Prasanth Varma
-
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ సినిమాపై రూమర్స్.. చిత్ర యూనిట్ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రం ప్రకటనతోనే ఆగిపోయిందంటూ సోషల్మీడియాలో ఒక వార్త ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మోక్షజ్ఞకు అనారోగ్యం కారణం పేరుతో మొదలు కాలేదు. ఇదే విషయాన్ని మీడియా వేదికగా బాలయ్య చెప్పారు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడ్డాయిని భారీగా రూమర్స్ రావడం జరిగింది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్పై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్వీ సినిమాస్’ తాజాగా ఇలా స్పందించింది. 'మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి పలు రూమర్స్ వచ్చాయి. అందులో ఏవీ నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి భవిష్యత్లో ప్రకటనలు, అప్డేట్స్ను మా సోషల్మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తాము. @SLVCinemasOffl, @LegendProdOffl మా ఎక్స్ ఖాతాలలో మాత్రమే ప్రకటిస్తాము. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను ఎంకరేజ్ జయకండి అని కోరుతున్నాము'. అని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి.సినిమాస్ సంయుక్తంగా సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య హిట్ సినిమా ఆదిత్య 369 సీక్వెల్లో కూడా మోక్షజ్ఞ నటిస్తున్నారు. 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్లో తన తండ్రితో కలిసి ఆయన మెప్పించనున్నారు. ఈమేరకు బాలకృష్ణ ఒక ప్రకటన కూడా చేశారు.AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma - @MokshNandamuri Project.Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @LegendProdOffl @ThePVCU pic.twitter.com/V9fXc7E0sy— SLV Cinemas (@SLVCinemasOffl) December 18, 2024 -
ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ సినిమా వాయిదా.. కారణమిదే!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అతడి మొదటి సినిమా రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం (డిసెంబర్ 5న) నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ నేడు జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది.మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ బాలకృష్ణ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు కాల్ చేశాడు. సినిమా ఓపినింగ్కుగానూ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్గా సెట్ వేశారు. ఇందుకోసం నిర్మాత దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశాడు.చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్పై కేసు నమోదు -
మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్
'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. ట్రైలర్లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
రాముడిగా మహేష్.. రావణుడిగా రానా ..!
-
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
హనుమాన్ సీక్వెల్ లో కాంతారా రిషబ్ శెట్టి
-
ప్రశాంత్వర్మ పీవీసీయూ వరల్డ్ నుంచి కొత్త సినిమా ప్రకటన
హనుమాన్ సినిమా తర్వాత టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రశాంత్వర్మ తర్వాతి ప్రాజెక్ట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో తన (పీవీసీయూ) నుంచి ప్రతి ఏడాది ఒక సినిమా వస్తుందని ఆయన వెళ్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పీవీసీయూలో రానున్న సినిమాపై అప్డేట్ ఇచ్చారు.ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వారు వెళ్లడించారు. టైటిల్ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. చెడును అంతం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుందన్నారు. (పీవీసీయూ) సూపర్ హీరోలను ఈ చిత్రంలో చూపిస్తామన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ను పూజా కొల్లురు దర్శకురాలిగా తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్వర్మ వెల్లడించారు. అయితే, ఈ సినిమాలో నటించనున్న నటీనటులు ఎవరనేది త్వరలో చెప్పనున్నారు.ఈ ఏడాదిలో హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ రానుంది. అయితే, ఈ చిత్రానికంటే ముందే అధీర, మహాకాళీ రానున్నాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే, ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్గా నందమూరి మోక్షజ్ఞ సినిమా రానుంది. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ను ప్రశాంత్ వర్మే దర్శకత్వం వహించనున్నాడు. -
రవితేజ చాలా మందికి హెల్ప్ చేసారు..
-
నెవర్ బిఫోర్ అనేలా 'హను-మాన్' మేకింగ్ వీడియో
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. వీడియోతో పాటు హనుమాన్ చాలీసాను యాడ్ చేశారు. ఆ వీడియో నిడివి 2:43 నిమిషాలు ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న హనుమాన్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
జపాన్లో ‘హను-మాన్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. (చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్కి మెయిల్స్.. నిజమేంటి?)ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు. After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024 -
'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్లు.. ఎక్కువగా ఆ రోజే!)One day you realise every rejection was a blessing in disguise! :)— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024 -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
ఆగిపోయిన ప్రశాంత్ వర్మ సినిమా.. బాలీవుడ్ డెబ్యూకు బ్రేక్!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్డూపర్ హిట్ కొట్టాడు. దీంతో ఆయనతో కలిసి పని చేయాలని బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్షస్ అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆగిపోయిన మూవీఇంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో ప్రశాంత్.. 'రణ్వీర్ చాలా ఎనర్జిటిక్ పర్సన్. ఎంతో టాలెంట్ ఉన్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పని చేస్తాం అని పేర్కొన్నాడు.భవిష్యత్తులో..అటు రణ్వీర్ సింగ్ సైతం ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్. మేము కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే ఫ్యూచర్లో తప్పకుండా కలిసి పని చేస్తాం అని తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది హనుమాన్కు సీక్వెల్గా తెరకెక్కుతోంది. An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!!In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/OG2gqkwJMO— Ramesh Bala (@rameshlaus) May 30, 2024 చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb — Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024 -
హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు.. ప్రశాంత్ వర్మ ట్వీట్
ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా .. హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి. థియేటర్స్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్ కలెక్షన్స్ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. First award for #HanuMan 🙂 Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro — Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024 -
బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలో కేవలం 11 గంటల్లోనే!
బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్గా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్తో గ్లోబల్గా జీ5లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ కథేంటంటే... అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్. RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles. https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU — ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024 -
ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్ సీన్ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx — Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ఇంతలోనే సడన్గా ఏమైంది?
టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్తో పాటే సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్పై అప్డేట్స్ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్గా స్ట్రీమింగ్ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆడియన్స్కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్ కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్కు.. డిజిటల్ ఫ్లాట్ఫామ్కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్ రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. All of Sudden Negativity on #HanuMan What is the reason? pic.twitter.com/7lTcGKec1P — Telugu Bit (@telugubit) March 17, 2024 Why, suddenly people are spreading negativity on #HanuMan cinema, after releasing it in OTT What is making them cry 🤔 pic.twitter.com/Aa90IxjIq6 — 🚩అజ్ఞాతవాసి Ãgnathavasì 🕉️ (@myselfBharath__) March 17, 2024 -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ స్పెషల్ పోస్ట్!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటనైతే రాలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ సైతం ఉన్న ఇంట్రస్ట్ కాస్తా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నంబర్వన్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత యానిమల్, డంకీ చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోను ప్రశాంత్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. కాగా.. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. 😊 https://t.co/BFBLAnWM5p — Prasanth Varma (@PrasanthVarma) March 16, 2024 -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ లేటేస్ట్ అప్డేట్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!!
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం. #HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼 — Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024 -
శివరాత్రికి ఓటీటీలో హనుమాన్??
సంక్రాంతి బ్లాక్బస్టర్ 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లలో విడుదలైన వాటిలో ఈ చిత్రంపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అయితేనేం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందీ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే.. వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు. చివరకు ఏమైంది? అనే సింపుల్ కాన్సెప్ట్తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు భలే నచ్చేశాయి. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే 'హనుమాన్' డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ అది కూడా మారిపోయింది. శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. సంక్రాంతికి థియేటర్లలో 'హనుమాన్' నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV — the.cineholic (@the_cine_holic) March 1, 2024 -
హను-మాన్ ఎఫెక్ట్.. రూ. 1000 కోట్ల ఆఫర్?
-
ప్రశాంత్ వర్మ బయోగ్రఫీ..!
-
మీరు నన్ను ట్రోల్ చేయవచ్చు..కానీ ఆ సినిమా తీసి చూపిస్తా..
-
ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ
ఆదిపురుష్ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదని, తానైనే వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేవాడినని ‘హనుమాన్’దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్లో కొన్ని సీన్స్ని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా తెరకెక్కించారు. అయితే..కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే గనుక ఆ సినిమా తీసి ఉంటే.. ఆ సన్నివేశాలను బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్ మేకర్కి అయినా అలాంటి భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్ సపోర్ట్ని ‘హను-మాన్’ని అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగాం’అని ప్రశాంత్ వర్మ అన్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి రానుందా?) హను-మాన్’విషయాకొస్తే.. తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ ‘జై హనుమాన్’ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఆ సినిమా పనులను ప్రారంభించారు. ఓ స్టార్ హీరో ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్) -
'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?
ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'హనుమాన్' నామజపమే వినిపిస్తోంది. స్టార్ హీరో గానీ డైరెక్టర్ గానీ లేకుండా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో ఇక్కడ, ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'హనుమాన్' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే 'హనుమాన్'లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఓ ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు. తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా. (ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) అలానే 'హనుమాన్' చిత్ర క్లైమాక్స్లో 'జై హనుమాన్' అనే మరో సినిమా 2025లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి. మెగాహీరో రామ్ చరణ్.. ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'లోని సెకండాఫ్లో చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతమున్న హీరోల్లో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ కావొచ్చనమాట. అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్లానే కనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్కి అంతకు మించిన పండగ మరొకటి ఉండదేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!
