Radhakrishna
-
నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఓటీటీలు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలైనా సరే కథ, కథనం బాగుంటే చాలు. ఇలాంటి సినిమాలే ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. కొన్ని చిన్న చిత్రాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ అలా విడుదలయ్యే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది.తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలోనే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 35 చిన్న కథ కాదు హీరో విశ్వదేవ్ నటించిన లేటేస్ట్ మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. రవి ఎస్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అర్జున్-కార్తిక్ కథను అందించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలోనే అనౌన్స్ ఓటీటీకి వస్తుందని ప్రకటించిన చిత్రబృందం.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల 35 చిన్న కథ కాదు మూవీతో మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ ఇటీవల విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. -
బోట్ల పేరుతో బాబు క్షుద్ర రాజకీయం..
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్,చంద్రబాబు ఇల్లు కోసం ప్రజల ప్రాణాలతో చలగాటాలా..
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏపీకి చేసిన నష్టం రూ.2500 కోట్లు..
-
వివేకా హత్య కేసుపై కథనాలు ఎలా ప్రచురిస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉండగా, ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను, కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది. ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుందని, దానికి కారకులు, ఎవరిది తప్పు వంటి వివరాలేవీ ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటివరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయవచ్చని తెలిపింది.దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనంవివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరినీ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ రాధాకృష్ణ, శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రజ్యోతి కథనం గురించి, ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులిచ్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా.. ‘ఘటన అంటే ఏమిటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడు అని రాయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనుక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు. దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలే’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్కు అందించారు. జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్బండ్పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.సోనియా రాక అనుమానమే!ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
కేసీఆర్పై ఏబీఎన్ తప్పుడు కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్డ్రైవ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. -
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఫ్లాష్బ్యాక్.. నీచంగా మాట్లాడింది గుర్తుందా?
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా.. చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ... రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి. చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్లో మరీ డిజాస్టర్స్గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే.. చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి. -
Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. -
మోదీ మాస్టర్ ప్లాన్లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో ఒకరిని ద్వేషించడానికి అయితే రాజకీయాలలోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావాలని అనుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, వేరే పార్టీ నేత కోసం నిత్యం పరితపించే వ్యక్తిగా పవన్ దేశంలోనే ఒక రికార్డు సాదించినట్లు అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తీరుతెన్నులు చూశాక ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు పవన్ కల్యాణ్ అవసరం ఎంత మాత్రం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక సిద్దాంతం లేదని, పద్దతి పాడు లేదని అడుగడుగున అందరికి తెలిసిపోతుంది. అందుకే ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నారని భావించాలి.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయనకు ద్వేషం ఉండవచ్చు. ఆయనను అర్జంట్గా పదవి నుంచి దించేయాలన్నంత కోపం ఉండవచ్చు. అందుకోసం ఆయన ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. కానీ జగన్ను అసలు ఎందుకు పదవి నుంచి దించాలన్నదానిపై ఆయనకు ఒక స్పష్టత ఉండాలి కదా! తనపార్టీని తానే నాశనం చేసుకుని, తన పార్టీవారిని తానే అవమానించి బయటకు వెళ్లగొడుతున్న అరుదైన రికార్డు ఉన్న పవన్ కల్యాణ్కు ఏవిషయంలోను స్పష్టత ఉండదు. అలాంటప్పుడు జగన్ విషయంలో ఏమి క్లారిటీ ఉంటుంది! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయనకు వ్యతిరేకత ఉందా? వలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవి నచ్చలేదా! ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రత్యేక నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తేవడం పవన్కు ఇష్టం లేదా? జగన్ విధానాలు నచ్చకపోతే ఫలానాది బాగాలేదు.. తాము దానికి ప్రత్యామ్నాయం ఇది సూచిస్తున్నానని చెప్పవచ్చు.కానీ అలా ఎన్నడైనా చేశారా! సముద్ర తీరంలో జగన్ నిర్మిస్తున్న ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యుత్, తదితరరంగాలలో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు ఇష్టం లేదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారికి వీటిని అడ్డుకోవడం ద్వారా ఒక లాభాన్ని ఆశిస్తున్నారు. వాటిపై దుష్ప్రచారం చేయడం ద్వారా తమకు రాజకీయ లబ్ది కలగాలని వారు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వాన్ని నడపవచ్చన్నది రామోజీ, రాధాకృష్ణల కుట్ర. కానీ, అందులో పవన్ కల్యాణ్కు అసలు పాత్రే ఇవ్వరు కదా. మహా ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు తప్ప ఇంకొకటి కాదని అంతా భావిస్తారు. ఈ మాత్రం దానికి పవన్ కల్యాణ్ తన ప్రతిష్టను అంతా పణంగా పెట్టి తన పార్టీని తాకట్టు పెట్టి. తనవారందరిని నట్టేట ముంచి చంద్రబాబు పాదాల వద్ద రాజకీయ బానిసత్వం చేయడం దేనికో ఆయన అభిమానులకు కూడా అంతు పట్టదు.ఈ మద్యకాలంలో పార్టీ నుంచి బయటకు వస్తున్న అనేక మందినేతలు ఎలా వాపోతున్నారో కనబడుతూనే ఉంది కదా! శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందని నమ్మిన పలువురు నేతలు కోట్లు ఖర్చు పెట్టారట. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారిని తూర్పు తిరిగి దండం పెట్టుకోండని చెప్పి, ఆయన మాత్రం పడమర వైపు తిరిగి చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. తత్పలితంగా పార్టీని కేవలం పది, పరకా సీట్లకే పరిమితం చేశారు. మిగిలిన చోట్ల లక్షలు, కోట్లు వ్యయం చేసిన నేతలంగా నిండా మునిగిపోయారు. బుద్ది తక్కువై పవన్ను నమ్మామని వారు చెబుతున్నారు. ఇందులో తెలుగుదేశం నేతల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే వారంతా చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. పదో - పరకో సీట్లు పడేస్తే పవన్ కల్యాణ్ తాము చెప్పినట్లు పడి ఉంటారని వారు అంటూ వచ్చారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఒక సభలో చెప్పి, తాను పదోపరకకో లొంగుతానా? అంటూ మాట్లాడితే జనసేన వారంతా బాగా మాట్లాడారులే అనుకున్నారు.. కానీ ఆయన చివరికి పది సీట్ల కోసం టీడీపీకి సరెండర్ అయ్యారు. పేరుకు ఇరవైఒక్క సీట్లు అయినా, పది సీట్ల వరకు చంద్రబాబు పంపించిన టీడీపీ నేతలకే పవన్ సీట్లు ఇచ్చారు.ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? వారాహి భోషాణం దేనికి, ఎవరి కోసం బిల్డప్? అసలు తెలుగుదేశంలో విలీనం చేసేస్తే సరిపోయేది కదా అని జనసేనను నమ్మి నాశనం అయినవారు అడుగుతున్నారు. వారిది అరణ్యరోదనగా మిగిల్చిన పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు తెలివిగా పవన్ కల్యాణ్ను పది సీట్లకే పరిమితం చేసి జనసేనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ఇంతకాలం తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని, చంద్రబాబుకు సమానంగా ఆయన పక్కనే నడుస్తున్నానని చెప్పుకున్న పవన్ కల్యాణ్ను అసలు ఆ రేసులో లేకుండా చేసుకున్నారు. తద్వారా తాను, లేదా తన కుమారుడు లోకేష్లు మాత్రమే.. ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి చేపట్టడానికి వీలుగా పవన్ను లొంగదీసుకున్నారు.పవన్ కూడా ఒక ఎమ్మెల్యే పదవి వస్తే మహద్బాగ్యం అంటూ పిఠాపురంలో ఒక నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతను బతిమలాడుకుంటున్న తీరు ఆయన రాజకీయాలకు పనికిరాడని రుజువు చేస్తుంది. తనపార్టీవారిని గెలిపిస్తారని అనుకు్న్నవారికి భ్రమలు తొలగిస్తూ పవన్ కల్యాణ్ తను గెలుపుకోసం పిఠాపురంలో టీడీపీ నేత కాళ్లావేళ్లా పడుతున్నారు. ఇలా తన రాజకీయ పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు చూస్తే రాజకీయాలలో ఏ మాత్రం పరిణితి లేని అజ్ఞాని అన్న సంగతి పదే, పదే అర్ధం అవుతుంది. జగన్ తనకు తానే దండలో రాయి పెట్టుకుని కొట్టుకున్నారట! ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా ఇలా మాట్లాడతారా! లోకేష్ పిచ్చి వ్యాఖ్యలకు, పవన్ బుర్ర తక్కువ కామెంట్లకు తేడా ఏమీ కనిపంచదు. చంద్రబాబే అతి తెలివితో ముందుగా తానేదో ఖండించినట్లు నటించి, ఆ తర్వాత గులకరాయి తగిలిందంటూ డబుల్ టాక్ చేశారు.పవన్ కల్యాణ్కు ఆ మాత్రం కూడా కుట్ర తెలివితేటలు కూడా లేవు. చంద్రబాబు ఏది చెబితే అదే తాను కూడా వంత పాడి గులకరాయి స్వరం ఎత్తుకున్నారు. జగన్కు తగిలింది గ్రానైట్ రాయి అని, పొరపాటున అది నవరగంతకు తగిలినా, కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగేది! అంతదాకా ఎందుకు ఒక గులకరాయిని తీసుకుని తమవాళ్లతో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కొట్టించుకు చూస్తే దాని పవర్ ఏమిటో తెలుస్తుంది. జగన్కు ఆ రకంగా గాయమైతే కనీసం సానుభూతి తెలపకపోగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరిగాయట. అప్పుడు ఎవరూ స్పందించలేదట. సమాజంలో జరిగే నేరాలకు, ముఖ్యమంత్రిపై దాడికి లింకు పెట్టి మాట్లాడడంలోనే పవన్ కల్యాణ్ అజ్ఞానం తెలుస్తుంది.సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది.. చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! మరి అలాంటి చంద్రబాబుతో ఎందుకు జత కట్టారు! వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా! అప్పుడు శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని పవన్ అన్నారా! పైగా వివేకా కూతురు సునీత నాలుక మడతేసి చెబుతున్న అసత్యాలను ఈయన ఎత్తుకున్నారు. సునీతే తన తండ్రి హత్య జరిగిన రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు కదా! ఆ తర్వాత కాలంలో, హత్య తానే చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈమె ఎందుకు బెయిల్ ఇప్పించారు! ఈ విషయాలేవీ పవన్కు పట్టవా! ఏదో ఒకటి జగన్ పై బురద వేసి చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు రాజకీయాల గురించి చెప్పాలి.మళ్లీ ముప్పైవేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పిచ్చి వాగుడు. అదే నిజమని నమ్మితే వలంటీర్ల వ్యవస్థను తీసివేస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడంం లేదు? చంద్రబాబు అయితే యూటర్న్ తీసుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారే! జగన్ అమలు చేస్తున్న స్కీములను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా తాము ఎంత బలహీనంగా ఉన్నది వీరిద్దరూ తెలియచేస్తున్నట్లే కదా! జగన్పై జరిగిన దాడి లేదా హత్యాయత్నం ఘటనలో తొలుత పవన్ సోదరుడు నాగబాబు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినా, ఆ తర్వాత సర్దుకుని దాడిని ఖండించారే.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడి హేయమని ఖండించారు కదా! నాగబాబుకు దాడి ఎలా కనిపించింది? పవన్ కల్యాణ్కు ఎందుకు కనిపించలేదు! అంటే పవన్ కల్యాణ్ పిచ్చి మాటలుమాట్లాడుతున్నారని తేలిపోవడం లేదా! పవన్కు నాగబాబు ఇచ్చిన స్టేట్ మెంటే జవాబుగా కనిపిస్తుంది కదా! అంటే నాగబాబుకు ఉన్న విజ్ఞత కూడా పవన్ కల్యాణ్కు లేదనే అనుకోవల్సిందే కదా! పవన్ కల్యాణ్ హుంకరింపులు, గంతులు, ఆవేశం నటిస్తూ ఊగిపోవడాలు ఇవన్ని చూసిన తర్వాత మనందరికి ఒక స్పష్టత వస్తుంది కదా! ఈయన రాజకీయాలకు ఏ మాత్రం తగడని. వ్యక్తిగత జీవితంలో అనైతిక ప్రవర్తనతో పాటు, ఇలాంటి అజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరం! ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు సిగరెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఉంటాయి. అలాగే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ రాజకీయ సమాజానికి, ఏపీ ప్రజలకు ప్రమాదకరమని అనిపించడం లేదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సొంత రాజకీయం చెల్లదని బాబుకి అర్థమౌతోందా..!?
నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు కూటమి పార్టీలు మొండి చేయి చూపాయి. రఘురామకృష్ణరాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చచేసి అప్రతిష్టపాలైన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు హాండిచ్చిన తీరు రాజకీయాలలో ఉన్నవారికి గుణపాఠం అని చెప్పాలి. నోటి దురద అనండి, నోటి దూల అనండి, తీట అనండి... ఏదైనా కాని తొందరపాటుతో, అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరు నేతల మన్ననలు పొందుదామనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంటుంది. తన గురించి తాను గొప్పగా ఊహించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్దం అవుతుందా? అన్నది డౌటే. ఎందుకంటే ఆయనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్అని రాజు ఆరోపించే దైన్య స్తితికి తెచ్చారు. ఎందుకంటే ఆయన నాలుగేళ్లుగా ఎవరి ట్రాప్ లో ఉన్నారు? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల ట్రాప్ లోనే కదా! నిజంగా రాజుకు ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడే నర్సాపురం సీటును టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా! లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికి ఇచ్చి, తాను నర్సాపురం తీసుకుని రాజుకు కేటాయించవచ్చు కదా! విశాఖలో తన బందువైన భరత్కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకీష్ణంరాజుపై లేదనే కదా దీని అర్ధం. రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు. ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో, లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయ్యారు కనుక నోరు మూసుకుని కూర్చుంటారో తెలియదు. చిత్రమైన సంగతి ఏమిటంటే బీజేపీలో ఆరు సీట్లలో ఒక్కరే ఒరిజినల్ బీజేపీ నేత. నర్సాపురం నుంచి బీజేపీ టిక్కెట్ పొందిన శ్రీనివాస వర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వెళ్లినవారే. సీ.ఎమ్.రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్లారు. ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు. అయినా బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీ, తదుపరి టీడీపీ ఎంపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు పురందేశ్వరి కాంగ్రెస్ లో పదేళ్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చారు. వర ప్రసాద్ తనకు టిక్కెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఈ పార్టీ టిక్కెట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. వీరందరికి టిక్కెట్లు ఇచ్చి రఘురామకృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ వ్యవహారంలో రాజు వల్ల తమకు కూడా నష్టం జరుగుతోందని భావించారో ఏమో కాని, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ ద్వారా రాయబారం చేసి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెబుతున్నట్లు ఉన్నారు. అది బుగ్గ గిల్లి జోలపాడడానికే కావచ్చు. ఉండి నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. మరి ఆయనను మార్చి రఘురామ కు ఇస్తారా అన్నది డౌటే. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ పంచన చేరారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణల ప్రాపకం కోసం వారు ఏది మాట్లాడమంటే అది మాట్టాడి పరువు పోగొట్టుకున్నారు. చివరికి తాను ఏమి మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్లారు. ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయినా జగన్కు ఉన్న ఆదరణ రీత్యా ఈయన బయటపడగలిగారు. డిల్లీలో జగన్తో సంబందం లేకుండా సొంత రాజకీయం చేయడం, బీజేపీ వారితో పైరవీ చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకత్వంతో కొంత తేడా వచ్చింది. అయినా కొంత సంయమనం పాటించి ఉంటే అన్ని సర్దుకుపోయేవేమో! అలాకాకుండా టీడీపీకి ఏజెంట్ అయిన ఆంద్రజ్యోతి రాదాకృష్ణ ట్రాప్లోకి వెళ్లి, జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆరంభించారు. ఆ సమయంలో ఒక ఏడాది పాటు మౌనంగా ఉండండని, ఆ తర్వాత అన్ని కుదుట పడతాయని కొందరు హితవు చెప్పినా ఆయన వినలేదు. దీంతో నరసాపురంలో మరో నేతను వైసీపీ ఇన్ చార్జీగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీకి సంబందం తెగిపోయింది. ఆ దశలో కాస్త నిజాయితీ ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజు ప్రతిష్ట నిలబెట్టుకుని ఉండేవారు. ఉభయ గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. కాని రాజు తెలివితక్కువగా, మూర్ఖంగా, కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటిని నాశనం చేసి, ఆయన వర్గానికి కూడా కళంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు. వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ను కోరుతూ పిటిషన్ ఇచ్చినా, రకరకాల పద్దతులలో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కధ నడిపించారు. ఈ కాలంలో ఒకటి,రెండుసార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు. ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవి 5 వంటివి తనకు లైవ్ కవరేజీ ఇస్తున్నాయనే సంబడంలో ఆయన రోజూ జగన్పై విమర్శలు సాగించారు. అవి కూడా కొన్నిసార్లు దూషణలుగా, అనుచిత వ్యాఖ్యలుగా ఉండేవి. ఒక అగ్రవర్ణ సామాజికవర్గాన్ని తూలనాడడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటివాటి ద్వారా కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టే యత్నం కూడా చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసింది. అప్పట్లో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడైనా పదవికి రాజీనామా చేసి, వైసీపీకి చాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు. ఓడిపోతానన్న పిరికి తనంతో ఉండిపోయారు. ఈయనను వైసీపీ ఎంపీగా పిక్చర్ ఇస్తూ ఎల్లో మీడియా కధ నడిపేవి. తనకు టీడీపీ, బీజేపీ, జనసేనలలో ఎవరైనా టిక్కెట్ ఇస్తారని బీరాలు పోయేవారు. నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నవారు ఉన్నారు. ఆ నమ్మకంతోనే వైసీపీని, జగన్ను అంత నీచంగా మాట్లాడుతున్నారని భావించినవారు లేకపోలేదు. సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఉన్నవి,లేనివి కలిపి అబద్దాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు. చంద్రరబాబు నాయుడును నమ్మితే ఇంతే సంగతి అన్నది సాదారణంగా ఉన్న నానుడి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధికి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. ఆమె బాపట్ల లోక్ సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు. దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి. 'రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారు ఈ రోజు అర్దం అయింది "అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంటే దాని అర్దం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా! రఘురామకృష్ణంరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా! ఆయనను నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మక ద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా! మరో ప్రత్యామ్నాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా! ఈ మూడు పార్టీలు రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్ ఇవ్వడం వేస్ట్ అని అనుకున్నాయనే కదా అర్ధం. తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి, ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా! ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసూరుమంటూ చెప్పారు. తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్దం అవుతుంది. తాను చిన్న ఓటమికి గురయ్యాయని అంటూ మళ్లీ ఆత్మవంచన చేసుకుని జగన్తన ప్రభావం చూపి టిక్కెట్ రాకుండా చేశారని పిచ్చి విమర్శ చేశారు. ఇలా చాతకాని వ్యాఖ్యలు చేసే బదులు తాను ఇంతకాలం తప్పు చేశానని, శ్రీదేవి మాదిరి తనకు కూడా జ్ఞానోదయం అయిందని ప్రకటించి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో ఆయన ఆలోచించాలి. అలా చేసే పరిస్థితి లేదు.. రామోజీ, రాదాకృష్ణ తదితర తెలుగుదేశం ఎజెంట్లు పెట్టిన ప్రలోభాలకు లొంగి, రోజూ తనను కాబట్టి టీవీ లైవ్ లలో చూపిస్తున్నారని, పత్రికలలో తన స్టేట్ మెంట్లు వేస్తున్నారని భ్రమపడి, వారి కోరిక మేరకు పిచ్చి మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు లబో, దిబో అంటున్నారు. ఇప్పటికైనా వారంతా తనను వాడుకుని వదలివేశారన్న సంగతి బోదపడిందో లేదో తెలియదు. రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేత, తన వియ్యంకుడైన కెవిపి రామచంద్రరావునో, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలనో కోరితే. వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. కాంగ్రెస్ టిక్కెట్ పైన అయినా, లేక స్వతంత్ర ఈ అభ్యర్ధిగా అయినా రంగంలో దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణంరాజుకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఈయన రోశం ఉన్న రాజకాదని, ఉత్తి రాజే అన్నే భావన కలుగుతుంది. సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణంరాజు, టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా? లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటారా అన్నది ఆయన తేల్చుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నోరు జారిన రేవంత్ ప్రకృతి తో జాగ్రత్తగా ఉండాలి కదా మరి ..!
