేరడం కోసం దృఢ సంకల్పంతో పోరాడాలని నిశ్చయించుకున్నారు. సీవీ రామన్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం చేశారు. దీంతో దిగివచ్చిన రామన్ కొన్ని షరతులతో ఆమెను ఐఐఎస్సీలో ప్రవేశానికి అంగీకరించారు. ఇవే ఆ షరతులు! ఒకటి.. రెగ్యులర్ అభ్యర్ధిగా కాకుండా సంవత్సరకాలం ప్రొబేషన్లో ఉండాలి. రెండు.. గైడ్ సూచనల మేరకు రాత్రులలో కూడా పనిచేయాలి. మూడు.. పురుషుల చదువు ధ్యాస మళ్లకుండా ల్యాబ్స్లో మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఈ మూడు షరతులను కావాలనే తనను నిరుత్సాహ పరిచేందుకే విధించారని గ్రహించినప్పటికీ కమల ఆ షరతులను అంగీకరించి సీటు సంపాదించారు. దీంతో ఐఐఎస్సీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా (1933) గుర్తింపు పొందారు. ‘‘రామన్ గొప్ప వ్యక్తి కావచ్చుగాని ఆయనకు స్త్రీల ప్రతిభ, పట్టుదలలపై నమ్మకం లేదు. ఇది చాలా బాధాకరం’ అని ఒకానొక సందర్భంలో ఆమె వాపోయారు. ప్రొటీన్లపై పరిశోధన ఐఐఎస్సీలో చేరాక పాలు, పప్పు దినుసులు, మొక్కలలో ఉండే ప్రొటీన్లపై పరిశోధనలను ప్రారంభించారు కమల. ఆమె అంకిత భావాన్ని చూశాక గానీ, శాస్త్రీయ పరిశోధనల్లో మహిళలు రాణిస్తారన్న నమ్మకం సీవీరామన్కు కలగలేదు. 1936లో ఆమె తన పరిశోధనలను సమర్పించి ఎంఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. వెంటనే యూకేలోని సుప్రసిద్ధ కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఆమె సత్తాను గమనించిన సీవీరామన్ మరుసటి ఏడాదే ఐఐఎస్సీలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించారు! అలా ఆమె ఒక మార్పునకు నాంది అయ్యారు. పేదల కోసం పానీయం కేంబ్రిడ్జిలో కమల బంగాళదుంపలపై పరిశోధన జరిపి సైటోక్రోమ్–సీ అనే ఎంజైమ్ను కనుగొన్నారు. ఈ ఎంజైమ్ జీవులు, మొక్కలు, జంతువులు, మనుషులలో శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరిస్తూ రెండు వారాలలో నలభై పేజీల సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. అలా పీహెచ్డీ పట్టా పొంది భారతదేశంలోనే తొలి మహిళా శాస్త్రవేత్తగా కమలా సోహాని గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే యు.ఎస్.లోని కెమికల్ కంపెనీ నుంచి ఆమెకు అవకాశాలు లభించాయి. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనాలని భావించి 1939లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ అధిపతిగా పని చేశారు. అనంతరం నేషనల్ రిసెర్చ్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అక్కడే విటమిన్లు, పోషణ, వాటి ప్రభావంపై పరిశోధనలు జరిపారు. ఆ సమయంలోనే ఎంవీ.సోహానీని వివాహం చేసుకొని 1947లో ముంబాయి వెళ్లారు. బాంబే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్గా నియమితులయ్యారు. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సలహాపై ‘నీరా’ అనే పానియాన్ని పేదల పోషణావసరాల కోసం తయారు చేశారు. నీరాలోని విటమిన్ ఏ, విటమిన్ సి.. పిల్లలు, గర్భిణులకు పోషకాలుగా, గిరిజన ప్రాంత పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సప్లిమెంటుగా వాడొచ్చని నిరూపించారు. శాస్త్ర విజ్ఞానంలో సమాజానికి ఇలా ఎంతో సేవ చేసిన కమలా సోహాని 1998లో ఓ సంస్థ ఏర్పాటు చేసిన సన్మానసభలో అకస్మాత్తుగా మరణించారు. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో నేటితో ముగుస్తున్న ‘నేషనల్ సైన్స్ డే’ వారోత్సవాలు ఈ తొలి మహిళా శాస్త్రవేత్తకు ఘనమైన నివాళిని ఇవ్వనున్నాయి. పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి ఆదర్శ మహిళ కమలా సోహాని ఆంగ్లేయుల పాలనలో మహిళలపై వివక్షకు ఎదురొడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమలా సోహాని మహిళా లోకానికే ఆదర్శనీయం. అయితే ఆమెకు తగినంత గుర్తింపు దక్కలేదనే భావించాలి. యండ్రపల్లి దుర్గయ్య, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం -
భారత్ అవకాశాల కేంద్రం: కామెరాన్
కోల్కతా: భారత్ ఇతర దేశాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోందని, ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. కోల్కతాలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి అయినా, చెడు అయినా అవకాశాలపై దృష్టి సారించడం ముఖ్యం. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకోవాలి. నా పదవీ కాలంలో భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలకు ప్రాధాన్యమిచ్చాం. జి20 దేశాల్లో భారత్లోనే బ్రిటన్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. టాటాల రూపంలో భారత్ నుంచి అతిపెద్ద పెట్టుబడులు అందుకున్న దేశం కూడా మాదే’’ అని కామెరాన్ పేర్కొన్నారు. 2010–2016 వరకు కామెరాన్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఈ రోజు మార్కెట్ ఎకానమీకి ప్రతికూలతలు ఎదురయ్యాయని, బలవంతుడి రాజకీయాలు ఆవిర్భవించడాన్ని చూస్తున్నామంటూ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడి తీరును ప్రస్తావించారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్యం వ్యర్థమన్న పూర్వ సిద్ధాంతం మాదిరిగా రక్షణాత్మకం, ఒంటరితనం పెరిగిపోతోందని పేర్కొన్నారు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, దాని రూపు మారిస్తే సరిపోతుందన్నారు. భారత స్టీల్పై అమెరికా అధ్యక్షుడు దిగుమతి సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. భారత ప్రధాని తాను ఎంత బలవంతుడో చూపించాల్సి ఉందన్నారు. -
అంతా పోగొట్టుకున్నా.. అవకాశాలివ్వండి
తమిళసినిమా: సినీ రంగం ప్రతిభను గౌరవిస్తుంది. అవకాశాలను అందిస్తుంది. డబ్బు, పేరు, అంతస్తు అన్నీ ఇస్తుంది. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే జీవితం కడగళ్ల పాలే. ఎప్పుడో తనువు చాలించిన మహానటి సావిత్రి కడ జీవితం గురించి ఇప్పటికీ చర్చించుకుంటుంటాం. అయితే ఈ తరం హీరోయిన్లు చాలా ప్రీ ప్లాన్డ్గా జాగ్రత్త పడుతూ సంపాదించింది కూడబెట్టుకుంటున్నారు. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేసి పలు రెట్లు పెంచుకుంటున్నారు. అలాంటిది నటి చార్మీళ లాంటి కొందరు హీరోయిన్లు భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తమిళంలో నల్లదోరు కుటుంబం, తైయల్క్కారన్, కిళక్కే వరుమ్ పాట్టు, ముస్తాఫా మనసే మౌనమా తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించి బాగా వెలిగిన నటి ఛార్మిళ. అలాంటిది ఇప్పుడు అన్నీ కోల్పోయాను అవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని అభ్యర్థించే స్థాయికి దిగజారింది. ఆమె ఏమంటుందో చూద్దాం. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగినా, నా జీవితంలో అనూహ్య సంఘటనలు జరిగాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఆరోగ్యం పాడయ్యింది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ముందే జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా చేయలేను. మంచంలో పడ్డ నా తల్లిని చూసుకోవాలి. కొడుకు బాగోగులు చూసుకోవాలి. అందుకే ఆత్మహత్యకు పాల్పడలేదు. ఒక కాలంలో చాలా చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ప్రముఖ దర్శకులను అవకాశాలు అడిగితే ఇవ్వడం లేదు. నాకు నటించడానికి అవకాశాలు ఇవ్వండి. భవిష్యత్ కోసం డబ్బును కూడబెట్టుకోలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. సినిమాల్లో ముమ్మరంగా నటిస్తున్నప్పుడు ఆడంబర జీవితాన్ని అనుభవించాను.తరచూ విదేశాలకు వెళ్లి నక్షత్ర హోటళ్లలో గడిపాను. సంపాదించిన దానిలో సగం విదేశాలకు వెళ్లడానికే ఖర్చు చేశాను. వివాహానంతరం నా జీవితం తలకిందులైంది. ఇంటిని, స్థిరాస్తులను విక్రయించేశాను. నేను చేసిన మరో పెద్ద తప్పు ఇంటిని అమ్మడం. ఆ ఇల్లు నాకు చాలా ఆత్మస్ధైర్యాన్నిచ్చింది. అలాంటి ఇల్లు పోయిన తరువాత మానసికంగా, శారీరకంగా నష్టపోయాను. ఆవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని ధీనంగా అభ్యర్థిస్తున్నారు. -
అవకాశాల కోసం అర్ధనగ్నంగా..