సంక్రాంతి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అల్టిమేట్గా 'హను-మాన్' చిత్రం విజేతగా నిలిచింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మూవీ టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు చిన్న షాక్ తగిలింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. 'హనుమాన్' సినిమా విషయంలో హీరో తేజకి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ.. ఓవరాల్గా మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే రిలీజ్ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన బలంగా నిలబడి హిట్ కొట్టాడు. అక్కడే అందరి మనసులు గెలిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గదతో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్గా మార్చాడు. దీంతో చిన్న సమస్య వచ్చింది. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) ట్విట్టర్ ప్రస్తుతం 'ఎక్స్'గా మారిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ లేదంటే పేరు మార్చిన సరే బ్లూ టిక్ పోతోంది. అలా ఇప్పుడు ప్రశాంత్ వర్మ టిక్ కూడా పోయింది. ఈ క్రమంలోనే అతడి చేస్తున్న పోస్టులు ఒరిజినల్ అకౌంట్ నుంచి చేస్తున్నాడా? ఫేక్ అకౌంట్ నుంచే చేస్తున్నాడా అనేది అభిమానులకు అర్థం కావట్లేదు. అందుకే త్వరగా బ్లూ టిక్ మళ్లీ తెచ్చుకో అని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా కొందరు నెటిజన్స్.. కావాలనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేశారు. తద్వారా వీరిద్దరినీ బ్యాడ్ చేయాలనేది వాళ్ల ఉద్దేశం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ పోవడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముందని నెటిజన్స్ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) #NewProfilePic pic.twitter.com/ONa2TNCv3s — Prasanth Varma (@PrasanthVarma) January 17, 2024 -
Teja Sajja Rare Unseen Photos: వంద కోట్ల సినిమా హనుమాన్ హీరో తేజ సజ్జ.. రేర్ ఫొటోలు
-
ధర్మంతో ఉంటూ.. ఫైట్ చేస్తున్నా
-
సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ 'హనుమాన్'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రేసులో హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలు చూసి మనం ఆహో ఓహో అంటుంటాం. వాళ్లందరికీ గురువు లాంటివాడు ఆంజనేయుడు. ఆయన కథతో ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. గ్రాఫిక్స్ ప్రధానం కావడం వల్ల గత రెండేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఏదో తొందరపడి విడుదల చేయాలని కాకుండా నిదానంగా ఒక్కో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఏకంగా అన్ని సినిమాలు? వచ్చే సంక్రాంతి బరిలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు బోలెడన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేశ్ 'గుంటూరు కారం', రవితేజ 'ఈగిల్' ముగ్గుల పండక్కే వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటితోపాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ, పవన్ కల్యాణ్ 'ఓజీ', చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కాంబోలోని సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 'హనుమాన్' స్పెషల్ ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హనుమాన్' సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా 11 భాషల్లో విడుదల చేయబోతున్న తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తోంది. ఇలా సమ్థింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతికి మిగతా సినిమాలతో కలిసి బరిలోకి దిగుతుందా? లేదా ప్లాన్ ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి. pic.twitter.com/LjAYhaDO9V — Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023 (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
సారీ.. దయచేసి క్షమించండి.. దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్
కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. తొలి అడుగులోనే ‘అ!’ లాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన హనుమాన్ టీజర్తో ఓ రేంజ్ అద్భుతాన్ని సృష్టించారు. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఓ విషయంలో ప్రశాంత్ వర్మ క్షమాపణలు కోరారు. రామాయణాన్ని పురాణం అన్నందుకు దయచేసి క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్వీట్లో ప్రశాంత్ వర్మ రాస్తూ..'నా ప్రసంగంలో ‘పురాణం’ అనే పదాన్ని ఉపయోగించినందుకు దయచేసి క్షమించండి. రామాయణం మన చరిత్ర' అంటూ పోస్ట్ చేశారు. కాగా..జాంబి రెడ్డి మూవీ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా 'హనుమాన్'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్తో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. Please pardon me for using the word ‘Mythology’ in my speech! Rāmāyana is our ‘History’! #JaiShreeRam 🙏🏼 — Prasanth Varma (@PrasanthVarma) November 26, 2022 -
బాలయ్య నెక్ట్స్ మూవీ.. 'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో భారీ ప్రాజెక్ట్?
నందమూరి బాలకృష్ణ కొత్త మూవీపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యతో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (చదవండి: అన్స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్లో ఉంటుంది : బాలయ్య) ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య అన్స్టాపబుల్- 2 టీజర్కు దర్శకత్వం వహించారు. అయితే బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్పైకి వస్తుందో చూడాలి. మరోపక్క బాలయ్య, దర్శకుడు పూరి జగన్నాధ్తో ఒక సినిమా చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆహా ఓటీటీ అన్స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో అన్స్టాపబుల్ సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. -
హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రంలో హీరో ఎవరంటే!