-
మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్ లీడరే కాదు.. ఆయన ప్రసంగం కూడా మాసే. పురాణాలను, ఆ పురాణాల్లోని ఇతివృత్తాలను, పాత్రలను గుర్తు చేస్తూ.. ఆ పాత్రలను నేటి రాజకీయాలతో పోల్చుతూ ఆయన చేసే ప్రసంగాలను అభిమానులనే కాదు.. ప్రతీ ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. "ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే శ్రీకృష్ణ పరమాత్ములు..నేను అర్జునుడిని" అన్న డైలాగ్.. వీపరీతంగా జనంలోకి వెళ్లింది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలు కౌరవ సేనను చీల్చిచెండాడినట్లు.. జగన్ మాటలు ఎల్లో మందను చీల్చి చెండాడుతున్నాయి. ప్రజలను శ్రీకృష్ణుడి స్థానంలో కూర్చోపెడుతున్న తీరు.. ఓ స్పష్టమైన సంకేతాన్నిస్తోంది. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆయుధం పట్టకుండా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించినట్లు.. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే తనను గెలిపించాలని చెబుతున్నారు. "జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని బయటకు తీయండి" అన్నారు. మహాభారతంలో పాండవులు వనవాసం, అజ్ఞాత వాసానికి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్తారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాక తిరిగి జమ్మ చెట్టు దగ్గరకు వచ్చి ఆయుధాలు తీసుకుంటారు. ప్రజల ఓట్లను ఆయుధాలతో పోల్చడమంటే.. కౌరవ సేన లాంటి ఎల్లో మందను ఓటు అనే ఆయుధంతో చీల్చి చెండాడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం.. ఉత్తర కోస్తా సిద్ధం..రాయలసీమ సిద్ధం..ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధమని సభకు వచ్చిన లక్షలాది జనంలో ఉత్తేజం నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సభ ముగిసిన తర్వాత కూడా ప్రజలు, మీడియానే కాదు తెలుగుదేశం, ఎల్లో మీడియా కూడా సీఎం జగన్ ప్రసంగం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. "బిందువు బిందువు కలిసి సింధువైనట్లు" అనగానే జనం స్పందించిన తీరు.. సమర నినాదాన్ని గుర్తు చేసింది. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాడీ లాంగ్వేజీలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చిన తరువాత ఈ సభ జరిగింది. సహజంగానే ఈ సభ ఎలా ఉంటుంది..? సీఎం జగన్ స్పీచ్ ఎలా ఉంటుంది..? అని వైఎస్ఆర్ సీపీ నేతలే కాదు కూటమిలోని నేతలు కూడా ఎదురు చూశారు. 2014లో కూడా ఇలానే ముగ్గురు కలిసి వచ్చారని.. తరువాత ప్రజలను మోసం చేసి ఎవరిదారిన వారు వెళ్లారని సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేశారు. 2014 టీడీపీ మేనిఫెస్టో సిద్ధం వేదిక నుంచి చూపిస్తూ.. ఇలా రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి వస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న తనకు ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో.. ప్రతి ఇంట స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. ఈ మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమా..? అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి జగన్ అన్నప్పుడు.. సిద్ధం.. సిద్ధం..సిద్ధమంటూ లక్షలాది గొంతుకలు ఒక్కసారిగా నినదించాయి. చంద్రబాబుది తుప్పుపట్టిన సైకిల్ అని.. ఆ సైకిల్కు టైర్లు, ట్యూబ్లు కూడా లేవని.. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయడానికి పొత్తులతో వస్తున్నాడని జగన్ అన్నప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లి పోయింది. కిల్ సైకిల్.. కిల్ సైకిల్ అని యవత అరవడం వినిపించింది. గంటా 21 నిమిషాలు పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా 15 లక్షల మంది, టీవీల్లో అంతే స్థాయిలో, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాదాపు కోటి మంది చూసి ఉంటారని గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పొత్తుల తరువాత జరిగిన సభ కావడంతో జాతీయ ఛానల్స్ కూడా విస్తృత ప్రచారాన్ని ఈ సిద్ధం సభకు ఇచ్చాయి. దురదృష్టమేమంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు లక్షలాది జనం గ్రాఫిక్స్లా కనిపించడం... ఓ రకంగా ఇది ప్రజలను అనుమానించడం, అవమానించడమే. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించడమంటే ఇదేనేమో. ఐటీడీపీ గ్రాఫిక్స్ను ఫ్రంట్ పేజీలో వేసుకునే స్థాయికి దిగజారడం శోచనీయం. -వైవీ రెడ్డి -
ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా..?
‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎంత కష్టం వచ్చిపడింది..! ‘ఆయన తనకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పడం లేదట. ఎన్డీఏలో చేరక తప్పడం లేదట. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమట’. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన భావాలను సహచరులతో ఆయన పంచుకున్నారట. ఆ సహచరుడు ఎవరో తెలిసిందే కదా! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే అని వేరే చెప్పనవసరం లేదు. వారిద్దరూ కూర్చుని ఒక వంటకం తయారు చేసి జనం మీద వదిలారన్నమాట. అందులో ఏమి రాశారో చూడండి..’’ 'రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని ఎన్డీఏలో చేరాలని హోం మంత్రి అమిత్షా మనల్ని ఆహ్వానించారు. మనకు ఉన్న పరిమితులు, సమస్యలపై చర్చించాం, వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రిత్యా తప్పదేమోననిపిస్తుంది’ అని చంద్రబాబు అన్నారట. దీనినే హిపోక్రసీ అని అంటారు. తెలుగులో కపటత్వం అన్నమాట. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తాను గెలవలేమోనన్నది వారి భయం. ఏపీలో ఎన్నికల మేనేజ్మెంట్లో చిక్కులు వస్తాయేమోనన్నది వారి సందేహం. గత ఎన్నికల ముందు మాదిరి తమ నేతల ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు జరిగితే ఇక్కట్ల పాలవుతామేమోనన్నది వారి డౌటు. ఇంకేమైనా కొత్త కేసులు ఉన్నాయేమో! దీనిని వదలి ఈ డ్రామా ఎందుకు? ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఫెయిర్గా తాము గతంలో బీజేపీని వదలి తప్పు చేశాం.. ఇప్పుడు కోరుకుంటున్నాం అని అంటే సరిపోతుంది. అలాగే ప్రధాని మోదీని తెలివితక్కువగా దూషించాం.. అందుకు క్షమించాలని కోరుకుంటున్నాం అని అంటే పర్వాలేదు. కాని ఇక్కడ కూడా ఆత్మ వంచనే. అమిత్షానే వీరిని పదే, పదే పిలిచినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం. బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు ఈ కథనాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పాతిక సార్లు షా అప్పాయింట్ను చంద్రబాబు కోరితే, ఆ విషయం రాయకుండా షా రమ్మన్నారని ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్లీ వైఎస్సార్సీపీపై విమర్శలు. రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోయిందని అంతా అనుకుంటున్నట్లు అబద్దపు ప్రచారం. బీజేపీతో పొత్తుపై మైనార్టీ వర్గాలు అసంతృప్తి చెందవచ్చని, కాని పరిస్థితులను విశదీకరించి చెబితే అర్ధం చేసుకుంటారని అమిత్షా అన్నారట. ఎంత కథ రాశారండి. యూపీలో ఒక్క సీటు కూడా మైనార్టీలకు ఇవ్వకుండా ఎన్నికలలో పోటీచేసిన బీజేపీ, ఏపీలో మైనార్టీ నేతలు టీడీపీకి మద్దతు ఇవ్వరేమోనని ఆలోచన చేస్తుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాయ ప్రచారం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణలో బీజేపీ సిద్దపడకపోవడం వల్లే, కాంగ్రెస్తో తప్పనిసరి పరిస్థితిలో జట్టు కట్టవలసి వచ్చిందని కూడా చంద్రబాబు చెబితే అమిత్షా ఊ కొట్టారట. కాంగ్రెస్కు ఇచ్చే బదులు బీజేపీకే పరోక్ష మద్దతు ఇచ్చి ఉండవచ్చు కదా..! 2019లో దేశం కోసం కాంగ్రెస్తో స్నేహం అని చంద్రబాబు భావన అని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊదరకొట్టాయి కదా! మోదీ అంత అవినీతిపరుడు లేడని, ఉగ్రవాది అని, ముస్లీంలకు రక్షణ ఉండదని, త్రిబుల్ తలాఖ్ తెచ్చారని ఇలా ఎన్నో విమర్శలు చేశారు కదా! ప్రత్యేక హోదాను కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లినా విభజన హామీలు నెరవేరలేదని, ఏడాదిన్నర పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మోదీ అవమానించారని చెప్పారు కదా! మరి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏమి మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలను కాకా పట్టి మరీ వారిని కలిశారో చెప్పాలి. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇతర సమస్యలను తీర్చుతామని అమిత్షా ఏమైనా హామీ ఇచ్చారా? అలా ఇచ్చి ఉంటే కదా! రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో జతకట్టి ఎన్డీఏలో చేరుతున్నామని చెప్పాలి. అదేమి కాకుండా చంద్రబాబు బీజేపీని అంటకాగే యత్నం చేస్తున్నారంటే దానికి ఒక కారణం చెబుతున్నారు. ఇదంతా ఈనాడు అధినేత రామోజీరావు ఇచ్చిన సలహా అని అంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని రామోజీ భావిస్తున్నారట. దానినుంచి తప్పించుకోవడానికి కేంద్రంలోని బీజేపీతో జట్టు కడితే ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినా, అంత దూకుడుగా వెళ్లకపోవచ్చన్నది ఆయన భావన అని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. తాను కూడా బీజేపీవారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే తనపై ఉన్న మార్గదర్శి కేసులలో అరెస్టు వరకు వెళ్లకుండా తప్పించుకోగలిగానని చెబుతున్నారట. ఈ ప్రచారంలో నిజం ఉందో, లేదో తెలియదు కాని, ఈ వాదనలో హేతుబద్దత ఉన్నట్లు అనిపిస్తుంది. మరో వైపు ఎక్కువ సర్వేలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటే ఒక్క సీ-ఓటర్ సర్వే టీడీపీకి ఫేవర్గా రావడం కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది. టైమ్స్ నౌ, న్యూస్ అరెనా ఇండియా, జనమత్, పొలిటికల్ క్రిటిక్ వంటి పలు సంస్థల సర్వేలలో ఏపీలో 17 నుంచి 20 లోక్సభ సీట్లు, 113 నుంచి 118 అసెంబ్లీ సీట్లతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే సీ-ఓటర్ సర్వే మాత్రం భిన్నంగా ఇచ్చింది. పదిహేడు సీట్లు టీడీపీ, జనసేన కూటమికి వస్తాయని అంటున్నది. 2019లో కూడా ఈ సంస్థ టీడీపీనే గెలుస్తుందని చెప్పింది కాని, వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇటీవలె జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్ఘర్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సీ-ఓటర్ చెబితే, ఆ రెండుచోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో సీ-ఓటర్ సర్వే గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. అసలు ఈ సర్వేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే నమ్మడం లేదని అనుకోవచ్చు. చంద్రబాబు అయితే జనసేనతో పొత్తు కోసం పడిన తంటాలు తెలిసినవే. వారిద్దరూ కలిశాక, నిజంగానే వారికి గెలుస్తామన్న నమ్మకం ఉండి ఉంటే బీజేపీని ఎందుకు బతిమలాడుకుంటారు? వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పదే, పదే ఎందుకు చెబుతుంటారు? వచ్చే రెండు నెలలు కూడా టీడీపీ అనండి.. చంద్రబాబు అనండి.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ.. ఇంకా ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఎన్నికలు అయ్యేవరకు మనకు ఈ బెడద తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
రామోజీ, రాధాకృష్ణ రోడ్లపైకి వస్తే చెప్పులతో కొడతారు
-
ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్?
ఏపీలో ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించేసింది. ఏకంగా ఇప్పుడు బహిరంగంగా అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిగ్గుపడటంలేదు. తెలుగుదేశం పార్టీ కరపత్రాల కన్నా హీనంగా మారిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి నిత్యం ఇదే పనిలో ఉంటున్నాయి. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వం రాగానే తమపై కేసులు పెడతారేమోనని అధికారులు భయపడుతున్నారట. దీనిపైనే చర్చించుకుంటున్నారట. గతంలో పత్రికలు, టీవీలు ఇలా ప్రచారం చేసేవి కావు. ✍️రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటుంటాయి. ఒకదానికి ఒకటి సమాధానం ఇచ్చుకుంటాయి. ఇంతకాలం అలాంటివి చూశాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా హద్దులు దాటిపోయి అధికారులను బెదిరించే దశకు చేరుకున్నాయి. దీనికి ఒక కారణం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండేవారు. తామే పవర్లోకి వస్తున్నాం. అధికారుల సంగతి చూస్తాం. వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చే పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నాం.. వారందరి అంతు తేలుస్తా అంటూ లోకేష్ ఎక్కడబడితే అక్కడ మాట్లాడుతూ వచ్చారు. యువగళం పేరుతో సాగిన పాదయాత్రలో ఆయన ఇదే పనిగా పెట్టుకుని మాట్లాడుతుండేవారు. ✍️చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తనను ఎవరు ఏమీ పీకలేరని అనేవారు. గొడవలు చేసి కేసులు పెట్టించుకునేవారికి పెద్ద,పెద్ద పదవులు ఇస్తామని ప్రచారం చేశారు. దానిని అమాయకంగా నమ్మిన కొందరు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేసి కేసుల్లో చిక్కుకుని నానా పాట్లు పడవలసి వచ్చింది. లోకేష్ కొన్నిసార్లు పూర్తిగా బాధ్యతారహితంగా కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేరు ప్రస్తావించి తాను అధికారంలోకి రాగానే ఏమి చేస్తానో చూడండి అంటూ బెదిరించేవారు. చిత్తూరు ఏఎస్పీని పేరు పెట్టి మరీ బెదిరించారు. దీనిపై ప్రజలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయంగా తమకు ఉపయోగపడటంలేదని ఆ తర్వాత కాలంలో అర్ధం అయిందో, ఏమో తెలియదు కానీ.. కాస్త స్వరం మార్చి పోలీసు అధికారులందరిపై తమకు కోపం లేదని, కొందరే ప్రభుత్వానికే అనుకూలంగా ఉండేవారిపైనే తమ విమర్శలంటూ సర్దుకోవడానికి యత్నించారు. ఈలోగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలు తెరపైకి రావడం, చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉండవలసి రావడం, లోకేష్ యువగళం యాత్రను ఆపి ఢిల్లీకి వెళ్లిపోవడం వంటివి జరిగాయి. ✍️దీంతో, వారికి కొంత భయం పట్టుకుంది. అధికారులపై దాడి చేయడం తగ్గించారు. తాజాగా లోకేష్ మళ్లీ యువగళం ఆరంభించినా, అధికారుల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు. కానీ, వైఎస్సార్సీపీ వారందరిని జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ఆయన తండ్రికి జైలర్ పాత్ర ఇచ్చారు. టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా జైలర్ ఎలా అవుతారో, లేదా జైలర్ ఉద్యోగం కూడా ఆయన చేతిలోకే తీసుకుంటారో తెలియదు. అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న గ్యారంటీనే లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న ఆశతో తంటాలు పడుతున్నారు. ✍️ఈ క్రమంలో టీడీపీ, జనసేనలకు ఊపిరి పోయడానికి కంకణం కట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పచ్చ మీడియా సంస్థలు పచ్చ నేతలకు బదులు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే పనిలోపడ్డాయి. గత కొన్నాళ్లుగా ప్రత్యేకించి చంద్రబాబుపై కేసులు వచ్చాక, ఈ మీడియా.. అధికారులను భయపెట్టడానికి అన్ని యత్నాలు చేస్తున్నాయి. ఒకసారి అధికారులు కేసులువస్తాయని భయపడి కేంద్రానికి వెళ్లడానికి అప్లై చేసుకుంటున్నారని రాయడం, డిప్యుటేషన్పై పనిచేసే అధికారులు కొందరు ఇక్కడ పరిస్థితి రీత్యా వెళ్లిపోవాలని చూస్తున్నారని మరోసారి, మళ్లీ వారి సర్వీస్ పొడిగింపు ఆదేశాలు వస్తే మరో రకంగాను రాస్తూ ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ✍️ఒకరోజు ఆంధ్రజ్యోతి అలాంటి బెదిరింపు కథనం రాస్తే ఆ మరుసటి రోజు ఈనాడు అందుకుంటుంది. ఉదాహరణకు నవంబర్29వ తేదీన ఈనాడు దినపత్రిక బ్యానర్ కథనం చూడండి.. ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి అని అధికారులు చర్చించుకుంటున్నారని ఒక చెత్త వార్త రాశారు. ఇదే తరహా వార్త అంతకు ఒకటి, రెండు రోజుల ముందు ఆంధ్రజ్యోతి రాసింది. ఈ రెండు పత్రికలు, టీవీలు పేరుకే విడివిడిగా ఉన్నాయి తప్ప, కంటెంట్ దాదాపు అంతా కలిసే జనం మీదకు వదలుతున్నారు. ఈనాడు ఎంత నీచంగా రాసిందంటే అధికారులు కేసులకు భయపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ప్రతిపక్షనాయకులపైన, ప్రభుత్వానికి గిట్టని వారిపైన అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం అని రాసిపడేశారు. ✍️చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, లోకేష్ తదితరులు ఊరుకునేలా లేరని వారు అనుకుంటున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ ఒక్క అధికారితో వీరు మాట్లాడి రాసినట్లు ఇందులో కనబడదు. వారి సొంత పైత్యం అంతా జనం మీద రుద్దేశారు. ఎవరూ అక్రమ కేసులు పెట్టాలని కోరరు. కానీ, పెట్టినవన్నీ అక్రమ కేసులే అని ఈనాడు మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ మీడియానే తన ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇచ్చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చేస్తోందన్న భ్రమ కల్పించడానికి, ఆ తర్వాత ఏదో అయిపోతుందన్నట్లు భ్రాంతి కల్పించడానికి ఈనాడు, జ్యోతి, టీవీ-5 తదితర ఎల్లో మీడియా ఈ రకంగా చేస్తోందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకుండా ఉండదు. ఎందుకంటే చంద్రబాబుపై వచ్చిన అభియోగాలలో అత్యధికభాగం పూర్తిగా దర్యాప్తులో ఆధారాలు దొరికిన తర్వాతే కేసులు పెట్టడం జరిగింది. ఆ వాస్తవం టీడీపీ వారికి కూడా తెలుసు. ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు సైతం తెలుసు. కానీ, తమకు మీడియా ఉంది కనుక దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును రక్షించడానికి వారు చేస్తున్న కుట్రలేనని ఈ వార్తలు చదివితే బోదపడుతుంది. ✍️ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కొందరు పోలీసు అధికారులతో పాటు మీడియా అధిపతుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఒక పోలీసు అధికారి అయితే టీడీపీని తాను నడుపుతున్నట్లుగా ఆయా పార్టీ పదవులను ఇచ్చేవారట. ఆ విషయం టీడీపీ నేతే విజయవాడలో పార్టీ మీటింగ్లోనే చెప్పిన సంగతి మర్చిపోయారా! ఇప్పుడు అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా!. ✍️ఇక ఆంధ్రజ్యోతి చిత్రంగా మరో వార్త ఇచ్చింది. ఇసుక ద్వారా సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరితే, ఇంకా ఎక్కువ రావాల్సిందని, అందువల్ల ఇంత నష్టం జరిగిందంటూ ఓ పిచ్చి వార్తను ఇచ్చింది. ఇలా తప్పుడు కథనాలు రాసి నడిరోడ్డు మీద నగ్నంగా తిరగడానికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ మాత్రం ఫీల్ కావడం లేదు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని అంటారు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసే బ్లాక్ మెయిలింగ్కు అధికారులు భయపడతారా? అదే కరెక్టు అయితే చంద్రబాబు పాలన సమయంలో అనేక మంది కేంద్రానికి వెళ్లారు. వారంతా కూడా ఆ టైమ్లో జరిగిన అక్రమాలకు భయపడే కేంద్రానికి వెళ్లారని ఈ ఎల్లో మీడియా ఒప్పుకుంటుందా?. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మన భూభాగంలోకి వెళ్తే దండయాత్రా!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను గురువారం న్యాయ, ధర్మబద్ధంగానే స్వా«దీనం చేసుకున్నామని.. ఇది దండయాత్ర ఎలా అవుతుందో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు నాగార్జునసాగర్ను తెలంగాణకు తాకట్టు పెట్టారని.. తద్వారా కోల్పోయిన రాష్ట్ర హక్కులను సీఎం వైఎస్ జగన్ సాధించారని ఆయన తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా జలాలకు మించి ఒక్క నీటి బొట్టునూ అదనంగా వాడుకోబోమని తేల్చిచెప్పారు. ‘మా వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దీనిని తెలుగు ప్రజలంతా సమరి్థస్తారని.. స్వాగతిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా పంతాలకు, పట్టుదలకు వెళ్లొద్దు’.. అంటూ అంబటి విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంపై ఎల్లో మీడియా అవాస్తవాలు పోగేసి అచ్చేస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. హక్కును కాపాడుకుంటే దండయాత్ర అంటారా..? మరోవైపు.. కృష్ణా బోర్డు పరిధిని 2021, జూలై 15న కేంద్రం నిర్దేశించాక.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని.. తెలంగాణ సర్కారే ఒప్పుకోలేదని గురువారం కేంద్రమంత్రి కిషన్రెడ్డే చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పును మేం సరిదిద్దితే.. సాగర్ మీదకు దండయాత్ర చేస్తున్నామని ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు రాస్తారా? ఇదేనా మీ జర్నలిజం? మేం తెలంగాణ భూభాగంలోకి వెళ్తే అది తప్పవుతుందిగానీ మన భూభాగంలోకి మనం వెళ్తే అది తప్పెలా అవుతుంది? తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు లేవు.. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విషయంలో వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు, ప్రయోజనాల్లేవు. ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరంగానీ ఓడించాల్సిన అవసరం కూడా లేదు. పొరుగు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మేం సత్సంబంధాలు కొనసాగిస్తాం. దిగజారి మాట్లాడుతున్న పురందేశ్వరి.. సాగర్ స్పిల్ వేపైకి మన పోలీసులను పంపడం దారుణమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగజారి మాట్లాడుతున్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? ఏపీలో టీడీపీకి సమాధే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు, ఆ పార్టీ శ్రేణుల ప్రవర్తనవల్ల వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో పెకళించి, సమాధి కట్టబోతున్నారు. ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును జైలుకు పంపితే.. ఒక్క పవన్ మాత్రమే వెళ్లి టీడీపీతో కలిసి పోటీచేస్తానని ప్రకటించారు. పవన్కళ్యాణ్ ఇంత త్యాగం చేసి తెలంగాణలో ఆయన ఎనిమిది సీట్లల్లో పోటీచేస్తే.. చంద్రబాబు సామాజికవర్గం వారు పవన్ను గెలిపిస్తామని ఎందుకు అనలేదు? చంద్రబాబు కోసం పనిచేస్తున్న పవన్ పిచ్చోడు అయితే అవ్వొచ్చేమోగానీ.. ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రం పిచ్చోళ్లు కాదు. బాబు అసమర్థతవల్లే హక్కులు కోల్పోయాం.. ► కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. ► బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఏపీకి, సాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించింది. కానీ, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందన్న సాకుతో తెలంగాణ దానిని అ«దీనంలోకి తీసుకుని తన వాటాకు మించి అధికంగా జలాలను వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తోంది. ► అలాగే.. నాగార్జునసాగర్ను కూడా తెలంగాణ సర్కార్ 2014లోనే పూర్తిగా అ«దీనంలోకి తీసుకుంది. ► కానీ, అప్పటి సీఎం బాబు ఇదంతా చూస్తూ మిన్నుకుండిపోయారు. తద్వారా సాగర్పై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టినట్లయింది. 2015 ఫిబ్రవరి 13న చంద్రబాబు హయాంలో సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయటానికి మన అధికారులను పంపితే.. తెలంగాణ అధికారులు అభ్యంతరం పెట్టారు. దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి చంద్రబాబు గవర్నర్ దగ్గర మొరపెట్టుకుని.. తెలంగాణ సర్కార్ దయాదాక్షిణ్యాలతో నీరు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన నీటిని మనం విడుదల చేసుకోవాలంటే తెలంగాణ సర్కార్ అనుమతి అవసరమా? -
ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని కోరాం: పేర్ని నాని
-
దొరికిపోయిన గజదొంగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తెహల్కా ఎప్పుడో చెప్పింది చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు షోకాజ్పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈ–మెయిల్ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది. చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. లోకేశ్ పాత్ర కూడా.. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? 2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు. ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్కుమార్రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లుగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి నిష్క్రమిస్తారు. -
యాక్ తూ..వాడు జర్నలిస్టా
-
పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్
-
గన్ షాట్ : ఎల్లో బ్యాచ్ అబద్దాల కూత
-
శతమానం భారతి... విద్యారంగం-లక్ష్యం 2047
డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధినే సాధించింది. రాధాకృష్ణ కమిషన్ , మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, జాతీయ విద్యా విధానం – 1968, నూతన విద్యా విధానం–1986, స్వర్ణ సింగ్ కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్పాల్, జనార్దన్ కమిటీల సిఫారసులను అనుసరించి అనేక సంస్కణలను చేపట్టింది. ఫలితంగా 1951లో 18 శాతంగా ఉన్న అక్షరాస్యత 75 ఏళ్లలో 74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ‘2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య’ అనే ఐక్యరాజ్య సమితి లక్ష్యం వైపు దేశం ముందుకు సాగుతోంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు భారత ప్రభుత్వం బదలాయించింది. 45వ అధికరణలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నూతన విద్యా విధానం–1986లో భాగంగా పాఠశాల స్థాయి విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పెంపొందించేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదలకు ఆ వ్యవస్థ నాంది పలికింది. ‘యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2019–20’ గణాంకాల ప్రకారం, ప్రాథమిక విద్యలో సగటు విద్యార్థి నమోదు నిష్పత్తి 97.8శాతం గా ఉంది. వచ్చే 25 ఏళ్లలో విద్యారంగంలో మరింత మెరుగైన çఫలితాలను సాధించే దిశగా భారత్ కృషి చేస్తోంది. (చదవండి: దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా హస్తగతం!) -
తగ్గేదేలే.. దూకుడు పెంచిన సీఎం వైఎస్ జగన్
-
‘కూ’త పెట్టారా?
మెసేజ్లు టైప్ చేయడం విసుగనిపిస్తోందా.. వేరే రాష్ట్రాల్లోని స్నేహితులకు వాళ్ల భాషలోనే సందేశాలు పంపాలనుకుంటున్నారా.. బంధువులతో లైవ్ వీడియోలు పంచుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు కూత పెట్టాల్సిందేనంటున్నారు ‘కూ’ సీఈవో అప్రమేయ రాధాకృష్ణన్. తొలి దేశీ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘కూ’ విశేషాలు, ప్రయాణం, భవిష్యత్ గురించి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. అలా మొదలైంది: నేను, మయాంక్ బిడ్వటకా గతంలో ‘వోకల్’ పేరుతో ఓ అప్లికేషన్ను అభివృద్ధి చేశాం. అది కూడా స్థానిక భాషలే కేంద్రంగా పనిచేస్తుంది. ఏ అంశంపైన అయినా అడిగే ప్రశ్నలకు నిపుణుల నుంచి సమాధానాలు లభిస్తాయి. వోకల్ను అభివృద్ధి చేసే క్రమంలోనే స్థానిక భాషల్లో మైక్రో బ్లాగింగ్ అప్లికేషన్ అవసరాన్ని గుర్తించాం. 2019 నవంబర్లో మొదలుపెట్టగా 2020 మార్చికల్లా ‘కూ’ సిద్ధమైంది. మైసూరు సమీపంలోని మండ్యలో కన్నడ భాషతో ‘కూ’ మొదలైంది. 22 భాషల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు గతేడాది డిసెంబర్ నాటికే దేశంలో ‘కూ’ వాడే వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రస్తుతం 2.5 కోట్ల వరకూ ఉంది. 5 వేల మంది సెలబ్రిటీలూ వాడుతున్నారు. ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలి, మరాఠీ, అసమీస్ వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. కేంద్రం గుర్తించిన 22 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏంటీ ‘కూ’ ప్రత్యేకతలు?: భారతీయ భాషల్లోనే సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ‘వాయిస్ టు టైప్’ కూడా ఉంటుంది. మీ మాతృ భాషలో మాట్లాడితే ఆ మాటలు అక్షరాల్లా టైప్ అవుతాయి. ఒక భాషలోని సందేశాన్ని మిగిలిన 9 భాషల్లోకీ తర్జుమా చేయవచ్చు. బంధు మిత్రులతో లైవ్ వీడియో చేయడం, చాట్రూమ్ ఏర్పాటు చేసుకోవడం మిగిలిన ప్రత్యేకతలు. -
దేశమే ఆయన కార్యక్షేత్రం
వైజ్ఞానికరంగంలో ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ రాధాకృష్ణ (ఆర్కే) 80 ఏళ్ళ వయసులో జనవరి 21న హైదరాబాదులో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఉత్తీర్ణులైన తొలితరం విద్యార్థుల్లో ఆయన ఒకరు. బీఏఆర్సీ (బార్క్)లో పరిశోధనలు చేస్తున్న క్రమంలో 1970కి ముందే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు. కశ్మీర్, శ్రీనగర్, చండీగఢ్లలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లలో ప్రొఫెసర్గా పనిచేసారు. అలహాబాద్ ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి 20 మంది దాకా నోబెల్ బహుమతి గ్రహీతలను ఆహ్వా నించి ‘సైన్సు సదస్సు’లను ఏడెని మిదేళ్ల పాటు నిర్వహించిన బృందంలో ఆర్కే కీలక పాత్ర వహించారు. ఆ నోబెల్ సైంటిస్టులు వారం రోజులపాటు క్యాంపస్ లోనే ఉండి ఉపన్యాసాలు, చర్చల్లో పాల్గొనే వారు. దేశ మంతటి నుంచీ సైన్సులో బోధన – పరిశోధనల పట్ల అసక్తి కల వెయ్యిమంది విద్యార్థులు, టీచర్లు ఆహ్వానితులుగా ఆ వారం రోజులూ అక్కడే ఉండే వీలు కల్పిం చిన విశిష్ట కార్యక్రమం అది. అందులో 200 మంది స్కూల్ ఫైనల్ స్థాయి విద్యార్థులూ ఉండే వారు. ఈ కార్యక్రమ ప్రధాన రూపకర్త ఆర్కే. ఆయన దేశభక్తి కేవలం నినాదప్రాయం కాదు. ప్రొఫెసర్గా ఎందరో విద్యార్థులను సైంటిస్టులుగా తయారుచేసి దేశానికి అందించిన ఆచరణశీలి ఆయన. సైన్సు విద్యను ప్రోత్సహించటానికి జీవితాన్ని అంకితం చేశారు. దశాబ్దాల క్రితమే ఎమ్ఐటీ (అమెరికా)లో ఆయన చేసిన కృషి ప్రశంసలందుకున్నది. 70 దేశాల ఉన్నత విద్యాలయాల్లో సైన్సు కార్యక్రమాల నిర్వహణలో పని చేసిన రాధాకృష్ణ ప్రధాన కార్య క్షేత్రం మాత్రం మన దేశమే. ఆయా దేశాల్లో 16 అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులు నిర్వహిం చినా, విదేశాల్లో పని చేయటానికి ఆయన ఇష్టపడలేదు. దేశంలోని ఎంటెక్, పిహెచ్డీ వంటి కోర్సులకు, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థలకు కావల్సిన పాఠ్యాంశాలను రూపొందించటం; రక్షణ శాఖలో, విద్యారంగంలో సాంకేతిక సలహా దారుగా పని చేయడం, విద్యా వాతావర ణాన్ని, శాస్త్రీయ çస్పృహను పెంపొందిం చడం వంటి ఎన్నో రకాలుగా దేశానికి విశిష్ట సేవలను అందించారు. – మరింగంటి శ్రీరామ, రిటైర్డ్ సీజీఎం, సింగరేణి ‘ 94922 05310 -
తగ్గిన ‘రాధేశ్యామ్’ వ్యూస్.. యూట్యూబ్ టీమ్ ఏమందంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటలీలో జరిగే పీరియాడికల్ ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.యూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర టీజర్ రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదలై మంచి రెస్పాన్స్ని అందుకుంది. అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డు క్రియేట్ చేసి దూసుకుపోతోంది ఈ టీజర్. అయితే ఈ విషయంలో అనుకోకుండా చిన్న సమస్య వచ్చింది. 63 మిలియన్గా ఉన్న వ్యూస్ ఒక్కసారిగా 62 మిలియన్లకి పడిపోయాయి. ఇది గమనించిన నెటిజన్లు ఎందుకిలా జరిగింది అంటూ యూట్యూబ్ టీమ్కి ట్విటర్లో మేసేజ్ పెట్టారు. అభిమానుల ట్వీట్లకి స్పందించిన ఆ టీమ్ కారణాన్ని తెలియజేసింది. ‘యూట్యూబ్ వ్యాలిడేట్ చేసే విధానం వల్ల వ్యూస్ అప్డేట్ చేయడంలో ఆలస్యం జరుగుతుంటుంది. ఒక్కోసారి తాత్కాలికంగా నెమ్మదించడం లేక వ్యూస్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంటుంది’ అని ఆ టీమ్ తెలిపింది. కాగా ‘రాధేశ్యామ్’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. చదవండి: నాకు అన్ని తెలుసు.. కానీ చెప్పను Thanks for reaching out – there may be a delay in the view count because of how YouTube validates views. Temporarily slowing down or even freezing a video's view count is expected, here are more details about why this happens and how it works: https://t.co/x3N7d5IYy2 — TeamYouTube (@TeamYouTube) October 27, 2021 -
‘రాధేశ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్.. కానీ కొంచెం వెరైటీగా..