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత తెలిసినా కొందరు దాన్ని ఆచరించలేరు. దక్షిణాదిలో మంచి స్థాయికి చేరుకున్న హీరోయిన్లు ఇక్కడ అవకాశాలను కాలదన్నుకుని బాలీవుడ్ మోహంతో అక్కడ అవకాశాల కోసం నానా తంటాలు పడుతుండడం చూస్తునే ఉన్నాం. బాలీవుడ్లో ప్రవేశించిన అతి కొందరు నటీమణులే సక్సెస్ అయ్యారు. అదీ కొన్ని చిత్రాలకే పరిమితం. మరి కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది అవకాశాలను వలదని, బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీ చిత్రం ఈ గోవా సుందరికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. దీంతో అక్కడ తన భవిష్యత్ ఉజ్వలమేనని కలలు కనేసింది కూడా. అయితే అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. అమ్మడు ఐదేళ్లలో ఐదు హిందీ చిత్రాలను మాత్రమే చేసింది. ఆ తరువాత బాలీవుడ్ ఇలియానా పక్కన పెట్టేసింది.దీంతో ఎక్కడ పారేసుకున్నానో అక్కడే వెతుక్కోవడానికి ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. అందుకు ఇలియానా ఎంచుకున్న విధానం ఎప్పుడూ ఏదో ఇక సంచలన చర్యలతో వార్తల్లో ఉండడం. చాలా మంది వాడుకునే ట్రిక్కే ఇది. ఇలియానా తన బాయ్ఫ్రెండ్తో దిగిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం, సెక్స్ గురించి మాట్లాడడం లాంటి చీప్ ట్రిక్కులను పాఠిస్తోంది. ఇలాంటివి ఈ నాజూకు అమ్మడిని వార్తల్లోకెక్కిస్తున్నాయి గానీ, అవకాశాలు మాత్రం రావడంలేదు. దీంతో చివరి ప్రయత్నంగా ఈ భామ ఈత దుస్తులతో కూడిన ఫొటోలను, పూర్తి నగ్న ఫొటోలను ఇంటర్నెట్కు విడుదల చేసింది. తను బాత్రూమ్ టబ్లో నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి అవన్నా ఇలియానాకు అవకాశాలను అందిస్తాయే లేక వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చింతకు గురవుతుందో చూడాల్సిందే. -
సినిమాల్లో అవకాశమిస్తామని..17 రోజులపాటూ..
హైదరాబాద్: మైనర్ బాలికకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి 17 రోజుల పాటు ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమాల్లో డ్యాన్సర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో బాలిక(15) బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న నలుగురు యువకులు బాలికపై కన్నేశారు. ఇందిరానగర్లో నివసిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ అక్బర్(21), తూము వెంకారెడ్డి(22), ప్రొడక్షన్ అసిస్టెంట్గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్ గణేష్(31) మోయినాబాద్వాసి గుడుపల్లి నవీన్కుమార్(19)లు బాలికకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ మభ్యపెట్టి ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. మరో స్నేహితుడు కుమార్తో కలిసి ఐదుగురు ఆమెను ఇందిరానగర్తో పాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉండగా మిగతా నలుగురిని ఐపీసీ సెక్షన్ 376(డి), సెక్షన్ 5(జి), రెడ్విత్ 6, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
పరిశోధనారంగంలో విస్తృత అవకాశాలు
కర్నూలు సిటీ: శాస్త్రీయ పరిశోధన రంగం వైపు యువత రావాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలో విస్త్రృతమై అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రొఫెసర్లు అన్నారు. క్యాన్సర్ బయాలజీ అనే అంశంపై స్థానిక సిల్వర్జూబ్లీ కాలేజీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ శనివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ డా.హరీష్, అన్నామలై యూనివర్శిటీ ప్రొఫెసర్ నాగిని, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ రాజేశ్వరిలు ముఖ్య అతి«ధులుగా హాజరై ప్రసంగించారు. దేశ భవిష్యత్తు, అబివృద్ధి అనేది శాస్త్ర పరిశోధన రంగంపై ఆధార పడి ఉంటుందన్నారు. రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనరంగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అధిక శాతం మంది యువత క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఆహారపు అలవాట్లు కాలానుగణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్పై దేశంలో పరిశోధనలు పెద్ద ఎత్తున చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆ కాలేజీ పూర్వ విద్యార్తి శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్డాక్టర్ అబ్దుల్ ఖాదర్, వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఆర్గనైజింగ్ కార్యదర్శి జాన్సన్ సాటురస్, కన్వీనర్ మైఖెల్ డేవిడ్, లలితా కూమారి, మాధవీలత, లక్ష్మీరంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఉచిత శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్మహీంద్రా ఫౌండేషన్, నిర్మాణ్ ఎన్జీవోలు అవకాశాలు కల్పిస్తున్నాయి. పదవ తరగతి పాసై ఇంటర్, డిగ్రీ ఫెయిల్ లేదా పాసైన విద్యార్థులు తాము కల్పించే శిక్షణా తరగతులకు హాజరు కావచ్చునని నిర్మాణ్ సంస్థ ప్రతినిధి కె.నిరంజన్ యాదవ్ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు యువతీ యువకులకు 90 రోజుల పాటు ఉచితంగా శిక్షణనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఉంటుందన్నారు. బీకాం పాసైన వారికి మాత్రం టాలీ, ఈఆర్పీ–9, బేసిక్ అకౌంట్స్, ఎంఎస్ ఎక్సెల్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తవగానే సర్టిఫికెట్ ఇస్తారు. కూకట్పల్లిలో ఉన్న ఈ శిక్షణా కేంద్రానికి ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 90300 55998, 91003 30378 నెంబర్లకు ఫోన్ చేయచ్చు. -
సివిల్ ఇంజినీర్లకు ఎన్నో అవకాశాలు
- సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సివిల్ ఇంజనీర్ల పాత్ర కీలకం కానుందని సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి అన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా రాజధాని నిర్మాణం జరగాలంటే అందులో సివిల్ ఇంజనీర్ల కృషి, వినూత్న ఆలోచనలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఎటువంటి నిర్మాణంలోనైనా నాణ్యత చాలా ప్రధానమని ఆయన విశ్లేషించారు. తాత్కాలిక సచివాలయం, ఇతర భవనాల గురించి ఆయన విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, స్మార్ట్ నగరాల వంటి ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాయని, దీని వల్ల సివిల్ ఇంజనీర్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో అవకాశాలు
జేఎన్టీయూ: భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్స్ స్కిల్స్) పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్. వేణుగోపాల్రెడ్డి అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్డే నిర్వహించారు. ఆచార్య వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్తో పాటు జపనీస్, చైనీస్, స్పానిష్ భాషలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు. అనేక విదేశీ కంపెనీలు ఏపీకి రానుండడంతో విదేశీ భాషలు నేర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజాన్ని ప్రేమించాలని.. అది మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుందన్నారు. -
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
ఆత్మకూరురూరల్ : జిల్లా గ్రామీణాభివద్ధి ఎంప్లాయీమెంట్ జనరేషన్ ద్వారా పలు బహుళజాతి కంపెనీల్లో పనిచేయుటకు గ్రామీణ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆత్మకూరు ఎంపీడీఓ ఏ నిర్మలాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైజింగ్ స్టార్ మొబైల్ – తడ, గ్రీన్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్– నాయుడుపేట, అమరరాజా బ్యాటరీస్ – తిరుపతి, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ కంపెనీ – నాయుడుపేట తదితర కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయన్నారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సుగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ శుక్రవారం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలు, 2 ఫొటోలతో హాజరుకావాలన్నారు. -
పేరు మారింది మరి ఫేట్?