వైవిధ్యమైన కథలతో సినిమాలను అందించడంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన అ!, కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హను-మాన్ అనే మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించి ఫస్ట్లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్గా ఫిక్షనల్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. శనివారం హైదరాబాద్లో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరపుకుంది. నిర్మాత సి కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయై తేజకు క్లాప్ కొట్టారు. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంపై వచ్చే నెలలో ప్రకటన వెలువడనున్నట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ వెల్లడించింది. ఇక ప్రశాంత్ వర్మ సైతం సజ్జాతో దేవుడి ముందు దండం పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ‘మేమిద్దరం’ మరోసారి అంటూ ట్వీట్ చేశాడు. ప్రైంషో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ స్పషం చేశారు. అయితే ఇప్పటికే తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ‘జాంబీరెడ్డి’ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జాంబీల నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ను అందుకుని సూపర్ హిట్గా నిలిచింది. మేమిద్దరం.. మరోసారి! 💪🏼#HanuManTheOrigin pic.twitter.com/aek2JVaXHv — Prasanth Varma (@PrasanthVarma) June 25, 2021 -
ఆ స్టార్ హ్యాండ్ ఇవ్వడంతో ‘అ2’ సీక్వెల్ ఆగిపోయింది: డైరెక్టర్
వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్తో ‘అ!’ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ హీరోగా అతడు తెరకెక్కించిన ‘కల్కీ’ చిత్రం కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ఇటీవల ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. తెలుగులో జాంబీ జానర్లో వచ్చిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా కొత్త థ్రిల్ అందించింది. తన డెబ్యూ చిత్రం అ!కు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఆయన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ సీక్వెల్ ఆగిపోయినట్లు ఆయన ప్రకటించాడు. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, దీనిని ఓ బాలీవుడ్ స్టార్తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని అనుకున్నట్లు చెప్పాడు. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా ఓకే అయిందనుకుంటుండగా అతడు షాక్ ఇచ్చాడని, ఆ స్టార్ ఈ మూవీ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నట్లు చెప్పడంతో ‘అ2’ సినిమా వెనక్కి వెళ్లిందని ఆయన వివరణ ఇచ్చాడు. -
‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జాంబిరెడ్డి సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్లోని ఓ హోటల్లో ఆదివారం హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ విలేకరులతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా లాక్డౌన్ సడలింపులు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అయితే అధిక శాతం మంది సినిమా చూడలేకపోయారని.. అలాంటి వారి కోసం ఈ నెల 26న ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పాలని కోరారు. విశాఖ నుంచి ఆహా ప్రీ రిలీజ్ టూర్ ప్రారంభించామని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో కొనసాగిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి–2 తీయనున్నట్టు చెప్పారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ జాంబిరెడ్డిలో కశిరెడ్డి పాత్రలో నటించానన్నారు. ఆహాలో ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నటుడు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు.. -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్డౌన్ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
‘ఆ డైలాగ్ ఐడియా నాదే’
'అ!' చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. 'అ!' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా, మాస్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? దర్శకుడిగా నా తొలి సినిమా 'అ!' ఏ సెంటర్ సినిమా అయితే... 'కల్కి' బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ. రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది! అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే... సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో. (చదవండి: ‘కల్కి’ మూవీ రివ్యూ) 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది? నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత... ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని... రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు. తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు? అవును. అయితే... అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు. సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు తెరపై చాలా పేర్లు పడ్డాయి. వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం. తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట. అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు? నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా. సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట? అవునండి. క్లైమాక్స్ యే కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత... స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా. 'అ!', 'కల్కి'... రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో? నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా? ఒక్కటి మాత్రం నిజం... తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్ లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది. నెక్స్ట్ సినిమా ఏంటి? ఏమో... రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం. మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా? ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి. -
35ఏళ్లు వెనక్కి!
‘పి.ఎస్.వి. గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నారు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ‘కల్కి’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓపెన్ టాప్ జీప్లో స్టైల్గా కూర్చుని ఉన్న రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటోంది. 1983 నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందట. మరి.. 35 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అశుతోష్ రానా, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వసూళ్లు ‘అ!’దుర్స్
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మించిన ‘అ!’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లోనే రూ. 9 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఓవర్సీస్లోనూ అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయి. అమెరికాలో ఐదు రోజుల్లో రూ.4.13 కోట్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి ముఖ్యపాత్రలు పోషించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. -
అ! ప్రీ రిలీజ్ ఈవెంట్