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్స్టోరీగా వస్తున్న ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్లకు, మోషన్ పోస్టర్కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది మూవీ టీం. ‘విక్రమాదిత్య ఎవరు?’ తెలుసుకునేందుకు సిద్ధంగా కావాలని తెలిపారు. అయితే ఈ టీజర్ని కొంచెం వెరైటీగా ఇంగ్లీష్ ఆడియోతో విడుదల చేయనున్నారు. అయితే మల్టీ లాంగ్వేజెస్లో సబ్ టైటిల్స్ రానున్నాయి. అయితే యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా పలు భాషల్లో జనవరి 14న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ పోస్ట్కి #GlobalPrabhasDay అనే ట్యాగ్ని జత చేయడం విశేషం. చదవండి: ప్రభాస్కు విలన్గా రంగంలోకి బాలీవుడ్ నటుడు? Who is Vikramaditya? 🤔 Stay tuned to find out in the #RadheShyam teaser, out on 23rd October! ☺️💕 Enjoy the teaser in English with subtitles in multiple languages! #GlobalPrabhasDay Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/JmkiSZY40v — Radha Krishna Kumar (@director_radhaa) October 20, 2021 -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
‘సంస్కారానికి నిలువెత్తు రూపం’
బాలు నిర్వహించిన ఒక పాటల రియాలిటీ షోలో పాల్గొని మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. సంగీత ప్రపంచంలో స్థానం దక్కించుని, తన సంగీత దర్శకత్వంలో బాలు పాడే స్థాయికి ఎదగాలనుకున్నారు. తన కలను నెరవేర్చుకున్నారు. బాలుతో సుమారు 15 పాటలు పాడించుకున్నారు. బాలు నుంచి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. తన ఎదుగుదలకు పరోక్షంగా బాలు ప్రేరణ అయిన విధానం తలచుకుంటూ బాలు ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కె. ఎం. రాధాకృష్ణ బాలు పాటతో పెరిగాను.. నా ఐదవ ఏట నుంచే శాస్త్రీయం సంగీతం నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి లలిత సంగీతం పాడేవాడిని. అప్పట్లో ప్రతిరోజూ రేడియోలో సినిమా పాటలు వినేవాడిని. బాలుగారి పాటలు ట్రెండీగా, కమర్షియల్గా అనిపించేవి. అందరూ బాలు గారి గురించి మాట్లాడుకోవటం, బాలుగారిలా పాడాలి అనుకోవటం వింటూ పెరిగాను. అందరిలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. బాలుగారికి సన్నిహితులైన కొందరి ద్వారా ఆయనను స్వయంగా చూసే అదృష్టం కలిగింది. 1998లో ఒక ప్రముఖ టీవీ చానల్లో పాటలకు సంబంధించి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. మొదటి ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయిపోయాను. అలా మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అవ్వటం వల్ల నేను సంగీత దర్శకుడిగా మారాలనే కసి, పట్టుదల పెరిగాయి. సంగీత సాధన చేయటం ప్రారంభించాను. గాయకుడిగా కంటె, సంగీత దర్శకుడిగా స్థిరపడటం మంచిదని భావించి, దాని మీద దృష్టి పెట్టాను. ఉప్పొంగెలే గోదావరి... 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న పిల్లల కోసం తీసిన హీరో సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తొలి అడుగు పెట్టాను. అప్పటికే నేను చేసిన ఆల్బమ్స్ నా స్నేహితులు.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు వినిపించారు. ఆయనకు నచ్చటంతో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ చిత్రానికి స్వరపరిచే అవకాశం వచ్చింది. అందులో బాలు గారి చేత పాడించుకోలేకపోయాననే వెలితి నాలో ఉండిపోయింది. ఆ తరవాత ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ద్వారా ఆ వెలితి పోయింది. ఆయన ఆ పాట విని ఎంతో పరవశించారు. ఆయనతో పాడించుకోవటం వల్ల ఆ పాటకు ఎంతో అందం వచ్చింది. ఈ పాట బాలు గారు పాడితే ప్రపంచవ్యాప్తం అవుతుంది అనుకున్నాను. అదే జరిగింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్’ చిత్రంలో ‘సరోజ దళ నేత్రీ’ పాట వింటూనే బాలు గారు ‘ఈ పాట చాలా హాయిగా, అద్భుతంగా ఉంది. ఈ పాటను నేను మరింత అందం తీసుకురావటానికి ప్రయత్నిస్తాను’ అంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడారు. ఆ రాత్రి నాకు ఆనందంతో నిద్ర పట్టలేదు. అప్పుడు అనుకున్నాను, ఆ రోజు పోటీలో ఓడిపోవటం మంచిదైందని. ఆనాటి నుంచి ఈ రోజు వరకు సంగీతం మీదే నిలబడ్డాను. ఉదయం తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కష్టపడటం అలవాటైంది. విపరీతమైన అలసట, తిండి కూడా సరిగ్గా తినే సమయం దొరకనంత బిజీగా ఉన్నాను. ‘గోదావరి’ చిత్రం వల్ల చిత్ర పరిశ్రమలో నాకు గౌరవం మరింత పెరిగింది. నిర్విరామంగా, నిరంతరం కష్టపడ్డాను, పడుతూనే ఉన్నాను. ఆయనది బేస్ వాయిస్... బాలుగారిది చాలా బేస్ వాయిస్. అందువల్ల ఏ పాటనైనా సులువుగా పాడేయగలుగుతారు. ఆయన నలభై ఏభై వేల పాటలు పాడటం పూర్తిగా దైవకృప. ఆయన ఒక నిరంతర సైనికుడిలా పాడుతూనే ఉన్నారు. ఆయనను చూసి.. ‘నేను కూడా బాలుగారిలాగ పాడాలి, హెలికాప్టర్లో తిరగాలి, ఆకాశవాణి, దూరదర్శన్లలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి’ అని కలలు కనేవాడిని. నా కలలు వాస్తవం అయ్యాయి. బాలు, శంకర్ మహదేవన్, హరిహరన్, శ్రేయోఘోషల్, ఆషాభోంశ్లే వంటి వారితో పాడించే స్థాయికి ఎదగటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో చనువుగా అనేవారు... నేను స్వరపరచిన కొన్ని పాటలు విని,‘నాతో ఎందుకు పాడించలేదు’ అని చనువుగా నన్ను కోప్పడేవారు. పాటలో ఉన్న జీవాన్ని తన గొంతులో పలికించేవారు. బాలు నిరంతర శ్రమజీవి. ఆయనకు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. సహనంగా ఎన్నిటినో తట్టుకోవటం వల్లే ఈ స్థాయికి ఎదిగారు. బాలుకి ఎంతోమంది ప్రత్యామ్నాయంగా ఉన్నా, ఆయనది ‘యంగ్ వాయిస్’ కావటం వల్ల అందరూ ఆయననే కోరుకున్నారు. యువతరంలోకి కూడా పరకాయ ప్రవేశం చేసి, వాళ్ల గొంతులో దూరి ఈయన పాడటం వల్ల పాటలు బాగా హిట్ అయ్యాయి. నేను ఒక పాట ట్రాక్ రికార్డు చేసి, బాలుగారికి పంపి, ‘సర్! నాకు యంగ్ వాయిస్లో కావాలి’ అన్నాను. ఆయన తన గొంతుని కంట్రోల్ చేస్తూ, యంగ్ హీరోలాగే పాడారు. డబ్బింగ్ అనుభవం, టైమింగ్ తెలిసి ఉండటం వల్ల ఆయన ఎవరికి పాడితే వారు పాడినట్లే అనిపించేది. అలా ఆయన తన గొంతును మార్చేవారు. మంద్ర స్థాయిలో పాడటం బాలు చేసిన మంచి పని. చాలామందికి నమ్మకాన్ని, స్ఫూర్తిని ఇచ్చారు. బాలుగారి నిరంతర శ్రమ వల్ల ఎంతోమంది పైకి వచ్చారు. నమ్మకాన్ని పెంచింది... నాకు శాస్త్రీయ సంగీతం రాదని చెబితే, బాలుగారు, ‘శాస్త్రీయంగా పాడుతున్నావు, సంగీతం రాదంటే ఎవరు నమ్ముతారు’ అన్నారు. ఆ తరవాత నుంచి శాస్త్రీయ సంగీతం బాగా సాధన చేశాను. ఆ సంగీత సాధనే నాకు మనోబలాన్ని ఇచ్చింది. నా పాటలు విన్న బాలుగారు, ‘కమర్షియల్గా చేయకపోయినా పరవాలేదు, శాస్త్రీయంగానే చేయాలిరా’ అన్నారు. చాలా వేదికల మీద నా పేరు ప్రస్తావించేవారు. ఏ షోలో ఎవరు నా పాట పాడినా, నన్ను బాగా ప్రశంసించేవారు. వెంటనే నాకు మెసేజ్ కూడా పంపేవారు. అదీ ఆయన సంస్కారం. కె. ఎం. రాధాకృష్ణ, సంగీత దర్శకులు సంపూర్ణ సుగుణాల కలబోత 1996లో ఒక రియాలిటీ షోలో పాల్గొన్న కార్యక్రమం ద్వారా బాలుగారితో 60 వారాల పాటు ప్రయాణం చేశాను. కేవలం బాలుగారిని చూడటానికే ఆ రియాలిటీ షోలో పాల్గొన్నాను. ఆ తరవాత నుంచి ఆ రియాలిటీ షోలో సెలక్షన్స్ ప్రక్రియను నాకే అప్పచెప్పారు. ఒక షోలో గెలుపొంది, ఆ షో సెలక్షన్స్తో పాటు, అదే కార్యక్రమానికి జడ్జిగా కూడా రావటం కేవలం బాలుగారి వల్లే జరిగింది. అలా ఆయనతో ప్రారంభమైన ప్రయాణం బాలుగారి తుది శ్వాస వరకు కొనసాగింది. ఆయన నన్ను ‘కొడుకు’ అనేవారు. నాకు ఆయన పితృ సమానులు. నన్ను బాలుగారే స్వయంగా ప్రముఖ దర్శకులు బాపు గారికి పరిచయం చేశారు. నన్ను మొట్టమొదటగా అమెరికాకు తీసుకు వెళ్లింది కూడా బాలు గారే. 2001లో నా స్టూడియోని బాలు గారే ప్రారంభించారు. నా స్టూడియోలోనే సుమారు నాలుగు వేల పాటలు పాడారు. అది నా అదృష్టం. ఆయన ప్రేమను పంచే మనిషి. చాలా ఆల్బమ్స్లో బాలుగారితో పాడించుకున్నాను. ఆయన రూపొందించిన ఒక కార్యక్రమంలో నేను సుమారు 80 పాటలు పాడాను. దేనికీ ఒక్క పైసా పుచ్చుకోలేదు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆయన నన్ను పొగిడారు. అప్పుడు నేను ఆయనతో, ‘‘మీరు మాకు పాడే అవకాశం ఇస్తే అది మాకు అవకాశం దొరికినట్లు, అదే మేం మీతో పాడించుకుంటే అది మా అదృష్టం’’ అని చెప్పాను. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘స్వరాభిషేకం’ చిత్రంలోని ‘కుడి కన్ను అదిరెనే’ పాటను నేనే స్వరపరిచాను. చిత్రంలో టైటిల్స్లో నా పేరు రాదు. కాని బాలు గారు ప్రపంచానికి ఈ విషయాన్ని పదేపదే చెప్పటం వల్లే నేను ఆ పాట చేశాననే విషయం అందరికీ తెలిసింది. తండ్రిలా ఉండేవారు... నాకు బాగా ఊబ కాయం రావటంతో, ఆయనే దగ్గరుండి నాకు బేరియాటిక్ సర్జరీ చేయించారు. ఆయనకు నా మీద ఉన్న పుత్రవాత్సల్యంతో చేసినందుకు నాకు ఆనందం అనిపించింది. చిన్న పిల్లలతో తూము నరసింహదాసు కీర్తనలు పాడించాను. అందులో ప్రతి ఎపిసోడ్కి ఆయన ముందు మాట చెప్పారు. నేను నిర్వహించిన ‘భాగవతం పద్యాలు’ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఏ కార్యక్రమానికీ నా దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. అంతటి మహానుభావుడు. ప్రతి దశలోనూ అడుగడుగునా చెయ్యి పట్టుకుని నడిపించిన పెద్ద మనిషి. నేను ఆయనను వ్యక్తిగతంగా పోగొట్టుకున్నాను. ‘‘నేను పార్థు అడిగితే ఏదీ కాదనలేను’’ అనేవారు. ఆయనకు నేను చేసే కార్యక్రమాలంటే అంత ఇష్టం. మానవత్వానికి నిలువెత్తు రూపం.. బాలుగారు తుది శ్వాస విడిచాక, సెప్టెంబరు 25వ తేదీ చెన్నై వెళ్లాను. నేను గోపిక పూర్ణిమ.. ఇద్దరం కలిసి ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.30 వరకు పాటలు పాడాం. ‘ఉరై రారా! నాతో గడుపు’ అన్నట్లుగా అనిపించింది. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చారు. ఆయనకు నా పాటలు ఏవి నచ్చినా, కళ్లతో ఆనందం వ్యక్తం చేసేవారు. భుజం మీద చెయ్యి వేసి తట్టేవారు. సంపూర్ణమైన మానవత్వానికి ప్రతీక. ఆయనను అతి దగ్గరగా చూసినవారిలో నేనూ ఒకడిని. ఆయనతో నేను ‘‘మీ వ్యక్తిత్వం నేర్చుకుంటే వస్తుంది, కాని మీ విద్య, ప్రతిభ నేర్చుకుంటే వచ్చేది కాదు’’ అనేవాడిని. అందరి గురించి అడిగేవారు.. ఆయన స్టూడియోకి వస్తూనే ఆఫీస్ బాయ్స్ క్షేమసమాచారాలు స్వయంగా అడిగి తెలుసుకునేవారు. ‘ఆయన గొప్ప కళాకారుడు’ అని చెప్పడానికి పార్థసారథి అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటారు. మనిషిని గౌరవించటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన గురించి ఎన్నని చెప్పగలను. ఎన్నో గుప్తదానాలు చేశారు. ఎవరో తెలిసినవారు ఆసుపత్రిలో ఉంటే, నా ద్వారా డబ్బు పంపారు. ‘మానవత్వం, మంచితనం, సమాజసేవ, కళాకారుడు, వ్యక్తిత్వం... ఇన్ని సుగుణాలు ఉన్న ఇంత గొప్ప వ్యక్తి ఇక మీదట రాడు. తన లోని లోపాలను గుర్తించి, తానే స్వయంగా సరిచేసుకునేవారు ఒక్కరు కూడా లేరు. గొప్ప సంగీత దర్శకుడైనా సరే, ఊరుపేరు లేని సంగీత దర్శకులైనా సరే ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పాడేవారు. అనుకున్న సమయానికి రికార్డింగుకి వస్తారు. ఏదైనా కారణం చేత ఆలస్యమైతే, క్షమాపణ అడుగుతారు. సంపూర్ణమైన సుగుణాల కలబోత బాలు. - డా. పురాణపండ వైజయంతి చదవండి: సోషల్ హల్చల్: క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన -
‘కూ’ కోటి యూజర్ల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయిన ‘కూ’ యూజర్ల సంఖ్య కోటి దాటింది. వచ్చే ఏడాది కాలంలో పది కోట్ల యూజర్ల మార్క్ను సాధించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. మార్కెట్ ఆఫర్ చేస్తున్న వృద్ధి అవకాశాల పరంగా చూస్తే తాము ఇంకా ఎంతో సాధించగలమన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో 2 శాతం లోపే తమ భావాలను మైక్రోబ్లాగింగ్ వేదికలపై వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘మైక్రోబ్లాగింగ్ ద్వారా తమ గళాన్ని దేశంలో ఎవరికైనా చేరువ చేయవచ్చు. 98 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులకు దీనిపై అవగాహన లేదు’’ అని రాధాకృష్ణ చెప్పారు. ఈ మార్కెట్పైనే కూ దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ‘కూ’ (ట్విట్టర్ మాదిరి) ఆరంభమైన 15–16 నెలల్లోనే కోటి యూజర్ల మార్క్ను సాధించగా.. అందులోనూ 85 లక్షల డౌన్లోడ్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే నమోదు కావడాన్ని గమనించాలి. ‘ప్రస్తుతం కోటిగా ఉన్న డౌన్లోడ్లు ఏడాది కాలంలో 10 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే కొన్నేళ్లలో 50 కోట్ల మార్క్ను చేరుకుంటాం’ అని రాధాకృష్ణ వివరించారు. -
పని కట్టుకుని ఇన్ని అబద్ధాలా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏబీఎన్ రాధాకృష్ణ విషం కక్కుతున్నాడని, ఇది మరీ పరాకాష్టకు చేరిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. మీడియా అంటే విశ్వసనీయత ఉండాలని, అది కోల్పోయిన పత్రిక ఆంధ్రజ్యోతి అని మండిపడ్డారు. ఇలాంటి వెకిలి రాతలతో వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ‘‘పనిగట్టుకుని ఇన్ని అబద్ధాలా? అసలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా ఇలాంటి రాతలు రాస్తారా? మీలో మానవత్వం ఉందా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనని మాటల్ని పనిగట్టుకుని రాయటం, ఇలా విష ప్రచారానికి దిగటం సిగ్గుచేటు’’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు విదిల్చే బిచ్చం కోసం రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నాడన్నారు. ఇలాంటి రాతలపై పరువునష్టం దావా వేస్తామని, ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా కేసులు వేసి బోనులో నిలబెడతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు మీదా వెకిలి వ్యాఖ్యలు చేసిన వెకిలిగాళ్లు చంద్రబాబు, రాధాకృష్ణ అని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీలో షరతులతో ఓ మాజీ అధికారి చేరాడంటూ ఆంధ్రజ్యోతి రాసిన రాతలను ఖండించారు. ‘‘ఇలా షరతులతో పార్టీలో చేరిన ఒక్కరిని చూపించండి చాలు?’’ అంటూ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. జగన్ అందరిలోనూ దేవుణ్ణి చూస్తారు ‘వైఎస్ జగన్ ప్రతి వ్యక్తిలోను దేవుణ్ణి చూస్తారు. దేవుడి మీద భయం, భక్తి లేని నాస్తికులు చంద్రబాబు, రాధాకృష్ణ. దేవాలయాల్లో క్షుద్రపూజలు చేసిన చరిత్ర వాళ్లది. తాను అర్ధరాత్రి దేవుడితోను, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోను మాట్లాడతానని.. పార్టీలో చేరేందుకు వచ్చిన విశ్రాంత అధికారికి జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు ఆంధ్రజ్యోతి దిగజారుడు రాతలు రాయడం సిగ్గుచేటు. వైఎస్ జగన్తో మాట్లాడిన ఆ అధికారి ఎవరో బయటకు తీసుకురావాల్సిన బాధ్యత రాధాకృష్ణదే. దీనిపై ఎక్కడైనా... మేం చర్చకు సిద్ధం. ఎల్లో మూక పిచ్చిరాతలతో జగన్ మనో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని గుర్తుంచుకుంటే మంచిది. అయినా ఆ అధికారితో చర్చలు జరపాల్సిన పని ఏముంది? 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ తాను దేవుడితో మాట్లాడతానని జగన్ చెప్పలేదే. ఈయనకే చెప్పాడా? ఆంధ్రజ్యోతికి ఏమాత్రం విశ్వసనీయత లేదు. ఏబీఎన్ అంటే ఆల్ బోగస్ న్యూస్ చానెల్. చంద్రబాబు వేసే బిచ్చం కోసం ఈ స్థాయికి దిగజారటం సిగ్గుచేటు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు దుర్మార్గం. ఆయన రాక్షసుడు కాదు.. రక్షకుడు. పిచ్చిరాతలు రాస్తే సహించం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ పదేళ్లుగా విషపు వార్తలు రాస్తూనే ఉన్నాడు. సీఎం దగ్గరకు సభ్యతగా వెళ్తే దాన్నీ తప్పుగా చిత్రీకరించడం మర్యాదేనా? చంద్రబాబుకు ముఖ్య భద్రతాధికారిగా పనిచేసిన ఇక్బాల్ ఆయన పద్ధతి నచ్చకపోవడం వల్లే.. పదవీ విరమణ పొందాక షరతులు లేకుండా వైఎస్ జగన్ పార్టీలో చేరారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ప్రజలు గమనించాలి. మహా నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, రామోజీరావు.. ఆయన చనిపోతే ఇక తిరుగుండదని పండుగ చేసుకున్నారు. వైఎస్సార్ను మించిన మహావృక్షంలా జగన్ ఎదిగితే విషం కక్కుతున్నారు. కులం, వర్గం అంటూ రెచ్చగొడుతున్నారు. ఇలాంటి పిచ్చిరాతలు రాస్తే పరువు నష్టం దావా వేసి బోనులో నిలబెడతాం. ప్రజలు జగన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇన్నేళ్లుగా విషం కక్కి రాధాకృష్ణ సాధించిందేమిటి? విశ్వసనీయత పోగొట్టుకున్నాడే తప్ప జగన్ను ఏమీ చేయలేకపోయాడని గుర్తించాలి..’ అని మంత్రి నాని పేర్కొన్నారు. -
స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్రానికి, ట్విటర్ కి మధ్య టూల్ కిట్ విషయంలో ఘర్షణ జరుగుతున్న ఈ కీలక సమయంలో దేశీయ మైక్రో బ్లాగింగ్ "కూ" యాప్ సిరీస్ బి నిధుల కింద 30 మిలియన్లను సేకరించింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ పెట్టుబడి నిదుల కోసం ఈ రౌండ్ కి నాయకత్వం వహించింది. ప్రస్తుత పెట్టుబడిదారులు అక్సెల్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ మరియు డ్రీమ్ ఇంక్యుబేటర్ కూడా ఈ రౌండ్ లో పాల్గొన్నారు. దీంతో "కూ" యాప్ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగి 100 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్, మిరే ఎస్టేట్స్ ఈ రౌండ్తో క్యాప్ టేబుల్ పైకి వచ్చిన ఇతర కొత్త పెట్టుబడిదారులు. "కూ" యాప్ అనేది భారతీయ భాషలలో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉన్న ఒక మైక్రోబ్లాగింగ్ సైట్. ఇది కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 మిలియన్ల డౌన్లోడ్లను సంపాదించి ప్రతిరోజూ కమ్యూనిటీ పోస్ట్ చేసే కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ మరియు స్మృతి ఇరానీ వంటి అనేక మంది ప్రముఖులు ఇందులో ఉన్నారు. "కూ"ని టాక్సీ ఫర్ స్యూర్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, గతంలో మీడియా యాంట్ & గుడ్ బాక్స్ వంటి సంస్థలను స్థాపించిన మయాంక్ బిదావత్కా కలిసి స్థాపించారు. కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒకటిగా ఎదగడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు దగ్గరికి చేరుకోవాలని ఉత్సాహంగా ఉన్నామని. ఈ కలను సాకారం చేసుకోవడానికి టైగర్ గ్లోబల్ సరైన భాగస్వామి” అని అన్నారు. చదవండి: బంగారం ప్రియులకు భారీ షాక్ -
ఇండియన్ ట్విటర్ నుంచి చైనా ఔట్
న్యూఢిల్లీ: దేశీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ’కూ’ యాప్ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్వై తన వాటాలను విక్రయించి వైదొలిగే పనిలో ఉంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్కి పోటీగా తెరపైకి వచ్చిన ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ఈ విషయం తెలిపారు. కూ యాప్ మాతృసంస్థ బాంబినేట్ గతంలో తయారు చేసిన వోకల్ యాప్ కోసం షున్వై క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత బాంబినేట్ సంస్థ ప్రధానంగా ఇండియన్ ట్విటర్ "కూ" యాప్ పై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో షున్వై తప్పుకుంటోంది. ఆ సంస్థకున్న 9 శాతం వాటాలను దేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ‘2018లో ప్రశ్నోత్తరాల యాప్ వోకల్ను మేం ప్రారంభించినప్పడు.. కంటెంట్ రంగంలో ప్రముఖ ఇన్వెస్టరయిన చైన సంస్థ షున్వై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్లో పలు కంపెనీల్లో షున్వై ఇన్వెస్ట్ చేసిందని, బాంబినేట్ కూడా అందులో ఒకటని వివరించారు. అప్పట్లో ‘కూ’ ని రూపొందించలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కూ ప్రారంభించామని, పూర్తి దేశీ యాప్గా జాతీయ స్థాయిలో దీనికి ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదని రాధాకృష్ణ చెప్పారు. 3వన్4 క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బాంబినేట్ ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించింది. పూర్తి స్వదేశీ యాప్గా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కొత్తగా మరే చైనా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం లేదని రాధాకృష్ణ వివరించారు. తెలుగు, హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంటోంది. ఇటీవలే 30 లక్షల డౌన్లోడ్లు దాటగా, పది లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. చదవండి: ‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! -
కేసీఆర్ దృష్టికి తీసుకెళతా!