సెంటిమెంట్ చాలా చేయిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువేనని చెప్పక తప్పదు. న్యూమరాలజీని బాగానే నమ్ముతారు.దానిని బట్టి తారలు పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాటే.తద్వారా ఎవరు ఎలాంటి ఫలితాలను పొందారన్నది పక్కన పెడితే ఈ పేర్ల మార్పుల పరంపర కొనసాగుతూనే ఉంది.ఆ మధ్య నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్లక్ష్మీగా మార్చుకున్నారు.తాజాగా వర్ధమాన నటి శ్రీప్రియాంక శ్రీజగా పేరు మార్చుకున్నారట. ఇటీవల తమిళ భాష తెలిసిన నటీమణులకు ఇక్కడ అవకాశాలు లేవు అంటూ ఒక వేదికపై తన ఆవేదనను వ్యక్తం చేసి నలుగురి దృష్టిలో పడ్డ ఈ అమ్మడు పుదుచ్చేరికి చెందిన అచ్చమైన తమిళ అమ్మాయి. కంగారు చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన శ్రీప్రియాంక ఆ తరువాత వందామల, కోడైమళై చిత్రాల్లో నటించింది. తాజా చిత్రం సారల్ విడుదలకు ముస్తాబవుతోంది. అయితే నాయకిగా తగిన గుర్తింపు కోసం పోరాడుతున్న శ్రీప్రియాంక తన పేరును శ్రీజగా మార్చుకోవడానికి కారణాన్ని తెలుపుతూ శ్రీప్రియాంక పేరుతో ఇప్పటికే ఇక్కడ ఇంకొందరు నటీమణులు ఉన్నట్లు ఇటీవలే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. పేరుతో కన్ఫ్యూజన్ ఉండరాదనే శ్రీజగా మార్చుకున్నట్లు వివరించారు. అయితే న్యూమరాలజీ ప్రకారం శ్రీజ పేరు తనకు భాగుంటుందన్నారని అసలు సంగతిని మెల్లగా చెప్పింది. తాను నటించిన సారల్ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అంది. ప్రస్తుతం రింగారం అనే చిత్రంలో నటిస్తున్నానని, తిరుపతి లడ్డు అనే మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పింది. మరి కొన్ని నూతన చిత్రాలను అంగీకరించే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు శ్రీజగా మారిన శ్రీప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ఈ కొత్త పేరు అయినా తనకు మంచి అవకాశాలు తెచ్చి పెట్టి తన ఫేట్ను మారుస్తుందేమో చూడాలి. -
'విద్యార్థులకు యూకేలో విస్తృత అవకాశాలు'
హైదరాబాద్: యూకేలో భారత విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని హైదరాబాద్లో బ్రిటిష్ హై కమిషన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలోని లైఫ్ సైన్స్ సెమినార్ హాల్లో ఈ-లెర్నింగ్పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రారంభ కార్యక్రమంలో అలిస్టర్ మాట్లాడుతూ భారత్, యూకే విద్యా సంబంధాలు మెరుగుపడ్డాయని, అవి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. యూకే ప్రభుత్వం ఇండియాతో కలిసి పలు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. యూకే ప్రధాని, భారత ప్రధాని పలు అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతిని తెలుసుకునే విద్యా విధానం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్లోని పలు ప్రాంతాల్లో విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఐఐఎం బెంగళూర్ ప్రొఫెసర్ పీడీ జోష్ మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. భవిష్యత్లో ఇంటర్నెట్ సదుపాయంతో ఇంట్లోనే చదువుకునే అవకాశం వస్తుందన్నారు. అనంతరం హెచ్సీయూ ఇన్చార్జీ వీసీ పెరియా సామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో విదేశీ భాషలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈక్వల్ ప్రాజెక్ట్ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ జంధ్యాల ప్రభాకర్ రావు, ఈయూ ప్రాజెక్టు మేనేజర్ మంజుల కౌల్లు పాల్గొన్నారు. -
అవకాశాల్లేక కుంగిపోతున్నారు!
పారిస్: అవకాశాల లేమితో కుంగిపోతున్న అట్టడుగు వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చేసే శక్తి విద్యకు ఉందని 'సూపర్30' వ్యవస్థాపకులు ఆనంద్కుమార్ అన్నారు. గతేడాది ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన ఆటోరిక్షా డ్రైవర్ కూతురు, సూపర్30 విద్యార్థిని 'నిధి ఝా' విజయగాథ ఆధారంగా ఫ్రెంచి భాషలో తెర కెక్కించిన 'ది బిగ్ డే' చిత్రాన్ని ప్రముఖ ఫ్రెంచి బిజినెస్ స్కూల్ 'ఎసెక్ స్కూల్' లో ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. అవకాశాల లేకపోవడం వల్లే అట్టడుగు వర్గాల విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారన్నారు. ఇతర విద్యార్థులతో సమానంగా వారికి సామర్థ్యాలు ఉన్నాయని, ఒక్క చిన్న అవకాశం వారి జీవితాలను మార్చేయగలదని తన 30 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఉదాహరణలు చూశానని చెప్పారు. నిధి ఝా జీవితం ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు పాస్కల్ ప్లిసన్ ది బిగ్ డే చిత్రాన్ని తెరకెక్కించారు. నిధి ఝా ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్లో విద్యనభ్యసిస్తోంది. -
ఇలియానాకేమయ్యింది?
నటి ఇలియానాకేమయ్యింది? పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఇలియానా ఇంతకుముందు టాలీవుడ్లో నెంబర్ ఒన్ స్థాయికి పోటీపడిన నటీమణుల్లో ఒకరు. అలాగే కోట్లు పారితోషికం డిమాండ్ చేసిన ఇలియానా తమిళంలో తెరంగేట్రం చేసిన చిత్రం కేడీ. ఆ చిత్రం తన కేరీర్కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ తరువాత శంకర్ దర్శకత్వం వహించిన నన్భన్ చిత్రంలో నటించేంత క్రేజ్ను సంపాందించుకున్నారు. అలాంటి సమయంలో ఇలియానాకు బాలీవుడ్ ఆశ పట్టింది. అది సహజమే అయినా అక్కడ అవకావాలను సద్వినియోగం చేసుకోలేక పోయారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఇలియానా చిత్రం ఒప్పందం సమయంలో కేటాయించిన కాల్షీట్స్ ప్రకారం షూటింగ్కు రారని, మధ్యాహ్నం తరువాతే లొకేషన్కు వస్తారని ఒక సన్నివేశం పూర్తయ్యేసరికి పేకప్ సమయం అవుతుందనే ఫిర్యాదులకు ఆస్కారం కల్పించడమే ఇలియానాకు అవకాశాలు కోల్పోయిందనేది చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక చిత్రం కూడా లేని ఇలియానా మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారనీ తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 తెరకెక్కనున్న విషయం తెలిసి ఇటీవల ఆయన్ని కలిసి అవకాశం అడిగినట్లు కోలీవుడ్ టాక్. ఇతరుల కోసం పళ్లు ఇకిలించను కాగా ఇటీవల ఇలియానా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇతరులను సంతోష పరచడానికని నేను పళ్లు ఇకిలించను. ఒకరిగురించి పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు. నా ఏకాంతాన్ని నేను గౌరవించుకుంటాను. కెమెరాముందు నటిస్తాను గానీ ఇతరుల కోసం 24 గంటలు నటించడం నాకు ఇష్టం ఉండదు. నా వ్యక్తిత్వం ఎవరికైనా నచ్చకపోతే అది వారి సమస్య. నన్నెవరయినా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తే అతనికి నవ్వుతూ పోజులిచ్చేనటిని నేనుకాదు. హీరోయిన్ల వద్ద కొందరు సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి నేను దూరంగా ఉంటాను’.. అని పేర్కొన ఇలియానాకేమయ్యింది? అవకాశాలు లేక పోవడంతో అసహనానికి గురవుతోందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అంతరాత్మ మాట వినండి