‘‘ప్రపంచ ప్రఖ్యాత నిర్మల్ బొమ్మల నేపథ్యంలో, అంతరించిపోతున్న హస్తకళలు, కళాకారుల గురించి కృష్ణకుమార్ తీసిన ‘రాధాకృష్ణ’ను అంతా ఆదరించాలి’’ అని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మాట్లాడుతూ–‘‘పూర్తిగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా ఇది. అందులోనూ నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీనుకెళ్తాను’’ అన్నారు. ‘‘శ్రీనివాస్రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో నాతో ఒక పాత్ర చేయించారు’’ అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బ్రతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు పుప్పాల సాగరిక కృష్ణకుమార్. ప్రసాద్ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు మాట్లాడారు. -
మంచి సందేశం ఉన్న చిత్రం రాధాకృష్ణ
‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాకుండా అంతరించిపోతున్న హస్తకళలను బతికించాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. నవరసాల సమ్మేళనం ఈ చిత్రం. అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో అనురాగ్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించారు. పుప్పాల సాగరిక, కృష్ణకుమార్ నిర్మించారు. ఫిబ్రవరి 5న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో.. ‘‘మమ్మల్ని నిర్మాతలుగా పరిచయం చేస్తున్న శ్రీనివాస్రెడ్డికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు పుప్పాల కృష్ణకుమార్. ‘‘దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది’’ అన్నారు టి.డి. ప్రసాద్ వర్మ. ఈ కార్యక్రమంలో అనురాగ్, కృష్ణభగవాన్ మాట్లాడారు. -
తంగేడు పువ్వు
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మించారు. టి.డి. ప్రసాద్వర్మ దర్శకత్వం వహించారు. యం.యం. శ్రీలేఖ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ‘తంగేడు పువ్వు...’ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిర్మల్ బొమ్మల నేపథ్యంలో లవ్స్టోరీని తెరకెక్కించారు ప్రసాద్వర్మ. హీరో అనురాగ్కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. చిత్రనిర్మాణ సారధి కృష్ణకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘కొట్టుకొట్టు..’ అనే సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘తంగేడు పువ్వు...’ పాటకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ఈ పాట రాసిన అనంత్ శ్రీరామ్కి, పాట పాడిన శ్రుతికి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు శ్రీనివాస్ రెడ్డి, యం.యం. శ్రీలేఖ, హీరో అనురాగ్, దర్శకుడు టి.డి. ప్రసాద్వర్మ, రాథోడ్ రాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డీ గ్లామరస్గా కనిపిస్తా!
శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘రాధాకృష్ణ’. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సోషియల్ డ్రామా ఇది. ఇందులో ‘పైసా వసూల్’ ఫేమ్ ముస్కాన్ సేథీ లీడ్ రోల్లో నటిస్తారు. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించనున్నారామె. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముస్కాన్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రకథ నిర్మల్ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊరి సంప్రదాయాలు, కట్టుబాట్లను మా సినిమాలో చూపించనున్నాం. మా బామ్మ పాత్ర ఆ ఊరి పెద్దలా కనిపిస్తారు. ఇందులో మేకప్ లేకుండా డీ–గ్లామరస్గా కనిపిస్తాను. పూర్తి స్థాయి పల్లెటూరి పాత్ర చేయడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం లంగా వోణీలో కనిపిస్తాను. సుమారు 30రోజుల పాటు నిర్మల్లో ఆ ఊరి విశేషాలన్నీ తెలుసుకున్నాను. కుండలు తయారు చేయడం, పెయింటింగ్ నేర్చుకున్నాను. నా పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. తెలంగాణ యాస సరిగ్గా పలకడం కోసం ఓ ట్యూటర్ను పెట్టుకున్నాను. నా డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి అనుకుంటున్నాను’’ అన్నారు. -
నిర్మల్ బొమ్మ నేపథ్యంలో...
‘‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా మా ‘రాధాకృష్ణ’ చిత్రం తెరకెక్కించాం’’ అని చిత్ర నిర్మాణసారథి పుప్పాల కృష్ణ కుమార్ అన్నారు. ప్రముఖ దర్శకులు శ్రీనివాసరెడ్డి సమర్పణ, స్క్రీ¯Œ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. హారిణి ఆరాధన క్రియేష¯Œ ్స, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక నిర్మించారు. పుప్పాల కృష్ణకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఎన్నో గొప్ప విశేషాల్లో నిర్మల్ బొమ్మ ప్రత్యేకమైనది. ఆదిలాబాద్ ఆటవీ ప్రాంతంలో లభించే పొనికి చెక్కతో ప్రాణం పోసుకునే నిర్మల్ బొమ్మ తయారీ పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కళాకారుల నం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో మా సినిమా రూపొందింది. మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సురేందర్ రెడ్డి. -
కిట్టన్నా నీ కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ కూడా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్ణయాలపై ఊహాజనిత వార్తలు, అసత్య కథనాలను రాస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా ? నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపు పైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా?' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. (చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు..) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల రూపు రేఖలు మార్చి నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పిల్లల్ని చదివించే ఏ తల్లి దండ్రులు ఆర్ధికగా ఇబ్బందులు పడకూడదని, అమ్మ ఒడి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులతో పాటు, నాడు–నేడుతో కార్పొరేట్ స్థాయి విద్యావసతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, బ్యాగ్, బూట్లు, సాక్స్, బెల్ట్ అందజేయాలని నిర్ణయించారు' అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నారు. (ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్ ఆంధ్రజ్యోతి) -
ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్ ఆంధ్రజ్యోతి
సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారంపై ఆంధ్రజ్యోతి అవలంభిస్తున్న తీరు, ప్రచురిస్తున్న కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఏంటి కిట్టు కేరాఫ్ ఆంధ్రజ్యోతి. రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తమరే చెప్తారా? బీజేపీకి మంచి పాలనా అనుభవం వుంది. మీ ఉచిత సలహాలు ఏల? కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అంతలా భయపడకు - నీ పార్ట్నర్ చంద్రబాబు కోసం తెరవెనుక ప్రయత్నాలు కొనసాగించు. ప్రధాని మనసులో ఏముందో తొంగి చూస్తావు. జగన్ గారి ఆలోచనేంటో ఆర్నెళ్ల ముందే పసిగట్టేస్తున్నావ్. వదిలేస్తే ట్రంప్, జిన్ పింగ్ సీక్రెట్స్నూ బయటపెట్టేస్తావ్. వెర్రి గొర్రెల్లా జనం నమ్మేస్తారనుకున్నావా? ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్ ఆంధ్రజ్యోతి. అప్పుడే ఎన్నికలంటూ ఎత్తుకున్నావేంటి?' అంటూ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు.. 'రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ కు 200 కోట్లు కేటాయించి, సిఎం జగన్ గారు రైతుల పట్ల తన అభిమానాన్ని మరో మారు చాటారు. మార్క్ ఫెడ్ దూకుడు పెంచడంతో కిలో పొగాకు ధర రూ.5 నుంచి 10 కి ఎగిసింది. ఇంకా పెరిగి రైతన్నల కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. హోం క్వారంటైన్లో ఉన్న కరోనా రోగులకు ప్రత్యేక కిట్లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో మందులు, మాస్కులు, గ్లవ్స్, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారిని పసిబిడ్డల్లా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తోంది. ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు' అంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. చదవండి: ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు.. -
ప్రభాస్ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమా అప్డేట్ ఏదీ? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో డార్లింగ్ను నిలదీస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పీరియాడికల్ లవ్స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణ అప్పట్లోనే ప్రకటించాడు. దీంతో ఉగాదికి సినిమా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూడగా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు యూవీ క్రియేషన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ను నిషేధించాలంటూ #BanUVCreationsను ట్రెండ్ చేశారు. యూవీ(UV) అంటే "అప్డేట్స్ ఉండవు" అని అర్థం అంటూ సెటైర్లు విసిరారు.(డార్లింగ్ ఈజ్ బ్యాక్) దీంతో స్పందించిన యూవీ క్రియేషన్స్ అప్డేట్స్ ఆలస్యమవుతున్నందుకు గల కారణాలను వివరించింది. ఈ మేరకు ట్విటర్లో.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా పనులన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిన తర్వాత మరెన్నో అప్డేట్స్ను పంచుకుంటామని పేర్కొంది. అప్పటివరకు అందరూ ఓపిక పట్టాలని కోరింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటూ తాము సురక్షితంగా ఉండటంతోపాటు దేశాన్ని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేసింది. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.(అల్లు అర్జున్, విజయ్ డైట్ తెలుసుకోవాలి: హృతిక్) -
ప్రభాస్ కొత్త సినిమా ‘జాన్’ కాదా?
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. హాలీవుడ్ హీరో రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ రెబల్ స్టార్కు ఏర్పడింది. అయితే ‘సాహో’తర్వాత ‘జిల్’ఫేం రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో, ఇటలీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. 'జాన్' అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. అయితే వర్కింగ్ టైటిల్నే సినిమా టైటిల్గా డిసైడ్ అయినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ను మార్చాలని చూస్తోందట చిత్రబృందం. ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన ఈ టైటిల్తో వెళితే సినీ అభిమానుల్లో అంత హైప్ క్రియేట్ అవదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచడానికి మరో డిఫరెంట్ టైటిల్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టిందట. ఇందుకోసం ప్రభాస్ అభిమానుల నుంచి కూడా సలహాలు తీసుకోనుందని సమాచారం. అయితే ప్రభాస్ కొత్త సినిమా పేరు ‘జాన్’ కాదని తెలియడంతో దిల్ రాజు తన సినిమా విషయంలో నిర్భయంగా ముందడుగేశాడు. తమిళ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘96’ను దిల్ రాజు తెలుగులో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభం నుంచి తన చిత్రానికి ‘జాను’అనే టైటిల్ను పెట్టాలని ఆలోచించాడట. కానీ ప్రభాస్ ‘జాన్’ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఈ అగ్ర నిర్మాత కాస్త తటపటాయించాడట. అందుకే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చిత్ర టైటిల్ను డిసైడ్ చేయలేకపోయాడు దిల్ రాజు. తాజాగా అతడికి అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణ టీం ఆ టైటిల్ను వదులుకున్నట్లు తెలియడంతో వెంటనే తన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ఫిక్స్ చేసి వెంటనే ఫస్ట్లుక్, టీజర్ను విడుదల చేసినట్లు సమాచారం. -
‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై లీగల్ చర్యలు’
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసమే సీఎం వైఎస్ జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరువేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని..ఇప్పుడు 61 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని తెలిపారు. ఇంగ్లీష్పై పట్టులేక ఎంతో మంది ఉద్యోగవకాశాలను కోల్పోతున్నారని, పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ఉంటుందన్నారు. మతం రంగు పూయడం దారుణం.. ఆంగ్ల బోధనపై మతపరమైన రంగు పూయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియానికి, మతానికి సంబంధం ఏమిటని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. ‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారు. వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు.. వారు మతం మారారా..? రెండు లక్షల మంది ఇంగ్లీష్ చదివి విదేశాలకు వెళ్ళారు.. వారు మతం మారారా..’ అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి గొప్ప మేలు చేస్తున్నారని.. కొంతమంది అది జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మతానికి ముడి పెట్టే వారిని జాతి ఎప్పటికీ క్షమించదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకుంటామన్నారు. మతం పేరుతో చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకంతో పేదలను విద్యకు దగ్గర చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతి చానెల్, పత్రిక చూడను: ముద్రగడ
సాక్షి, తూర్పు గోదావరి : ఇసుక విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను ఇచ్చిన సలహాను ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అసహనం వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖ గురించిన వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి గనుక మీ ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని.. ఇకపై ఆంధ్రజ్యోతి చానెల్ను గానీ, పత్రికను గానీ చూడదలచుకోలేదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ లేఖ రాశారు. నేనేమీ మీలాగా అపర మేధావిని కాను.. ‘04-11-2019వ తేదీన ఇసుక విషయమై సలహా ఇస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసి పత్రికలకు విడుదల చేశాను. నేనేమి మీలాగ అపర మేధావిని కాను. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు పడుతున్న బాధలు చూసి ఇసుక పాలసీ పక్కాగా రూపొందించే వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయండి అని లేఖలో రాసాను. ఆంధ్రజ్యోతిలో ఆ వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాను. నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిన సలహాను రాష్ట్రంలోనే కాదు. దేశంలో ఉన్న గౌరవ మేధావులను తప్పు అని చెప్పమనండి బేషరతుగా క్షమాపణ చెబుతాను. నా సలహాను ఎందుకు పత్రికలో రాయకూడదని, రాయొద్దని హుకుం జారీ చేసారు. ప్రభుత్వాల వల్లన నష్టం జరిగినప్పుడు లొల్లి పెట్టడానికి ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా మీకు ఉన్నాయి. మీ స్వేచ్చకు సంకెళ్లు వేయకూడదు. మాలాంటి వారికి అలాంటివి జరిగినప్పుడు మా బాధను ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగదు. మీ చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం. దయచేసి ఇక నుండి నా వార్తలు మీ ప్రింటు, ఎలక్ట్రానిక్ చానెల్లో చూపకండి. ఇక నుంచి మీ చానెల్ గాని, మీ పత్రిక గాని చూడదల్చుకోలేదు’ అని ఏబీఎన్ రాధాకృష్ణకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. -
ట్రామ్లో ప్రేమ
ప్రభాస్ ట్రామ్ ఎక్కబోతున్నారు. పడవలాంటి కార్లు బోలెడన్ని ఉండగా పాత కాలం ట్రామ్ ఎక్కాల్సిన అవసరం ఏంటి? అయినా ఇప్పుడు హైదరాబాద్లో ట్రామ్లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ట్రామ్ రెడీ చేశారు. ఈ వాహనాన్ని తన తాజా చిత్రం ‘జాన్’లో ఉపయోగించనున్నారు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ లవ్స్టోరీ నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ చేస్తున్నారు కళా దర్శకుడు రవీందర్. ఈ సెట్లో భాగంగా ట్రామ్ని తయారు చేశారు. ఈ వాహనానికి సుమారు 50 లక్షల ఖర్చయిందని సమాచారం. ఇందులో ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. 1970లో ఇటలీ నుంచి బయలుదేరిన ఓ ట్రైన్లో ‘జాన్’ ప్రేమకథ సాగుతుందని తెలిసింది. -
డార్లింగ్కి శుభాకాంక్షలు
‘బాహుబలి’ సక్సెస్తో ‘ప్యాన్ ఇండియన్ స్టార్’గా మారిపోయారు ప్రభాస్. ఆ నెక్ట్స్ ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ మంచి వసూళ్లను రాబట్టగలిగింది. ‘సాహో’ వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రస్తుతం ఓ ప్రేమకథ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1970 నేపథ్యంలో పీరియాడికల్ లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటలీలో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ను ఈ నెలాఖరులో హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఓ భారీ సెట్ను తయారు చేస్తున్నారు. పీరియాడికల్ మూవీ కాబట్టి ఆ కాలాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కళాదర్శకడు రవీందర్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. బుధవారం ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా అప్డేట్ను అధికారికంగా ప్రకటించి, ప్రభాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇటీవల హాలిడేలో భాగంగా ప్రభాస్ ప్యారిస్ వెళ్లారు. ఆయన బర్త్డే వేడుకలు అక్కడే జరుగుతాయని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. దాదాపు నెల రోజులుగా ‘మా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ 23వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అభిమాన హీరోకి సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. -
‘రాధాకృష్ణకు జర్నలిజం విలువలు తెలియవు’
సాక్షి, అమరావతి : రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టారని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ నియమాకాలపై సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేశారని వెల్లడించారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు జర్నలిజం విలువలు తెలియవని విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తు పబ్బం గడుపుతున్నారని.. సీఎం వైఎస్ జగన్ పాలనపై విషం చిమ్మే ధోరణిలో రాధాకృష్ణ వెళ్తున్నారని మండిపడ్డారు. గ్రామ సచివాలయం పరీక్ష పేపర్ లీకైందని అసత్య ప్రచారం చేశారు.. అలాగే అధికారుల బదిలీలపై కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని తెలిపారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ఆధారాలతో రాయాలని.. కుట్రలతో కాదని హితవు పలికారు. -
ఆ పత్రికది విష ప్రచారం