31 అక్టోబర్ 2015 నుంచి నవంబర్ 6 వరకు టారో బాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) విలాసంగా జీవించేందుకు కావలసిన ధన సమృద్ధికి పుష్కలంగా అవకాశాలు దొరుకుతాయి. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూడవచ్చు. ఆర్థికంగా లోటుండదు. అయితే మీకు అయిన వారి నుంచే తిరస్కరణలు, నిరాశ, వంచన ఎదురు కావచ్చు. అయితే జీవితంలో ఇదొక దశ మాత్రమే. శాశ్వతం కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ముదురు నీలం టారస్ (ఏప్రిల్ 21-మే 20) అన్నింటా సమతుల్యతను పాటించడం మంచిది. అవిశ్రాంతంగా గడుపుతారు. పనికీ, సమయానికీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు. మీ ప్రేమ సఫలమవుతుంది. మీరేదైనా బంధంలో ఉంటే మాత్రం దానిని దృఢపరచుకో. మీ తప్పులేమిటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. చురుగ్గా, హుషారుగా ఉండండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు జెమిని (మే 21-జూన్ 21) మీ జీవన గమనంలో కీలక మార్పు సంభవించవచ్చు. ఓ విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇతరుల విషయంలో అనవసర జోక్యం వద్దు. అతిగా పని చేయకుండా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. మీరు పురుషులయితే ప్రేమ విషయంలో మీరే చొరవ చూపడం మంచిది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు (పీచ్) క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీరు చాలా మొండివారిగా, బలవంతులుగా మిమ్మల్ని ఎవరూ మార్చలేరన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సమతుల్యత పాటించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏదో అద్భుతం జరిగినట్లుగా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. కొత్త వ్యాపారం ఆరంభమవుతుంది. విజయసోపానాలను అధిరోహిస్తారు. కలిసొచ్చేరంగు: లేత నారింజ రంగు లియో (జూలై 24-ఆగస్టు 23) నిజమేదో, ఊహ ఏదో తెలుసుకోవలసిన వారమిది. అలాగే ప్రేమ విషయంలో మీరు అత్యవసర నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అప్పుడప్పుడు స్వల్ప అభద్రతాభావం, కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నా, వారమంతా సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మీ పద్ధతి ప్రకారం మీరు నడచుకుంటూ ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఇంటిని ఆధునీకరించుకోవ డానికి తగిన సమయమిది. మీరు తలపెట్టిన కార్యం సజావుగా పూర్తవుతుంది. గత నెలలో కలిగిన చిక్కులు, చికాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితమనే ఓడ ఎటు తీసుకెళితే అటు నడవండి. మీకు మీరు అనవసర నిర్ణయాలు తీసుకోవద్దు, అపోహలకు, భ్రమలకు గురి కావద్దు. కలిసొచ్చే రంగు: ఊదా లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈ వారం ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. వ్యాపారం లాభాలబాటలో నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పొదుపు చేయడానికి ఇది తగిన సమయం. అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆహార జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యం విషయంలో అవస్థలు తప్పవు. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ ఆశలు, ఆశయాలకు, మీకున్న వనరులు, సమస్యలు సవాళ్లకు మధ్య వైరుధ్యం ఏర్పడవచ్చు. పని... ఆరోగ్యం... కెరీర్- వీటన్నింటిపరంగా సంతోషం కలుగుతుంది. అంతా సవ్యంగా ఉన్నాయన్న భావన మీ మనసును ఆనందంతో నింపుతుంది. మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బంధాన్ని సరి చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ కలల సౌధాన్ని కూలగొట్టుకోవద్దు. వాటిని నెరవేర్చుకునే మార్గ్గాన్ని అన్వేషించండి. రోజువారీ పనులతో జీవితం బోర్గా అనిపించకుండా విహార యాత్రలు చేయండి. మీ బంధాలను పునరుద్ధరించుకోండి. బంధుమిత్రుల నుంచి అనూహ్యమైన బహుమతులు రావచ్చు. సామాజిక జీవనం మరింత ప్రకాశ వంతంగా మారుతుంది. కలిసొచ్చే రంగు: సిల్వర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) రానున్న నెలంతా మీకు ఆనందమే ఆనందం. అందుకు ఈ వారమే పునాది. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. మీ వ్యాపార భాగస్వామి విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. ఎదురు చూడని వ్యక్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. ప్రేమికులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) రానున్న నెల మీకు ఒడిదొడుకులతో కూడుకున్న నెల అని చెప్పవచ్చు. మీరు చేస్తున్న పనికి, పెట్టిన పెట్టుబడికి, వచ్చే రాబడికి మధ్య పొత్తు కుదరని విధంగా ఫలితం ఉంటుంది. అయితే రాత్రి తరవాత పగలు, చీకటి తర్వాత వెలుగు ఉంటుందని గ్రహించి, రిలాక్స్ అవండి. రొమాన్స్లో ఉంటే ఈ వారం దానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ కోరికలు నెరవేరతాయి. ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు. అనేక సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో అవలీలగాా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుప్పచ్చ రంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌరవాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) నిరుద్యోగులు గట్టి ప్రయత్నం మీద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్థులు మీదైన ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధికోసం ఏమైనా పరీక్షలుంటే వాటికి సిద్ధమైతే తప్పక సత్పలితాలు ఉండగలవు. వ్యాపారస్థులయితే కొత్త మెళకువలని తోటి వ్యాపారుల నుండి తెలుసుకోవడం మంచిది. ఏమైనా ఒక నెలలోగా ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగా ప్రయాణించాల్సి ఉంది. టారస్(ఏప్రిల్ 21-మే 20) ఎవరినో చూసి లేదా ఎవరి ప్రోత్సాహం వల్లనో కొత్తవస్తువాహనాల్ని కొనుగోలు చేయడం ప్రస్తుతం సరికాదు. త్వరలో రానున్న ఓ అవసరం కోసం ఇప్పటినుంచే వ్యయం విషయంలో తగినంత ప్రణాళిక, శ్రద్ధ అవసరం. ప్రభుత్వపరమైన చెల్లింపులువెంటనే చేయండి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం సాగిస్తుంటే దాన్ని వెంటనే విరమించుకోండి. జెమిని (మే 21-జూన్ 21) ప్రస్తుత ఉద్యోగం నుంచి బయటపడి మరో మంచి ఉద్యోగాన్ని చేయదలచిన మీ ప్రణాళిక అమలు కావడం కష్టమే. అదే విధంగా మీరుంటున్న ఇల్లు లేదా లేదా ఊరి మార్పు కూడా అంత సులభ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటూ రావలసిన సొమ్ముల కోసం ఎదురు చూడడంతో ఈ వారం ముగిసిపోవచ్చు. అయితే ప్రయత్నాన్ని మానకండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) దీర్ఘకాలంపాటు శ్రమిస్తేనే గాని పరిష్కరింపబడని సమస్యలు అలాగే కొనసాగవచ్చు. వాటివల్ల ఆర్థిక లోటు తప్ప మరే నష్టమూ ఉండదు. మీకు తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణం. ఆదాయానికి లోటుండదు కాని అన్ని పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నామనే దిగులు ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఈ వారంలో పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. లియో (జూలై 24-ఆగస్టు 23) మీరు ఆరంభించిన ప్రయత్నాలకి అనుగుణంగా మీ ప్రణాళిక ఫలించి చక్కని ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే ఒకప్పటి అపనింద తొలగే అవకాశం ఉంది. కొత్తవ్యాపారాన్ని లేదా గతంలో చేసి మానేసిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. అయితే మీకు మీరుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే సమయం ఉండదని గమనించి దిగండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆర్థికంగా అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో పెద్దగా రాణింపు ఉండకపోవచ్చు. గతాన్ని గురించిన ఆలోచనని మాని, భవిష్యత్ ప్రణాళికని వేసుకోండి. కార్యాల్లో వ్యతిరేకత ఉండదు అలాగని అనుకూలతా ఉండదు. మిత్రుల మాటల్ని నమ్మి వ్యాపారంలోకి దిగకండి. సలహాలనీ సూచనలనీ వినండి కాని, ఆచరణలోకి తేవాలనుకోవడం సరికాదు ఈ వారానికి. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. తగినంత విద్యార్హత ఉన్నా ఉద్యోగం లేదా వ్యాపారాన్ని చేసే వీలు సాధ్యం కాకపోవచ్చు. మీ అనవసర పట్టుదల మాని, రాజీ యత్నం చేస్తే ఫలితం అనుకూలంగానే ఉంటుంది. మీ కుటుంబం మీకు ముఖ్యం తప్ప మీ సహాయం వల్ల మరో కుటుంబం ఉన్నతిని పొందుతుందని మీ కుటుంబాన్ని వెనక్కి పెట్టుకోవడం సరి కాదు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రస్తుతం మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే మానసిక స్థితి ఊగులాట ధోరణిలో ఉంటూ దాంపత్య అన్యోన్యత విషయంలో తీవ్ర వ్యగ్రతతో ఉండవచ్చు. మానసిక అనారోగ్యం వల్ల శరీరారోగ్యమూ దెబ్బతిన వచ్చు కాబట్టి వ్యాయామాల్ని చేస్తూ తగిన ఆరోగ్య పద్ధతుల్ని అవలంబిస్తూ ఆధ్యాత్మికతవైపు దృష్టి మళ్లించడం మంచిది. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మొహమాటం వల్ల లేదా నోటిమాటగా చెప్తే ఏమౌతుందో అనే ఆలోచన వల్ల మీ అభిప్రాయాన్ని మీ పనుల ద్వారా తెలియజేయడం సరికాదు. మీరు అజాత శత్రువు కాబట్టి మీ అసౌకర్యం గురించి వివరించి చెప్పడం ఉత్తమం. మీరే ఉద్యోగాన్ని లేదా ఆరోగ్యాన్ని వంకగా పెట్టుకుని ఇష్టం లేని పనుల్ని వాయిదా వేస్తున్నారేమో గమనించుకోండి. దోషిగా దొరికి పోకండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆశలు ఆకాశంలో, ఆచరణ పాతాళంలో ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? బంధువుల పట్ల ప్రేమాభిమానాలుండవచ్చునేమో కాని అతి కాకూడదని గమనించండి. మాట కరుకుదనం వల్ల, పట్టువిడుపులు లేని కారణంగా వ్యాపారంలో మీకు పేరు రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా కొంతమొత్తం సొమ్ముని ఓ పక్కన దాచి ఉంచండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ ఏదో ఆందోళనతో గడుపుతారు ఈ వారాన్ని. దానిక్కారణం అనవసరమైన వాగ్వివాదాన్ని పెట్టుకుని ఏం జరుగుతుందోననే ఒక లో భయంతో ఉండడమే. పట్టుదలకి పోకండి. వాగ్వివాదాలూ హామీలూ మంచిది కాదు. మీరూ మీ కుటుంబం అనే ధ్యాసతో గడపండి కాలాన్ని. వినోదయాత్రగాని విహార యాత్రగాని చేసే అవకాశం ఉంది. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సంతానానికి సంబంధించిన చదువులు చక్కగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆర్థిక సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే జంకుగా అనిపించవచ్చు. అదీ ఒకందుకు మంచిదే. నిలకడగానే వ్యాపారాన్ని చేయండి. బంధుమిత్రులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. సంతృప్తితో గడపండి. ఆందోళనకి దూరంగా ఉండండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఈ అతివలు.. కలల రథ సారథులు
ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం వెనుకంజే.. అన్న నానుడిని తిరగరాశారీ అమ్మాయిలు. సాంకేతిక కోర్సులు పూర్తిచేసి కంప్యూటర్ కెరీర్ వైపు పరుగులు తీస్తున్న ఈ తరం యువతులకు భిన్నంగా కొత్త పంథాను అనుసరించారు. మొక్కవోని దీక్ష, పట్టుదలతో ముందడుగు వేసి సవాళ్ల రైలు బండికి సారథులుగా నిలిచారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన అత్యాధునిక కలల మెట్రో రైళ్లు నడిపే ‘ట్రెయిన్ ఆపరేటర్లు’గా ఏడుగురు అమ్మాయిలు ఎంపికయ్యారు. మెట్రో రైళ్ల నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) కంపెనీ నిర్వహించిన ఐదు కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులై.. ఉప్పల్ మెట్రో డిపోలో ఆరు నెలలపాటు ఇచ్చిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. మెట్రో రైళ్లు డ్రైవర్ అవసరం లేని ‘కమ్యునికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థ’ ఆధారంగా పనిచేసినప్పటికీ ఈ రైళ్లను సురక్షితంగా నడిపేందుకు అవసరమైన విభిన్న సాంకేతిక అంశాలపై తర్ఫీదు పొందారు. ఇప్పటి వరకు ఉప్పల్ మెట్రో డిపోలో రైళ్లను నడిపిన ఈ అమ్మాయిలు త్వరలో మెట్రో పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టించనున్నారు. ఈ సందర్భంగా వారిని ‘సాక్షి’ పలకరించింది. - సాక్షి, హైదరాబాద్ ఉద్విగ్నంగా ఉంది మెట్రో రైలు నడపడం చాలా ఉద్విగ్నంగా ఉంది. కొరియాలో తయారైన ఈ ఆధునిక రైళ్లను మన నగరంలో నడపడం గొప్ప విషయం. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్లో డిప్టొమా పూర్తి చేశాను. అయితే అమ్మాయిలంటే కంప్యూటర్ జాబ్లకే పరిమితం అంటే నాకు నచ్చదు. - కె.మాధురి వరసాయి అవకాశాలిస్తే మహిళలు సత్తా చాటుతారు అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారన్నదే చిన్నప్పటి నుంచి నేను నమ్మిన ఫిలాసఫి. నేను ట్రిపుల్ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. ఏడాదిపాటు బీహెచ్ఈఎల్ సంస్థలో అసిస్టెంట్గా పనిచేశాను. కియోలిస్ సంస్థ నిర్వహించిన ఐదు రకాల పరీక్షలను పాస్ అయి ట్రెయిన్ ఆపరేటర్గా ఎంపికయ్యాను. - ఎన్.రాధ కంప్యూటర్ జాబ్ అంటే బోరింగ్ నేను ట్రిపుల్ఈలో బీఈ పూర్తిచేశాను. రెండున్నరేళ్లపాటు సిమెన్స్ సిస్టమ్స్ సంస్థలో డిజైన్ ఇంజనీర్గా పనిచేశాను. ఆఫీసు జాబ్ బోరింగ్ అనిపించింది. అందుకే ఛాలెంజింగ్ కెరీర్ను ఎంచుకున్నాను. - పి.శ్రీలేఖ గొప్ప ఉద్యోగం అనుకుంటున్నా నేను ట్రిపుల్ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. సబ్జెక్ట్కు సంబంధించిన కోర్ జాబ్ మాత్రమే చేయాలనుకున్నాను. ఈ సంస్థలో అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్నది నా లక్ష్యం. ఇది గొప్ప ఉద్యోగమని భావిస్తున్నా. - ఈ.అనూషా దేవి అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే.. మా నాన్న అప్పారావు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. చదువంటే నాకు బాగా ఇష్టం. అందుకే మా అమ్మానాన్నలు చాలా కష్టపడి చదివించారు. వారి ప్రోత్సాహంతోనే నేను ఈసీఈలో డిప్లొమా పూర్తిచేశాను. ప్రస్తుతం ఆపరేటర్గా ఎంపికయ్యా. - జి.శ్యామలాదేవి 400 కిలోమీటర్లు నడిపితే.. మొత్తం 400 కి.మీ. ఎలివేటెడ్ మార్గంలో రైళ్లను విజయవంతంగా నడిపితే కమర్షియల్ ఆపరేటర్గా ధ్రువీకరణ పత్రాన్ని కియోలిస్ సంస్థ వారికి అందజేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున వారానికి 48 గంటలపాటు ఆపరేటర్గా విధులు నిర్వహించాలి. వీరికి ప్రారంభ వేతనం సుమారు రూ. 25 వేలు. ఏడాదికి 10 నుంచి 15 శాతం చొప్పున వేతనంలో పెరుగుదల ఉంటుంది. భవిష్యత్తులో మహిళలకు మరింత ప్రాధాన్యం ట్రెయిన్ ఆపరేటర్లకు మూడు నెలల పాటు తరగతి గదిలో, మరో మూడునెలలు క్షేత్రస్థాయిలో సురక్షితంగా మెట్రో రైళ్లు నడిపేలా శిక్షణనిచ్చాం. ప్రస్తుతం మూడు కారిడార్లలో నడిచే 57 రైళ్లను నడిపేందుకు 57 మంది ఆపరేటర్లను ఎంపికచేసి శిక్షణనిచ్చాం. వీరిలో ఏడుగురు అమ్మాయిలున్నారు. భవిష్యత్ అవసరాన్ని బట్టి వీరి సంఖ్య పెరగవచ్చు. ఎంపికలో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం. - కె.బి.ఆర్.సి.మూర్తి, శిక్షణ కార్యక్రమం హెడ్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ -
తూములతో.. కరకట్టకు తూట్లు
అది 2009 అక్టోబర్.. 10.94 లక్షల క్యూసెక్కుల వరద నీటితో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కరకట్టను తెంచుకుని గ్రామాలపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయల పంట, ఆస్తి నష్టం వాటిల్లాయి. కొందరు స్వార్థంతో కృష్ణానది కరకట్టకు మధ్యలో పైపులైన్లు వేయటం వల్లే భారీ నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. భట్టిప్రోలు మండలం ఒలేరు పల్లెపాలెం వద్ద కరకట్ట కోతకు గురవడానికి కారణం ఇదేనని కనుగొన్నారు. భట్టిప్రోలు నుంచి లంకెవానిదిబ్బవరకు సుమారు వంద చోట్ల కరకట్టకు మధ్యలో పైపులైన్లు ఉన్నట్లు తేలింది. మళ్లీ...ఇప్పుడు కృష్ణానదికి పెను ముప్పు పొంచి ఉంది. పైపులైన్లు కాదు ఏకంగా నది ఒడ్డునే గోతులు తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. రేపల్లె : కొందరి స్వార్థం అందరికి పెనుముప్పును తెచ్చిపెడుతోంది. నదీపరివాహక ప్రాంతంలో మనుగడను ప్రమాదకరంగా మారుస్తోంది. నదీప్రవాహం, కరకట్టకు మధ్య ఉన్న లంకభూముల్లో భారీ గోతులు తవ్వుతున్నారు. సాగు పేరుతో రక్షణ కవచాలకు విచక్షణ రహితంగా గునపాలు గుచ్చుతున్నారు. కృష్ణా కరకట్టల మధ్య తూములు ఏర్పాటు చేస్తూ కట్టలను బలహీనపరుస్తున్నారు. లంక భూముల్లో భారీ గోతులు తవ్వి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే కాస్తంత వరద నీరు వచ్చినా లంక భూములు భారీ కోతకు గురై కరకట్టను తాకేంత ప్రమాదానికి చేరుకుంది. భారీ గోతులు... మండలంలోని పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలోని లంక భూముల్లో 12 నుంచి 15 అడుగుల వరకు భారీ గోతులు తవ్వి మట్టిని తరలించారు. నదీ ప్రవాహానికి నాలుగుమీటర్ల దూరంలోనే భారీ గోతులు తవ్వారు. పలుచటి గోడలా మాత్రమే కరకట్ట మిగిలింది. మట్టి తరలించిన భూమిలో కూడా చెరువులు, పంటలు వేసేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. సాగుభూమి, చెరువులుగా మార్చిన భూమిలో నుంచి నదీ ప్రవాహానికి నడుమ తూములు కూడా ఏర్పాటు చేశారు. నదీ ప్రవాహం కాస్తంత ఎక్కువైనా పలుచగా మారిన కట్టలు, లంకభూమి కోతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. నిరంతరం నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారధికి కూడా ముప్పే.. తీరప్రాంత ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన పెనుమూడి-పులిగడ్డ వారధికి సైతం అక్రమార్కుల ఫలితంగా ముప్పు పొంచి ఉంది. కృష్ణానదికి వరదలు వచ్చే సమయంలో లంకభూములు వరద తాకిడికి కోసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వారధి వద్ద కూడా భూమి కోతకు గురై వంతెనకు పెను ముప్పే వాటిల్లేప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మళ్లీ దుమ్మురేపుదామా..
నటి తమన్నకిప్పుడు అవకాశాలు కావాలి. అలాగే అర్జెంట్గా ఒక విజయం అవసరం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టేసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం ఈ మూడు భాషల్లోనూ అవకాశాలు పలచబడ్డాయి. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో కోలీవుడ్లో మరో రౌండ్ కొట్టాలని ఆశ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో అజిత్ తాజా చిత్రానికి రెడీ అవుతుండడం, ఆ చిత్రానికి శివ దర్శకత్వం వహించనుండడంతో తమన్న ఈ చిత్రంపై కన్నేశారు. కారణం ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వీరం వంటి విజయవంతమైన చిత్రం తెరకెక్కడమే. శివ దర్శకత్వంలో తమన్న చిరుతై చిత్రంలో కార్తీ సరసన నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. దీంతో అజిత్ తాజా చిత్రంలో అవకాశం కొట్టేయాలని దర్శకుడు శివకు ఫోన్ చేసి మరోసారి మనం వీరం చిత్రం తరహాలో దుమ్మురేపుదాం అని అడిగారు. అయితే ఆమె ఫోన్ టెక్నిక్ దర్శకుడు శివ వద్ద పని చేయలేదు. ఆమెకు తన నూతన చిత్రంలో అవకాశం కల్పించే విషయం గురించి మాట ఇవ్వలేకపోయారు. కారణం ఈసారి ఇంతకుముందు జతకట్టని కొత్త కథానాయికతో నటించాలని అజిత్ భావించడమే. అందువలన ఈ చిత్రంలో చాన్స్ లేదనే విషయాన్ని దర్శకుడు చల్లగా తమన్నకు చెప్పేశాడు. దీంతో తమన్న చాలా అప్సెట్ అయిందట. అయితే ప్రస్తుతం ఆమె ఆర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆరంభం చిత్రం తరువాత ఆర్య అజిత్కు మంచి ఫ్రెండ్ అయిపోయారు. అజిత్ చిత్రంలో నటించడానికి ఆర్య సిఫార్సును ఉపయోగించుకోవలసిందిగా తమన్న స్నేహితులు చెవిలో ఊదుతున్నారట. అయితే బిరియాని విందుతో కథానాయికలను బుట్టలో వేసుకునే ఆర్యను అజిత్కు రికమెండ్ చేయమని ఎలా అడగాలి అని తమన్న సంకోచిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ గురువారం తెరపైకి రానుంది. -
విద్యలో సమానావకాశాలు ఏవి?
విద్యపై పెట్టిన పెట్టుబడిని మిగిలిన రంగాలపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, రవాణా, గనులు వగైరా ఉత్పాదక రంగాల మీద పెట్టిన ఖర్చుగానే భావించాలి. ఎందుకంటే విద్యా రంగం మీద పెట్టిన పెట్టుబడి వల్లనే ఆ రంగాలు ఆ స్థాయికి వెళ్లాయన్నది వాస్తవం. ఉన్నత ప్రమాణాలతో ప్రజలందరికీ విద్యనం దించాలనే ఆకాంక్ష 67 ఏళ్ల స్వాతంత్య్ర భారతదే శంలో, రాజ్యాంగం ఆమో దించిన 65 ఏళ్ల కాలంలో కూడా తీరలేదు. అందు కనే అందరికీ ఉచిత, సమాన విద్యనందించా లని ఈ నాటికీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ నాటికీ ఎస్సీ అమ్మాయిల్లో 80 శాతం, ఎస్టీ అమ్మా యిల్లో 90 శాతం మంది 10వ తరగతి కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. ఏ దేశమైనా సామాజికం గా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు ప్రా థమికంగా ప్రజలందరినీ ముందు విద్యావంతు లను చేయాలి. ఈ దిశలో ఆచరణాత్మక ప్రయత్నా లు జరగలేదు. 1937లో వార్ధాలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో బేసిక్ విద్యను అమలు చేయాలనే తీర్మానం ఆమోదం కోసం గాంధీ చాలా కష్టపడవల సివచ్చింది. రాజ్యాంగ రచన సమయంలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని రాజ్యాంగ సభలో డా॥బి.ఆర్.అంబేద్కర్ ప్రతిపాదించారు. కానీ రాజ్యాంగ సభలోని ప్రాథమిక హక్కుల కమిటీలో గల సభ్యులు విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చ డానికి వ్యతిరేకించారు. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 40 శాతం ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేవు, 22 శాతం ప్రాథమిక పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి, ఒకే గదిలో నడిచే పాఠశాలలు లక్ష కు పైగానే ఉన్నాయి. ఇవన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో నల్లబల్లలు కూడా లేవు. 72 శాతం పాఠశాలల్లో మంచినీటి వసతి లేదు, 89 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. బాలికలకు సరైన వసతులు లేని కారణంగా ఒక దశలో బడి మానేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా 3 శాతం నుంచి 5 శాతం వరకు పిల్లలు తగ్గుతున్నారు. ఆర్థిక, విద్య హక్కు, పని హక్కులను ప్రభుత్వ మే ప్రజలందరికీ అందించే ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 41వ ఆర్టికల్ ఆదేశిస్తున్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్లలో 14 ఏళ్ల వయసుగల బాల బాలికలందరికీ నిర్బంధంగా ఉచితంగా విద్యనందించటానికి రా జ్యం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ ఆదేశించింది. వీటి అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తే ఈనాడు భారతదేశంలో నిరక్షరాస్యత ఉండేది కాదు. ప్రభుత్వరంగ విద్య దుస్థితికీ, అంద రికీ విద్యను అందించాలన్న పట్టుదల లోపించడా నికి కారణం-విద్యపై చేసే ఖర్చును అనుత్పాదక వ్యయంగా ప్రభుత్వాలు భావించడమే. కానీ విద్య పై పెట్టిన పెట్టుబడిని మిగిలిన రంగాలపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలి. వ్యవసాయం, పరిశ్రమ లు, సేవలు, రవాణా, గనులు వగైరా ఉత్పాదక రం గాల మీద పెట్టిన ఖర్చుగానే భావించాలి. ఎందు కంటే విద్యారంగం మీద పెట్టిన పెట్టుబడి వల్లనే ఆ రంగాలు ఆ స్థాయికి వెళ్లాయన్నది వాస్తవం. స్వతంత్ర భారతదేశంలో విద్యారంగం అభి వృద్ధి కోసం నియమించిన రాధాకృష్ణన్ కమిషన్ (1948), సెకెండరీ విద్యపై నియమించిన ముదలి యార్ కమిషన్ (1952), కొఠారీ కమిషన్ (1966) ఇచ్చిన నివేదికలు, సూచనలు కొన్ని ఆశలను చిగు రింప చేశాయి. కానీ వీటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కొఠారీ కమిషన్ సూచనలు కొంత వరకు ప్రగతిశీలకంగానే ఉన్నాయి. ఉమ్మడి పాఠ శాల విద్యా విధానం ఉండాలని ఈ కమిషన్ చేసిన సిఫారసు అందరినీ ఆకర్షించింది. వీటిని అమలు చేయాలన్న డిమాండ్ ఈనాటికీ ఉంది. 1986లో వచ్చిన విధానం ఉమ్మడి పాఠశాల సూచనకు స్వస్తి చెప్పడమే కాకుండా, చిన్నస్థాయి పాఠశాల విధానానికి బాటలు వేసింది. విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించే పద్ధతికి దారి చూపిం ది. ఫలితంగా విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయింది. 1990 తరువాత వచ్చిన నూత న ఆర్థిక విధానాలు విద్యను ప్రైవేటు రంగం నుంచి వ్యాపార , మార్కెట్ సరుకుగా కార్పొరేట్ రంగంలోకి తరలించాయి. ఇప్పుడు విద్యను ఈ శక్తులు లాభ సాటి వ్యాపారంగా భావిస్తున్నాయి. విద్యలో వ్యాపా ర ధోరణులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరు ద్ధం. 2010లో వచ్చిన విద్యా హక్కు చట్టం ఈ వ్యా పార ధోరణిని చట్టరీత్యా బలోపేతం చేసింది. దీనికి తోడు ఎన్డీఏ హయాంలో విద్య కాషాయీకరణ ప్ర క్రియ మొదలై, ఇప్పుడు కూడా సాగుతోంది. రొమి ల్లా థాపర్ పుస్తకాలు తగులబెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి పిలుపునివ్వడం విద్యను మతతత్వం వైపు తీసుకు వెళ్లే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం మేరకు విద్యను లౌకిక సూ త్రాల ఆధారంగా సంరక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే నవంబర్ 2 నుంచి డిసెంబర్ 4 వరకు అఖిల భారత స్థాయిలో ‘విద్య పోరాట యాత్ర’ను అఖిల భారత విద్యా హక్కు వేదిక చేపట్టింది. విద్యా రంగ సమస్యలను ప్రజల లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో సాగుతున్న ఈ యాత్ర భోపాల్లో ముగుస్తుంది. (విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు) కె. నారాయణ -
రియల్టీపై రాబడి రావాలంటే..
రియల్టీపై రాబడి రావాలంటే.. పెట్టిన పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండి.. కొంత మెరుగైన రాబడి అందించగలిగే అనువైన సాధనాల్లో స్థిరాస్తి కూడా ఒకటి. కొన్ని సందర్భాలు మినహా రియల్ ఎస్టేట్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవు. అయితే, మంచి రాబడులు అందుకోవాలంటే ప్రాపర్టీ ఎంపికలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. సిటీ మధ్యలో ప్రాపర్టీ తీసుకోవాలంటే వేతన జీవికి తలకు మించిన భారమే అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగినా ఏ చిన్న దాంతోనో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లోనైతే ప్రాపర్టీ కొంత చౌకగా.. కాస్త పెద్దదే లభిస్తుంది. క్రమక్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న కొద్దీ రియల్టీ విలువ కూడా పెరిగి.. పెట్టిన పెట్టుబడిపై రాబడి మెరుగ్గా అందుకోవచ్చు. {పాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన మరో విషయం.. కీలకావసరాలైన సదుపాయాలు అందుబాటు దూరంలో ఉన్నాయా లేక సమీప భవిష్యత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది. ఉదాహరణకు షాపింగ్ కాంప్లెక్స్లు, పార్కులు, పిల్లల కోసం ప్లేగ్రౌండ్స్ మొదలైనవి ఉంటే ఆ ప్రాంతం వైపు చాలా మంది మొగ్గు చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఏరియాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఇటువంటి సదుపాయాలకు తగినంత స్థలం ఉంటుంది. ఇలాంటి ఆకర్షణలు వచ్చే కొద్దీ అక్కడి ప్రాపర్టీకి క్రమక్రమంగా విలువ పెరుగుతుంది. దీనివల్ల అక్కడి స్థిరాస్తి విలువా పెరుగుతుంది. అలాగే, స్కూళ్లు, ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నగరాల్లో ప్రస్తుతం చాలామందికి ఇల్లు ఈ మూల ఉంటే.. ఆఫీసు మరో మూల ఉంటోంది. ఫలితంగా రోజూ కిలోమీటర్లు, గంటల కొద్దీ ప్రయాణాలు తప్పడం లేదు. దీని వల్ల పెట్రోలు కోసం బోలెడంత వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే బస్సులు, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూసి, ఎంపిక చేసుకోవడం ఉత్తమం. శివారు ప్రాంతాలకు కూడా మెట్రో రైళ్ల లాంటి రవాణా సాధనాలు వస్తున్నందున వాటికి సమీపంలోనివి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు, ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, కంపెనీలు మొదలైనవి ఉన్నా లేక వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటిల్లో పనిచేసే ఉద్యోగులు దగ్గర్లో ఉండటానికి మొగ్గు చూపుతారు కాబట్టి.. అక్కడి రియల్టీ రేట్లూ పెరిగే అవకాశాలు ఉంటాయి. -
ఆంధ్రలో ఐటీ వృద్ధి సాధ్యమేనా?
-
MBA కోర్సుకి గల అవకాశాలు!
-
బయోటెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలు ఏంటీ?
-
MBAకు ఉన్న అవకాశాలేంటి?