సాక్షి, కడప(బనగానపల్లె) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమర్థ పాలనపై ఆంధ్రజ్యోతి పత్రిక విష ప్రచారం చేస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ కడుపు మంటతో ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పట్టణంలోని స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. పారదర్శక పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల నియామకంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించినది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని తప్పుడు కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని విమర్శించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని 150 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలోనూ పేదలు వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ప్రజాసంకల్ప యాత్ర లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల మేరకు నాయీ బ్రాహ్మణు లు, టైలర్లు, రజకులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రూ .10 వేలు ఆర్థికసాయం అందుతుందన్నారు. ఉగాది రోజున అర్హులైన 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. -
ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి
సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాకుండానే రికార్డు స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతుండటాన్ని చూసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కడుపు మండుతోందని వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు రాసిన ఆ పత్రిక యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సవ్యంగా ముగుస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయక నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిన బాబును వేనకేసుకొస్తూ.. ఇప్పుడు తప్పుడు ప్రచారంతో వారి ద్వారా ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆదివారం వారు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమి కొడతారు జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం వైఎస్జగన్ ద్వారా సాధ్యమవుతుంటే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో అక్రమాలు జరిగాయని ఆ పత్రిక తప్పుడు కథనాలు రాస్తే.. దాని ఆధారంగా చంద్రబాబు ఏపీ సీఎంకు బరితెగింపు లేఖ రాశారని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖ పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోటీ పరీక్షలు నిర్వహించే ఏపీపీఎస్సీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనితమ్మకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. తప్పుడు కథనాలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ను కోరారు. గత ఐదేళ్లలో బాబు బాగోతాల గురించి ఏనాడైనా ప్రశ్నించారా అని రాధాకృష్ణను నిలదీశారు. ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. తుపాన్ల పేరుతో సేకరించిన చరిత్ర రాధాకృష్ణదని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పేరును చంద్రజ్యోతిగా మార్చుకోవాలని హితవు పలికారు. అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి కోల్పోయిన చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, అందుకు ఆంధ్రజ్యోతి పత్రిక వంతపాడుతోందని అనంతపురం జిల్లా హిందూపురంలో మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేటలో విమర్శించారు. అక్రమాలు, లాబీయింగ్ ద్వారా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు లభించలేదన్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండాలనే నిబంధన ఎక్కడాలేదన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో పేపర్ లీకైందంటూ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పేపర్ లీకు ద్వారా ఉద్యోగం దక్కించుకుందని ప్రచారం చేస్తున్న బీసీ మహిళ అనిత భర్త ఎంతోమందికి ఉద్యోగాల కోసం పదేళ్ల నుంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రముఖ హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్లో ఒక వంటమనిషి రూ.కోటి గెల్చుకున్నారని గుర్తు చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు కడపలో డిమాండ్ చేశారు. రికార్డు స్థాయి ఉద్యోగాల భర్తీని జీర్ణించుకోలేకే.. రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని మాజీ సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణలు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ ఎక్కడ లీకయిందో రాధాకృష్ణ చెప్పాలని, అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలిసి రేపోమాపో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ దగ్గరకు వెళ్తామని చెప్పారు. ప్రచురించిన కథనాలను నిరూపించకలేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని పేదల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రాధాకృష్ణ అకృత్యాలపై దళితులు గొంతువిప్పాలి కులాల మధ్య చిచ్చుపెట్టే ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు గొంతు విప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్లో వార్తలు ప్రసారంచేసి దళితులను కించపరిచాయన్నారు. రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన విచారణకు ఆదేశించాలని కోరారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే దానిని వక్రీకరించి కథనాలు ఇవ్వడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకుంటారా? పత్రికను అడ్డం పెట్టుకొని భూ దందాలు, పంచాయితీలు చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వందల కోట్లు వెనకేసుకున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వచ్చిన ప్రకటనలు, అక్రమాలు, భూ దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకోవడమే ఆ పత్రిక దిన చర్య అని ధ్వజమెత్తారు. బాబు తప్ప మరొకరు సీఎంగా ఉండకూడదా.. అని ప్రశ్నించారు. ప్రస్తుత నియామకాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు అత్యధికంగా లబ్ధిపొందుతుంటే ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వేమూరి రాధాకృష్ణపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు తాడిపత్రి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసి, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిలో అలజడి సృష్టించేలా రాతలు రాసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
అందుకే ఆర్కే భరించలేకపోతున్నారు
సాక్షి, విశాఖపట్నం : ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో టాపర్గా బీసీ మహిళ నిలిచారని, ఇది కులపిచ్చి ఉన్న ఏబీఎన్ రాధాకృష్ణ భరించలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల్లో విప్లవాత్మక మార్పుకోసం ప్రయత్నిస్తుంటే.. ఏబీఎన్ రాధాకృష్ణ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్ పాలనలో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. బీసీలకు లక్ష, ఎస్సీలకు 64 వేలు, ఎస్టీలకు 10 వేల ఉద్యోగాలు దక్కాయి. ఏబీఎన్ రాధాకృష్ణ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో అధికారిక ప్రచారాల పేరుతో ఏబీఎన్ ఛానల్ కోట్లాది రూపాయలు దోపిడీ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్లలో వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు రాధాకృష్ణ అకృత్యాలపై గొంతు విప్పాలి. ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరమైన విచారణకు ఆదేశించాల’’ ని కోరారు. -
‘వైఎస్సార్సీపీ వెనుకడుగు వేయదు’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదని.. కుల మీడియా సృష్టించిన నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల మీడియాలో ఒక్క వారం రోజుల పాటు చంద్రబాబును చూపించకపోతే ఆయన ఉండరని వ్యాఖ్యానించారు. ఈ మీడియా యాజమాన్యాలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ప్రజలని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న వైఎస్సార్సీపీని మాత్రం కుల మీడియా తొక్కే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘రాధాకృష్ణ అసలు జర్నలిస్ట్ కాదు.. కొన్నేళ్ల క్రితం సాధారణ వ్యక్తిగా ఉన్న రాధాకృష్ణ ఇప్పుడు ఒక మీడియా సంస్థకు అధినేత ఎలా అయ్యాడు?. అందుకోసం ఆయన ఎన్నో చీకటి పనులు చేశారు. వైజాగ్లో ఏదో ఇంటి సమస్య వస్తే అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరికించే ప్రయత్నం చేశారు. నేను మాట్లాడినట్టు తప్పుడు ఆడియో సృష్టించారు. పైగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిచామని అబద్ధాలు చెప్తున్న రాధాకృష్ణకు.. అది పోలీసుల డ్యూటీ అని తెలియదా?. ఎదుటి వ్యక్తి మీద యుద్ధం ప్రకటించాక వైఎస్సార్సీపీ వెనుకడుగు వేయదు. ఆదివారం రోజున చంద్రబాబు, రాధాకృష్ణలకు చెందిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ సంభాషణలు చూస్తే రాధాకృష్ణ ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు. 2010-11లో రాధాకృష్ణ ఇన్వెస్టర్లను మోసం చేసినందుకు ఓ కేసు నమోదైంది. తనకు పెట్టుబడులు ఇచ్చి ఆదుకున్న ఇన్వెస్టర్లను రాధాకృష్ణ మోసం చేశారు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ అయితే ఆయన్ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు తన సొంత మామనే వాడు అని సంబోధిస్తున్నారు. ఈ వీడియో చూస్తే చంద్రబాబు, రాధాకృష్ణల సంబంధం ఎలాంటిదో అర్థమవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు ఎవరు కూడా చంద్రబాబును సహించరు. బురద కుంటలో ఉండాల్సిన వ్యక్తిని మీడియా సంస్థకు అధిపతిని చేస్తే ఎలా ఉంటుందో, ఒక దుర్మార్గున్ని సీఎం చేస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు. తోక పత్రిక, కుల పత్రిక ఏదో తప్పుడు వార్తలు సృష్టిస్తారు. వీళ్ల గుణం ఎంటో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రజ్యోతి సృష్టించిన ఫేక్ న్యూస్ను తెలుగు దొంగల పార్టీ నాయకులు వైరల్ చేస్తారు. రాధాకృష్ణ మీద ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసాం. మేము ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుల్లో కేవలం పది శాతం మాత్రమే పరిష్కారం అయ్యాయి. బీజేపీతో వైఎస్సార్సీపీకి ఎలాంటి పొత్తు లేద’ని తెలిపారు. -
ఎన్టీఆర్పై తీవ్ర అసభ్య పదజాలంతో బాబు తిట్ల దండకం
-
బాబూ.. నువ్వు, నీ బినామీలు జైలుకే..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పూర్తి అర్థమైందని, అందుకే వైఎస్సార్సీపీ నేతలపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు దోపిడీలకు సహకరించిన రాధాకృష్ణ కూడా బాబుతోపాటు జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని, ఏపీ ప్రజలను తాను కించపరిచినట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ విషప్రచారం చేస్తోందని, దీనిపై ఈసీకి, సీఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాత్రికేయ విలువలను తుంగలో తొక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్ను మూసివేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. మా పార్టీ అధ్యక్షుడి గురించి, ఏపీ ప్రజల గురించి కించపరుస్తూ మాట్లాడిన్నట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లోనే వచ్చింది. కుట్రపూరితంగా దీన్ని ప్రసారం చేశారు. నేను ఏ రోజూ అలా మాట్లాడను. ఆ వాయిస్లోని కొన్ని పదాలు నాకు తెలియవు. అస్ట్రేలియాలోని ఓ వ్యక్తి ద్వారా మాట్లాడించి నాకు అంటగట్టారు. ఆ విషయాన్ని ఫోరెనిక్స్ ల్యాబ్ నిర్థారిస్తుంది. ఆంధ్రజ్యోతి ఒక కులానికి కొమ్ముకాస్తున్న పత్రిక. రాధాకృష్ణ గతంలో కిరోసిన్, రేషన్ బియ్యం దొంగ. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే నాపై ప్రసారం చేసిన అంశాలను నిరూపించాలి. టీడీపీ ప్రయోజనాల కోసమే ఈ న్యూస్ ప్రసారం చేశారు. నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై దుష్ప్రచారం చేశారు. రేపు ఇంకొక వైఎస్సార్సీపీ నేతపైనా ఇలాగే చేస్తారు. రాధాకృష్ణ కుల పిచ్చి ఉన్న వ్యక్తి. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తి. టీడీపీకి అమ్ముడుపోయిన బాడుగ నేత రాధాకృష్ణ. చంద్రబాబుతో కలిసి ఆయన దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తాం. ఇక్కడ దుష్ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడి పోలీసులకు కూడా రాధాకృష్ణపై ఫిర్యాదు చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వైఎస్ జగ¯Œ పై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆంధ్రజ్యోతికి రూ.1,500 కోట్లు ‘‘చంద్రబాబు మాత్రమే కాదు.. గత ఐదేళ్లుగా దోపిడీకి సహకరించిన వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామి. చంద్రబాబుతోపాటు రాధాకృష్ణ లాంటి వ్యక్తులు జైలుకు వెళ్తారు. అధికారం చేజారుతుందని చంద్రబాబు రోజురోజుకీ అసహనానికి లోనవుతున్నాడు. అందుకే రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తే.. మరుసటి రోజే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికకు రూ.1,500 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చాయి. ఇదికాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరో రూ.1500 కోట్ల సెటిల్మెంట్లు రాధాకృష్ణ చేశాడు’’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. -
ఎల్లో లీల..జాతకాల మాయ..!
సాక్షి, అమరావతి : ‘ఆ’ పేపర్ నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది. ‘‘కష్టంగా ఉంది నాయుడుగారూ..’’ ‘‘పేపర్ నడపడానికేనా కష్టం. ఏమైనా పంపించమంటావా?’’ ‘‘పేపర్ని నడిపించడానికి కాదు, మిమ్మల్ని గెలిపించుకోడానికి కష్టంగా ఉంది. ఫీల్డు మీద మావాళ్లు చెబుతున్నారు కదా. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా ఉన్నారు. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా హామీలు ఇస్తున్నారు. జగన్ ఇస్తానన్నవి మీరూ ఇస్తాననడం దెబ్బ కొట్టేసింది. సీఎం అంటే ఎంత ధీమా ఉండాలి. అది మీలో లేదు. సీఎం అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మీలో లేదు. జగన్ సభకు ఎర్రటి ఎండల్లో కూడా జనం వస్తున్నారు. మీరు చలువ పందిళ్లు వేసి, స్ప్రయిట్ ఇస్తున్నా జనం రావడం లేదు.’’ ‘‘ఆ సంగతి నాకూ తెలుసు. నా సంగతి నాకు చెప్పకుండా నువ్వేం చేస్తావో అది చెప్పు అన్నాడు’’ చంద్రబాబు విసుగ్గా. ‘‘అలా విసుక్కుంటే ఎలా నాయుడుగారూ? ఇప్పటికే జనాన్ని విసుక్కుని శత్రువైపోయారు. నాయకుల్ని విసుక్కుని జగన్కి స్నేహితుల్ని చేసేశారు. ఇప్పుడు నన్నూ విసుక్కుంటున్నారు. నన్ను విసుక్కుంటే నేనెక్కడికీ పోయేది లేదు కానీ.. ఈరోజు మన పేపర్ చూశారా .. ‘చంద్రబాబుకి మళ్లీ రాజయోగం’ అని మీ జాతక చక్రం వేయించాను. ‘బాబుకు గురుబలం అధికం’ అని బిజుమళ్ల బిందు మాధవ సిద్ధాంతి చేత చెప్పించాను. మీ జాతకంలో 9వ స్థానంలో గురు శుక్రులు, దశమంలో రాహువు, 11వ స్థానంలో రవి బుధులు ఉన్న కారణంగా మీరు తప్ప ఈ రాష్ట్రానికి వేరే భాగ్యం లేదని జ్యోతిష పండితులు చెప్పినట్లుగా మా స్పెషల్ డెస్క్ చేత రాయించాను. గ్రహబలం ప్రకారం మీరు సీఎం అవడం ఖాయం అని జనం అనుకుని మీకే ఓటేస్తారు..’’ చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘సీఎం అవుతానని అనుకుని ఓటేయడం ఏంటి! సీఎం అవ్వాలని అనుకుని కదా ఓటెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అన్నాడు. ‘‘ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడించాలి నాయుడుగారూ. మీకోసం మా టీమ్ మొత్తం డే అండ్ నైటు కష్టపడుతున్నాం. ఒక పాత్రికేయ భీష్ముడి చేత మాట్లాడించాం. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి చేత మాట్లాడించాం. ఒక ఆర్థిక నిపుణుడి చేత మాట్లాడించాం. రోజుకొక లీడర్కి ఫీడింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. అయినా జనం కదలడం లేదు. ఇక లాభం లేదని పండితుల్ని పట్టుకొచ్చాం. ఏం చేసినా మిమ్మల్ని సీఎం చెయ్యడానికే నాయుడుగారూ..’’ ‘‘చాల్లేవయ్యా.. ‘నీదేమీ లేదు.. అంతా నాదే’ అనే కదా నాకు చెబుతున్నావ్. ఇంతకీ జగన్ గురించి మీ పండితులు ఏమన్నారో చెప్పు’’ అన్నాడు చంద్రబాబు. ‘‘మీకున్నట్లుగా జగన్కి గురుబలం లేదని రాయించాను నాయుడుగారూ..’’ ‘‘ఎందుకు! జగన్కి గురుబలం గ్రహబలం లేకపోయినా, జనం అనుగ్రహం ఉందని జనం అనుకోడానికా?! నాకు పనికొచ్చే ఐడియాలు వెయ్యమంటే.. జగన్కి పనికొచ్చే ఐడియాలు వేస్తావేంటయ్యా..’’ అన్నాడు చంద్రబాబు.. తలకొట్టుకుంటూ. – మాధవ్ -
అమరావతి సాక్షిగా మరో కుట్రకు ప్లాన్
-
సీఐసీలో లుకలుకలు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్ను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. దీనిపై ప్రధాన కమిషనర్ రాధాకృష్ణ మాథుర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఆచార్యులు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాథుర్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారులపై బ్యాంకుల తనిఖీ నివేదికలను బహిర్గతం చేయాలని అప్పటి కమిషనర్ శైలేష్ గాంధీ జారీచేసిన ఆదేశాల్ని రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సమాచార కమిషన్ చర్యల్ని కోర్టు సమర్థించి, ఆ సమాచారం వెల్లడించాలని ఆదేశించినా ఆర్బీఐ స్పందించలేదు. పదవి నుంచి దిగిపోయిన తరువాత శైలేష్ గాంధీ సామాన్యుడిగా ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఆయన అభ్యర్థనను కేంద్ర సమాచార కమిషన్ తిరస్కరించింది. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు తన వద్దకు రాగా, సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని శ్రీధర్ ఆచార్యులు ఆర్బీఐని ఆదేశించినట్లు తెలిసింది. అలిఖిత నియమం బేఖాతరు!: అప్పీలులో ఆర్బీఐ సంబంధిత అంశాలు ఉన్నప్పుడు ఆ అప్పీళ్లు వినే కమిషనర్కు పంపాలనే అలిఖిత నియమం ఉల్లంఘించారని శ్రీధర్ ఆచార్యుల నిర్ణయంపై మాథుర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీని వల్ల సదరు అప్పీళ్లు విచారించే కమిషనర్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని, కమిషనర్ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చేలా చేశారని మాథుర్ పేర్కొన్నట్లు తెలిసింది. సీఐసీ నిబంధనావళిలో అలాంటి అలిఖిత నియమం ఏదీ లేదని శ్రీధర్ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఆర్బీఐ చట్టానికి అనుగుణంగానే తాను ఆదేశాలు జారీచేసినట్లు శ్రీధర్ తెలిపారు. ఆ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలా? ‘2017 జూన్ నాటికి రూ. 9.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని భారతీయ బ్యాంకుల ద్వారా కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు. 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు పెడితే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7 వేల మంది ఘరానా ప్రముఖులు వారు. మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? చిన్నపాటి అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక రైతులు పొలాల్లోనే ప్రాణాలు వదిలేస్తుంటే, బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలని మనం ప్రమాణం చేశామా? భారత రాజ్యాంగంతో పాటు అంతరాత్మకు లోబడి తీర్పు చెప్పాను’ అని శ్రీధర్ ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. -
మరో ట్వీట్ పేల్చిన పవన్ కళ్యాణ్
-
పవన్.. ఆ వెధవలను పక్కనపెట్టేయ్!