-
టెలికాం ఇండస్ట్రీలో అవకాశాలు
-
సంక్షేమంలో కోత
పడకేయనున్న పథకాలు! ఫీజు రీయింబర్స్మెంటుపై అనుమానాలు రేషన్ సరకులదీ అదే బాట విశాఖ రూరల్, న్యూస్లైన్: రాష్ట్ర విభజనతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే పథకాల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోటు బడ్జెట్ పేరుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కోత పడే అవకాశాలు ఉన్నాయంటూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పటికే పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతోంది. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన ప్రభావం ప్రభుత్వ శాఖల బడ్జెట్పై పడింది. పెన్షన్ల నుంచి సాల్కర్షిప్ల వరకు అన్నింటికీ అరకొర నిధులే విడుదలవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,21,517 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.7.93 కోట్లు అవసరం. కానీ 1,70,413 మందికి రూ.4.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన వారు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. స్కాలర్షిప్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్లో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. హామీలు నెరవేర్చేనా : దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ పథకంలో కేటాయింపులు తగ్గించి విద్యార్థులపై భారం వేసింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితమని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అలాగే అన్ని రకాల పెన్షన్లను రూ. వెయ్యికి పెంచామని హామీలు గుప్పించారు. కానీ ఇప్పుడు రుణమాఫీ విషయంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోటుబడ్జెట్ పేరుతో అన్ని పథకాలును అమలు చేయడం, హామీలన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యంకాదని టీడీపీ నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రం కలిసున్నప్పుడే సంక్షేమ పథాకల్లో కోతలు పడగా రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లేదన్న సాకుతో కొనసాగుతున్న పథకాలను మరింత కుదించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేషన్దుకాణాల ద్వారా సరఫరా కావాల్సిన నిత్యావసరాలు సక్రమంగా విడుదల కావడం లేదు. జిల్లాకు కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తెల్లరేషన్కార్డుదారులు బహిరంగ మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 16న ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం కొలువుతీర లేదు. దీంతో సంక్షేమ పథకాల పరిస్థితి దారుణంగా మారింది. ఆదివారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రకటనలు చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
క్షమాపణకు త్వరపడండి
ఇస్లాం వెలుగు పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. మనిషన్న తర్వాత ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లి పోవడం మానవ సహజం. మానవమాతృలెవరూ దీనికి అతీతులు కాదు. కావాలని కాక, కాకతాళీయంగా జరిగిన చిన్న చిన్న తప్పుల్ని దైవం క్షమిస్తాడు. కానీ తెలిసి, కావాలని మాటిమాటికీ బుద్ధిపూర్వకంగా తప్పులు చే సేవారిని మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి, దానిని సరిదిద్దుకుంటే, మరి కొంతమంది తప్పును అస్సలు అంగీకరించనే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకువస్తే దాన్ని కప్పిపుచ్చుకోడానికి వితండవాదం చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలోనూ తమను తాము సంస్కరించుకోడానికి ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపపడినవారే నిజమైన విశ్వాసులు. విశ్వాసుల గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటుంది. ‘వారి వల్ల ఏదైనా నీతిమాలిన పని గానీ, పాపకార్యం గానీ జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్ను స్మరించి, క్షమాపణ వేడుకుంటారు. అంతేగానీ తాము చేసినదానిపై వారు మంకుపట్టు పట్టరు.’’ (3-135). మరొక చోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా సైతాన్ ప్రేరణ వల్ల ఏదైనా దురాలోచన జనిస్తే, వెంటనే వారు అప్రమత్తులై పోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది.’’ (7-201). ‘‘మీరు అల్లాహ్ను క్షమాపణ కోరుకుని ఆయన వైపునకు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయామయుడు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలున్నాయి. (11-90). మరొకచోట ఇలా ఉంది. ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి. అమిత దయాళువు. కనుక మీపై (దైవ) శిక్ష వచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని పరిస్థితి రాక ముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి.’’ (39-54). ఈ పవిత్ర ఖురాన్ వాక్యాల ద్వారా తెలిసేదేమిటంటే, సాధ్యమైనంత మేర ఏ తప్పూ జరక్కుండా ఉండడానికి శక్తి వంచన లేని ప్రయత్నం చేయాలి. ఒక వేళ తెలిసో తెలియకో తప్పు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీ ఇస్తుందో, మృత్యువునే తెస్తుందో తెలియదు. కనుక శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవాన్ని క్షమాపణ వేడుకోవాలి. జరిగిపోయిన తప్పుల పట్ల మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటి తప్పులు జరగని విధంగా గాఢమైన నిర్ణయం తీసుకుని, దానిపైనే స్థిరంగా ఉండాలి. భావి జీవితాన్ని సంస్కరించుకుంటూ అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు సత్కార్యాల్లో లీనమవ్వాలి. దానధర్మాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో దైవక్షమాపణ వేడుకుని, ఆశావహదృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోను, పరలోకంలోనూ దైవ ప్రసన్నతను పొంది, శాశ్వతమైన సుఖాలకు పాత్రులమయ్యే అవకాశం ఉంది. - మహమ్మద్ ఉస్మాన్ఖాన్ -
ఆడవాళ్లకే ఎక్కువ
కొత్తగా రంగంలోకి అడుగిడేవారిలో ప్రతిభగల వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వర్ధమాన తార కృతి సనన్ పేర్కొంది. అయితే మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయంది. ‘బయటి ప్రాంతాలనుంచి వచ్చేవారి విషయంలో పరిస్థితులు మారిపోయాయి, వారికి నాణ్యమైన పని దొరుకుతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడమనేది ఆహ్వానించదగ్గ పరిణామం’ అని అన్నారు. నిర్మాతలు వెనకటి మాదిరిగా లేరు. ఈ రంగంతో సంబంధంలేని వారికి కూడా అవకాశం కల్పించడమనేది గతంలో ఏనాడూ జరగలేదు. సినిమా అనేది హీరో భుజస్కంధాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల హీరో పాత్రధారి అందరికీ తెలిసినవాడైతే బాగుంటుంది’ అని అంది. ఏదిఏమయినప్పటికీ మగవాళ్లకంటే ఆడవాళ్లకే అవకాశాలు బాగా లభిస్తున్నాయంది. కొత్త నటుడిని పరిచయం చేసేందుకు నిర్మాతలు కొంత జంకుతున్నారంది. కొత్తగా బాలీవుడ్లోకి అడుగిడిన ఆడవాళ్లకు సీనియర్ నటుల సరసన నటించే అవకాశాలు కూడా లభిస్తున్నాయని 23 ఏళ్ల కృతి తన మనసులో మాట చెప్పింది. ఆడవాళ్లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయంది. కాగా సినిమాయేతర రంగంనుంచి బాలీవుడ్లోకి అడుగిడిన కృతికి అవకాశాలు విరివిగానే లభిస్తున్నాయి. ఇందుకోసం ఈ సుందరి పెద్దగా పోరాడాల్సిన పనేలేకుండాపోయింది. ‘బాలీవుడ్లో అవకాశాల విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని, సినిమా అవకాశాలకోసం నానాతంటాలు పడుతున్నవారిని ఎందరినో గమనిస్తున్నా’నంటూ కాస్త గర్వంగా చెప్పింది. -
అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్ : అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్మోహన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ అంధుల పాఠశాలలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. చిన్నారుల బోధనను చూసి అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్టికెట్లను అందజేశారు. ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కె. వరుణ్, ఎంఈఓగా పి. సంఘవి, హెచ్ఎంగా బి. గణేష్, వ్యవహరించారు. డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు పాల్గొన్నారు. -
టెలికాం రంగంలో నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు
-
సద్విమర్శను స్వీకరిస్తేనే స్వర్గానికి సోపానం
తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుంకటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. మనిషి ఎంత బలవంతుడో, అంత బలహీనుడు కూడా! అతని ద్వారా ఏదో ఒక తప్పు జరిగిపోతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లిపోవడం మానవ సహజం. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. అయితే, కావాలని కాకుండా కాకతాళీయంగా జరిగే చిన్న చిన్న తప్పుల్ని అల్లాహ్ క్షమిస్తాడు. కాని తెలిసీ, కావాలని బుద్ధిపూర్వకంగా మాటిమాటికీ చేసే పాపాలను మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, దాన్ని సరిదిద్దుకుంటే, మరికొంతమంది తప్పును అసలే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకు వస్తే దాన్ని కప్పి పుచ్చుకోవడానికి వితండవాదం చేస్తారు తప్ప, తమ తప్పును సంస్కరించుకోవడానికి సుతరామూ ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పును తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకునే వీలు కలుగుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాప పడేవారు నిజమైన విశ్వాసులు. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది... వారివల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, పాపకార్యంగాని, జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్ను స్మరించి క్షమాపణ వేడుకుంటారు. అంతేగాని తాము చేసిన దానిపై వారు మంకుపట్టు పట్టరు. (3-135). పవిత్ర ఖురాన్లో మరోచోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా షైతాన్ ప్రేరణ వల్ల దురాలోచన జనిస్తే వెంటనే వారు అప్రమత్తులైపోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది (7-201). ‘‘మీరు దైవాన్ని క్షమాపణ కోరుకుని ఆయన వైపు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయాళువు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి’’ (11-90)మరొకచోట ఇలా ఉంది: ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవకారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దదాళువు. కనుక మీపై దైవశిక్షవచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని స్థితి రాకుముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి (39-54).జ పవిత్ర ఖురాన్లోని ఈ దివ్య వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమంటే, సాధ్యమైనంత వరకూ ఏ చిన్న తప్పూ జరగకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. అందుకని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా, శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవకారుణ్యాన్ని అన్వేషించాలి. జరిగిన తప్పుల పట్ల మనస్పూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటివి జరగని విధంగా దృఢనిర్ణయం తీసుకుని, దానిపై స్థిరంగా ఉండాలి. భావిజీవితాన్ని సంస్కరించుకుంటూ, అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత మేర సత్కార్యాల్లో లీనమవ్వాలి. దైవకారుణ్యంపట్ల సదా ఆశ కలిగి ఉండాలి. ఈవిధంగా మనసా, వాచా, కర్మణా, ఆశావహ దృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోనూ, పరలోకంలోనూ దైవప్రసన్నత పొంది, శాశ్వత అమర సుఖాలకు పాత్రులు కావచ్చు. - యండీ ఉస్మాన్ ఖాన్