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తల్లిపై వేసిన ఒట్టును పక్కనపెట్టి మరీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మళ్లీ స్పందించటం మొదలుపెట్టారు. పక్కదోవ పట్టిస్తున్న వెధవలను పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాలంటూ పవన్కు వర్మ సలహా ఇస్తున్నారు. ఇక పవన్ రవిప్రకాశ్పై ఓ వీడియో పోస్టుపై స్పందిస్తూ.. హే పవన్ కల్యాణ్ అది కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం వీడియో.. లక్షలసార్లు సర్క్యూలేట్ అయ్యింది. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవలను పక్కన పెట్టేయ్. వాళ్లు రాజు రవితేజ కంటే చాలా ప్రమాదకరం’ అంటూ మరో ట్వీట్ చేశారు. అతనికే(రవి ప్రకాశ్) కాదు.. ప్రతీ ఒక్కరికీ అది పాతదనే తెలుసు. దానిపై అతను వివరణ కూడా ఇచ్చాడు. నీ పక్కనున్న వారే అది ఎవరికీ తెలిదని నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిని పక్కనపెట్టు అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కాస్టింగ్ కౌచ్ బాధితులను, అప్పారావ్ లాంటి వాళ్ల దౌర్జన్యాలకు బలైన వారిని పవన్ వ్యభిచారుణులతో పోల్చటంపై ఆయన అభ్యంతరం చేస్తూ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా?’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇక నిన్నంతా రవిప్రకాశ్పై విరుచుకుపడ్డ పవన్.. ఈ రోజు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేయటం ప్రారంభించేశారు. Hey @PawanKalyan this is not new expose ...its 5 years old and u must be last to see this OLD video circulated million times ..please kick out the immidiate idiots who advised u to put it out..They are more dangerous to u than that idiot Raju Ravi teja of Pawanism https://t.co/JETIcaawhD — Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018 Not him , but everyone knows this 5 year old incident which he already explained ..only ur people are lying to u saying nobody knows ..keep them away — Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018 నమ్మలేని షాక్ కాస్టింగ్ కౌచ్ బాధితులని,వాకాడ అప్పారావ్ లాంటి మగాళ్ల దౌర్జన్యాలాలకి గురయిన అమ్మాయిలని,పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే, మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా? pic.twitter.com/Je9ArxIGcu — Ram Gopal Varma (@RGVzoomin) 21 April 2018 -
ఆంధ్రజ్యోతికి రూ. లక్ష జరిమానా
సాక్షి, అనంతపురం : తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన టీడీపీ నాయకుడు ఎల్.నారాయణచౌదరి, వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి వేసిన పరువునష్టం కేసులో బాధితునికి రూ.11 లక్షల పరిహారం చెల్లించాలని అనంతపురం జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రకాష్రెడ్డి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎస్కే నరేంద్రరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ‘పరిటాల పేరు ఉచ్ఛరించడానికి కూడా మీకు అర్హత లేదు’ అనే శీర్షికతో ‘కారుబాంబు కేసులో 27 మంది హత్యకు కారణమైన మీది ఎలాంటి చరిత్రో ప్రజలకు తెలుసు’ అని టీడీపీ నాయకులు ఎల్.నారాయణ చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రజ్యోతి దినపత్రిక 2001 ఫిబ్రవరి 28న వార్త ప్రచురించింది. దీనిపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి.. ఎల్.నారాయణచౌదరి పైన, ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపైన 2001లో జిల్లా కోర్టులో రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారు. 1998లో హైదరాబాద్లో కారుబాంబు ఘటన జరిగింది. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఆయన సోదరులు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కేసు నమోదు చేశారు. కేసు విచారించిన ప్రత్యేక కోర్టు 2000 జనవరి 12న వీరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ విషయం తెలిసి కూడా తన కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఎల్.నారాయణ చౌదరి మాట్లాడారని దావాలో ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం బాధితుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి ఎల్.నారాయణచౌదరి రూ.10 లక్షలు, ఆంధ్రజ్యోతి దినపత్రిక రూ.లక్ష చెల్లించాలని జిల్లా జడ్జి శశిధర్రెడ్డి తీర్పు చెప్పారు. అది కూడా 2001 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. -
వారి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో?
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్లో ప్రీమియర్ షో పడిపోనుంది. అయితే ఈ సినిమా స్పెషల్ షోకి రావాల్పిందిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
న్యాయవ్యవస్థలో మీడియా జోక్యం తగదు
నిర్బంధ ఉద్యోగ విరమణ వెనుక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రమేయం: రిటైర్డ్ జడ్జి ఎం.కృష్ణప్ప నెల్లూరు(లీగల్): న్యాయవ్యవస్థలో కొన్ని మీడియా సంస్థలు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయని, ఇది తగదని నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ (5వ అదనపు) జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించి పలువురి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని, బాధ్యతల నిర్వహణలో ప్రలోభాలకు తలొగ్గక నీతి, నిజాయితీలతో పనిచేశానని తెలిపారు. ఫలితంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన ఓ పరువునష్టం కేసులో అన్ని ఆధారాలు ఉండటంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చానన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ విషయం మనసులో పెట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాడన్నారు. తనపై గతంలో అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికల్లో వాటిని ప్రచురించి హైకోర్టు ద్వారా తనను సస్పెండ్ చేయించారని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు విచారణ జరిపి తనకు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. తనను నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించడం వెనుక రాధాకృష్ణతో పాటు కొన్ని శక్తులు పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో ఏ వేదికపైన అయినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్మున్న చానల్ అని చెప్పుకుంటున్న ఏబీఎన్ యజమాని దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. -
అద్వితీయ రాష్ట్రపతికి రాజమహేంద్రవరానుబంధం
చరిత్ర కెక్కని వాస్తవం రెండేళ్లు ఆర్ట్స్ కాలేజీలో తత్త్వశాస్త్రాన్ని బోధించిన సర్వేపల్లి రాజమహేంద్రవరం కల్చరల్: తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ ద్వితీయ రాష్ట్రపరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునికి రాజమహేంద్రవరంతో అనుబంధం ఉంది. అయితే ఆ విషయం చరిత్రపుటలకు ఎక్కలేదు. ఆయన 1917–1919 మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్సు కళాశాలలో ‘ఫిలాసఫీ’ (తత్త్వశాస్త్రాన్ని) బోధించారు. ఆ రోజుల్లో ఆర్ట్సు కళాశాల నేటి గూడ్సుషెడ్డుకు సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉండేది. రాధాకృష్ణన్ పండితుడు నేటి టి.నగరు ప్రాంతంలోని కొక్కొండవారి వీధిలో నెలకు రూ.15 అద్దెకు ఉండేవారు. అయితే ఆ విషయం సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంపై వెలువడిన గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. చివరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నిఘంటు నిర్మాణశాఖ, భాషాభివృద్ధిపీఠం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘20వ శతాబ్దపు తెలుగువెలుగులు’ గ్రంథంలో ప్రచురించిన రాధాకృష్ణన్పై వ్యాసంలో కూడా ఈ విషయాన్నిఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రాజమహేంద్రి జ్ఞాపకాలు ఆయనలో సదా పదిలంగా ఉండేవి. ఆ విషయం చరిత్ర పరిశోధకుడు, గ్రంథరచయిత యాతగిరి శ్రీరామనరసింహారావు తన స్వీయచరిత్ర‘నరసింహావలోకనం’లో ఇలా తెలియజేశారు. ‘1962లో గుర్గాంవ్లో అఖిల భారత సహకారశిక్షణా కళాశాలలో శిక్షణపొందుతున్న సమయంలో నా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరం ట్రెయినీలం రాష్ట్రపతి సర్వేపల్లిని కలుసుకునేటందుకు విజ్ఞాపన పత్రాన్ని పంపాం. వెంటనే రాష్ట్రపతి భవనం నుంచి ప్రత్యేక దూత ద్వారా మాకు అంగీకారం లభించింది. అది1962 సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం 4 గంటలు. సర్వేపల్లికి నాపేరు వైఎస్ నరసింహారావు అని తెలిపాను. ఊరు పేరు, ఇంటిపేరుతో సహాపూర్తిగా చెప్పమని ఆయన అడిగారు. ఊరు రాజమండ్రి, పూర్తిపేరు యాతగిరి శ్రీరామనరసింహారావు అన్నాను. మాది బ్రాహ్మణులలో మధ్వశాఖ అని వెంటనే గ్రహించిన ఆయన అరిపిరాల పాపారావు పంతులుగారు బాగున్నారా? అని అడిగారు. అరిపిరాలవారి ఇంట దక్షిణంవైపు వాటాలో నెలకు రూ. 15 అద్దెపై ఉండేవాడినని ఆయన తెలిపారు. ఆయనింకో ప్రశ్న వేశారు.. రాజమండ్రి మెయిన్రోడ్డు అంతే ఉందా? తరువాత ఆయన వేసిన మరోప్రశ్న– గోదావరిబ్రిడ్జి కింద ఏడో స్తంభం బలహీనమైనదని అనేవారు, ఇంకా అంటున్నారా? అని. నా చిన్నతనంలో అనేవారని బదులు చెప్పాను. మాకు కేటాయించిన 8 నిమిషాల సమయం 26 నిమిషాల వరకు కొనసాగింది’. స్మృతి చిహ్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజమహేంద్రవరంలో పనిచేసిన సుమారు 96 సంవత్సరాల తరువాత, నేటి ఆర్ట్సుకళాశాల ప్రాంగణంలో –2015లో ఆయన శిలా విగ్రహాన్ని నెలకొల్పారు. దానిపై ఈ వివరాలన్నీ పేర్కొనడం నగర ప్రేమికులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. -
రాధాకృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల అదుపులో బాబాయి, అబ్బాయి, మేనమామ వీరులపాడు : తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కక్షతో మెండెం రాధాకృష్ణ(35)ను గ్రామానికి చెందిన కామాల యాకోబు, అతని బాబాయి కామాల జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. హత్యకు పాల్పడిన ఇరువురితో పాటు వారికి ఆశ్రయమిచ్చిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావును అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన మెండెం రాధాకృష్ణ ఈ నెల 7న గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలోని ఆర్అండ్బీ రహదారి పక్కనున్న పంట బోదెలో శవమై కనిపించాడు. మృతుని తల్లి వెంకట్రావమ్మ తన కుమారుడిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందిగామ రూరల్ సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాధాకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతుని శరీరంపై గాయాలుండడమే కాక ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో మృతుని తల్లి ఇచ్చిన అనుమానితుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టగా యాకోబు, తన బాబాయి జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు తేలింది. నిందితులను విచారించగా తల్లితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కక్షతో తన బాబాయితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దొరికిపోయారు ఇలా.. ఈనెల 7న రాత్రి సమయంలో రాధాకృష్ణ మద్యం దుకా ణం సమీపంలో ఉండడాన్ని గమనించిన యాకోబు, జమలయ్యలు గొంతు నులమడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న పంట బోదెలో పడేసి ఇబ్రహీం పట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావు ఇంటికి నిందితులు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి విజయవాడ పరి సర ప్రాంతాల్లో ఉన్నారు. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో గురువారం ఉదయం 7 గంటల సమయంలో కంచికచర్ల బస్టాండ్కు చేరుకున్నారు. వీరు బస్టాం డ్ సమీపంలో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో సీఐ సత్యకిషోర్ సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. ఎస్ఐ అవినాష్, ట్రైనీ ఎస్ఐ ప్రియకుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
గడప గడపలో ఘనస్వాగతం
అట్టహాసంగా ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్ పలు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు ఇంటింటికీ పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన కరపత్రాల పంపిణీ ముదునూరులో సారథి, విజయవాడలో రాధాకృష్ణ లాంఛనంగా ప్రారంభం విజయవాడ : గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లగా జనం నుంచి ఘన స్వాగతం లభించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన విగ్రహాలకు నివాళి అర్పించి నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం ముదునూరులో, పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలోని భ్రమరాంబపురంలో, సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రికలో పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ సర్కారు అడ్డగోలు వ్యవహారాలతో అన్ని వర్గాల ప్రజలకూ నష్టం చేస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చుతోందని, దీనిని తమ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉండి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఊర్మిళా నగర్లో పార్టీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని ముదునూరులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు పేద ప్రజల భూములు లాక్కోవటమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు దందాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా పరిషత్ ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో పట్టణంలోని 17, 18 వార్డుల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి, పార్టీ నాయకులు పాల్లొన్నారు. పామర్రు నియోజకవర్గంలో పామర్రు మండలంలోని మల్లకూరు గ్రామంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కారక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్రులో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు 16వ వార్డులో పార్టీ సమన్వయకర్త సామినేని ఉదయభాను గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యక్రమం నిర్వహించారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలోని జూపూడి గ్రామంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నంలోని కరగ్రహారంలో ఉన్న ఫరీద్ బాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ సమన్వయకర్త పేర్ని నాని గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో పార్టీ సమన్వయకర్త్త మొండితోక జగన్మోహనరావు నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభించారు. కైకలూరులో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. పెడన పట్టణం ఏడో వార్డులో పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోని గొల్లనపల్లి గ్రామంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. -
బైక్ను ఢీకొన్న కారు--ఇద్దరి దుర్మరణం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం వద్ద బైక్ను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కొర్రపాడు గ్రామానికి చెందిన వడ్డి పెద్దన్న(46), రాధాకృష్ణ(40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై సమీపంలోని తోటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో వాహనం అదుపుతప్పి ఇద్దకూ కిందపడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆంధ్రజ్యోతి ఎండీపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుపై నిరాధారమైన వార్తలు ప్రచురిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సీఎం కేసీఆర్పై దుష్ర్పచారం చేస్తూ పనిగట్టుకొని ఇలాంటి వార్తలు రాస్తున్నారని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు. -
కృష్ణుడు కాదు.. రాధ..!
మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసేందుకు కాదు మూడుముళ్లు.వెనుకంజ వేసేందుకు కాదు... ఏడడుగులు. దాంపత్యంలో కలతలు వస్తుంటాయి... పోతుంటాయి.అర్ధం చేసుకుంటే ఏ స్పర్ధా సమస్య కాదు. నిజానికి సమస్యలు ఉన్నప్పుడే పరిష్కారాలు పుట్టుకొస్తాయి. పదిమందికీ అవి సమాధానాలవుతాయి. ప్రియాంక, రాధాకృష్ణ భార్యాభర్తలు. వారి పెళ్లయి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఒక్కసారి కూడా రాధాకృష్ణ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. శారీరకంగా కలవలేదు. పగలంతా బాగానే ఉండేవాడు కానీ, రాత్రి బెడ్రూమ్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడు. ప్రియాంక చీర కట్టుకునేవాడు, బొట్టుపెట్టుకునేవాడు. కాళ్లకు పట్టీలు పెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. ఆమెను మగవాడిలా తయారవమనేవాడు. భర్త పేరులో కృష్ణుడు లేడు. రాధ మాత్రమే ఉంది అని అర్థం చేసుకుంది ప్రియాంక. అంతా తన కర్మ అని సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని ఎవరితోటీ చెప్పలేదు. మనసులోనే ఉంచుకుని, తనలో తనే కుమిలిపోతుండేది. అయితే ఆమె అత్తమామలు మాత్రం పెళ్లయి, కాపురానికి వచ్చి నెల దాటినప్పటినుంచే ఆమె నెల తప్పడం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్లు. ప్రతి నెలా ఆమెకు నెలసరి రాగానే నిరుత్సాహ పడిపోయేవారు. ఆరు నెలలు గడిచేసరికి కోడలు గొడ్రాలేమోనని అనుమానపడి, సూటీపోటీ మాటలతో వేధించేవారు. తమ కుమారుడు ప్రయోజకుడే కాని, లోపమల్లా కోడలిలోనే ఉందని వారంతట వారే నిర్థారించుకుని, సంతానం కలగడం కోసం ప్రియాంక చేత రకరకాల నాటుమందులు, పసర్లు మింగించేవారు. ఆ మందులు మింగీ మింగీ ప్రియాంకకు జీవితం మీద విరక్తి పుట్టేది. ఇంతలో ఓ రోజు భర్త జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో బలవంతాన హాస్పిటల్కు తీసుకెళ్లింది. పరీక్షలలో అతను హెచ్.ఐ.వి. పాజిటివ్ అని తేలింది. అప్పటి వరకు ఉగ్గబట్టుకుని ఉన్న ప్రియాంక అసలు విషయాన్ని అప్పుడు బయట పెట్టింది. ప్రియాంక తలిదండ్రులు, సోదరులు కలిసి విషయాన్ని తెలియజేస్తూ కోర్టుకు వెళ్లారు. పెళ్లయి ఏడాది గడిచినా, శారీరకంగా కలయిక జరగడకపోవడం, పైగా భర్తకు ఎయిడ్స్ ఉందని నిర్థారణ కావడంతో ఫ్యామిలీ కోర్టు వెంటనే వారికి విడాకులు మంజూరు చేయడమే కాక, పెళ్లిలో కట్టకానుకలు, ఇతర లాంఛనాల కింద ప్రియాంక తలిదండ్రులు ఖర్చుపెట్టిన సొమ్మంతటినీ వడ్డీతో సహా అత్తమామల నుంచి తిరిగి ఇప్పించింది. జరిగినదంతా మర్చిపోయి, ప్రియాంక మళ్లీ పెళ్లి చేసుకుని, భర్తతో హాయిగా ఉంది. ఇప్పుడు ఆమెకు ఆరునెలల బాబు. ప్రశ్న - జవాబు:- నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. నా పై అధికారి ప్రవర్తన ఏమీ బాగుండట్లేదు. పనికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నా మెసేజ్లు వస్తున్నాయి. వారాంతంలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. ఈ మెసేజ్లు మా వారి కంటపడితే ఏమవుతుందో ఏమో అనే భయంతో ఫోన్ను ఆయన కంటపడకుండా దాస్తున్నాను. దీంతో ఆయన నన్ను తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఈ సమస్య మూలంగా మనశ్శాంతి కోల్పోయాను. ఆఫీస్కు వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది. స్నేహితులతో చెబితే, ఉద్యోగంలో ఇవన్నీ మామూలేనంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అతనికి బుద్ధి చెప్పేదెలా? - శ్రీజ, ఈమెయిల్ మీరు పనిచేసే ఆఫీసులో ఒక కౌన్సెలింగ్ బెంచ్ ఏర్పాటు చేసి ఉందా, లేదా ముందు తెలుసుకోండి. ఎందుకంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి కాకుండా ప్రతి కార్పొరేట్ కార్యాలయంలోనూ ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్కి ముగ్గురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారు. వారిలో ఒక మహిళా కౌన్సెలర్ (స్వచ్ఛంద సేవకురాలు), ఆఫీసుకు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి, మరొక మహిళా న్యాయవాది సభ్యులుగా ఉంటారు. వేధింపులకు గురయ్యే మహిళ ఆ బెంచ్కు ఫిర్యాదు చేస్తే వారు తగిన చర్యలు తీసుకొని, ఆ పై అధికారులకు విషయం తెలియజేసి మీకు న్యాయం జరిగేలా చూస్తారు. వేధింపులకు సంబంధించిన విషయాన్ని ఫిర్యాదు చేసినప్పుడు ఆ ప్రభావం పనిపై పడకూడదు. అంటే ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం, ట్రాన్స్ఫర్లు చేయడం.. వంటి ప్రతీకార చర్యలేవీ చోటుచేసుకోకూడదు. అంత రహస్యంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఒకవేళ అలాంటి బెంచ్ మీ ఆఫీసులో లేకపోతే ఆ పై అధికారులకు ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ విజ్ఞప్తి పంపండి. రాతపూర్వకంగానూ ఫిర్యాదు చేయవచ్చు. మరో విషయం.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయకుండా ఉండటం సరికాదు. అందుకే మీ కాపురంలో అనుమానం చోటుచేసుకుంటోంది. మొదటి మెసేజ్కే మీరు ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్టి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయండి. మా పెళ్లయి రెండున్నర సంవత్సరాలైంది. అయితే ఇంతవరకూ మేము శారీరకంగా ఒకటి కాలేకపోయాము. దగ్గరవుదామని నేను ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక వంకతో నన్ను దూరం పెడుతోంది. ఆమె మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇంకా ఈ దూరాన్ని భరించడం నా వల్ల కాదు. ఆమెకు విడాకులివ్వాలనుకుంటున్నాను. ఎలా ప్రొసీడవ్వాలి? సలహా ఇవ్వండి. - బి.కుమార్, ఆదోని భార్య లేదా భర్తతో శారీరక సంబంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉన్నట్లయితే, దానిని రుజువు చేయగలిగితే జీవిత భాగస్వామి నుంచి చట్టప్రకారం విడిపోవచ్చు. మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టడానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి ఆమెకు మీరంటే ఇష్టం లే కపోవడం... రెండు... ఆమెకు శారీరకపరమైన లోపం ఏమైనా ఉండటం. కొందరు స్త్రీలలో ఫ్రిజిడిటీ అంటే సంసార జీవితమంటే విముఖత ఉండవచ్చు. వీటిలో సరైన కారణమేంటో తెలుసుకోండి. జీవిత భాగస్వామితో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం కూడా క్రుయాలిటీ కిందికి వస్తుంది. కోర్టు దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. సంబంధిత ఆధారాలతో మీరు విడాకుల కోసం కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది. నాకు ఐదేళ్ల పాప ఉంది. మేము డైవోర్స్ తీసుకుని రెండేళ్లయింది. మా పాపను చూడటానికి ఆయన నెలకొకసారి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మా మధ్య అవగాహన ఏర్పడింది. మా తప్పు మేము తెలుసుకున్నాము. మేము తిరిగి కలిసి ఉందామను కుంటున్నాము. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు అనుమతి లేకుండా తిరిగి కలవటం సబబు కాదని మాకు తెలిసిన వాళ్లంటున్నారు. ఇది నిజమేనా? మేము ఏం చేయాలి? సలహా ఇవ్వండి. - పి. కవిత, కరీంనగర్ మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మీరు విన్నది నిజమే. ఒకసారి చట్టపరంగా విడిపోయారు కాబట్టి తిరిగి మీరు కలిసి ఉంటే అది సహజీవనం కింద వస్తుంది కానీ, చట్టబద్ధమైన బంధం కానేరదు. మీ పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తిరిగి మీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి వివాహాన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్న చట్టాన్ని అనుసరించి, మీరు ఈసారి రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు మీ బంధానికి ఒక అర్థం, పవిత్రత వస్తాయి. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఆయన నన్ను బాగానే చూసుకుంటారు. అయితే ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వింటాడు. ఇంటిలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా, ఏమి కావాలన్నా అమ్మనే సంప్రదిస్తాడు తప్పితే నన్ను అడగడు. అన్నం కూడా అమ్మ పెడితేనే తింటాడు. నేను ఇది భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు. -కె. రజని, భీమవరం అమ్మ మాట వినడం అనే ఆ ఒక్క లక్షణం తప్పించి మీ ఆయన మంచివాడే అని నువ్వే చెబుతున్నావు. కేవలం అమ్మ మాట లేదా భార్య మాట మాత్రమే వినాలి, అది తప్పించి వేరే వారి మాట వినకూడదు అని చట్టం ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా భార్యమాట వినని వారిని శిక్షించే హక్కు కూడా చట్టానికి లేదు. ఇది కేవలం మీ ఇద్దరి మధ్య అవగాహనపరమైన సమస్య. భవిష్యత్తులో నువ్వు కూడా అమ్మవి అవుతావు, నీ పిల్లలు నీ మాట వింటారు. అది తప్పు అని అప్పుడూ ఇప్పుడూ కూడా ఎవరూ చెప్పలేరు. అన్నింటికీ అమ్మ మాట వింటున్నాడు, అమ్మకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే బాధతోనో, అసహనంతోనో అతన్ని దూరం పెట్టవద్దు. ప్రేమతో నీ మాట వినేలా చేసుకో. లేనిపోని చికాకులతో కాపురాన్ని కోర్టు గుమ్మం దాకా తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు. సాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్స్: నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, అనురాధ, అడ్వకేట్, హైదరాబాద్ -
’జిల్ ’డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
వేసవిలో కలిసొచ్చే 'జిల్'
చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్ ............................................. కొన్ని సినిమాలకు కొన్ని బాక్సాఫీస్ సానుకూలతలు కలిసొస్తాయి. మాస్ మెచ్చే ఫార్ములా కథ... తక్కువ నిడివి సినిమా... చకచకా నడిచే కథనం... అక్కడక్కడా కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా చటుక్కున బండిని పట్టాల మీదకెక్కించే సంఘటనలున్న స్క్రిప్ట్... వీటన్నిటికీ తోడు కొత్తగా మొదలవుతున్న వేసవి సెలవుల సీజన్ కూడా కలిసొస్తే? గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'జిల్'కి కూడా అవన్నీ సమకూరాయి. గత ఏడాది వచ్చిన వాణిజ్య విజయం 'లౌక్యం'తో ఊపు మీదున్న గోపీచంద్, గతంలో ప్రభాస్తో 'మిర్చి' తీసిన నిర్మాతలు కలసి కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్తో చేసిన తాజా ప్రయత్నం ఇది. అన్ని సానుకూలతులున్నా... కథను బిగువుగా తెరపై నడిపించారా అన్నది చూద్దాం... కథ ఏమిటంటే... ముంబయ్లో ఒక మాఫియా డాన్ ఛోటా నాయక్ (నూతన పరిచయం - మోడల్ కబీర్). పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కిన అతను తప్పించుకుంటాడు. ఈ మాఫియా డాన్ తనను మోసం చేసి, వెయ్యి కోట్లు కొట్టేసిన మాజీ సహచరుడు రంగనాథం (బ్రహ్మాజీ) కోసం వెతుకుతుంటాడు. రంగనాథం హైదరాబాద్లో తలదాచుకొంటాడు. మరోపక్క హైదరాబాద్లోనే జై (గోపీచంద్) ఒక అగ్నిప్రమాద నివారక దళ అధికారి. స్వయానా ఫైర్ ఆఫీసరైన బాబాయ్ (చలపతిరావు), పిన్ని (ఐశ్వర్య) కుటుంబంతో అతనిది అందమైన అనుబంధం. అనుకోని పరిస్థితుల్లో ఒక టీనేజ్ అమ్మాయి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడిన హీరో, ఆమెతో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో రంగనాథాన్ని విలన్ అనుచరుల నుంచి హీరో కాపాడతాడు. దాంతో, విలన్కూ, హీరోకూ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తరువాత ఒక అగ్ని ప్రమాదంలో రంగనాథ్ మరణిస్తాడు. ఆ మరణించే క్రమంలో హీరోతో ఏదో చెబుతాడు. దాంతో విలన్ ఆ వెయ్యికోట్ల రహస్యం హీరోకే చెప్పాడని వెంటపడతాడు. అక్కడ నుంచి రెండు వర్గాల మధ్య జరిగే పిల్లీ ఎలక పోరాటం మిగతా సినిమా. ఎలా చేశారంటే... కథానాయకుడిగా గోపీచంద్ మునుపటి కన్నా మరింత స్లిమ్గా, కొత్త లుక్తో, ఉత్సాహంగా కనిపించారు. సన్నివేశాల్లోనే కాక, పాటలు, ఫైట్లలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. కథానాయిక రాశీ ఖన్నా కాస్తంత బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. పాత్ర తాలూకు చిలిపితనం దానికి తోడైంది. దాంతో, తెర మీద అందంగా మెరిశారు. విలన్గా పరిచయమైన కబీర్ మంచి ఒడ్డూ పొడుగు, గడ్డంతో బాగున్నారు. చలపతిరావు, ఐశ్వర్య, చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్ లాంటి వారు సరేసరి. ఈ సినిమాకు ప్రధాన బలం - కెమేరా పనితనం. కొంత డిజిటల్ కెమేరాతో, మరికొంత ఫిల్మ్తో చిత్రీకరించిన ఈ సినిమాలో శక్తి శరవణన్ ఛాయాగ్రహణ పనితనం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఫారిన్ లొకేషన్లలో పాటల నుంచి చిన్న అపార్ట్మెంట్ల మధ్యలో, శ్మశానంలో ఫైట్ల దాకా తెరపై కనువిందైన విజువల్స్ అలరిస్తాయి.పాటల విషయంలో జిబ్రాన్ నవతరం శైలిలోని అనుసరించినా, సినిమాలో వచ్చే రెండో పాట ఒక్కటే పాడుకోవడానికి వీలుగా అనిపిస్తుంది. అనల్ అరసు ఫైట్లు, ఎలా ఉందంటే... ఈ చిత్ర కథలో లోపాలూ చాలానే కనిపిస్తాయి. విలన్ అయిన మాఫియా డాన్కూ, అతను వెతుకుతున్న మాజీ అనుచరుడు రంగనాథం (బ్రహ్మాజీ)కూ మధ్య ఏం జరిగిందన్నది, అతనెలా వెయ్యికోట్లతో తిరుగుతున్నాడన్నది కథలో వివరంగా చూపరు. అలాగే, హైదరాబాద్లో రంగనాథంకు అందించే పాస్పోర్ట్, వగైరాల కథ గురించీ పెద్దగా వివరం లేదు. అవన్నీ ఒక్క సీన్లో, మూడు ముక్కల్లో డైలాగుల్లో తేల్చేశారు. ఆ రకంగా స్క్రిప్టులో మరింత చిక్కదనానికి ఉన్న అవకాశాన్ని తామే చేజేతులా వదులుకున్నారు. అలాగే, ఉన్నట్టుండి సినిమాలో కామెడీ తగ్గిందనే భావన కలగడం వల్లనో ఏమో పోసాని, అతని అనుచరుడు హీరో ఇంటికి వెళ్ళి వెతికే ఘట్టాన్ని బలవంతాన జొప్పించారు. దాని వల్ల సినిమా నిడివి పెరగడం, చకచకా వెళుతున్న కథ కాళ్ళకు అడ్డం పడడం తప్ప, ఆ సీన్ వల్ల వినోదం కానీ, సినిమాకొచ్చిన విశేష ప్రయోజనం కానీ లేదనే చెప్పాలి. హీరో కుటుంబంపై విలన్ దాడి, అతని మీద ప్రతీకారానికి హీరో చెలరేగడం దగ్గరే ప్రేక్షకులకు కూడా కొంత విలన్ మీద కోపం పెరుగుతుంది. లేదంటే, విలన్ తన వెయ్యి కోట్ల కోసం తానే కొట్లాడుతున్నాడు కదా, అందులో తప్పేముంది అనిపించే ప్రమాదం హెచ్చు. సినిమా కోసమని లాజిక్లతో పని లేకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని, ఎక్కడికక్కడ కథ ముందుకు నడవడానికి తగ్గట్లు కన్వీనియంట్ స్క్రీన్ప్లే రాసుకున్న సినిమా ఇది. కాసేపు ప్రేమ, ఇంకాసేపు విలనిజం, మరికాసేపు పగ - ప్రతీకరం లాంటి వాటిని తీసుకొని, దేని మీదా పూర్తి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. అలాంటి లోటుపాట్లు పక్కనపెడితే, తొలి చిత్ర దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ మంచి మార్కులే పడతాయి, కొన్నిచోట్ల ఆయన రాసుకున్న డైలాగులూ, 'హీరోతో ఫోన్లో మాట్లాడినవారినల్లా చంపేస్తా'నంటూ విలన్ వేసిన పీటముడి లాంటివి ప్రేక్షకులకు బాగుంటాయి. అయితే, అవన్నీ ఈ రెండు గంటల 20 నిమిషాల సినిమాను దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది చూడాలి. మీదకొచ్చి పడే కొత్త సినిమాల సత్తా ఏమిటన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా 'జిల్' అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించకుండా, సామాన్య యాక్షన్ చిత్ర ప్రేమికులు కాలక్షేపానికి నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయవచ్చు. మొదటే చెప్పుకున్న అది 'జిల్'కు ఉన్న బలం, సానుకూలత కూడా! - రెంటాల జయదేవ -
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
మెదక్టౌన్: చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించేందుకు ఆగస్టు 1నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా బ్యాంకు మెదక్-నిజామాబాద్ జిల్లాల జోనల్ మేనేజర్ రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైస్ మిల్లర్స్ గెస్ట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించడం జరిగిందన్నారు. రూ.2.51 లక్షల కోట్ల వ్యాపారంతో 28 రాష్ట్రాలతోపాటు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రాబ్యాంకు తన సేవలను అందిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 482 బ్రాంచ్లతో రూ.65కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. జోన్ పరిధిలోని వ్యవసాయానికి రూ.840 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.630 కోట్లు అందించినట్లు తెలిపారు. బ్యాంకు ఎల్లప్పుడు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రాబ్యాంకు తనవంతు సేవలందిస్తుందన్నారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు మేనేజర్లు మల్లికార్జున, రఘు ప్రసాద్, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీకి ఘన సన్మానం
ఒంగోలు క్రైమ్ : ఎస్పీ పి.ప్రమోద్కుమార్కు మంగళవారం రాత్రి పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీని దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి రాధాకృష్ణ పోలీసుల సేవలను కొనియాడారు. ఎస్పీ ప్రమోద్కుమార్ అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎస్పీని పూలమాలలతో ముంచెత్తారు. సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఎస్పీ చేపట్టిన కార్యక్రమాలను ఎవరూ మరచిపోలేరని ఏఎస్పీ రామానాయక్ కీర్తించారు. కార్యక్రమంలో ఫాస్ట్ట్రాక్ జడ్జితో పాటు పీటీసీ ప్రిన్సిపాల్ సమైజాన్రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త ఎస్పీ శ్రీకాంత్ జిల్లాకు బదిలీపై వస్తున్న ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్లోని ఏసీబీ జాయింట్ డెరైక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించిన సంగతి తెలిసిందే. జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్న శ్రీకాంత్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీకి గౌరవ వందనం ఎస్పీ పి.ప్రమోద్కుమార్కు మంగళవారం పోలీసులు ఘనంగా గౌరవ వందనం చేశారు. పోలీస్ విభాగాల్లోని అధికారులు, పోలీసులు ఉదయం 6 గంటలకే పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. బదిలీపై వెళుతున్న ఎస్పీకి లాంఛనంగా పోలీస్ పరేడ్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాల రథంపై ఎస్పీ దంపతులను క్వార్టర్స్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పోలీస్ బృందాలు దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ప్రమోద్కుమార్ పోలీస్ కవాతును పరిశీలించారు. అనంతరం గౌరవవందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామానాయక్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
'వెళ్లి బాబు కాళ్లు పట్టుకోండి'
-
'మంత్రుల కాళ్లు కాదు ... బాబు కాళ్లు పట్టుకోండి'
రాష్ట్ర విభజన వద్దని కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవడం కాదని, ముందు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడును శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంట్లో పగటి వేషాలు వేస్తున్నారని టీడీపీ నేతలను ఆమె ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబుకు సహాయం చేయాలనుకేంటే మంచిదే చేయండని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ సందర్భంగా హితవు పలికారు. చేతనైతే జగన్ను రాజకీయంగా ఎదుర్కొండి, అంతేకానీ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై మాత్రం దిగజారి వార్తలు రాయడం మంచిది కాదన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా కథనాలు రాస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వ్యాఖ్యాలను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు శోభానాగిరెడ్డి తెలిపారు. విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించారని ఆరోపించారు. అలాంటి ఆయన ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏం సాధించబోతున్నారంటూ సీఎం కిరణ్ను ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, జీవోఎంలో సభ్యుడు జైరాంరమేష్ కాళ్లు పట్టుకుని వేడుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు గతంలో కేంద్రానికి లేఖ ఇచ్చారు. దాంతో పార్టీ అధ్యక్షుడు అనుకూలమని లేఖ ఇచ్చిన బాబు కాళ్లు పట్టుకోకుండా కేంద్ర మంత్రులు కాళ్లు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంటుందంటూ శోభానాగిరెడ్డి టీడీపీ నేతలను శుక్రవారం బహిరంగంగా ప్రశ్నించారు. -
ఆంధ్రజ్యోతి ఎండీ ప్రాజెక్టుకు అనుమతిపై ఆగ్రహం
విజయవాడ: విజయవాడ సమీపంలోని బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ పవర్ ప్రాజెక్ట్కు ప్రభుత్వం అనుమతివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని కాదని కిరణ్కుమార్ రెడ్డి వ్యవహరించడంపై మండిపడ్డారు. పవర్ ప్రాజెక్ట్ అనుమతి విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సాక్షి దిన పత్రిక మంగళవారం వెలుగులోకి తెచ్చింది. బుడమేరు కాల్వపై రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్కు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అనుమతులే అత్యంత వివాదాస్పదం కాగా, గత ఐదారేళ్లుగా మూతపడి ఉన్న ఈ ప్లాంటుకు కిరణ్ కుమార్రెడ్డి ప్రభుత్వం తాజాగా గ్రీన్సిగ్నల్ ఇవ్వడం మరింత వివాదాస్పదం కానుంది. శనివారం అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కొత్త పార్టీ ఏర్పాటు వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఒక ఎల్లో పత్రికాధిపతికి దక్కిన ఈ కానుక రాజకీయ, ఇంధన వర్గాల్లో చర్చనీయాంశమైంది! వరదలు వచ్చే ప్రతిసారి బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. ఆధునీకరణ చేయకుంటే విజయవాడకు ముంపు తప్పదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు నివేదించారు. బుడమేరు ఆధునీకరణకు ప్లాంటు అడ్డంకిగా మారింది. దీంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్వోసీని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు రద్దు చేసింది. రోశయ్య హయాంలోనూ ఈ ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించారు. ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు ఇప్పుడు కిరణ్కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
బొమ్మరిల్లు కార్యాలయం సీజ్
శ్రీకాకుళం క్రైం, న్యూస్లైన్: ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిరగేసిన బొమ్మరిల్లు కార్యాలయాన్ని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాధితులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు బొమ్మరిల్లు కార్యాలయాన్ని వీఆర్వో బరాటం నాగేశ్వరరావు సమక్షంలో శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ రాధాకృష్ణ సీజ్ చేశారు. కార్యాలయంలో ఉన్న మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. లబోదిబోమంటున్న 13 వేల మంది ఖాతాదారులు పలాస : పలాస-కాశీబుగ్గ పట్టణంలో సుమారు 13 వేల మంది నుంచి 7 కోట్ల రూపాయలను బొమ్మరిల్లు ఫైనాన్స్ సంస్థ సేకరించింది. మంగళవారం రాత్రి బొమ్మరిల్లు కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఈ విషయం ధ్రువీకరించారు. సాయిరాం చిట్స్ ఫైనాన్స్ సంస్థ కోటి రూపాయలతో బోర్డు తిప్పేసింది. సాయిరాం ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ఖాతాదారుల ఫిర్యాదు మేరకు బొమ్మరిల్లు సంస్థకు చెందిన నలుగురు డెరైక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియడంతో పలాస-కాశీబుగ్గ పట్టణంలోని ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బొమ్మరిల్లు సంస్థను ఏలూరు సమీపంలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన ఆర్ఆర్ రాజా ఎండిగా ఉన్న సమయంలో పలాసలో 2012 ఫిబ్రవరి 5న బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ పరిధిలో ఒక ఏబిఎంతో పాటు 8 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. పూండి ప్రాంతంలో కళింగరాజ్యం వెంచర్ల పేరుతో సైట్లు వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సైట్లను చూపించి డిపాజిట్లు సేకరించారు. టెక్కలి నుంచి అటు ఇచ్చాపురం, ఇటు పాతపట్నం వరకు వేలాది మంది ఖాతాదారుల నుంచి దినసరి, నెలసరి ఖాతాలను ప్రారంభించి డబ్బులు వసూలు చేశారు. బొమ్మరిల్లు మూతబడిందని తెలియడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.